breaking news
Pawan Kalyan
-
పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం
-
తెల్ల చొక్కా.. మాసిపోయిన గడ్డం.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు..!
-
మీరు భయపెడితే భయపడతా అనుకున్నారా? జడ శ్రవణ్ వార్నింగ్
-
ఏపీ కేబినెట్ భేటీ..పవన్ సహా ఆరుగురు మంత్రుల డుమ్మా!
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రుల గైర్హాజరు చర్చాంశనీయంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరు కాకపోవడం విశేషంశుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, అమరావతి రాజధాని పురోగతి వంటి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. అయితే, ఈ సమావేశానికి పలువురు మంత్రులు డుమ్మా కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాదెండ్ల మనోహర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అనారోగ్య కారణంగా హోమ్ మంత్రి అనిత, మంత్రి టీజీ భరత్, మంత్రి గొట్టిపాటి రవి.. కుటుంబ కార్యక్రమం కారణంగా మరో మంత్రి ఫరూక్ హాజరు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.మొత్తం ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడంతో ఈ కేబినెట్ సమావేశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా పవన్ వరుసగా రెండు కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంపై వివిధ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అధికార వర్గాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఉస్తాద్ ఆశలన్నీ ట్రైలర్ మీదే.. తేడా వస్తే గల్లంతే
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్ భగత్సింగ్ నుంచి ఇప్పటికే భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు.ధురంధర్ స్పీడ్ఇప్పటికే ధరుంధర్-2 టికెట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో సరైన ప్లానింగ్తో పద్ధతి ప్రకారం చిత్ర యూనిట్ ముందుకెళ్తుంది. అయితే, ఉస్తాద్ భగత్సింగ్ మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. దేఖ్లెంగే సాలా సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది. అయితే, ఆ తరువాతి రెండు పాటలు ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా... చుట్టూ హైప్ ఉన్నప్పటికీ అనుకున్నంత రేంజ్లో బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి.ముఖ్యంగా, తాజాగా విడులైన కాలరే ఎత్తరా... పాటలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూస్తారని హరీష్ శంకర్ పదే పదే సూచించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్ మేకింగ్ రిఫ్రెషింగ్గా ఉన్నప్పటికీ, ఈ పాట చాలా మంది అభిమానులకు ఊహించినంత హైప్ని అందించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మొత్తంమీద, ఉస్తాద్ భగత్సింగ్ నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా యావరేజ్గా ఉందని అంటున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. ఇక అందరి చూపు మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ మీదనే ఆశలు ఉన్నాయి. సినిమాలో బలమైన కంటెంట్తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిపేలా ట్రైలర్ కట్ ఉంటేనే సినిమాకు బలం పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్పైనే ఉంది. ఇక్కడ కూడా సరైన కంటెంట్ లేకుండా విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆపై ధురంధర్-2 వంటి హిట్ ప్రాంఛైజ్ని తట్టకుని ఉస్తాద్ ఎంతమేరకు నిలబడుతాడో చూడాల్సి ఉంది.ట్రైలర్తో తేలిపోతుంది.తమిళ్ హిట్ సినిమా తేరి రీమేక్గా ఉస్తాద్ భగత్సింగ్ చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఉన్నాయి. అయితే, దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఉస్తాద్ సరికొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల కానున్నడంతో అసలు విషయం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తేరి రీమేక్ అయితే మాత్రం ఉస్తాద్ భగత్సింగ్ను ఎవరూ కాపాడలేరనేది వాస్తవం. -
ఉస్తాద్ భగత్సింగ్ 'కాలరే ఎత్తరా..' సాంగ్ విడుదల
పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. -
పవన్ కళ్యాణ్ ని సార్ అనలేదని ఒక మహిళ నాకు ఫోన్ చేసి...
-
మహేష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్
-
పవన్ కల్యాణ్.. ఇదేనా అభివృద్ధి? డ్రైనేజీ నీటిలో దిగి కాకినాడ ప్రజల నిరసన
-
పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్.. దర్శకుడు ఏమన్నాడంటే..
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్ శంకర్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్పై స్పందించారు.పవన్ కాదు.. డూప్గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్ పోస్టర్ని వదిలారు. అందులో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదంటూ రూమర్స్ వచ్చాయి. హరీశ్ శంకరే పవన్కు డూప్గా నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్గా నటించారని అన్నారు.బాధ కాదు.. హ్యాపీగా ఫీలయ్యా.. ఈ రూమర్స్పై తాజాగా హరీశ్ శంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్కు డూప్గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్ రిలీజ్ సమయంలో వచ్చిన రూమర్స్ చూసి బాధ పడలేదని, పవన్తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్ని వాడతారని చెప్పారు. ఉస్తాద్ విషయానికొస్తే..హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. -
ముగ్గురిని కనాలా.. గ్యాస్ ధరలు పెంపు.. బాబు, పవన్ పై కేతిరెడ్డి ఫైర్
-
మా 11 మంది దమ్ము ఏంటో అర్థమైందా.. వెళ్తూ వెళ్తూ పవన్ కి ఇచ్చిపడేసిన జగన్
-
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
టాలీవుడ్లో మరో వివాదం.. సారీ చెప్పిన డైరెక్టర్
పవన్ కల్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తీసిన దర్శకుడు హరీశ్ శంకర్.. హీరో మహేశ్ బాబు అభిమానుల్ని హర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విటర్లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్.. మహేశ్ ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్)అసలేం జరిగింది?మంగళవారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని.. బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా 'తథాస్తు' అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీశ్ శంకర్.. తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేశ్ బాబు అభిమానులు మాత్రం హరీశ్ శంకర్ని ఘోరంగా ట్రోల్ చేశారు. 'ఉస్తాద్..' మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీశ్ శంకర్.. మహేశ్ అభిమానులకు సారీ చెప్పాడు.హరీశ్ ఏమన్నాడు?'సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, తమన్ స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజులకు రిప్లై ఇస్తూ ఆ హడావుడిలో ఓ ట్వీట్ని పూర్తి చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీమ్ అలెర్ట్ చేయగానే నిమిషం లోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవముంది. 'పోకిరి' గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. 'వారణాసి'తో ఆయన పేరుమీద మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నాను''ఆయనని కానీ ఆయన అభిమానులని కానీ బాధపెట్టాలని ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలనే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని హరీశ్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా) -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
డిప్యూటీ సీఎం పవన్కు అవమానం
నెల్లూరు: ‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫొటో ముద్రించకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. ఒక పక్క చంద్రబాబు సింగిల్గా మనం గెలవలేదు.. మోదీ, పవన్కళ్యాణ్ అండతోనే గెలిచామంటూ బహిరంగ వేదికలపై చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వ ప్రచార పోస్టర్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలు ముద్రించారు. సీఎం ఫొటో పెట్టారంటే అర్థం ఉంది. కానీ మంత్రి లోకేశ్ ఆ శాఖ కానప్పటికీ.. ఆ పోస్టర్లలో ఆయన ఫొటో ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమిలో సఖ్యత లేదనే ఒక ప్రచారం అయితే.. మరో వైపు పవన్కళ్యాణ్ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక వైపు సీఎం చంద్రబాబు, మరో పక్కన డీసీఎం పవన్ ఫొటోలు పెట్టారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో మాత్రం ఆయన ఫొటో లేకుండా చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. -
మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..
-
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్) -
మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా..! ఇంతకన్నా దరిద్రపు ప్రభుత్వం ఏమైనా ఉంటుందా..?
-
పవన్ సార్.. మా ఊరికి రోడ్డు వేయండి
-
జగన్ 2029 మార్క్ అర్ధమైంది.. బాబు, పవన్ గగ్గోలు..
-
కుల, మతాలు అంటూ.. పవన్ కొత్త రాజకీయం
-
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
-
వాళ్లు 11 మందే అయినా.. 1,100 మందితో సమానం
సాక్షి, అమరావతి: శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 మందే అయినా 1,100 మందితో సమానమన్నట్లు మాట్లాడుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఉండకపోతే వైఎస్సార్సీపీ బలపడుతుందని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పిన దానిని చాలా బలంగా నమ్ముతారు. కానీ, మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. ఎందుకు సంకోచిస్తున్నామో తెలీదు. మనలో (కూటమి) ఏకాభిప్రాయం, ఏకత్వం ఉండాలి. వైఎస్సార్సీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు చాలా బలంగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. -
11 మంది 1100 మందితో సమానం..! YSRCP పై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు
-
'ఉస్తాద్ భగత్సింగ్' ఫ్యాన్స్కు షాకిస్తున్న బుక్మైషో
‘ఉస్తాద్ భగత్సింగ్’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా బుక్మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్ను చేర్చి పవన్ కల్యాణ్ అభిమానులకు షాకిచ్చింది.మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాడు.బుక్మైషో టికెటింగ్ ప్లాట్ఫామ్లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
చంద్రబాబు, పవన్కు ఉండవల్లి లేఖ
-
దేవిశ్రీ ప్రసాద్కి అవమానం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్ సాంగ్ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్శంకర్పై డీఎస్పీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.డీఎస్పీ అవుట్..తమన్ ఇన్పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. బ్యాగ్గ్రౌండ్ స్కోర్ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥This will be a grand celebration and a lifetime memory for fans ❤️POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026రెండోసారి..మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గ్యాప్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్సింగ్ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్కి 20 రోజుల ముందు బీజీఎం తమన్ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చారు. Request💔:#DeviSriPrasad #DSP @ThisIsDSP Garu #UstaadBhagatSingh & Future Films,Any Projects solo Gane Cheyandi Songs & BGMs. Duo & Collaboration Chesedhi Talent Vallu. Miku Avasaramledhu. Dayachesi Encourage Kuda Cheyodhu 🙏.Also Any Productions@MythriOfficial,@UBSTheFilm pic.twitter.com/fRwbgMZUGj— DSP & Harris jayaraj🎶 (@entertynmentfan) March 4, 2026వర్క్ నచ్చలేదా?ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని డీఎస్పీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వర్క్ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. Why so much negitivity on #Devisriprasad, todays generation kids dont know the value of him. Anyhow people more interested on copycat only not with the original composers..#DSP— Tanneru Ravi Teja (@rav4467) March 5, 2026 -
'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?
టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?) -
జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలేనా?
సాక్షి, అమలాపురం: ‘అధికారం ఒకరిది... పెత్తనం మరొకరిది’’ అన్నట్టుగా ఉంది రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో రాజకీయం. మిత్రధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న లీడర్ విత్ క్యాడర్ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరిస్తున్నామనే వంకతో ప్రభుత్వ పథకాల పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. తద్వారా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేస్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీలో ఉండి కూడా తమకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరిని అడగాలో తెలియని దైన్య స్థితిలో జనసేన శ్రేణులు మధనపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గెలిచారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాలకు చెందినవారే అయినా ఉద్యోగ రీత్యా ఎన్నికల ముందు వరకు స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవు. అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గ ఓటర్లకు తెలియకుండానే విజయాలు సాధించారు. ఆ తరువాత కూడా వారు స్థానికులతో పెద్దగా సంబంధాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. కనీసం క్యాడర్తో కూడా సన్నిహిత సంబం«ధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీకి చెందిన నాయకులు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కనబెట్టి నేరుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజోలులో.. రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీలలో వర్గ పోరు అధికంగా ఉంది. ముఖ్యంగా రాజోలు జనసేనలో సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతున్న వర్గ పోరు పోలీసు స్టేషన్ల వరకు చేరిన విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రాజోలు పార్టీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై స్వీకరించిన వినతులలో కొన్నింటిని మాత్రమే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళుతున్నారు. మరికొన్ని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడం లేదా నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమం పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధ పల్లంరాజుల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఈ ముగ్గురికి ఎటువంటి అధికార హోదా లేకపోవడం ఇక్కడ గమనార్హం. పి.గన్నవరంలో.. పి.గన్నవరంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు వంటి పార్టీ సీనియర్ నాయకులకు పొగబెట్టిన ఇక్కడ నాయకులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ డి.వి.వి.సత్యనారాయణ వంటి వారు లీడర్ విత్ క్యాడర్ అంటూ నియోజకవర్గంలో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. ఫించన్లకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నేరుగా అధికారులకే సిఫారసులు చేసేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కొన్నింటికైనా పరిష్కారం చూపిస్తున్నారు. కలెక్టరేట్తోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన అధికారులే నేరుగా అర్జీలు స్వీకరిస్తుంటే టీడీపీ నాయకులు లీడర్ విత్ క్యాడర్ పేరుతో అవే సమస్యల పరిష్కారం కోసం అంటూ చేస్తున్న హంగామా, ప్రచార ఆర్భాటం చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ అణగిమణగి.. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పదవులు కూడా లేని నాయకులు పెత్తనం చేస్తుంటే పార్లమెంట్ పరిధిలో మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా అణగిమణగి ఉండాల్సిందే. స్థానిక ఎమ్మెల్యేలను కాదని వీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పెత్తనాలు చేయడమనేది కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన బండారు శ్రీనివాసరావు కొత్తపేటలోను, రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలోను, పవన్ కళ్యాణ్కు సన్నితంగా ఉన్న పార్టీ నాయకులు నల్లా శ్రీధర్ అమలాపురంలోను, నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ రామచంద్రపురంలోను కిమ్మనకుండా ఉండాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కనీసం వీరి ఉనికిని కూడా గుర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే జనసేన నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పెత్తనం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సీనియర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, పార్టీ పెద్దలకు చెప్పినా సర్దుకు పొమ్మంటున్నారే తప్ప పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో లోలోనే మధనపడుతున్నారు. -
బాబు, పవన్ భేటీ వెనుక అసలు ప్లాన్? KBG తిలక్ సంచలన కామెంట్స్
-
వేట్లపాలెం ఘటనపై బాబు, పవన్ కు శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు, పవన్, లోకేశ్లపై కేసులు పెట్టాలి
తాడికొండ: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు వల్లె వేస్తూ కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్లపై డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్, టీవీ–5 అధినేత బీఆర్ నాయుడు, ఈనాడు, ఈటీవీ అధినేత చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ, మహాన్యూస్ వంశీకృష్ణ, ప్రైమ్–9 అధినేత తోపాటు లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ న్యూస్ ఛానెల్స్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించిన యాంకర్లు, చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంపై బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారంతా దు్రష్పచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ చార్జ్షీట్ సైతం లడ్డూ ప్రసాదాల్లో ఏవిధమైన కొవ్వు కలవలేదని పొందుపరిచినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఎస్వీబీసీ చానెల్ గౌరవానికి భంగం కలిగించిన ఎమ్మెల్యేపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బాబు, పవన్ పై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆగ్రహం..
-
జనసేన ప్రధాన కార్యాలయంలో యువకుడి హల్చల్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శుక్రవారం ఓ యువకుడు ప్రవేశించి కారు అద్దాలను పగలగొట్టడం సంచలనం కలిగించింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతను కార్యాలయంలో చొరబడ్డాడు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలు ఉంటేనో.. లేదంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకుంటే తప్ప మీడియా ప్రతినిధులను సైతం భద్రతా సిబ్బంది జనసేన పార్టీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే ఆ వ్యక్తి ఎలా లోపలకు ప్రవేశించాడన్న దానిపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ, ఎస్పీ ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నారం నీలాద్రిగా సమాచారం. అతనికి మతిస్థిమితం లేదని.. పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఆ వ్యక్తి నిర్మాణ పనులకొచి్చన కారి్మకుడిగా భద్రతా సిబ్బంది భావించడం వల్లే లోపలకు రాగలిగాడని చెబుతున్నారు. గత ఏడాది మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓ జనసేన నేత ‘జనసేన పార్టీని మంగళగిరి నియోజకవర్గంలో ఎదగనీయకుండా ఉండేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, దానికి జనసేన పార్టీలో కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. -
అరవ శ్రీధర్ మోసాలపై సాక్ష్యాలతో సహా నిరూపించా
సాక్షి టాస్క్ ఫోర్స్: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు చేసిన అన్యాయంపై సాక్ష్యాలతో సహా నిరూపించి నెల అయిందని, కమిటీలు వేశారు గానీ చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ తాజాగా వీడియో ఒకటి విడుదల చేశారు. ‘జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రత్యేకంగా కమిటీ వేసి హడావుడి చేశారు. అయితే ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మహిళకు అన్యాయం జరిగితే అధికారం అండతో చర్యలు తీసుకోవడం లేదు. అరవ శ్రీధర్పై కేసు నమోదు చేశారు. నాపై కేసు నమోదు చేశారు.. అయితే ఏమి చేశారు..’ అని బాధిత మహిళ ప్రశ్నించింది. జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారానే అరవ శ్రీధర్ తనకు పరిచయమయ్యాడని, అతను ఎమ్మెల్యే కాకపోతే తన జీవితంలోకి వచ్చేవాడు కాదని, ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. తాను తల్లి, తండ్రీ లేని అనాథనని, ఇప్పుడు అరవ శ్రీధర్ చేతుల్లో మోసపోయి ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయానని వాపోయింది. తప్పు చేసిన వాడు దర్జాగా క్రికెట్ ఆడుతున్నాడని, అధికారం అండతో అతన్ని కాపాడుతున్నారని విమర్శించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు. -
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
దేవుడా లేక...త్రివిక్రమ్ స్క్రిప్ట్ మాట్లాడించిందా... ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు
-
లోకేష్ మైండ్ ఇట్.... గిల్టా.. గాడిద గుడ్డా... ఏకిపారేసిన జడ శ్రవణ్
-
ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని నీకు.. డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?
-
పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు
-
సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు
-
ఆలీ మాట్లాడినట్టే మాట్లాడుతున్నావ్ పవన్పై జడ శ్రవణ్ పంచులు
-
మతమార్పిడి రాయబారి..! పవన్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్
-
నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. ఎవరూ తప్పించుకోలేరు..
-
పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్
-
ఒక నిష్ట దరిద్రుడివి.. పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
-
నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది.. పవన్ పై తాటిపర్తి ఫైర్
-
బాబుకు దెబ్బ మీద దెబ్బ
-
హైందవ ద్రోహి.. సాక్షాత్తూ ఆ దేవదేవుడే బయటపెట్టిన సాక్ష్యం
-
ఇవి పాలకుల పా‘పాలు’
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడే ఉండే తిరుమ లేశుని లడ్డూ ప్రసాదంపై ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలకు దిగారో గానీ... అప్పటి నుంచి రాష్ట్రంలో జరగని అనర్థాలంటూ లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు వగైరాలతో ముఖ్యమంత్రి మొదలుకొని అందరి కందరూ బిజీగా ఉంటే రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు చుట్టుపట్ల కల్తీ పాల బారినపడి ఆరుగురు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత ఆదివారం దీని తీవ్రత వెల్లడైనా, అంతక్రితం వారం నుంచి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా స్థానిక అధికారులైనా మేల్కొన్నారేమోగానీ... అమరావతిలో కొలువుదీరిన యంత్రాంగం నిద్ర లేవడానికి మరికొన్ని రోజులు పట్టింది. తీరిగ్గా ఇప్పుడు రాష్ట్రవ్యాప్త తనిఖీలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో శాసనసభలో పచ్చి అబద్ధాలు వల్లెవేయటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని, ఎవరు ఏ అసత్యాలతో రక్తి కట్టించాలో తేల్చుకుని, స్క్రిప్టులు బట్టీ పట్టడంలో కూటమి నేతలు తంటాలు పడుతుంటే, అడిగిందల్లా అందించటంలో యంత్రాంగమంతా తరించింది. ఇక కల్తీ పాలపై, కలుషిత నీటిపై పట్టించుకొనే నాథుడేడి? చివరకు కుప్పంకేంద్రంగా సాగే కల్తీ పాల దందాను కూడా కర్ణాటక పోలీసులు వచ్చి బట్టబయలు చేయాల్సి వచ్చింది.పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలెలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణ మొదలుకొని సాగుతున్న వరస పరిణామాలు గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అటుతర్వాత ఏప్రిల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. నిరుడు నవంబర్లో కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటిరాగలది 2015 పుష్కరాల్లో రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమ యంలో బాబు కుటుంబసమేతంగా అక్కడ ఉండటమే కాదు... తన షూటింగ్ కోసం భక్తుల్ని గంటల తరబడి ఆపటం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎంతో ఆరోగ్యంతో నిక్షేపంలా ఉండే సామాన్య పౌరులు ఒక్కసారిగా అస్వస్థులు కావటం, వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేసే పరిస్థితి తలెత్తటం ఎంత విషాద కరం! అన్నిటికన్నా ఘోరమేమంటే... రాజమండ్రికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ అవసరమైంది. ఆ లేత ప్రాణం దీన్నితట్టుకోలేక కన్నుమూసింది. డయాలసిస్ సాగుతున్న పిల్లల్లో మూడేళ్లలోపు వారు కూడా ఉన్నారంటే ఉదంతం తీవ్రతేమిటో తెలుస్తుంది. పాలలో కలిపిన ఇథిలీన్ గ్లైకాల్ అనే పదార్థం వల్లే బాధితుల రక్తంలో ప్రమాదకర స్థాయిలో యూరియా, క్రియాటిన్లు ఉన్నాయని చెబు తున్నారు. రక్తంలో గరిష్ఠంగా 24 మిల్లీగ్రాములు ఉండాల్సిన యూరియా దాదాపు 140 మిల్లీ గ్రాములు... గరిష్ఠంగా 1.3 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీరమ్ క్రియాటిన్ ఏకంగా 9 మిల్లీ గ్రాములు ఉందంటే యంత్రాంగం కళ్లు ఎంతగా మూసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇదింకా సద్దుమణగక ముందే గత అయిదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి భారీ సంఖ్యలో ప్రజలు డయేరియా వాతబడ్డారు. నగరంలోని సగం ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కావటమే ఇందుకు కారణమంటున్నారు. 2024 జూలైలోనే అక్కడి బీసీ హాస్టల్లో ఇలాంటి కారణంతోనే పలువురు విద్యార్థులకు డయేరియా సోకింది. అప్పుడు కాస్తయినా శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు ఇది పునరావృత మయ్యేది కాదు. కల్తీ మాటలతో అధికారంలోకొచ్చి, ఆ బాణీనే కొనసాగిస్తున్న పాలకుల అసమర్థత అన్నిటినీ కల్తీమయం చేస్తోంది. ఇప్పటికైనా పాలించటం మొదలెడతారో లేదో బాబు అండ్ కో తేల్చుకోవాలి. -
ఈ నీచుడికా మనం ఓటేసింది.... ఇలాంటి ఉప ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా..?
-
నువ్వెలా సీఎం అయ్యావ్ సామి.. నీ తలా తోకా లేని స్పీచ్కు ఆ గొర్రెలు చప్పట్లు..
-
కూటమి వదిలిన బాణం హెరిటేజ్కే గుచ్చుకుంది
సాక్షి విజయవాడ: తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు కుట్ర పన్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. దేవుడి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటిలయత్నం చేశారని విమర్శించారు. తిరుపతి లడ్డు వివాదంలో వీరిద్దరే దోషులని వ్యాఖ్యానించారు. ఎన్డీడీబీ రిపోర్టును అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలన్న దుర్బుద్ధితో ఇదంతా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారని మండిపడ్డారు. ప్రజల సంపదతో నడిచే శాసనసభ పూర్తి అవాస్తవాలు, అబద్ధాలతో జరిగిందన్నారు. దుర్మార్గమైన, జుగుప్సాకరమైన, ప్రజలను తప్పు దోవ పట్టించే చర్చ అసెంబ్లీలో నిన్న జరిగిందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.''కన్ను ఆర్పకుండ అబద్దాలు ఆడే వ్యక్తి చంద్రబాబు. అబద్దాలు ఆడడంలో చంద్రబాబుతో పవన్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ స్వార్థం కోసం తిరుపతి లడ్డుపై మాట్లాడారు. 164 మంది ఎమ్మెల్యేలు చెప్పినా అబద్ధం అబద్ధమే. పోయే కాలం వచ్చినప్పుడు దేవుడు చెప్పినా వినరు. శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీసింది ఎవరు? దెబ్బ తీస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీసి గత ప్రభుత్వం మీద నెట్టమని ఏం ధర్మం చెప్పింది?2024 జూలై 12న నెయ్యి శాంపిల్ తీశారు. శాంపిల్స్ తీసినపుడు ఏ ప్రభుత్వం అధికారంలో వుంది? 5 రోజుల పాటు శాంపిల్ మీ దగ్గర పెట్టుకొని కల్తీ చేశారు. కస్టమర్ ఇచ్చిన శాంపిల్నే తాము పరీక్షించామని ఎన్డీడీబీ తెలిపింది. మీరు ఏవిధంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారో.. అదే మేము రిపోర్ట్లో పేర్కొన్నాం తప్పా మాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్డీడీబీ పేర్కొంది. ఈ రిపోర్ట్కు చట్టబద్దత లేదని.. దీన్నిఎక్కడా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదని చెప్పింది. మరి ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని కూటమి నేతలు ఎలా మాట్లాడారు? దేవుడిని రాజకీయాలకు వాడాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇప్పించుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది.తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి వొదిలిన బాణం హెరిటేజ్కే గుచ్చుకుంది. హెరిటేజ్ షేర్లు భారీగా పతనమయి, వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. శీవారిని అప్రదిష్ట పాలు చేసినందుకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా నష్టపోతారు. హెరిటేజ్, కొన్ని సంస్థలు సప్లే చేస్తున్న పాలు కల్తీనే. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాజ్యాంగం బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కులమతాలకు అతీతంగా వ్యవహరించాలి. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడనని'' జడ శ్రవణ్ కుమార్ అన్నారు. -
పవన్ని టార్గెట్ చేస్తూ పూనమ్ సంచలన ట్వీట్!
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కల్యాణ్ని విమర్శిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఓ బాంబ్ పేల్చింది. ఈసారి ఏకంగా పవన్ మతం, పిల్లలని క్రైస్తవంలోకి మార్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(ఇదీ చదవండి: పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్)'మూడు నెలల వయసున్నప్పుడే విదేశాలకు తీసుకెళ్లి పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ కైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసమే ఆ దుస్తులు ధరిస్తున్నారా?' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. నేరుగా ఎటాక్కి దిగారుగా అని ఓ నెటిజన్ రీట్వీట్ చేయగా.. ఇది ఎటాక్ కాదని, తనకు వచ్చిన ఓ సందేహం మాత్రమేనని పూనమ్ చెప్పుకొచ్చింది. పేరు చెప్పనప్పటికీ.. పూనమ్ ప్రస్తావించింది పవన్ గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలోనే.. రాజకీయ లబ్ది కోసం ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే కోణంలోనే పూనమ్ ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.(ఇదీ చదవండి: నంది అవార్డులని పందులతో పోల్చిన తెలుగు నిర్మాత). -
రాజకీయాల కోసం నీ భార్యకు గుండు కొట్టించావ్.. నువ్వు ఒక్కసారైనా గుండు కొట్టించుకున్నావా ?
-
అంతా బూమెరాంగ్.. పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-
ఆరా ఆఫ్ ఉస్తాద్
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’పాట లిరికల్ వీడియో లాంచ్ ఈవెంట్ను యూనిట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్గారి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయైతే..’పాటకు నేను, దేవీ, హరీష్గార్లు కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మళ్లీ ఈపాటతో మీ ముందుకు వచ్చాం’’ అని తెలి΄ారు చంద్రబోస్. ‘‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ నాకు ప్రత్యేకమైనపాట. మైత్రీ మూవీ మేకర్స్ నా హోమ్ బ్యానర్ వంటిది. ఈ నిర్మాతలకు సినిమా అంటే ఎంతో తపన’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. -
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి. -
నాపై దాడిని బీజేపీ, జనసేన నేతలు ఖండించారు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప
-
మూగబోయిన పవన్ గొంతు అవమాన భారంతో జనసైనికుల ఆవేదన..
-
మళ్ళీ అవినీతి సామ్రాజ్యానికి నేనే మహా చక్రవర్తిని అన్నట్టు మాట్లాడతాడు
-
ఈ అంబటి అనే కుక్కకు కూడా... అంటే అర్ధం ఏంటో తెలుసా పవన్...ఏకిపారేసిన అంబటి
-
లోకేష్.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. మంత్రి నారా లోకేష్కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్లో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఎవ్వడైనా కలుపుతాడా? రఫ్ఫాడించిన ఉండవల్లి
-
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్లోని చివరి వాహనం దెబ్బతీంది. -
చిన్నారులను చిదిమేస్తుంటే.. పవన్, అనిత ఏం చేస్తున్నారు
-
మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ
-
తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..
-
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
తప్పు నాదే.. కార్యకర్తల ముందు తల దించుకున్న పవన్..!
-
బిగ్ షాక్.. పవన్ ను ఛీకొట్టిన ఫ్యాన్స్! నమ్మే ప్రసక్తే లేదు..
-
అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్
-
లోకేష్ను లేపితే కాసులు, లేపకుంటే ఉంటే కేసులు.. పవన్ కళ్యాన్ గురించి మాట్లాడి వేస్ట్..
-
పవన్ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్కళ్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఏం జరిగిందంటే.. పాలేరు రిజర్వాయర్లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్కళ్యాణ్పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్గూడెం వద్ద ఉన్న టోల్ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం. -
‘దుప్పటి.. చెట్టు.. ఆవు..’ లోకేష్, పవన్పై బైరెడ్డి చెప్పిన కథ
సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని బైరెడ్డి మండిపడ్డారు.అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.పవన్ కల్యాణ్, లోకేష్ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్ పవన్తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్ కల్యాణ్.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్కు ఉపయోగపడింది. పవన్కు ఉపయోగపడలేదు.తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్ కల్యాణ్.. కాసిన పండు తినేదంతా లోకేష్.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్ కల్యాణ్.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు. -
పవన్పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్
సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. -
పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?
-
పవన్ కళ్యాణీపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
-
కూటమిగా ఉంటే గెలుపు మాదే! పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్
-
నా కూతురిని కాపాడండి
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా తన కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో బుధవారం హోం మంత్రి అనితను కలిసి సమస్యలను వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులను ఎంత వేడుకున్నా స్పందన లేదని బాధిత మహిళ వాపోయారు. గురువారం మరోసారి తనను కలవాలని, దర్యాప్తు చేయిస్తామని హోం మంత్రి అనిత చెప్పి వెళ్లిపోయారు. అనంతరం బాధిత మహిళ బోరున విలపిస్తూ తన కూతురిని నరకకూపం నుంచి ఎవరూ కాపాడటం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే హోం మంత్రిని మూడుసార్లు కలిశానని, ఎప్పుడు కలిసినా చూస్తాం.. చేస్తాం అనడమేగాని ఇంత వరకూ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి తన కుమార్తెని ఇంటికి తీసుకురావాల్సిందిగా వేడుకోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం లేదన్నారు. ఎంతో కష్టపడి కూతురిని చదివించుకున్నానని, కానీ వ్యభిచార కూపంలోకి తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని అప్పగించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. -
బాకీల బాబు.. బడాయిల డాబు!
సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఇవ్వకుండా మోసం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ కింద రూ.19,200 కోట్లు ఎగనామం.. తల్లికి వందనం కింద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగ్గొట్టి పిల్లలకు పంగనామాలు.. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.64,800 కోట్లు ఎగవేత.. అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ.16,747.52 కోట్లు బకాయిలు.. దీపం పథకంతో మహిళలకు రూ.4,700.96 కోట్లు ఎగవేత.. మహిళలు అందరికీ ఉచిత బస్సు కింద రూ.3,200 కోట్లు బాకీ.. సూపర్ సిక్స్ కింద రెండేళ్లలో రూ.1,42,897.12 కోట్లకుపైగా ఎగ్గొట్టి ప్రజలను సీఎం చంద్రబాబు మోసగించారు! ఆ మోసాలన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసినట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అసత్యాలు చెప్పించారు. అలవోకగా, కళ్లార్పకుండా అసత్యాలను చెప్పే చంద్రబాబు.. ఉభయసభలనుఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలోనూ అవే అవాస్తవాలను వల్లె వేయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 143 హామీలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. వాటి అమలుకు తనదీ పూచీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు వాగ్దానం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ రద్దు చేయబోమని.. వాటిని కొనసాగిసూ్తనే సూపర్ సిక్స్ సహా 143 హామీలనూ నెరవేరుస్తామని చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలంటే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.17,179 కోట్లు మాత్రమే విదల్చడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా మిగలడంతో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన బాండ్లను పరిశీలించి 20 నెలల్లో తమ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఎంత ఎగ్గొట్టిందో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. సంపద సృష్టి లేదు.. ఆర్థిక విధ్వంసం!రుణ సేకరణ భారాన్ని తగ్గించడానికి.. రాష్ట్ర పునరుజ్జీవనానికి అవసరమైన మద్దతు పొందడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్తో చెప్పించారు. ఎన్నికలకు ముందు.. సంపద సృష్టించి, రుణ భారాన్ని తగ్గించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సీఎం చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పులు చేశారు. రికార్డు స్థాయి అప్పులతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఏ ఒక్క పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య.. రెండేళ్లపాటు కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులున్నా.. రూ.3,32,671 కోట్ల అప్పులలో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేస్తున్నారు.తప్పు చేసి నిందలా..2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 6 లక్షల ఎకరాలను అకారణంగా 22 ఏ జాబితాలో పెట్టారు. చుక్కల భూములు, అనాధీనం భూములు, షరతులు గల పట్టా భూములు లాంటివి అందులో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 22 ఏ జాబితాలో ఉన్న భూములను సుమోటో వెరిఫికేషన్ చేయించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 60 వేల ఎకరాల అనాధీనం భూములు, 34 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, సుమారు 18 వేల ఎకరాల ఇతర భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించి ఊరట కల్పించారు. దీంతో ఆ భూములపై రైతులకు మళ్లీ హక్కులు వచ్చాయి. కానీ.. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ భూముల్లో చాలా వరకూ మళ్లీ 22 ఏ జాబితాలోకి నెట్టేశారు. వీటితోపాటు 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు 13.59 లక్షల ఎకరాలను జగన్ ఫ్రీ హోల్డ్ చేస్తే.. వాటిని కూడా చంద్రబాబు 22 ఏ జాబితాలో పెట్టించేశారు. వాస్తవాలు ఇలా ఉండగా గత ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నిందలు వేయించారు. రాష్ట్రంలో 22 ఏ దుర్వినియోగం చేసింది చంద్రబాబు సర్కారేనని రైతులు స్పష్టం చేస్తున్నారు.పోలవరంలో బాబు చారిత్రక తప్పిదాలుగోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. 2016–18లో పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ను చంద్రబాబు పూర్తి చేశారు. 2017లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురై దెబ్బతింది.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ చారిత్రక తప్పిదాన్ని విదేశీ నిపుణుల కమిటీ ఎండగట్టింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది.. పోలవరాన్ని గాడిలో పెట్టి.. 2027 నాటికి పూర్తిచేసేందుకు మార్గం సుగమం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గవర్నర్తో చంద్రబాబు అభాండాలు వేయించారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా..2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టు సంస్థలతో కలిసి భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. ఈ కమీషన్ల బాగోతాన్ని కేంద్ర ఆదాయపు పన్నుల శాఖ ఎండగట్టింది. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టారంటూ కాగ్ కడిగిపారేసింది. 2014–19 మధ్య తాను కట్టని రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసినట్లు.. ఇప్పుడు దాన్ని పునర్ నిర్మిస్తున్నట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేయించారు. రాజధాని పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రూ.47,387 కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు.. నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగిస్తున్నారని కాంట్రాక్టర్లు ప్రస్తావిస్తున్నారు. భవనాలు చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తుండగా చంద్రబాబు సర్కారు దానికి మూడు రెట్లకుపైగా అధికంగా చెల్లించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందన్నది బహిర్గతమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విత్తనం నుంచి విక్రయాల దాకా అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలిచి వ్యవసాయాన్ని వైఎస్ జగన్ పండుగగా మార్చితే.. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి, ఉచిత పంటల బీమాను రద్దు చేసి, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది చంద్రబాబేనని రైతన్నలు మండిపడుతున్నారు.క్రెడిట్ చోరీలో చంద్రబాబుకు సాటెవ్వరు..?వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు అవే అసత్యాలను గవర్నర్ నోటి వెంట చెప్పించారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ బాగోతాన్ని విశాఖ సీఐఐ సదస్సు వేదికగా గౌతమ్ అదానీ బట్టబయలు చేసినా.. ఆ సదస్సు ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయంటూ గవర్నర్తో చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేయించారు. అదానీ గ్రూప్ పేరును దాచిపెట్టి గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ చంద్రబాబు సర్కారు చేసుకున్న ప్రచారానికి తెర దించుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు సమక్షంలోనే సీఐఐ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన ఇంధన వనరులపై దృష్టిసారించడమే కాకుండా ఆ దిశగా పలు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు వాటిని తన ఖాతాలో వేసుకుంటూ వైజాగ్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్న సంగతి విదితమే. గత ప్రభుత్వ హయాంలో 2023లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత అతిపెద్ద పెట్టుబడుల ఒప్పందంగా నిలిచిన ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్ల ఒప్పందాన్ని తిరిగి ఇప్పుడు కుదుర్చుకొని కొత్త ఒప్పందంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెన్యూ పవర్తో కుదిరిన రూ.97,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్తో ఇప్పుడు కొత్త పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలను అదుపు తప్పేలా చేసి విధ్వంస పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు.. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ నిర్మించి ప్రగతి దిశగా నడిపిస్తున్నట్లు గవర్నర్తో అవాస్తవాలను చెప్పించారంటూ సర్వత్రా మండిపడుతున్నారు.బాబు మోసాల ఖరీదు రూ.1,42,897.12 కోట్లు!⇒ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా రెండేళ్లుగా హామీని అమలు చేయలేదు. ఒక్కో ఏడాది రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. భృతి కింద రెండేళ్లలో యువతకు చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయి పడ్డారు.⇒ పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.⇒ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు.⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు.⇒ 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వీరు 20 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. రెండేళ్లుగా పైసా ఇవ్వకుండా పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు.⇒ తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లు తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. -
తప్పు చేశాం.. నేతల కళ్ళల్లో పశ్చాత్తాపం
-
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హిందువుల దోహులు ఎవరంటే..? చంద్రబాబు, పవన్
-
‘లడ్డూ కల్తీ పేరుతో చంద్రబాబు వికృత రాజకీయాలు’
సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తన అసమర్థత బయట పడకుండా ఏడాదిన్నరగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నాడని, శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూడటం సిగ్గచేటన్నారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.చంద్రబాబు సీఎంగా ఉండగా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంకర్లు దొడ్డి దారిన ఎలా ప్రవేశించాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి లభించిందని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇచ్చారని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆలయ ప్రతిష్టను దిగజార్చారుస్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఏడాది క్రితం సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ తప్పని తేల్చడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తప్పును చేశామని అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. అబద్ధాన్ని నిజం చేయడమే లక్ష్యంగా మరిన్ని తప్పులు చేస్తున్నారు.ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నితమైన అంశాన్ని పట్టుకుని వికృత రాజకీయాలకు తెరదీయడం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో కట్టు కథలు ప్రచారం చేస్తూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు. లడ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని మొన్నటిదాకా ప్రచారం చేసిన కూటమి నాయకులు.. కొత్తగా పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ తిమ్మిని బమ్మిని చేసే కుట్రకు తెరదీశారు.బాబూ.. వీటికి సమాధానం చెప్పువాస్తవానికి తాను చేసిన ఆరోపణలన్నింటికీ తానే సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు.. ఆ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు. చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీకి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిల్స్ తోనే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ పరీక్షలు జరిపింది. ఆ నెయ్యి లోనే పామాయిల్, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అండ్ కో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకో కల్పిత కథనాలు రాసి ప్రజలను అయోమయానికి గురిచేసి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా కల్తీ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీ రిజెక్టు చేసి వెనక్కి తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లనే దొడ్డి దారిన తెప్పించి లడ్డూ తయారీకి వాడారు. దీనికి సీఎంగా ఉన్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందిపోయి దొంగే దొంగ అన్నట్టుగా ఆయనే తిరుమలపై తప్పుడు ప్రచారం ఊపందించాడు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటు. సీబీఐ చార్జిషీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు 2014-19 వరకు రూ. 273.90 లకు తిరుమలకు నెయ్యిని సరఫరా చేసింది. వాస్తవం ఇలా ఉంటే నువ్వుల నూనె కన్నా తక్కువ ధరకు నెయ్యి ఎలా సప్లై చేస్తున్నారని వారే ప్రశ్నిస్తారు.నేరం చేసినట్టు సీబీఐ చార్జిషీట్లో పొందుపరిచిన బోలేబాబా డెయిరీకి కూడా చంద్రబాబు సీఎంగా ఉండగానే టీటీడీకి అనుమతి లభించింది. మార్చి 6, ఏప్రిల్ 19, 2019న 82 వేల కేజీలు ఒకసారి, 12 వేల కేజీలు ఇంకోసారి నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేసే బల్క్ ఆర్డర్ ఇవ్వడంపైన సీబీఐ సిట్ అనుమానం వ్యక్తం చేసింది. పైగా ఆ ఆర్డర్ కేజీ విలువ రూ.291 మాత్రమే కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకి లేదా? బోలేబాబా డెయిరీకి 82 వేల కేజీల నెయ్యిని రూ.291లకు ఆర్డర్ ఇవ్వలేదని, టీటీడీ రిజెక్టు చేసి పంపిన నెయ్యిని అడ్డదారిలో తెచ్చి వాడలేదని చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగలరా? 2015లో టీటీడీకి నెయ్యిని సప్లై చేస్తున్న నందిని డెయిరీ పేరుతో విజయవాడలో డూప్లికేట్ నెయ్యి తయారు చేసి 12 ట్యాంకర్లు సప్లై చేస్తే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ చేసిన విషయం నిజమా కాదా? ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు ఏం సమాధానం చెబుతారు?హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్అధికారంలో ఉన్న చంద్రబాబు తన వద్ద ఉన్న వ్యవస్థలతో విచారణ జరిపించి ఎవరైనా తప్పు చేసి ఉంటే న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చేయకుండా రోడ్డెక్కి తప్పు ప్రచారం చేయడం, తనకు అనుకూల పత్రికలు, టీవీలలో ఊదరగొట్టడం, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, కరపత్రికల ద్వారా తిరుమల ప్రతిష్టకు నష్టం వాటిల్లేలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు చంద్రబాబుకి ఎవరిచ్చారు?చంద్రబాబు చేసిన మహాపచారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుందనే భయంతో పాపాన్ని జనసేన, బీజేపీకి అంటించడానికే ప్రెస్మీట్ పెట్టించాడు. కానీ అక్కడ కూర్చున్న వారందరిలోనూ తప్పు చేశామన్న భావన కనిపిస్తోంది. దేవుడితో ఆటలాడుకుంటున్నామన్న అపరాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపతులు, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించే చంద్రబాబు మోసాలను ఇకనైనా గుర్తించి ఆయన్ను ప్రశ్నించాలి. తన అసమర్థ పాలన నుంచి ఎన్నికల హామీలు అమలు చేయలేని చేతకాని తనం నుంచి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడితో ఆటలాడుకుంటున్న చంద్రబాబుని నిలదీయాలి. చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించకుండా అబద్దాలు, మోసాలతో మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. -
లడ్డూపై పవన్ వ్యాఖ్యలు నీచాతి నీచం.. గొడ్డు మాంసం తింటా అన్నాడు
-
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెనుక ఒక పిలకేసుకుని..సినిమా అనుకున్నావా?
-
వెంకన్నతో రాజకీయాలు వద్దు క్షమాపణలు చెప్పండి..లేదంటే..
-
మీ ముగ్గురు నోర్లు పడిపోతాయి.. బాబు, పవన్, లోకేష్ పై రాచమల్లు సెటైర్లు
-
తిరుమల ప్రసాదంపై బాబు, పవన్వి నీచ రాజకీయాలు
తిరుపతి మంగళం: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్కుమార్ మండిపడ్డారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆదివారం తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద రోడ్లను వైఎస్సార్సీపీ శ్రేణులు పసుపునీళ్లతో కడిగి శుభ్రం చేశాయి. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాలు చేస్తోన్న కూటమి నేతలను నీవే శిక్షించు వేంకటేశ్వరా అంటూ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. అజయ్కుమార్ మాట్లాడుతూ..సీబీఐ తన విచారణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, అయినా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శ్రీవారి లడ్డూపై చేసిన తప్పుడు ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి జంతువుల కొవ్వు కాదు బాత్రూం శుభ్రపరచడానికి వాడే కెమికల్స్ ఉపయోగించారని మరో పచ్చి అబద్ధాన్ని చెప్పి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్డీడీబీ, సీబీఐ సిట్ నివేదికల్లో ఎక్కడా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారని అజయ్కుమార్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే నోట శ్రీవేంకటేశ్వరస్వామే నిజాలను పలికించారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యచ్చం వాసుయాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు వస్తే అందులో మూడు హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'.. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. తెలుగులో మాత్రమే తీసిన ఓ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వచ్చే పండగకి ఇప్పటినుంచే కర్చీఫులు వేసేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోలు నలుగురు రాబోతున్నట్లు హింట్స్ ఇచ్చేస్తున్నారు.అధికారికంగా చూసుకుంటే నాగార్జున.. సినిమాతో పాటు డేట్ కూడా ప్రకటించేశారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు మూడో పార్ట్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 15న థియేటర్లలోకి రాబోతుందని అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి భాగం 2016లో రాగా అద్భుతమైన హిట్ అయింది. 2022లో వచ్చిన రెండో పార్ట్ కూడా సక్సెస్ అందుకుంది. 2027 సంక్రాంతికి ఇప్పుడు మూడో భాగం రానుంది.ఈసారి చిరంజీవితో బ్లాక్బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇదివరకే చెప్పేశాడు. అయితే అది వెంకటేశ్తోనే ఉండబోతోందని టాక్. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని మాట్లాడుకుంటున్నారు. వెంకీ-ఫహాద్ తోడళ్లులుగా కనిపించబోతున్నారని టాక్. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అనిల్-వెంకకి మరో హిట్ పక్కా.ఈసారి పండగకు వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా రావాలని అనుకుంటున్నారట. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ దర్శకత్వంలో మరోసారి చిరు పనిచేయబోతున్నారు. ఇదివరకే ప్రకటన వచ్చింది. కూతురి సెంటిమెంట్ నేపథ్యంగా సాగే యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. దీన్ని పండగకే టార్గెట్ చేసుకుని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.మరోవైపు బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తొలుత పీరియాడికల్ స్టోరీ అనుకున్నారు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల దాన్ని పక్కనబెట్టేసి ఓ యాక్షన్ మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుని కూడా వచ్చే సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది.గతంలో చిరు-బాలకృష్ణ, వెంకీ-నాగ్, నాగ్-చిరు.. సంక్రాంతికి పోటీపడిన సందర్భాలు ఉన్నాయి గానీ నలుగురు ఒకేసారి రాలేదు. కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఈ షాకింగ్ పోటీకి వేదిక కానుందని అంటున్నారు.వీళ్లతో పాటు పవన్ కల్యాణ్-సురేందర్ రెడ్డి, శర్వానంద్-శ్రీనువైట్ల, తేజ సజ్జా 'జాంబీ రెడ్డి 2' సినిమాలని కూడా ఈ పండగకే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి వీళ్ళలో ఫైనల్ అయ్యేది ఎవరో చూడాలి? -
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
సినీ నటుడు పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పవన్ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’ మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత తదుపరి ఆయన చేయనున్నది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమానే కావడం విశేషం. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక గురించి మరోసారి విమర్శలు వస్తున్నాయి.‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్ను పవన్కు జోడీగా సురేందర్ రెడ్డి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇమాన్వీ ఎంపికను తప్పుబడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫౌజీ మూవీలో ఇమాన్వీని తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వివాదమే రేగింది. తన మూలాలు పాకిస్థాన్కు చెంది ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్తో ఉన్న సంబంధాలన్నీ కూడా భారత్ తెంచుకుంది. పాకిస్థాన్ నటులు, సినిమాలపై కూడా నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ మూవీకి ఇమాన్వీని తీసుకోనున్నారని వార్తలు రావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఇమాన్వీ ఎంపిక అంశం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.నాది పాకిస్థాన్ కాదుఫౌజీ సినిమా సమయంలో కూడా ఇమాన్వీ ప్రాంతీయత గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను పాకిస్థానిని కాదని, భారతీయ అమెరికన్ని అని గర్వంగా చెప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు తన మూలాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ' పాకిస్థాన్తో నా కుటుంబం సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని కొందరు నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. నేను చాలా క్లియర్గా హిందీతో పాటు తెలుగు, గుజరాతీ మాట్లాడగలనని గర్వంగా చెబుతాను. నేను పుట్టింది లాస్ ఏంజెలిస్లో.. చాలా ఏళ్ల క్రితమే నా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఎప్పుడో అమెరికన్ సిటిజన్స్గా గుర్తింపు పొందారు. నేను చదివింది కూడా అమెరికాలోనే.. సినిమాలపై ఆసక్తితో నా చదువు పూర్తయ్యాక కొరియోగ్రాఫర్గా కెరీర్ని ప్రారంభించాను. ఫైనల్గా భారతీయ చిత్రపరిశ్రమలో అవకాశాల్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది.' అంటూ గతంలో ఇమాన్వీ తన గురించి క్లారిటీ ఇచ్చింది. -
‘శ్రీవారి భక్తులకు చంద్రబాబు,పవన్ క్షమాపణలు చెప్పాలి’
భీమవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరంలో వైయస్సార్సీపీ నాయకులు చినిమిల్లి వెంకట రాయుడు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనే కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖలో 1.86 లక్షల టన్నుల మాంసాన్ని అక్రమంగా నిల్వ చేస్తే ఆరోజు పట్టించుకోని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిజం చెబుతుంటే మాపై దాడులులడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నాయకులంతా ముక్కు నేలకు రాసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలేశుడిని వివాదాల్లోకి లాగడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచనలను దృష్టి మళ్లించడం కోసం పదే పదే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠవాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బయటపెట్టి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వరుస పెట్టి దాడులకు దిగుతున్నారు.జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసిందికల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారంటూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్న నెయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలోకి ప్రవేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నా కూడా వైయస్సార్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసం కాదు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు సహా ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతైనా దుష్ప్రచారం ఆపడం లేదు. బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిపారంటూ చంద్రబాబు కొత్త ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి. చంద్రబాబు ప్రచారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హయాంలోనే అనుమతులు లభించాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసే కుట్రపాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కనిపించకుండా చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం స్కూళ్లలో చదివే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోతున్నారు. రెండేళ్లు కూడా గడవకుండానే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పుడు ప్రచారానికి గాను ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆలయ మెట్లు ఇప్పుడైనా సవ్యంగా పైనుంచి కిందకు కడగాలి. దేవుడి మీద నమ్మకం లేదని, దేవుడిని ఉరి తీయాలని చెప్పిన నాగబాబు సైతం సనాతన ధర్మం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అవకాశవాద రాజకీయాలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. సీబీఐ సిట్ చార్జిషీట్లో మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్ల పేర్లు లేకపోయినా వారి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మాటలతో హిందువుల మనోభావాలను గాయపరచడం సరికాదు.గోవధపై మీరెందుకు మాట్లాడటం లేదు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారే అయితే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా (శ్లాటర్ హౌస్)ను తక్షణం మూసేయించాలి. ఇళ్ల మధ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్న జంతు వధ కారణంగా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న జంతు వధను ఆపేలా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాటర్ హౌస్పై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. విశాఖలో 1.85 లక్షల టన్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచరిదని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎందుకు స్పందించలేదు? 12 వేల గోవులను చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే పట్టించుకోని ఈ కేంద్ర మంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసినా ఇప్పటికీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. దేవుడి మీద భయం, భక్తి ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? కేంద్ర తనిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాదని తేలింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. -
వెనుక ఒక పిలకేసుకుని.. సినిమా అనుకున్నావా?
-
బాబు, పవన్ బొమ్మేసి ఏకిపారేసిన పేర్ని నాని
-
పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై
-
గల్లా మాధవి, పెమ్మసానికి YSRCP కాపు నేతల స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆగని అరవ అరాచకాలు స్పందించని పవన్ కల్యాణ్
-
నాకు బీపీ లేపొద్దు.. పంతం నానాజీపై పవన్ సీరియస్
-
తప్పుడు ఫ్లెక్సీలు.. బూతులు.. రెచ్చగొడుతున్నదెవరు? జగన్ దబిడి దిబిడి
-
తిరుమల లడ్డులో కొవ్వు కలవలేదని బాధపడిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళే..
-
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్కు, పవన్కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ ప్రచారం చేస్తే.. మైనస్సే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు. -
నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు
-
జర్రమొచ్చింది.. సైలెంట్ మోడ్లో సేనాని!
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు.. చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు. ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది::సిమ్మాదిరప్పన్న -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేసుంటే.. బాబ, పవన్ పై రోజా ఫైర్
-
లేని కొవ్వు కోసం.. అల్లాడిపోతున్నారమ్మా
-
బాబు, పవన్ను వేంకటేశ్వరస్వామి క్షమించడు: ఆర్కే రోజా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలువురు నేతలు శుక్రవారం పరిశీలించారు. జోగి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఏకంగా మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడ్డారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. వాళ్ల పార్టీకి వాళ్లే సమాధి కట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ఇద్దరూ క్షమాపణలు కోరాలి. కానీ, అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు’’ అని రోజా కామెంట్ చేశారు. జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ జనం జగన్ వెంటే ఉన్నారని వాళ్లు గుర్తించాలి అని రోజా అన్నారు.ఏపీలో ఇలాంటి పరిస్థితి ఎన్నాడూ చూడలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారామె. -
సీబీఐ క్లీన్చిట్పై ‘ఏకసభ్య’ డ్రామా!
