అత్తాపూర్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని మోసం చేస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని రాజేంద్రనగర్, ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏసీపీ ముత్యంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... రైల్వేలో పని చేస్తూ డిస్మిస్ అయిన అత్తాపూర్ హుడా కాలనీ నివాసి ఎ.ప్రశాంత్(39), ప్రైవేట్ ఉద్యోగి కందుల గోపాల్(29), ఖమ్మం జిల్లాకు చెందిన తేజ(30) స్నేహితులు. గత కొంతకాలంగా వీరు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్నారు.
డబ్బు తిరిగి చెల్లించమని అడిగిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని ప్లాట్లు, భూమి డాక్యుమెంట్లను తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్రాజు కందుల గోపాల్ ద్వారా ప్రశాంత్కు ఉద్యోగం కోసం రూ.12.65 లక్షలు చెల్లించాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని కోరిన వెంకట్రాజును నాటు తుపాకీతో చంపుతానని ప్రశాంత్ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితుడు కొద్దిరోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల సహాయంతో సోమవారం ఉదయం హుడాకాలనీలోని ప్రశాంత్ ఇంటిపై దాడి చేశారు. అతనితో పాటు మరో నిందితుడు గోపాల్ను కూడా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద మొత్తం రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్టు చేసి, మంగళవారం రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి కంట్రిమేడ్ పిస్టల్, రివాల్వర్లతో పాటు మూడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తి, సఫారీ వాహనం స్వాధీనం చేసుకున్నారు.
బాధితుల్లో శ్రావణ్ అనే ఎన్ఆర్ఐ కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. ముఠాలోని మరో నిందితుడు తేజ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్, ఎస్ఓటీ ఏసీపీ అశోక్కుమార్, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఎస్సైలు సైదేశ్వర్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, నిరుద్యోగుల నుంచి దండుకున్న డబ్బుతో తన చెల్లెళ్ల పెళ్లి చేశానని ప్రధాన నిందితుడు ప్రశాంత్ పోలీసులకు తెలిపాడు. పెళ్లిళ్లు చేసే స్తోమత లేకపోవడంతోనే మోసాలకు పాల్పడ్డానన్నాడు.
రైల్వే ఉద్యోగాల పేరిట దగా
Published Wed, Jul 23 2014 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement