సిగరెట్‌ ఇస్తుండగానే లాక్కెళ్లారు | Chain Snatchers Strike Again In Hyderabad Rajendranagar | Sakshi
Sakshi News home page

మగాళ్లను వదలని స్నాచర్లు

Feb 16 2019 2:08 PM | Updated on Feb 16 2019 2:29 PM

Chain Snatchers Strike Again In Hyderabad Rajendranagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో చైన్‌ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు మహిళల్ని టార్గెట్‌ చేసిన స్నాచర్లు తాజాగా మగవారిని కూడా వదలడం లేదు. సిగరెట్‌ ఇవ్వమని అడిగి.. అదే అదునుగా షాపు యజమాని మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్‌ కాలనీలో రాఘవ రెడ్డి అనే వ్యక్తి కిరాణ షాపు నడుపుతున్నాడు.

ఈ క్రమంలో స్నాచర్లు శనివారం రాఘవరెడ్డి షాప్‌ దగ్గరికి వచ్చి సిగరెట్‌ కావాలని అడిగారు. సిగరెట్‌ చేతికి ఇస్తుండగా అదును చూసి రాఘవ రెడ్డి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దాంతో బాధితుడు రాజేంద్ర నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement