అపూర్వ కానుక
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన శివ్ జోహ్రీ తన కుమార్తెకి అపురూపమైన, అందమైన కానుకని అందించాడు. కూతురి వివాహం కోసం రూ. 25 లక్షల విలువైన వెండి వివాహ పత్రికను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాక్సు తరహాలో ఈ పెళ్లికార్డును రూపొందించారు. కార్డు తయారీలో మేకులు, స్క్రూలను వాడలేదు.
ఈ పత్రిక బరువు సుమారుగా 3 కిలోలు ఉంటుంది. పొడవు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు ఉంటుంది. ΄ûరాణిక ఘట్టాలను, దేవతామూర్తులను పత్రికపై అద్భుతంగా తీర్చిదిద్దారు. రామదర్బార్, శివపార్వతుల కళ్యాణం, రాధాకృష్ణులు, తిరుపతి ఆలయ ద్వారాలు, శేష పాన్పుపై పవళించిన విష్ణుమూర్తి... మొదలైన చిత్రాలు దీనిపై కనిపిస్తాయి.


