rajendra nagar
-
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కలకలం
-
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జంట హత్యల కలకలం
-
రాజేంద్రనగర్ లో బైక్ రేసింగ్ లు..
-
రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాజేంద్రనగర్లో భారీగా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ను సీజ్ చేశారు. నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నారు.భార్య, భర్తతో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను జైల్కు తరలించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా సాగుతోంది. -
రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వే వద్ద కారు బీభత్సం.. ఒకరి మృతి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వే వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ వైడర్ను ఢీ కొట్టింది. అధికవేగంతో ఉండటంతో ఆ కారు.. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్ను మరలించిన పోలీసలు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే మితిమీరిన వేగమా?. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు.. రేసింగ్లో పాల్గొని ఇలా వేగంగా దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. -
Ranga Reddy: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీని వీడనున్న ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినబీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇలా అందరూ బీఆర్ఎస్కు గుడ్బై చెబుతున్నారు. తాజాగా మారో సిట్టింగ్ ఎమ్మెల్యే కారు దిగేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్ఎస్ను వీడారు. -
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
HYD: రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, రాజేంద్రనగర్: నగరంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కరాచీ బేకరీలో పేలుడు.. సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ RGIA పోలీస్స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్లో పేలుడు సంభవించింది. ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ గోడౌన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక కంచన్బాగ్ డీఆర్డీఓ తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్స అందచేయాలి: సీఎం రేవంత్రెడ్డి కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కారికులున్నారని సీఎం రేవంత్కు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. -
సన్ సిటీ క్రాకర్స్ షాప్ లో అగ్నిప్రమాదం
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్గౌడ్పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్గౌడ్పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
గుప్తనిధులు నిజమా అబద్దమా ?
-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
ఘనంగా ఎన్ఐఆర్డీపీఆర్ 64వ వ్యవస్థాపక దినోత్సవం
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం సమగ్రాభివృద్ధికి చాలా అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో భారతదేశం బెంచ్మార్క్లను సాధించిందన్నారు. ఉపాంత రంగాలకు చెందిన ప్రజలకోసం ఎన్ఐఆర్డీపీఆర్ జాతీయ స్థా యి మేళాలను నిర్వహించడం ద్వారా దేశవ్యా ప్తంగా కళాకారులను ప్రొత్సహిస్తుందన్నారు. -
రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
-
హైదరాబాద్: స్కూల్లో క్షుద్రపూజల కలకలం!
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా.. క్షుద్ర పూజల కలకలం రేగింది. అదీ ఏకంగా ఒక పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ స్కూల్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. స్కూల్లోని సైన్స్ ల్యాబ్తోపాటు స్టోర్ రూమ్లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్లో సీసీ ఫుటేజ్లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Hyderabad: ఏటీఎంలో భద్రపరచాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ
సాక్షి, హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు. గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్నగర్, ఎన్ఎండీసీ, గగన్పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్లను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు లోడ్చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలన... డ్రైవర్ ఫారూఖ్ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జీ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్ బాక్సుతో పాటు రెండు గన్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. -
హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతు
-
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్గా.. అలాగే శంషాబాద్, షాద్నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్సై రాజ్కుమార్ తెలిపిన మేరకు.. గుజరాత్ రాజ్కోట్ ప్రాంతానికి చెందిన తుషార్ అమ్రా బెడ్వా(32), పూజా బెడ్వా భార్యభర్తలు. వీరికి 18 నెలల క్రితం వివాహం జరిగింది. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తుషార్కు ఉద్యోగం రావడంతో నగరానికి వలస వచ్చాడు. బండ్లగూడ జాగీరు ప్రాంతంలోని రాయల్ ఎన్క్లేవ్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం పూజా ఏడు నెలల గర్బిణి. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుషార్ స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ప్రతి రోజు క్రికెట్ ఆడి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవాడు. 8 గంటలైనా రాకపోవడంతో భార్య పూజా తుషార్ సెల్ఫోన్కు ఫోన్చేయడంతో స్నేహితులు ఫోన్ లిఫ్ట్ చేశాడు. క్రికెట్ ఆడుతూ తుషార్ కిందపడ్డాడని దీంతో తాము స్థానికంగా ఉన్న రినోవా ఆసుపత్రికి తీసుకు వచ్చామని వెల్లడించారు. హుటాహుటిన పూజా ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు. దీంతో విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం తుషార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి రాజ్కోట్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి -
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
కన్న కూతురిపై కసాయి తండ్రి దారుణం
సాక్షి, రాజేంద్రనగర్: కన్న కూతురుపై ఓ కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక విషయాన్ని తల్లికి తెలపగా ఆమె విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కిస్మత్పూర్లో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. వీరికి 9 ఏళ్ల కూతురు సంతానం కాగా సోమవారం రాత్రి కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి దిగాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్య తిరిగొచ్చాక ఉదయం కూతురు జరిగిన విషయాన్ని తల్లికి తెలపడంతో భర్తను నిలదీసింది. వారిని చితకబాదిన అతడు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. దీంతో స్థానికుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల కోసం చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
80 దేశాలకు విత్తనాల ఎగుమతులు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన, పరీక్షాకేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. విత్తన పరీక్ష యంత్రాలను, నూతన వంగడాలను, మొలకలను అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమని నిరంజన్రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే పత్తి దిగుబడిలో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉందని, వరి దిగుబడిలో పంజాబ్ను తలదన్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఏజీ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యండెడ్గా పట్టుకొని నిలదీయడంతో..
సాక్షి, రాజేంద్రనగర్: విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్హ్యాండ్గా పట్టుకొని నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. చదవండి: సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడిని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా -
హైదరాబాద్: రాజేంద్రనగర్లో యువతి మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి మరణం కలకలం రేపుతోంది. చింతల్మెట్లోని ఓ అపార్టుమెంట్ రూమ్ నంబర్ 201లో ఓ యువతి మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వారం క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మృతురాలు సుమేర బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది హత్య? ఆత్మహత్య? అన్న విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి -
ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య.. ‘నా భర్త సైకో..’
రాజేంద్రనగర్ (హైదరాబాద్): భార్యాభర్తల మధ్య గొడవలు.. ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనకు తన పిల్లలంటే ఇష్టమని, వారినీ వెంట తీసుకుపోతున్నానని సూసైడ్నోట్ రాసింది. మొదట కొడుకు, బిడ్డ ఇద్దరికీ ఉరివేసింది. వారు చనిపోయాక బెడ్పై పడుకోబెట్టి.. తానూ ఉరివేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడకు చెందిన సాయికుమార్, స్వాతికుసుమ ఇద్దరూ గతంలో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ప్రాంతంలోని ఫోర్ట్ వ్యూ కాలనీలో కాపురం పెట్టారు. పెళ్లయిన 6 నెలలకు గర్భవతి కావడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. తర్వాత వారికి కుమారుడు తన్విక్ శ్రీ (4), కుమార్తె శ్రేయ (రెండున్నరేళ్లు) పుట్టారు. కుమార్తె పుట్టనప్పటి నుంచి సాయికుమార్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల నుంచి బంగారం, డబ్బులు తీసుకురావాలని స్వాతిపై ఒత్తిడితెచ్చాడు. ఒకట్రెండు సార్లు స్వాతి డబ్బులు తీసుకురావడంతో ఇది అలవాటుగా మారింది. స్వాతి తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోవడంతో.. ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా తానేనని, ఆస్తులన్నీ తనకు రాసివ్వాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. జల్సాలకు అలవాటు పడి స్వాతి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టాడు, కొన్నింటిని అమ్మేశాడు. దీనితో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో స్వాతికుసుమ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పిల్లలను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకుంది. శుక్రవారం రాత్రంతా బయటికి వెళ్లొచ్చిన సాయికుమార్.. శనివారం సాయంత్రం దాకా ఏమీ పట్టించుకోలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లి బెడ్రూం తలుపుతట్టినా లోపలి నుంచి ఏ స్పందనా రాలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా.. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్వాతి తల్లిదండ్రులు శారద, జగన్నాథం, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చారు. చదవండి: (మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. 3 నెలలుగా..) గోడపై సూసైడ్ నోట్ స్వాతి తొలుత పిల్లలు తన్విక్శ్రీ, శ్రేయలకు చీరతో ఉరివేసి.. బెడ్పై పడుకోబెట్టి, తర్వాత తాను ఉరివేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, ఆ నివేదిక వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా.. ఆత్మహత్యకు ముందు స్వాతి బెడ్రూం గోడపై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. ‘‘నా భర్త శాడిస్టు, సైకో.. బాగా ఏడిపిస్తున్నాడు. సరిగా చూసుకోవడం లేదు. ఊరంతా అప్పులు, మా బంగారం కూడా అమ్మేశాడు. ఐ డోంట్ లైక్ హిజ్ డిస్రెస్పెక్టివ్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ. అతడిని నేను ఇంకా భరించలేను. లవ్ యూ అమ్మా, నాన్నా. మీరే మీ బాధపడకండి. నా పిల్లలు అంటే నాకు పిచ్చి. నేను లేనిదే వాళ్లను ఎవరూ చూసు కోరు. అందుకే తీసుకోని పోతున్నా..’’ అని ఆ సూసైడ్ నోట్లో ఉంది. స్వాతి భర్త సాయికుమార్ను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య తలనరికి పోలీస్ స్టేషన్కు..
కట్టుకున్న వాళ్లే ఆ మహిళల పాలిట కాలయముళ్లయ్యారు. కాపాడాల్సిన వారే కర్కశత్వంతో ప్రాణాలు తీశారు. అనుమానం పెనుభూతమై ఓ రాక్షసుడు కట్టుకున్న భార్యను దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ తలను తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మరో ఘటనలో గొంతు నులిమి భార్యను హత్య చేసిన దుర్మార్గుడు శవాన్ని ఇంట్లోనే ఉంచేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా నిలుస్తున్న ఈ ఘటనలు నగరంలోని అత్తాపూర్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం వెలుగు చూశాయి. సాక్షి, రంగారెడ్డి: అనుమానం పెనుభూతమైంది. పెళ్లై 14 సంవత్సరాలైనా భార్యపై నమ్మకం కుదరలేదు. నిత్యం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశాడు. కేసు పెడితే..శిక్ష అనుభవించి వచ్చి పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నాడు. చివరకు ఆమెను దారుణంగా కడతేర్చాడు. తల నరికి ప్లాస్టిక్ సంచిలో వేసుకొని ముగ్గురు పిల్లలతో సహా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. గగుర్పాటు కలిగిస్తున్న ఈ ఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన షమ్రీన్ అలియాస్ సమ్రీన్కు, ఎంఎం పహాడీ హిమ్మత్నగర్కు చెందిన మహ్మద్ పర్వేజ్తో 14 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు. పెట్రోల్బంక్లో పని చేసే మహ్మద్ పర్వేజ్ పెళ్లినాటి నుంచే భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. నాలుగేళ్ల కిందట వేధింపులు అధికం కావడంతో సమ్రీన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన పర్వేజ్ పెద్దల సమక్షంలో రాజీ కోసం భార్య కుటుంబ సభ్యుల వద్దకు వచ్చాడు. ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆమె తిరిగి కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. కొన్ని రోజుల పాటు సాఫీగానే సాగింది. మళ్లీ ఆరు నెలలుగా పర్వేజ్ ప్రతి విషయంలో సమ్రీన్ను అనుమానిస్తూ పలురకాలుగా వేధిస్తున్నాడు. మద్యానికి బానిసై...భార్యను కొడుతూ శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు 15 రోజుల కిందటే సర్ది చెప్పారు. మాంసం కోసే కత్తితో... గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన పర్వేజ్ భార్యను చితకబాదాడు. అనంతరం భోజనం చేసి నిద్రపోయాడు. అర్థరాత్రి లేచి ఇంట్లో మాంసం కోసే కత్తితో భార్యపై దాడి చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసి ప్లాస్టిక్ కవర్లో వేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను తీసుకుని రక్తపు దుస్తులతోనే అర్థరాత్రి వేళ రెండు కిలోమీటర్లు నడిచి అత్తాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. భార్య తలను తీసి టేబుల్పై పెట్టి..తానే హత్య చేశానని చెప్పాడు. ఒక్కసారిగా రక్తమోడుతున్న తలను చూసిన నైట్ డ్యూటీ కానిస్టేబుల్ భయాందోళనకు గురయ్యాడు. ఇన్స్పెక్టర్తో పాటు రాజేంద్రనగర్ ఏసీపీకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. గది మొత్తం రక్తపు మరకలే... పర్వేజ్ భార్యపై కత్తితో దాడి చేసిన సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. కత్తితో దాడి చేయడంతో గది మొత్తం రక్తం చిల్లింది. అతి కిరాతకంగా మొండెం, తలను వేరు చేశాడు. పక్కనే నిద్రిస్తున్న పిల్లలు ఈ సంఘటనతో భయకంపితులై ఏమి మాట్లాడలేని స్థితిలో తండ్రితో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లారు. తాత, అమ్మమ్మ వచ్చిన అనంతరం జరిగిన విషయాన్ని వారికి తెలిపినట్లు సమాచారం. కఠినంగా శిక్షించాలి... తమ సోదరిని కిరాతకంగా హత్య చేసిన మహ్మద్ పర్వేజ్ను కఠినంగా శిక్షించాలని సమ్రీన్ సోదరుడు కోరారు. జైలుకు వెళ్లి వచ్చాక మంచిగా ఉంటానని చెప్పాడని, ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: (భార్యపై అనుమానం.. గూడ్స్ షెడ్లో దారుణహత్య) -
20 రోజుల్లో వివాహం.. ఈఎంఐ ఒత్తిళ్లు తట్టుకోలేక...
రాజేంద్రనగర్: మరో 20 రోజుల్లో ఆ యువకుడి వివాహం. పెళ్లి కార్డులను ముద్రించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం నుంచి పంపిణీ చేద్దామని తల్లిదండ్రులు చెప్పడంతో సరే అన్నాడు. కాగా.. రుణానికి సంబంధించి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నిర్వాహకులు ఇంటికి ఏజెంట్లను పంపించారని, ఫోన్లలో ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆదర్శనగర్కు చెందిన అవినాష్ వాగ్దే (25) ప్రైవేట్ ఉద్యోగి. నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 26 అవినాష్ వివాహం జరగాల్సి ఉంది. శనివారం పెళ్లి పత్రికలను ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చా డు. ఆదివారం ఉదయం నుంచి కార్డులు పంచుదామని తల్లిదండ్రులు, సోదరుడికి చెప్పాడు. అవినా ష్ రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించడంలేదు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫోన్లో బ్యాంక్ సిబ్బంది తరచూ ఫోన్ చేస్తు న్నారు. దీంతో పాటు ఇంటికి ఏజెంట్లు వచ్చిపోతున్నారు. పెళ్లి త్వరలో ఉండడం, డబ్బు సమకూర్చకపోవడం తదితర కారణాలతో అవినాష్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సంతోష్ వాగ్దే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్ నిర్వాహకులే కారణమని సంతోష్ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. -
రాజేంద్రనగర్లో దారుణం.. స్నేహితుడిని వదిలి వస్తుండగా
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనబడకపోవడంతో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వివరాలు.. బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్లు బుధవారం తమ స్నేహితుడు జైద్ ఖాన్ను సిటీ వద్ద వదిలి తిరుగు ప్రయాణం అయ్యారు. (చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..) ఉదయం పూట పొగమంచు కురవడంతో రోడ్డు సరిగా కనపడలేదు. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు వెంటనే నార్సింగీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్పైకి దూసుకెళ్లిన కొత్త కారు -
అప్పు తీర్చడం లేదని ముగ్గురు కలిసి కిడ్నాప్
రాజేంద్రనగర్: అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మెరుపు దాడి చేసి బందీ అయిన వ్యక్తిని విడిపించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం..సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన తన్వీర్ హుస్సేన్(45) స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఖుద్బుద్దీన్ వద్ద అప్పుగా రూ.8.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బు కోసం తన్వీర్ హుస్సేన్ను తిరిగి ఇవ్వాలని ఖుద్బుద్దీన్ ఎన్నిసార్లు అడిగినా రేపు, మాపు అంటూ దాట వేస్తున్నాడు. దీంతో ఖుద్బుద్దీన్ తన స్నేహితులు మహమూద్, ఇబ్రహీంతో కలిసి ఈ నెల 6వ తేదీన తన్వీర్ హుస్సేన్కు ఫోన్ చేసి ఇంటి వద్దకు రావాలని తెలిపారు. తన్వీర్ హుస్సేన్ రాగానే డబ్బు విషయం అడిగారు. తన వద్ద లేవని.. రాగానే ఇస్తానంటూ తెలిపాడు. దీంతో ముగ్గురు కలిసి తన్వీర్ హుస్సేన్ను ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించి చితకబాదారు. తన్వీర్ హుస్సేన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించి.. జాడ తెలియకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఖుద్బుద్దీన్కు డబ్బులు ఇచ్చే విషయమై తెలపడంతో అతడిపై నిఘా పెట్టారు. సోమవారం ఉదయం ఇంటిపై దాడి చేసి ఓ గదిలో బందీగా ఉన్న తన్వీర్ హుస్సేన్ను విడిపించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖుద్బుద్దీన్తో పాటు సహకరించిన ఇబ్రహీం, మహమూద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రాజేంద్ర నగర్ లో తల్లి కూతుళ్ళ మిస్సింగ్ కలకలం
-
ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’
సాక్షి, రాజేంద్రనగర్: సెల్లార్లో ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు గుంతలో శవమై తేలిన మృతిపై తమకు అనుమానాలున్నాయని తల్లితండ్రులు అపర్ణ, శివశంకర్ అన్నారు. న్యూఫ్రెండ్స్ కాలనీలోని కేఆర్ అపార్ట్మెంట్లో వారు నివసిస్తుండగా గురువారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులు సెల్లార్లో ఆడుకుంటూ అనీష్ (6) కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మరుసటి రోజు అతను ఓ గుంతలో పడి శవమై కనిపించాడు. ఆదివారం బాలుడి తల్లితండ్రులు విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుమారుడి మొహంపై గీతలు ఉన్నాయని, రక్తం కారిందని, కన్ను గుడ్డు లేదని తెలిపారు. ఇన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు మాత్రం ఆడుకుంటూ పడి మృతి చెందినట్టు కేసును మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ కుమారుడిని ఎవరో చంపి అందులో వేసినట్టు తమకు అనుమానాలు ఉన్నాయని ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య -
ఏసీబీకి చిక్కిన రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గురువారం రాత్రి డాక్యుమెంట్ రైటర్ నుంచి నగదు తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇద్దర్నీ పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. లంగర్హౌస్కు చెందిన ఒక మహిళ గంధంగూడ ప్రాంతంలోని 300 గజాల స్థలంలో డెవలప్మెంట్కు బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బిల్డర్ డెవలప్మెంట్ చేయకపోవడంతో సంబంధిత డాక్యుమెంట్ రద్దు కోసం తన సోదరుడి కుమారుడైన అరవింద్ మహేష్కుమార్ను సంప్రదించారు. అరవింద్ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డాక్యుమెంట్ రైటర్ వాసును సంప్రదించాడు. వాసు ఈ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీకి తెలిపాడు. ఈ పని చేసేందుకు ఆయన మొదట రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సంభాషణలను అరవింద్ వీడియో రికార్డు చేశాడు. చివరకు రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అనంతరం అరవింద్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. సెల్ఫోన్లో కీలక సమాచారం... ముందస్తు పథకం ప్రకారం గురువారం డబ్బులు ఇస్తానని చెప్పిన అరవింద్.. సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులతో పాటు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ వాసు డబ్బు తీసుకున్నాడు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బు తీసుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఆయన నేరుగా డబ్బు తీసు కుంటే పట్టుకునేందుకు వీలుగా ఏసీబీ అధికారులు రెండు గంటల పాటు వేచి చూశారు. చివరకు డాక్యుమెంట్ రైటర్ వాసు వద్ద డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. హర్షద్ అలీ కార్యాలయంలో మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన పట్టుబడగానే ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ సెల్ఫోన్తో మాయమయ్యారు. ఏసీబీ అధికారులు సెల్ఫోన్కు సంబంధించి వివరాలు అడగడంతో ఇంటి వద్ద ఉందని ఒకసారి, అసలు లేదని మరొకసారి చెబుతూ హర్షద్ అలీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు సెల్ఫోన్ను అప్పగించారు. అందులో పలు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్గా హర్షద్ అలీ గత సంవత్సర కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటవీ శాఖ భూములు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో సస్పెన్షన్కు గురయ్యారు. అయినా ఆయన తీరు మారలేదని, పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేశారని తెలుస్తోంది. -
తల్లిని చంపిన కూతురు కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, రాజేంద్రనగర్(హైదరాబాద్): తల్లిని హత్య చేసిన కుమార్తెతోపాటు ప్రియుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... చింతల్మెట్ ప్రాంతానికి చెందిన యాదమ్మ(45), యాదయ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కూతురుకు వివాహం చేయగా రెండవ కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. చిన్న కూతురుతో కలిసి చింతల్మెట్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేస్తుంటారు. చిన్న కూతురు నందిని(19) ఇంటి వద్దే ఉంటుంది. ఇంటి పక్కనే గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న రామ్కుమార్(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగానే నందిని ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకునేది. స్థానికులు ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో మందలించింది. సెల్ఫోన్లో సైతం తరచు మాట్లాడుతుండటంతో వద్దని హెచ్చరించింది. సోమవారం పని కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఫోన్ చేసి నందిని ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. పని దొరకకపోవడంతో తల్లి ఇరువురిని చూసి మందలించింది. ఇదే విషయమై తల్లి, కూతురు మధ్య గొడవ జరిగింది. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి తల్లిపై దాడి చేసి చున్నీతో ఉరి వేశారు. అనంతరం తమకే ఏమీ తెలియనట్లు రామ్కుమార్ గ్యాస్ ఏజెన్సీలో పనికి వెళ్లగా ఇంట్లో కూతురు ఉంది. స్థానికులు గొడవ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మొదట ఇద్దరు మైనర్లు అని 17 సంవత్సరాలు ఉన్నామని పోలీసులకు తప్పుదోవ పట్టించారు. ఆధార్, ఇతర సర్టిఫికెట్ల ఆధారంగా వారు మేజర్లని పోలీసులు నిర్ధారించారు. చదవండి: భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు -
తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసి రప్పించి ఎంత పనిచేసింది..
సాక్షి, రాజేంద్రనగర్: ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని ఉరివేసి చంపేసింది. నిందితులు ఇరువురు మైనర్లు కావడంతో ఈ విషయం మరింత కలచివేస్తోంది. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు యాదమ్మ(42) తన భర్త, పిల్లలతో కలిసి చింతల్మెట్ సమీపంలో నివాసిస్తోంది. భర్త రోజూవారి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. వీరికి 17 ఏళ్ల కూతురు సంతానం. ఆమె 17 ఏళ్ల మైనర్ బాలుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలుసుకున్న తల్లి ఇరువురిని మందలించింది. చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్పై దాడి మృతి చెందిన యాదమ్మ సోమవారం ఉదయం తల్లి ఇంట్లో ఉండగానే సదరు బాలిక ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. దాదాపు గంట పాటు ఇరువురు బాలిక తల్లితో గొడవపడి బయటకు రావడంతో అనుమానం వచ్చిన స్థానిక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇరువుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ గంగాధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాల్ రికార్డర్తో కన్నమేశాడు.. భార్యతో కలిసి తండ్రి ఇంట్లోనే.. -
మహిళా హత్య: వివాహేతర సంబంధం?.. తమ్ముడి భార్యే..
సాక్షి, శంషాబాద్ రూరల్: ఇందిరానగర్ దొడ్డిలో ఈ నెల 8న హత్యకు గురైన మహిళ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దివ్యాంగురాలైన యాదమ్మ అర్ధరాత్రి తన ఇంట్లోనే హత్యకు గురికాగా.. ఆమె వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు భావించారు. దీంతో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె వద్ద ఉన్న బంగారం కోసం తమ్ముడి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మరింతగా విచారణ కొనసాగుతుందని సీఐ ప్రకాష్రెడ్డి తెలిపారు. చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..! గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి -
పొంగిపొర్లుతున్న రాజేంద్రనగర్ అప్ప చెరువు
-
వాయుగుండంగా మారిన గులాబ్ తూఫాన్
-
భర్త కళ్లేదుటే పురుగుల మందు తాగిన భార్య..
రాజేంద్ర నగర్(హైదరాబాద్): నెల్లూరు జిల్లాలో భర్త కళ్లేదుటే.. భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే హైదరాబాద్లోనూ అదే తరహా ఘటన జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ వివాహిత.. భర్త కళ్లేదుటే.. తాను విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నీవు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు సేవించింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి... సాజీద్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా.. ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: Property Disputes: కన్నవారికే ‘ప్రాణ భయం’ .. -
బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతం.. ప్రమాదమా? హత్యా?
సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్లో కలకలం రేపిన బాలుడి మిస్సింగ్ విషాదాంతమైంది. జలాల్బాబానగర్లో శుక్రవారం ఉదయం రెండేళ్ల బాలుడు అబుబకర్ కిడ్నాప్నకు గురైన విషయం తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి సమీపంలోని స్మశాన వాటిక నీటి గుంటలో శనివారం బాలుడు శవమై తేలాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు రాజేంద్ర నగర్లో పోలీసులకు సమాచారమివ్వడంతో బాలుడిది హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తమ చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడిని చంపేసి నీటి గుంటలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
ఏపీ సీఎం జగన్ను కలిసిన సందీప్రెడ్డి
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ప్రేమావతిపేటకు చెందిన ఏనుగుల సందీప్రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చేపడుతున్నఅభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. దివంగత నేత వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాగే ప్రజలకు సేవ చేయాలని ఆంకాంక్షించారు. -
బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా హైదరాబాద్లోకి
సాక్షి, రాజేంద్రనగర్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్న ఇద్దరు మయన్మార్ దేశస్తులను రాజేంద్రనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. మయన్మార్కు చెందిన అబ్దుల్ మునాఫ్ అలియాస్ అన్సారీ(31) 2014లో బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా పంజాబ్కు చేరుకుని అక్కడి నుంచి ముంబై, ఢిల్లీలలో నివసించాడు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి దినసరి కూలీగా బతుకుతున్నాడు. మయన్మార్కు చెందిన అఫీజ్ అహ్మద్(34) 2017లో బంగ్లా సరిహద్దు మీదుగా చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి మునాఫ్తో ఉంటున్నాడు. 2018 నుంచి వీరిద్దరు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ వారి భార్యలను సైతం నగరానికి రప్పించారు. ఇక్కడే ఆధార్, పాన్, ఓటర్ కార్డు తదితర వాటిని ఏజెంట్ల ద్వారా సమకూర్చుకున్నారు. పోలీసులు అబ్దుల్ మునాఫ్, అఫీజ్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు. వారి భార్యలు నూర్ కాలీమా, షేక్ రోఫికా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువురిని రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజేంద్రనగర్లో ఆటో డ్రైవర్ కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో ఆటో డ్రైవర్ కిడ్నాప్ కలకలం రేపింది. వివరాలు.. మెహదీపట్నంకు చెందిన ఆటోడ్రైవర్ నదీమ్ను కొందరు దుండగులు కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన ఎస్వోటీ పోలీసులు సెల్ఫోన్ సిగ్నల ఆధారంగా కిడ్నాపర్ల ఆట కట్టించారు. చింతల్మెట్ ప్రాంతంలో ఒక గదిలో నదీమ్ను బంధించినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని విడిపించారు. అనంతరం నదీమ్ను కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడ్తో మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొంది. ఈ తీవ్రతకు కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. డోర్లు లాక్ కావడం, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల్లో అగ్నికీలలు విస్తరించాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతా నిమిషాల్లోనే... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉమామహేశ్వరరావు రొయ్యల వ్యాపారి. పాలకొల్లు నుంచి ముంబైకి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. ఈయన వద్ద థానేకు చెందిన ముత్యంజయ యాదవ్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన సూర్యకుమార్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పాలకొల్లు నుంచి ఓ కంటైనర్ (ఏపీ 39 టీక్యూ 5734)లో ఇద్దరు డ్రైవర్లు బయలుదేరారు. వీరిలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు క్యాబిన్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ వాహనం ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణిస్తూ హిమాయత్సాగర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో పాటు మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ కూడా ధ్వంసం కావడంతో పాటు దాని డోర్స్ లాక్ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోని మంటలు క్యాబిన్ మొత్తం ఆక్రమించాయి. వీటిలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహన చోదకులు ఆగి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. క్యాబిన్ ముందు అద్దాలు పగులకొట్టినా.. మంటల ఉధృతి కి వెనక్కు తగ్గారు. గ్యాస్సిలిండర్ పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కేబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు పూర్తిగా కాలిపోయారు. రాజేంద్రనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వడంతో ఫైరింజన్ మంటల్ని ఆర్పింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రాజేంద్రనగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ ఉదం తంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కంటైనర్ ఢీకొట్టిన వాహనం వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. -
అన్నం తినిపించిన పోలీసులు
సాక్షి, జేంద్రనగర్ (హైదరాబాద్): రోడ్డు పక్కన అచేతనంగా ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉన్న ఓ మహిళ (45)ను రాజేంద్రనగర్ పోలీసులు ఆదుకున్నారు. దుస్తులు వేసి తినేందుకు ఆహారాన్ని అందించారు. అన్నం కలిపి తినేందుకు సైతం శక్తి లేకపోవడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ పడి ఉందని 100 నంబర్కు సమాచారం అందింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. (చదవండి: ప్రధాన మంత్రి ప్రశంసలు అందుకున్న హిమేష్ ) ఓ మహిళ ఒంటిపై దుస్తులు లేకుండా అచేతనంగా పడి ఉండడంతో ఇద్దరు మహిళా పోలీసులను రప్పించి ఆమెకు దుస్తులు వేశారు. మంచినీరు అందించారు. తినేందుకు ఏమైనా ఇవ్వాలని ఆమె సైగలు చేయడంతో పోలీసులు అన్నం తీసుకొచ్చి అందించారు. అన్నం కలిపి నోట్లో పెట్టుకునేందుకు కూడా ఆ మహిళ ఇబ్బంది పడుతుండడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు తినిపించి ఠాణాకు తీసుకొచ్చారు. తన పేరు రాజమణి.. కుమారుడి పేరు మహేశ్ అని మహిళ తెలిపింది. మహిళను హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్ట్కు తరలించారు. మహిళ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్ లో సంచలనం రేపిన కిరాతక హత్య
శంషాబాద్ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమనడంతో పాటు హోటల్ను రాసివ్వమ్మని వడ్డీ వ్యాపారి చేసిన ఒత్తిడి అతడి హత్యకు కారణమైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నంబరు 248 వద్ద ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్య వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎంపహాడిలో నివాసముండే షేక్ రషీద్(29) స్థానికంగా గరీబ్నవాజ్ హోటల్ నడిపిస్తున్నాడు. లాక్డౌన్కు ముందు హోటల్ను బాగు చేయడానికి ఎంఎంపహాడిలోనే నివాసముండే రియల్ఎస్టేట్, వడ్డీ వ్యాపారి మహ్మద్ ఖలీల్ (33) నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. లాక్డౌన్ కారణంగా హోటల్ మూసివేయడంతో స్థానికంగా మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల ఖలీల్ వద్దకు వెళ్లిన రషీద్ మరో రూ.50 లక్షల అప్పుగా ఇవ్వమని కోరాడు. అందుకు ఖలీల్ నిరాకరించడంతో పాటు ముందుగా తీసుకున్న అప్పును వెంటనే చెల్లించడమో..లేదా హోటల్ను తన పేరుమీద రాయడమో చేయాలని ఒత్తిడి చేశాడు.. పక్కా పథకంతోనే.. ఖలీల్ ఒత్తిడి పెరుగుతుండటంతో షేక్ రషీద్ తన హోటల్లో వంటవాళ్లుగా పనిచేస్తున్న ఎంఎంపహాడికి చెందిన మహ్మద్ అజ్మత్(28), సయ్యద్ ఇమ్రాన్(28)తో కలిసి ఖలీల్ను అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకోసం రషీద్, ఇమ్రాన్లు చార్మినార్కు వెళ్లి రెండు కత్తులు కొనుగోలు చేశారు. వడ్డీవ్యాపారి ఖలీల్ ఆదివారం మధ్యాహ్నం షేక్రషీద్ నడిపిస్తున్న హోటల్ వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. సాయంత్రం వరకు సర్దుతానని రషీద్ అతనికి చెప్పి పంపాడు. రాత్రి 10 గంటల సమయంలో రషీద్, అజ్మత్ ఓ ఆటోను మాట్లాడుకుని అందులో సిమెంట్ ఇటుకలు సిద్దం చేసుకుని పిల్లర్ నంబరు 248 వద్దకు చేరుకున్నారు. అక్కడికే సయ్యద్ ఇమ్రాన్ను రప్పించుకున్నారు. డబ్బుల కోసంఖలీల్ను పిల్లర్నంబరు 248 హెచ్ఎఫ్ కన్వెన్షన్ వద్దకు రావాలని రషీద్ ఫోన్ చేయడంతో అతడు హోండా యాక్టివా వాహనంపై అక్కడకి చేరుకున్నాడు. రాత్రి 11.15 గంటల సమయంలో అక్కడికి చేరుకుని రషీద్తో మాట్లాడుతున్న సమయంలో వెనక్కి నుంచి అజ్మత్, ఇమ్రాన్ సిమెంట్ ఇటుకలతో దాడి చేశారు. గాయపడిన స్థితిలో పరుగులు పెడుతున్న అతడిని వెంటాడి మరోసారి కత్తులతో దాడి చేయడంతో పాటు సిమెంట్ ఇటుకలతో బాది అంతమొందించారు. అక్కడే ఉన్న మృతుడి వాహనం తీసుకుని పరారయ్యారు. అక్కడ దుస్తులు మార్చుకున్న వాళ్లు రక్తంతో ఉన్న దుస్తులను తీసుకొచ్చి వ్యవసాయ కళాశాల వద్ద పారేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, సీఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంట కలిసిన మానవత్వం కాగా ఖలీల్ను నడిరోడ్డుపై వెంబడిస్తూ హత్య చేస్తున్నా అక్కడున్న వారు ఏ ఒక్కరు నిందితులను ఆపే ప్రయత్నం చేయలేదు. సంఘటన జరుగుతున్న సమయంలో వాహనాలపై రాకపోకలు సాగించారే తప్ప ఏ ఒక్కరు ప్రతిఘటించలేదు. ఘటన మొత్తం పది నిమిషాల పాటు జరిగిన స్థానికులు మాత్రం సెల్ఫోన్లలో చిత్రీకరించేందుకే ఆసక్తి చూపారు. మరిన్ని వార్తలు ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం 'స్నేహం చేయకపోతే అశ్లీల ఫోటోలను షేర్ చేస్తా' -
యాప్ రుణానికి మరొకరు బలి
-
యాప్ రుణానికి మరొకరు బలి
రాజేంద్రనగర్ : అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ యాప్ల నుంచి రూ.50 వేల రుణం తీసుకుని, అధికవడ్డీలు చెల్లించలేక మనోవేదనతో తనువు చాలించాడు. గుంటూరు మంగళ గిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో నివసిస్తున్నాడు. కరోనాతో ఉద్యోగం పోవడంతో.. కరోనా పరిణామాల నేపథ్యంలో సునీల్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైన అతడు పలు ఆన్లైన్ యాప్ల ద్వారా మొత్తం రూ.50 వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు. అయితే, ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్ సైబర్ క్రైంకు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్ వెళ్లలేదు. ఇదిలా ఉండగా, అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్ చేయగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. సునీల్ డిఫాల్టర్ అంటూ బంధువులకు మెసేజ్లు ఆన్లైన్లో అప్పులు ఇచ్చిన యాప్ల నిర్వాహకులు సునీల్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి, అతడి స్నేహితులు, బంధువులకు ‘సునీల్ డిఫాల్టర్’అని అతడి ఫొటోతో మెసేజ్లు పంపారు. దీంతో సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి భోజ నం చేసేందుకు రమ్మని సునీల్ భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
ప్రియుడి గదిలో బాలిక ఆత్మహత్య
అత్తాపూర్: పెళ్లి విషయంలో మాటామాటా పెరిగి ప్రేమికుడి గదిలో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగానగర్ ప్రాంతానికి చెందిన నర్సింహులు కుమార్తె (17) వికారాబాద్కు చెందిన శ్రీకాంత్తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. శ్రీకాంత్ హైదర్గూడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కాగా తరచూ శ్రీకాంత్ దగ్గరకు వస్తుండే ప్రవీణ గురువారం కూడా అలాగే వచ్చింది. పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్ను కోరడంతో అతను కొంత సమయం కావాలన్నాడు. ఈ విషయంలో కాసేపు ఇద్దరు గొడవపడ్డారు. అనంతరం శ్రీకాంత్ బయటకు వెళ్లిన సమయంలో ప్రవీణ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం) కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరికి తీవ్రగాయాలు బొంరాస్పేట: మద్యం మత్తులో బైక్నడుపుతూ కల్వర్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వడిచర్లకు చెందిన వడ్ల విఠల్(40), మంగలి వేణు(30) సాయంత్రం కొడంగల్ నుంచి ద్విచక్రవాహనంపై గ్రామానికి తిరిగి వస్తుండగా రేగడిమైలారం శివారులోని బాపనోనిబావి సమీపంలోని కల్వర్టును ఢీకొట్టారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిలో విఠల్ పరిస్థితి విషమంగా ఉందని ఆయన్ను వెంటనే పరిగి ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందునే ప్రమాదం జరిగిందని ఎస్సై శ్రీశైలం తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రా ఏజెంట్.. విడాకులు తీసుకున్న మహిళతో!
సాక్షి, రాజేంద్రనగర్: రా ఏజెంట్నని నమ్మించి విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకొని బంగారు నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ట్విస్ట్లను తలపించిన ఈ సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఎం.ఆనందవర్ధన్(39)కు వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నార్సింగి ఠాణా పరిధిలోని నెక్నాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. తాను కూడా విడాకులు తీసుకున్నట్లు నమ్మించాడు. తాను మాజీ ఆర్మీ అధికారినని.. ప్రస్తుతం రా ఏజెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు మోసం చేసి బెంగళూరు చిరునామాతో ఓ ఐడీ కార్డు సృష్టించి ఆమెకు చూపించాడు. విడాకులు తీసుకున్నట్లు నకిలీ కాపీని చూపించి ఆమెను వివాహం చేసుకున్నాడు. చదవండి: స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి.. అనంతరం మహిళ వద్ద ఉన్న 50 తులాల బంగారాన్ని దొంగలించి ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో రూ. 8 లక్షలు తీసుకొని జల్సాలు చేశాడు. నెలలో 20 రోజులపాటు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి మొదటి భార్య వద్ద ఉండేవాడు. రా ఏజెంట్గా ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడికి వెళ్తున్నాననే వివరాలు సైతం భార్యకు చెప్పవద్దని ఉన్నతాధికారుల వద్ద ప్రమాణం చేశానని చెప్పేవాడు. అయితే, మార్చి నెలలో బీరువాలో భద్రపరిచిన 50 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సదరు మహిళ ఆనందవర్ధన్ను ప్రశ్నించింది. ఇంట్లో చోరీ జరిగిందని నాటకమాడాడు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని మహిళ చెప్పగా.. తాను రా ఏజెంట్నని, తన ఇంట్లోనే చోరీ జరిగితే దేశ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని, తన ఉన్నతాధికారులకు విషయం చెప్పి బెంగళూరులోనే కేసు నమోదు చేయిస్తానని వెళ్లాడు. అక్కడ రా అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నకిలీ పత్రాలు తీసుకొచ్చి ఆమెను నమ్మించాడు. బంగారం రికవరీ విషయాన్ని ప్రశ్నించడంతో సెప్టెంబర్లో దొంగ పట్టుబడ్డాడని, అతడి నుంచి అధికారులు రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. డబ్బును ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేశారని నకిలీ చెక్కును సృష్టించాడు. చదవండి: వివాహం, విడాకులు రెండూ కష్టమే డబ్బు చేతికి రావాలంటే సమయం పడుతుందంటూ మహిళను నమ్మించాడు. డబ్బు విషయమై రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతో తానే బెంగళూరుకు వెళ్లి తీసుకొస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. గత నెలలో రా అధికారులమంటూ రెండు ఈ మెయిల్స్ను సృష్టించి నెక్నాంపూర్లోని మహిళకు సందేశాన్ని పంపాడు. కిడ్నాపర్లు రా ఏజెంట్ అయిన ఆనందవర్ధన్ను కిడ్నాప్ చేసి హతమార్చారని, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మృతదేహాన్ని సైతం ఇవ్వలేమంటూ సమాచారం ఇచ్చాడు. హత్యను తాను నమ్మలేనని, మృతదేహాన్ని చూస్తానని ఆమె బదులిచ్చింది. తానే బెంగళూర్కు వస్తున్నానని మహిళ మెయిల్ చేయడంతో ఆనందవర్ధన్ రెండు రోజుల క్రితం నేరుగా నెక్నాంపూర్లోని ఇంటికి వచ్చేశాడు. అప్పటికే ఆనందవర్ధన్ విడాకులు ఇచ్చానని తెలిపిన మరో మహిళ చిరునామాలో సంప్రదించి విషయం తెలిపింది. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ ఆనందవర్ధన్ రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాపర్లు అపహరించారని, వారి నుంచి తప్పించుకొని వచ్చానంటూ పోలీసులను, మహిళను నమ్మించి ఉడాయించేందుకు మొదట ప్రయత్నించాడు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా జరిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. -
రాజేంద్రనగర్: చిరుతను పట్టుకున్న అధికారులు
-
6 నెలలు ముప్పుతిప్పలు, ఎట్టకేలకు బోనులో
సాక్షి, హైదరాబాద్: గత 6 నెలలుగా రాజేంద్రనగర్ వాసులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. రాజేంద్ర నగర్లోని వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. రెండు రోజుల క్రితం అధికారులు ఈ బోను ఏర్పాటు చేశారు. ప్రతి 10–15 రోజులకు ఒక్కసారి కనిపిస్తూ హల్చల్ చేస్తున్న పులి పట్టుబడటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే లేగదూడలు, ఆవుల మంద, మేకల మందలపై దాడి చేసిన చిరుత గత శుక్రవారం రాత్రి మరోసారి వాలంతరీ ప్రాంతంలోని డైరీఫామ్లోకి చోరబడి రెండు లేగదూడలను చంపివేసింది. ఫిట్నెస్ ఉంటే నల్లమలకు వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు నెహ్రూ జువాలాజికల్ పార్కుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వారం పాటు చిరుత అక్కడే ఉండనుంది. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ ఉందని భావిస్తే.. నల్లమల అడవుల్లో దానిని వదిలివేస్తారని సమాచారం. (చదవండి: మరోసారి చిరుత కలకలం) చిరుత సంచారమిలా మే 14వ తేదీన చిరుత బుద్వేల్ రైల్వే అండర్పాస్లో కనిపించింది. రోడ్డుపై గంట పాటు సేదతీరి పక్కనే ఉన్న ఫామ్హౌజ్లోకి దూరింది. అనంతరం ఫామ్ హౌజ్ నుంచి యూనివర్సిటీ గూండా గగన్పహాడ్ అడవుల్లోకి వెళ్ళింది. మే 23వ తేదీన గ్రేహౌన్స్లోని సీసీ కెమెరాలలో చిరుత కనిపించడంతో అధికారులు అటవీశాఖ, పక్కనే ఉన్న నార్మ్ అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం 29,30వ తేదీల్లో నార్మ్లోని క్వాటర్స్ వద్ద తిరుగుతూ సీసీ కెమెరాలలో కనిపించింది. అనంతరం జూన్ 3వ తేదీన మరోసారి కెమెరాలకు చిక్కింది. ఆగస్టు 25వతేదీన వాలంటరీలో డైరీఫామ్పై దాడి చేసి ఆవును చంపివేసింది. తిరిగి సెప్టెంబర్ 11వ తేదీన హనుమాన్నగర్ గుట్టలపై మేకల మందపై దాడి చేసి రెండు గొర్రెలను చంపి వేసింది. అక్టోబర్ 2వ తేదీన బుద్వేల్ గ్రీన్సీటీ నుంచి కిస్మత్పూర్ వైపు వస్తు స్థానికులకు కనిపించింది. తిరిగి శుక్రవారం రాత్రి వాలంతరీలోని డైరీఫామ్పై దాడి చేసి రెండు లేగదూడలను చంపి వేసింది. -
మెరుపు వేగంతో బైక్.. ఇద్దరు మృతి
-
మెరుపు వేగంతో బైక్.. ఇద్దరు మృతి
సాక్షి, రంగారెడ్డి : రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక దుర్గానగర్ చౌరస్తాలో బుధవారం రాత్రి బైకుపై ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ప్రయాణిస్తూ విద్యుత్తు స్తంభాని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆరంఘర్ నుంచి చంద్రయాన్గుట్ట వైపు అతి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. మృతులు మహ్మద్ సాజిత్ తన స్నేహితుడు కాజా మోయినుద్దీన్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణంగా బైక్ అతివేగమే అని పోలీసులు నిర్ధారించారు. -
రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం
-
రాజేంద్రనగర్లో మళ్లీ చిరుత పులి
-
అదిగో చిరుత.. మళ్లీ ప్రత్యక్షం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరించినట్టు తెలిసింది. నారం ఫాంహౌస్ వద్ద ఓ ఇంటి కాంపౌండ్లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, నాలుగు వారాల క్రితం బద్వేల్ సమీపంలో నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. ఓ లారీ యజమానిపై దాడి చేసి పారిపోయింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరుత పాదముద్రల ఆధారంగా అది చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లిఉండొచ్చుని భావించారు. తాజాగా చిరుత మరోసారి ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. (చదవండి: చిరుత చిక్కలే!) -
హైదరాబాద్లో మరో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వరుస హత్యలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారం లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, గొల్కొండలో ఒకరు, పాతబస్తీలో మరోకరు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు రాజేంద్రనగర్లోని హిమాయత్సాగర్ చెరువు వద్ద ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. మృతుడిని హైదర్ షా కోట్ మాధవి నగర్కు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చిరుత ఆచూకీ లభ్యం
-
చిరుత చిక్కలే!
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సీసీ కెమెరాలకు చిక్కిన చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు శాఖల అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రేహౌండ్స్, ఫైరింగ్రేంజ్, నార్మ్, గగన్పహాడ్ అటవీ ప్రాంతాన్ని శుక్రవారం ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా జల్లెడ పట్టారు. అటవీ శాఖ రంగారెడ్డి జిల్లా రేంజ్ అధికారి విక్రమ్చంద్ర, రాజేంద్రనగర్ ఎస్సై సురేశ్ తమ సిబ్బందితో సీసీ కెమెరాలలో కనిపించిన ప్రాంతంతో పాటు బయోడైవర్సిటీ పార్క్, చెరువు, గ్రేహౌండ్స్ రేంజ్ పరిసరాలను పరిశీలించారు. చెరువుతో పాటు బయోడైవర్సిటీ పార్కు, గ్రేహౌండ్స్ ఖాళీ ప్రదేశాల్లో చిరుత అడుగు జాడలు కనిపించాయి. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించిన చిరుత గురువారం రాత్రి నార్మ్లో కనిపించిన చిరుత ఒకటే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్సిటీ ఖాళీ ప్రదేశంలో కనిపించిన అడుగుల ముద్రలు, శుక్రవారం కనిపించిన అడుగుల ముద్రలు పోలి ఉన్నాయని తెలిపారు. చెరువు ప్రాంతంలో చిరుత అడుగు జాడలు స్పష్టంగా కనిపించగా..చిరుత జాడ కోసం మధ్యాహ్నం వరకు వెతికిన అధికారులు అనంతరం తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు. స్థానికుల భయాందోళన నార్మ్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించడంతో రాజేంద్రనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. బుద్వేల్ రైల్వే అండర్ పాస్ వద్ద కనిపించి జాడ తెలియకుండా పోయి గురువారం రాత్రి చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నార్మ్ ప్రధాన రహదారి పక్క నుంచే మాణిక్యమ్మ కాలనీ, అంబేడ్కర్ బస్తీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయా లని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. వామ్మో.. చిరుత! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అడవి పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మల్కపేట రిజర్వాయర్ కాలువ మరమ్మతు పనులు జరుగుతుండగా.. సమీప ప్రాంతం నుంచి చిరుత వెళ్లడాన్ని ఓ టిప్పర్ డ్రైవర్ తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. చిరుత నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి జూ పార్కుకు తరలించాలని అక్కపల్లి సర్పంచ్ మధుకర్ కోరారు. మల్కపేట రిజర్వాయర్ కాలువ వెంట వెళ్తున్న చిరుత మళ్లీ పెద్దపులి కలకలం మంచిర్యాల జిల్లా తాండూర్తో పాటు గిరిజన గూడేల్లో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మారుమూల అటవీ ప్రాంతం శివారు గూడేల వైపు పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. నర్సాపూర్, అబ్బాపూర్, బెజ్జాల గిరిగూడేల మీదుగా మాదారం త్రీఇంక్లైన్ శివారు అటవీ ప్రాంతం వరకు పులి అడుగులను శుక్రవారం బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి మజారొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ అధికారి తన్వీర్ఖాన్ సేకరించారు. పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి కదలికలపై నిఘా వేసి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పులి తిష్ట వేసిన లొకేషన్ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపులి పాదముద్ర కొలత తీసుకుంటున్న దృశ్యం -
చిరుత చిక్కలేదు
సాక్షి, హైదరాబాద్, రాజేంద్రనగర్: హైదరాబాద్ శివార్లలో గురువారం పట్టపగలు నడిరోడ్డుపైకి వచ్చి వాహనదారులు, స్థానికులను హడలెత్తించిన చిరుత పులి ఆచూకీ ఇంకా లభించలేదు. శుక్రవారం వివిధ ప్రాంతాలను జల్లెడ పట్టినా అది కానరాలేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అటవీ, రెవెన్యూ, జూపార్క్, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా గాలించినా, 25 ట్రాఫిక్ కెమెరాల ద్వారా పరిశీలించినా దాని జాడ కనిపించలేదు. రెండు ప్రాంతాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేసి మేకలను ఎరగా వేసినా అక్కడకు చిరుత రాలేదు. వర్సిటీలో అడుగుల జాడ.. గురువారం నుంచి చిరుత సంచరించిన ప్రాంతాల ఆధారంగా దాని జాడను కనిపెట్టేందుకు పోలీసు శాఖ సహకారంతో అటవీశాఖ అధికారులు విస్తృత కసరత్తు చేశారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి చివరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత అడుగుల జాడను కనుగొన్నారు. మూసేసిన యూబీ బీర్ కంపెనీ వెనుక ప్రాంతంలో చిరుత అడుగుల జాడ కనిపించింది. డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. గురువారం సాయంత్రం వరకు అక్కడే ఉండి రాత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయం మీదుగా చిలుకూరు అటవీ ప్రాంతం వైపు చిరుత వెళ్లినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ వర్సిటీలో చిరుత అడుగుల జాడ కనిపించిందని, అది ఎక్కడి నుంచి వచ్చిందో అదే దారి గూండా వెళ్లి ఉండవచ్చని, దీనిపై స్థానికులను అప్రమత్తం చేశామన్నారు. అన్మోల్ గార్డెన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బోన్లను అలాగే ఉంచామని, ఒకవేళ చిరుత ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే మేకలను తినేందుకు తప్పకుండా వస్తుందని అధికారులు తెలిపారు. దట్టమైన ప్రాంతం.. వ్యవసాయ విశ్వవిద్యాలయం మొత్తం 2,500 ఎకరాలలో విస్తరించి ఉంది. అలాగే ఫారెస్ట్ రేంజ్, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం, బయోడైవర్సిటీ పార్క్, ఎన్ఐఆర్డీ, ఆర్టీపీ సెంటర్, సౌడమ్మగుట్ట, మానసాహిల్స్, ప్రేమావతిపేట, హిమాయత్ సాగర్, కొత్వాల్గూడ ప్రాంతాలు మరో 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం గుట్టలు, చెట్లతో నిండుకొని ఉంది. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కష్టంతో కూడుకున్నదని, ఈ ప్రాంతంలోనే చిరుత ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని అధికారులు అంటున్నారు. వ్యవసాయ యూనివర్సిటీలో గతంలో బయోడైవర్సిటీ పార్కును, అక్కడి చెరువు చుట్టూ ఉన్న గుట్టలు, దట్టమైన చెట్లు, పొదల వద్ద గుహలను ఏర్పాటు చేశారు. ఎండా కాలంలో సైతం ఈ చెరువు నీటితో కళకళలాడుతోంది. డైవర్సిటీ పార్కు పక్కనే అటవీ ప్రాంతం గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రంతోపాటు చెట్లు, గుట్టలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చిరుత అన్ని విధాలుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బిక్కుబిక్కుమంటున్న కాలనీల వాసులు చిరుత జాడ తెలియకపోవడంతో పక్కనే ఉన్న బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీ, వేంకటేశ్వర కాలనీ, నేతాజీనగర్, శ్రీరామ్నగర్ కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒకే ప్రాంతంలో ఉండదు ఆహారాన్వేషణలో భాగంగా చిరుత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుందని, ఒకే ప్రాంతంలో అది ఉండదని, వచ్చిన దారి గుండా తిరిగి వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. గురువారం కనిపించిన చిరుత నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందని, దాని కదలికలనుబట్టి అది పూర్తి ఆరోగ్యంతో ఉందని, గాయాలేవీ లేవని వెల్లడించారు. కలవరానికి గురై అది రోడ్డుపైకి వచ్చి ఉండొచ్చన్నారు. -
సింగిల్ రూమ్, వైఫై, టీవీ, ఏసీ ఫెసిలిటీస్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ బాగుందంటూ దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపించాడు. ఇది గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగిన అతడు తన సోదరుడిని డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పెట్టి.. లేచిన తర్వాత సందేశం ఇవ్వాలంటూ సూచించాడు. అందులోని అంశాలు ఇవి.. ‘‘అన్నా నమస్తే... అంతా బాగేనా? ఇగో చేరుకున్నాం మంచిగ. ఫ్లైట్ రెండున్నరకు (తెల్లవారుజామున) ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో చెకప్ చేసిన్రు. కౌంటర్ మీద ఇమిగ్రేషన్ ఆఫీస్లో పాస్పోర్ట్ ఉంచుకుని, డిటేల్స్ రాసుకున్నాడు. మనకో పేపర్ ఇచ్చాడు. అదే పాస్పోర్ట్తో సమానం జాగ్రత్తగ పెట్టుకో అని చెప్పాడు. (విమానం దిగగానే క్వారంటైన్కే..) అక్కడ నుంచి లగేజ్ కాడికి వచ్చి తీసుకున్నం. ఆ తర్వాత ఇంకో లైన్ కట్టున్రి అని చెప్పిన్రు. అలా బయటకు వచ్చాం. అక్కడ ఎర్ర బస్సులు గదే క్వారంటైన్ వ్యాన్లు రెడీగా పెట్టారు. దుబాయ్, లండన్, యూఎస్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్స్లో వచ్చిన అందరినీ అందులో తీసుకువచ్చి రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకువచ్చి ఉంచిర్రు. ఇక్కడ మనిషికి సింగిల్ రూమ్, వైఫై, టీవీ, ఏసీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నయ్. స్నానం చేసి కూర్చున్నా. ఎన్ని రోజులు ఉంచుకుంటారో తెలీదు. ఖైదీలను తోల్కపోయినట్లు ముందొక పోలీసు గాడీ.. వెనుక మా బస్సు.. అలా ఎయిర్పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో తోల్కొని వచ్చారు. గట్లుంది పరిస్థితి. ఇక చూడాలి ఎట్లుంటదో. ఏం టెన్షన్ తీసుకోకున్రీ. చెప్తా మల్లా విషయాలు. లేచినాక నాకు మెసేజ్ పెట్టు’’. (రంగంలోకి లక్షమంది పోలీసులు) -
బయటపడ్డ రేవంత్రెడ్డి అక్రమాలు: క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కొండల్రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తయింది. గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 127లో రేవంత్రెడ్డి, కొండల్ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్లు, కబ్జాలకు పాల్పడినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు తేల్చారు. దీనితో పాటు సర్వే నెంబర్ 127లనే 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్టు గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పూర్తి నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంగళవారం సమర్పించారు. ఆర్డీవో నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎకరం 36 గుంటల భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకునట్లు నివేదికలో పేర్కొన్నారు. (రేవంత్ భూ ఆక్రమణ నిజమే) సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఓల్టా చట్టన్ని ఉల్లంఘించినందుకు రేవంత్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో నివేదికలో కోరారు. అలాగే నింబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన గోడలను సైతం కూల్చివేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గండిపేట సమీపంలో అక్రమంగా ఫామ్హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించేందుకు సోమవారం ఆయన అనుచరులతో కలిసి అక్కడి చేరకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు, రేవంత్కు పెద్దఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులను రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి, కేటీఆర్ల అక్రమ భూముల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) స్థానికుల ఆరోపణల ఆధారంగా.. గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు, తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. స్థానికులు కొందరు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా స్టేటస్కో ఉత్తర్వులు వచ్చాయని అంటున్నారు. అయితే, ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్కు నివేదిక ఇచ్చారు. తప్పుగా రికార్డుల్లో నమోదు చేశారని, తప్పుడు మ్యుటేషన్లు చేశారని ఆ నివేదికలో కలెక్టర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భూమితో పాటు ఇతర ఆరోపణలపై కూడా ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రాజేంద్రనగర్లో రోడ్డు ప్రమాదం
-
మద్యం తాగి కారు నడిపిన యువకులు
-
ప్రారంభంకానున్న ద్రాక్ష ఫెస్టివల్
-
రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగర శివారు మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతోఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్కాప్ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు, సంబంధిత అధికారుల అండదండలతోఈ దందా కోనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
గ్యాస్ పైపు నోట్లో పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్ : జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పులగూడ గ్రామం దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఆర్.మౌలీధర్ నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా అతడి చెల్లి శ్రావణి ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సమీప బంధువైన ఆర్.నరేందర్ప్రదీప్కు తెలిపింది. దీంతో అతను ఆదివారం సాయంత్రం మౌలీధర్ నివాసానికి వచ్చి చూడగా మొహానికి ప్లాస్టిక్ కవర్ను గ్యాస్ పైప్తో కట్టుకుని పడిఉండటాన్ని కిటికీలోంచి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతడి పక్కనే సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి చెల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
విద్యను సమాజ సేవకు ఉపయోగించాలి
రాజేంద్రనగర్: మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. విద్యను స్వార్థం కోసం కాకుండా దేశ రక్షణ, సమాజ సేవ కోసం ఉపయోగించాలని సూచించారు. ఆదివారం బండ్లగూడ జాగీరులోని శారదా ధామంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ జాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయవద్దని సూచించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. సరస్వతి విద్యా మందిరాలు వ్యాపార ధోరణితో విద్యను బోధించడం లేదని.. సమాజ, దేశ సేవ కోసం బోధిస్తున్నాయని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో భారతదేశం అన్ని దేశాలకు దిక్సూచిగా ఉందని కొనియాడారు. దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విద్యా పీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు. అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యారణ్య స్కూల్ భవనానికి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సీబీఆర్ ప్రసాద్ రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్మించనున్న పాఠశాలకు రూ.12.5 కోట్ల విలువైన భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వర్, పారిశ్రామికవేత్త ఎంఎస్ఆర్వీ ప్రసాద్, సేవిక సమితి ప్రధాన కార్య దర్శి అన్నదాన సీతక్క తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు.. సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్ నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పూర్తి నివేదికను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు నిర్వహకులకు అందిస్తున్నట్లు విద్యార్థి సమ్మేళనం సభ్యులు వెల్లడించారు. -
విధుల్లో చేరిన దిశ తండ్రి
సాక్షి, రాజేంద్రనగర్: దిశ తండ్రి శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు. తన జాయినింగ్ రిపోర్టును ప్రిన్సిపాల్ అంజయ్యకు అందజేశారు. ఆయన ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లోని రాణి ఇంద్రాదేవి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే వారు. ఆయన బదిలీ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం రాజేంద్రనగర్ జూనియర్ కళాశాలకు బదిలీ చేసింది. -
అర్ధరాత్రి బాల్కనీ దూకి..
సాక్షి, అత్తాపూర్ : వేగంగా దూసుకొచ్చిన సఫారీ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కారులో పది మంది ప్రయాణిస్తుండగా మిగతా ఏడుగురు పరారయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు.. అయ్యప్ప సొసైటీ నారాయణ క్యాంపస్లో కోచింగ్ తీసుకునే హనుమదీశ్వర్(19), గణేష్(19), తరుణ్(19), శషాంక్గౌడ్(19), భాను(19), అభివరణ్(19), భాస్కర్(19) వరుణ్(19)లు స్నేహితులు. గురువారం రాత్రి అందరూ కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కొంపల్లిలో ఉండే గణేష్ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ బాబాయ్ కారు సఫారీని తీసుకొని రాత్రి 12:30 గంటలకు శంషాబాద్ వైపు వచ్చారు. తరువాత ఇంటికి బయలు దేరారు. హనుమదీశ్వర్ కారును వేగంగా నడిపాడు. కారు పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 221 వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారులో ముందు కూర్చున ఉదయ్, తరుణ్లకు బలమెన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో విద్యార్థి శషాంక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరగగానే మిగతా విద్యార్థులు అందరూ పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన ఉదయ్ది మహబూబ్నగర్ మద్దూర్ మండలం, తరుణ్ది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అని పోలీసులు తెలిపారు. కారు తీసుకెళ్లారిలా.. గణేష్ గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో కొంపల్లిలో ఉండే తన చెల్లెలు గాయత్రికి ఫోన్చేశాడు. తాను గంటలోపు వస్తానని సఫారి కారు తాళం కావాలని అడిగాడు. ఇంటి ముందు ఉన్న పూల చెట్టు తొట్టిలో కారు తాళం వేయాలని చెప్పాడు. దీంతో గాయత్రి పూలతొట్టిలో తాళం వేసి ఉంచింది. గణేష్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కారు తీసుకువెళ్ళినట్లు గణేష్ బాబాయి కృష్ణ విలేకరులకు తెలిపాడు. అసలు విషయం అందరూ నిద్రిస్తున్న వేళ అర్ధరాత్రి హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు బర్త్ డేకు వెళ్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఐదుగురు వార్డెన్లు నిద్రపోగానే 9 మంది విద్యార్థులు బాల్కనీ నుంచి కిటికి గోడ పైకి వచ్చి కిందికి దిగారు. కారులో శంషాబాద్కు బర్త్ డే కోసం వెళ్లారు. తెల్లవారు జామున వారు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఆరాంఘర్ చౌరస్తా వద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్లోని వర్మ క్యాంపస్లో మెడిసన్ లాంగ్ టర్మ్ విద్యార్థి గణేష్ కుత్బుల్లాపూర్లోని ఇంటికి వెళతానని తల్లిదండ్రులతో మాట్లాడించి అనుమతి తీసుకొని వెళ్లాడు. అర్థరాత్రి బర్త్ డేకు వెళ్లేందుకు ఇంట్లోని సఫారీ కారును తీసుకొని వచ్చి అయ్యప్ప సొసైటీలో వేచి ఉన్నాడు. రూమ్లలో ఉన్న విద్యార్థులు యశ్వంత్, తరుణ్, శంకర్ గౌడ్, భాను, భాస్కర్, వరుణ్లు మొదటి అంతస్తులోని బాల్కానీలో బీమ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికి పైకి వెళ్ళారు. పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన నెట్ను తొలగించి కిందికి దిగారు. గురువారం అర్థరాత్రి 12.40 గంటలకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. గణేష్ తప్ప మిగతా విద్యార్థులంతా గురువారం రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు స్టడీ అవర్లో ఉన్నారు. 11.30 గంటలకు వార్డెన్ రాములు అటెండెన్స్ తీసుకున్నాడు. 11.45 గంటలకు లైట్లు ఆపి అంతా పడుకున్నారు. వర్మ క్యాంపస్లో రాత్రి సమయంలోను ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, వార్డెన్ రాములుతో పాటు జూనియర్ లెక్చరర్లు కరీం, యోగీష్, మురళీ తదితరులు ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున చేవెళ్ల ఎస్ఐ వెంకటేష్ ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో మీ విద్యార్థులు ఇద్దరు చనిపోయారని చెప్పడంతో విషయం తెలిసిందని నారాయణ కాలేజ్ డీజీఎం శ్రీధర్రెడ్డి తెలిపారు. 3.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహించేమా పూర్య విద్యార్థి ఫోన్ చేసి ఇద్దరు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని చెప్పినట్లు తెలిపారు. హస్టల్ ముందు వైపు సీసీ కెమెరాలు ఉండడం, డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కనీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేదికాదు. హాస్టల్లో రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. -
రాజేంద్రనగర్లో ఘోర రోడ్డుప్రమాదం!
-
రాజేంద్రనగర్లో ఘోరరోడ్డుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టి.. పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న యువకులు కూడా గాయపడ్డారు. కారును నడిపింది మైనర్ బాలుడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మితిమీరిన వేగమే కారణం! కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని, బైక్ను ఢీ కొన్న అనంతరం కారు రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకువెళ్లిందని స్థానికులు చెప్తున్నారు. కారును నడిపిస్తున్న మైనర్ బాలుడితోపాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నారని, వారు కూడా గాయపడ్డారని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు. భార్యాబిడ్డతో కలసి తన బైక్పై హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు అతను వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. -
రాజేంద్రనగర్ పేలుడు ఘటనపై డీసీపీ దర్యాప్తు
-
రాజేంద్రనగర్లో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానిక పుట్పాత్పై పడిఉన్న బాక్సును ఓ వ్యక్తి తెరిచాడు. అయితే బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన ఆ వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. రాజేంద్రనగర్ పోలీసు పరిధిలోని శివరాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. అయితే ఆ డబ్బా చెత్తకుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్ డబ్బాగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మృతుడు రాజేంద్రనగర్కు చెందిన యాచకుడు అలీగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. పేలుడు ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బాంబు బ్లాస్ట్ కాదని, కెమికల్ బ్లాస్ట్ అని తెలిపారు. వేరే ప్రాంతం నుంచి ఆ బాక్సును యాచకుడు అలీ తీసుకు వచ్చినట్లు తెలిపారు. -
కల్యాణలక్ష్మి డబ్బు కావాలని భర్త వేధింపులు
సాక్షి, రాజేంద్రనగర్: కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు తనువు చాలించింది. కోటి ఆశలతో అత్తింట్లో కాలు పెట్టిన ఆమె భర్త వేధింపులకు విసుగుచెందిన ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన మమత(24)ను మూడు నెలల క్రితం గండిపేట మండలం గంధంగూడ వెస్టెండ్ కాలనీకి చెందిన సురేష్కుమార్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో మమత కుటుంబసభ్యులు బంగారం, నగదుతోపాటు ఇతర వస్తువులను అందజేసి ఘనంగా వివాహం చేశారు. సురేష్కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, పెళ్లి తర్వాత నెలరోజుల నుంచి అతడు అద నపు కట్నంతోపాటు కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని ఆ డబ్బు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. దీంతో మమత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల అల్లుడి వద్దకు వచ్చిన వారు మూడు నెలల క్రితమే వివాహం చేశామని, ప్రస్తుతం కట్నం డబ్బు లేదని, త్వరలో సమకూర్చి అందజేస్తామని నచ్చజెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సురేశ్ భార్యతో మాట్లాడడం మానేశాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు తన కుటుంబీకులు, తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఈక్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన మమత గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం విధుల నుంచి వచ్చిన సురేశ్ విషయాన్ని గమనించి పోలీసుకలు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. మమత మృతదేహం -
రాజేంద్రనగర్లో టిప్పర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : టిప్పర్ ఇళ్లలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. రోడ్డుపై టిప్పర్ని పార్క్ చేసి డ్రైవర్ టీ తాగడానికి వెళ్లగా ఉన్నట్లుండి బ్రేక్ ఫెయిల్ కావండంతో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్నవారు భయంతో పరుగులు తీసి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
డయల్ 100తో బతికిపోయింది. కానీ..
సాక్షి, హైదరాబాద్ : మాజీ భార్యను హతమార్చాలని పక్కాప్లాన్ ప్రకారం ఆమెను వెంబడించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్టేషన్నుంచి సదరు నిందితుడు పోలీసుల కళ్లుగప్పి కత్తితో సహా ఉడాయించడంతో ఈ కేసులో ట్విస్టు మొదలైంది. వివరాలు..బోరబండకు చెందిన లావణ్య, సాయి కిరణ్కు గతంలో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలతో కలిసి లావణ్య బండ్లగూడలో నివాసముంటున్నారు. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. భార్య విడాకులు తీసుకొని వేరుగా ఉండటాన్ని సాయికిరణ్ అవమానంగా భావించాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం బండ్లగూడలో సాయిలావణ్యపై కత్తితో దాడిచేసి హతమార్చాలనుకున్నాడు. అయితే, అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిరణ్ను గమనించిన లావణ్య.. తన మాజీ భర్తతో ముప్పు ఉందని డయల్ 100కు పోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్వరం స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్ బయటే కూర్చోబెట్టడంతో అతను పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతను ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. తప్పించుకున్న సాయికిరణ్ను ఎట్టకేలకు పోలీసులు జూబ్లిహిల్స్ వద్ద పట్టుకుని మళ్లీ స్టేషన్కు తరలించారు. మాజీ భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని, తమకు తమ కుటుంబానికి రక్షణ కావాలని లావణ్య కోరుతోంది. -
మేనకోడలిపై కీచకమామ అఘాయిత్యం..!
సాక్షి, హైదరాబాద్ : వరంగల్లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవకుముందే రాష్ట్ర రాజధానిలో అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. సొంత మేనమామే ఓ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాపను ఆడిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో శుక్రవారం జరిగింది. కీచక మేనమామ బారినుంచి తప్పించుకుని వచ్చిన చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. (మానవమృగం) ఇదిలాఉండగా.. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో జరిగిన శ్రీహిత హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీహిత ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళాలోకం గళమెత్తింది. మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ‘శ్రీహిత చట్టం’ తేవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. వరంగల్ ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నా.. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. (హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..) -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
-
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురుపై..
-
దారుణం : కన్న కూతురిపై తండ్రి అత్యాచారం
సాక్షి, హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతురిపై రెండు సంవత్సరాలు అత్యాచారాని పాల్పడుతున్నారు. చదవండి : కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి జైలు ఈ విషయాన్ని పిన తల్లికి చెప్పిన పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమిలేక తన కాలేజీ స్నేహితుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయిని చైల్డ్ లేబర్ ప్రొటక్షన్ హాల్లో ఉంచామని పోలీసులు తెలిపారు. -
స్క్రాప్ గోదాంలో పేలుడు
సాక్షి, రాజేంద్రనగర్: కెమికల్ డబ్బాల పేలుడుతో సీఐ, ఎస్సైతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. రాజేంద్రనగర్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.. శాస్త్రీపురంలో యాకత్పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిద్ స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కెమికల్ డబ్బాలను సేకరించి ఈ గోదాంలో శుభ్రపరుస్తుంటారు. శుభ్రపరిచిన ఈ డబ్బాలను తిరిగి విక్రయిస్తారు. 5, 10, 20, 25 లీటర్ల డబ్బాలతో పాటు ప్లాస్టిక్ డ్రమ్ములను శుభ్రపరిచి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఇందులో పది మంది యువకులు పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక కెమికల్ డబ్బా పెలింది. ఈ సంఘటనలో హసన్నగర్కు చెందిన అప్రోజ్(25)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు మోకాళ్ల వరకు నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యజమాని పారిపోయాడు. స్థానికులు, తోటి కార్మికులు అప్రోజ్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో అప్రోజ్ కాలును శాస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ విషయమై స్థానికులలు ఎంఐఎం నాయకుడు రహమత్బేగ్, శాస్త్రీపురం కార్పొరేటర్ మిస్బావుద్దీన్లకు సమాచారం అందించారు. స్థానికులంతా కలిసి గోదాం ఎదుట గురువారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కార్పొరేటర్తో పాటు పలువురు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ సత్తయ్యగౌడ్, ఎస్సై నదీమ్ సిబ్బందితో గోదాం వద్దకు చేరుకుని లోపల పరిశీలిస్తుండగా ఆ సమయంలో మరో కెమికల్ డబ్బా పేలింది. దీంతో సీఐ, ఎస్సై, కార్పొరేటర్తో పాటు రహమత్బేగ్, సయ్యద్ హబీబ్లకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే అపోలోతో పాటు అస్రా ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ ఆశోకచక్రవర్తి పరిశీలించారు. గోదాంను సీజ్ చేశారు. కాగా, గోదాం పరిశీలించేందుకు వెళ్లిన సీఐతో పాటు నలుగురి కర్ణబేరీలకు దెబ్బతిన్నాయి. వారికి వినికిడి శక్తి తగ్గిపోయినట్టు తెలిసింది. గోదాములను తొలగించాలి శాస్త్రీపురంలో పలు గోదాంలు అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దాదాపు 25కు పైగా గోదాములు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాన రహదారిపైనే భారీ ప్లాస్టిక్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, అనుకోని ప్రమాదం జరిగితే చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు నష్టం వాట్టిల్లే ప్రమాదం ఉందన్నారు. -
తాగునీరు కలుషితం
సాక్షి, రాజేంద్రనగర్: తాగునీటి పైపులైన్లోకి మురుగు నీరు ప్రవేశించి నీరు కలుషితమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మంచినీటి పైపులైన్ పగలడంతో ఈ సమస్య ఏర్పడింది. అత్యవసరంగా ఈ పైపులైన్కు మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం బండ్లగూడ గ్రామం నుంచి కిస్మత్పూర్కు వెళ్లే ప్రధాన రహదారి ఎస్ఎంఆర్ ప్రాంతంలో కల్వర్టు ఉంది. ఈ కల్వర్టు మూసుకుపోవడంతో మురుగు నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ పైపులైన్ను వేసి కల్వర్టు వెడల్పు చేశారు. ఈ సమయంలో బండ్లగూడ నుంచి కిస్మత్పూర్కు వెళ్లే తాగునీటి ప్రధాన పైపులైన్కు చిల్లు ఏర్పడింది. దీని మీదుగా తాగునీరు ఎగజిమ్ముతుంది. నీరు సరఫరా అయిన సమయంలో తాగునీరు బయటకు వస్తుంది. నీటి సరఫరా లేని సమయంలో మురుగు నీరు ఉదయం వేలల్లో పైపులైన్ను ముంచి ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ మురుగు నీరంతా పైపులైన్లోకి కలుస్తుంది. దీంతో తాగునీరు కలుషితమై ఇళ్లల్లోకి చేరుతుంది. స్థానికులు ఈ విషయమై గత 4–5రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు 50కాలనీలకు ఈ పైపులైన్ నీరే సరఫరా అవుతుంది. అత్యవసరంగా ఈ పైపులైన్కు జలమండలి అధికారులు మరమ్మతులు నిర్వహించాలి. కానీ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డీజీఎం మణికొండలో ఉండడం, ఏఈ పీరంచెరువులో ఉండడంతో ఈ ప్రాంతంపై ఏ ఒక్కరి అజమాయిషి లేదు. అలాగే ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ అధికారులు ఎవరూ అందుబాటులోకి రావడం లేదు. దీంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మురుగు నీరు తాగడంవల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన పైపులైన్ ప్రాంతంలో పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. -
పీఎం చేతులమీదుగా పెన్షన్ స్కీం పత్రం అందజేత
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ హైదర్గూడ ప్రాంతానికి చెందిన ఎర్ర హరినాథ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్–యోగి మందాన్ పెన్షన్ స్కీమ్ పత్రాన్ని అందుకున్నారు. ఈ పథకాన్ని అహ్మదాబాద్లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రధాన మంత్రి చేతులమీదుగా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాన్ని స్వీకరించాలని రెండు రోజుల క్రితం పీఎం కార్యాలయం నుంచి హరినాథ్కు సమచారం అందింది. ఈ సందర్భంగా మంగళవారం హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పెన్షన్ పత్రాన్ని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పారు. తాను ఎప్పుడూ మోదీని నేరుగా చూస్తానని అనుకోలేదన్నారు. సంఘ సేవకుడైన హరినాథ్ ఎంతోమంది కార్మికులకు పెన్షన్తో పాటు కార్మిక సభ్యత్వాలను అందజేశారు. -
రాజేంద్రనగర్లో విషాదం!
-
స్విమ్మింగ్ పూల్లో మునిగి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద A to Z ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటమునిగి మృత్యువాతపడ్డాడు. గత కొంతకాలంగా విద్యార్థి ఈత నేర్చుకోవడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం కూడా రోజులానే స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. సమయానికి అక్కడ కోచ్ లేకపోవడంతో కొంత దూరం వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. బాలుడి మృతికి స్విమ్మింగ్ పూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో కోచర్ లేకపోవడంతో పాటు అక్కడ సరియైన నిర్వహణ లేని కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు. అప్పటి వరకు తమ ముందు ఆడుకున్న తన కొడుకు విగత జీవిలా పడి వుండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు యాజమాని అక్కడి నుంచి అదృశ్యమయ్యరు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
సిగరెట్ ఇస్తుండగానే లాక్కెళ్లారు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు మహిళల్ని టార్గెట్ చేసిన స్నాచర్లు తాజాగా మగవారిని కూడా వదలడం లేదు. సిగరెట్ ఇవ్వమని అడిగి.. అదే అదునుగా షాపు యజమాని మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన రాజేంద్రనగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదర్గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో రాఘవ రెడ్డి అనే వ్యక్తి కిరాణ షాపు నడుపుతున్నాడు. ఈ క్రమంలో స్నాచర్లు శనివారం రాఘవరెడ్డి షాప్ దగ్గరికి వచ్చి సిగరెట్ కావాలని అడిగారు. సిగరెట్ చేతికి ఇస్తుండగా అదును చూసి రాఘవ రెడ్డి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దాంతో బాధితుడు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజేంద్రనగర్లో ద్రాక్ష ఫెస్టివల్
-
ఔటర్లో గెలిచేదెవరు?
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో ఈసారి సార్వత్రిక పోరు హోరాహోరీగా సాగనుంది. ఉత్తర,దక్షిణ భారత దేశానికి చెందిన ఓటర్లు, విద్య,ఉద్యోగం,వ్యాపారం కోసం నగరానికి వచ్చి స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల వారితో మినీ ఇండియాను తలపిస్తోన్న శివార్లలో పలు నియోజకవర్గాల్లో గెలుగు గుర్రాలేవన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆకాశహారŠామ్యలు ఒకవైపు..నిరుపేదల గుడిసెలు మరోవైపు..పారిశ్రామిక వాడలు ఒకవైపు...వాణిజ్య భవనాలు మరోవైపు..నాణేనికి రెండు పార్శ్వల్లా ఉన్న ఈ నియోజకవర్గాల్లో పేదాగొప్ప తారతమ్యం సుస్పష్టం అధ్వాన అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల సౌకర్యాల లేమి, ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి సమస్య,పారిశ్రామిక కాలుష్యంతో సతమతమౌతున్నాయి.సమస్యలతో సహవాసం చేస్తున్న పలు కీలక శివారు నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారిన ఎన్నికల పోరుపై ’సాక్షి’ అందిస్తోన్న గ్రౌండ్రిపోర్ట్... ఎల్బీనగర్లో నువ్వా..నేనా.. ఏపీ నుంచి రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రవేశించే గేట్వేలా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి,టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్గౌడ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ తరఫున బరిలోకి దిగిన పేరాల శేఖర్రావు కూడా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,నియోజకవర్గంలో 11 మంది కార్పొరేటర్లు తమ పార్టీ వారే కావడంతో తన గెలుపు ఖాయమని రామ్మోహన్ గౌడ్ భావిస్తున్నారు. టీడీపీ క్యాడర్ నుంచి పూర్తిసహకారం లభిస్తుండడం,గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి,అన్ని వర్గాలతో ఉన్న సత్సంబంధాలు తన గెలుపునకు దోహదం చేస్తాయని సుధీర్రెడ్డి విశ్వసిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్రావు భూత్,డివిజన్స్థాయి క్యాడర్పై ఆశలు పెట్టుకున్నారు. లింగోజిగూడా,నాగోలు,హయత్నగర్ సహా అన్ని డివిజన్లలో నెలకొన్న ముంపు సమస్యలు,ట్రాఫిక్ ఇక్కట్లు,కాలనీలకు మినీ బస్సు సర్వీసులు లేక ప్రజారవాణా అస్తవ్యస్తంగా మారడం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేయనున్నాయి. ఉప్పల్ బరిలో గెలుపు ఎవరిదో.... పాతకొత్తల సమ్మేళనంగా నిలిచిన ఉప్పల్ నియోజకవర్గంలో ఈ సారి కీలక పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న భేతి సుభాష్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బోలెడు ఆశలుపెట్టుకున్నారు. కూటమి పార్టీలో అనైక్యత, నాలుగేళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి వీరేందర్గౌడ్ గతంలో తన తండ్రి దేవేందర్గౌడ్ చేపట్టిన అభివృద్ధి పథకాలు,బీసీ ఓట్లు తనవైపేనని భావిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సెటిలర్స్ ఓట్లతోపాటు తాను వ్యక్తిగతంగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. గత పదేళ్లుగా టీడీపీ క్యాడర్నిర్వీర్యంకావడం,కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండడం వీరేందర్గౌడ్కు ఇబ్బంది కరంగా మారింది. కుత్బుల్లాపూర్లో ద్విముఖ పోటీ.. పారిశ్రామికవాడలు.. రసాయన బల్క్ డ్రగ్ కాలుష్యం,రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల నిలయం కుత్బుల్లాపూర్. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి కూన వివేక్గౌడ్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఉన్న సెటిలర్స్ ఓట్లపై ఇద్దరు నేతలు బోలెడు ఆశలుపెట్టుకున్నారు. టీఆర్ఎస్ సంక్షేమ,అభివృద్ధి పథకాలు,సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండడం, సౌమ్యునిగా పేరొందిన టీఆర్ఎస్ అభ్యర్థి వివేక్ తన గెలుపును ఆకాంక్షిస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బల్క్డ్రగ్ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న కాలుష్యంతో అవçస్తలు పడుతున్న జనం, ఓపెన్నాలాలు, 450 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు ఏర్పాటుచేసినప్పటికీ సగం పైపులైన్లలో తాగునీటి జాడలు లేకపోవడం,నీటినిల్వలు లేక అలంకార ప్రాయంగా మారిన రిజర్వాయర్లపై జనం అసంతృప్తిగా ఉన్నారు. ఐటీ అడ్డాలో పాగా ఎవరిదో.. దేశ,విదేశాలకు చెందిన దిగ్గజ ఐటీ,బీపీఓ,కెపిఓ సంస్థలు,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా,దేశ,విదేశీ అతిథులు,సెటిలర్స్తో మినీ ఇండియాగా..ఐటీఅడ్డాగా..సైబరాబాద్గా పేరొందింది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నారు. తమ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండడం,పార్టీకి ఉన్న పది మంది కార్పొరేటర్ల సహకారంతో ప్రచారపర్వంలో ముందున్నారు. కూటమిలో కుమ్ములాటలు టీడీపీ అభ్యర్థి ఆనంద్ప్రసాద్కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించడంలేదు.రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గజ్జెల యోగానంద్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సెటిలర్స్ ఓట్లు,విద్యాధికుల ఓట్లు తనకేనన్న ధీమాతో ఉన్నారు. కూకట్పల్లిలో ముగ్గురి యుద్ధం... సెటిలర్స్ ఎక్కువ గా ఉండే∙ కూకట్పల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు,ప్రజాకూటమి తరఫున చుండ్రు సుహాసిని,బీఎస్పీ తరఫున హరీష్రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు తనకు వరంగా మారతాయని టీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ క్యాడర్,నేతల నుంచి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కూటమి అభ్యర్థి చుండ్రు సుహాసిని అగ్రనేతల రోడ్షోలతో ప్రచార పర్వంలో ముందున్నప్పటికీ భూత్,డివిజన్ స్థాయిలో బలంగా లేకపోవడం ఇబ్బంది క రం. ఇక బీఎస్పీ అభ్యర్థి హరీష్రెడ్డి గత రెండునెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయడం,టీఆర్ఎస్పార్టీలో అసంతృప్తులు తనకు సహకరిస్తారన్న ధీమాతో ఉన్నారు. రాజేంద్రనగర్లో త్రిముఖ పోరు.. కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు,కాటేదాన్ పారిశ్రామిక వాడ,చారిత్రక జంటజలాశయాలు నెలకొన్న ఈ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్,బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తోకల శ్రీనివాస్ రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ప్రకాశ్గౌడ్ భావిస్తున్నారు. పార్టీలో ఆయన అభ్యర్థిత్వంపై అసంతృప్తులు,క్యాడర్కు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఆయనపై ఉ¯న్నాయి. బీజేపీ సీనియర్నేత బద్దం బాల్రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తోపాటు యూపీ,బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల సెటిలర్స్ ఓట్లపై విశ్వాసం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ రెబెల్గా బరిలో ఉన్న తోకల శ్రీనివాస్రెడ్డి క్యాడర్లో ఉన్న సానుభూతి తనకు కలిసివస్తుంద ని భావిస్తున్నారు. ఈనియోజకవర్గంలో ప్రధానంగా జి.ఓ.111 ఎత్తివేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి..రాజ్ ఎవరో.. ఉత్తర,దక్షిణభారత రాష్ట్రాలు,తెలుగురాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి వలసవచ్చినవారితో నిండిన ఈ నియోజకవర్గం మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు,టీజేఎస్ అభ్యర్థి దిలీప్కుమార్,బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సంస్థాగతంగా టీఆర్ఎస్పార్టీ బలంగా ఉండడం,క్యాడర్ మద్దతు,గత నాలుగేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పార్టీ కార్యకలాపాలు తన గెలుపును నల్లేరుమీద నడకప్రాయంగా మారుస్తాయని మైనంపల్లి హనుమంతరావు భావిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా దూకుడుగా వ్యవహరిస్తారన్న విమర్శకూడా ఉంది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు విద్యాధికుడు,గతంలో ఓడిపోయారన్న సానుభూతి,ఉత్తరాది సెటిలర్స్ ఓట్లు తనకు కలిసివస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్కుమార్ చివరిక్షణంలో ప్రచారంలో పుంజుకున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్,టీడీపీ శ్రేణులు ఆయనకు సహకరిస్తున్నాయి. అయితే ఆయన పార్టీ గుర్తుకు సరైన ఆదరణ లేకపోవడం ,పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం ఆయనకు మైనస్పాయింట్గా మారింది. -
ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం.
-
ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం..
సాక్షి, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి భంగపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి కేటాయించారు. మీ నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శంషాబాద్లోని ఆయన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు పేరు చెప్పి టీడీపీ దరిద్రం కాంగ్రెస్ కు అంటించారని ఉత్తమ్ కుమారెడ్డిపై నిప్పులు చెరిగారు. 40 మంది కార్యకర్తలు కూడా లేని టీడీపీకి రాజేంద్రనగర్ సీటు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతోందనీ, కాలాన్ని వృధా చేయకుండా కార్తీక్ రెడ్డికి టికెట్ కోసం వేలాదిగా గాంధీభవన్ ముట్టడించాలని మన పోరాటం ఢిల్లీకి తాకి పునరాలోచించాలని కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు శ్రీనివస్ గౌడ్ అధ్యక్ష పదవికి రాజీనామచేశారు. కార్తీక్ రెడ్డికి టికెట్ ఇస్తే లక్ష ఓట్లతో రాజేంద్ర నగర్ గెలుస్తారు. లేదంటే ప్రచాకటరకమిటీ సభ్యత్వంతో సహా అన్ని పదవులకు కార్తీక్ రెడ్డి ,రాజేంద్రనగర్ కార్యకర్తలు రాజీనామా చేస్తామని, కూర్చొని మాట్లాడితే కాదు, రోడ్లపైకి వెళ్లి ఎక్కడిక్కడ స్తంభింపచేయాలని ఇంతమంది కార్యకర్తలను రోడ్డు మీద పడేసినందుకు ఉత్తమ్ కుమారెడ్డికి ధన్యవాదాలని ఎద్దెవ చేశారు. కార్తీక్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నా ఆయనవెంటే ఉంటామని ప్రకటించారు,ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సైతం సిద్దపడాలని అవసరమైతే సబితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఇద్దరు బరిలో నిలవాలని ఇద్దరినీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. -
బండ్ల గణేశా.. టికెట్ దక్కెనా?
సాక్షి, హైదరాబాద్ : పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేశ్.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తుల అనంతం అర్థాత్రి విడుదల చేసిన తొలి జాబితాలోను.. తాజాగా 10 మందితో ప్రకటించిన రెండో జాబితాలోను అతని పేరును ప్రకటించలేదు. అంతేకాకుండా గణేష్ ఆశిస్తున్న రాజేంద్ర నగర్ స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. (చదవండి: కాంగ్రెస్ రెండో జాబితా) గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షమైన టీడీపీ తమకే ఆ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డికి ఈ స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఫ్యామిలీకి ఒకే టికెట్ సిద్ధాంతమన్నా కాంగ్రెస్.. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, కోమిటి రెడ్డి బ్రదర్స్, మల్లు బ్రదర్స్లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఆమె ఈ టికెట్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరి అధిష్టానం బండ్ల గణేశ్కు అవకాశం ఇస్తుందా..? లేక టీడీపీకి వదిలేస్తుందో వేచి చూడాల్సిందే. ఎన్నికల నగార మోగినప్పటి నంచి హడావుడి చేస్తున్న బండ్ల గణేశ్కు టికెట్ దక్కపోతే పరిస్థితి ఏంటని.. ఆయన రాజకీయాల్లో కొనసాగుతాడా? లేక ఇతర పార్టీలవైపు చూస్తాడా? అనే చర్చ జోరు అందుకుంది. (చదవండి: 65 మందితో కాంగ్రెస్ తొలి జాబితా) -
రాజేంద్రనగర్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి
-
శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు
రాజేంద్రనగర్: హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఏదైనా శుభకార్యం, దుకాణాల ప్రారంభోత్సవం జరిగితే వచ్చి నజరానా తీసుకోని వెళ్లేవారు. కానీ ఇప్పుడు గ్యాంగులుగా ఏర్పడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిపై దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రెండు రోజుల క్రితం నలుగురు హిజ్రాలు నార్సింగి సబ్రోడ్డులో దారిగూండా వెళ్తున్నవారిని అడ్డగించి అందిన కాడికి దోచుకున్నారు. మంచిరేవులకు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నియోజకవర్గంలోని మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో కొందరు హిజ్రాలు ఉన్నప్పటికీ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గుంపులు గుంపులుగా.. హిజ్రాలు గ్యాంగులుగా ఏర్పడి నానా హడావిడి సృష్టిస్తున్నారు. ఒకొక్క గ్యాంగులో నాలుగు నుంచి 10 మంది సభ్యులు ఉంటున్నారు. ఆటోల్లో తిరుగుతూ ఎక్కడ శుభకార్యం జరిగిన వాలిపోతున్నారు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు వెలికి చేష్టలు చేస్తూ ఇబ్బందులు సృష్టిసుంటారు. వారు అడిగిన డబ్బు ఇచ్చేంత వరకు విడవడం లేదు. దీంతో నయానో.. బయానో సముదాయించి డబ్బును అందజేస్తున్నారు. పెళ్లి చేసేవారి వారి స్థాయిని బట్టి రూ. 5 నుంచి రూ. 25 వేల వరకు, గృహప్రవేశాలకు రూ. 5 నుంచి రూ.10 వేలు, ఇతర ఏ శుభకార్యాలు చేపట్టిన రూ. 5 వేల వరకు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. అసభ్యకరపదజాలంతో తిడుతూ శాపనార్థాలు పెడుతూ రోడ్లపై హంగామా చేస్తారు. -
భర్తను చంపిన కేసులో భార్య,ప్రియుడు అరెస్ట్
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల దౌర్జన్యం
-
ఇంటికి కన్నం వేసిన పని మనిషి అరెస్ట్
అత్తాపూర్ : నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అని ఇంటి పనులన్నీ అప్పజెప్పారు. అదే అదనుగా భావించిన ప్రబుద్ధుడు పని చేస్తున్న ఇంటికే కన్నం పెట్టాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పో లీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన నగర శి వారులోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ జోన్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలోని ప్రెస్టేజ్ రాయల్ విల్లాస్ లోని 56వ ప్లాట్లో గత కొంతకాలంగా డాక్టర్ రా మకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే భార్యాభర్తలు ఉద్యోగులు కావడంతో ఇంట్లో వంట చేయడానికి తమకు తెలిసిన బంధువుల ద్వారా ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్న రవి అనే వ్యక్తిని ఫిబ్రవరి మాసంలో వంట మనిషిగా పెట్టుకున్నారు. అదే అదనుగా భావించిన రవి.. దంపతులిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో బీరువాలో ఉన్న 51 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును దోచుకోని పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పని మనిషి రవికి ఫోన్ చేస్తే స్వీఛాప్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఆఫీసర్ అశోక్కుమర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్లలో మేకల దొంగతనం
రాజేంద్రనగర్ రంగారెడ్డి : ఒకటి కాదు... రెండు కాదు... 11 నెలలుగా 30 మేకలను ఎత్తుకెళ్లారు. కారుల్లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడతారు. దొంగతనాల విషయం తెలిసి దొంగలను పట్టుకునేందుకు స్థానిక యువకలు ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు సరికదా.. ఆ కారును వారి మీదకే దూకించి భయపెట్టేవారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందన్న చందంగా ఎట్టకేలకు మేకల దొంగలు పోలీసులకు చిక్కారు. కారు పంక్చర్ కావడంతో స్థానిక యువకులు గుర్తించి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రేమావతిపేట ప్రాంతంలో స్థానిక కురుమ, యాదవులు మేకలను పెంచుతున్నారు. వీటిని తమ ఇళ్ల ముందు ఉన్న పాకలతో పాటు బస్తీలోని ఖాళీ స్థలంలో రాత్రి సమయాలలో గడ్డి వేసి ఉంచేవారు. గత 11 నెలలుగా రాత్రి సమయంలో వాహనాలలో వచ్చిన దొంగలు వీటిని ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఇలా 30 మేకలను అపహరించారు. ఈ విషయమై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. స్థానిక యువకులు రాత్రి సమయంలో బస్తీలలో కాపు కాసినా వారిపైకే వాహనాలను తీసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేసి తప్పించుకునే వారు. వాహనాలకు నెంబర్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో వారిని పట్టుకోవడంలో స్థానిక యువకులు విఫలమయ్యారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో స్థానిక యువకులు ప్రేమావతిపేట శివాలయం వద్ద కాపు కాశారు. కారులో నలుగురు యువకులు ప్రేమావతిపేట ప్రాంతానికి వచ్చారు. ఓ వీధిలో నిద్రిస్తున్న మూడు మేకలను రెప్పపాటులో కారులోకి వేసుకున్నారు. మేకల శబ్ధానికి అప్రమత్తమైన యువకులు కారు వద్దకు రాగానే రివర్స్లో వారిపైకే వేగంగా పోనిచ్చారు. అప్రమత్తమైన యువకులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో వాహనం ముందు టైర్ పంక్చరైంది. అలాగే ముందుకు వేగంగా పోనిచ్చారు. రోడ్డుపై కొద్దిదూరం వెంబడించినా యువకులకు కారు చిక్కలేదు. విషయాన్ని పెద్దలకు చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాహనం పంక్చర్ కావడంతో దానిని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో డాంబర్ రోడ్డు (బీటీ రోడ్డు)ను రాసుకుంటూ వెళ్లింది. యూనివర్సిటీ రోడ్డు నుంచి బుద్వేల్ మీదుగా స్థానిక చర్చి ప్రాంతంలో పార్కు చేసి ఉంది. దీంతో యువకులు వాహనాన్ని గుర్తించి దానిపై స్థానికులను ఆరా తీశారు. స్థానిక యువకులే దొంగతనాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనంతో పాటు నలుగురు యువకులు, ఒక మేకను స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత 11 నెలల కాలంగా 30 మేకలను దొంగలించింది వీరేనా, వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ యువకులంతా 24 సంవత్సరాలలోపే ఉండడం గమనార్హం. -
బ్యూటీషియన్ను మాటల్లో దించి గొలుసు చోరీ
రాజేంద్రనగర్ : బ్యూటీపార్లర్కు వచ్చిన ఓ మహిళ.. నిర్వాహకురాలిని మాటల్లోకి దింపి ఆరు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెక్రటేరియట్ కాలనీలో పద్మావతి అనే మహిళ సరిత బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ(30) బ్యూటీపార్లర్లోకి వచ్చింది. ఈ సమయంలో పద్మావతి ఒంటరిగా ఉంది. తనకు మేకప్ చేయాలని కోరడంతో పద్మావతి ఆ మహిళకు మేకప్ చేయడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఊరు, ఇతర కుటుంబ విషయాలు అడిగి బ్యుటీషియన్ పద్మావతిని మాటల్లోకి దింపింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి పద్మావతి మెడలో ఉన్న ఆరు తులాల బంగారు గొలుసు కనిపించకపొవడంతో లబోదిబోమంటూ స్థానికుల సాయంతో నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ మాటల్లోనే మత్తు ఉందని ఆమె తనతో ఏం చేసిందో గొలుసు ఎలా తీసుకుందో తెలియడం లేదని పద్మావతి బోరుమంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి ....
రాజేంద్రనగర్: మహిళపై అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితుడిని మైలార్దేవ్పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... శివరాంపల్లి ఇందిరారెడ్డినగర్ ప్రాంతానికి చెందిన ఎం.పద్మమ్మ(38), తిరుపతయ్యలు దంపతులు. వీరు గత నెల 30న కూలీ పని కోసం బహదూర్పురా అడ్డా వద్దకు వెళ్లారు. పని దొరకకపోవడంతో సాయంత్రం ఇంటికొస్తూ దానమ్మ జోపిడీ వద్ద గల కల్లు కాంపౌండ్కు వెళ్లారు. ఇద్దరూ కల్లు సేవిస్తుండగా మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన ఎం.విష్ణు(28) అలియాస్ చక్రం వీరితో మాటలు కలిపాడు. గతంలో ఇడ్లీలు విక్రయించే సమయంలో పద్మమ్మ, తిరుపతయ్యలకు విష్ణుతో పరిచయం ఏర్పడింది. తనకు రాఘవేంద్ర కాలనీలోని తెలిసిన మార్వాడీ ఇళ్లల్లో పని ఉందని చెప్పి.. పద్మమ్మకు పని కల్పిస్తానని నమ్మించాడు. దీంతో పద్మమ్మ తన భర్త తిరుపతయ్యను ఇంటికి పంపి.. తాను పని చూసుకుని వస్తానని విష్ణుతో వెళ్లింది. వాళ్లిద్దరూ ఆటోలో రాఘవేంద్ర కాలనీ వద్ద దిగి అక్కడే ఉన్న మార్వాడీ ఇంట్లో పని మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లగానే విష్ణు.. శాస్త్రీపురంకు వెళ్లే దారిలో గుండా వెళదామని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోకి తీసుకెళ్లి పద్మమ్మపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనతో కోపగించుకున్న పద్మమ్మ జరిగిన విషయాన్ని పోలీసులకు, భర్తకు చెబుతానని విష్ణును బెదిరిండంతో.. పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై బాది చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని మద్యం సేవించాడు. తిరిగి పార్కుకు చేరుకుని మరోసారి బండరాయితో మోది ఆమె మెడలోని బంగారు పుస్తె, ముక్కు పుడక, పట్టగొలుసులు, కమ్మలను తీసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పార్కులో ఉన్న చెత్తా, చెదారాలు వేసి కాల్చివేశాడు. అక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్లాడు. స్థానికులు పార్కులో మంటలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పద్మమ్మదిగా గుర్తించి ఆమె భర్త ఇచ్చిన సమాచారంతో విష్ణు కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. సోమవారం ఉదయం వైన్స్ షాపు వద్ద కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.∙ -
కాటేదాన్లో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్: కాటేదాన్లోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు గంటల పాటు మంటలు ఎగిసిపడి షేడ్ మొత్తం దగ్ధమైంది. పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్రంగా కష్టపడ్డారు. ఇంత జరిగిన నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా సమాచారం సైతం అందించలేదు. స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో షాలీమార్ కొబ్బరినూనె పరిశ్రమ కొనసాగుతుంది. ఇందులో నూనె తయారీ, ప్యాకింగ్ చేస్తారు. శనివారం రాత్రి విధులు ముగించుకున్న కార్మికులు ఇళ్లకు వెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. మంటలు ఉధృతం కావడంతో సెక్యూరిటీ గార్డులు విషయాన్ని కంపెనీ యజమానికి తెలిపారు. అప్పటికే పరిశ్రమలోని నాలుగువైపుల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలతో ప్యాకింగ్కు సిద్ధంగా ఉన్న కొబ్బరినూనె డబ్బాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని కార్మికులు తెలుపుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పరిశ్రమ పైకప్పు కుప్పకూలింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దీంతో కేసు నమోదు చేయలేదని మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం కావడంతో... ఈ పరిశ్రమలో కొబ్బరినూనె తయారీ, ప్యాకింగ్తో పాటు పసుపు, కారం, గరం మసాలా తది తర నిత్యవసర వస్తువుల ప్యాకింగ్ను నిర్వహి స్తున్నారు. ఇందులో 800 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం ప్రమాదం జరగడంతో ఎవరు లేరని దీని కారణంగా పెను ప్రమాదం తప్పిందని కార్మికులు వెల్లడించారు. రెండు గంటలు ఉక్కిరిబిక్కిరి... ఉదయం రెండు గంటల పాటు దట్టమైన పొగలతో కాటేదాన్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా వాహనాలు వెళ్ళేందుకు రహదారులు పెద్దగా లేకపోవడం, రహదారి నుంచి పరిశ్రమ లోపలికి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు అగ్నిమాపక యంత్రంలో నీటిని తిరిగి తీసుకురావడానికి బుద్వేల్ లేదా బహదూర్పురా వాటర్బిడ్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. -
కటింగ్ కోసం వచ్చి కత్తెరతో దాడి
-
హైదరాబాద్ సీఐ .. ఏపీలో కేసు
సాక్షి, జగ్గయ్యపేట : తెలంగాణకు చెందిన సీఐ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో వివాదంలో చిక్కుకున్నాడు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన పుష్పన్ కుమార్ హైదరాబాద్ రాజేంద్రనగర్లో సీఐగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వ్యక్తిగత కారణాలతో గత మూడేళ్లుగా భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వీరు విడిగానే ఉంటున్నారు. అయితే కేసు కోర్టులో ఉండగానే పుష్పన్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య విజయ, కుటుంబ సభ్యులతో కలిసి సీఐ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఆగ్రహించిన పుష్పన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, విజయ ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో విజయ చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించింది. తనకు అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకొన్న పుష్పన్ను అడగటానికి వెళ్తే తనతోపాటు కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని, విచారణ పూర్తి కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నారంటూ విజయ పుష్పన్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చుక్కలు చూపిస్తున్న కరెంట్ బిల్లులు
-
ఆర్టీఏ అధికారులమని చెప్పి..
రాజేంద్రనగర్: నగరశివారులో నకిలీ ఆర్టీఏ అధికారులు హల్చల్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ కర్నూలు రోడ్డులో ఆదివారం రాత్రి ఆర్టీఏ అధికారులమంటూ కొందరు యువకులు లారీలను ఆపి వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఇద్దరు లారీ డ్రైవర్లను చితకబాది వారి వద్ద నుంచి అందిన కాడికి దోచుకొని ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
పోలీసుల పేరిట బెదిరింపు.. రూ.50 లక్షలతో పరారీ
బంగారం వ్యాపారి నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా ఘటన హైదరాబాద్: పాత నోట్లను మార్పిడి చేసుకోవడానికి వచ్చిన ఓ బంగారం వ్యాపారిని పోలీసు దుస్తుల్లో ఉన్న దుండగులు బెదిరించి రూ.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన దీపక్(35) బంగారం వ్యాపారి. నగరంలోని తన స్నేహితుడి సహాయంతో అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంక్లో పాత నోట్లను మార్చాలనుకున్నాడు. ఈ మేరకు మగంళవారం పాయంత్రం దీపక్ ఓ కారులో తన స్నేహితులైన రమేశ్, దినేశ్, రాజేశ్లతో కలసి అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంక్ వద్దకు వచ్చాడు. కానీ నోట్లను మార్పిడి చేసే శ్రీనివాస్, చైతన్య, శివకుమార్లు ఆలస్యంగా రావడంతో బ్యాంక్ సమయం ముగిసిపోయింది. మరునాడు మళ్లీ వద్దామని భావించిన దీపక్ తన స్నేహితులతో కలసి హైదర్గూడ సోమిరెడ్డినగర్కు చేరుకున్నాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పోలీస్ వాహనాల హడావిడి కనిపించడంతో భయపడి అక్కడి నుంచి కారులో వెళ్లిపోతుండగా ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. దుండగుల్లో ఒకరు పోలీసు యూనిఫారం, మరో వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉన్నారు. కారును తనీఖి చేయాలని గద్దించడంతో దీపక్ తన వద్ద రూ.50 లక్షలు ఉన్నాయని, వాటిని బ్యాంకులో మార్పిడి చేయడం కోసం తెచ్చానని చెప్పాడు. ఇది నల్లడబ్బని, 200 శాతం ఫైన్ పడుతుందని, ఇదంతా పత్రికల్లో, టీవీల్లో వస్తుందని దుండగులు భయపెట్టి రూ.50 లక్షల మూటను ఎత్తుకెళ్లారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు రాత్రి 9:30 గటంలకు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జనపథం - రాజేంద్రనగర్
-
బీటెక్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి కాలేజీకి వెళ్లి అదృశ్యమయ్యాడు. హైదర్గూడ వాసి ఎం. హేమ ప్రసాద్ కుమారుడు ఈశ్వర్ తేజ్(19) స్థానిక వీఎన్నార్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన సాయితేజ్ సాయంత్రం తిరిగి రాలేదు. అతని దగ్గర ఉన్న రెండు సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయి. తల్లిదండ్రులు కాలేజీలో విచారించగా సోమవారం కాలేజీకి వెళ్లలేదని తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు మిత్రులు, బంధువులను వాకబు చేశారు. ఫలితం కానరాక పోయేసరికి మంగళవారం ఉదయం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఫామ్హౌస్పై దాడి: బాలికపై అత్యాచారం
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేటలోని ఓ ఫామ్ హౌస్పై శనివారం దోపిడీ దొంగలు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అక్కడున్న ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఫామ్హౌస్లోని రెండు ల్యాప్టాప్లు తీసుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి....దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఇన్నోవా కారు బోల్తా : నలుగురికి గాయాలు
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో దుర్గానగర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించి.. ట్రాఫిక్ను పునరుద్దురించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీసీఎం బోల్తా: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలంలో మంగళవారం ఉదయం డీసీఎం బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆయిల్ పీపాలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు ఆరాంఘర్ చౌరస్తాలో బోల్తా పడింది. వ్యాన్లోని పీపాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. -
ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు
హైదరాబాద్సిటీ: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో లక్ష్మిగూడ చెరువులో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు బహదూర్పురాకు చెందిన అమీర్, ఫారూఖ్, సల్మాన్, ఆసిఫ్లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఊరు వెళుతున్నారా .. చెప్పేసి వెళ్లండి
మీరు వేసవి సెలవులకు ఊరెళుతున్నారా.. ఇళ్ళకు తాళాలు వేసి ఎక్కడికన్న ప్రయాణం అవుతున్నారా అయితే దొంగలుంటారు జాగ్రత్త. కనీస జాగ్రత్త చర్యలు తీసుకొని ఊరెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. సెలవుల్లో యాత్రలు, సొంత గ్రామాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని రాజేంద్రనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లే ఇళ్లనే దొంగలు లక్ష్యం చేసుకొనే ప్రమాదం ఉంది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు తెగబడి అంతా దోచుకెళతారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్స్పెక్టర్ వి. ఉమేందర్ సూచిస్తున్నారు. పోలీసు సూచనలు, సలహాలు పాటిస్తే దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయ విజ్ఞప్తి చేశారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి పిల్లర్ నంబర్ 180 వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. బైక్ పై వెళుతున్న శ్రీనివాస్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆహారం వికటించి విద్యార్థులకు అస్వస్థత
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం డివిజన్లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 16 మంది శుక్రవారం అస్వస్థత పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఓ విద్యార్థిని తెచ్చిన చక్కెరను 16 మంది తినగా... వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారిని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. మధ్యాహ్న భోజనానికి సుమారు 80 మంది విద్యార్థులు హాజరుకాగా, చక్కెర తిన్న 16 మంది మాత్రమే అస్వస్థతకు గురవడం గమనార్హం. -
ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి
రాజేంద్రనగర్: హైదరాబాద్లో ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 170 వద్ద మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం రాజేంద్రనగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఫారూఖ్(30)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆ కుటుంబంలో అందరూ ఐపిఎస్లే
-
టిప్పర్తో పరారైన వ్యక్తి అరెస్ట్
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టిప్పర్ మాయం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నార్సింగ్లో రెండు నెలల క్రితం టిప్పర్ అదృశ్యం కాగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితుడు శివాజీని పోలీసులు సోమవారం నార్సింగ్లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్
-
రోడ్డుపై నూనె : పలువురికి గాయాలు
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : ఓ ట్రాలీ ఆటో నుంచి నూనె ప్యాకెట్లు రోడ్డుపై పడి పగిలిపోవడంతో.. పలు వాహనదారులు జారి పడి గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. కాటేదాన్ నుంచి నార్సింగ్ వైపు వెళుతున్న ఓ ట్రాలీ ఆటో నుంచి 15 నూనె ప్యాకెట్ల బాక్స్లు రోడ్డుపై పడిపోయాయి. ప్యాకెట్లు పగిలి నూనె రోడ్డుపై కారిపోవడంతో.. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ముగ్గురు వాహనాదారులు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి రోడ్డుపై మట్టి వేసి ఇతర వాహనాదారులకు ప్రమాదాలు కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. -
'చదువుకోనందుకు బాధగా ఉంది'
మణికొండ (రంగారెడ్డి): చిన్నతనంలో చదువుకోనందుకు ఇప్పటికీ బాధ కలుగుతోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం మాట్లాడుతూ... చిన్నతనంలో అప్పటి పరిస్థితుల వల్ల తాను చదువుకోలేకపోయానని... తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఓపికతో ప్రతి విద్యార్థిని గమనిస్తూ విద్యాబోధన చేస్తారని చెప్పారు. -
తండ్రిని హతమార్చిన కుమారుడు
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : కుటుంబ కలహాలతో కన్నతండ్రిని హతమార్చాడో ప్రబుద్ధుడు. దీనికి తల్లి సహకరించింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కోకాపేట్ కాలనీకి చెందిన సల్లంగుల చంద్రయ్య(47) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతుండేవి. కాగా శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరగడంతో.. కోపంతో ఊగిపోయిన చంద్రయ్య కుమారుడు వెంకటేష్(19) పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రి తలపై వేటు వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న తల్లి అంజమ్మ(45) కూడా కుమారుడికి సహకరించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని మణికొండ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో ఉన్న శివాలయానికి ప్రహరీ, వాణిజ్య షట్టర్లను నిర్మిచారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం తహశీల్దారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆలయ ప్రహరీ, వాణిజ్య షట్టర్లను కూల్చివేశారు. కాగా, కూల్చివేతలను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో స్థానికులు ధర్నాకు దిగారు. కూల్చివేసిన వాటిని తిరిగి రెవెన్యూ సిబ్బందే నిర్మింపజేయాలని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఆందోళన కారులను రాయదుర్గం పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
వివాహిత కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కిడ్నాప్ అయిన వివాహిత కేసు మిస్టరీ వీడింది. కోల్కతాలో బిహార్కు చెందిన కిడ్నాపర్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివాహితకు విముక్తి కల్పించారు. సోమవారం మధ్యాహ్నానికి ఆ మహిళను హైదరాబాద్కు తీసుకు రానున్నారు. ఆ వివాహిత కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేసేందుకు దుండగులు కిడ్నాప్కు పాల్పడిన విషయం తెలిసిందే. -
రాధిక కిడ్నాప్ నిందితుడు ఒడిశాలో..
అత్తాపూర్ (హైదరాబాద్) : వివాహిత రాధిక కిడ్నాప్ కేసు దర్యాప్తును రాజేంద్రనగర్ పోలీసులు వేగవంతం చేశారు. ఈనెల 6 వ తేదీన అదృశ్యమైన రాధికను రూ.3 లక్షలు ఇవ్వకపోతే ముంబైలో అమ్మేస్తానని దుండుగుడు చేసిన వాట్సాప్ కాలింగ్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ స్నిగ్నల్స్ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నట్లుగా గుర్తించారు. బాధితురాలిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఉదయం ఎస్ఓటీ పోలీసు బృందాలు విమానంలో ఒడిశాకు బయలుదేరాయి. కాగా ఈనెల 6న గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన రాధికను కిడ్నాప్ చేసిన దుండగుడు వాట్సాప్ ద్వారా ఆమె భర్తను రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి భర్తకు డబ్బు డిపాజిట్ చేయమని ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా అతను భవానీనగర్కు చెందిన మహమ్మద్ అజర్ఖాన్గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ చిరునామాకు వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. కాగా రాధికను నిర్బంధించిన దుండగుడు ఆమె శరీరం నుంచి రక్తం కారుతున్న చిత్రాన్ని వాట్సాప్లో పంపడం కలకలం సృష్టించింది. -
నగర శివారులో భారీ వర్షం
రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా): రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షం 45 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా పడింది. మైలార్దేవ్పల్లి, ఉడంగడ్డ, ఆరాంఘర్, గగన్పహాడ్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, యూనివర్సిటీ, హిమాయత్సాగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంతే కాకుండా వాటి చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ వేసవి కాలం అనంతరం ఇదే భారీ వర్షం. -
స్కూల్బస్సు బీభత్సం
-
ఔటర్రింగ్రోడ్డులో కారు దగ్ధం
-
హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి
హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. నగరంలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాజేంద్రనగర్లోని ఎన్టీఆర్ నగర్లో ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలోనే వనస్తలిపురంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు యువతిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. -
రాజేంద్రనగర్లో కాల్పుల కలకలం
-
రాజేంద్రనగర్లో కాల్పుల కలకలం
హైదరాబాద్: రాజేంద్రనగర్లో మంగళవారం తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ ఏజీ కాలనీలోని రహదారిపై వెళ్తున్న వాహనంపై ఆగంతకులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న రియాల్టర్ షాబుద్దీన్ నేరుగా రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన వాహనంపై ఆగంతకులు కాల్పులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబుద్దీన్ తో పాటు పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి వచ్చి స్థానికులను విచారిస్తున్నారు. -
రేవ్ పార్టీపై పోలీసుల దాడి
హైదరాబాద్: రేవ్ పార్టీలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. శివారు ప్రాంతాల్లో జోరుగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలోని బాబుల్రెడ్డి నగర్ లో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరుగురు యువతులతో పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకోగా, మంగళవారం వరకు ఈ విషయం వెలుగులోకి రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పోలీసులు అర్థరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టు తెలుస్తోంది. అలాగే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యుడిని పోలీసు స్టేషన్ కు పిలిపించారని కూడా అనుమానాలు తావిస్తోంది. బడాబాబులను తప్పించేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. -
రాజధానిలో చిరుత సంచారం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ చుట్టుపక్కల గ్రామస్థులను ఇప్పుడో చిరుత వణికిస్తోంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందన్న వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా.. రాములు గౌడ్ అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒక లేగదూడ చనిపోయి పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. చిరుతపులి దాడిలోనే అది మరణించిందని వారు చెబుతున్నారు. బండ్లగూడ, కిస్మత్పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు జూ అధికారులు గానీ, అటవీ శాఖాధికారులు గానీ ఎవరూ రాలేదు. ఇక లేగదూడ చిరుత దాడిలోనే మరణించిందా లేక మరేదైనాకారణం ఉందా అనే విషయాన్ని కూడా ఇంతవరకు నిర్ధారించలేదు. ఆ విషయం తేలితే గానీ చిరుత సంచారం కూడా నిర్ధారణ కాదు. ఈ విషయాన్ని తర్వగా తేల్చి, తమను చిరుత బారి నుంచి కాపాడాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
రాజేంద్రనగర్లో చిరుత సంచారం
-
అత్యాచారం చేసి ఆపై హత్య..!
-
కారులో వెళ్తున్న దంపతులు... వెంబడించిన పోకిరీలు
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లో కీచక పర్వం కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై గత అర్థరాత్రి దంపతులు కారులో వెళ్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన ముగ్గురు అకతాయి యువకులు బైకులపై కారును వెంబడించారు. కారును ఛేజ్ చేసి... రోడ్డుకు అడ్డంగా బైకులు ఉంచి... కారులోని యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో కారులోని జంట 100 నెంబర్ డైల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. నిందితులు ముఖేష్, ప్రవిణ్, నవదీప్లు అని పోలీసులు తెలిపారు. వీరంతా ఓటర్ రింగ్ రోడ్డు స్టాఫ్గా భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితలను తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట దగా
అత్తాపూర్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని మోసం చేస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని రాజేంద్రనగర్, ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏసీపీ ముత్యంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వేలో పని చేస్తూ డిస్మిస్ అయిన అత్తాపూర్ హుడా కాలనీ నివాసి ఎ.ప్రశాంత్(39), ప్రైవేట్ ఉద్యోగి కందుల గోపాల్(29), ఖమ్మం జిల్లాకు చెందిన తేజ(30) స్నేహితులు. గత కొంతకాలంగా వీరు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్నారు. డబ్బు తిరిగి చెల్లించమని అడిగిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని ప్లాట్లు, భూమి డాక్యుమెంట్లను తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్రాజు కందుల గోపాల్ ద్వారా ప్రశాంత్కు ఉద్యోగం కోసం రూ.12.65 లక్షలు చెల్లించాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని కోరిన వెంకట్రాజును నాటు తుపాకీతో చంపుతానని ప్రశాంత్ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితుడు కొద్దిరోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల సహాయంతో సోమవారం ఉదయం హుడాకాలనీలోని ప్రశాంత్ ఇంటిపై దాడి చేశారు. అతనితో పాటు మరో నిందితుడు గోపాల్ను కూడా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద మొత్తం రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి కంట్రిమేడ్ పిస్టల్, రివాల్వర్లతో పాటు మూడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, సఫారీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో శ్రావణ్ అనే ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. ముఠాలోని మరో నిందితుడు తేజ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్, ఎస్ఓటీ ఏసీపీ అశోక్కుమార్, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఎస్సైలు సైదేశ్వర్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిరుద్యోగుల నుంచి దండుకున్న డబ్బుతో తన చెల్లెళ్ల పెళ్లి చేశానని ప్రధాన నిందితుడు ప్రశాంత్ పోలీసులకు తెలిపాడు. పెళ్లిళ్లు చేసే స్తోమత లేకపోవడంతోనే మోసాలకు పాల్పడ్డానన్నాడు. -
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
నగరంలోని రాజేంద్రనగర్ ఉప్పరపల్లికి చెందిన మైనర్ బాలికను కొంతమంది దుండగలు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. ఆమెను నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో రెండు రోజుల పాటు బందించి బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను గత రాత్రి ఉప్పరపల్లిలో వదిలి నిందితులు పరారైయ్యారు. దాంతో ఆమె ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రబ్బర్ గోడౌన్లో అగ్నిప్రమాదం
హైదారాబాద్ రాజేంధ్రనగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అశోక్ రబ్బర్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పారు . ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్ని మాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. గోడౌన్ రెండు నెలలు కిందట మూత పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వేసవి సమీపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం
-
ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యేనా?
మణికొండ, న్యూస్లైన్: రాజేంద్రనగర్ మండల పరిషత్ను తిరిగి దక్కించుకుని కాంగ్రెస్ పట్టునిలుపుకుంటుందా...? కాస్త దూరంలో ఉన్న అవకాశాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తన రాజకీయ చతురత ప్రదర్శించి దక్కించుకుంటారా అనే విషయం మండల వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మండల పరిధిలో 22మంది ఎంపీటీసీలు ఉండగా అందులో 12మంది మద్దతు ఉన్నవారు ఎంపీపీగా ఎన్నికవుతారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్కు 10, టీడీపీకి బీజేపీతో కలసి 8మంది సభ్యుల బలం ఉంది. పుప్పాలగూడలో గెలిచిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు కాంగ్రెస్కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో కాంగ్రెస్ ఎంపీపీ స్థానం కాంగ్రెస్ వశమయ్యే సూచనలే అధికం. కానీ ఇక్కడే ఓ చిన్న తిరకాసు.. కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలుపొందిన నార్సింగ్కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విషయంలో సందేహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నాయకుడి భార్యపైనే రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ నేత జ్ఞానేశ్వర్ పోటీలోకి దించారని వారు ఆరోపిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎంపీపీ ఎంపికలో కాంగ్రెస్కు తామెందుకు మద్దతు ఇవ్వాలనే వారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. స్వతంత్రులు ఇద్దరు మద్దతు ఇచ్చినా.. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆ ఇద్దరు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ బలం తిరిగి 10లోనే ఉండిపోతుంది. ఇక టీడీపీవారు ఇదే అదనుగా వారిద్దరిని తమవైపు తిప్పుకుంటే కనుక వారి బలం అపుడు 10కే చేరే అవకాశం ఉంటుంది. దీంతో అపుడు తిరిగి మండలంలో మిగిలిన హిమాయత్సాగర్, కిస్మత్పూర్లలో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. వారిద్దరినీ తమవైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే అడిగినంతా ఇచ్చుకునైనా వారి మద్దతు కూడగట్టుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయత్నాలను ముమ్మురం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో రాని క్లారిటీ మండల వ్యాప్తంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బలాబలాలు అలా ఉండగా మరోవైపు టీడీపీలో ఎంపీపీ స్థానం ఏ వ్యక్తి కట్టబెట్టాలనే విషయంలో తర్జన భర్జన కొనసాగుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు ఖానాపూర్కు చెందిన మల్లేశ్ముదిరాజ్కు ఎంపీపీ స్థానమంటూ ప్రచారం చేయడంతో పాటు అతడి చేత ఎన్నికలలో ఖర్చుపెట్టించి తీరా ఇపుడు బండ్లగూడకు చెందిన ప్రేమ్కుమార్గౌడ్ను తెరపైకి తెచ్చినట్టు ఆపార్టీ నాయకులే వాపోతున్నారు. ఇంకోవైపు ఎంపీపీ స్థానం జనరల్కు ఉందని, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా కృషి చేశానని, పార్టీలో సీనియర్నని, తనకు గ్రీన్సిగ్నల్ ఇస్తే ఎలాగైనా ఎంపీపీ స్థానాన్ని సాధిస్తానని మణికొండకు చెందిన కె.రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులను కోరినట్టు సమాచారం. అవసరమైతే రెండున్నరేళ్లు తాను, మరో రెండున్నరేళ్లు పార్టీ లో మరెవరైనా ఎంపీపీగా కొనసాగవచ్చని, ఇది తనకు సమ్మతమేనని పేర్కొన్నట్టు తెలిసింది. -
భళా.. హస్తకళ
-
చెత్తరహిత సమాజానికి సమష్టి కృషి
-
'పోలీసులే నన్ను దొంగగా మార్చారు'
రాజేంద్రనగర్: ఘరానా మహిళా దొంగ చెంచులక్ష్మి పోలీసులకు చిక్కింది. పలు దొంగతనాలతో సంబంధమున్న ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 11 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జంట నగరాల్లో ఆమెపై 50పైగా కేసులున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో తాళాలు వేసి వున్న ఇళ్లలో ఆమె చోరీలకు పాల్పడిన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులే తనను దొంగగా మార్చారని చెంచులక్ష్మి ఆరోపించింది.