ఊరు వెళుతున్నారా .. చెప్పేసి వెళ్లండి | Police Advice to attapur People | Sakshi
Sakshi News home page

ఊరు వెళుతున్నారా .. చెప్పేసి వెళ్లండి

Mar 17 2016 6:12 PM | Updated on Aug 21 2018 5:46 PM

మీరు వేసవి సెలవులకు ఊరెళుతున్నారా.. అయితే మాకు చెప్పి వెళ్లండి అంటున్నారు.. రాజేంద్ర నగర్ పోలీసులు.

మీరు వేసవి సెలవులకు ఊరెళుతున్నారా.. ఇళ్ళకు తాళాలు వేసి ఎక్కడికన్న ప్రయాణం అవుతున్నారా అయితే దొంగలుంటారు జాగ్రత్త. కనీస జాగ్రత్త చర్యలు తీసుకొని ఊరెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. సెలవుల్లో యాత్రలు, సొంత గ్రామాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని రాజేంద్రనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లే ఇళ్లనే దొంగలు లక్ష్యం చేసుకొనే ప్రమాదం ఉంది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు తెగబడి అంతా దోచుకెళతారు.

ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ వి. ఉమేందర్ సూచిస్తున్నారు. పోలీసు సూచనలు, సలహాలు పాటిస్తే దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయ విజ్ఞప్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement