సాక్షి,అమరావతి: పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అయితే కేబినెట్ సమావేశం మధ్యలో పవన్ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కు వెళ్లిపోయారు.


