jaipur
-
సమీర్ రిజ్వీ మెరుపులు.. పంజాబ్పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్తో శనివారం నాటి మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్తో కలిసి నాటౌట్గా నిలిచాడు.ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
‘మైసూర్’లో ‘పాక్’ మాయం!
జైపూర్: ‘మైసూర్పాక్లో మైసూర్ ఏదిరా?’ అంటూ ఒక సినిమాలో హోటల్ యజమానిని కమెడియన్ పాత్రధారి నిలదీసే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. జైపూర్లో మాత్రం పలు మిఠాయి దుకాణాలు మాత్రం దాయాది పేరు ధ్వనిస్తోందనే కారణంతో మైసూర్పాక్ పేరును మైసూర్శ్రీగా మార్చేశాయి! అంతేగాక ప్రతి మిఠాయి పేరులోనూ పాక్కు బదులు శ్రీ అని చేరుస్తున్నాయి. అలా మోతీపాక్ మోతీశ్రీ, ఆమ్పాక్ ఆమ్శ్రీ గోండ్ పాక్ గోండ్శ్రీ అయిపోయాయి. స్వర్ణభస్మపాక్, చాందీభస్మ్ పాక్ వంటి ప్రీమియం మిఠాయిలు కూడా స్వర్ణభస్మశ్రీ, చాందీభస్మ్ శ్రీగా పేరు మార్చుకున్నాయి. దేశాభిమానంతోనే ఈ పని చేసినట్టు జైపూర్లోని ప్రఖ్యాత ‘త్యోహార్ స్వీట్స్’, ‘బాంబే మృష్టాన్ భండార’ వంటి స్వీట్షాపుల యజమానులు చెబుతున్నారు. దీన్ని కస్టమర్లు కూడా ఎంతగానో మెచ్చుకుంటుండటం విశేషం! ‘‘స్వీట్ల పేర్ల మార్పు చిన్న విషయంగా అన్పించొచ్చు. కానీ పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యం నుంచి చూస్తే ఇది చాలా శక్తిమంతమైన సాంస్కృతిక సంస్పందన. యుద్ధక్షేత్రం నుంచి మిఠాయి దుకాణాల దాకా మన వీర జవాన్లకు ప్రతి భారతవాసీ తోడుగా ఉన్నాడని చాటిచెప్పే ప్రయత్నమిది’’ అని వారంటున్నారు. ‘‘మైసూర్పాక్ పేరును మైసూర్శ్రీగా మార్చారని వినగానే నా పెదాలపై గర్వంతో కూడిన చిరునవ్వు ఉదయించింది. మన జవాన్ల వీరత్వానికి మిఠాయిలు కూడా ఇలా సెల్యూట్ చేస్తున్నాయని అనిపించింది’’ అని పుష్పా కౌశిక్ అనే రిటైర్డ్ టీచర్ చెప్పుకొచ్చారు. -
బంధాలు వద్దు..డబ్బు ముద్దు
-
వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్కు బాంబు బెదిరింపు
'అపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సజావుగా కొనసాగడం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం లీగ్ కొనసాగుతుందని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెబుతున్నా.. అభిమానుల్లో ఏదో తెలీని గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు జరగాలంటే జట్లు వేర్వేరు వేదికలు తిరుగుతూ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే పాక్ దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో భారత ప్రభుత్వం దేశంలో పలు విమానాశ్రయాలను మూసి వేయించింది. ఇందులో ఐపీఎల్ మ్యాచ్లకు వేదికలైన చండీఘడ్, ధర్మశాల ఉన్నాయి. ఈ క్రమంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అహ్మదాబాద్కు షిఫ్ట్ అయ్యింది.తాజాగా ఓ వార్త ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మే 16న జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ ఈ-మెయిల్ ఇవాళ (మే 8) ఉదయం 9:13 గంటల సమయంలో వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియంను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్లు, తనిఖీ యూనిట్లతో స్టేడియంను జల్లెడ పట్టారు. స్టేడియంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నిన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. స్టేడియంను పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు వెంటనే అలర్టై మ్యాచ్ను సజావుగా సాగేలా చూశారు. నిన్న ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్లో కేకేఆర్, సీఎస్కే తలపడ్డాయి. వరుసగా రెండు రోజులు ఐపీఎల్ వేదికలకు బాంబు బెదిరింపులు రావడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్గా తీసుకుంది. మ్యాచ్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంది.మరోవైపు భారత దళాలు పాక్లోని రావల్పిండి స్టేడియంపై చేసిన డ్రోన్ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్లో భాగంగా ఇవాళ బాబర్ ఆజం కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు క్రికెటర్లను రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.కాగా, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్లో భారత దళాలు పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూ ఉంది. -
Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి
జైపూర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్లో విషాదం చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం తాగిన ఓ యువతి ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. తన కారుతో బాలిక వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి జైపూర్లోని సంగనీర్ గేట్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ఆసిమా తన తండ్రితో పాటు కజిన్తో కలిసి బైక్పై ఇంటికి వెళ్తున్నారు.సరిగ్గా సంగనీర్ గేటు సమీపంలో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ఆసిమా బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆసిమా మృతి చెందింది. ఆమె తండ్రి, బంధువు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైక్ను ఢీకొట్టిన అనంతరం యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. రాంగ్ రూట్లో వెళుతూ మరో బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారమైన యువతిని, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో కారు డ్రైవ్ చేసిన యువతి అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు.जयपुर में एक बार फिर हिट एंड रन का दर्दनाक मामला सामने आया है, सांगानेरी गेट के पास शराब के नशे में दो लड़के और दो लड़कियां कार से तेज रफ्तार में जा रहे थे !!इसी दौरान उनकी कार ने एक बाइक को जोरदार टक्कर मार दी, हादसे में बाइक पर सवार 14 साल की बच्ची असीमा की मौके पर ही मौत हो… pic.twitter.com/JyHUT9PMt7— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) April 29, 2025 పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నిస్తుండగా సదరు యువతి పోలీసుల్ని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కారు నడిపిన యువతి నాగ్పూర్కు చెందిన సంస్కృతిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ పరీక్ష నిర్వహించి అరెస్టు చేశారు. కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ ప్రారంభించారు. -
అంబర్ కోట అదరహో.. వాన్స్ ఫ్యామిలీకి పుష్ప, చందా స్వాగతం
న్యూఢిల్లీ, సాక్షి: భారత్లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కుటుంబ సమేతంగా మంగళవారం జైపూర్లోని అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబ సభ్యులకు యూనెస్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వద్ద రాజస్థానీ సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. హతీ గావ్లో ప్రత్యేక శిక్షణ పొందిన చందా, పుష్ప అనే ఏనుగులు వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికగా.. పలువురు నృత్యాలతో అలరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబుల్ సమేతంగా నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింక్ సిటీ జైపూర్ పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం.. అంబర్ కోటతో పాటు హవా మహల్, జంతర్ మంతర్ను సైతం సందర్శించనుంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎర్ర ఇసుక రాయి, పాలరాతితో ఉన్న అంబర్ పోర్ట్ను ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తుంటారు. రాజా మాన్ సింగ్ 16వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. #WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children welcomed at Jaipur's Amber Fort. pic.twitter.com/bhFxFOLrHW— ANI (@ANI) April 22, 2025ఇక.. ఈ పర్యటనలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిబావు కిషన్రావ్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఇచ్చే ఆతిథ్యం వాన్స్ కుటుంబం స్వీకరించనుంది. రాజస్థాన్ ఇంటర్నేషన్ సెంటర్లో(RIC)లో దౌత్యవేత్తలు, మేధావులను ఉద్దేశించి అమెరికా-భారత్ సంబంధాలపై జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జైపూర్ అలర్ట్ అయ్యింది. ప్రముఖులు బస చేసే రామ్బాగ్ ప్యాలెస్లో వాన్స్ కుటుంబం దిగగా.. అక్కడ కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం భారత్కు చేరుకున్న వాన్స్ కుటుంబం.. న్యూఢిల్లీలో బస చేసింది. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాలపై జేడీ వాన్స్ చర్చించారు. అనంతరం వాన్స్ కుటుంబానికి ప్రధాని మోదీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. బుధవారం వాన్స్ కుటుంబం ఆగ్రాను సందర్శించనుంది. గురువారం ఉదయం తమ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరనున్నారు. -
హెడ్ కోచ్కు గాయం.. రాజస్తాన్ రాయల్స్ పోస్ట్ వైరల్
తమ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గాయంపై రాజస్తాన్ రాయల్స్ అప్డేట్ అందించింది. ‘ది వాల్’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్ క్లబ్ క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.తన చిన్న కుమారుడు అన్వయ్తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో ద్రవిడ్ పాల్గొన్నాడు. యంగ్ లయన్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ఆడిన ద్రవిడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే రాహుల్ ద్రవిడ్ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్ రాయల్స్ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.కాలికి కట్టు అలాగే ఉండటంతోఅయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు. ఈరోజే జైపూర్లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్ జెర్సీలో థమ్సస్ సింబల్ చూపిస్తున్న ద్రవిడ్ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.ఇక ఈ ఫొటో వైరల్గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్ కోచ్కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ జట్టుసంజూ శాంసన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్, షిమ్రన్ హెట్మెయిర్, నితీశ్ రాణా, యుధ్వీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ, సందీప్ శర్మ.రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ సిబ్బందిహెడ్కోచ్- రాహుల్ ద్రవిడ్డైరెక్టర్ ఆఫ్ క్రికెట్- కుమార్ సంగక్కరఫాస్ట్ బౌలింగ్ కోచ్- షేన్ బాండ్బ్యాటింగ్ కోచ్- విక్రమ్ రాథోడ్ఫీల్డింగ్ కోచ్- దిశాంత్ యాగ్నిక్.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా..Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025 -
గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్!
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం. ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2— Press Trust of India (@PTI_News) March 3, 2025అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఐఐటీ బాబాగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట. -
జనసేన కిరణ్ రాయల్కు షాక్
సాక్షి, తిరుపతి: జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ మంజూరైంది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.సోమవారం మీడియా సమావేశం పెట్టిన లక్ష్మి.. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే, ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన రాజస్థాన్ పోలీసులు.. చెక్బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి రెండు రోజుల క్రితం తిరుపతి ప్రెస్క్లబ్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.ఇదీ చదవండి: తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడులక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు. అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు. -
కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత?
శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సర్వసాధారణం. అలాగే ఈ సీజన్లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తతెత్తుతుంటాయి. దీనికి భిన్నమైన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. దీనిగురించి తెలుసుకున్నవారంతా అవాక్కవుతున్నారు.రాజస్థాన్లోని జైపూర్ రైల్వే జంక్షన్(Jaipur Railway Junction)లో విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్ప్రెస్ (12468)లో వెళ్లేందుకు వచ్చిన 64 మంది ప్రయాణికులు ఆ సమయంలో గందరగోళానికి గురయ్యారు. వారంతా ఏసీ కోచ్లో సీటుకోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే రైలులో తమ కోచ్ కనిపించకపోవడంతా వారంతా అవాక్కయ్యారు. వారు ఎదురు చూసిన రైలులో బీఈ-1 (థర్డ్ ఏసీ) కోచ్ను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇంతలో ఒక ప్రయాణికుడి దృష్టి నాన్ ఏసీ కోచ్పై పడింది. దానిపై బీఈ-1/ఎస్ఎల్ అని రాసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ కాదు. దీంతో ఆ 36 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనను చూసిన రైల్వే అధికారులు(Railway officials) ఆ కోచ్ దగ్గరకు చేరుకున్నారు. వారు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ రైలులో థర్డ్ ఏసీ కోచ్ సౌకర్యం ఉండదని, స్లీపర్ కోచ్లోనే ప్రయాణించాలని వారు తెలియజేశారు. అలాంటప్పుడు థర్డ్ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేశారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.వాస్తవానికి నెల్లాళ్ల క్రితమే ఈ రైలునుంచి ఏసీ కోచ్ను తొలగించారు. అయితే దీనిని టిక్కెట్లు జారే చేసే కంప్యూటర్ సిస్టమ్ నుంచి తొలగించలేదు. దీంతో టిక్కెట్లు జారీ అయ్యాయి. గత డిసెంబర్లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ ఏసీ క్లాస్తో కూడిన తాత్కాలిక కోచ్ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు. సిస్టమ్ను అప్డేట్ చేయకపోవడంతో, ఈ కోచ్లో 64 మంది ప్రయాణికుల బుకింగ్ జరిగింది. తరువాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఏసీబోగీలో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’ -
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్సిటీ జైపూర్లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్లోని జైపుర్లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్జీ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा, कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024ఘటనా స్థలంలో 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.#WATCH | Jaipur, Rajasthan | Jaipur DM, Jitendra Soni says, "4 people have died (in the incident). Around 40 vehicles caught the fire. Fire brigade and ambulances have reached the spot. The relief work is underway. The fire has been doused off and only 1-2 vehicles are left.… https://t.co/5l1uNq2lUd pic.twitter.com/p3XDxSJQto— ANI (@ANI) December 20, 2024 ప్రమాద స్థలికి సీఎం..ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ— Press Trust of India (@PTI_News) December 20, 2024 -
జనాన్ని కాలుష్యంలో ముంచెత్తుతారా?
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఎస్సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన. కొత్తగా టీజెన్కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్ఓఎఫ్ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.ఎన్టీపీసీ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్ఎస్టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.- ఉమామహేశ్వర్ దహగామపర్యావరణ నిపుణులు -
వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్..!
వింటర్ సీజన్ జైపూర్ లో ఉండటానికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం పొగమంచుతో, పగలంతా ఎండ, సాయంత్రం నగరం అందించే కళలను ఆస్వాదించడానికి తగినంత చల్లగా ఉంటుంది. అందుకు తగినవిధంగానే జైపూర్ ఈ వింటర్లో కళ, సంస్కృతి, వారసత్వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ’కుంభ్ ఆఫ్ లిటరేచర్’గా పరిగణించబడే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో రచయితల సెషన్ కళాత్మకంగా జరుగుతుంది. ఇక జైపూర్ ఆర్ట్ వీక్లో ఎగ్జిబిట్లు, ఇన్స్టాలేషన్ల ద్వారా వర్ధమాన కళాకారుల తెలుసుకోవచ్చు. లిటరేచర్ ఫెస్టివల్ 2025టీమ్వర్క్ ఆర్ట్స్ రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, వినోదకులు, సాంస్కృతిక చిహ్నాల ఆసక్తిని పరిచయం చేస్తుంది. జైపూర్లోని క్లార్క్స్ అమెర్లోని ఐదు రోజుల ఉత్సవంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా వివిధ కళారూ΄ాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రాంగణంలో జైపూర్ కళాకారులు చిత్రించిన కుండలు, అప్లిక్ ఎంబ్రాయిడరీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటి తయారీ కళ, వాస్తుశిల్పం, జైఘర్, రాజస్థాన్ కోటల చరిత్ర, జైపూర్ నగర దృశ్యాలు, వారసత్వం, భారతదేశ అసంఖ్యాక చరిత్రలు, ప్రశంసలు పొందిన వక్తలు, రచయితలు, చరిత్రకారులతో కూడిన సెషన్లో కళలను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. జానపద కళా రూపాలుఆవాజ్ స్టూడియోచే నిర్వహించే ఆర్ట్స్, డిజైన్ ఈవెంట్ ఏఐఊఖీ. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఎదుగుతున్న అట్టడుగు నేపథ్యాలను అన్వేషించే పాటలకు ప్రసిద్ధి చెందిన ఇండీ కళాకారుడు రాహ్గీర్ను ప్రదర్శించే మూడు రోజుల పండుగ. డిసెంబర్ 20న ్ర΄ారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో రాష్ట్రంలోని జానపద కథల పరిణామం ఇక్కడ చూడచ్చు. హ్యాండ్–బ్లాక్ ప్రింటింగ్, కుండల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్షాప్ల, మూడు రోజులలో రాజస్థాన్ హస్తకళల సొగసును చూడచ్చు. మాస్టర్ కల్బెలియా కళాకారులచే 500 మందికి పైగా జానపద నృత్యంలో పాల్గొంటున్నారు. కళల ప్రదర్శనపబ్లిక్ ఆర్ట్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PAT)చే నిర్వహించే, ఒఅగి 4.0 వారం రోజులపాటు ఆర్ట్ వీర్ జరుగుతుంది. ఆ కార్యమ్రంలో ప్రదర్శనలు, వర్క్షాప్ల నిర్వహణ కోసం నగరంలోని వర్ధమాన కళాకారులు తమ చేయూతను అందిస్తున్నారు. దేవుళ్లు, రాక్షసులు, ఆలయ పెయింటింగ్లు, జానపద కథలను వీటిలో రూపొందించారు. ఆర్కిటెక్చరల్ ఆర్టిస్టుల బృందం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ ఇన్స్టాలేషన్ను ఆవిష్కరిస్తుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఆర్ట్ వీక్ జరుగుతుంది. వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్ -
ఇది టెక్, డేటా శతాబ్ది సంస్కరణలు..
జైపూర్: సంస్కరణలు, పనితీరు, పారదర్శ కతలను పాటిస్తూ భారత్ సాధించిన అభివృద్ధి ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం జైపూర్లోని ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో మొదలైన ‘రైజింగ్ రాజస్తాన్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు, నిపుణుడు భారత్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. గత పదేళ్లలో భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. సంక్షోభాల సమయంలోనూ నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి భారీ ఉత్పత్తి క్షేత్రంగా భారత్ ఎదగాలి. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లడం కలిసొచ్చే అంశం. ప్రజాస్వామ్యయుతంగా మానవాళి సంక్షేమం కోసం పాటుపడటం భారత విధానం. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే ఎన్నకుంటున్నారు. ఈ సంస్కృతిని యువశక్తి మరింత ముందుకు తీసుకెళ్తోంది. యువభా రతంగా మనం ఇంకా చాన్నాళ్లు మనం కొనసా గబోతున్నాం. భారత్లో అత్యంత ఎక్కువ మంది యువత, అందులోనూ నైపుణ్యవంతులైన యువత అందుబాటులో ఉన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామీకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కుతాయని భారత్ నిరూపించింది. ఈ శతాబ్దిని టెక్నాలజీ, డేటాలే ముందుకు నడిపిస్తాయి’’ అన్నారు. -
జైపూర్కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
చితిపై బతికొచ్చాడు
జైపూర్: మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్లోని జుంఝున్లో చోటుచేసుకుంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్ కమార్ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్ రప్పించారు. జుంఝునూలోని బీడీకే హాస్పిటల్కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సందీప్ పచార్తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
జైపూర్పై పట్నా పైరేట్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లో పట్నా పైరేట్స్ జట్టు నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన లీగ్ పోరులో ఆఖరి నిమిషాల్లో అద్భుతంగా ఆడి జైపూర్ పింక్ పాంథర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 43–41 తేడాతో పింక్ పాంథర్స్ ను ఓడించింది. పట్నా తరఫున అయాన్ 14 పాయింట్లతో సత్తా చాటగా... మరో రెయిడర్ దేవాంక్ కూడా 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. జైపూర్ జట్టులో కెప్టెన్, స్టార్ రెయిడర్ అర్జున్ దేశాల్ 20 పాయింట్లతో విజృంభించినా జట్టును గెలిపించలేకపోయాడు. హోరాహోరీ పోరుపోటాపోటీగా సాగిన తొలి అర్ధభాగంలో తొలుత జైపూర్ పైచేయి సాధించినా.. చివరకు పట్నా ఆధిక్యంలోకి వచ్చింది. రెయిడ్ మిషన్ అర్జున్ దేశ్వాల్ ఆరంభం నుంచి వరుస పాయింట్లతో హోరెత్తించాడు. బోనస్తో తమ జట్టు ఖాతా తెరిచిన అతను వరుస టచ్ పాయింట్లతో చెలరేగాడు. అటువైపు పట్నా ఆటగాళ్లు దేవాంక్, అయాన్ కూడా విజయవంతమైన రెయిడ్స్తో ఆకట్టుకున్నారు. దాంతో తొలి ఐదు నిమిషాలు ఆట హోరీహోరీగా సాగింది.కానీ, డిఫెండర్లు ఆశించిన మేర రాణించలేకపోవడంతో పట్నా వెనుకబడింది. దీన్ని జైపూర్ సద్వినియోగం చేసుకుంది. కోర్టులో మిగిలిన అయాన్ను ఔట్ చేసి పదో నిమిషంలోనే పట్నాను ఆలౌట్ చేసి 14–10తో ముందంజ వేసింది. ఆపై అర్జున్ సూపర్ రైడ్తో పాటు సూపర్10 పూర్తి చేసుకున్నాడు. దాంతో జైపూర్ ఆధిక్యం 19–13కి పెరిగింది. ఈ దశలో పట్నా అనూహ్యంగా పుంజుకుంది. దేవాంక్, అయాన్ రెయిండింగ్లో జోరు కొనసాగించడగా... డిఫెన్స్లోనూ మెరుగైంది. అర్జున్ను ట్యాకిల్ చేసి కోర్టు బయటకి పంపించింది.దాంతో 19–19తో స్కోరు సమం చేసింది. ఆవెంటనే కోర్టులో మిగిలిన అభిజీత్ను ట్యాకిల్ చేసి జైపూర్ను ఆలౌట్ చేసిన పట్నా 22–20తో ఆధిక్యంలోకి వచ్చింది. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేసిన ఆ జట్టు 25–21తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.ఆఖర్లో పట్నా మ్యాజిక్ రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జైపూర్ మళ్లీ జోరు పెంచింది. ముఖ్యంగా అర్జున్ దేశ్వాల్ చెలరేగిపోయాడు. ఒకే రెయిడ్లో ఏకంగా ఐదుగురు పట్నా ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన మరో రైడ్లో కోర్టులో మిగిలిన అక్రమ్ షేక్ను కూడా టచ్ చేసి వచ్చాడు. దాంతో 24వ నిమిషంలో పట్నాను రెండోసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 27–25తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది.అయినా పట్నా వెనక్కు తగ్గలేదు. అయాన్ రెయిడింగ్లో హవా చూపెట్టగా.. డిఫెండర్లు కూడా పట్టుదలగా ఆడారు. అర్జున్ను మరోసారి ట్యాకిల్ చేశాడు. నీరజ్ను సూపర్ ట్యాకిల్ చేసి మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 40–40తో స్కోరు సమం చేసింది. ఈ దశలో రెయిడ్ కు వెళ్లిన అర్జున్ ప్రత్యర్థికి దొరికిపోయాడు. కానీ, పట్నా డిఫెండర్ లైన్ దాటడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. ఆపై, డూ ఆర్ డై రెయిడ్లో దేవాంక్ బోనస్ సాధించడంతో పట్నా 42–41తో ఒక పాయింట్ అధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ చివరి రెయిడ్ కు వచ్చిన సోంబీర్ ను ట్యాకిల్ చేసిన పట్నా మూడు రెండు తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. -
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్గఢ్లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
కర్వా చౌత్ ట్రాజెడీ : ఆవేశంతో భార్య, ఆమె చీరతో భర్త
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.జైపూర్లోని హర్మారా ప్రాంతంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్హెచ్ఓ ఉదయ్ భన్ తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా... -
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్ -
యానిమల్ బ్యూటీపై ఆరోపణలు.. ఆమె టీమ్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.అసలేం జరిగిందంటే..?జైపుర్కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024 -
భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!
జైపూర్ ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో ఫిర్యాది ఎస్బీఐలో మేనేజర్గా పనిచేస్తున్నారు. తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ, తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.75వేలు, అడ్వకేట్ ఫీజు, లిటిగేషన్ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా తన భార్యనెలకు రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్లు పొందుతోందని కౌంటర్ పిటిషన్ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్ అధికారి గార్గ్ మహిళ పిటిషన్ను కొట్టి వేశారు.భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు, విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. మెయింటెనెన్స్ అంటేభార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. -
UTT 2024: టీటీ లీగ్కు వేళాయె... బరిలో 8 జట్లు
గత నాలుగు సీజన్లుగా భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లకు చక్కని అవకాశాలు కల్పిస్తున్న అల్ట్మేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఫ్రాంచైజీ లీగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యూటీటీ ఐదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్తో పాటు మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్ల మధ్య 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్... 7న జరిగే ఫైనల్స్తో ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రతి రోజూ రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్లను స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్లో సత్తాచాటి మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే పురుషుల కేటగిరీలో హైదరాబాదీ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సీజన్లో రాణించడం ద్వారా అందరి దృష్టిలో పడేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు.భారత స్టార్ మహిళా ప్లేయర్ మనిక బత్రా బెంగళూరు స్మాషర్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైంది. శ్రీజతో పాటు మనిక కూడా పారిస్లో ప్రిక్వార్టర్ ఫైనల్దాకా పోరాడింది. యూటీటీ టోర్నీ సందర్భంగా 29 ఏళ్ల మనిక మాట్లాడుతూ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు ఈ ఫ్రాంచైజీ లీగ్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకొచ్చింది. ‘వ్యక్తిగతంగా నేను రాణించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడింది. విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడటం ద్వారా మెలకువలు నేర్చుకునేందుకు, దీటుగా పోరాడేందుకు యూటీటీ దోహదం చేసింది. ఈ టోర్నీని ప్లేయర్లంతా ఆస్వాదిస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళల సింగిల్స్లో పురోగతికి యూటీటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయంగా మన క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు యూటీటీ చలవే’ అని మనిక తెలిపింది. నిరుటి రన్నరప్ చెన్నై లయన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట శరత్ కమల్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు రాటుదేలేందుకు యూటీటీ చక్కని వేదికని అన్నాడు.దీనివల్లే మన జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే కాదు... ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాయని చెప్పాడు. మహిళల సింగిల్స్లో ప్రిక్వార్టర్స్, టీమ్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప మైలురాయని శరత్ తెలిపాడు.ఈ టోర్నీలో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. పారిస్ మెగా ఈవెంట్లో శరత్కు ఊహించని విధంగా తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడిన 42 ఏళ్ల శరత్ రిటైర్మెంట్ అనంతరం అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లే యోచనలో ఉన్నాడు. దీనిపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యతో పాటు, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. బరిలో ఉన్న జట్లుఅహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్ టీటీ, యూ ముంబా టీటీ. -
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
రాజకీయలపై రాజస్థాన్ మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజకీయాల్లో నాయకులు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సి వస్తుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజే అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ప్రతి నాయకుడు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సిందే. రాజకీయాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. పదవి, మత్తు, స్థాయి. పదవి, మత్తు ఎప్పుడు ఉండకూడదు. పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటే స్థాయి దానికదే పెరుగుతుంది. రాజకీయలు అంత ఈజీ కాదు. రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రజలను సమన్వయం చేయటం కూడా అంత సులభం కాదు. మన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గతంలో కొంతమంది నాయకులు అభివృద్ది చేయటంలో విఫలం అయ్యారు’’ అని అన్నారు.ఇక.. ఇటీవల ఆమెను పార్టీలో పక్కకు పెడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది బీజేపీ అధిష్టానం మరోసారి వసుంధర రాజేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. జైపూర్లోని సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. -
ఈ స్పైడర్ మ్యానుడు చపాతీలు కూడా చేస్తాడు
స్పైడర్ మ్యాన్ అంటే... పది అంతస్తుల బిల్డింగ్ నుంచి అవలీలగా జంప్ చేసేవాడు. అగ్నిగుండంలో హాయిగా మార్నింగ్ వాక్ చేసేవాడు... టోటల్గా చెప్పుకోవాలంటే ‘స్పైడర్ మాన్’ అంటే సాహసాల సాగరం.‘స్పైడర్ మ్యాన్ అంటే అస్తమానం సాహసాలేనా? ఇలా కూడా’ అని ఒక జైపూర్ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 13 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.‘ఇంతకీ అతడు ఏంచేశాడు?’ అనే విషయానికి వస్తే.... స్పైడర్మ్యాన్ డ్రెస్ వేసుకొని చపాతీలు చేశాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. గిన్నెలు శుభ్రం చేశాడు. ఎండలో తల మీద ఇటుకలు మోశాడు. ‘అసలు సిసలు సాహసాలంటే ఇవే’ అన్నారు నెటిజనులు. ‘గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’ అంటూ స్పైడర్–మ్యాన్ సినిమాలలోని ఐకానిక్ డైలాగును ఉటంకించారు. -
ప్రముఖ మార్ట్లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. -
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్లోని జోహ్రీ బజార్లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్లో యూఎస్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, అనస్తీషియా హెడ్గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్షాప్లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్. -
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు. -
సంజూ శాంసన్కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఖర్గే పొరపాటున మాట్లాడినా.. అది నిజమే!’: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని 371వ ఆర్టికల్ను మార్చాలన్న మోదీ-షా గేమ్ ప్లాన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనుకోకుండా బయటపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే ఖర్గే 370 ఆర్టికల్ అనాల్సింది.. పొరపాటున ఆర్టికల్ 371 అన్నారని తెలిపారు.అయినప్పటికీ మోదీ- షా అసలు గేమ్ ప్లాన్ బయటపడిందని జైరాం రమేష్ అన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే విరుచుకుపడ్డారు. కానీ నిజం ఏమిటంటే.. నాగాలాండ్కు సంబంధించిన ఆర్టికల్ 371-ఎ, అస్సాంకు చెందిన ఆర్టికల్ 371-బి, మణిపూర్కు సంబంధించిన ఆర్టికల్ 371-సి, సిక్కింకు చెందిన ఆర్టికల్ 371-ఎఫ్, మిజోరామ్కు సంబంధించిన ఆర్టికల్ 371-జిని మోదీ-షా మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆర్టికల్ 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిందని జైరాం రమేష్ అన్నారు. ఆర్టికల్ 371జే పూర్వపు హైరాబాద్-కర్ణాటక ప్రాంతానికి సంబంధించిందని ఆయన గుర్తు చేశారు. Today by a slip of the tongue in his speech in Jaipur, @INCIndia President Mallikarjun Kharge ji mistakenly said that Modi claims credit for abolishing Article 371. Kharge ji clearly meant Article 370. Amit Shah immediately pounced on the Congress President. But the truth is… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 6, 2024 అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 371పై మోదీ-షా ప్లాన్ను బయటపెట్టడంతో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అమిత్ షా ఆందోళన పడ్డారని అన్నారు. అందుకే అమిత్ షా.. ఖర్గే మాటలను ఆర్టికల్ 370కి ముడిపెడుతున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. It is shameful to hear that the Congress party is asking, "Kashmir se kya waasta hai?" I would like to remind the Congress party that J&K is an integral part of India, and every state and citizen has the right over J&K, just as the people of J&K have the right over the rest of… pic.twitter.com/cFeO80XBxl — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 6, 2024 మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా స్పందించి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ నేతలు చేస్తున్న పొరపాట్లు దశాబ్దాలుగా మన దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటాలియన్ సంస్కృతి కారణంగా ప్రతిపక్ష పార్టీ.. భరత దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేదు’ అని అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే ఏమన్నారంటే... మల్లికార్జున్ ఖర్గే రాజస్థాన్లోని జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించి సభలో మోదీ-షాపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ వాళ్లు రాజస్తాన్ వచ్చి ఆర్టికల్ 371ను రద్దు చేశామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు అసలు దానితో సంబంధం ఏమిటీ?. జమ్ము కశ్మీర్కు వెళ్లి అక్కడి ప్రజలకు దానికి గురించి మాట్లాడితే బాగుంటుంది’ అని ఖర్గే అన్నారు. -
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్లోని జైపూర్లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!
జైపూర్: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్కు నిరాకరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర సింగ్ తన్వర్కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామన్నారు. -
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టయిలే వేరు; రూ. 50వేలనుంచి 35కోట్ల దాకా
పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం! ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది. బునాయ్ ఏర్పాటు, సక్సెస్ సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తూ, బునాయ్ నైట్వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది. 2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి. స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి పరి చౌదరి విద్య పరి జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది. -
‘జైపూర్ డైలాగ్స్’తో సంబంధం లేదు..సునీల్ శర్మ వివరణ
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజస్థాన్లోని జైపూర్ నియోజకవర్గంలో సునీల్ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్న సునీల్ శర్మకు కీలకమైన జైపూర్ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది. తరచూ కాంగ్రెస్పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ దిక్షిత్తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ శర్మ జైపూర్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు. I am in no way related to the Jaipur dialogues YouTube channel or Twitter handle. This is completely fake news and false propaganda being floated to diminish the prospects of the Congress Party. — Sunil Sharma (@I_SunilSharma) March 23, 2024 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్ శర్మ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లేదా ట్విటర్ హాండిల్తో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్ శర్మ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్ ఛానెల్స్ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్ డైలాగ్స్ కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విజన్ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్ శర్మ అన్నారు. జైపూర్ డైలాగ్స్కు సునీల్ శర్మ డైరెక్టర్ అంటూ.. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
Prime Minister Narendra Modi: విష వలయంలో కాంగ్రెస్
జైపూర్/రేవాడీ: కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అంటే... ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు. తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
జైపూర్: రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధృవీకరించారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే ఎయిర్పోర్టు మొత్తం సీఐఎస్ఎఫ్ బలగాలు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్సెల్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో.. గ్రాండ్గా పెళ్లి వేడుక!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, టాలీవుడ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని జైపూర్లో పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహా వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పాల్గొన్నారు. ఈ డెస్టినేషన్ గ్రాండ్ వెడ్డింగ్లో దిల్ రాజు సందడి చేశారు. డప్పు వాయిస్తూ ఫుల్ జోష్లో కనిపించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
RS: సోనియా గాంధీ నామినేషన్.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(77) రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆమె వెంట కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తనయుడు రాహుల్ గాంధీ, తనయ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. అదే సమయంలో.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी ने जयपुर, राजस्थान में राज्यसभा के लिए नामांकन पत्र भरा। pic.twitter.com/aPpWNndFJ5 — Congress (@INCIndia) February 14, 2024 #WATCH | Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra leave from Jaipur, Rajasthan. The Congress Parliamentary Party Chairperson filed her nomination for Rajya Sabha Election from Rajasthan today. pic.twitter.com/PxxeCC8hHr — ANI (@ANI) February 14, 2024 రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అందులో ఒకటి కాంగ్రెస్కు దక్కనుంది. నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం సోనియా ఆమె రాయ్ బరేలీ లోక్సభ స్థానానికి ఎంపీగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం లోక్సభకు ఐదుసార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె తనయ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుమ.. ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వయసురిత్యా.. అలాగే అనారోగ్య కారణాలతోనే ఆమె పార్టీ కార్యకలాపాలకు(ఎన్నికల ప్రచారంతో సహా) దూరంగా ఉంటూ వస్తున్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
సాహిత్యం వల్ల టూరిజం అభివృద్ధి
జైపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వల్ల రాజస్థాన్ టూరిజంకు గణనీయమైన మేలు జరగడమే కాకుండా జైపూర్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జైపూర్లో గురువారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ను ప్రారంభిస్తూ ఈ సాహిత్య వేడుక వల్ల ఎంత మంది ప్రముఖులు వచ్చి వెళతారో మిగతా సంవత్సరమంతా అంతమంది ప్రముఖులు వచ్చి వెళతారని ఆమె అన్నారు. భారీ సాహిత్య ఉత్సవాల వల్ల ప్రాంతీయ నగరాలకు గుర్తింపు, టూరిజం కార్యకలాపాల పెరుగుదల జరుగుతుందని తెలిపారు. కాగా, జైపూర్లోని క్లార్క్ హోటల్లో విశేష సంఖ్యలో సాహితీ ప్రేమికుల మధ్య ఐదురోజుల లిటరేచర్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది సాహితీవేత్తలు ఈ వేడుక కోసం తరలి వచ్చారు. వీరిలో ముగ్గురు బుకర్ప్రైజ్ విజేతలు, ఐదుగురు పులిట్జర్ ప్రైజ్ విజేతలు ఉన్నారు. ఇతర భారతీయ భాషల సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. కాగా తెలుగు నుంచి కేవలం ఒకే ఒక స్పీకర్గా పరకాల ప్రభాకర్కు ఆహ్వానం అందింది. అది కూడా సాహిత్యాంశ కాకుండా రాజకీయాంశ మీద ఆయన మాట్లాడతారు. తెలుగులో మంచి సాహిత్యం ఉన్నా ఇంగ్లిష్ పాఠకులకు అనువాదాల ద్వారా తగినంతగా అందకపోవడం వల్లే ప్రతిసారీ ఈ ఉత్సవంలో చోటు దొరకడం లేదు. -
ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్మెంట్ని చూపించిన ప్రదాని మోదీ!
జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది. వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur. French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg — ANI (@ANI) January 25, 2024 (చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!) -
Republic Day 2024: జైపూర్లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్బాగ్ ప్యాలెస్కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
జైపూర్లో మోదీ, మాక్రాన్ రోడ్ షో
జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు జైపూర్లో రోడ్ షో నిర్వహించారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్ చేరుకున్నారు. అనంతరం జైపూర్లో ఇద్దరూ రోడ్షో నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. ఇదీ చదవండి: నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్.. -
నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. మోదీతో స్పెషల్ ప్రోగ్రామ్..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు. వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్ గురువారం భారత్కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్ ప్యాలెస్లో మాక్రాన్ కోసం ప్రైవేటు డిన్నర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రోడ్ షో.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్లో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. #WATCH | Rajasthan: Jaipur decked up with posters of PM Narendra Modi and French President Emmanuel Macron ahead of their visit today pic.twitter.com/2tOGZZmxVx — ANI (@ANI) January 24, 2024 ఈ రెండు రోజుల పర్యటనలో భారత్తో మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇక, ఫ్రాన్స్.. భారత్కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది. -
Rajasthan Haunted Places: రాజస్థాన్లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
ఎన్ఐఏ చేతికి కర్ణిసేన చీఫ్ హత్య కేసు
చంఢీగడ్: కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్ఐఏ చేపట్టింది. హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కర్ణిసేన అధినేతను డిసెంబర్ 5న రాజస్థాన్, జైపూర్లోని ఆయన నివాసంలో దుండగులు కాల్చి చంపారు. హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా హత్యకు బాధ్యత వహించాడు. ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలను డిసెంబర్ 9న చండీగఢ్లో పోలీసులు అరెస్టు చేశారు. గోదారానే తమను సుఖ్దేవ్ గోగామేడి హత్యకు ఆదేశించారని పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న షూటర్లు గోదార సన్నిహితులు వీరేంద్ర చాహన్, దనరామ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: 'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్పై విపక్ష ఎంపీ మిమిక్రి -
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసిదంది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్ -
కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య
జైపూర్: జైపూర్లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్తో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి వరండాలో కూర్చోగా ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్ పోస్ట్లో గోగమేడి హత్యకు తానే కారణమని పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు -
పొగమంచు ఎఫెక్ట్తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!
జైపూర్: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్కు వెళ్లింది. అంజూ రాజస్థాన్ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్లో టచ్లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు. ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్లోని అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ. -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్లీక్ సొమ్ము రాజస్తాన్లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
జోయాలుక్కాస్ చైర్మన్కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్అలుక్కాస్ తెలిపారు. -
జైపూర్లో నోట్ల వర్షం హల్చల్: వీడియో వైరల్
Money Heist' Attire రాజస్థాన్లోని జైపూర్లో నోట్ల వర్షం కురిసిన ఘటన గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఫలితంగా ట్రాఫిక్ జామ్కు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జైపూర్లోనిమాల్వియా నగర్లోని గౌరవ్ టవర్ సమీపంలో చోటు చేసుకుంది. 'మనీ హీస్ట్' సిరీస్ స్ఫూర్తితో మనిషి నోట్ల వర్షం కురిపించాడు. తన ముఖంపై సాల్వడార్ డాలీ మాస్క్తో ఎరుపు రంగు జంప్సూట్లో ఉన్నట్టుండి బిజీగా ఉన్న మార్కెట్లో గాలిలో డబ్బుల వర్షం కురిపించాడు. దీనితో భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు వీలైనన్ని ఎక్కువ నోట్లను అందిపుచ్చుకోవడానికి పరుగులు తీశారు. ఇందులో దాదాపు అన్నీ 20, 10 రూపాయల నోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఎక్కడి వాహనాలు అక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ చర్యకు కారణమైన వ్యక్తిని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసి, విచారణ కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు జ్ఞానచంద్ యాదవ్ వెల్లడించారు. 'మనీ హీస్ట్': అలెక్స్ పినా రూపొందించిన స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్ -
మొత్తానికి ఆయన చెప్పినట్టే జరిగిందిగా.. కపిల్ సిబాల్
జైపూర్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు జైపూర్లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై మరోసారి డానిష్ అలీ స్పందిస్తూ ఇది ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు దక్కిన బహుమతి అయి ఉంటుందని అన్నారు. ప్రమోషన్.. పార్లమెంట్లో రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్న అధిష్టానం ఆయనకు టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ బుధవారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. राजस्थान प्रदेश भाजपा कार्यालय जयपुर में ज़िला टोंक की समन्वय बैठक में प्रदेश अध्यक्ष श्री @cpjoshiBJP जी द्वारा संगठनात्मक कार्यों व चुनाव की तैयारियों के साथ सेवा सप्ताह के कार्यक्रमों सहित आगामी कार्यकर्ताओं के प्रवास योजनाओं की जानकारी लेते हुए। pic.twitter.com/wK63ctXR6X — Ramesh Bidhuri (@rameshbidhuri) September 27, 2023 అక్కడ ఆయనైతేనే కరెక్టని.. సమావేశాలు ముగిశాక డానిష్ అలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలను మతపరంగా దూషించడానికే నిర్వహించారని బీజేపీ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని ఆరోజే వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందన్నారు. ఆ జిల్లాలో 30 శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. నేనేమీ అనలేదు.. అంతకుముందు డానిష్ అలీ ప్రధాని కులాన్ని దూషించిన కారణంగానే రమేష్ బిధూరీ అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ బీజేపీ నేతలు విమర్శించగా అందులో డానిష్ అలీ ఎక్కడా ప్రధాని కుల ప్రస్తావన చేయలేదని.. ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఒక తీవ్రవాదిని ఎలా అనుమతించారని మాత్రం ప్రశ్నించిన సంభాషణలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Despite the abuses and extreme provocation, I didn’t utter a single word that could harm the sanctity of the temple of democracy. Even I didn’t repeat what Mr @rameshbidhuri said about me and my community. Inspite of it @BJP4India is trying it’s best to create a false narrative. pic.twitter.com/yApQ6w1vJR — Kunwar Danish Ali (@KDanishAli) September 26, 2023 ఇది కూడా చదవండి: ‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’ -
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సు మీదకు దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. భరత్పూర్లోని హంత్రా సమీపంలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం వెలుగుచూసింది. రాజస్థాన్లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్కు బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున లఖన్పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు బ్రేక్డౌన్ అయ్యింది. డీజిల్ అయిపోవడంతో డ్రైవర్తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనకాల నిల్చొని ఉన్నారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు వెనకాల వేచి ఉన్న 11 మంది (అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 12 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అంతు, నంద్రం, లల్లు, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్గా గుర్తించారు. ఈ ఘనటలో అయిదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజస్థాన్లో మంగళవారం సాయంత్రం హనుమాన్గఢ్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదం జరిగింది. జీపును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరికి గాయలయ్యాయి. చదవండి: పరీక్ష రాసి తిరిగివస్తూ.. ముగ్గురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం -
పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది
జైపూర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలిసిపోతుంది.. కాకపోతే దాని కోసం కొంత కాలం వేచి ఉండాలన్నారు కేంద్ర మంత్రి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్. పరివర్తన సంకల్ప యాత్రలో భాగంగా దౌసాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని షియా ముస్లింలు సరిహద్దు గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారని చూస్తూ ఉండండి ఎదో ఒక రోజు ఆ భూభగం దానంతటదే వచ్చి భారత్లో కలిసిపోతుందన్నారు. #WATCH | Dausa, Rajasthan | "PoK will merge with India on its own, wait for some time," says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm — ANI (@ANI) September 12, 2023 ఈ సందర్బంగా జీ20 సమావేశాలు విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసశంసలు కురిపించిన ఆయన గతంలో ఇవే సమావేశాలు చాలా దేశాలు నిర్వహించినప్పటికీ భారత్ మరింత ఘనంగా నిర్వహించిందని ప్రపంచ వేదిక మీద భారత్ సత్తా ఏమిటో నిరూపించుకుందని అన్నారు. Every smallest move was so well planned in #G20BharatSummit How #Chinese Premier Li Qiang was greeted on his arrival? 1. Received by VK Singh, EX-ARMY General. 2. Considering #China 's LOVE for Northeast...Assamese song was played in background. Entire reception had NSA Ajit… pic.twitter.com/vCvE4RAse0 — BhikuMhatre (@MumbaichaDon) September 12, 2023 ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అందుకే బీజేపీ ప్రతిష్టాత్మక పరివర్తన యాత్రను ప్రారంభించిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యాత్ర సమయంలో వారే స్వయంగా వచ్చి ఆ విషయాన్ని తెలిపారన్నారు. బీజేపీ ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదని ప్రధాని ఛరిష్మాతోనే ఎన్నికలకు వెళ్తుందని అన్నారు. మంచితనంతో ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజలు కోరుకునే అభ్యర్థులకు పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. #WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp — ANI (@ANI) September 8, 2023 ఇది కూడా చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ -
G20 Summit: నేతల సతీమణులకు ప్రత్యేక విందు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రానికి వచి్చన ప్రపంచ నేతల సతీమణులకు శనివారం జైపూర్ హౌస్లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరికీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కళాకృతులను తిలకించేందుకు అవకాశం కలి్పంచారు. విందులో భాగంగా వారికి మిల్లెట్లతో చేసిన వంటకాలను వడ్డించారు. స్ట్రీట్ ఫుడ్ రుచి చూపించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విందుకు తుర్కియే అధ్యక్షుడి సతీమణితోపాటు, జపాన్ ప్రధాని సతీమణి యోకో కిషిదా, యూకే ప్రధాని సతీమణి అక్షతామూర్తి, ఆ్రస్టేలియా, మారిషస్ తదితర దేశాల ప్రధానుల సతీమణులు, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రితు బంగా తదితర 15 మంది వరకు హాజరయ్యారని వెల్లడించాయి. అంతకుముందు, వీరంతా సుమారు 1,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్ఐ)పుసా క్యాంపస్కు వెళ్లారు. వీరికి విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన భార్య కియోకో స్వాగతం పలికారు. తృణధాన్యాల సాగు గురించి తెలుసుకున్నారు. ప్రముఖ చెఫ్లు లైవ్ కుకింగ్ సెషన్లో తృణధాన్యాల వంటకాలను వివరించారు. మధ్యప్రదేశ్లోని డిండోరికి చెందిన గిరిజన మహిళా రైతు లహరీ బాయి తదితర 20 మంది మహిళా రైతులతో వీరు ముచ్చటించారు. -
ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్లో ఉంచిన సుప్రీం -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
నగ్నంగా ఊరేగించిన మహిళకు సీఎం భరోసా
జైపూర్: రాజస్థాన్లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు అప్పగించారు. అనంతరం ప్రతాప్గఢ్ వెళ్లి గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు. #WATCH | After meeting the Pratapgarh assault victim, Rajasthan CM Ashok Gehlot says, "In this case, an SIT has been formed. 11 people have been arrested... I spoke to the victim's family and assured them that justice would prevail... I offered her a government job... And we will… pic.twitter.com/rJQ4mFHbXk — ANI (@ANI) September 2, 2023 ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
వసుంధర రాజేకు షాకిచ్చిన బీజేపీ
జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం. రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు.. -
వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్
జైపూర్: బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్లో బాంబు దాడి జరిపారని అన్నారు. అందుకు సచిన్ పైలట్ స్పందిస్తూ మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్వట్టర్లో రాస్తూ.. "1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో మిజోరాం రాజధాని ఐజ్వాల్పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది" అని రాశారు. అమిత్ మాలవ్య చేసిన వ్యాఖ్యలకు సచిన్ పైలట్ బదులిస్తూ.. "మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అదికూడా 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా జరిగింది. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదు. ఎందుకంటే ఆయన 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు." అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును జతపరిచారు. .@amitmalviya - You have the wrong dates, wrong facts… Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966. He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB — Sachin Pilot (@SachinPilot) August 15, 2023 ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ
జోధ్పూర్: భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం మరింత బలపడింది. ఇప్పటికే సీమా హైదర్-సచిన్ మీనా, అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోగా తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటై ఈ లిస్టులో చేరిపోయారు. అయితే వీరు సాహసాలకు తెరతీయకుండా పెద్దలను ఒప్పించి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్కు చెందిన అమీనాకు భారత్లోని జోధ్పూర్కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్కు వర్చువల్గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన సంబంధమని పాకిస్థాన్లో ఉన్న తమ బంధువులు ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పారు అర్బాజ్ ఖాన్. వాస్తవానికి వివాహం భారత్లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయామని. అయినప్పటికీ తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు లేనందునే ఈ విధంగా ఆన్లైన్లో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ వివాహం చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. నిఖా మాత్రమే కాదు వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాలను దగ్గరుండి జరిపించారు కుటుంబ సభ్యులు. అర్బాజ్ చెప్పినట్లు పాకిస్తాన్ భారతదేశం మధ్య సంబంధాలు సరిగ్గా లేవన్నది ఒకప్పటి మాట. ఈ జంటల కథలను చూస్తే సంబంధాలు మెరుగవుతున్నట్టే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ -
జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..?
జైపూర్: జైపూర్ ఎక్స్ప్రెస్లో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సహోద్యోగులతో సహా తోటి ప్రయాణికులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడు చేతన్ సింగ్తో పాటు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఘన్శ్యామ్ ఆచార్య.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగిందో సవివరంగా పోలీసులకు వివరించాడు. కాల్పులకు ముందు కానిస్టేబుల్ చేతన్ సింగ్ తనకు ఆరోగ్యం సరిగా లేదని సీనియర్ అధికారికి తెలిపినట్లు ఘన్శ్యామ్ వెల్లడించారు. రైలు దిగిపోతానని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే.. షిఫ్ట్ పూర్తి చేసుకునే వెళ్లమని సీనియర్ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కోపోద్రిక్తుడైన చేతన్ సింగ్ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. అంతకు ముందే చేతన్ సింగ్తో వాగ్వాదం జరిగిందని, అక్కడ తన గొంతును నులిమే ప్రయత్నం చేశాడని ఘన్శ్యామ్ పేర్కొన్నాడు. 'దిగిపోతా..' ఘన్శ్యామ్, సీనియర్ అధికారి టిమారమ్ మీనా(58), కానిస్టేబుల్ నరేంద్ర పర్మార్(58), చేతన్ సింగ్(33)లు డ్యూటీలో ఉన్నారు. అర్ధరాత్రి 2.53 సమయంలో మీనా, చేతన్ సింగ్లు ఏసీ కోచ్లో పర్యవేక్షిస్తున్నారు. పర్మార్, శ్యామ్ స్లీపర్ కోచ్లో ఉన్నారు. ఘన్శ్యామ్ రిపోర్టును ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో చేతన్, మీనాతో సహా మరో ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఉన్నారు. అయితే.. చేతన్ ఆరోగ్యం బాగులేదని రైలు దిగిపోతానని మీనాకు చెప్పారు. కానీ కేవలం రెండు గంటలు డ్యూటీ మాత్రమే మిగిలి ఉందని మీనా చేతన్ను సముదాయించారు. 'డ్యూటీ పూర్తి చేయాలని..' కానీ చేతన్.. మీనా మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అయితే చేతన్ విషయాన్ని ఎన్స్పెక్టర్కు తెలిపాడు మీనా. అటు నుంచి కంట్రోల్ రూమ్కు కూడా సమాచారం అందించాడు. కానీ డ్యూటీ పూర్తి చేసుకుని ముంబయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోమని ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని చేతన్కు చెప్పగా ఆయన వినిపించుకులేదు. అయితే.. చేతన్ వద్ద గన్ తీసుకుని, విశ్రాంతి తీసుకోమన్నారు. పక్కనే ఉన్న బెడ్పైన పడుకోమన్నారు. గొంతు నులిమి.. కొద్ది సేపటికే తిరిగి వచ్చిన చేతన్ తన గన్ను తనకు ఇచ్చేయమని అడిగాడు. వద్దని వారించిన ఘన్శ్యామ్ గొంతును నులిమే ప్రయత్నం చేశాడు. ఘన్శ్యామ్, చేతన్ల గన్లు తారుమారు అయ్యాయి. ఎవరి గన్లు వారికి ఇప్పించడానికి వచ్చిన సీనియర్ అధికారి మీనాపై చేతన్ తిరగబడ్డాడు. వాగ్వాదం సాగింది కాసేపు. ఆ తర్వాత ఘన్శ్యామ్ అక్కడి నుంచి వెళ్లాడు. కాసేపటికే చేతన్ ఫైరింగ్ మొదలుపెట్టాడు. మీనాతో సహా మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగే సమయంలో గన్ పేలుడు శబ్దాలు విని బాత్రూంలో దాక్కున్నట్లు ఘన్శ్యామ్ తెలిపారు. మిగిలిన కానిస్టేబుళ్ల క్షేమాన్ని కనుకుని, కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. అనంతరం రైలును చైన్ లాగి నిందితుడు పారిపోయాడని ఘన్శ్యామ్ తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత..
జైపూర్: పాకిస్థాన్కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్ బాలిక జైపూర్ ఎయిర్పోర్టులో అధికారులను షాక్కు గురిచేసింది. పాక్లో ఉన్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితమే వచ్చా.. ఎయిర్పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్ నుంచి భారత్కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్కు గురయ్యారు. ఎయిర్పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్పోర్టులోని టిక్కెట్ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు. ప్లాన్ ఇచ్చింది ఆయనే.. పాకిస్థాన్లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది. కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకొచ్చిన కారు.. -
జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్
జైపూర్: శిఖర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ శాసనసభలో ఎర్ర డైరీ ఒకటి హల్చల్ చేసింది. అది గాని బహిర్గతమైతే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఉందో లేదో తెలియని ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ ఎర్రటి టమాటాలు, సిలిండర్లను వంటగది బడ్జెట్ పెంచేసిన విషయం మాత్రం కానరాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఎమ్మెల్యే మంత్రి రాజేంద్ర సింగ్ గుదా రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై ఆందోళన వ్యక్తం చేస్తూ సొంత పార్టీపైనే విమర్శలు చేసి, ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ ఇది రాజస్థాన్ సీఎం భవిష్యత్తును తేల్చే భవిష్యవాణి అంటూ సంచలనం సృష్టించారు. ఆ డైరీలో 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన లావాదేవాల వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్ వేయడంలో తనదైన మార్క్ ప్రదర్శించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శిఖర్ సభలో ఈ ఎర్ర డైరీ గురించి ప్రస్తావించి సీఎం అశోక్ గెహ్లాట్ కు కౌంటర్ వేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ఎదో కార్యక్రమం చేశారు. అది మొహబ్బత్ కీ దుకాణ్ కాదు "లూటీ కీ దుకాణ్-ఝూటీ కీ దుకాణ్" అని అన్నారు. ప్రజలను లూటీ చేసిన సమాచారం తోపాటు వారు చెప్పిన ఝూటా కబుర్ల గురించిన వివరమంతా ఎర్ర డైరీలో ఉన్నాయి. ఆ నిజాలు బయటకు వస్తే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు. लाल डायरी..... अब अच्छे-अच्छे निपट जाएंगे! लाल डायरी का नाम सुनते ही कांग्रेसियों के मुंह में दही जम जाता है?#Rajasthan #AshokGehlot #congrees #NarendraModi#sikar #RajendraGuda pic.twitter.com/fafANrlwlp — Priti charan (@CharanPriti) July 27, 2023 అసలే దుందుడుకు స్వభావి అయిన సీఎం ఈ కామెంట్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. మీకు ఊహాజనితమైన ఎర్ర డైరీ కనిపిస్తుంది కానీ కళ్ళ ముందున్న ఎర్రటి టామాటాలు, ఎర్రటి గ్యాస్ సిలిండర్లు కనిపించవు.. వాటి కారణంగా ఎర్రగా మారిన ప్రజల ముఖాలు కూడా కానరావు. చూస్తూండండి వచ్చే ఎన్నికల్లో జనం మీకు ఎర్రటి జెండా చూపించడం ఖాయమని కౌంటర్ వేశారు. "PM को लाल टमाटर, महंगाई से हुए लोगों के लाल चेहरों पर बात करनी चाहिए" ◆ राजस्थान CM अशोक गहलोत का बयान @ashokgehlot51 #AshokGehlot pic.twitter.com/1F4wdPPlVV#राजस्थान_में_मोदी_मोदी — Nemi saini (@NemiSainiINC) July 27, 2023 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కార్యక్రమంలో తన పేరును తొలగించారన్న కారణంతో ప్రధాని మోదీ, సీఎం గెహ్లాట్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇలా హాటు హాటుగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం -
రాజస్థాన్ సీఎం అలక .. ప్రధానికి అలా ఆహ్వానం
జైపూర్: ప్రధాని కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో తన ఆహ్వాన ప్రసంగానికి సమయం ఇవ్వనందున తాను కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఈ విధంగా ట్విట్టర్లో మా ఆహ్వానాన్ని అందుకోండంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నరేంద్ర మోదీకి ఆహ్వానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, ఆయన వీలైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. శిఖర్ వేదికగా కిసాన్ సమ్మాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు రాజస్థాన్ విచ్చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ఈ కార్యక్రమానికి షెడ్యూలును విడుదల చేసింది ప్రధాని కార్యాలయం. కానీ అందులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు లేకపోవడంతో కోపగించి తాను కూడా ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా ఇదే ట్విట్టర్ వేదికగా ప్రధానికి ఆహ్వానాన్ని తెలుపుతున్నానని అన్నారు. అశోక్ గెహ్లాట్ తన సందేశంలో ఏమని రాశారంటే.. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, మీ కార్యాలయం వారు కార్యక్రమానికి ముందుగా ఉండాల్సిన నా 3 నిముషాల ఆహ్వాన ప్రసంగాన్ని తొలగించిన కారణంగా నేను స్వయంగా వచ్చి మీకు ఆహ్వానం తెలపలేకపోతున్నాను. అందుకే ఈ ట్విట్టర్ మాధ్యమాం ద్వారా మీకు ఆహ్వానం తెలుపుతున్నానని, గడిచిన ఆరు నెలల్లో ఏడోసారి పర్యటిస్తున్న మీకు అక్కడకు వచ్చి ఆహ్వానించి మీకు కొన్ని డిమాండ్లను తెలపాలని అనుకున్నాను. కానీ అది కుదరకపోవంతో ఈ మాధ్యమం ద్వారా వాటిని మీ ముందుంచుతున్నానని ఐదు డిమాండ్లను రాశారు माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी, आज आप राजस्थान पधार रहे हैं। आपके कार्यालय PMO ने मेरा पूर्व निर्धारित 3 मिनट का संबोधन कार्यक्रम से हटा दिया है इसलिए मैं आपका भाषण के माध्यम से स्वागत नहीं कर सकूंगा अतः मैं इस ट्वीट के माध्यम से आपका राजस्थान में तहेदिल से स्वागत करता… — Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2023 దీనికి బదులుగా ప్రధాని కార్యాలయం స్పందిస్తూ.. ప్రోటోకాల్ ప్రకారం మొదట షెడ్యూలులో మీ ఆహ్వాన ప్రసంగం చేర్చడం జరిగింది. కానీ మీ కార్యాలయం నుండి మీరు కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు. ప్రధాని గత పర్యటనల్లో మిమ్మల్ని ఆహ్వానించినా ప్రతిసారి మీరు హాజరయ్యారు. ఈ రోజు కార్యక్రమానికి కూడా మిమల్ని ఆహ్వానిస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాల ఫలకాల మీద కూడా మీ పేరుని చేర్చడం జరిగింది. మీకు తగిలిన గాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంతవరకు మీరు కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామని రాసింది. Shri @ashokgehlot51 Ji, In accordance with protocol, you have been duly invited and your speech was also slotted. But, your office said you will not be able to join. During PM @narendramodi’s previous visits as well you have always been invited and you have also graced those… https://t.co/BHQkHCHJzQ — PMO India (@PMOIndia) July 27, 2023 త్వరలో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, శిఖర్ లో ఆ పార్టీకి 8 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి కూడా దక్కని కారణంగా ఈసారి ఇక్కడ ఎలాగైనా బోణీ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడ కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని నిర్వహించారని అంటున్నాయి రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు. ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
ఏయూ బ్యాంక్ లాభం రూ.387 కోట్లు
ముంబై: జైపూర్ కేంద్రంగా పనిచేసే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 44 శాతం వృద్ధి చెందిన రూ.387 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు రూ.1,979 కోట్ల నుంచి రూ.2,773 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు చేరుకుంది. కానీ, నికర వడ్డీ మార్జిన్ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 5.9 శాతంగా ఉంటే, తాజాగా సమీక్షా త్రైమాసికంలో 5.7 శాతానికి పరిమితమైంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయడమే, నికర వడ్డీ మార్జిన్ క్షీణతకు దారితీసినట్టు బ్యాంక్ సీఈవో సంజయ్ అగర్వాల్ తెలిపారు. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను తగ్గించినా కానీ, రానున్న రోజుల్లో నికర వడ్డీ మార్జిన్పై ఒత్తిడి ఉంటుందని స్పష్టం చేశారు. డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంక్ల మధ్య పోటీ మొదలైనట్టు అంగీకరించారు. నిధుల వ్యయాలు 5.96 శాతం నుంచి 6.58 శాతానికి పెరిగిపోవడంతో, డిపాజిట్లపై రేట్లను తగ్గించక మరో దారి లేదన్నారు. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.5–5.7 శాతానికి తగ్గొచ్చని చెప్పారు. క్రెడిట్ కార్డ్ల రుణ పుస్తకం రూ.1,000 కోట్లను దాటిందని, ఈ విభాగంలో భవిష్యత్తులో బలమైన వృద్ధిని చూడనునున్నట్టు చెప్పారు. రుణాలు 29 శాతం పెరిగి రూ.63,635 కోట్లకు చేరాయి. స్థూల ఎన్పీఏలు 1.76 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 0.55 శాతానికి పరిమితమయ్యాయి. -
ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్
జైపూర్: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై సూటి ప్రశ్నలు సంధించిన తన కేబినెట్ మంత్రి రాజేంద్ర సింగ్ గుధాను పదవి నుంచి తప్పించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అటు తర్వాత ప్రధాని అనుచిత వ్యాఖ్యలపైన స్పందిస్తూ రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి తన పోర్ట్ ఫోలియోలోని హోంశాఖను వేరెవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూతద్దంలో చూపిస్తున్నారు.. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి రాజేంద్ర సింగ్ మణిపూర్ తరహాలో రాజస్థాన్ లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పాయని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పోర్ట్ ఫోలియో లోని హోంశాఖను ఎవరైనా సమర్ధులకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజస్థాన్ లో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై స్పందిస్తూ రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో శాంతి భద్రతల అమలు విషయమై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందు మీరు తప్పుకోండి.. దీనిపై రాజస్థాన్ సీఎం స్పందిస్తూ.. మీ వైఫల్యాలను, అసమర్ధతను ఎదుటివారిపై రుద్దటం సరైన పధ్ధతి కాదు. ప్రచార ఆర్భాటాల కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా. మణిపూర్లో అన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళారా? మణిపూర్ కూడా మన దేశంలో భాగమే కదా. అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ముందు అక్కడి ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ పదవి నుండి తప్పుకోవాలి. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలో ఉండి ఉంటే ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో మాకు. ముందు మీ పోర్ట్ ఫోలియోలో హోంశాఖను ఎవరైనా సమర్ధుడికి అప్పగించండి.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జైల్లో పెట్టినా తగ్గేదే లేదు.. మంత్రి పదవి నుండి తప్పించబడ్డ రాజేంద్ర సింగ్ పదవీచ్యుతులైన తర్వాత ముఖ్యమంత్రికి మరోసారి చురకలంటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. మన ఆడబిడ్డలకు ఇక్కడ భద్రత లేదు. కేబినెట్ సమావేశాల్లో కూడా నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను. పోలీసులు మామూళ్లు వసూలు చెయ్యడంలో చాలా బిజీగా ఉన్నారు. దీని పరిష్కారం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరముంది. మంత్రి పదవి పోయినా, నన్ను జైల్లో పెట్టినా నేను మాత్రం ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉంటానన్నారు. Press Conference at CM residence | July 22 https://t.co/wxGUzUujum — Ashok Gehlot (@ashokgehlot51) July 22, 2023 ఇది కూడా చదవండి: విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి.. -
Jaipur: అరగంట గ్యాప్లో మూడు భూకంపాలు!
ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ జైపూర్ ఉలిక్కిపడింది. పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. శుక్రవారం వేకువ ఝామున జైపూర్ కేంద్రంగా.. 4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి, 4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. What a scary day to witness such high magnitude #earthquake in #Jaipur. Please be safe! pic.twitter.com/hGDgfCHYtL — Jahnvi Sharma (@JahnviSharma01) July 20, 2023 #earthquake See the dogs on the street in deep sleep suddenly waking up #jaipur #भूकंप pic.twitter.com/oGYz942g9i — Rameshwar Singh (@RSingh6969a) July 20, 2023 जयपुर में तेज़ भूकंप के झटके महसूस किए गए हैं। I hope you all are safe! #Jaipur #earthquake pic.twitter.com/FWAEvBTw7A — Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 20, 2023 -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్లో చిల్ అవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్గా..
ఫ్యాషన్ డిజైనర్కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్షిప్ న్యూయార్క్లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్వేర్ లేబుల్కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్చార్జ్లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్గా అనిపించాయి. డిజైనింగ్లో హర్ష్కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా దీపాలీ..
‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్స్పన్’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్టెల్ కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా... రాజస్థాన్లోని జైపుర్కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్స్పన్’ చైర్మన్ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) తొలిరోజుల్లో ‘బాస్ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్ షూటర్గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?) ఇంతలోనే కోవిడ్ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు ఇండియన్ మార్కెట్పై కూడా దీపాలీ దృష్టి సారించింది. ‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ. ఈఎస్జీ–ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్ వాటర్ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు. ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం. -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
సెమీఫైనల్ ‘షూటౌట్’లో ఓడిన తెలుగు టాలన్స్
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ ఆట సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జైపూర్లో జరిగిన సెమీస్లో తెలుగు టాలన్స్పై గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. నిర్ణీత 60 నిమిషాల సమయంలో ఇరు జట్లు 35–35 గోల్స్తో సమంగా నిలవగా, ఆపై 10 నిమిషాల అదనపు సమయం తర్వాత స్కోరు 40–40తో మళ్లీ సమమైంది. టాలన్స్ తరఫున కైలాశ్ పటేల్ 15 గోల్స్ సాధించగా, యూపీ తరఫున భూషణ్ షిండే 15 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి అర్ధభాగంలో 16–12తో టాలన్స్ ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో జట్టు పట్టు కోల్పోయింది. అనంతరం ‘షూటౌట్’లో యూపీ 4–3 తేడాతో తెలుగు టాలన్స్ను ఓడించింది. మరో సెమీస్లో మహారాష్ట్ర ఐరన్మెన్ 38–28తో రాజస్తాన్ పేట్రియాట్స్పై విజయం సాధించింది. -
Anchor Sreemukhi : దోస్త్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హంగామా (ఫోటోలు)
-
డాన్సింగ్ పానీపూరి.. ఎగబడితింటున్న జనం.. ఇదేం పనంటూ నెటిజన్స్ ఫైర్!
కోటి విద్యలు కూటి కొరకు అన్న సామెత అందరికి తెలసిందే. రుచి, శుచితో కూడిన ఆహారానికి దేశంలో యమ డిమాండ్ ఉంది. అందుకే ఫుడ్ బిజినెస్లోకి ప్రజలు అడుగుపెడుతున్నారు. ఈ వ్యాపారంలో పిల్లలు నుంచి పెద్దలు వరకు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిరుతిండి టేస్ట్ ఉంటే చాలు ప్రజలు అక్కడవాలిపోతారు. అందుకే వీధి వ్యాపారులు కేవలం రుచితో మాత్రమే కాకుండా అనేక వైవిధ్యాలతో ముందుకు వస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రుచితో పాటు కాస్త భిన్నంగా పానీపూరి అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని వీడియో వైరల్గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్లో ఒక వీధి వ్యాపారీ సందడిగా ఉండే ట్రిపోలియా బజార్లో తోపుడు బండి మీద పానీపూరి అమ్ముతున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆ వీడియో వైరల్గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో, వీధి వ్యాపారి తన ఒట్టి చేతులతో పానీ పూరీని కలపడం, పూరీలను నింపడం డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. అతను తన ముక్కును గీసుకున్న తర్వాత పానీ పూరి నీటిలో తన చేతులను ఉంచడం కూడా అందులో కనిపిస్తుంది. అనంతరం అదే చేతితో వినియోగదారులకు గోల్గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ, రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) చదవండి: Video: బైక్పై లవర్స్ రొమాన్స్.. అందరిముందే హగ్లతో రెచ్చిపోయిన జంట -
తెలుగు టాలన్స్ దూకుడు.. గుజరాత్ను చిత్తు చేసి! టేబుల్ టాపర్గా..
Premier Handball League 2023- జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు లీగ్ దశను విజయంతో ముగించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టాలన్స్ జట్టు 36–28 గోల్స్ తేడాతో గర్విత్ గుజరాత్ జట్టును ఓడించింది. మొత్తం 10 మ్యాచ్లు ఆడిన టాలన్స్ 15 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు టాలన్స్తోపాటు మహారాష్ట్ర ఐరన్మెన్, రాజస్తాన్ పేట్రియాట్స్ జట్లు సెమీఫైనల్ చేరుకోగా... చివరి సెమీఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ పంజెర్స్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్లు పోటీపడుతున్నాయి. నేటి నుంచి గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), టెక్ మహీంద్రా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా నేటి నుంచి గ్లోబల్ చెస్ లీగ్ జరుగనుంది. మొత్తం ఆరు జట్లు (బాలన్ అలాస్కన్ నైట్స్, చింగారి గల్ఫ్ టైటాన్స్, గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్, ఆల్పైన్ వారియర్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్) బరిలో ఉన్నాయి. -
చిల్లర భరణం.. భర్తకు షాకిచ్చిన కోర్టు
జైపూర్: భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తెచ్చిన ఓ భర్తకు కోర్టు షాకిచ్చింది. వాటిని తీసుకోవాలని భార్యకు చెబుతూనే.. ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. రాజస్తాన్లోని జైపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమ విభేదాలు రావడంతో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఈ కేసు పెండింగ్లో ఉంది. అప్పటి వరకు సీమకు నెలకు రూ.5 వేల చొప్పున నిర్వహణ ఖర్చుల కింద ఇవ్వాలని దశరథ్ను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, అతడు 11 నెలలుగా ఆ సొమ్మును ఇవ్వడం లేదు. దీంతో, సీమ మళ్లీ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అతడిపై కోర్టు రికవరీ వారెంట్ జారీ చేసింది. డబ్బు చెల్లించేందుకు అతడు నిరాకరించడంతో పోలీసులు జూన్ 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే.. దశరథ్ అరెస్ట్ కావడంతో సీమకు చెల్లించాల్సిన డబ్బును అతడి కుటుంబసభ్యులు ఏడు బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చారు. రూ.55 వేలకు సమానమైన రూ.1, రూ.2 నాణేలు వాటిలో ఉన్నాయి. 280 కేజీల దాకా బరువులు ఉన్నాయి ఆ సంచులు. అయితే.. ఆ డబ్బును తీసుకునేందుకు సీమ నిరాకరించారు. తనను మానసికంగా వేధించాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా తీసుకువచ్చారని ఆరోపించారు. న్యాయమూర్తి మాత్రం నాణేల రూపంలో దశరథ్ డబ్బు చెల్లించవచ్చని తెలిపారు. అయితే, ఆ నాణేలన్నిటినీ అతడే స్వయంగా లెక్కించాలని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు డబ్బు కోర్టు అధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున డబ్బును దశరథ్ లెక్కించి రూ.వెయ్యి చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులో వాటిని భార్యకు అప్పగించాలని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: శివలింగంపై కరెన్సీ నోట్లు విసిరి.. -
జైపూర్లో అదితిరావు, సిద్ధార్థ్ సందడి..
-
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
ఎల్కేజీ ఫ్రెండ్ను దగ్గర చేసిన ఇన్స్టాగ్రామ్
చిన్ననాటి స్నేహితులను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. అయితే ఒక్కోసారి స్నేహితులను విడిచి మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో లేక మరో స్కూలుకు మారడమో లాంటివి జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో చిన్నారుల స్నేహాలు దూరమవుతుంటాయి. అయితే ఒక యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని వెదికి పట్టుకుంది. నేహా అనే ఈ యువతి తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్లో తన కథను వీడియో రూపంలో వివరించింది. తాను తన లోవర్ కేజీ స్నేహితురాలిని వెదికేందుకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని తెలిపింది. దీనిసాయంతో తన బాల్య స్నేహితురాలిని వెదికానని వెల్లడించింది. వీడియోలో నేహ తెలిపిన వివరాల ప్రకారం 2006లో తన స్నేహితురాలు లక్షితతో పాటు ఎల్కేజీ చదివానని పేర్కొంది. అయితే లక్షిత తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవడంతో తమ స్నేహం తెగిపోయిందని తెలిపింది. తనకు తన స్నేహితురాలి పూర్తిపేరు కూడా తెలియదని,అయితే తన రూపం, స్నేహం గుర్తుకు వస్తుండటంతో ఆమెను ఎలాగైనా వెదకాలని అనుకున్నానని తెలిపారు. ఇందుకోసం తాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రూపొందించానని అన్నారు. దానిలో తన స్కూలు గ్రూపు ఫొటో పోస్ట్ చేశానని తెలిపారు. తరువాత తాను లక్షిత పేరుతో గల వేల అకౌంట్లను వెదికానన్నారు. వారికి మెసేజ్లు చేస్తూ, ఫొటోలను చెక్ చేశానని తెలిపారు. ఎట్టకేలకు తన స్నేహితురాలు లక్షిత నుంచి రిప్లయ్ వచ్చిందని ఆనందంగా తెలిపారు. తాము 18 ఏళ్ల తరువాత కలుసుకుని మాట్లాడుకున్నమని అన్నారు. దీనిని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు తన స్నేహితురాలు జైపూర్లో ఉన్నదని తెలిసిందన్నారు. నేహ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేహా తన స్నేహితురాలిని కనిపెట్టేందుకు అనుసరించిన విధానం నచ్చిందని, తాము కూడా తమ బాల్య స్నేహితులను ఇలానే వెదికి తీరుతామని తెలిపారు. మరొక యూజర్ సోషల్ మీడియా అద్భుతాలు చేస్తున్నదని పేర్కొన్నారు. -
వైరల్ అవుతున్న శర్వా మ్యారేజ్ వీడియోలు..!
-
శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్లో జైపూర్లోని లీలా ప్యాలెస్లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుకలకు లీలా ప్యాలెస్ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అంతకుముందే కాబోయే వధూవరులిద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు. (ఇది చదవండి: ‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్ మచ్చ) శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్ వేడుకల్లో పలువురు తారలు కూడా పాల్గొన్నారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ కూడా సంగీత్కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జైపూర్లో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్కు శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది. కాగా.. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్) #RamCharan at his best friend #sharwanand wedding 🤩🤩 @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8 — Telugu Box office (@TCinemaFun) June 2, 2023 Ram Charan at #Sharwanand and Rakshita 's Sangeet function 😍❤️#SharwaRakshitaWedding @ImSharwanand pic.twitter.com/37pcknNccz — ❤️ (@RakeShPrabhas20) June 2, 2023 Man Of The Masses @AlwaysRamCharan 🦁 Joined his Best Buddy @ImSharwanand's Wedding at JAIPUR ❤️✨🤩#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp — 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) June 2, 2023 #Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan 🦁🔥 pic.twitter.com/IM7vaIsGD0 — Raees (@RaeesHere_) June 2, 2023 -
మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ
న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్ వాహనం ఎక్స్యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది. ఎక్స్యూవీ 700 కార్ ఓనర్ కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్గా మంటలు వ్యాపించినట్టు కులదీప్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముందస్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం అసలు సర్క్యూట్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్ వైరింగ్ కనెక్షన్ ఒరిజనల్ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమాచారాన్ని కారు ఓనర్కు ఈమెయిల్ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 చాలామంది తమ వాహనాలను ఎడిషనల్ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్డేట్ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్లు, మెకానిక్లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది. Here is an update to our official statement with reference to the incident in Jaipur involving the XUV700. Our customers' safety is always our top most priority. pic.twitter.com/HYSQDEBFIu — Mahindra Automotive (@Mahindra_Auto) May 24, 2023 -
గుడ్న్యూస్! గద్వాల మీదుగా జైపూర్కు మరో రైలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన మహబూబ్నగర్– విశాఖ రైలును కిషన్రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జిల్లాకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించేలా, నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. రైలు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రైల్వేస్టేషన్ ప్రాంగణం, పరిసరాలు మార్మోగాయి. తెలంగాణలో పంటల బీమా పథకం ఎక్కడ?: కిషన్రెడ్డి తెలంగాణలో కనీసం పంటల బీమా పథకం అమలు చేయడం లేదని.. ఇక్కడ వర్షాలకు పంటలు నష్టపోతే సాయం చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నాందేడ్ వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారని అని కిషన్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదోడికి ఇల్లు కట్టే సోయిలేదు గానీ.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డు సమయంలో కడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు వస్తోందని, రైతులకు పెరిగిన ఎరువుల ధరల భారం పడకుండా రూ.లక్ష కోట్ల సబ్సిడీని ఇస్తోందని ఆయన వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 సబ్సిడీ.. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల సాయం అందజేస్తోందని వివరించారు. దేశ భవిష్యత్ కోసమే రూ.2వేల నోట్ల ఉపసంహరణ ‘రూ.2 వేల నోట్ల ముద్రణ 2018 మార్చి 31 నుంచే బంద్ అయింది.. ఈ నోటు ఉపసంహరణపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. సెపె్టంబర్ 30 వరకు బ్యాంకుల్లో బదలాయింపు చేసుకోవచ్చు.. దేశ భవిష్యత్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి పాల్గొన్నారు. -
జైపూర్లో ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ ఆరంభ సీజన్
హ్యాండ్బాల్కు ఆదరణ పెంచే క్రమంలో మరో ముందడుగు. జైపూర్ వేదికగా ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8 నుంచి జూన్ 25 వరకు రాజస్తాన్లోని జైపూర్లో గల సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఇందులో రాజస్తాన్ పేట్రియాట్స్, గర్విత్ గుజరాత్, మహారాష్ట్ర ఐరన్మెన్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తర్ప్రదేశ్, తెలుగు టాలోన్స్, ఢిల్లీ పంజెర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ మ్యాచ్లను వయాకామ్ 18, జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఖేల్లో వీక్షించవచ్చు. -
Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్ డాక్టర్ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్...
మరో కీర్తికిరీటం ‘మిసెస్ తెలంగాణ’. ‘మిసెస్ వోగ్స్టార్ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్ నాడి పట్టుకుంది. సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో జైపూర్ వేదికగా వోగ్ స్టార్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్స్టార్ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది. ‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్ఎన్ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్తోనే మమేకమైపోయింది. సైనిక్పురిలోని భారతీయ విద్యాభవన్లో టెన్త్ టాపర్ని. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్లు ప్రాక్టీస్ చేశాను. యాక్టింగ్లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్ లెవెల్ ప్లేయర్ని. ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్ ఇంటర్లో ఉండగా ఓ యాక్సిడెంట్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు. ఏఎస్రావు నగర్లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్సెట్లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్లో సీటు తెచ్చుకున్నాను. టాప్ టెన్లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్ వల్ల ఆ కల నెరవేరలేదు. ► ... డాన్స్ మానలేదు! కుప్పంలో ఎంబీబీఎస్ చేశాను. అప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ మానలేదు. నేను స్టేజ్ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్ మ్యారేజ్. డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్లో నా సీనియర్. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు. డాన్స్ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్ హైదరాబాద్ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్ రౌండ్లో ర్యాంప్ వాక్, డాన్స్ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్ తెలంగాణ ఆడిషన్’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా అనేక సెషన్లు జరిగాయి. అన్నీ వర్చువల్గానే. ► పోటీల నుంచి నేర్చుకున్నాను! ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’ ఎంపిక ఇలా! స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి. – డాక్టర్ ఎం.వి. శ్రీకీర్తి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
'జైపూర్ అంటే చాలా ఇష్టం.. నా కెరీర్కు టర్నింగ్ పాయింట్'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే వరుస విజయాలకు బ్రేక్ పడింది. గురువారం సీఎస్కేతో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగింది. మ్యాచ్ ఓటమిపై ధోని స్పందించాడు. ''ఈ పిచ్పై ఇంత టార్గెట్ కొంచెం కష్టతరమే. అయితే తొలి ఆరు ఓవర్లలో మా బౌలర్లు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి కొన్ని మిస్ఫీల్డ్ల వల్ల పరుగులు వచ్చాయి. ఇక పతీరానా బౌలింగ్ బాగానే ఉంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతటి బౌలర్ అయినా ఏం చేయలేడు. ఇక రాజస్తాన్ బ్యాటింగ్ అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా యశస్వి జైశ్వాల్, ద్రువ్ జురేల్ లాంటి కుర్రాళ్లు అద్బుతంగా ఆడారు. కానీ గెలుపు ఒక్కరికే దక్కుతుంది.. ఈరోజు రాజస్తాన్దే.'' అని చెప్పుకొచ్చాడు. జైపూర్తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ధోని.. '' జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం నాకు ప్రత్యేకం. నా కెరీర్లో తొలి వన్డే సెంచరీ వైజాగ్లో వచ్చినప్పటికి.. ఈ స్టేడియంలో ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ నా కెరీర్కు టర్నింగ్ పాయింట్. అందుకే జైపూర్ స్టేడియానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మాకు మద్దతిచ్చిన అభిమానులందరికి కృతజ్థతలు'' అంటూ తెలిపాడు. MS Dhoni said "fans will be chasing me this year (smiles), Jaipur has a special place in my heart for my 183*". pic.twitter.com/srXedpHFPA — Johns. (@CricCrazyJohns) April 27, 2023 చదవండి: సీఎస్కేపై ఆధిపత్యం.. ప్రతిష్టాత్మక మ్యాచ్లో గుర్తుండిపోయే విజయం -
'గెలవాల్సిన మ్యాచ్ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం'
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్ 44, బట్లర్ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. అయితే ఒక దశలో 12 ఓవర్లు వరకు వికెట్ కోల్పోని రాజస్తాన్ 87/0తో పటిష్టంగా కనిపించింది. ఈజీగా గెలుస్తుందనుకుంటే స్టోయినిస్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం.. శాంసన్ రనౌట్ కావడం రాజస్తాన్ను ముంచింది. ఆ తర్వాత హెట్మైర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం ఓటమిని ఖరారు చేసింది. ఆఖర్లో పడిక్కల్ ఏదో పోరాడే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ''దాదాపు నాలుగేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాం. జైపూర్లో విజయంతో ప్రారంభించాలనుకున్నాం. కానీ కోరిక నెరవేరలేదు. అయితే ఓడినందుకు పెద్దగా బాధ లేదు. ఇక మంచి ఆరంభం లభించాకా ఓడిపోవడం దురదృష్టకరం. ఈరోజు మా బ్యాటింగ్ లైనఫ్ సరిగ్గా కుదరలేదు. తొలి వికెట్కు శుభారంభం ఇచ్చిన జైశ్వాల్, బట్లర్ స్వల్ప వ్యవదిలో ఔటవ్వడం.. నేను రనౌట్ అవ్వడం జట్టు లయను దెబ్బతీసింది. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 155 పరుగుల టార్గెట్ను చేధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన దశలో పిచ్ కఠినంగా మారిపోయింది. మ్యాచ్ గెలిచామా.. ఓడామా అన్నది పక్కనబెడితే.. కొన్ని పాఠాలు మాత్రం నేర్చుకున్నాం. తర్వాతి మ్యాచ్ల్లో ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడుతాం. ఓడిపోయాం ఇంకేం చేయలేం.. తర్వాతి మ్యాచ్లో చూసుకోవాల్సిందే'' అంటూ ముగించాడు. -
రాజస్తాన్పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్ 44, బట్లర్ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో మెరవగా.. స్టోయినిస్ రెండు వికెట్లు తీశాడు. 18 ఓవర్లలో రాజస్తాన్ 126/4 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. పడిక్కల్ 24, రియాన్ పరాగ్ మూడు పరుగులతో ఆడున్నారు. రాజస్తాన్ విజయానికి 12 బంతుల్లో 29 పరుగులు కావాలి. శాంసన్ రనౌట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 40 పరుగులు చేసిన బట్లర్ భారీ షాట్కు యత్నించి స్టోయినిస్ బౌలింగ్లో బిష్ణోయికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్ రనౌట్ అయి రెండో వికెట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులుగా ఉంది తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 44 పరుగులతో మంచి టచ్లో కనిపించిన యశస్వి జైశ్వాల్ స్టోయినిస్ బౌలింగ్లో ఆవేశ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. బట్లర్ 38, శాంసన్ రెండు పరుగులతో ఆడుతున్నారు. రాజస్తాన్ ఆడుతూ పాడుతూ.. 10 ఓవర్లలో 73/0 లక్నోతో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. బట్లర్ 36, జైశ్వాల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 155.. ఆరు ఓవర్లలో రాజస్తాన్ 47/0 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ను నిలకడగా ఆరంభించింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. జైశ్వాల్ 27, బట్లర్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 155 రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్రాహుల్ 39, పూరన్ 29 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు. 18 ఓవర్లలో లక్నో స్కోరు 129/4 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పూరన్ 10, స్టోయినిస్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. దీపక్ హుడా(2) పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్(39) ఔట్.. తొలి వికెట్ డౌన్ రాజస్తాన్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ హోల్డర్ బౌలింగ్లో బారీ షాట్కు యత్నించి బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. 9 ఓవర్లలో లక్నో స్కోరు 74/0 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 35, కేఎల్ రాహుల్ 36 పరుగులుతో ఆడుతున్నారు. 5 ఓవర్లలో లక్నో స్కోరు 31/0 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 15, కేఎల్ రాహుల్ 14 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో ఇవాళ(బుధవారం) 26వ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టాప్-2లో కొనసాగుతున్నాయి. మరి ఇరుజట్లలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్ #RajasthanRoyals win the toss & elect to bowl as #TATAIPL returns to Jaipur after 4️⃣ long years 😃 Stream #RRvLSG | FREE across telecom operators with #IPLonJioCinema only 🙌#IPL2023 | @rajasthanroyals @LucknowIPL pic.twitter.com/KxGnLncLv7 — JioCinema (@JioCinema) April 19, 2023 అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో గెలుపెవరిదన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా లక్నోతో పోలిస్తే రాజస్థాన్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. సొంత మైదానంలో ఆడటం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. లీగ్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్ల్లో రాజస్థానే విజయం సాధించింది. -
షూటింగ్లో పాల్గొనడం సంతోషం
‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్ కోసం జైపూర్కు వచ్చాను. తిరిగి షూటింగ్స్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు నటి సుష్మితాసేన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్కు ఓ మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఆర్య’ వెబ్ సిరీస్లోని మూడో సీజన్ కోసం సుష్మితాసేన్ ప్రస్తుతం జైపూర్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్ సిరీస్కు రామ్మద్వానీ, సందీప్ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్ ‘తాలి’ అనే మరో వెబ్సిరీస్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్ని గత నెలలో పూర్తి చేశారామె. -
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు.. పేలుళ్ల కేసు నిందితుల ఉరిశిక్ష రద్దు..
జైపూర్: రాజస్థాన్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 71 మంది మరణించి, 180 మంది గాయపడిన 2008 జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నిందితుల్లో నలుగురికి ఉరిశిక్షను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 2019 డిసెంబర్లోనే వీరికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం. నలుగురు నిందుతుల పేర్లు.. మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సైఫురెహ్మాన్ అన్సారీ. జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్తో కూడిన డివిజన్ బెంచ్ 28 అప్పీళ్లను ఆమోదించి ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. వరుస పేలుళ్లతో జైపూర్ షేక్.. 2008 మే 13న జైపూర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ ఘటనల్లో మొత్తం 71 మంది చనిపోయారు. 180మందికిపైగా గాయపడ్డారు. ఓ సైకిల్పై ఉన్న స్కూల్ బ్యాగ్లో లైవ్ బాంబు కూడా లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 8 ఎఫ్ఐర్లు నమోదయ్యాయి. 1,293 మంది సాక్షులను విచారించారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉన్నారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇద్దరు బత్లా హౌస్ ఎన్కౌంటర్లో హతమయ్యారు. నలుగురు జైపుర్ జైల్లో ఉన్నారు. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్లో జైపూర్లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
ప్రపంచ ఆటో తయారీ హబ్గా భారత్
న్యూఢిల్లీ: భారత్ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్) ప్లాంటును వర్చువల్గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్లో టాటా మోటార్స్ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్ ఆటో తయారీ కేంద్రంగా భారత్ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు. -
షీ ఈజ్ అన్స్టాపబుల్
నేవీ వెల్నెస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, నౌకాదళానికి చెందిన వివిధ విభాగాల మహిళలు ‘షీ ఈజ్ అన్స్టాపబుల్’ నినాదంతో ఈ నెల 14న దిల్లీలోని వార్ మెమోరియల్ నుంచి కారు యాత్ర చేపట్టారు. వివిధ నగరాల గుండా సాగిన ఈ కారు యాత్ర మహిళా యోధుల విజయాలను ప్రచారం చేస్తోంది. జైపూర్లోని ఒక కళాశాలలో... నావికా దళానికి చెందిన పాయల్ గుప్తా వికాస్ శ్రేయాన్, కుషాల్ పండేకర్లు గోవా నుంచి పోర్ట్ లూయిస్ (ఈస్ట్ ఆఫ్రికా) వరకు చేసిన సంచలన సముద్ర యాత్ర గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొని 21 రోజుల పాటు 4.500 కి.మీ నాస్స్టాప్గా సాగిన ఈ సాహస సముద్రయాత్ర గురించి విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు నేవీలో చేరడానికి అవసరమైన విద్యార్హతల గురించి ఆసక్తిగా అడిగారు. బికనేర్లోని ఒక స్కూల్లో... లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి నేతృత్వంలో లెఫ్టినెంట్ కమాండర్లు ప్రతిభ జమ్వాల్, స్వాతి, విజయాదేవి, ఐశ్వర్య, పాయల్గుప్తాలు దేశీయంగా తయారుచేసిన ఐఎన్ఎస్వీ తరిణి నౌక ద్వారా వివిధ దేశాలు చుట్టి వచ్చిన ‘నావికా సాగర్ పరిక్రమ’ గురించి ‘షీ ఈజ్ అన్స్టాపబుల్’ బృందం చెప్పింది విన్న తరువాత విద్యార్థులు చప్పట్లు కొట్టారు. తమకు కూడా అలాంటి సాహసాలు చేయాలని ఉందని మనసులో మాట చె΄్పారు. నావికాదళానికి సంబంధించి మహిళల సాహసగాథలు మాత్రమే కాకుండా అలనాటి స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను చెప్పి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గుర్తు తెచ్చుకుంది ఈ బృందం. ఇలా ఎన్నో పట్టణాలలో స్కూల్, కాలేజీ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి నావికాదళ ప్రాముఖ్యత, నావికాదళంలో ఉద్యోగావకాశాల గురించి తెలియజేయడం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాస కోణంలో ఈ బృందం సభ్యులు స్ఫూర్తిదాయకమై ఉపన్యాసాలు ఇచ్చారు. లైఫ్స్కిల్స్ గురించి వారికి అర్థమయ్యే భాషలో వివరించారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలను సందర్శించి అక్కడ ఉంటున్న వారితో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళల సముద్ర సాహసయాత్రలు ఆయా కాలాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ఆ యాత్రలలో ఎన్నో కథలు దాగున్నాయి. శక్తిమంతమైన స్ఫూర్తి ఉంది. వీటిని ప్రజలకు చేరువ చేయడం ‘షీ ఈజ్ అస్స్టాపబుల్’ యాత్ర ముఖ్య ఉద్దేశం. వచ్చిన స్పందన చూస్తే యాత్ర ఉద్దేశం నెరవేరిందని చెప్పవచ్చు. ‘నారీశక్తి స్ఫూర్తిని ప్రజల చెంతకు తీసుకువెళ్లడానికి, నావికాదళంలో చేరాలనే ఉత్సాహాన్ని యువతలో కలిగించడానికి ఈ యాత్ర ఉపయోగపడింది’ అంటున్నారు వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. 2,300 కి.మీల ఈ ఆల్–ఉమెన్ కారు యాత్ర ఈరోజు దిల్లీలో ముగుస్తుంది. -
లతా మంగేష్కర్ నా సినిమా జీవితానికి ఆమె వీసా ఇచ్చింది
‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు. శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను. లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు. ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్కు ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు. లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది. -
పేరెంటింగ్: కూతురు నేర్పిన పాఠం
‘పిల్లలతో స్నేహంగా ఉండండి. వాళ్లు తల్లిదండ్రులకు భయపడేలా ఉంచకండి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి’ అంటున్నారు సుధామూర్తి. 15 ఏళ్ల వయసున్నప్పుడు 45 ఏళ్లు ఉన్న తనకు తన కూతురు అక్షత నేర్పిన పాఠం వల్ల తాను ఈ రోజు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు. ‘పిల్లలకు తమ మీద తాము ఆధారపడటం నేర్పాలి. ఆనందం పొందడం నేర్పించాలి. నా తల్లిదండ్రుల నుంచి అదే నేర్చుకున్నాను. నా పిల్లలకూ అదే నేర్పాను’ అన్నారు సుధామూర్తి. జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొని తల్లిదండ్రులను, యువతను ఉద్దేశించి తన పుస్తకాల నేపథ్యంలో మాట్లాడారు. ‘పిల్లల నుంచి తల్లిదండ్రులు... తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలి. అలా జరగాలంటే ఇద్దరి మధ్య భయం లేని సంభాషణ జరిగే వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేలా ఉంటే తమ మనసులోది చెప్పకుండా ఉంటారు. అప్పుడు ఇరుపక్షాలకూ నష్టం జరుగుతుంది’ అన్నారు సుధామూర్తి. తొలికాలపు మహిళా ఇంజినీర్గా, ఇన్ఫోసిస్ దిగ్గజంగా తనకు ఉన్న గుర్తింపు కంటే పుస్తకాలు రాయడం ద్వారా ‘దేశానికి అమ్మమ్మ’గా తనకు వస్తున్న గుర్తింపు, తన రాతలూ మాటలూ నవతరం వింటున్న తీరు తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారామె. జైపూర్లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం క్రిక్కిరిసిన పాఠకుల మధ్య ‘మై బుక్స్ అండ్ బిలీఫ్స్’ అనే అంశం మీద మాట్లాడారు. ► ఆడపిల్ల గొప్పతనం ‘ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదని నేను నిరూపించదల్చుకున్నాను. మా నాన్న డాక్టర్. నేను డాక్టరైతే బాగుంటుందని అనుకున్నాడు. మా అమ్మ లెక్కల టీచర్. నేను కూడా లెక్కలు టీచరు అయితే సరిపోతుందని భావించింది. కాని నేను అప్లయిడ్ సైన్స్లో ఇంజినీరింగ్ చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇంజినీరింగ్ మగవారి విద్య అని అప్పటివరకూ భావన. మా నానమ్మ నేను ఇంజినీరింగ్ చదివితే తమ ఇళ్లల్లో కుర్రాళ్లు ఎవరు పెళ్లి చేసుకుంటారని హడలిపోయింది. ఆడపిల్లలు ఇంజినీరింగ్ చేస్తారని తెలియక నేను చదివిన కాలేజీలో లేడీస్ టాయిలెట్ కట్టలేదు. నేను చేరాక కూడా ఈ సెమిస్టర్ అయ్యాక మానేస్తుంది వచ్చే సెమిస్టర్లో మానేస్తుంది అని కట్టలేదు. నేను మానలేదు. పట్టుదలగా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు... అందరిది... అదే నేను నిరూపించాను. ఏ ఇంటి అమ్మాయిలైనా ఇలాంటి పట్టుదలతో ఉండాలి. మీ మీద మీరు ఆధారపడి ముందుకు పోవాలి’ అందామె. ► కూతురి పాఠం ‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక నేను మంచి ఇంజనీర్ని అనిపించుకోవాలని... మగవాళ్ల కంటే బాగా పని చెయ్యాలని ఉద్యోగంలో విపరీతంగా కష్టపడేదాన్ని. (భర్త నారాయణమూర్తితో) ఇన్ఫోసిస్ స్థాపించాక లాభాల గురించి పత్రికల్లో వార్తలు వచ్చినా పిల్లలకు అది పెద్ద విషయంగా చూపేదాన్ని కాదు. అంతేకాదు, పది రూపాయలు పిల్లలకు ఇచ్చినా లెక్క అడిగేదాన్ని. ఇలా ఉండగా నా కూతురు అక్షత, అప్పుడు 15 ఏళ్లు ఉంటాయి, తనకు తెలిసిన ఒక పేద పిల్లాడికి కాలేజీలో సీటు వచ్చిందని, ఆ అబ్బాయిని స్పాన్సర్ చేయమని నన్ను అడిగింది. నేను నా పని హడావిడిలో ఆ మాట విని– నువ్వు స్పాన్సర్ చెయ్ అనేశాను తేలిగ్గా. దానికి నా కూతురు భయపడకుండా– అమ్మా... నీకు 45 ఏళ్లు వచ్చాయి. మంచి స్థితిలో ఉన్నావు. ఆదాయం ఉంది. ఒకరికి సాయం చేయగలవు. నాకు నువ్వు పాకెట్ మనీ కూడా ఇవ్వవు. కాని సాయం చేయమనేసరికి నన్ను చేయమంటున్నావు. చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు చేయలేనప్పుడు ఇంకొకరు సాయం చేయాలని ఆశించకు అంది. ఆ రోజు ఆఫీస్కు వెళ్లి అలా కూర్చుండిపోయాను. రెండు రోజులు ఆ మాటలు వెంటాడాయి. దాని నుంచే నా ఫౌండేషన్ పుట్టింది. ఫలితం? ఎందరో పేదలకు సాయం చేస్తున్నాను. ఎదుటివాళ్లకు సాయం చేయడంలోని ఆనందం నా కూతురి వల్లే పొందడం నేను నేర్చుకున్నాను’ అందామె. ► పోల్చి చూసుకోవద్దు ‘పిల్లలకు ఇంకొకరితో పోల్చి చూసుకోవడం నేర్పించవద్దు. నా కొడుక్కు నాలుగో ర్యాంకు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాణ్ణి కంగ్రాచ్యులేట్ చేయమన్నాను. నేను చేయను... వాడు నాకు పోటీ అన్నాడు. మన కంటే బాగా పని చేసేవారు ఎప్పుడూ ఉంటారు... మన కంటే ప్రతిభ ఉన్నవారిని చూసి ఈర్ష్య పడటం మంచి అలవాటు కాదు అని నేర్పించాను. పిల్లలకు తమతో మాత్రమే తాము పోల్చుకుని చూసుకోవాలని చెప్పాలి. నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా అని చెక్ చేసుకుని ఎదిగేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో అని చెప్పాలి’ అన్నారామె.‘తల్లిదండ్రులు పిల్లలకు దేశం తిప్పి చూపించాలి. మన దేశాన్ని అర్థం చేయిస్తే వారు తాము తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు. ఒంటి మీద చొక్కాలేని పేదలే ఈ దేశాన్ని నిజంగా అర్థం చేయిస్తారు అనే మాట పిల్లలకు చెప్తే దేశం కోసం వాళ్లు ఏం చేయాలో తోటివారికి ఎలా సాయం చేయాలో తెలుసుకుంటారు’ అని ముగించారామె. ‘నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో’ అని చెప్పాలి. – సుధామూర్తి – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నటి గాయత్రి
తమిళ సినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా గాయత్రి అవార్డును గెలుచుకున్నారు. గ్లామర్కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న నటి గాయత్రి. ఇటీవల కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన సూపర్ హిట్ చిత్రం విక్రమ్లోనూ నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలోను ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. కాగా ఇటీవల నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించిన మామనిదన్ ,ఇత్రం గత ఏడాది జూన్లో విడుదలై మంచి చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అనంతరం ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. శీనూ రామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన చెన్నై అంతర్జాతీయ చతురత్వాల్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. తాజాగా జైపూర్లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మామనిదన్, ఇరైవిన్ విశాల్, గార్గీ, విత్రన్ త్రాలను ప్రదర్శించారు. కాగా మామనిదన్ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన గాయత్రి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆమెను చిత్ర దర్శకుడు శీను రామసామితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. -
కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్
జైపూర్: చైనా మన మీదకి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా నుంచి మనకు ముప్పు ఉందని రెండు, మూడేళ్లుగా నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. కానీ కేంద్రం దాన్ని దాచి పెడుతూ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 20 మంది సైనికుల ప్రాణాలు తీసింది. అరుణాచల్ ప్రదేశ్లో మన జవాన్లను కొట్టింది. లద్దాఖ్, తవాంగ్లో ఘర్షణలు జరిగాయి. ఇన్ని జరిగినా మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోంది’’ అంటూ ధ్వజమెత్తారు. చైనా ఆయుధ సంపత్తి, వాటిని నియోగిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. బీజేపీని ఓడించేది మేమే కాంగ్రెస్ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, ఎప్పటికైనా బీజేపీని ఓడించేది తమ పార్టీయేనని రాహుల్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పనైపోయిందంటున్నారు. కానీ బీజేపీ ఎప్పటికైనా కాంగ్రెస్ చేతిలోనే ఓడుతుంది. కాంగ్రెస్కు కోట్లాది మంది కార్యకర్తల బలముంది. వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకుంటే రాజస్థాన్లో అఖండ విజయం ఖాయం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి నేతల నిష్క్రమణను మీడియా ప్రస్తావించగా, ‘పోయేవాళ్లందరినీ పోనిస్తాం. కాంగ్రెస్పై నమ్మకమున్న వాళ్లే మాతో ఉంటారు’’ అన్నారు. బీజేపీకి బీ టీమ్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ–టీమ్గా మారిందని రాహుల్ ఆరోపించారు. ఆప్ లేకుంటే గుజరాత్ ఎన్నికల్లో గెలిచే వాళ్లమన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్ఫథం లేదు. దేశానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది కాంగ్రెస్కు మాత్రమే తెలిసిన విద్య. వచ్చే ఎన్నికల్లో ఇతర విపక్షాలతో కలిసి పని చేస్తాం. మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అన్నారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తదితరులు రాహుల్తో కలిసి నడిచారు. ‘నెహ్రూ భారత్’ కాదిది: బీజేపీ న్యూఢిల్లీ: చైనా యుద్ధానికి వస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పి కొట్టింన్నిలాంటి మాటలతో సైనికుల స్థైర్యాన్ని రాహుల్ దెబ్బ తీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. ‘‘1962లో మనపై చైనా యుద్ధానికి కాలుదు వ్వినప్పటి నెహ్రూ కాలపు భారత్ కాదిది. మోదీ నేతృత్వంలోని కొత్త నవీన భారత్. కయ్యానికి కాలు దువ్వే వాళ్లకు గట్టిగా జవాబిస్తాం’’ అన్నారు. -
పెళ్లి పీటలు ఎక్కనున్న హన్సిక.. వరుడు ఎవరో తెలిసిపోయింది
హీరోయిన్ హన్సిక మోత్వాని త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు తెలుస్తోంది. సోహాల్ కతూరియా అనే వ్యాపారవేత్తతో చాలాకాలంగా డేటింగ్లో ఉన్న హన్సిక డిసెంబర్4న వివాహం చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైనట్లు సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. రాజస్థాన్ జైపూర్లోని ముండోటా ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందట. ఇక హన్సిక ప్రియుడు సోహాల్ కతూరియా విషయానికి వస్తే.. ముంబైలోని బడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. చాలాకాలం నుంచి హన్సికకు అతనితో మంచి అనుబంధం ఉందట. అంతేకాకుండా అతని కంపెనీలోనూ హన్సిక షేర్స్ ఉన్నట్లు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతకాలంగా డేటింగ్లో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్యాలెస్లో జరగనున్న పెళ్లి వేడుక కోసం ఇప్పటికే గదులు కూడా బుక్ చేసినట్లు సమాచారం. -
ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...
జైపూర్: వెండి ఆభరణాల కోసం ఒక దొంగల ముఠా ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి కాలుని దారుణంగా నరికేశారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వృద్ధురాలు ఆరు బయట నిద్రిస్తున్నప్పుడు ఒక దొంగల ముఠా వెండి వస్తువుల కోసం ఏకంగా కాలుని నరికి వెళిపోయారు. ఈ విషయాన్ని ఇంటి ఓనర్ తెలియజేయడంతో తమకు తెలిసిందని బాధితురాలి మనవరాలు చెబుతోంది. ఆమె వచ్చి చూసేసరికి వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు భాధితురాలిని గంగా దేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై పలు గాయాలన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తెల్లవారుజామున తమకు ఈ విషయమై కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి సుమారు 100 ఏళ్లు ఉండవచ్చని, చాలా తీవ్రంగా గాయపడిందని అన్నారు. ఈ మేరకు పోలీసులు భాదితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం) -
రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (చదవండి: ఘోర ప్రమాదం..గోడ కూలి 10 మంది దుర్మరణం) -
లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు!
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్స్టా యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్స్టాని వాడడంతో అందులో బగ్ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్ గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జైపూర్కు చెందిన విద్యార్థి నీరజ్ శర్మ.. తన ఫోన్లో ఇన్స్టా వాడుతుండగా అందులో ఓ బగ్ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్ లాగిన్, పాస్వర్డ్ లేకుండా అతని ఖాతాలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ థంబ్నైల్స్ మార్చేందుకు ఈ బగ్ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్బుక్ శర్మకి $45,000 రివార్డ్ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
హోం మంత్రి మఫ్లర్ ఖరీదు రూ.80 వేలు: గహ్లోత్
జైపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేసుకునే మఫ్లర్ ఖరీదు రూ.80 వేలు కాగా, కాషాయ పార్టీ నేతలు రూ.2.5 లక్షల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తున్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో బీజేపీలో ఆందోళన మొదలైందన్నారు. ప్రధాని, హోం మంత్రి, బీజేపీ నేతలు విధులను వదిలేసి, రాహుల్ గాంధీపై దాడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ రూ.41 వేల విదేశీ టీ షర్టు వేసుకున్నారన్న బీజేపీ వ్యాఖ్యలపై గహ్లోత్ ఈ మేరకు స్పందించారు. చదవండి: (భర్తకు ట్రాన్స్వుమన్తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..) -
అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ..
ఇంట్లో పెద్దపిల్లలు వాడిన ఆట వస్తువులు, పొట్టి అయిన, బిగుతైన బట్టలు, పై తరగతికి వెళ్లిన అక్క లేదా అన్నయ్య పుస్తకాలను తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వడమనేది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న పద్ధతి. చిన్నవాళ్లకు కూడా ఆ బట్టలు పొట్టి అయినప్పుడు ఇల్లు తుడిచే మాప్గానో, మసిబట్టగానో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పద్దతికి టెక్స్టైల్స్ పరిశ్రమలు మరికొన్ని కొత్త హంగులు జోడించి రీసైక్లింగ్ పేరిట ఆకర్షణీయమైన ఉత్పత్తులను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్నాయి. రీసైక్లింగ్ చేసిన ఫ్యాషన్ ఉత్పత్తుల క్రేజ్ను గుర్తించిన రిని మెహత.. పాత చీరలతో అందమైన బ్యాగ్లను రూపొందించి పిటారా పేరుతో విక్రయిస్తోంది. సంప్రదాయ బ్యాగ్లతోపాటు, లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా ఫ్యాషన్ ఉత్పత్తులు అందించడం పిటారా ప్రత్యేకత. పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్థాలను జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న పిటారా గురించి రిని మెహతా మాటల్లో... ‘మాది జైపూర్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకంగా ఉండడం ఇష్టం. నా మనసులో వచ్చే అనేక క్రియేటివ్ ఆలోచనలు బ్లాక్బోర్డు మీద రాస్తుండేదాన్ని. అలా రాస్తూ కాస్త పెద్దయ్యాక సొంతంగా తయారు చేసిన కార్డులను ఎగ్జిబిషన్స్లో ప్రదర్శనకు ఉంచే దాన్ని. నా ఆలోచనలు, అభిరుచులను పట్టించుకోని అమ్మానాన్నలు నన్ను ఎమ్బీఏ చేయమని పట్టుబట్టారు. వారికోసం ఎమ్బీఏలో చేరాను కానీ, పూర్తిచేయలేదు. ఆ తరువాత క్రియేటివ్ రంగంలో పనిచేయాలన్న దృఢసంకల్పంతో.. టెక్స్టైల్ డిజైనర్గా పనిచేయడం ప్రారంభించాను. కొన్నాళ్లు డిజైనర్గా పనిచేశాక నేనే సొంతంగా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘పిటారా’. తమ్ముడు లా వదిలేశాడు.. కట్టుకోవడానికి పనికిరాని పాతచీరలతో బ్యాగ్లు తయారు చేసి విక్రయించవచ్చు అని తమ్ముడు రోహన్ మెహతాకు చెప్పాను. నా ఐడియా వాడికి బాగా నచ్చింది. దీంతో రోహన్ లా ప్రాక్టీస్ను వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి పిటారాను ప్రారంభించాము. పిటారా అంటే ‘ట్రెజరీ బాక్స్’ అని అర్థం. ప్రారంభంలో ఇంట్లో మూలుగుతోన్న పాత చీరలతో బ్యాగ్లు తయారు చేసే వాళ్లం. క్రమంగా ఇంట్లో పాత చీరలన్నీ అయిపోయాయి. తరువాత మేము తయారు చేస్తోన్న ఉత్పత్తుల గురించి మా కాలనీలో వాళ్లకు, సోషల్ మీడియాలోనూ వివరించడంతో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా చీరలు ఇచ్చిన వారికి కూపన్లు ఇచ్చే వాళ్లం. ఆ కూపన్లను మా స్టోర్లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడుకునే విధంగా ఏర్పాటు చేశాం. అన్నీ హ్యాండ్మేడే.. మా పిటారా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే. వాటిలో రాజస్థానీ కళ, సంస్కృతీ సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మా బ్యాగ్లలో బగ్రు, జర్దోసి ప్రింట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిదీ యంత్రాలతో తయారు చేస్తున్నారు. మేము మన సంస్కృతిని వెనక్కి తీసుకు రావడంతోపాటు, కళాకారులకు ఉపాధి కల్పించాలనుకున్నాము. అందుకే మా బామ్మ వాలెట్ను ప్రేరణగా తీసుకుని అప్పట్లో వాడిన బ్లాక్, ఇక్కత్ ప్రింట్ వస్త్రంతో వివిధ రకాల టెక్నిక్లను వాడి డిజైన్లు రూపొందించి ఇప్పటి ట్రెండ్కు నప్పేవిధంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు జోడించి రోజువారి వాడుకునే వస్తువులను రూపొందిస్తున్నాం’ అని వివరిస్తోంది రిని మెహతా. సృజనాత్మక ఆలోచనా విధానం ఉండాలే గానీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనడానికి రిని మెహతా పిటారా ఉదాహరణగా నిలుస్తోంది. సవాలుగా అనిపించినప్పటికీ.. వ్యాపారం ఏదైనా ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభంలో మా వద్దకు వచ్చిన వ్యర్థాలను లగ్జరీ ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం సవాలుగా అనిపించింది. తరువాత మొత్తం వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడం మొదలు పెట్టాం. లెదర్, జూట్, జరీలను విడివిడిగా తీసి వాటిని అవసరమున్న వాటి దగ్గర వాడేవాళ్లం. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బ్యాగ్లు తయారు చేయడంతో మా ఉత్పత్తులకు మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో రంగురంగుల హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, టాట్స్, క్రాస్బాడీ బ్యాగ్స్, పాస్పోర్టు కవర్స్, సన్గ్లాస్ కేసెస్, టిష్యూ బాక్సెస్, హ్యాంగర్స్, ట్రావెల్ పౌచ్లు వంటివి అనేకం తయారు చేసి విక్రయిస్తున్నాం. మనం బతకడానికి పర్యావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణాన్ని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్తో కాలుష్యమయం చేసేకంటే వాటిని మరో విధంగా వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాము. చదవండి: చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ.. -
ఈ దొంగలు మహాముదుర్లు.. 'ఎమ్మెల్యే' కారునే ఎత్తుకెళ్లారు!
జైపూర్: ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆయన చుట్టూ పటిష్ఠ భద్రత ఉంటుంది. ఆయన ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తుంటారు. 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. అయితే.. అవేమీ తమను అడ్డుకోవన్నట్లు అలాంటి ఇంటికే కన్నం వేశారు దొంగలు. ఎమ్మెల్యే కారునే మాయం చేశారు. రాజస్థాన్లోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఎమ్మెల్యే నారయన్ బెనివాల్కు చెందిన ఎస్యూవీ కారు చోరీకి గురైంది. జైపూర్లోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన అపార్ట్మెంట్ ముందు నిలిపి ఉంచిన కారును శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్తో పాటు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఎస్హెచ్ఓ శ్రీమోహన్ మీనా. చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పోలీసులపై ఎమ్మెల్యే ఆరోపణలు.. 'ఎప్పటిలాగే వివేక్ విహార్ ప్రాంతంలోని మా అపార్ట్మెంట్ ముందు వాహనాన్ని నిలిపాము. తెల్లవారి వచ్చి చూసే సరికి అక్కడ లేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఒక ఎమ్మెల్యే వాహనం ఈవిధంగా చోరీకి గురవుతుందా? ఒక సాధారణ పౌరుడి పరిస్థితేంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ దొంగలు దర్జాగా తిరుగుతున్నారు. ' అని ఎమ్మెల్యే బెనివాల్ ఆరోపించారు. ఇదీ చూడండి: Hyderabad: కొండాపూర్ పబ్లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్పై పిడిగుద్దులు -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో శనివారం జైపూర్లో మేజర్ మూవీ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్గా మారింది. అలాగే సినిమాలో మేజర్ సందీప్ను చూసి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కోడుతూ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో అడివి శేష్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘జైపూర్.. థియేటర్లో సినిమా చూస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహై! నా కెరీర్లో ఇదో గొప్ప క్షణం’ అంటూ అడివి శేష్ రాసుకొచ్చాడు. కాగా జైపూర్లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్కు చూసేందుకు 100 మందికి పైగా జవాన్లు థియేటర్కు వచ్చారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్ మూవీ టీం జవాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది. కాగా ఈ సినిమాను మహేశ్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX — Adivi Sesh (@AdiviSesh) May 28, 2022 -
అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు.. కారణం?
జైపూర్: ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత.. కానీ అందుకు భిన్నంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు అత్తారింట్లో మాత్రం గెలవలేకపోతున్నారు. ప్రపంచాన్ని జయించగలుగుతున్న నారీమణులు ఇంట్లో అత్తామామల పోరుకు బలైపోతున్నారు. కట్నం, అదనపు కట్నం వివాదాల్లోనే సగం మంది మహిళల జీవితాలు గతించిపోతున్నాయి. వరకట్న వేధింపులకు ఎంతో మంది ఆత్మహత్య, హత్యలకు గురవుతున్నారు. తాజాగా కట్న దాహానికి అయిదు నిండు ప్రాణాలు బలయ్యాయి. మృతుల్లో గర్భిణిలు, చిన్నారులు ఉండటం మరింత కలిచివేసే విషయం. ఈ అమానుష ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. జైపూర్ జిల్లాలోని డుడు ప్రాంతంలో శనివారం ముగ్గురు మహిళలతో సహా అయిదుగురు మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు. ఇందులో ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులున్నారు. అలాగే మహిళల్లో ఇద్దరు ప్రస్తుతం గర్భిణీలు. ముగ్గురు మహిళలు కాలు దేవి(27), మమతా(23) దేవి, కమలేష్(20) అక్కాచెల్లెల్లుగా గుర్తించారు. నాలుగేళ్ల చిన్నారి, 27 రోజుల శిశువును కాలుదేవి పిల్లలుగా గుర్తించారు. ముగ్గురు అక్కాచెల్లెల్లు బాల్య వివాహ బాధితులే. పెద్దగా చదువుకోని, మద్యం అలవాటు ఉన్న ముగ్గురు అన్నదమ్ములతో వీళ్ల వివాహాలు జరిగాయి. ముగ్గురు సోదరీలు గృహసింసకు గురవుతున్నట్లు తెలిసింది. చిన్న సోదరి కమలేష్ ఏడాది వయసున్నప్పుడే కాలుదేవికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఉన్నతంగా జీవించాలని ఆశపడ్డ ముగ్గురూ.. చాలా కష్టపడి చదువుకున్నారు. వీరిలో మమత పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించింది. పెళ్లైన తర్వాత కూడా చదవును కొనసాగిస్తున్న కాలు ప్రస్తుతం బీఏ చదువుతోంది. ఎనిమిది నెలల గర్భవతి అయిన చిన్న చెల్లెలు కమలేష్ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది. కాలు దేవిని అత్తామామలు కొట్టడంతో 15 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగొచ్చింది. అయితే కాలు తన ఇద్దరు పిల్లలతోపాటు మమతా, కమలేష్ అయిదుగురు మార్కెట్కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం మిస్సింగ్ కేసు నమోదవ్వగా.. శనివారం విగతజీవులుగా తేలారు. ఇంటికి సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలోని బావిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు సోదరులు నర్సి, గోరియో, ముఖేష్లను అరెస్టు చేశారు. మహిళలు, వారి పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేక వరకట్న వేధింపులతో భర్తలు, అత్తమామలే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్తకు దూరంగా భార్య.. అనుమానాస్పద మృతి.. మరిదే కారణమంటూ.. -
ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం
జైపూర్: దేశంలో తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతోందని.. సుపరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని, ప్రతిపక్షాలు విసిరే వలలో చిక్కుకోవద్దని సూచించారు. ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయని, బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. శుక్రవారం రాజస్తాన్లోని జైపూర్లో నిర్వహించిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చిందని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మనకు దేశభక్తే స్ఫూర్తి ‘‘బీజేపీ అభివృద్ధి కోసం తపన పడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నాయి. సమాజంలోని చిన్నపాటి ఉద్రిక్తతలు, బలహీనతలను అడ్డం పెట్టుకొని మరింత విషం చిమ్ముతున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి శక్తులు, పార్టీల నుంచి కాపాడుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలి. జన సంఘ్ కాలం నుంచి దేశభక్తి, జాతి ప్రయోజనాలు, జాతి నిర్మాణమే మన విధానం, కార్యక్రమంగా కొనసాగుతోంది. అభివృద్ధి, విశ్వాసంపై బీజేపీ దృష్టి పెట్టడానికి దేశభక్తే స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి షార్ట్కట్లు మనకు వద్దు. మనం వేసే అడుగులు దారి తప్పకూడదు. మాట తూలకూడదు. అభివృద్ధి, సామాజిక న్యాయం, భద్రత పేదల సంక్షేమం, వారి జీవనాన్ని సరళతరం చేయడమే మనకు ముఖ్యం. పేదల సాధికారత కోసం కృషిని కొనసాగించాలి. మన మార్గం నుంచి పక్కకు వెళ్లకూడదు. మన దృష్టిని మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని లెక్కచేయాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా అభివృద్ధికే కట్టుబడి ఉండాలి. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధారించుకుంటోంది. పార్టీపరంగా కూడా 25 ఏళ్లకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. ఎన్డీయే ప్రభుత్వానికి ఈ నెలలోనే 8 ఏళ్లు నిండుతాయి. ఈ 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం. పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం. సమతుల అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రత కల్పించాం. దేశంలో భాషల ప్రాతిపదికగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇదే నిదర్శనం. భాషా వైవిధ్యం దేశానికి గర్వకారణం. ఇప్పుడు ప్రపంచమంతా గొప్ప అంచనాలతో భారత్ వైపు చూస్తోంది. అలాగే భారత్లోనూ ప్రజలు బీజేపీపై ప్రత్యేకమైన అనురాగం కురిపిస్తున్నారు. గొప్ప నమ్మకం, ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, బలోపేతం చేయడానికి వంశపారంపర్య పార్టీలపై బీజేపీ పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ విషయంలో బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలి’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
ప్రజల ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను మరింత పెంచుతున్నాయి: మోదీ
-
బారాత్లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు
జైపూర్: రాజస్థాన్లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు. రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
Tina Dabi: ఆమెది మళ్లీ లవ్ మ్యారేజ్!
అందమైన ఆఫీసర్గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ ప్రదీప్ గవాండే వివాహంతో శుక్రవారం ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, బంధువులు సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. టీనా, ప్రదీప్ల మ్యారేజ్ మరాఠీ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ కార్యక్రమంలో టీనా తెలుపు, బంగారు రంగు చీర ధరించగా, ప్రదీప్ కూడా తెల్లటి కుర్తా-పైజామాలో కనిపించాడు. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2015 ఐఏఎస్ బ్యాచ్లో టాపర్ అయిన టీనా దాబీ, డాక్టర్ ప్రదీప్ గవాండే (2013 ఐఏఎస్ బ్యాచ్) మే 2021లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ జంట ప్రేమ మొదట స్నేహంతో ప్రారంభమైంది. టీనా, ప్రదీప్ కలిసి పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టీనా దాబి తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు మార్చిలో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్త, రాజస్థాన్కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండే అని వెల్లడించింది. దుమారం రేపిన మొదటి వివాహం.. తర్వాత విడాకులు.. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన టీనా దాబి.. 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్లో టాపర్. అయితే రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. ఇక 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. -
పురాణ స్త్రీల మరో అన్వేషణ
‘నేను రాసిన మహా భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఉంటుంది... కాని శ్రీ కృష్ణుడు వచ్చి దుస్తులు ఇవ్వడు... ద్రౌపది తానే ఆ ఘట్టాన్ని ఎలా ఎదుర్కొని ఉంటుందో రాశాను’ అంటుంది ఇరా ముఖోటి. మహా భారతాన్ని అందులోని స్త్రీ పాత్రల కోణంలో వ్యాఖ్యానిస్తూ ఇరా ముఖోటి రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ ఎన్నో ఆలోచనలు రేపుతోంది. ప్రశంసలూ పొందుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నేచురల్ సైన్సెస్ చదివిన ఇరా పురాణ స్త్రీలను పునర్దర్శించే పనిలో ఎందుకు పడిందో ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాఠకులతో పంచుకుంది. ‘సమాజం చాలా ఆధునిక స్థాయికి చేరింది. ఇంగ్లిష్ భాషలో మాట్లాడి ఆలోచించే వర్గం మన దేశంలో స్థిరపడింది. అదే సమయంలో ప్రతి ఇల్లూ మూలాలకు దూరంగా జరుగుతూ ఏకాకిగా మారుతోంది. అలాంటి సమయాలలో పురాణాల వైపు చూసి వాటిని మళ్లీ చదవడం ద్వారా అంతో ఇంతో ఓదార్పు పొందడం జరుగుతోంది. పురాణాలను మళ్లీ వ్యాఖ్యానిస్తూ ఇంగ్లిష్లో వస్తున్న రచనలను కూడా అలాగే చూడాలి’ అంటుంది ఇరా ముఖోటి. ఫార్మస్యూటికల్ రంగంలో చాలా ఏళ్లు ఉన్నతోద్యోగం చేసిన ఇరా రచన పట్ల తన ఆసక్తిని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఒక దశలో ఉద్యోగం మానేసి గమ్యం లేనట్టుగా తిరుగుతూ రచయితగా ఉండటమే తన నిర్ణయంగా బలపరుచుకుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం వైపు చూళ్లేదు. ఫుల్టైమ్ రైటర్గా మారిపోయింది. ‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా కూతుళ్లు ఇద్దరూ చిన్నవాళ్లు. వాళ్లను తీసుకుని ప్రతి సంవత్సరం రామ్లీల చూడటానికి వెళ్లేదాన్ని. నాటకం చివరలో సీత రాముడి పక్కన సింహాసనం పై కూచోవడం చూసి నా కూతుళ్లు చప్పట్లు కొట్టేవాళ్లు. నాకు అనిపించేది... సీత అలా కూచోవడం వెనుక ఎన్ని సవాళ్లను ఎదుర్కొంది.. ఎన్ని పరీక్షలకు తల ఒంచింది... ఇవన్నీ నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనిపించేది. సీత ఎంతో ఆదర్శప్రాయమైన స్త్రీ. ఆమెకు కష్టాలు తప్పలేదు. అదే సమయంలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. అది నా మనసు కలచి వేసేలా చేసింది. స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా, ఎంత ముందంజ వేసినా వారిపై దాష్టీకాలు ఉంటాయి అనిపించింది. ఆ సమయంలోనే పురాణపాత్రలను మళ్లీ రాయాలనుకున్నాను. వెంటనే ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల రాశాను.’ అందామె. అలా రైటర్ అయిన ఇరాను ఆమె పబ్లిషర్ ప్రోత్సహించాడు. ‘నీకు చరిత్ర అవగాహన బాగా ఉంది. ముందు హిస్టారికల్ నాన్ ఫిక్షన్ రాయి’ అని సలహా ఇచ్చాడు. దాంతో ఇరా రాయడం మొదలెట్టింది. ‘హీరోయిన్స్: పవర్ఫుల్ ఇండియన్ విమెన్ ఆఫ్ మిత్ అండ్ హిస్టరీ’, ‘క్వీన్స్ అండ్ బేగమ్స్ ఆఫ్ మొఘల్ అంపైర్’, ‘అక్బర్– ది గ్రేట్ మొఘల్’ పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత అన్నింటి కంటే ముందు రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల బయటకు వచ్చింది. అయితే ‘ద్రౌపది’ పాత్ర మీద పున ర్వా్యఖ్యానం, పునఃచిత్రణ కొత్త కాదు. ప్రాంతీయ భాషలలో, ఇంగ్లిష్లో ఎన్నో రచనలు వచ్చాయి. తెలుగులో యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రాసిన ‘ద్రౌపది’ (2009) నవల చాలా చర్చోపచర్చలకు కారణమైంది. 2010లో అదే నవలకు సాహిత్య అకాడెమీ బహుమతి దక్కితే దుమారం రేగింది. కాని ఇరా రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ అమె రచనా శైలి, ఆలోచనా శైలితో ఆకట్టుకుంటోంది. ‘ద్రౌపది భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం. స్త్రీ ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కాని ద్రౌపది తన కోపాన్ని ప్రదర్శించగలిగింది. ఆమె నిండు కౌరవసభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాడింది. ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర. అయినా సరే కౌరవసభకు సమాధానం చెప్పగలిగింది.’ అంటుందామె. అయితే అందరూ తరతరాలుగా చెప్పుకుంటున్న ఆ ‘వస్త్రాపహరణం’ ఘట్టంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి చీరలు ఇవ్వడాన్ని ఇరా రాయలేదు. ‘1930లో మన దేశంలో ఒక పండిత వర్గం, చరిత్రకారుల వర్గం కలిసి కొన్నాళ్లు పూణెలో కూచుని మహాభారతంలోని ప్రక్షిప్తాలన్నీ తొలగిస్తూ సిసలైన మహాభారతాన్ని తేల్చారు. నేను వారు కూర్చిన మహాభారతాన్ని నా రచనలకు ప్రామాణికంగా తీసుకున్నాను. వాస్తవ దృష్టితో చూస్తే అది రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య తగవు. కృష్ణుడు కూడా ఈ వాస్తవిక దృష్టిలో ఒక రాజకీయవేత్తగా కనిపించాడు నాకు. అందుకే దైవశక్తులు ఉన్న కృష్ణుడిని నా వస్త్రాపహరణ ఘట్టంలో పెట్టలేదు. ద్రౌపదినే ఆ ఘటనను ఎదుర్కోనిచ్చాను’ అంటుందామె. పురాణాలలో ఉన్నత వర్గాల ప్రయోజనాలు నిమ్నవర్గాల ప్రజలకు ఎలా చేటు చేశాయో చూపే ప్రయత్నం చేస్తుంది. ‘లక్క ఇంటిలో పాండవులను కాపాడటానికి కుంతి ఒక గిరిజన తల్లిని, ఐదుమంది పిల్లలను తమకు మారుగా పడుకోబెడుతుంది. ఆ అమాయకులు అగ్నికి ఆహుతి అవుతారు. ఇది ఎంత అన్యాయం. ఏకలవ్యుడు, ఘటోత్కచుడు పాండవ, కౌరవులతో సమగౌరవం ఎందుకు పొందలేదో చూడాలి’ అంటుంది. కురుక్షేత్ర యుద్ధం వల్ల వితంతువులుగా మారిన కౌరవుల భార్యల దిక్కులేని స్థితిని ఇరా తన పుస్తకంలో రాస్తుంది. ‘సతీ సహగమనం’ ఆ సమయంలోనే ఉనికిలోకి విస్తారంగా వచ్చి ఉంటుందని ఆమె ప్రతిపాదన. ఏమైనా ఇది అంతులేని అన్వేషణే. కాలం గడిచేకొద్ది నాటి పాత్రలు కొత్త అర్థాలతో భారతజాతిని మేల్కొలుపుతూనే ఉంటాయి. ఇరా ముఖోటి వంటి మహిళా రచయితలు ఆ పనిలో భాగం కావడమే ఇప్పుడు వార్త. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆమె అందంతో మిస్టర్ పర్ఫెక్ట్కే వలేసింది.. ఐదేళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత..
జైపూర్: ఆమె అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుంది. చివరకు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ విన్నర్ కూడా ఆమె చేతికి చిక్కి ఇబ్బందులకు గురయ్యాడు. అతడిని హనీ ట్రాప్ చేసిన సదరు యువతి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ ఉందతం రాజస్థాన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన రాధ.. కొన్నేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి రాజస్థాన్లోని జైపూర్లో నివాసం ఉంటోంది. తనకు పెళ్లి అయిన్పప్పటికీ భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, జైపూర్లో రాధ.. కొద్ది రోజులు బ్యూటీ పార్లర్ నిర్వహించింది. అనంతరం జైపూర్ మెట్రో పనిచేస్తుండగా.. ఆరేళ్ల క్రితం ఆమె స్నేహితురాలి ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరూ డీప్ లవ్లో మునిగిపోయి దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రాధ ఆ యువకుడికి దూరమైంది. ఈ క్రమంలో సదరు యువకుడు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నాడు. గతేడాది ఏప్రిల్లో యువకుడికి వివాహం కూడా జరిగింది. మరోవైపు రాధ.. ఓ డ్యాన్స్ గ్రూప్లో చేరి అస్సాం వెళ్లింది. సదరు యువకుడిని విడిచిపెట్టి ఆమె మరికొంత మంది యువకులతో కలిసి జీవించడం ప్రారంభించింది. కాగా, గతేడాది మే నెలలో రాధ మళ్లీ జైపూర్కు చేరుకుంది. తన ప్రియుడికి(మిస్టర్ రాజస్థాన్) వివాహం జరిగిందన్న విషయం తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తమ సంబంధం గురించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి కొద్ది నెలలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాధ అతడిని రూ. 20 లక్షలు డిమాండ్ చేయగా.. తన వద్ద లేవని చెప్పడంతో.. రాధ ఆ వ్యక్తిని అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులు భరించలేక అతను పోలీసులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం.. సదరు వ్యక్తి ఓ హోటల్లో బ్లాక్ మెయిలర్ రాధకు రూ.50 వేల నగదు, మూడు చెక్కులను ఇస్తుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రాధను సంజయ్ సర్కిల్ పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఐపీఎస్ అధికారి సూట్ కేస్ చూసి షాక్ తిన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది!
Airport Security Opens IPS Officer Suit Case: నిజానికి చాలా పన్నీ ఇన్సిడెంట్లను చూస్తే కాస్త ఆశ్చర్యంగానూ, కామెడిగానూ ఉంటుంది. పైగా కొంతమంది అమాయకంగా చేస్తారో లేక సరదాగా చేస్తారో తెలియదు గానీ కొన్ని ఇషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జైపూర్లో చోటు చేసుకుంది. వివారల్లోకెళ్తే.. జైపూర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఒక ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సూట్కేస్ని తెరిచి చూపించాల్సిందిగా కోరారు. భద్రతా దృష్ట్యా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్యాగ్లను ఓపెన్ చేయమని చెబుతుంటారు. ఆ విధంగా ఆ ఐపీఎస్ అధికారి సూట్కేస్ని ఓపెన్ చేయమని అడిగారు. అయితే అరుణ్ బోత్రా తన సూట్ కేస్ ఓపెన్ చేయగానే సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడంతా ఒకేటే నవ్వులు. ఇంతకీ ఆ సూట్కేస్లో ఏమున్నాయంటే పచ్చి బఠాణిలు. సూట్కేస్ మొత్తం బఠాణిలతో నిండి ఉంది. అయితే ఆయన ఆ బఠాణిలను కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన" జైపూర్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది నా బ్యాగ్ని ఓపెన్ చేయమన్నారు" అనే క్యాప్షన జోడించి మరీ ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతోపాటు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్గా మారింది. Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ — Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022 (చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్లో చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?) -
ఆ రెండు నగరాల మధ్య.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే!
ఇకపై భవిష్యత్తు రవాణా మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే. ప్రస్తుతం, పెరుగుతున్న ఇందన ధరల వల్ల పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పేందుకు వాహనదారులు సిద్దం అవుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీని ప్రవేశ పెట్టాలని చూస్తుంది. అంటే, ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు విద్యుత్ ద్వారా నడుస్తాయి. రైళ్లు, మెట్రో రైళ్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే ఈ హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. రెండేళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీలో మొట్టమొదటిసారిగా నిర్మించారు. తద్వారా హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీచార్జ్ అవుతాయి. ఇప్పుడు విదేశీ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ జైపూర్ నగరాల మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది తన కలల ప్రాజెక్టుగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఈ బిగ్ డీల్కు సంబంధించి విదేశీ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని గడ్కరీ తెలిపారు. ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. మణిపూర్, సీక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లలో రోప్ వే కేబుల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇప్పటివరకు 47 ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. "ఢిల్లీ & జైపూర్ నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవేను తయారు చేయాలనేది నా కల" అని ఆయన అన్నారు. 2022-23 బడ్జెట్ పద్దులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేల అభివృద్ధి చేపట్టే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)కు రూ.1.34 లక్షల కోట్లు కేటాయించనున్నారు. (చదవండి: మైలేజ్లో రారాజు..మారుతి సుజుకీ సరికొత్త రికార్డు..!) -
వివాహేతర సంబంధం: ప్రియుడు బలవంతం పెట్టడంతో..
జైపూర్ : వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని మహిళ గొంతు నులిమ హత్య చేసింది. ఈ ఘటన జైపూర్లో వెలుగుచూసింది. మృతుడిని సుభాష్ కుమావత్గా పోలీసులు గుర్తించారు. మృతుడి ఫోన్ను పరిశీలించడంతో పాటు అక్కడున్న ఆధారాలను బట్టి మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమావత్ పొరుగున ఉండే మహిళకు సంబంధించిన పలు వీడియోలు బాధితుడి ఫోన్లో ఉండటంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఈ బండారం బయటపడింది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మహిళ భర్త పనికి వెళ్లినప్పుడు కుమావత్ తన ఇంటికి వెళ్లినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. కుమావత్ తనతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అతడిని అడ్డుకునే ప్రయత్నంలో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆ మృతదేహాన్ని కిటికీ దగ్గరకు లాక్కెళ్లి ఏదో పని నిమిత్తం తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. కుమావత్తో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆ మహిళ చెప్పింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో సదరు మహిళ ఆ వ్యక్తిని వదిలించుకోవాలని ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
అదిరిపోయిన హోప్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా ఎక్కువే!
రాజస్థాన్లోని జైపూర్లో ప్రధాన కార్యాలయం కలిగిన హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం(హోప్ ఆక్సో) మార్కెట్లోకి వచ్చే ముందు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లీథియం-అయాన్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఎంపిక చేసిన డీలర్ భాగస్వాములతో #OXOSNEAKPEEK క్లోజ్డ్ లూప్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ, జైపూర్, జోధ్ పూర్, పాట్నా, కోల్ కతా, హైదరాబాద్, లూధియానా వంటి మరెన్నో 20 ప్రధాన నగరాల్లో 30000 కిలోమీటర్లకు పైగా టెస్టింగ్ చేసినట్లు ఈవీ తయారీదారు పేర్కొంది. కంపెనీ ఇప్పటికే జైపూర్ నగరంలో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటులో 1.80 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్ధ్యం గలదు. ఈ కంపెనీ ఇప్పటికే అనేక స్కూటర్లను తయారు చేసింది. ప్రస్తుతం ప్రతిరోజూ 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. అలాగే, రాబోయే మూడేళ్లలో భారతీయ మార్కెట్లో కనీసం పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలోని రివోల్ట్ ఆర్వి300/400 వంటి ఎలక్ట్రిక్ బైక్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. (చదవండి: ఓలా, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా వచ్చేస్తున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్!) -
పెళ్లైన రెండు రోజులకే.. నవవధువు అన్నంలో విషం పెట్టి, రాత్రికి రాత్రే!
పెళ్లీడుకొచ్చిన యువతులు.. వివాహం చేసుకొని భర్తతో సుఖ, సంతోషాలతో ఉండాలని కలలు కంటారు. అచ్చం అలాంటి అలోచనలతో యువకులు కూడా.. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవించాలనుకుంటారు. అంతే ఆనందంతో ఇటీవల ఓ యువకుడు పెద్దల సమక్షంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే జరిగిందనే లోపు ఆ యువతి చేసిన పనికి కుటుంబమంతా ఆస్పత్రి పాలైంది. పెళ్లైన రెండు రోజులకే ఇంటిల్లిపాదికి అన్నంలో విషం పెట్టి.. నగలు, డబ్బుతో అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో ఆలస్యంగా రాజస్తాన్లో వెలుగులోకి వచ్చింది. జైపూర్ జిల్లా కోట్పుట్లీ ప్రాంతానికి చెందిన నందు పట్వా ఫిబ్రవరి 22న పూజారాణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వివాహమైన తర్వాత ఆమె అత్తగారి ఇంటి(నందు పట్వా ఇల్లు)కి వచ్చింది. వివాహం జరిగిన రెండు రోజులకు ఆమె వంట చేసి.. భర్త, అత్త, మామలకు అన్నం పెట్టింది. అయితే ఆమె చేసిన వంట తిన్న కుటుంబ సభ్యులు(భర్తతో సహా) స్పృహ కోల్పోయారు. వారు మరుసటిరోజు ఎంతకూ నిద్రలేవకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా అందరూ స్పృహ కోల్పోయి కనిపించారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి పాలు కావడానికి గల కారణం తెలియగానే కోలుకున్న కుటంబసభ్యులు షాక్కు గురయ్యారు. ఆ యువతి పక్కా ప్లాన్ వేసి.. విషం కలిసిన వంటను తాను తినకుండా భర్తతో పాటు అత్త, మామకు తినిపించింది. కుటుంబ సభ్యులు ఆ అన్నం తిని స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న నగలు, డబ్బు పట్టుకొని ఉడాయించింది. ఈ ఘటనపై నందు పట్వా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దొంగ వధువు పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సదరు యువతిని ఓ మధ్యవర్తి చూపించాడని, అతనికి సుమారు రూ. లక్ష ముట్టజెప్పినట్లు ఫిర్యాదులో నందు కుటుంబం పేర్కొంది. -
పరి పూనమ్ చౌదరి.. ఉమన్ ఆఫ్ బునాయ్
తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్ని అవుతాను.. ఇంజినీర్ని అవుతాను... కలెక్టర్ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్ చౌదరి. జైపూర్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్ అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ కోర్సును నేర్చుకుంది. తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్ చేస్తూనే ఫైన్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్’, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియాలతో ‘బునాయ్’ అనే బ్రాండ్ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు. బునాయ్ బ్రాండ్... భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్గా ఉండే డ్రెస్లతో 2016లో బునాయ్ని జైపూర్లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్లను ఆన్ లైన్ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్ టోన్కు సరిపడినట్లు డిజైన్ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్ ‘బునాయ్’ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్ మోడల్స్ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్లు లభించడం కూడా బునాయ్ బ్రాండ్ పాపులర్ అవడానికి మరో కారణం. ఉమన్ ఆఫ్ బునాయ్ ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్ను చేర్చుకుని బునాయ్ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్కి ‘ఉమన్ ఆఫ్ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్ బ్రాండ్వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్ అయింది. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్తో పరి ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్’లో ఈ–కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు కూడా ఆమెను వరించింది. -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
తమిళనాడుతో హిమాచల్ ప్రదేశ్ ఫైనల్ పోరు... ధావన్ మళ్లీ మెరిసేనా!
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్గా అవతరించాలనే పట్టుదలతో హిమాచల్ప్రదేశ్... ఆరోసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో తమిళనాడు... జైపూర్లో నేడు జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత క్రికెటర్ రిషి ధావన్ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ చేరిన హిమాచల్ ప్రదేశ్ ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ టైటిల్ నెగ్గిన తమిళనాడు మరో టైటిల్పై గురి పెట్టింది. బాబా అపరాజిత్, వాషింగ్టన్ సుందర్లతోపాటు చివర్లో మెరుపులు మెరిపించే షారుఖ్ఖాన్ సూపర్ ఫామ్లో ఉండటం తమిళనాడుకు సానుకూల అంశం. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: IND-19 Vs PAK-19: పాక్పై చివరి బంతికి ఓడిన భారత్.. -
నేను నికార్సైన హిందువును.. హిందూత్వవాదిని కాదు: రాహుల్
జైపూర్: భారత్ హిందువుల దేశమని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందూత్వవాదులది కాదని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందూత్వవాదులే కారణమని దుయ్యబట్టారు. వారికి అధికారమే పరమావధి అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత ఏడేళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందూ, హిందూత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. రెండు ప్రాణుల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగానే, రెండు పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ హిందువు, గాడ్సే హిందూత్వవాది అని అన్నారు. 2014 నుంచి భారత్లోని హిందూత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు. తాను నికార్సైన హిందువునని, హిందూత్వవాదిని కాదని తేల్చిచెప్పారు. హిందూత్వవాదులు నిక్షేపంగా ఉన్నారు హిందూత్వవాదులను మరోసారి తరిమికొట్టాలని, దేశంలో హిందువుల పరిపాలనను పునఃప్రతిష్టించాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. õ దేశంలో 20 కంపెనీలే 90 శాతం కార్పొరేట్ లాభాలను కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు కూడా కార్పొరేట్ల బానిసలేనని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రద్దు చేశాయని, మోదీ ప్రభుత్వం మాత్రం రైతులకు హిందూత్వవాది కాబట్టే మోదీ రైతులను వెనుక నుంచి పొడిచాడని చెప్పారు. రైతన్నలు ఎదురుతిరిగితే హిందూత్వవాది తోకముడిచి, క్షమాపణ చెప్పడం ఖాయమన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ..70 ఏళ్లలో కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన దేశాన్ని కార్పొరేట్ మిత్రులకు అమ్మేసేందుకు మోదీ సర్కారు కుతంత్రాలు సాగిస్తోందని ఆరోపించారు. ర్యాలీలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కానీ, ప్రసంగించలేదు. రాజస్తాన్ Ðసీఎం గహ్లోత్, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరయ్యారు. కాగా, ఈ ర్యాలీ వద్దకు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఆలస్యంగా చేరుకున్నారు అదానీ, అంబానీకే అచ్ఛే దిన్ మంచి రోజులు(అచ్ఛే దిన్) వస్తాయంటూ దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారని, కానీ ఆ మంచి రోజులు అదానీకి, అంబానీకి మాత్రమే వచ్చాయని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయినా ఆ తప్పు అదానీ, అంబానీది కాదని, వారికి దోచిపెట్టే ప్రధానిది అని అన్నారు. మోదీ నిర్వాకాలతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించలేరని అన్నారు. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు, రైతులే ఆ పని చేయగలరని చెప్పారు. మోదీ పాలనలో అసంఘటిత రంగం పూర్తిగా కునారిల్లిందన్నారు. లద్దాఖ్, అరుణాచల్లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే, అలాంటిదేమీ లేదని ప్రధాని బుకాయిస్తున్నారని చెప్పారు. -
సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?
‘లెర్న్ ఫ్రమ్ ది మాసెస్...’ అనే మావో మాట అంకిత్ విన్నాడో లేదో తెలియదుగానీ ఆచరణ లో అలాగే చేశాడు. ‘నువ్వు చదవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక పుస్తకం. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచమే ఒక మహా విశ్వవిద్యాలయం’ అనే మంచి మాట నచ్చి కొత్త బాట పట్టాడు... ప్రపంచం సంగతి సరే, ముందు దేశాన్ని చుట్టిరావాలని, ప్రజల దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనే బలమైన కోరిక జైపూర్ (రాజస్థాన్) కు చెందిన అంకిత్ అరోరాకు కలిగింది. అలా అని విమానం ఎక్కే ఆర్థిక పరిస్థితి తనకు లేదు. ఎదురుగా సైకిల్ కనిపించింది. ‘అవును. సైకిల్ మీద దేశం చుట్టి వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. ‘చాలా కష్టమేమో’ అన్నది తనలోని మరో వెర్షన్. ‘కాలినడకన దేశాలు తిరిగే వాళ్లు ఉన్నారు. సైకిల్పై వెళ్లడం అసాధ్యమేమీ కాదు’ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతడు బయలుదేరాడు.... నాలుగు సంవత్సరాల పాటు సాగిన తన యాత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు చూశాడు. మహారాష్ట్రలో దారుశిల్పాలు, తంజావూరులో ఆదివాసి కళలు, తమిళనాడులో సంగీతవాద్య పరికరాల తయారీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడంటే సేంద్రియ వ్యవసాయం గురించి ఘనంగా చెప్పుకుంటున్నాంగానీ, దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చా...లా ఏళ్ల క్రితమే ఈ ఆదర్శనీయ వ్యవసాయ విధానం అమలులో ఉంది. వాటిని దగ్గరగా గమనించిన అంకిత్ ఇతర ప్రాంతాలకు ప్రయాణమైనప్పుడు, వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి ఆ విషయాలను చెప్పేవాడు. ‘మీరు మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు’ అనేవాడు. ఉత్తమ వ్యవసాయ విధానాలు, చెట్లు, నీటిసంరక్షణ... ఇలా తాను తెలుసుకున్న ఎన్నో విషయాలను ప్రచారం చేస్తూ వెళ్లాడు. (చదవండి: సేంద్రియ కర్బనమే పంటకు ప్రాణం!) ‘నువ్వు సర్కార్ తరపున వచ్చావా? నీకు జీతం ఎంత ఇస్తారు?’ ఇలాంటి ప్రశ్నలెన్నో అడిగే వాళ్లు రైతులు. ‘లేదు’ అనే మాట వారిని ఆశ్చర్యానికి గురి చేసేది. కళ్లతోనే అభినందించి, ఆదరించి తిండి పెట్టేవారు. కొందరు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. శ్రీనగర్లో తనను దొంగగా అనుమానించారు. మరోచోట స్మగ్లర్ అనుకొని వెంబడించారు. అయితే అది కొద్దిసేపు. నిజం తెలుసుకున్నాక అనుమానించినవారే హృదయపూర్వకంగా అభినందించారు. ప్రఖ్యాత కవి విలియమ్ బట్లర్ ఈట్స్ ‘ది లేక్ అయాల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ’ కవితలో కనిపించే ఆదర్శ, ప్రశాంత, కళాత్మక వ్యవసాయక్షేత్రం ఒకటి ప్రారంభించాలనేది తన కల. బెంగళూరుకు చెందిన శ్రీదేవి, అంకిత్ ఊహలకు రెక్కలు ఇచ్చారు. క్రిష్టగిరి దగ్గర శ్రీదేవి కుటుంబ సహాయ సహకారాలతో ‘ఇన్నిస్ ఫ్రీ’ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. రసాయనాలు ఉపయోగించకుండా కూరగాయలు ఎలా పండించాలి? ఎకో–టాయిలెట్స్ ఎలా నిర్మించుకోవాలి? పశువులకు బలమైన మేత.. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇదొక బడిగా మారింది. (చదవండి: సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..) తాను తిరగాల్సిన ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో మొదటిది ఈశాన్య ప్రాంతాలు. అక్కడకు వెళ్లాలని, అక్కడ నేర్చుకున్న మంచి విషయాలను ఇతర చోట్ల ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంకిత్. అంకితభావం ఉన్నవారి కలలు నెరవేరడానికి అట్టే సమయం పట్టదు కదా! -
జాడలేని దొంగ: స్టార్ హోటల్లే టార్గెట్.. రూ.19 కోట్ల చోరీ
సాక్షి, హైదరాబాద్: 48 ఏళ్ల వయస్సు... 29 ఏళ్ళ నేర జీవితం... 17 ఏళ్ళుగా స్టార్హోటల్సే టార్గెట్... 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 36 చోరీలు... దాదాపు రూ.19 కోట్ల సొత్తు అపహరణ... వివిధ రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్... ఇంతటి ఘరానా నేరచరిత్ర కలిసిన గజదొంగ జయేష్ రావ్జీ సెజ్పాల్ కోసం రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడిని ఆఖరుసారిగా 2018 మార్చ్లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతడి కదలికలపై సమాచారం ఉండే అందించాల్సిందిగా కోరారు. సెజ్పాల్ గత నెల్లో జైపూర్, ఉదయ్పూర్ల్లో రెండు నేరాలు చేశాడు. ►గుజరాత్కు చెందిన జయేష్ రావ్జీ సెజ్పాల్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. ఆపై గుజరాత్తో పాటు ముంబైలో ఉన్న కొన్ని హోటల్స్/ఫుడ్ పాయింట్స్లో క్యాటరింగ్ వర్కర్గా పని చేశాడు. ►ఈ రకంగా వచ్చే ఆదాయంతో బతుకీడ్చటం కష్టంగా మారడంతో 1991లో తొలిసారిగా ముంబైలోని డొంగ్రీ ఠాణా పరిధిలో చోరీ చేశాడు. అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న వీసీపీని ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కి ఆథర్ రోడ్ జైలుకు వెళ్ళాడు. ►అక్కడే ఇతడికి రమేష్ ఛాగ్ అనే మరో నేరగాడి సలహాతో స్టార్ హోటళ్ళను టార్గెట్గా చేసుకుని నేరాలు చేయాలని పథకం వేశాడు. ఓ నగరాన్ని టార్గెట్గా చేసుకునే జయేష్ ట్రావెల్స్ బస్సుల్లో అక్కడకు చేరుకుంటాడు. ►బోగస్ గుర్తింపుకార్డులు దాఖలు చేయడం ద్వారా మధ్య తరహా లాడ్జిల్లో బస చేస్తాడు. ఆపై ఆటోలో ఏదో ఒక స్టార్ హోటల్ వద్దకు వెళ్తాడు. కొత్తగా పెళ్ళైన జంట లేదా వివాహ వేడుకలకు హాజరైన జంటల్ని గుర్తిస్తాడు. ►వీరి వద్దే భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో వీరిని ఎంచుకుంటున్నాడు. ఒకటికి రెండుసార్లు వారిని ఫాలో అవుతూ ఏ గదిలో బస చేశారో, ఏఏ సమయాల్లో బయటకు వెళ్ళి వస్తున్నారో గుర్తిస్తాడు. ►నీట్గా తయారయ్యే, పక్కా వాక్చాతుర్యం కలిగి ఉన్న జయేష్ ఆ హోటల్ సిబ్బందిని మచ్చిక చేసుకునో, బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ ద్వారానో ఆ గదిలో బస చేస్తున్న తన ‘టార్గెట్’ పేరు, వివరాలు తెలుసుకుంటాడు. ►ఆపై హోటల్ లాబీల్లో ఆ జంటలో ఒకరిని (రూమ్ ఎవరి పేరుతో బుక్కై ఉంటే వారిని) పేరుతో పలకరిస్తూ వారితో మాట కలుపుతాడు. ఇలా ఒకటిరెండుసార్లు తన టార్గెట్తో మాట్లాడుతూ హోటల్ సిబ్బంది కంటపడతాడు. ►దీంతో వారు జయేష్ సదరు జంటకు బంధువో, స్నేహితుడో అయింటాడని భావిస్తారు. వీరికి ఈ భావన వచ్చిందనే నమ్మకం కలిగిన తర్వాత తన టార్గెట్ బయటకు వెళ్ళే వరకు ఎదురు చూస్తాడు. ►ఆపై వారి గది ఉన్న ఫ్లోర్కు చేరుకుని రిసెప్షన్ను సంప్రదించి యాక్సిస్ కార్డు మర్చిపోయానంటూ చెప్పి హోటల్ సిబ్బందిని నమ్మిస్తాడు. వారి నుంచి మరో యాక్సిస్ కార్డు తీసుకుని టార్గెట్ చేసిన వారు బస చేసిన గదిలోకి ప్రవేశిస్తాడు. ►చేతికి చిక్కిన బంగారం, వజ్రాల ఆభరణాలను తస్కరించి హోటల్ నుంచి ఆటోలో బయలుదేరి తాను బస చేసిన లాడ్జికి వెళ్తాడు. అక్కడ నుంచి సొత్తుతో సహా ముంబైకి పారిపోయి చోరీ సొత్తు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. ►ఈ పంథాలో హైదరాబాద్తో పాటు విశాఖపట్నం సహా 18 నగరాల్లో నేరాలు చేశాడు. జయేష్ 2014లో తొలిసారిగా సిటీకి వచ్చి జూన్ 6న మెర్క్యూరీ హోటల్లో పంజా విసిరి రూ.10 లక్షల సొత్తుకు పోయాడు. ►2016 డిసెంబర్ 16న అమీర్పేట మ్యారీగోల్డ్ హోటల్లోని రూ.4 లక్షల బంగారం ఎత్తుకుపోయాడు. 2018 మార్చ్ 6న బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో రూ.30 లక్షల బంగారం చోరీ చేసి నగర పోలీసులకు చిక్కాడు. ►బెయిల్పై వెళ్లిన జయేష్ గత నెల 20న ఉదయ్పూర్లోని హోటల్లో రూ.కోటి బంగారం, ఆఖరి వారంలో జైపూర్లోని హోటల్ నుంచి రూ.2 కోట్ల బంగారం, నగదు తస్కరించాడు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా ఇతడిని గుర్తించిన రాజస్థాన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ►‘ఆరు రాష్ట్రాలకు వాంటెడ్గా ఉండగా మనం చాకచక్యంగా పట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే పరిచయస్తులైన రాజస్థాన్ పోలీసులు జయేష్ ఆచూకీ కోసం ఆరా తీశారు. మన దగ్గరి వివరాలు చెప్తున్నాం. దీనిపై ఎలాంటి అధికారిక లేఖలు లేవు. మనమిచి్చన సమాచారంతో అతడికి సూరత్లో పట్టుకున్నట్లు తెలుస్తోంది’ అని నగర అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
చపాతీలు కోసం చంపేశారు..!
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్లో చోటు చేసుకుంది. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్రూమ్కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఆ వైరస్ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
బడా వ్యాపారవేత్తకు షాక్: అటు కుమార్తె పెళ్లి, ఇటు స్టార్ హోటల్లో భారీ చోరీ
జైపూర్: ఒకవైపు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంటే మరోవైపు కేటుగాళ్లు రెచ్చి పోయారు. అదను చూసి తమ పని కానిచ్చేశారు. ముంబై వ్యాపారవేత్తకు చెందిన ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దోచు కొనిపోయారు. ఈ భారీ చోరీ ఫైవ్స్టార్ హోటల్లో గురువారం జరిగింది. విషయం తెలిసి వ్యాపారవేత్త కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. (ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?) వివరాలను పరిశీలిస్తే ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహ వేడుక జైపూర్లోని ఫైవ్స్టార్ హోటల్ క్లార్క్స్ అమెర్లో ఘనంగా జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా భాటియా, ఇతర కుటుంబ సభ్యులు ఏడో అంతస్తులో బస చేశారు. కింద లాన్లో సంగీత్ వేడుక జరుగుతోంది. అంతా ఆ హడావిడిలో ఉండగా అదును చూసిన దుండగులు రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అపహరించినట్లు పోలీసులు రాధారామన్ గుప్తా శుక్రవారం తెలిపారు. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) హోటల్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం జరిగిందని రాహుల్ భాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో హోటల్ మేనేజ్ మెంట్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వధువు తరపు బంధువులే ఈ పనిచేసి ఉంటారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. -
కివీస్తో మ్యాచ్లో విజయం.. రోహిత్ 9 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్
Rohit Sharma 9 Years Old Tweet Viral After India Won Match Vs NZ.. టీమిండియా టి20 కెప్టెన్గా కోహ్లి నుంచి బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ మొదటి అడుగులో సక్సెస్ అయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టి20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రోహిత్కు పూర్తి స్థాయి కెప్టెన్గా ఇది తొలి విజయం కాగా.. అటు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్కు కూడా తొలి విజయమే. మ్యాచ్ విజయం నేపథ్యంలో రోహిత్ శర్మ తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: సిరాజ్ను ‘కొట్టిన’ రోహిత్ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్! రంజీ ట్రోఫీలో భాగంగా నవంబర్ 7, 2012న జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. అప్పటి మ్యాచ్ సందర్భంగా రోహిత్ తన ట్విటర్లో కామెంట్ను షేర్ చేశాడు. '' జైపూర్లో కెప్టెన్గా అడుగుపడింది. దీనిని సంతోషంగా స్వీకరిస్తున్నా. ఈ కెప్టెన్ పదవి నాకు మరిన్ని బాధ్యతలను పెంచింది.'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా విజయం అనంతరం రోహిత్ శర్మను అభినందిస్తూ ఒక అభిమాని రోహిత్ పాత ట్వీట్ను రీట్వీట్ చేశాడు. ''జైపూర్లో అడుగుపెట్టిన తొలిసారి రోహిత్ రంజీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్గా ఉన్నాడు.. ఇప్పుడు సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత అతను టీమిండియాకు టి20ల్లో ఫుల్టైం కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. జైపూర్ అతనికి బాగా కలిసివచ్చింది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మ్యాచ్లో రోహిత్ శర్మ 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 19న జరగనుంది. చదవండి: Rohit Sharma: నా వీక్నెస్ బౌల్ట్కు బాగా తెలుసు.. ట్రాప్లో పడిపోయా Touched down in jaipur and yes I will be leading the side, looking forward to the added responsibility :) — Rohit Sharma (@ImRo45) November 7, 2012 First time Rohit Sharma ever led Mumbai in Ranji Trophy was in Jaipur (KL Saini ground) in 2012. First time Rohit Sharma will lead India as a full-time T20 captain will be in Jaipur pic.twitter.com/vFzFAVqD57 — Sarang Bhalerao (@bhaleraosarang) November 16, 2021 -
Ind Vs Nz 1st T20: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్గా దిగుతా
Deepak Chahar hilariously wants to open the batting: పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమైంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుధవారం కివీస్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక రోహిత్ శర్మకు కెప్టెన్గా.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్కు ఇదే మొదటి సిరీస్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్లతో పాటు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో తుదిజట్టులో ఎవరు ఆడతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. కాగా ఇప్పటికే రెగుల్యర్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఉండగా... ఒకవేళ తుదిజట్టులోకి ఎంపికైతే ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్కు ఆ ఛాన్స్ ఇస్తారేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీపక్ చహర్ సోషల్ మీడియా షేర్ చేసిన పోస్టు, అందుకు జతచేసిన క్యాప్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘ఈరోజు రాత్రి నా హోం గ్రౌండ్లో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు అంతా సిద్ధమైంది’’అంటూ చహర్ రోహిత్తో మాట్లాడుతున్న ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీంతో.. బహుశా బౌలింగ్లో చహర్ఓ పెనింగ్ చేస్తాడేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఆగ్రాకు చెందిన దీపక్ చహర్ రాజస్తాన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. రాజస్తాన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న గ్రెగ్ చాపెల్ దీపక్లో ఫాస్ట్బౌలర్కు ఉండాల్సిన లక్షణాలు లేవని కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీ 2010-11లో హైదరాబాద్తో మ్యాచ్లో కేవలం 10 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాయాలు వెంటాడినా.. చిక్కులను అధిగమించి.. 2018లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో వన్డేల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న దీపక్ చహర్ ఈ సీజన్లో జట్టు చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తన కెరీర్లో చహర్ ఇప్పటి వరకు మొత్తంగా 1686 పరుగులు చేశాడు. ఇందులో 166 ఫోర్లు, 74 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్! Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్ కావడమే ఎంతో సంతోషం! All set to open the innings at my home ground tonight. 😃 pic.twitter.com/Rr8Z4VfKhK — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) November 17, 2021 -
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్తకొత్తగా..!
టి20 వరల్డ్కప్ ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు సొంతగడ్డపై మళ్లీ కొత్తగా సీజన్ను మొదలు పెట్టేందుకు సన్నద్ధమైంది. ‘ప్రపంచకప్’ ఓటమి వేదన ‘పేటీఎమ్ కప్’తో తీరదు కానీ ఆట ఆగిపోదు కాబట్టి మరో టి20 సమరానికి సమయం వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే మరో ఏడాదిలోపే జరిగే తర్వాతి టి20 ప్రపంచకప్ ప్రణాళికలు కొత్త కెప్టెన్, కొత్త కోచ్ల నేతృత్వంలో ఈ సిరీస్ నుంచే మొదలు కానున్నాయి. మరోవైపు వరల్డ్కప్ ఫైనల్ ఆడిన మూడు రోజుల్లోపే, ఆ ఓటమి బాధ నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒక ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్లో బరిలోకి దిగాల్సిన పరిస్థితిలో దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్ నిలిచింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి టీమిండియా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తుండగా... విలియమ్సన్ లేని కివీస్ ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. IND vs NZ T20: Important Things About Rohit Sharma and Rahul Dravid: వరల్డ్కప్లో నమీబియాతో తమ చివరి మ్యాచ్ ఆడిన భారత తుది జట్టులో కొన్ని తప్పనిసరి మార్పులు జరగనున్నాయి. రోహిత్, రాహుల్, సూర్యకుమార్, అశ్విన్లు మాత్రమే ఇక్కడా ఆడే అవకాశం ఉండగా. కోహ్లి, జడేజా స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు. వరల్డ్కప్ జట్టులో చోటు దక్కని లెగ్స్పిన్నర్ చహల్ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఇద్దరు పేసర్లు షమీ, బుమ్రా దూరం కావడంతో భువనేశ్వర్కు మరో అవకాశం లభించింది. ఒకప్పటి తన బౌలింగ్తో పోలిస్తే పదును కోల్పోయిన భువీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం. ఇక చివరిసారిగా 2018 మార్చిలో భారత టి20 టీమ్ తరఫున ఆడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్కు మరో అవకాశం లభించింది. తన టెస్టు ప్రదర్శనతో కీలక సభ్యుడిగా మారిన అతను ఐపీఎల్లోనూ రాణించి టి20ల్లో చాన్స్ దక్కించుకున్నాడు. ఇక మిడిలార్డర్లో మరో బ్యాట్స్మన్ స్థానం కోసం మాత్రమే తీవ్రంగా పోటీ ఉంది. ఇప్పటికే భారత్కు ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉన్నా... అతనికి రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్లనుంచి పోటీ ఉంటుంది. తాజా ఫామ్ చూసుకుంటే రుతురాజ్ అద్భుతంగా ఆడుతుండగా... బౌలింగ్ కూడా చేయగలగడం వెంకటేశ్ బలం. జేమీసన్కు చోటు... మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిన 24 గంటలలోపు సిరీస్ ఆడేందుకు సోమవారం సాయంత్రం జైపూర్లో దిగింది. టెస్టు సిరీస్కు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించాడు. దాంతో సారథిగా టిమ్ సౌతీ వ్యవహరిస్తాడు. బౌల్ట్ కూడా టీమ్లో లేకపోగా... కాన్వే, ఫెర్గూసన్ ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్నారు. వరల్డ్కప్ ఆడని వారిలో కొత్తగా మార్క్ చాప్మన్, కైల్ జేమీసన్ ఈ సిరీస్లో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ భారత జట్టు టి20 నాయకత్వం కూడా కొత్త కాదు. కోహ్లి గైర్హాజరులో 2017–2020 మధ్య అతను 19 మ్యాచ్లలో భారత్కు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 15 విజయాలు దక్కగా, 4 సార్లు జట్టు ఓడింది. అతని కెప్టెన్సీలో జట్టు ఆసియా కప్ కూడా గెలిచింది. అయితే కోహ్లి అధికారికంగా తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అతను టి20 కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. 🎥 Head Coach Rahul Dravid rekindles his first meeting with a young @ImRo45 & lauds the #TeamIndia T20I captain for his contribution towards the Indian cricket. 👏 ☺️#INDvNZ pic.twitter.com/croLaIElLu — BCCI (@BCCI) November 16, 2021 -
భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్: తొలి మ్యాచ్ కష్టమేనా?
Pollution threat Looms Large on 1st T20 Against IND VS NZ: టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్లో ఆసీస్ చేతి అనుహ్యంగా ఓటమి చెందిన న్యూజిలాండ్.. తదుపరి భారత పర్యటనకు సిద్దమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా నవంబర్17న తొలి టీ20 మ్యాచ్లో జైపూర్ వేదికగా భారత్తో తలపపడనుంది. అయితే జైపూర్లో గత వారం రోజులుగా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే శీతాకాలంలో పొగమంచు కూడా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఆదివారం జైపూర్లో గాలి అత్యంత కలుషితంగా ఉందని, జైపూర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఈ ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు జైపూర్ చెరుకోగా, కీవిస్ ఆటగాళ్లు సోమవారం(నవంబర్ 15)న చేరుకోనున్నారు. కాగా అంతక ముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా పొగమంచు కారణంగా శ్రీలంక ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఆడారు. అప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316 గా నమోదైంది. చదవండి: ఆ అవార్డు వార్నర్కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్ -
న్యూజిలాండ్ సిరీస్కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్...
India vs New Zealand T20I: న్యూజిలాండ్ సిరీస్కు ముందు భారత అభిమానులకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ అందించింది. న్యూజిలాండ్తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్కు ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. నవంబర్ 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్కు జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కనీసం సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అయినా తీసుకున్నవారు మాత్రమే అనుమతించబడతారని ఆర్సిఏ ప్రకటించింది. కోవిడ్-19 ప్రోటోకాల్లను పాటిస్తూనే స్టేడియంలో ప్రేక్షకుల ప్రవేశంపై రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆర్సిఏ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు. ఇంగ్లండ్తో జరిగిన హోమ్ సిరీస్ తర్వాత అభిమానులను తొలి సారిగా అనుమతిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ రెండు టెస్ట్లు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్కతాలో చదవండి: Mushtaq Ahmed: టీమిండియాలో అంతర్గత విభేదాలు.. త్వరలోనే కోహ్లి రిటైర్మెంట్ అంటూ.. -
రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
రాజస్థాన్లోని జైపూర్కి చెందిన ఓ రెస్టారెంట్.. కస్టమర్లకు ఓ విచిత్ర షరతు పెట్టింది. కస్టమర్ల పక్కన మహిళ ఉంటేనే లోపలికి ప్రవేశమట. అందేంటి?? అనుకుంటున్నారా... దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆకలేసి సదరు హోటల్కి వెళ్లబోతే, పక్కన లేడీ ఎవ్వరూ లేరని వెనక్కి పంపారట. దీనితో ఒక మహిళను తీసుకొచ్చి, హోటల్లో కూర్చోబెట్టి కడుపునిండా తిన్నాడట. ఐతే పాపం ఆ మహిళ మాత్రం పప్పు రోటీ తినడానికి ఈ వ్యక్తి నన్నిక్కడికి తీసుకొచ్చాడనే క్యాప్షన్తో తన ఇమేజ్తో సహా ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!! So this guy took me here to have dal roti because pic.twitter.com/PVrgeuS4H9 — Harshita Sharma (@Harshita511) October 17, 2021 -
టాప్ లెస్ ఫోటోస్తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్గానే కాకుండా స్పెషల్ సాంగ్స్తోనూ అభిమానులు అలరిస్తున్న ఈ బోల్డ్ భామ.. గ్లామర్ ఫోటోషూట్లతోనూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తుంది. చదవండి: Mani Sharma: వైరలవుతోన్న మణిశర్మ కుమారుడి నిశ్చితార్థపు ఫోటోలు ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం జైపూర్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఈషా తన రిసార్ట్లోని బాల్కనీ వద్ద దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఇన్స్టాలో అయిదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామకు బోల్డ్గా కనిపించడం కొత్తేం కాదు. ఇంతకముందు చాలాసార్లే బికినీ ఫోజులతో కనువిందు చేసింది. కానీ ఈసారి మరింత రెచ్చిపోయి ఏకంగా టాప్లెస్గా సెమీ న్యూడ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సెగలు రేపుతోంది. జీన్స్ ప్యాంట్ మినహా ఒంటిపై నూలుపోగు లేకుండా ఘాలుగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. చదవండి: Shriya Saran: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ శ్రియ -
పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్ ఉన్నాడు. రీట్ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. జైపూర్- ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!
న్యూఢిల్లీ: ఢిల్లీ, జైపూర్ మధ్య త్వరలో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవే నిర్మించే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు మీడియాతో తెలిపారు. ఈ రెండు నగరాల మధ్య రహదారిని నిర్మించడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక విదేశీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఢిల్లీ-జైపూర్ మధ్య రహదారి విస్తరణతో పాటు, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే విషయంలో కూడా ఎలక్ట్రిక్ హైవే విస్తరణ కోసం స్వీడిష్ సంస్థతో కూడా చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 22 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించాలని చూస్తున్నట్లు, ఇప్పటికే వాటిలో ఏడింటి పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. (చదవండి: గంటల వ్యవధిలోనే రూ.21 కోట్ల ఆర్జన!) "ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం నా కల. ఇది ఇప్పటికీ ప్రతిపాదిత ప్రాజెక్ట్. దీని కోసం మేము ఒక విదేశీ సంస్థతో చర్చిస్తున్నాము" అని నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పీటీఐతో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, బస్సులు & ట్రక్కులు వంటి ప్రజా రవాణా వాహనాలను త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, నితిన్ గడ్కరీ ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని సమీక్షించారు. ఈ రహదారి వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుంచి సగానికి తగ్గనున్నట్లు పేర్కొన్నారు. జైపూర్ - ఢిల్లీ మధ్య ప్రయాణం త్వరలో రెండు గంటలకు తగ్గనున్నట్లు ఆయన ప్రకటించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ)ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి ఢిల్లీ, జైపూర్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది అని అన్నారు.