-
ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీ ఓటమికి కారణాలివే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు ఓటమికి అనేక కారణాలున్నాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాషాయ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ ఓట్లే దెబ్బతీశాయని తెలుస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఆ పార్టీ అభ్యర్థికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని.. మహబూబ్నగర్లో మాత్రం ఆశించిన మేరకు రాబట్టలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని భావించిన బీజేపీకి పట్టభద్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. నిరుద్యోగం, పీఆర్సీని ప్రధాన ఎజెండాగా చేసుకున్న ఆ పార్టీ నేతలు వాటినే ప్రధాన అంశాలు చేసుకుని ప్రచారం నిర్వహించారు. అంతే తప్పా తమ వైపున ఉన్న తప్పులను సరిదిద్దుకునే పని చేయలేదనే ఆవేదన బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపునకు కలిసివచ్చాయని గుర్తించారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఆమెకు కలిసొచ్చింది. ఈ సరళిని పరిశీలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కంటే పూర్వ పాలమూరులో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. 2015లో 55శాతం పోలింగ్ జరిగితే ఈసారి ఏకంగా 78.47శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెంపునకు అధికారుల అవగాహనతో పాటు టీఆర్ఎస్ కారణమని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలూ ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులను గుర్తించి వారికి ఓటు కోసం దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా వారితో నిరంతరం టచ్లో ఉంటూ పోలింగ్ రోజున వారిని వెంట తీసుకెళ్లి వేయించడంలో కీలకంగా వ్యవహరించారు. పెరిగిన ధరల ప్రభావం ఇక బీజేపీ నేతలు మాత్రం పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ, వారితో ఓటు వేయించేలా చర్యలేవీ తీసుకోలేపోయారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఉండటం బీజేపీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రాంచందర్రావు ఉమ్మడి జిల్లాలో అంతగా పర్యటించలేదనే అపవాదు ఉంది. ఇదీ ఈ ఎన్నికల్లో కాస్తా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయి. పెరిగిన ధరలతో పట్టభద్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వద్దనుకున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించినట్టు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తే పీఆర్సీ వరిస్తుందని ఉద్యోగులు నమ్మి ఆ పార్టీ అభ్యర్థి వాణీదేవికే ఓటేశారు. అన్నిటికంటే మించి ఉమ్మడి జిల్లాలో కాషాయ నేతల్లో కొరవడిన సమన్వయం, వర్గ విభేదాలూ రాంచందర్రావు ఓటమికి కారణాలే. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు అభ్యర్థి తరపున ప్రచారం విషయంలో అంటీముట్టినట్టుగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సీనియర్, జూనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇటీవలే బట్టబయలయ్యాయి. దీంతో బీజేపీ క్యాడర్ సైతం ఊహించినంత ప్రచారం చేయలేదు. చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం ఇదే! ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం -
వాహ్ హైదరాబాద్... ఇదేనా విశ్వనగరం?
మాటలు కోటలు దాటుతున్నయ్; చేతలు మాత్రం గడప దాటని చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామంటూ గత ఆరేళ్లుగా ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలైనవెన్ని? నగరంలో రూ.67,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయా లను ఘనంగా పెంపొందించినట్లు కేటీఆర్ స్వయంగా రాష్ట్ర శాసనసభలో చెప్పారు. అంతగా అభివృద్ధి చేస్తే నగరంలో రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకొచ్చింది? కాలనీలకు కాలనీలు ఎందుకు ముంపునకు గురయ్యాయి? గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సంవ త్సర కాలంలో లక్ష మంది పేదలకు రెండు పడకల ఇళ్ళు నిర్మించి ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా దసరా రోజున 11,000 ఇళ్లలో గృహప్రవేశం జరిపిం చారు. లక్ష ఇళ్ళెక్కడ? 11,000 ఎక్కడ? హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా, పాతబస్తీని ఇస్తాంబుల్ నగరంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ 2015లో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కై స్క్రాపర్లు, నగరం చుట్టూ గ్రీన్ కారిడార్, వేగంగా దూసుకు పోయే స్కైవేలు, నగరం శివారులో శాటిలైట్ టౌన్షిప్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడేమైంది? గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిస్తే 100 రోజుల ప్రణాళికలతో నగరం రూపురేఖలనే మార్చివేస్తామని మునిసిపల్ మంత్రిగా కేటీఆర్ హడావుడి చేశారు. కనీసం రోడ్లలో గుంతలనైనా పూడ్చారా? సిటీలో ఎక్కడ గుంత చూపించినా వెయ్యి ఇస్తానని సవాల్ చేసిండు. కానీ నగరంలో ఎక్కడ చూసినా గుంతలే కన్పిస్తున్నాయి. మూసీనది అభివృద్ధి కోసం అంటూ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదే? రూ. 1,400 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా? నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం కోసం రూ 20,000 కోట్లతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అమలుపరుస్తున్నట్లు ప్రకటించారు. 20 ఫ్లైఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 5 గ్రేడ్ సెపరేట్లతో మొత్తం 2,000 కిలోమీటర్ల కొత్త రహదారులు వేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ అందులో నాలుగోవంతు కూడా వేయలేదు. ట్రాఫిక్ రద్దీ కోసం మూసీనదిపై 42 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రణాళిక కూడా చేయలేదు. మురికి నీటితో ఉన్న హుస్సేన్సాగర్ను మంచినీటితో నింపుతాననీ, సాగర్ నీటిని కొబ్బరి నీటివలె చేస్తాననీ చెప్పిన కేసీఆర్ ఇప్పుడా విషయమే మరచిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పునాది పడిన మెట్రో రైలు తమ ఘనతగా చెప్పుకొంటున్న కేసీఆర్ పాతబస్తీ వరకు ఆ రైల్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పగలరా? శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పిన ఆయన ఎందుకు ఆ ఊసెత్తడం లేదు? హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పుకొం టున్న నేతలు 450 ఏళ్ళ నగర చరిత్రకు సాక్షిగా ఉన్న పలు వారసత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయంలోని హెరిటేజ్ భవనంతో పాటు అమ్మవారి గుడి, మసీద్లను కూల్చివేసి, వాటి శిథిలాలపై కొత్త సచివాలయ నిర్మాణం చేప ట్టారు. చరిత్రాత్మక కట్టడాలైన అసెంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రమంజిల్ ప్యాలెస్లను కూల్చేందుకు సిద్ధపడుతు న్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసుకొనేందుకు రాచకొండ, శామీర్పేటల వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పి, డీపీఆర్లు కూడా సిద్ధమైనా ఒక తట్ట మట్టిని కూడా ఎత్తలేదు. గత ఎన్నికల ముందు 18,000 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా? నగర పరిధిలో మొదటి దశలో రూ.130 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం నాలుగు మార్కెట్లు మాత్రమే నిర్మించినా వాటిని కూడా అందుబాటులోకి తేలేదు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా 200 నుండి 300 ఎకరాలలో 15 కొత్త డంప్యార్డ్లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. నగర ప్రజలను వరదల నుండి విముక్తి కలిగించడం కోసం సీవరేజీ డెవలప్ మెంట్ ప్లాన్ అమలుకు రూ 10,000 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో నగర ప్రజలకు ముంపు బాధలు తప్పడం లేదు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో గప్పాలు కొట్టడం తప్ప హైద రాబాద్కు ఒరిగిందేమీ లేదు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద లతో కార్లు, వాహనాలు మునిగిపోయి ఎటు చూసినా బురద, వాసనతో ఉన్న నగరాన్ని చూసి ఇదేనా విశ్వనగరమంటే, ‘వాహ్... హైదరాబాద్?’ అని జనం నవ్వుకుంటున్నారు. వ్యాసకర్త: ఎన్. రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ నేత, శాసనమండలి సభ్యుడు -
అది జరిగినప్పుడే అసలైన పల్లె ప్రగతి
సాక్షి, హైదరాబాద్: బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లెప్రగతి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. హోం, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు కలిసి ఈ దుకాణాల మీద దాడులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు దుకాణాలు తీసివేయాలని.. మద్యాన్ని అరికట్టాలన్నారు. పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని కొనియాడారు. కానీ, ప్రతి ఊరికి ట్రాక్టర్ అవసరం లేకపోవచ్చని, దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. (‘మెట్రో’పై కిషన్రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్) బీజేపీ ఎమ్మెల్సీ రామ్చందర్ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు నియమించాలని కోరారు. నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్రం.. గ్రామాలకు అనేక పథకాల ద్వారా నిధులు ఇస్తుందని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి రోజు పండగనే జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు నిధుల కేటాయింపు గతంలో రూ.13 వేల కోట్లు దాటలేదని, కానీ నేడు రూ.23 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. -
‘టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గెలుపుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నా యని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, అవినీతి, కుంభకోణాలను రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు గుర్తుంచుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని గ్రహించకపోవడం వారి అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఆయన ఎద్దేశా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి, నాలుగో స్థానానికి పరిమితమైనప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్కు చెందిన శాసనసభ్యులు పార్టీని నమ్మలేక టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాల్లో ఘన విజయం సాధించడమే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నేల మట్టం చేసిందని రాంచందర్రావు పేర్కొన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మూడు సీట్లలో కాంగ్రెస్.. అతి తక్కువ మెజార్టీతో బయట పడిందని, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా కొద్ది నెలల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు -
కమలం..కొత్త వ్యూహం!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీనియర్లందరినీ బరిలోకి దించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను సనత్నగర్ శాసనసభకు, ఎమ్మెల్సీ రాంచందర్రావును మల్కాజ్గిరి శాసనసభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టనుంది. ఈ ఇద్దరి పదవీ కాలం ఇంకా ఉన్నా, గెలుపే లక్ష్యంతో పని చేయటం..ఇతర నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉండడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. వీరితో పాటు సిట్టింగ్ స్థానాల్లో అంబర్పేట – కిషన్రెడ్డి, గోషామహల్ – రాజాసింగ్, ముషీరాబాద్ – డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ – రామచంద్రారెడ్డి, ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లే మళ్లీ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన చోట్ల కూడా సీనియర్లను, జనంతో సంబంధం ఉన్న నేతలనే రంగంలోకి దింపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్లో సతీష్గౌడ్, కార్వాన్లో దేవర కరుణాకర్, జూబ్లీహిల్స్ ఏపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడి పేర్లను దాదాపు ఖరారు చేశారు. ఇదిలా ఉంటే నగరంతో పాటు శివారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. టీడీపీ, టీఆర్ఎస్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్లోనూ ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉందని ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. అమిత్ షా సభతో సమరశంఖం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి, ఆ రోజు నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే దిశగా బీజేపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే వివిధ పార్టీల చోటా నేతలను పార్టీలో చేర్చుకుంటూ, అమిత్ షా సమక్షంలో ముఖ్యమైన నేతల చేరికలకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం లోక్సభ నియోజకవర్గాల వారిగా ఇన్చార్జులు అసెంబ్లీ స్థానాల వారిగా రోజు వారి సమీక్షలు, సభలు నిర్వహిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement