
సాక్షి, హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతురిపై రెండు సంవత్సరాలు అత్యాచారాని పాల్పడుతున్నారు.
చదవండి : కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి జైలు
ఈ విషయాన్ని పిన తల్లికి చెప్పిన పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమిలేక తన కాలేజీ స్నేహితుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయిని చైల్డ్ లేబర్ ప్రొటక్షన్ హాల్లో ఉంచామని పోలీసులు తెలిపారు.