తండ్రిని హతమార్చిన కుమారుడు | Son kills Father | Sakshi
Sakshi News home page

తండ్రిని హతమార్చిన కుమారుడు

Aug 21 2015 5:11 PM | Updated on Sep 2 2018 4:37 PM

కుటుంబ కలహాలతో కన్నతండ్రిని హతమార్చాడో ప్రబుద్ధుడు. దీనికి తల్లి సహకరించింది.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : కుటుంబ కలహాలతో కన్నతండ్రిని హతమార్చాడో ప్రబుద్ధుడు. దీనికి తల్లి సహకరించింది. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్‌లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...  కోకాపేట్‌ కాలనీకి చెందిన సల్లంగుల చంద్రయ్య(47) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతుండేవి.

కాగా శుక్రవారం తెల్లవారుజామున మరోసారి ఇంట్లో గొడవ జరగడంతో.. కోపంతో ఊగిపోయిన చంద్రయ్య కుమారుడు వెంకటేష్(19) పక్కనే ఉన్న గొడ్డలితో తండ్రి తలపై వేటు వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న తల్లి అంజమ్మ(45) కూడా కుమారుడికి సహకరించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement