Chandrababu Naidu
-
‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్రెడ్డి అన్నారు.‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్, జగన్ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. -
నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా
-
చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోడానికి కారణమైందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని, ఇది భవిష్యత్లో అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు. అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్ జగన్ ప్రతిపాదించారని చెప్పారు. 80 ఏళ్లయినా ఇంకా వలసలేనా? ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏనాడైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు. -
ధర లేని 'ఉల్లి'.. రైతు 'తల్లడిల్లి'!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మార్కెట్లో ధర లేక, కొనే నాథుడు లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రబీ పంట చేతికొచ్చే సమయంలో దిగజారిన ధరలతో గగ్గోలు పెడుతున్నారు. వందలాది క్వింటాళ్ల ఉల్లిని రోడ్ల పక్కనే కుప్పలుగా పోసి కొనే వారి కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. క్వింటా కనీసం రూ.500 కూడా పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.నాణ్యత బాగున్నా కొనే వారేరీ?రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు.అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరు ప్రాంతంలో సాగయ్యే కేపీ ఉల్లికీ డిమాండ్ ఎక్కువే. 3 నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. ఖరీఫ్లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వేసిన పంట గత నెల నుంచి కోతలు మొదలయ్యాయి. నాణ్యతకు ఢోకా లేకున్నప్పటికీ మార్కెట్లో ధర లేక, కొనేవారూ లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.క్వింటా ధర రూ.300 నుంచి రూ.500లోపే..ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు రోజుకు 2వేల క్వింటాళ్ల చొప్పున వస్తోంది. కేవలం 5 శాతానికి మాత్రమే క్వింటా రూ.800 పలుకుతుండగా, 95 శాతానికి పైగా పంటకు క్వింటా రూ.300 నుంచి రూ.500కు మించి ధర లభించలేదు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే సమయానికి మరింత దయనీయంగా మారుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తాము తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి రైతుకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంఉల్లి రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ అండగా నిలిచింది. 2019–24 మధ్య క్వింటా రూ.3,500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. ధర తగ్గిన సందర్భాల్లోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా జగన్ ప్రభుత్వం కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశారు. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లోనూ షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చేశారు. గతేడాది క్వింటా రూ.1,200 తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరికి రూ.800కి కొనుగోలు చేస్తామని చెప్పి మూడు రోజులు తిరక్కుండానే ‘అబ్బే అలాంటి ఆలోచనే ప్రభుత్వం దగ్గర లేదు’ అంటూ మాట మార్చి ఉల్లి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది.ఈయన పేరు గంగరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట అమ్ముకుందామని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. వ్యాపారులు లేక ఇలా రోడ్ల పక్కన ఉల్లిని రాసులుగా పోసి ఎదురు చూస్తున్నాడు. కొనండి బాబూ అని కాళ్లావేళ్లా పడుతుంటే క్వింటా రూ.400కైతే తీసుకుంటామంటున్నారు. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం కూలీ ఖర్చులు కూడా రావని, ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నారు.కోత ఖర్చులు కూడా రావుఐదెకరాల్లో ఉల్లిసాగు చేశా. ఎకరాకు రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాను ఎకరాకు 10 టన్నుల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయానికి ధర లేకుండా పోయింది. ఎంతోకొంతకు తెగనమ్ముకుందామన్నా కొనే నాథుడు కనిపించడం లేదు. బ్రతిమిలాడుతుంటే క్వింటా రూ.500 ఇస్తామంటున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రావు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. – ఎం.షఫీ, కర్నూలు జిల్లాచంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు1.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. దాదాపు రూ.1.20లక్షల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 15 టన్నుల దిగుబడి ఉంది. క్వింటా రూ.400కి మించి ధర ఇవ్వడం లేదు. పెట్టుబడి ఖర్చులు దక్కని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు. – జీ మిన్నల్ల, పాలకుర్తి, కర్నూలు జిల్లా -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె తాత్కాలిక విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బకాయిలు చెల్లించాలని ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం తాత్కాలికంగా విరమించాయి. ప్రభుత్వం పది రోజుల్లో రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1 నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేసి సమ్మె చేస్తున్నాయి. సోమవారం రెండో దఫా ప్రభుత్వం ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపింది. మొత్తం బకాయిల్లో రూ.1,000 కోట్లను పది రోజుల్లో, జూలై అనంతరం మరో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ చెప్పారు. ప్రతి నెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల మేర బిల్లులు చెల్లించడంతోపాటు నూతన బీమా విధానం రూపకల్పనలో నెట్వర్క్ ఆస్పత్రులను భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. అందువల్ల 10 రోజులు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. నమ్మకం లేక...ప్రభుత్వం పది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గద్దెనెక్కాక గతంలో రెండుసార్లు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం సమ్మె చేశాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సమ్మె చేసిన సమయంలో డిసెంబర్కి బకాయిలన్నీ చెల్లించేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ సమ్మెను తాత్కాలికంగానే నిలుపుదల చేస్తున్నామని ఆశా స్పష్టం చేసింది. పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. -
అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?
-
చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత
-
నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..
-
కూటమి ప్రభుత్వం వేస్ట్.. రాజీనామాకు రెడీ
-
సిగ్గుపడు రాథాకృష్ణ.. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి..
-
నీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు... గుర్తుపెట్టుకో.. YSRCP మహిళలు వార్నింగ్
-
ABN బ్రోకర్ కృష్ణ... నీ ఆఫీసుని తగలేస్తాం జాగ్రత్త రెచ్చిపోయిన రోజా
-
చంద్రబాబు ఇప్పుడే మొదలైంది.. బాబుకు రోజా ఊర మాస్ వార్నింగ్
-
రాధాకృష్ణ.. పిచ్చి కూతలు, రాతలు రాస్తే తగలబెట్టేస్తాం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు. ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్ చేశారు. -
రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. -
రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయటపడింది.జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏ పనులూ చేయడం లేదు.. అవసరమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర శాఖల్లోనూ పనులు నడవడం లేదు. ప్రజలకు మేలు చేయలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో నాకేం పదవులు అవసరం లేదు.. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి పాలనలో కమ్మని ప్రభుత్వం అన్నందుకు ఆదినారాయణరెడ్డిపై కూటమి నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరో మారు బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నీకు సిగ్గుందా... రాధాకృష్ణపై మహిళా నాయకురాలు విరుచుకుపడ్డారు
-
ఆంధ్రా బ్రోకర్.. నీ ABN ముందు ఉన్నాం మగాడివైతే బయటకు రా
-
క్షమాపణ చెప్తావా.. గంగలో దూకుతావా. ABN రాధాకృష్ణపై రెచ్చిపోయిన అంబటి
-
బాబులో మావిగన్ టెన్షన్..
-
రేయ్ రాధాకృష్ణ...! నాకు స్వీట్ గా చెప్పడం రాదు... కడప యాసలో చెప్తున్నా....
-
LIVE : ABN ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్..
-
శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
-
మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?
-
RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం
-
ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఒకవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చంద్రబాబు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల టూర్లకు, చివరికి ప్రతి శనివారం హైదరాబాద్లోని సొంత ఇంటికి వెళ్లొచ్చేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.దీంతో రెండేళ్లలోనే సీఎం చంద్రబాబు (వీవీఐపీ) ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.54.41 కోట్లు, 2025–26 ఆరి్థక సంవత్సరంలో రూ.54.63 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు అద్దె చెల్లింపు కోసం బడ్జెట్లో రూ.54.63 కోట్లను కేటాయించారు. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలన్నా తాడేపల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక వారాంతంలో చంద్రబాబు పక్క రాష్ట్ర హైదరాబాద్లో ఉన్న తన సొంత ఇంటికి సైతం ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. దీంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడుతోంది.పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల ఖర్చు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
సర్కారు నమ్మక ద్రోహం!
సాక్షి, అమరావతి: ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. వారిని మూడో గ్రేడ్ కిందకు మార్చి, బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి, రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గ్రామ పంచాయతీల్లో రీ కేటగిరైజేషన్ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా దానిని రూ.25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలల క్రితం ఇచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019–2020 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల సమయంలో గ్రేడ్–5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియలో నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేవలం ఐదు శాతం గ్రామ పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా పేర్కొంటూ, వాటి నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులను కేవలం మూడు గ్రేడ్లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చివరి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ణయించి, గతంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆ బేసిక్ వేతనాన్ని రూ.25,220కు తగ్గించేసింది. అభినందన సభ సాక్షిగా మోసం గ్రామ పంచాయతీలను రీ కేటగిరైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులందరికీ పదోన్నతులు వస్తాయని ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 4న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పదోన్నతుల అభినందన సభ కూడా నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–5 నుంచి గ్రేడ్–3కి మారినప్పటికీ, వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.మొదట ప్రకటించిన పేస్కేల్ ఇవ్వాల్సిందే ప్రభుత్వమిచ్చిన జీవో 91లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరి ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ధారించి, ఇప్పుడు దానిని రూ.25,220కు తగ్గించడం అత్యంత అన్యాయమని నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బగ్గా జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకొని, మొదట ప్రకటించిన విధంగా రూ.28,280 పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
రాష్ట్రానికి చీడలా రాధాకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా! ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి. -
‘మావిగన్’ను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు వ్యూహం
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతోందని, ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ఆమోదయోగ్యం కాని, ఆచరణకు నోచుకోని అమరావతిని నిర్మించాలనుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం రూ.20 వేల కోట్లతో గ్రోత్ ఇంజిన్గా దూసుకెళుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనను ప్రకటించిన రోజే చంద్రబాబులో వణుకు పుట్టిందని చెప్పారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఆమోదిస్తుండటంతో సోషల్ మీడియాలో రూ.కోట్లు ఖర్చు చేసి విపరీతమైన పోస్టులు పెట్టారని, అపహాస్యం చేయడంతోపాటు బూతులు కూడా మాట్లాడారన్నారు.నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కువ రోజులు నిలువలేకపోయిందన్నారు. తర్వాత చంద్రబాబు ఇదే అంశంపై మంత్రులతో ప్రెస్మీట్ పెట్టించారన్నారు. అయినా సంతృప్తి చెందని చంద్రబాబు పచ్చ మీడియాను రంగంలో దింపాడన్నారు. ప్రభుత్వాన్ని జాకీలతో పైకిలేపేందుకు జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నాడన్నారు. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలవి ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్పాకరంగా, బాధాకరంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదన్నారు. కండకావరంతో కొవ్వెక్కి రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడినా.. తమ నాయకుడు వైఎస్ జగన్ మాత్రం శాంతియుతమైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయాలని తమకు చెప్పారన్నారు. రాధాకృష్ణ నాలుక కోసి.. ఉప్పూకారంతో ఊరగాయ పెడతారు స్త్రీలను దూషిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణను ఏ మహిళ అయినా మెట్టుతో కొట్టదా అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఆడబిడ్డలైతే రాధాకృష్ణ ఇంటికెళ్లి నాలుక కోసి ఉప్పుకారం వేసి ఊరగాయ పెడతారన్నారు. చంద్రబాబు ఎంతటి నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. కేవలం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా అన్నారు. ‘రాధాకృష్ణా.. నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా. నీలా మేం మాట్లాడితే సరిపోతుందా. ఇవే మాటలు నీ భార్య దగ్గర మాట్లాడితే నీ భార్య కూడా నిన్ను చెప్పుతో కొడుతుంది. మేం నీలా మాట్లాడలేం. జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని రాధాకృష్ణకు అతడి ఇంట్లోని మహిళలు గడ్డిపెట్టాలి’ అని రాచమల్లు కోరారు. -
జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్
-
రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు
-
ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాక్
సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్ తగ్గిస్తూ జీవో నెంబర్.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు వణుకు: కన్నబాబు
సాక్షి,విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకి వెన్నులో వణుకుపుడుతోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ఈ రోజు( సోమవారం) వైజాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయెుచ్చనే ఆలోచనతో చంద్రబాబు భయపడుతున్నారన్నారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు వారికి అర్ధమవుతుంది. మావిగన్ ప్రతిపాదన అమరావతి అవినీతిపై ఎక్కు పెట్టిన గన్లా వారికి కనిపించింది. రూ.20 వేల కోట్ల ఖర్చు చేస్తే మచిలీపట్నం విజయవాడ గుంటూరు అభివృద్ధి చెందుతుంది. ఇదివరకే అమరావతి కోసం చంద్రబాబు రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారని ఏబీఎన్ రాధాకృష్ణ రాస్తున్నారు.ఓ వైపు జీతాలకు డబ్బులు లేవని ఆర్ధిక మంత్రి అంటూనే మరోవైపు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని, కమ్మరావతి పిలుస్తున్నారు. అమరావతి అందరి రాజధాని అయితే కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి మాటలను కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదు. ఏబీఎన్ రాధా కృష్ణ చెత్త పలుకు రాసారని దిగజారి రాతలు రాస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కడుపు మంటతోనే తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడనే పదమే కూటమి ప్రభుత్వానికి ఉరుకులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు. -
పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...
-
‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’
తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. ‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. -
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేని నువ్వు అమరావతి ఎలా కడతావ్..
-
ఈవీఎం ట్యాంపరింగ్.. 50 లక్షల ఓట్లు..
-
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం. -
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులా?: మేరుగ నాగార్జున
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
పోలింగ్.. రిగ్గింగ్.. ట్యాంపరింగ్.. AP ఎన్నికల్లో ఏం జరిగింది ?
-
AP: ఐదో రోజుకు నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. నేటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో నెట్వర్క్ ఆసుప్రతుల ప్రతినిధులు భేటీ కానున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం వెంటిలేటర్పైకి చేరింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం పదేపదే హామీలిచ్చి, ఆచరణలో పైసా కూడా విదిలించకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. సిబ్బందికి జీతాలు, మందుల సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.తమ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆస్పత్రుల దగ్గర యాజమాన్యాలు బోర్డులు పెట్టి నిరసన చేపడుతున్నాయి. దీంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. క్యాన్సర్, గుండె, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కొత్తగా ఎటువంటి ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడం లేదు. అత్యవసరమైన కేసుల్లో చికిత్సలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు మాత్రం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. -
శనగకు ‘ధరా’ఘాతం.. రైతును ఆదు‘కొనే’వారేరి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15 శాతం కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. మార్కెట్లో ధర లేక.. కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అదనపు అనుమతుల పేరిట కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతోంది.దక్కే ధర రూ.4,900లోపే..ఈ ఏడాది రబీలో 10.30 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.5,650 కాగా.. మార్కెట్లో రూ.4,600 నుంచి రూ.4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుండగా, ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. కేంద్రంపై భారం నెట్టేసి.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమైంది. అర్థంతరంగా కొనుగోలు కేంద్రాలు మూసివేత ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతివ్వగా, కేవలం 84 వేల టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 30–40 శాతం పంట మాత్రమే మార్కెట్కు వచ్చింది. గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. అదనపు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖమంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇలా లేఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.కొనుగోలు కేంద్రాల్ని మూసేశారుఐదెకరాల్లో శనగ వేశాను. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్లో మొక్కుబడి తంతుగా కేంద్రాలు తెరిచి.. సీజన్ ముగియకుండానే మూసేశారు. మద్దతు ధర దక్కక,.. బహిరంగ మార్కెట్లో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు, ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. – బి.దస్తగిరి, మాలేపాడు, ఎర్రగుంట్ల మండలం, వైఎస్సార్ కడప జిల్లారెండేళ్లుగా ఇదే పరిస్థితిమద్దతు ధర దక్కక.. పంటను కొనుగోలు చేసేవారు లేక శనగ రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈ ఏడాది దిగుబడిలో కనీసం 15 శాతానికి మించి కొనుగోలు చేయలేదు. కోతకొచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది పంట అమ్ముడుకాక కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
మావిగన్.. ప్రజలు అంగీకరిస్తున్న రాజధాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ మంచి ప్రతిపాదన అని, సీఎం చంద్రబాబు చెప్పే అమరావతి దోచుకోనే ప్రతిపాదన అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి కట్టే బదులు, మావిగన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని మూడు ముక్కలాట అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ చెప్పారురాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని చెప్పారు. జగన్ ఇప్పుడు చెప్పిన ప్లాన్ బీ కూడా కొత్తదేమీ కాదు. కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే పెద్దగా చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఈ కారిడార్కు మావిగన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు ఉన్నాయి. నోయిడా అసలు పేరు.. ‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ’. పేర్లు ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేసేందుకు జగన్ పోర్టు నిర్మాణం చేపట్టారు.మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే. ఒక మంచి గ్రోత్ కారిడర్ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నారు. ఈ మూడు నగరాలు కలవడం బాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్ను అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ రాకుండా అడ్డుకుంటున్నాడు. మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రాజధాని పెడితే చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుల భారం ఉండదు. జగన్ చేసిన ఈ ఆచరణాత్మక ప్రతిపాదనపై ఈ మూడు నగరాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మేధావులు చర్చిస్తున్నారు.మంచి ప్రతిపాదన అని అంగీకరిస్తున్నారు. మా పార్టీ నాయకులంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నాయకులు వ్యతిరేకించారన్నది దుష్ప్రచారమే. అమరావతికి కులం రంగు పులిమిందీ చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేశ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.అమరావతి ఇప్పట్లో కాదని బాబే చెబుతున్నారుబాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెబుతున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదనా అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్లో ఉన్న రేటు రావడానికి ఎంత కాలం పడుతుంది? చంద్రబాబువన్నీ మభ్యపెట్టే మాటలే.ఇదీ నయా రాయ్పూర్ వాస్తవ పరిస్థితిచత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. రాయ్పూర్ కోసం ఆ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అదీ తీర్చేశారు. అక్కడ చేసిన ఖర్చు రూ.7 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని వస్తే ఇలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. చత్తీస్గఢ్లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్పూర్లో పెట్టారు. ఇక్కడ వికేంద్రీకరణ పెద్ద తప్పుగా దుష్ప్రచారం చేశారు.అమరావతి రైతులకూ అన్యాయం చేశారుచంద్రబాబు అమరావతి రైతులకూ అన్యాయం చేశారు. ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.అమరావతి సంబరాలను ప్రజలు, అధికారులు పట్టించుకోలేదుఅమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా వారు కూడా పట్టించుకోలేదు. -
అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..
సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపాయాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు? రాష్ట్రానికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశామని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్ ఇంజన్గా మారే అవకాశమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్ ట్రిక్స్కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనలో తప్పేంటి?‘మా నాయకుడు వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఉన్నారు. -
వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ
-
ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం
-
BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు
-
20 ఏళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని అమరావతికీ ఇదే పరిస్థితి..
-
YSR అన్నట్లు బాబు ప్రతి అబద్దపు మాట ఆణిముత్యమే
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
-
‘రాజీనామా చేయ్.. బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: టీటీడీ ఛైర్మన్ నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిను తొలగించాలంటూ నిరసన చేపట్టారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంంలో కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు.బీఆర్ నాయుడు వచ్చాక అనేక వివాదాలు, అపశ్రుతులు జరిగాయని.. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా బీఆర్ నాయుడు వ్యవహరించారన్న భూమన.. బీఆర్ నాయుడిని తొలగించకపోతే మరింత ఉధృతంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా కొనసాగించడం చంద్రబాబు చేతగానితనం అంటూ మండిపడ్డారు. లడ్డూ గురించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మహిళను 30 ఏళ్లుగా బీఆర్ నాయుడు చిత్రహింసలకు గురిచేశాడు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ వ్యక్తిగత విషయాలు బీఅర్ నాయుడు బయటపెడతారని భయపడుతున్నారా?...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు. బీఅర్ నాయుడిపై ఎందుకు స్పందించలేదు. నెయ్యి విషయంలో ఏమి లేకపోయినా మెట్లు కడిగావ్. మరి ఇప్పుడు బీఅర్ నాయుడు విషయంలో ఎలాంటి ప్రోక్షణ చేస్తావ్. లడ్డూ గురించి సీఎం చంద్రబాబు పచ్చి అబద్దపు మాటలు చెప్పారు. చివరికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏంలేదని తేలింది. ఇప్పటికైన చంద్రబాబు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
BR నాయుడును చూసి అబ్బా, కొడుకులు వణికిపోతున్నారు.. RK రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
లక్షల కోట్లు అప్పు.. డెవలప్ చేస్తున్నావా.. ముంచుతున్నావా?
-
దేవతల రాజధాని అమరావతిని చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది
-
BR నాయుడుపై చర్యలు ఎక్కడ? ఏపీ వ్యాప్తంగా YSRCP నిరసనలు
-
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికితోడు పరీక్షల వ్యవస్థను సర్కారు అపహాస్యం చేస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా, బయట సిలబస్ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లిష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదమేర్పడింది. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆరు మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ.. గతేడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షల కోసం ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టీ పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ సెట్టింగ్లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి.. 35 శాతం మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థీ రాసేలా, మరో 15 శాతం కష్టతరంగా, మిగిలిన 50 శాతం మధ్యస్తంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది ఎవరికీ అర్థంగాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ఇంగ్లిష్లో పేపర్లో ఇచ్చిన తప్పు ప్రశ్నలివీ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలప్రశ్నపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూప్రింట్కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లిష్ పేపర్ను పరిశీలిస్తే.. » జంబుల్డ్ సెంటెన్స్ (ప్రశ్న నం.17)లో సాధారణంగా ఒక స్టోరీ లేదా ఒక ఘటనను ఇచ్చి, అందులోని కొన్ని పదాలను అటు ఇటుగా మార్చి (జంబుల్), ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. కానీ ఈసారి పేపర్లో ఒక స్టోరీని పూర్తిగా ‘రివర్స్’లో వెనుక నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఐదు మార్కులు కోల్పోయారు. » ఎడిటింగ్ (ప్రశ్న నం.22): ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చిన పాసేజ్లో ఎడిట్ చేయాల్సిన సెంటెన్స్ను ‘అండర్ లైన్’ చేయాలి. గతంలో జరిగిన పరీక్షల్లో ఇచ్చిన పాసేజ్లో నాలుగు వర్డ్స్ను అండర్లైన్ చేసి ఇచ్చారు. కానీ పబ్లిక్ పరీక్షలో మాత్రం ఒకే పాసేజ్ ఇచ్చి ఎక్కడ ఎడిట్ చేయాలో అండర్లైన్ చేయలేదు. 4 మార్కులు కోల్పోయారు. » అడ్వైస్ (ప్రశ్న నం.26): సెంటెన్స్లో ఇచ్చిన ‘నౌన్’ను ఉద్దేశించి అడ్వైస్ ఇస్తారు. కానీ, ఈసారి పరీక్షలో నౌన్కు కాకుండా నౌన్ తండ్రికి అడ్వైస్ ఇవ్వమని అడిగారు. అంటే విద్యార్థులకు బోధించని, సిలబస్లో లేని ప్రశ్నను ఇవ్వడంతో 2 మార్కులు కోల్పోయారు. » ఆపోజిట్ వర్డ్స్ (ప్రశ్న నం.28): ఇది పూర్తిగా సిలబస్లో లేనిది, బ్లూప్రింట్కు సంబంధం లేనిది ఇచ్చారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న కావడం గమనార్హం. ఫిజికల్ సైన్స్లోనూ అదే తీరు ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ సిలబస్లో లేని ప్రశ్నలే ఇచ్చారు. వారి ఐక్యూ స్థాయిని అంచనా వేసేవిగా మార్చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో విద్యార్థులు కచ్చితంగా ఏరోజు ఏ ప్రశ్నలు చదవాలో సిలబస్ ఇచ్చా రు. కానీ ఆ జాబితాలోని మోడల్స్కు, వెయిటేజీకి విరుద్ధంగా ప్రశ్నలు సైతం సందిగ్ధంగా, అసాధారణ రీతిలో ఇవ్వడంతో విద్యార్థులు సరిగా రాయలేకపోయారు. ముఖ్యంగా 8, 11, 14(1), 14(4), 3వ ప్రశ్నలు అసాధారణ రీతిలో ఇవ్వడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వీటికి ఆరు మార్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ వంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితమవుతూనే ఉంటాయన్నారు. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్, మోనిటైజేషన్ ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్నామని తెలిపారు. రాజధానిలో భూమి విలువలు పెరుగుతాయని, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను ఇచ్చారని చెప్పారు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతేనని చెప్పారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. పార్లమెంటు శాశ్వత రాజధాని అని చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్లాన్ ఏ, ప్లాన్ బీ చేస్తామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని అవుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 నాటికల్లా రాజధానిలో ప్రధానమైన పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపారు. -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీవైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు. వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధిదేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్ను రాజధాని కారిడార్గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.ఇతర మౌలిక వసతులకు కొదవలేదుఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది. అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభామావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. మావిగన్తో అందరికీ మేలురాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం అత్యంత వాస్తవిక ఆలోచనమావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం -
‘అప్పు’డే తెల్లారింది!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) చేయనున్న బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. సూపర్ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? ఆర్బీఐ చేత అప్పుల క్యాలెండర్ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. 2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్ ఇలా తేదీ అప్పు మొత్తం (రూ.కోట్లలో) ఏప్రిల్ 7 4,400 ఏప్రిల్ 21 4,600 మే 5 4,400 మే 19 4,600 జూన్ 2 4,400 జూన్ 16 4,600 మూడు నెలల్లో అప్పు రూ.27,000 కోట్లు బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ రుణం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ విజయానంద్ దీంతో ఏపీపీఎఫ్సీఎల్ అప్పు రూ.13,610 కోట్లు సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్ల టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్ ఆఫ్ కంఫర్ట్ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది. -
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
‘నిన్నటి వరకూ గ్రాఫిక్స్ కథలు.. ఇప్పుడేమో..’
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడిన మాటలు అంతా మోసపూరితం, అసత్యాలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యద్భుత రాజధాని అని నిన్నటి వరకు గ్రాఫిక్స్ కథలు చెప్పారని, రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తా అని చంద్రబాబే చెప్పారని, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ అంటూ మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ‘రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు మారిపోయాయి అని టీడీపీ హడావుడి చేస్తోంది. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు మోసపూరితం, అసత్యాలే. మొన్న రెండేళ్లలో రాజధాని పూర్తి అని చెప్పారు.. ఈ రోజు ఇది నిరంతర ప్రక్రియ, కొంత భాగం మాత్రమే పూర్తి చేస్తా అంటున్నారు. లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో అప్పులు తీసుకుని నామమాత్రపు పనులు చేశారు. విభజన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతి రాజధాని అని చెప్పాయని అబద్ధపు మాటలు చెప్పారు. మేధావులు ఆ కమిటీల రిపోర్ట్ ఇప్పటికీ చూడవచ్చూ. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కమిటీల పేర్లు చెప్తున్నారు. 44 శాతం మంది అమరావతికి ఒకే చెప్పారు అంటున్నారు...మరి మిగిలిన 56 శాతం గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడూ రైతు గురించి మాట్లాడటం లేదు...కేవలం అక్కడున్న రియల్ ఎస్టేట్ కోసమే మాట్లాడతావు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోరాం...తుంగలో తొక్కారు. పోలవరం ఈయనే చేసాడట...వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ప్రజలకి తెలియదా..?అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది?విభజన సమయంలో 7 మండలాల విలీనం చేస్తామని కేంద్రం చెప్పింది. దాన్ని తీసుకుని ఆ మండలాలు ఇచ్చే వరకు నేను ప్రమాణం చేయను అని నాటకాలు ఆడాడు. జపాన్ సంస్థ మకీ బిహార్ కంటే ఇక్కడ దారుణ ప్రస్తుతులు ఉన్నాయని చెప్పింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నీ వల్ల నాశనమై పోయాడు. నువ్వు విట్, srm వంటి ప్రైవేటు సంస్థలు తెచ్చి ఏదో చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళు పిల్లల వద్ద లక్షలకు లక్షలు పిండేస్తున్నారు. అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది..?వైజాగ్ అంటే నానా యాగీ చేశారు..మిగతా రాజధానుల్లాగానే మనకూ ఒక మంచి నగరం ఉండాలని వైజాగ్ అంటే నానా యాగీ చేశారు. అన్నీ బాగుండాలనే జగన్కి పిచ్చా...ఏమీ లేని చోట గ్రాఫిక్స్ చూపే నీకు పిచ్చా...?, జగన్ ఇప్పుడు చెప్తున్నట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చేస్తే ఎంత బాగుండేది..?, తక్కువ ఖర్చుతో వాటిని అభివృద్ధి చేస్తే ఎంత అభివృద్ధి జరిగేది..?, కొత్త నగరం నిరంతర ప్రక్రియ అంటూ నువ్వే చెప్తున్నావు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు 4 వేలకు కడితే...నువ్వు అమరావతి 12వేలుతో కడతావా...?, ఆర్ధిక పరిస్థితి చూసుకుని వెళ్దాం అంటే నువ్వు దుర్మార్గుడివి అని ఎదురు దాడి చేస్తున్నారు..నువ్వు అక్కడ పెడుతున్న ఖర్చు ఉన్న నగరాల్లో పెట్టీ ఉంటే ఎంత సంపద సృష్టించే వాళ్ళం..?, ఇవన్నీ చెబితే ప్రతిపక్ష నేతను హేళన చేస్తూ మాట్లాడుతున్నారునేను చెప్పిందే వేదం అంటూ మేధావిలా ఫోజులు కొడుతున్నారు. చట్టబద్ధత పేరుతో అమరావతిని కేంద్రం చేతుల్లో పెట్టాడు. ఏ రాష్ట్ర రాజధానికి ఇలా చట్టబద్ధత తీసుకోలేదు. రాయలసీమకు ఏం చేశావో ఒక్కటి చెప్పు.. నీ నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏమీ చేశావో ఒక్కటన్నా చెప్పు. కర్నూలు హైకోర్టు మొదలుపెడితే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లావు. మేము మనుషులం కాదా...మాకు సెంటిమెంట్లు ఉండవా...?, అమరావతి దేవతల రాజధాని అయితే..కర్నూలు పరమ శివుడి తిరుగాడిన ప్రాంతం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మాకు లేదు...నువ్వే వాటిని రాజేస్తున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు, నేడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టావు. నీకు తెలంగాణపై ఉన్నంత ప్రేమ రాయలసీమపై లేదా..?, నీలా ఒక ప్రాంతాన్ని కాకుండా రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్తో సంబంధం లేదని మొన్న చట్టం చేశారు...మరి ఉమ్మడి ఆస్తులు సంగతి ఏమిటి..?, తెలంగాణలో నిన్ను తరిమేస్తే వచ్చి...కట్టుబట్టలతో వచ్చానని చెప్పడం దేనికీ..?జగన్ చేపట్టిన పోర్ట్, మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజల జీవితాలను మార్చేశారు. రాయచోటి జిల్లా కేంద్రం తీసేసిన నీకు అక్కడి ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయని తెలియదా...?, అమరావతిలో ఏదో జరిగితే మా రాయలసీమ ప్రాంతపు వాదులు అమాయకంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అలా ఆదేశాలు ఇచ్చి మరీ పండగ అంటూ హడావుడి చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్ట. రాజ్యసభలో అమరావతి అని మాట్లాడించి కులాల కుంపట్లు రాజేస్తూ ఇతరులను విమర్శిస్తున్నారు. రేణుకా చౌదరీ మాటలను మీలో ఎవరైనా ఖండించారా...?, ఆనాడు జలయజ్ఞం నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకూ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని కులాల పరంగా చిచ్చులు పెట్టీ రాజకీయ లబ్ది పొందుతూ మమ్మల్ని అంటే ఎలా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమరావతి టైం లైన్పై చేతులెత్తేసిన చంద్రబాబు
సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్లైన్పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. -
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. దేవతల రాజధాని నిర్మిస్తున్నానంటూ 2014లో మొదలు పెట్టారు. చంద్రబాబు భూ దోపీడీకి పాల్పడుతున్నారు. 50 వేల ఎకరాలు భూమి కావాలని బంగారు పండించే భూములను రైతుల వద్దనుండి దుర్మార్గంగా లాక్కున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన బాబు.. ఇప్పటికి 80 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు అయినా పడుతుంది. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. 47 వేల కోట్లు రాజధానికి అప్పు చేశారు.. ఇప్పటికి 13 వేల కోట్లు అప్పుచేశారు.భవన నిర్మాణం చదరపు అడుగు 4 వేలు ఉంటే 14 వేలు ఖర్చు చేస్తూన్నారు.. 22 నెలల్లో 3 లక్షల 41 వేల కోట్లు ఇప్పటివరకు ప్రజల పేరుతో అప్పు చేశారు. అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం. చంద్రబాబు ఉన్నన్నిరోజులు రాజధాని నిర్మాణం పూర్తి చేయలేరు’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?...డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?. నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్ను విడుదల చేయండి...ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్మెన్లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు...నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు
-
నీ ఇల్లు, మంత్రి నారాయణ ఇల్లు ఉంటే రాజధాని చేసేస్తావా..
-
అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు
-
జగన్ పై కోపంతో ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు
-
అమరావతిలో తినాలంటే ఎప్పటికీ తిండి దొరకదు తాగాలంటే టీ కూడా దొరకదు
-
మాతాలు, కులాలు మధ్య చిచ్చు.. కేతిరెడ్డి స్టాంగ్ కౌంటర్
-
కేవలం రాజధాని గుర్తింపు కోసం బిల్లు.. బాబు అసలు కుట్ర ఇదే
-
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
-
క్యాపిటల్ ముసుగులో బాబు వేలకోట్ల దోపిడీ ఆధారాలతో ఉతికారేసిన జగన్
-
జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి
-
నారాయణ మన బాబు గారికి చెప్పాడట వైఎస్ జగన్ సెటైర్లు అదుర్స్
-
అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేవు అమరావతికి 2 లక్షల కోట్లు ఎక్కడ నుండి తెస్తావ్
-
అమరావతి కుంభకోణం పై POINT to POINT సంచలన నిజాలతో జగన్
-
హైకోర్టు, సచివాలయం అసెంబ్లీ, కేవలం డిజైన్స్ కోసమే 401 కోట్లు.. ఏంది సామీ ఇదంతా..!
-
అమరావతికి YSRCP వ్యతిరేకం కాదు
-
ఏపీ కొత్త రాజధాని MAVIGUN!
-
కిలోమీటర్ కు 170 కోట్లా..కొంచమైనా సిగ్గుందా బాబు
-
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్సభలో సమాజ్వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
బాబు చేసే దోపిడీకి.. వీరప్పన్ కూడా సరిపోడు..
-
గోల్డ్ బిస్కెట్లతో కడుతున్నావా? బాబుపై జగన్ సెటైర్లే సెటైర్లు
-
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
దేశంలోనే అతిపెద్ద స్కాంకు, కరప్షన్ కు బాబు క్యాపిటల్
-
స్కామ్లు రాజధాని అమరావతి..చంద్రబాబు కష్టపడి సాధించిన ఘనత
-
బాబు అమరావతి అవినీతి చిట్టా.. విస్తుపోయే షాకింగ్ నిజాలను బయటపెట్టిన జగన్
-
దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు. -
మీ కుటుంబాల అడ్రస్ చెప్పమంటావా.. బాబు, పవన్, లోకేష్ కు ఇచ్చిపడేసిన జగన్
-
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
అడ్వాన్సుల పేరుతో 8 వేల కోట్లు సర్వనాశం చేశాడు..
-
మీ కుటుంబాలు అన్నీ ఎక్కడున్నాయో నన్ను చెప్పమంటావా చంద్రబాబు వైఎస్ జగన్ షాకింగ్ నిజాలు
-
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని మీ మంత్రులే చెప్పారు.. ఇప్పుడేమో డ్రామాలు
-
LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
బతుకులతో బాబు చధరంగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాలనలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.రూ.1.25 లక్షలు నష్టపోతున్నా ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా. – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లాపెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – మద్దిరెడ్డి వెంకటరెడ్డి, అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
అమరావతి నాటకం.. చట్టబద్ధత బూటకం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్లతో చెలరేగిపోయారు.కేంద్రానికి సంబంధం లేకపోయినా..రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.భవిష్యత్లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు. ‘డబ్బుల్’ ధమాకా..రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రంరాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
మదనపల్లె: నాలుగుసార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని రైతులను ప్రశ్నించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్ రౌండ్టేబుల్ సమావేశంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా గోదావరి జలాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం ద్వారా కృష్ణా జలాలు రాయలసీమ రైతులకు అందకుండా చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం తప్ప ప్రేమ లేదన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి 40 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకునేలా కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టి అన్యాయం చేస్తుంటే రైతులు చూస్తూ ఊరుకుంటే ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. లిఫ్ట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని వీటిని స్వయంగా తాము పరిశీలించినట్టు చెప్పారు. మిగిలిన పనులు పూర్తయితే రాయలసీమకు సాగు కష్టాలు తీరుతాయన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తరలించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని, ఈ విషయం అక్కడ ప్రజలే చెబుతున్నారని అన్నారు. రాయలసీమ నిధులను ఎవరబ్బ సొత్తని అమరావతి రాజధాని కోసం తరలిస్తున్నారని ప్రశ్నించారు. చదరపు అడుగు నిర్మాణ ధర రూ.6,500 ఉంటే.. ఏ ధరలు పెరిగాయని రూ.11,500 పెంచి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.సీమకు ప్రమాద ఘంటికలురాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు సాధన కో–ఆర్డినేటర్ సాకే శైలజానా«థ్ మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్మట్టితో 200 టీఎంసీలు నిలిచిపోతాయని, కృష్ణాకు అందాల్సిన 100 టీఎంసీలు దక్కవన్నారు. అప్పర్ భద్ర, తుంగ ద్వారా 30 టిఎంసీల నీళ్లు ఆగిపోతాయన్నారు. ఈ జలాలు ఆగిపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిరాక ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. నీటి సమస్యపై మాట్లాడితే చంద్రబాబు నోరుమెదపరన్నారు. శ్రీశైలంలో మిగిలే 21 టీఎంసీల బురద నీళ్లే అంటున్న చంద్రబాబుకు ఆ బురదనీటి విలువ ఏమిటో తంబళ్లపల్లె, అనంతపురం ప్రాంతాల రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. రాయలసీమకు నీళ్లు రావడం, పొలాలు పండటం చంద్రబాబుకు ఇష్టముండదన్నారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్.రమేష్కుమార్రెడ్డి, తిప్పారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ ఆహ్మద్ మాట్లాడుతూ.. రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించుకునేందుకు చంద్రబాబు దిగివచ్చేలా పోరాటం సాగించాలన్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. -
కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్
-
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం
-
‘సీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు’
సాక్షి,అన్నమయ్య: భవిష్యత్లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్గా ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.వైఎస్సార్సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీలకు షాక్.. ఉచిత విద్యుత్ కట్..!
-
Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు
-
కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి
-
Magazine Story: బాబు అప్పు ఏపీకి ముప్పు
-
ఖాళీ కుర్చీలు జనాలు లేని సభలు కూటమి పతనం మొదలైంది
-
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారని, నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్ధాలే అందుకు నిదర్శనమని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే.. వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ఆయన గుర్తుచేశారు. అయినా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని, నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎవరు మంచి పని చేసినా దానిని తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కాకాణి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చెబుతున్న చంద్రబాబు 2014–19 మధ్య ఎన్ని స్థలాలిచ్చారు? ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామంటూ పచ్చి అబద్ధం చెప్పారు. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయిన వాటిని ఇవాళ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. రెండు లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉండగా మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేం సిద్ధం. 2019–24 మధ్య నిరుపేదలకు దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన 72 వేల ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టిన చరిత్ర వైఎస్ జగన్దే. టిడ్కో ఇళ్లు ఇచ్చిందీ వైఎస్ జగనే.. 2024 ఫిబ్రవరిలో 1.25 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్దే. అలా 1,43,600 ఇళ్లను అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా? ఇంకా 365 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేల చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అలాగే, 430 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.50 వేల చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 25 లేఅవుట్లలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలు ఉండకూడదంటూ ఆర్–5 జోన్లో మొత్తం 50,793 ఇళ్ల పట్టాలను రద్దుచేసింది.టిడ్కో ఇళ్లలో చంద్రబాబు అవినీతి.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగింది అవినీతి మాత్రమే. ముడుపులిచ్చిన కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అలాగే, లబ్ధిదారులపై విపరీతంగా భారం మోపారు. ఇలా టిడ్కో ఇళ్ల మీద రూ.8,929 కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి. -
ఖాళీ కుర్చీలు.. బాబు సభ అట్టర్ ఫ్లాప్
-
చంద్రబాబు నాయుడుపేట సభ అట్టర్ ఫ్లాప్
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్ఫ్లాప్ అయ్యింది. -
బాబు ఆలోచన విధానమే దోపిడీ మేం వస్తే మీకేంటి ఇబ్బంది..
-
నీకెందుకు ఈ బ్రతుకు ..!
-
మీడియాకు చంద్రబాబు సుద్దులు.. ఎల్లో మీడియాకు ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్
-
పడిపోతున్న పల్లీ ధరలు.. పట్టించుకోని బాబు సర్కార్
-
అమరావతి ముందు సింగపూర్ దేనికి పనికిరాదు.. భూములు ఇవ్వండి.. నిండా మునగండి
-
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
ఉగాదులు వెళ్లినా.. ఉషస్సులేవీ?
సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు. పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది. స్క్రిప్ట్డ్ సక్సెస్ స్టోరీలు విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. విఫల పథకానికి విజయోత్సవాలా? పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నీ వికృత చేష్టలన్ని బద్దలైపోద్ది.. నాకు ఎల్లో మీడియా ఉందని రెచ్చిపోతే..
-
తిరుపతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా..
-
దిగజారిన వేరుశనగ ధర
సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. నాణ్యత లేదనే వంకలతో కోతలుకాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్సిక్స్తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
పునర్విభజనలో 50 శాతం సీట్లుపెరుగుతాయి
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు. -
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
-
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ
-
అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ
-
ఏం ప్లాన్ వేశావ్ బాబు.. రాజధాని వెనుక ఇంత స్కామా..?
-
బాబు కుట్రలో భాగమే.. కార్టూన్ బరితెగింపు
సాక్షి, అమరావతి: విలువల వలువలు ఏనాడో విడిచేసిన ఈనాడు పత్రిక.. చంద్రబాబు ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధమని మరోమారు రుజువు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడానికి తహతహలాడే ఎల్లో మీడియా.. రాజధాని ముసుగులో మరోమారు దిగజారింది. రాజధాని అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసే రీతిలో ఓ దిగజారుడు కార్టూన్ను ఈనాడు పత్రిక శనివారం ప్రచురించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మార్కు పాత్రికేయ కుతంత్రానికి తెగబడింది. ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసం అనేక దిగజారుడు కార్టూన్లను ప్రచురించిన ఈనాడు పత్రిక అలాంటి దిగజారుడు కార్టూన్తో శనివారం పసుపు విషాన్ని పత్రికలో చిమ్మింది. ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్ చూసి ఆ పత్రిక పాఠకులే కాదు తెలుగు పాఠకులంతా ఛీత్కరించినట్లు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన నిరసనలే నిదర్శనం. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రాజధాని కట్టలేకే కార్టూన్ కుట్రలు రాజధాని నిర్మాణంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దుష్ప్రచార కుట్రకు తెగబడింది. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అనే అవాస్తవాన్ని పదే పదే ప్రచారం చేయాలన్న కుతంత్రంలో భాగంగానే ఈనాడు ఈ కార్టూన్ను ప్రచురించింది. దురుద్దేశపూరితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్టూన్ ప్రచురించింది. వైఎస్ జగన్గానీ వైఎస్సార్సీపీ గానీ రాజధానిగా అమరావతిని ఏనాడూ వ్యతిరేకించనే లేదు. మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు రాజకీయ కుట్రకు కొమ్ముకాసేందుకే 2019–24 వరకు ఈనాడు పత్రికతోపాటు పచ్చ మీడియా అంతా గగ్గోలు పెట్టి దుష్ప్రచారం సాగించింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజధానిగా అమరావతిని వైఎస్సార్సీపీ వ్యతిరేకించలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలనే డిమాండ్ చేస్తోంది. కానీ దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని అమరావతి నిర్మాణంలో ఎటువంటి కదలికా లేదు. రూ.20వేల కోట్లకుపైగా అప్పులు చేసినా సరే రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించి అవినీతికి పాల్పడుతోంది. టీడీపీ దోపిడీకి అమరావతి కామధేనువుగా మారిందన్నది స్పష్టమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపించేందుకే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోంది. రాజధాని నిర్మాణానికి 30ఏళ్లు పడుతుందని చెబుతోంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా వందేళ్లు పడుతుందని ఏకంగా బ్రిజేష్ కుమార్ కమిటీకి చంద్రబాబు ప్రభుత్వం నివేదించడం గమనార్హం. అంటే మాస్టర్ప్లాన్లో పేర్కొన్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం తమ తరం కాదని చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో అమరావతి పేరిట రెండో దశ, మూడో దశ భూసేకరణ పేరుతో చేస్తున్న హడావుడితో అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ‘అమరావతిపై అసెంబ్లీ తీర్మానం’పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. అదే అదనుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో సిండికేట్ ఈ దుష్ప్రచారానికి తెగబడింది. ఎన్టీఆర్పైనా దిగజారుడు కార్టూన్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయిన ఈనాడు పత్రిక ఆనాడు కూడా ఇలాంటి దిగజారుడు కార్టూన్లనే ప్రచురించింది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజూ కార్టూన్లు ప్రచురించింది. ‘ఆయనకు తెలివి లేదు... రోజూ గంటకు మించి ఆలోచించ లేరు... ఒంటిపై బట్టలు కూడా సరిగా వేసుకోలేరు’ అనే రీతిలో దిగజారుడు కార్టూన్లు ప్రచురించడం గమనార్హం. ఎన్టీ రామారావు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్లు పాత్రికేయ ప్రమాణాలను అథఃపాతాళానికి దిగజార్చాయి. ఆ దంపతులు ఇద్దర్నీ కించపరుస్తూ ప్రతి రోజు కార్టూన్లు ప్రచురించి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకువచ్చే దుష్ప్రచార కుట్రను బరితెగించి సాగించింది. కార్టూన్లలో ముఖ్యమంత్రిని ఏకంగా అర్ధనగ్నంగా చూపిస్తూ ఈనాడు పత్రిక తన కుట్రను పతాకస్థాయికి తీసుకువెళ్లింది. ఆ విధంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కేవలం 9 నెలల్లోనే భారీ కుట్రకు తెగబడ్డారు. అనంతరం 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి కుట్రకు సహకరించిన ఈనాడు రామోజీరావుకు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. ఎన్టీరామారావు ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించింది. తద్వారా రామోజీ ఫిల్మ్సిటీ వ్యాపార ప్రయోజనాలకు సహకరించింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అసైన్డ్ భూముల ఆక్రమణ తదితర అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ఆనాడు ఎన్టీరామారావు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన నాటి ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇవ్వడం గమనార్హం. పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈనాడు పత్రిక కార్టూన్ ప్రచురించడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈనాడు ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈనాడు పత్రికపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
నెల్లూరు రూరల్: రైతులను మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వరి కోతలకు ముందు పుట్టి ధాన్యం (845 కేజీలు) ధర రూ.22 వేలు ఉందని అధికారులు చెబితే.. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం ధరల పతనం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ పార్టీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివుని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాకాణి మాట్లాడుతూ.. మిల్లర్లు చేస్తున్న దోపిడీలో అధికారులు, మంత్రులు, పాలకులు వాటాలు పంచుకుంటున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లాలో రబీ సీజన్లో 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంటే.. కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు టార్గెట్ ఇవ్వడం చూస్తే.. రైతులను ఏ విధంగా మోసం చేస్తోందో అర్థమవుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2.5 శాతం మాత్రమే ధాన్యం కొంటున్నారని, మిగిలిన 97. 5 శాతం దళారులు, మిల్లర్లు దోచుకుపోతున్నారన్నారు. తేమ పేరిట 90 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు నిబంధనల ప్రకారం 17 శాతం కంటే ఒక శాతం అధికంగా తేమ ఉంటే క్వింటాల్కు ఒక కేజీ లెక్కన తరుగు కింద అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. పుట్టికి 90 కేజీల అదనపు తరుగు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన గన్నీ బ్యాగులు అందజేసి, అన్ని సదుపాయాలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు రూ.500 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.24 వేలు ధర వస్తే.. అది జగన్మోహన్రెడ్డి గొప్పతనం కాదని, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగాయని టీడీపీ నేతలు, పచ్చమీడియా దు్రష్పచారం చేశాయన్నారు. ఈ రోజు ధరలు పడిపోతుంటే ఇరాన్ యుద్ధం వల్ల అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
2028 నాటికి అమరావతి పూర్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మాదిరి ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని.. యుమునా నది పవిత్ర జలాలను, పార్లమెంట్లోని పవిత్ర మట్టిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. అమరావతి స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్–5(2)ను సవరిస్తూ కొత్తగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చడంతో పాటు సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ సీఎం చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు జవాబిస్తూ.. అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరని, అంగుళం కూడా కదిలించే పరిస్థితి రాదన్నారు. ‘ఏపీకి ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దృఢత్వం వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం’ అని తెలిపారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.అమరావతిలో ఆదాయం సృష్టిస్తాం‘నాలుగోసారి సీఎం అయ్యా. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే. ఆ రోజు సైబరాబాద్ను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశా. ఈ రోజు అమరావతిని అలా చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కు ఏపీ దేహం అయితే అమరావతి గుండె. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకునేలా తయారు చేసే బాధ్యత మనందరిది. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. ఇక్కడ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇక్కడి ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి తెస్తాం. దేశంలో ఇప్పుడున్న నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి భవిష్యత్ నగరం. వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలో, దేశంలో ఎన్ని లేటెస్టు టెక్నాలజీలు ఉన్నాయో అవన్నీ తెస్తాం. రాష్ట్రాన్ని విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. మూడు మెగా సిటీలు అభివృద్ధి చేస్తాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తాం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో తెలియదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు’ అని చంద్రబాబు అన్నారు. కేంద్రహోంశాఖకు తీర్మానం కాపీ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం కాపీని అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనివారం సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎస్కు పంపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల విభాగం (ఐ అండ్ పీఆర్) ఒక ప్రకటన విడుదల చేసింది. -
అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
-
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
‘మరి వైజాగ్లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’
కాకినాడ: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు. -
‘అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు’
విశాఖ: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. అమరావతిని వైఎస్ జగన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు. -
ఓటేసి తప్పు చేశాం... చంద్రబాబుపై తిరగబడుతున్న సొంత నియోజకవర్గ ప్రజలు
-
ఏపీలో గ్యాస్ కొరత... దాన్ని కూడా సంపద సృష్టిగా మార్చిన బాబు
-
పరిశ్రమలపై కక్షసాధింపు.. పేదలపై ధరల పిడుగు


