రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం డివిజన్లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 16 మంది శుక్రవారం అస్వస్థత పాలయ్యారు.
రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురం డివిజన్లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 16 మంది శుక్రవారం అస్వస్థత పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఓ విద్యార్థిని తెచ్చిన చక్కెరను 16 మంది తినగా... వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారిని రాజేంద్రనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. మధ్యాహ్న భోజనానికి సుమారు 80 మంది విద్యార్థులు హాజరుకాగా, చక్కెర తిన్న 16 మంది మాత్రమే అస్వస్థతకు గురవడం గమనార్హం.