బాబు, పవన్‌.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత | YSRCP kakani poojitha Serious Comments On CBN And Pawan | Sakshi
Sakshi News home page

బాబు, పవన్‌.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత

May 31 2026 1:42 PM | Updated on May 31 2026 1:46 PM

YSRCP kakani poojitha Serious Comments On CBN And Pawan

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.

ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement