సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ | Nhrc Serious On Sai Krishna Case | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

Jun 26 2026 9:29 PM | Updated on Jun 26 2026 9:31 PM

Nhrc Serious On Sai Krishna Case

ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఎన్‌హెబ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్‌ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

పోలీసు స్టేషన్‌లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement