జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ | Lingamaneni Ramesh Nominated to Rajya Sabha by Jana Sena | Sakshi
Sakshi News home page

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌

Jun 5 2026 8:01 PM | Updated on Jun 5 2026 9:11 PM

Lingamaneni Ramesh Nominated to Rajya Sabha by Jana Sena

సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది.  చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్‌తో పాటు లింగమనేని రమేష్‌కు లావాదేవీలు ఉన్నాయి.  

లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా లింగమనేని రమేష్‌కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement