సాయి కృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ బాబురావు A5, A6గా సాంబయ్యలను చేరుస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సాయి కృష్ణ లాకప్డెత్ లో అశోక్, నాని మా ఎదుట సరండర్ అయ్యారు. వారిని అరెస్టు చేసినప్పుడు మొబైల్స్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే అమ్మేశామంటూ చెప్పారు. అయితే తమ ఫోన్లను నాగపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లు తెలిపారు. అయితే సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం నుంచి హత్య చేయడం వరకు సాక్ష్యాలు మాయం చేయడంలో అశోక్, నానిలు కీలకంగా వ్యవహరించారు.
కుట్రలో భాగంగానే వీరు ముందస్తు చర్యల్లో భాగంగా భాగంగా అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. ఈ కేసు ఇంకా కీలక విచారణ దశలోనే ఉంది. మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంట్లో ఎవరు పాత్ర ఉందో విచారణ జరపాలి ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరపాల్సి ఉంది. అశోక్, నానిని మరింత విచారించాల్సిన అవసరముంది.
మే 6న సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. సాయి కృష్ణను విజయవాడలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చినట్టు టవర్ లోకేషన్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు లభించాయి.. సాక్షులు నిందితుల మొబైల్ ఫోన్లో నెట్వర్క్ లు ఒకే ప్రాంతంలో చూపించాయి. సాయి కృష్ణ లాక్ అప్ డెత్ లో అశోక్, నాని ఇద్దరి పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రత్యక్ష సాక్షులు విచారించిన తర్వాత A 1గా వున్నా నాగరాజుని సాయికృష్ణకి అప్పగించారు. సాయికృష్ణ ని అశోక్, నాని, నాగరాజు తీవ్రంగా కుట్టారని శరీరం మీద గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తీవ్రమైన హింస కారణంగా సాయికృష్ణ లాక్ అప్ డెత్ అయ్యాడు అని మేము విశ్వసిస్తున్నాం.’అని చెప్పుకొచ్చారు.