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారానికి సీబీఐ సిట్ రిపోర్టుతో చెక్ పడటం.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఏకసభ్య విచారణ కమిషన్ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని సీబీఐ సిట్ చెప్పలేదని.. దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మరి సిట్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ సిట్ చార్జిషీట్లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఇంకా కుట్రలు పన్నుతారా? అని ధ్వజమెత్తారు. ఏమీ లేకపోయినా రాజకీయ కుట్రలతో వైఎస్సార్ సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుప్రీం’ జోక్యంతో సాగని బాబు ఆటలు.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని దారుణమైన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ను నియమించి వాటినే రిపోర్టులో ఇచ్చేద్దామని భావించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ ఏర్పాటు కావడంతో ఆయన ఆటలు సాగలేదు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ దర్యాప్తులో అన్నీ తేలిపోవడంతో.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సీబీఐ సిట్ చెప్పింది.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమనే. ఆ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న జగన్ పేరు ఉందా? సిట్ రిపోర్టులో జగన్ కానీ, అప్పటి దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో.. ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైఎస్ జగన్కు ఆపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు రూ.319కే ఎలా ఆవు నెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్‡్ష ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే... ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాడు ఫిబ్రవరి తర్వాత ఉన్న ప్రభుత్వం మాదే అయితే మే నెలలో ఈసీతో పోట్లాడి మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు? పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్గానే పని చేసింది. 2019లో జగన్ సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్‡్ష ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మీరు కిలో నెయ్యి రూ.291కి ఎలా కొన్నారు? మా హయాంలో రూ.319, రూ.329కి కొనుగోలు చేస్తే తప్పు అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. టెండర్లు వివరాలు తేదీలతో సహా బయటపెట్టండి. ఎవరు దొంగో ఎవరు దొరో తేలుతుంది. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా.. పవన్ కళ్యాణ్ ఉచ్ఛం నీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి! క్రిస్టియన్ అంటారు.. బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా? అని పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెబుతున్నారు. దేవుడంటే భయం లేని వారు ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య.. గతంలో దేవుడే లేడని అంటాడు! దేవుడిని విమర్శించను.. లేని వారి గురించి ఎలా మాట్లాడతా? అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి.. నేను సనాతన హిందువును! వైఎస్ జగన్ క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్కు తెలియదా? ఆ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం గత ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా? అంతర్వేది రథాన్ని కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. మీ ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం పక్కన పెంటపాడులో రథాన్ని తగలబెడితే చర్యలు తీసుకున్నారా? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మరి మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర బాబుదే 2015–16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో పలు ఆలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబు... 250 గుళ్లు జగన్ ధ్వంసం చేశారని అనటానికి సిగ్గుందా? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా అవి. ఉత్సవమూర్తులే కాదు.. గర్భగుడిలో ఉన్న మూర్తులను కూడా మీ ప్రభుత్వంలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా? ఎక్కడైనా మెట్లు కడిగారా? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని జగన్ తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారని అంటున్న పవన్.. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా? నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని, అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్.. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు? తండ్రి చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైఎస్సారే ఏడు కొండలను నాడు వైఎస్సార్ రెండు కొండలు అన్నారంటూ చంద్రబాబు, పవన్ దు్రష్పచారం చేస్తున్నారు. తిరుమల ఏడు కొండలను దివ్యక్షేత్రం అని పిలవాలని, ఆ కొండల మీద అన్యమత ప్రచారం నిషిద్ధమని 2007 జూన్ 2న వైఎస్సార్ జీవో ఇచ్చింది నిజం కాదా? ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. తమ ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తి పారవశ్యం చెందుతున్నట్లు చంద్రబాబు చెబుతున్న మాటలు.. వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెబుతున్నట్లుంది! మీ మాటలు నమ్మటం లేదని పవన్ కళ్యాణ్తో చెప్పిస్తున్నట్లున్నారు. జనం ఆయన మాటలు కూడా నమ్మడం ఎప్పుడో మానేశారు.జంతు కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైఎస్ జగన్ క్రిస్టియన్ అని... శ్రీవేంకటేశ్వరస్వామికి హిందూ భక్తులను తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచి్చమాటలు చెబుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు! జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని గద్దిస్తున్న చంద్రబాబు... అది ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి మినహా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని ఈ డ్రామాలు చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు రూ.4.65 కోట్లు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. మరి మీ పీఏ శ్రీనివాస్కు రూ.2 వేల కోట్లు వచ్చాయని ‘ఈడీ’ చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నారు. అది బహిర్గతం కాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీసి తానూ, తన కుమారుడు కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. సీబీఐ సిట్ చార్జ్షీట్లో ఎక్కడా వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ వితండవాదం చేస్తున్నారు. రేపు కొత్త కమిషన్ (వన్మెన్ కమిషన్) వేసి జగన్ను, వైవీ సుబ్బారెడ్డిని చేర్చే దుర్బుద్ధితో ఉన్నారని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వీళ్ల మాటలున్నాయి. మతం పేరుతో జగన్ను నాశనం చేయాలని ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అపచారాలను ప్రశ్నించాలని, కట్టడి చేయాలని స్వామీజీలను ప్రవచనకారులను, హైందవ ధర్మ పరిరక్షకులను కోరుతున్నాం.ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? శ్రీవేంకటేశ్వరస్వామివారికి తలపెట్టిన అపచారం తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నలను కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. టీటీడీని ప్రక్షాళన చేయమని మీరు బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు అక్కడ ఎందుకు లేరు? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు... నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేశ్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో జగన్ లడ్డూలు చేయించారని, తాము మాత్రం నాలుగు లారీలను వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్టులో పేర్కొంది.ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి చివరికి సీలు కూడా తీయకుండా, సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పాపాత్ములు? ఎవరు మట్టికొట్టుకుపోవాలి? ఎవరు సర్వనాశనం అవుతారు? -
నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..
కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.I am sorry to use this statement నువ్వు బ్రతికేది కుడా ఒక బ్రతుకేనా @NagaBabuOffl 👊💦ఏ మూల నుండి నువ్వు హిందువువి అయ్యావ్ ❓దేవుడునే నమ్మని నువ్వు ఎట్టా సనాతనివి అవుతావ్ ❓👊కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు, ఏ రోజు రాజకీయాలు కోసం ని తమ్ముడు లగా ని లాగా లుచ్చా మాటలు… pic.twitter.com/G6Ghrb5JZc— Ravindra 🙏❤️ (@kurapati1005) February 4, 2026ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -సిమ్మదిరప్పన్న. -
తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్లో చంద్రబాబు, పవన్: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్ జగన్పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో పవన్ చెప్పినవి ఇవే.. జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.చంద్రబాబుది దైవ ద్రోహం.. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్, నేను. వైఎస్సార్ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు. -
పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అడ్డంగా దొరికి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా?
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్మీట్తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనంతిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని.. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఊగిపోయిన పవన్జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్సీపీ నేతలకు క్లీన్ చిట్(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ముందే చెప్పిన వైఎస్ జగన్చంద్రబాబు ఏకసభ్య కమిషన్ డ్రామా గురించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్టీఆర్ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్సీపీ టార్గెట్గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్పై దాడి చేశారు. చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది. అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్ విసిరారు. -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్లో పడవద్దని కేడర్కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మత విద్వేషాలు.. హింసా రాజకీయాలకు మూలం చంద్రబాబే..!
-
చంద్రబాబు, పవన్ సీక్రెట్ మీటింగ్
-
చంద్రబాబు, పవన్ ఏకాంత చర్చలు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్కళ్యాణ్ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
పెట్రోల్ బాంబులతో దాడులు చేయిస్తారా? పవన్ పై పోతిన మహేశ్ ఫైర్
-
పోలీసుల ఓవరాక్షన్ పై YSRCP నేతల మాస్ వార్నింగ్
-
జనసేనకు బిగ్ షాక్
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన ఆవిర్భావం నుండి పవన్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయం ప్రకటించారు.అయితే, జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బొలిశెట్టి కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
భోలేబాబాను తెచ్చింది నారా బాబా.. తెలుసుకో పయ్యావులా !
-
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
పవన్ కార్యాలయం ప్రకటనతో బట్టబయలైన లిక్కర్ దందా
కాకినాడ: ఏపీలో విచ్చలవిడిగా అధిక ధరలకు లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయని చాలాకాలంగా వైఎస్సార్సీపీ చెబుతూ వస్తున్నమాట వాస్తవమేననేది తేటతెల్లమైంది. ఏపీలో అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటనతో లిక్కర్ దందా జరుగుతుందనేది బట్టబయలైంది. ఏపీలో మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో అధిక ధరలపై తమకు వరుస ఫిర్యాదు వచ్చాయని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించింది. ఇందులో పవన్ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో అధిక ధరలే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులొచ్చాయి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటించడంతో అసలు విషయం వెలుగుచూసింఇ. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖక సూచించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది పవన్ కార్యాలయం. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి ఏపీలో లిక్కర్ షాఫులు నిర్వహిస్తున్నారు. అత్యధిక శాతం లిక్కర్ దందా అంతా కూడా కూటమి కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా అత్యధిక ధరలకు మద్యం అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
గలీజు ఎమ్మెల్యే కోసం జనసేన కొత్తడ్రామా
సాక్షి, విజయవాడ/అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ జనసేన. ఏకంగా అసెంబ్లీ నుంచే అరవ శ్రీధర్ వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ.. ఇటు కమిటీ పేరిట కాలయాపన చేస్తోందా పార్టీ.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. వారం గడుస్తున్నా ఎలాంటి చర్యల్లేవ్. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. మరోవైపు..ఎమ్మెల్యే అరవశ్రీధర్ గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా.. జనసేన చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించకుండా ముఖం చాటేస్తున్నారు. పైగా బాధితురాలిని బెదిరించిన జనసేన నేత నాగేంద్రతోనే కమిటీ వేయించారు. ఈ కమిటీలో శివశంకర్, రమాదేవి, వరుణలు ఉన్నారు. వీళ్లు ఓ హోటల్లో దిగారు. శ్రీధర్ వాళ్ల ముందు హాజరయ్యారు. ఇవాళ, రేపు అరవ శ్రీధర్ను విచారిస్తారట. ఆ వీడియోలు అసలువో.. నకిలీవో నిర్ధారించుకుంటున్నారట. అంతేగానీ అరవ శ్రీధర్ తప్పేం లేదని మాత్రం ఆ పార్టీ ప్రకటించలేకపోతోంది. అరవశ్రీధర్, జనసేనలోని అతని అనుచరులు ఇప్పటికీ బాధితురాలిని బెదిరిస్తూ తిరుగుతున్నారు. జంగిల్ రాజ్లో ఇప్పటికే మహిళలకు భద్రత కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరుసలో.. ఓ కామాంధుడైన ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
MAGAZINE STORY: బండబూతుల దండుపాళ్యం
-
Tirumala Laddu Row : ఫ్రస్టేషన్లో పవన్ కళ్యాణ్
సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
Mounika : పీకే గారూ.. ఇదేనా మీరన్న మహిళల భద్రత..?
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు, పవన్, లోకేశ్కు మంచి బుద్ధి ఇవ్వాలి
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, లోకేశ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. -
Sailajanath: గుర్తుపెట్టుకోండి.. మీరు గెలిచింది EVMల వల్లే
-
Kannababu : ఇంతమందికి నిద్రలేకుండా చేస్తున్న..
-
చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు. -
నోరు పడిపోయిందా? MLA శ్రీధర్ ఘటనపై మహిళల స్ట్రాంగ్ రియాక్షన్
-
రాజకీయాలకోసం దేవుడిని అడ్డం పెట్టుకున్నారు.. మీ పతనం మొదలైంది..
-
కూటమి అపచారం.. వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువచ్చింది. దీంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తుల డిమాండ్ చేస్తున్నారు.విజయవాడఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా?.ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తారా?.రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగుతారా.రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు క్షమాపణ చెప్పాలి.జరగని ఒక ఘటన జరిగిందని ప్రచారం చేసారు సీబీఐ అలాంటిది ఏమి లేదని చెప్పింది.పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వచ్చి మళ్ళీ మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నా.కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక సమాధానం చెప్పలేక తిరుగుతున్నారు. కర్నూలు..కల్లూరు అర్బన్లోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలునంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలుచంద్రబాబు, పవన్ చేసిన అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులువారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకన్నను వేడుకుంటూ టెంకాయలు కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలువిజయవాడలబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పక్షాళన పూజలుపూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు.బందర్ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేసిన పార్టీ శ్రేణులుచంద్రబాబు, పవన్ వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు విశాఖ..సీతమ్మధార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు.పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి , పార్టీ నేతలు.తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారంపై నేతలు ఆగ్రహం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు.. వైయస్సార్ జిల్లా...బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో 101 టెంకాయ కొట్టి పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు...కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పులివెందుల నాయకులు ప్రత్యేక పూజలు విశాఖ..మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..కేకే రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారంపై పార్టీ నేతల ఆగ్రహం..ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టిన నేతలు..పాప పరిహార పూజకు భారీగా హాజరైన పార్టీ శ్రేణులు.. -
బరితెగించిన కూటమి ప్రభుత్వం.. దేవుడితోనే రాజకీయాలు..
-
వేద మంత్రాలతో.. హోరెత్తిన నిందా పరిహార హోమం
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా? ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్కళ్యాణ్కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు. హోమం భగ్నానికి యత్నం శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు. టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. -
‘చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ధి రాలేదు’
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్ రిపోర్ట్లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్గారి మీద, వైఎస్సార్సీపీ మీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు.దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రెస్మీట్లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి కుట్రకు అప్పుడే బీజం:చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. అంతటితో ఆగకుండా పందికొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, దాంతోనే లడ్డూలు తయారు చేశారని, వాటిని ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలతో దేశంలోని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పంది కొవ్వు, పశువుల కొవ్వేమిటి!. లడ్డూ ప్రసాదంలో కలిశాయని ఓ ముఖ్యమంత్రే చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న అనుభవజ్ఢుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు ఇవి. వీటిని ఆరోజే విజ్ఞులైన వారంతా ఖండించారు.ఏ కొవ్వూ లేదని తేల్చిన ల్యాబ్లు. ఆ నివేదికలతో సీబీఐ సిట్ ఛార్జ్షీట్ :రాజకీయాల్లో ప్రత్యర్థులపై కక్ష సాధించాలంటే వేరేలా ప్రయత్నాలు చేయొచ్చు కానీ హిందూ ధర్మానికి భంగం కలిగేలా ప్రపంచంలో అందరూ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని చేసిన ఆరోపణ సహించరానిది. అంతకు ముందే టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చీవాట్లు పెట్టి మీ సిట్ కాదు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ శాంపిల్స్ ను సెకండ్ ఒపీనియన్ కోసం మళ్లీ ల్యాబ్స్ కు పంపమని ఆదేశించింది. ఆ శాంపిల్స్ పరిశీలించిన ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ.. అందులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చి చెప్పాయి. ఆ నివేదికల ఆధారంగా, చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని సిట్ తేల్చింది. అదే విషయాన్ని పొందుపర్చిన సీబీఐ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయినా మీడియా బలంతో, అధికార బలంతో జగన్మోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోలతో దారుణంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు.మీ హయాంలో నెయ్యిపైనే ల్యాబ్ రిపోర్టులు:చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తేదీల్లో వీఆర్ డెయిరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళ్తే శాంపిల్స్ తీసుకున్నారు. ఇది జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. ఈ శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించి, నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ల్యాబ్ రిపోర్ట్స్ లోనే ఇలా జరగొచ్చు అని చెప్తే.. వాటిని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. దీని మీద సుప్రీంకోర్టు వెళ్తే చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత సిట్ వేస్తే విచారణ జరిపి తాజాగా నివేదిక ఇచ్చింది. దున్నపోతు ఈనిందంటే కట్టేయండి అన్న చందాన పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి వెళ్లి, మెట్లు కడిగి, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 జూన్, జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి పరీక్షలు చేయకుండా, సెకండ్ ఒపీనియన్ కూడా లేకుండా అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసారు.ఆ డెయిరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే:నెయ్యి కల్తీ పేరుతో ఆధారాలు లేకపోయినా రాజకీయంగా వైఎస్సార్సీపీపై బురదజల్లడంతో పాటు శ్రీవారిని కూడా అడ్డుపెట్టుకుని ఆయన ప్రసాదంలో పందికొవ్వు పేరుతో కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. ఇవాళ ఏ కొవ్వూ లేదని తేలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి వాడామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కల్తీ నెయ్యిని ఎందుకు వాడారో చెప్పండి. తిప్పిపంపిన ట్యాంకర్లను తిరిగి తెప్పించి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అపచారం కాదా వీళ్లు చెప్పాలి.నెయ్యిపై రిపోర్ట్ ఇచ్చిన సంస్థలు రెండూ ప్రతిష్టాత్మకమైనవే. ఇందులో ఒకటి హర్యానాలోని కర్నాల్ లో ఉన్న నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), అలాగే గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ). టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నెయ్యి పంపిణీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలోనే. మేం అనుమతి ఇచ్చినా చంద్రబాబు హయాంలో సరఫరా చేస్తుంటే సరి చూసుకోవాలిగా. మీ పాలనలో సరఫరా అయిన నెయ్యికి కూడా మేం ఎలా బాధ్యత వహిస్తాం ?, భోలేబాబాకు తొలుత అనుమతి ఇచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. ముందు హర్ష డెయిరీగా పేరు పెట్టుకుని, ఆ తర్వాత పేరు మార్చుకున్నారు. భోలేబాబాకు పాలు లేవని ఇవాళ పచ్చమీడియాలో రాతలు రాస్తున్నారు. అటువంటి డెయిరీకి మీరు అనుమతి ఎలా ఇచ్చారు?.చంద్రబాబు అధికారంలో ఉండగా అనుమతిచ్చిన భోలే బాబాగా చెప్తున్న హర్ష డెయిరీ కిలో నెయ్యి రూ.291కి ఎలా ఇచ్చింది?, ఇప్పుడు ఇంత చౌకగా ఎలా నెయ్యి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్న వారు ముందు దీనికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు ఇలాంటి చేష్టల్ని ఖండించాల్సిందే.అధికారులు రాజకీయ కుట్రలో భాగం కావద్దు:చిన్నప్పన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరే జీతం కూడా తీసుకున్నాడు. చిన్నప్పన్ పీఏ అయితే ఛార్జిషీట్ లో వైవీ సుబ్బారెడ్డి పేరు ఉండాలిగా, ఎందుకు లేదు. లడ్డూకు నామాలు పెట్టి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు అడ్డూ అదుపూ లేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్ డబ్బు కోసం దేనికైనా సిద్దపడే వ్యక్తి. ఆయనకు వెంకటేశ్వరస్వామి మీద కాదు డబ్బుల మీద, బూతు బొమ్మలు చూపించడం మీద, నూజేన్ ఆయిల్ లాంటి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు దండుకోవడంలో, జూబ్లీ పార్క్ ల్లో డబ్బులు కాజేసే కార్యక్రమంలో ఉంది. ఆయన అపవిత్రుడు కాబట్టే కొండమీద అపచారాలు జరుగుతున్నాయి.మేం నాస్తికులు అంటున్న ఆయన పెద్ద ఆస్తికుడు మరి. ఐఏఎస్ అయిన శ్యామలరావు, ఐఆర్ఐఎస్ వెంకయ్య చౌదరికి ఏం పోయేకాలం వచ్చింది. మీరు భగవంతుడి దగ్గర కాపలా కాయకుండా నాటకాలు నడిపిస్తే భగవంతుడు క్షమించడు. వీరిద్దరిపై మాకు గౌరవం ఉంది. ధర్మాన్ని పాటించాల్సిన వీళ్లు చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగస్వాములై మా మీద బురదజల్లుతున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన వాళ్లు పుట్టగతుల్లేకుండా పోతారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..తిరుమలలో వాడిన నెయ్యికి సంబంధించి సీబీఐ సిట్ పూర్తి వాస్తవాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు మాట్లాడటం లేదు?. ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఓ పార్టీ ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చంద్రబాబు చెంచా అని మేం అనుకుంటున్నాం. కానీ జనం మాత్రం చంద్రబాబు చెంచా అనే అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది మాత్రమే వినకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. పవన్ ఇంతవరకూ పొలిటిషియన్ గా మారలేకపోయారు. చంద్రబాబు, లోకేష్ చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ల అవినీతిలో నాకు భాగం లేదని పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన బీజేపీ, టీడీపీ.. ఇలా ఎవరికి ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తున్నారు.అధికారం కోసం ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. భగవంతుడు లేదు, తండ్రి లేదు, పిల్లనిచ్చిన మామ లేదు, పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఆయనకు కొడుకు మాత్రమే ఉండాలి. కొడుకు వారసుడు కాబట్టి తనను మాత్రమే చంద్రబాబు లెక్క చేస్తాడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
‘బాబు, పవన్, లోకేష్లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


