breaking news
YS Jagan Mohan Reddy Birthday
-
ఐర్లాండ్ లో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జీడీ నెల్లూరులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
అద్దంకిలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జగన్ పుట్టినరోజుకు వేడుకలు చేస్తారా?
అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారు.బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సహా ఐదుగురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా ఎందుకు నిర్వహించారంటూ పోలీసులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.జగన్ బర్త్డే వేడుకలకు సంబంధించి సరైన కారణాలు చెప్పకుండానే నేతలను అదుపులోకి తీసుకోవడం అక్రమ అరెస్టులేనని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సాక్షి విలేఖరి శాంత కుమార్ని ఎస్సై నరేంద్ర దుర్భాషలాడు. -
వైఎస్ జగన్ పుట్టిన రోజు.. రోజా ప్రత్యేక పూజలు
-
విశ్వవ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, అమరావతి / నెట్వర్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సంబరాలు విశ్వవ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ అభిమానులు, వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడిక్కడ కేక్లు కట్ చేసి సంబరాలు జరిపారు. అనేకమంది వర్చువల్ విధానంలో సెలబ్రేషన్స్ నిర్వహించగా.. మరికొందరు జూమ్ కాలింగ్ వంటి విధానాల ద్వారా పుట్టిన రోజు వేడుకలతో సందడి చేశారు. పలుచోట్ల వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్), అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని నార్త్ కరోలినా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో అభిమానులు కేక్లు కట్చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.యూకేలో వేడుకలు వైఎస్సార్సీపీ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కమిటీ, వైఎస్సార్సీపీ మిడిల్స్బరో యూత్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ(ఎన్ఆర్ఐ అఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ ఓబుల్రెడ్డి పాతకోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను మూడు యూకే నగరాలైన కోవెంట్రీ , మిడిల్స్బరో, షెఫీల్డ్లలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు యూకే నలుమూలల నుండి జగన్ అభిమానులు హాజరయ్యారు. యూకేలోని ఎన్నారైలు శంతన్రెడ్డి, జానీ, వంశీ, రాజారెడ్డి, అనిల్, ఉదయ్, మధు, మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.ఫీనిక్స్, ఆరిజోనాలో..వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఫీనిక్స్, అరిజోనాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కేక్ కటింగ్ చేసి.. వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ విధానంలో ప్రదర్శించారు. కార్యక్రమాల్ని సోమశేఖర్రెడ్డి యర్రాపురెడ్డి, వంశీ ఎరువారం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, గురు, లక్ష్మి, శ్రీనివాస్గుప్తా, శ్రీధర్ లక్కిరెడ్డి, రుక్మన్, రమేష్, శ్రీనివాస్ మొల్లాల, అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ మామిడి, విఘ్నేష్, కొండారెడ్డి, జగన్, రోహిత్ చెరుకుమిల్లి, జ్ఞానదీప్, అనుష, భవిష్య పర్యవేక్షించారు.న్యూజిలాండ్లోనూ.. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నారైలు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా ఏపీ వైఎస్సార్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్త్రెడ్డి, పార్థ పిల్ల, అమర్ ముదిమి, బాల బీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.యూరప్ దేశాల్లో సందడినెదర్లాండ్లోని వైఎస్సార్సీపీ యూరప్ యూనిట్ సభ్యులు, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఆదివారం సందడిగా సాగాయి. ఎయిండోవెన్లో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, యూరప్ కన్వీనర్ కార్తిక్ యల్లాప్రగడ, యూరప్ కోర్ టీమ్ ప్రతినిధులు సారథిరెడ్డి వంగా, కృష్ణతేజరెడ్డి గడ్డం, శ్రీనివాస్రెడ్డి సానికొమ్ము పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించిన ప్రదేశాలన్నీ జైజగన్ నినాదాలతో మార్మోగాయి.సింగపూర్లో జగన్ వైబ్స్ సింగపూర్లో వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం నిర్వహించారు. జై జగన్ నినాదాల నడుమ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇవ్వాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణ నేతృత్వం వహించగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. సింగపూర్ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, మలేషియా కన్వీనర్ విజయభాస్కర్రెడ్డి, మేడపాటి సందీప్, రామ్రెడ్డి, చంద్ర, సుహాస్, కిరణ్, సుధీర్, భాస్కర్, ప్రసాద్, పవన్, కుమార్, దొర హాజరయ్యారు.ఆస్ట్రేలియాలో..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలో సందడిగా సాగాయి. ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వింగ్ ఆర్గనైజర్గా కిరణ్సాయి ప్రసన్ననాయుడు అక్కడి ఎన్ఆర్ఐ సహచరులతో కలిసి వైఎస్ జగన్ జన్మదిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అరబ్ దేశాల్లోనూ సంబరాలుఅరబ్ దేశాలైన ఖతర్, కువైట్లలో ఆదివారం ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఖతర్లో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రక్తదానం చేసిన అందరికీ జగనన్న సంతకంతో ప్రశంసా పత్రాలను సాంబశివారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కో–కన్వీనర్లు, అడ్వైజర్లు హాజరయ్యారు. కువైట్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం షర్క్ బెనైదాల్ గార్ పిస్తా హౌస్ పక్కనున్న బ్లూమ్ హోటల్ బేస్మెంట్లో 600 మంది కువైట్ కమిటీ సభ్యుల నడుమ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి కేక్ కట్చేశారు. వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో–కన్వీన్లు రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, షా హుస్సేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేషష్రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లక్ష్మీప్రసాద్ యాదవ్, షేక్ రహంతుల్లా, షేక్ అప్సర్ అలీ, షేక్ యాసి, గల్ఫ్ అడ్వైజర్ ఎన్.మహేశ్వర్రెడ్డి, కో–కన్వీనర్ ఎం.చంద్రశేఖర్రెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
జగమంతా సంబరం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి గ్రామంలోనూ పండుగను తలపించేలా వేడుకలు జరుపుకొన్నారు. కేక్లు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. యువత, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసి వైఎస్ జగన్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పేదలు, అనాథలకు దుస్తులు పంపిణీ చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం, కేక్లు పంచిపెట్టారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు అవసరమైన పరీక్షలు చేసి మందులు అందించారు. నేత్ర వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. యువతకు షటిల్, క్రికెట్ పోటీలు, రైతులకు ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.ప్రత్యేక పూజలు.. పెద్ద ఎత్తున ర్యాలీలు..వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరిపించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని, 2029లో మళ్లీ సీఎం కావాలని వేడుకున్నారు. అదేవిధంగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్ జగన్ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో యువత భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ‘జై జగనన్న.. రావాలి జగనన్న.. కావాలి జగనన్న..’ అని నినదించారు. గ్రామాల్లో జరిగిన వేడుకల్లో రైతులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని వైఎస్ జగన్ పాలనలో తమకు కలిగిన లబ్ధి గురించి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టారు. ఇతర రాష్ట్రాలు.. దేశాల్లోనూ..జగన్ జన్మదిన వేడుకలను దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు తెలంగాణ, తమిళ నాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ సహా పలు దేశాల్లోనూ వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా జరుపుకొన్నారు. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్థులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో జగనిజం వైఎస్ జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షల పోస్టులతో సామాజిక మాధ్యమాలు హోరెత్తాయి. ఆదివారం ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం నుంచే సోషల్ మీడియాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్’ అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర మాధ్యమాల్లో వెల్లువెత్తిన పోస్టులు ట్రెండింగ్లో నిలిచాయి. అధిక వ్యూస్ సంపాదించాయి. ‘ఎక్స్’లో అయితే ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ హ్యాష్ట్యాగ్’ టాప్ ట్రెండింగ్గా నిలిచింది.మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా: వైఎస్ జగన్తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు, వైఎస్సార్సీపీ కటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అందరి మద్దతే నాకు గొప్ప బలం’ అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఉప్పొంగిన అభిమానం.. రక్తంతో జగన్ చిత్రపటం
ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, చిత్రకారుడు మిరప రమేష్ కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వీరాభిమానం. ఆదివారం తన రక్తంతో వైఎస్ జగన్ చిత్రపటం గీసి, హ్యాపీ బర్త్డే అన్నయ్యా.. అంటూ శుభాకాంక్షలు తెలిపి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. -
YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..
-
జగన్ అంటే జనం.. జనం అంటే జగన్
ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది.. ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది.. పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే.. సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు.. విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు.. అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్’ ఫాలోయింగ్ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్ జగన్మోహనుడు.బద్వేలు : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు. రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి. పడిలేచిన కెరటం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా .. 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు. జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు. నేడు జన్మదిన వేడుకలు..వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.మళ్లీ జగనన్న పాలనే రావాలి ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ లీడర్ అంటే జగనే ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్ కరీముల్లాకు 2021లో లివర్ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు సీఎంఓకి ఫోన్ చేశారు. కరీముల్లా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ ఆదుకున్న మనసున్న లీడర్ వైఎస్ జగన్..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు మా కుటుంబానికి దేవుళ్లు వైఎస్సార్.. వైఎస్ జగన్ మా కుటుంబానికి దేవుళ్లు. 2004లో వైఎస్ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం మా కుటుంబానికి అందలేదు. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్.. వైఎస్ జగన్ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. – పెసల కొండారెడ్డి, చియ్యపాడు, చాపాడు మండలంఎప్పటికీ రుణపడి ఉంటా..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాశినాయన మండలం, వైఎస్సార్ కడప -
జగన్లా ఒక్కరోజు పాలించినా చాలూ..!
ఉన్న మాటంటే ఉలుకెక్కువ.. చంద్రబాబుకి ఈ విషయంలో మరీనూ. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. 2019-2024 ఈ ఐదేళ్లు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. కరోనా లాంటి కష్ట కాలంలోనూ రాష్ట్రానికి జగన్ ఎంతో సమర్థవంతంగా పాలించడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. మరి విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అన్నీ బాగున్నా.. నాలుగుసార్లు సీఎంగా ఉండి చేసింది ఏంటి?. ఆ వివరాలే కాస్త లోతుల్లోకి వెళ్లి చెప్పుకుందాం..‘‘చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం..’’ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఓ ఖురాన్గా భావించే వైఎస్ జగన్ చెప్పే ముందు మాట ఇది. ఆ మాటను మడమ తిప్పకుండా ఐదేళ్లపాటు ఆచరణలో చేసి చూపించారాయన. ఇచ్చిన హామీలలే కాదు చెప్పని మంచిని చేసి చూపించి ఎన్నికల హామీలకంటూ ఒక నిర్వచనం.. ఓ పరిపూర్ణతను తీసుకొచ్చారు. మరి చంద్రబాబు చేసిందేంటి.. ఇప్పుడు చేస్తోంది ఏంటి?..మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుది. పైగా ప్రజలకిచ్చిన హామీల్ని ఎగ్గొట్టిన ట్రాక్ రికార్డ్ కూడా బాబుగారి సొంతం!. వీటికి తోడు ‘‘అమలు చేసేశాం’’ అంటూ హడావిడితో జనాల్ని మభ్య పెడుతూ.. కాకి లెక్కలతో కాలం గడిపేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ అప్పులతో ఏపీ శ్రీలంక అయిపోతోందని జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి.. తీరా ఈ ఏడాదిన్నరలో 2 లక్షల 66 వేల కోట్ల అప్పులు చేసి సౌత్ సూడాన్లా మార్చేస్తున్నారు. అందుకే చంద్రబాబులా.. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, జనాల్ని చీటింగ్ చేయడం తనవల్ల కాదంటూ జగన్ ఏనాడో తేల్చేశారు!.అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి.. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ చూసిన నిత్య చిత్రం ఇది. గ్రామస్థాయి పాలన మొదలుకుని రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు.. సకాలంలో ఆ పథకాల అమలు.. తద్వారా ప్రత్యక్ష లబ్ధిదారులకు నిధుల పంపిణీ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టి విప్లవాత్మక నిర్ణయాలతో పరిపాలించారు. మరీ ముఖ్యంగా పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మరి బాబుగారో..ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎటూ తిరిగి ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాల్లో చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఆయన పని చేసేది పెత్తందారుల కోసమే. తనకో విజన్ ఉందని చెబుతూ పెట్టుబడుల కోసం పాకులాడడం, పరిశ్రమలు.. కంపెనీలు రాబోతున్నాయంటూ హడావిడి చేయడం.. అమరావతి పేరిట అంతర్జాతీయ రాజధానంటూ ఊహాలోకంతో జనాలను మాయ చేయడం.. ఇదే ఆయనకు తెలిసింది. సీఎంగా ఇన్నేళ్లలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని ఆయన సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా.. రైతుల నుంచి మొదలు అన్నివర్గాలు ఆయన చేతుల్లో మోసపోయి అవస్థలు పడ్డాయి.జగన్ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. దిశ లాంటి చట్టం, యాప్తో మహిళలు భద్రంగా ఉండేవాళ్లు. ఆ ఐదేళ్లలో నేరాలు-ఘోరాలు పెద్దగా రికార్డు కాలేదు. సమత్యుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల కోసం తీవ్రంగా ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. అయినా కూడా ఐదేళ్లపాటు జగన్ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్మని రోజంటూ లేదు. ప్రజల్లో లేని భయాలు.. అపోహలు సృష్టించుకుంటూ వచ్చింది చంద్రబాబుకి బాకా ఊదే మీడియా.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా. మరి ఇప్పుడు కూటమి పాలనలో ఏం జరుగుతోంది?..👉నవరత్నాలతో పేద, రైతు, మహిళ, వృద్ధులు, విద్యార్థులు.. ఇలా ప్రతీ వర్గానికి మేలు చేసింది ఎవరు?. అన్ని వర్గాలను మోసం చేసింది.. చేస్తోంది ఎవరు?.. సంక్షేమం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఎవరు?. తల్లికి వందనం.. నిరుద్యోగ భృతి.. సంక్షేమాన్ని ఎగ్గొడుతోంది ఎవరు?. ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పునాది వేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు?.. 👉రైతు భరోసా రూపంలో అన్నదాతకు ఆర్థిక సాయం.. ఆర్బీకేలతో అన్నివిధాలుగా ఆదుకుంది ఆదుకుంది ఎవరు?. అన్నదాత సుఖీభవతో మోసం చేస్తోంది ఎవరు?.. గిట్టుబాట ధర అందించడంతో పాటు బీమాలు, సకాలంలో పంట నష్టాలు అందించింది ఎవరు?. వ్యవసాయం దండగ అన్నది ఎవరు?.. గిట్టుబాటుధర లేక అల్లాడుతున్న రైతుల్ని గాలికొదిలేసింది ఎవరు?. 👉నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బాగుచేసింది ఎవరు?.. వాటిల్లో ట్యాబులిచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను పేద పిల్లలకు అందించే ప్రయత్నం చేసింది ఎవరు?. అవే బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించింది ఎవరు?.. పిల్లలకు నాసిరకం బ్యాగుల్ని అందిస్తోంది ఎవరు?. 👉గ్రామ సచివాలయాల పేరిట ప్రజలకు ఒకే దగ్గర వివిధ సేవల్ని అందించింది ఎవరు?.. వలంటీర్ లాంటి వారధి వ్యవస్థను మోసం చేసి నిర్వీర్యం చేసిందెవరు?. క్యూల అవసరమే లేకుండా ఒకటో తేదీనే ఫించన్లు.. రేషన్ను డోర్డెలివరీ చేసింది ఎవరు?.. ఫించన్ హామీని నెరవేర్చకుండా.. లబ్ధిదారుల్లో కోతలు విధిస్తోంది ఎవరు?. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించింది ఎవరు?. విలేజ్ క్లినిక్స్.. ఫ్యామిలీ డాక్టర్తో ప్రజల వద్దకే వైద్యం చేర్చింది ఎవరు?.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది ఎవరు?.👉పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. పిల్లలకు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీల కట్టించింది ఎవరు?.. ఇప్పుడు వాటిని ప్రైవేట్పరం చేస్తోంది ఎవరు?.. కరోనా కాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది ఎవరు?.. కరోనా కాలంలో పొరుగు రాష్ట్రం పారిపోయింది ఎవరు?.. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఎవరు?.. ఆ ప్రజల జీవితాల్ని పట్టించుకోనిది ఎవరు?.👉అసలు అభివృద్ధి చేసిందెవరు?.. ఆ అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. క్రెడిట్ కొట్టేస్తుందెవరు?.. ఏపీని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేసి.. కేంద్రం నుంచి అవార్డులు, పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఎవరు?.. ఇప్పుడు ఏపీని పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు మారుస్తోంది ఎవరు?. ఎవరిది సంక్షేమం.. ఎవరిది మోసం.. అబద్ధాలతో ఎల్లకాలం పాలించగలరా?.. ఏపీ ప్రజలు ఆ మాత్రం ఆలోచించలేరా?..కాకిలా కలకాలం కాదు.. హంసలా బతకాలంటారు పెద్దలు(చంద్రబాబు లాంటి వాళ్ల కాదు). నిబద్ధత కలిగిన నాయకుడంటే ఎలా ఉండాలో.. ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో.. జగన్ చూసైనా నేర్చుకోవయ్యా చంద్రబాబూ. నీ జీవితంలో కనీసం అలా ఒక్కరోజైనా పాలించగలవా?.. -
జగన్ మావయ్యతో క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
ఇల్లు ఇచ్చి.. సోదరిగా బట్టలు పెట్టారు
సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన బండి విశాల భర్త సింహాచలం కోవిడ్ సమయంలో మరణించారు. ఎటువంటి ఉపాధీ లేక, దిక్కు లేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు రోడ్డులో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆమె ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ సమయంలో సోదరిగా భావించి, తనకు బట్టలు పెట్టడం ఎప్పటికీ మరచిపోలేనని విశాల చెమర్చిన కళ్లతో చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రినే ప్రజలు కోరుకుంటారని అన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఉచిత వడ్డీ సైతం ఆమెకు అమలు చేశారు. దీంతో నాలుగు వాయిదాల్లోనే విశాల రుణ బకాయి మొత్తం చెల్లించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి రుణం సైతం సులభంగానే లభించింది. ప్రస్తుతం ఆ రుణ బకాయి ఉండటంతో నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే విశాల పెద్ద కుమార్తె మేఘన ఫీజు రీయింబర్స్మెంట్ సాయంతో బీఎస్సీ పూర్తి చేసి, డిప్లమో చేసింది. చిన్న కుమార్తె కీర్తిప్రియకు అమ్మ ఒడి పథకం అమలైంది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. తమ ఒక్క కుటుంబానికి ఇన్నివిధాల సాయం చేసిన జగన్ మేలును జీవితాంతం గుర్తుంచుకుంటామని, తమ ఆయుష్షు కూడా పోసుకుని, ఆయన నూరేళ్లు సంపూర్ణ జీవితం గడపాలని విశాల ఆకాంక్షించారు. -
కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని.. ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు’’ అని సజ్జల అన్నారు.‘‘2014లో అధికారంలోకి రాలేకపోయాం. నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. అన్నీ ఛేదించుకుని 2019లో అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించిన నాయకుడు జగన్. ఐదేళ్ల తర్వాత మేనిస్టోని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ అమలు వేశామో లేదో చెప్పమనిప్రజల్నే అడిగారు. మళ్ళీ అధికారంలోకి కచ్చితంగా వస్తాం. భారీ సీట్లతో గెలుస్తాం. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్కు ఆదరణ ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
నువ్వే కావాలి.. మళ్లీ రావాలి
సాక్షి, రాజమహేంద్రవరం: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్ల కటింగ్తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు.ఇదీ సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘నవరత్నాలు’ పేరిట తొలుత అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, చేయూత, రుణమాఫీ, పింఛను కానుక తదితర 9 రకాల పథకాలను జగన్ తీసుకొచ్చారు. వాగ్దానం చేసినవే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేశారు. తన పాలనా కాలంలో మొత్తం 33 పథకాల ద్వారా జిల్లా ప్రజలకు రూ.25,436 కోట్ల మేర సంక్షేమాన్ని అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కడా పైసా లంచం ఇవ్వనవసరం లేకుండానే.. పార్టీ, వర్గం, కులం అనే భేదం చూడకుండా.. కేవలం అర్హతే ప్రామాణికంగా.. వలంటీర్ల ద్వారా గడప వద్దనే సంక్షేమాన్ని అందించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల జారీని సైతం సచివాలయాల ద్వారా సులభతరం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు అందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో సైతం చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు. ప్రగతి గురుతులు పల్లెల ప్రగతికి ఎనలేని తోడ్పాటునందించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, జగనన్న కాలనీలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు రూపుదిద్దుకున్నాయి. మన బడి నాడు – నేడు పథకం ద్వారా 1,069 పాఠశాలల్లో భవనాల నిర్మాణానికి, ఇతర వసతుల కల్పనకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, జగనన్న విద్యా కానుక కింద నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, షూస్, సాక్స్, బెల్టులు, మంచి బ్యాగ్ల వంటి వస్తువులు అందజేశారు.68,518 మంది పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1,233.34 కోట్లు ఖర్చు చేశారు. 3,079 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు, 279 రైతు భరోసా కేంద్రాలకు రూ.52.31 కోట్లు, 208 హెల్త్ క్లినిక్లకు రూ.38.17 కోట్లు వెచ్చించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 1,443 పనులకు రూ.52.89 కోట్లు ఖర్చు చేశారు. 15,369 చిన్న పరిశ్రమలకు రూ.670.85 కోట్ల మేర రాయితీలు అందజేశారు.గత టీడీపీ ప్రభుత్వంలో అధ్వానం 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కావాలంటే వారు టీడీపీ వారో లేక ఆ పార్టీ సానుభూతిపరులో అయి ఉండాలి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు తప్పనిసరి. ఆపై పథకానికి ఇంత అని రేటు నిర్ణయించి మరీ వసూలు చేసేవారు. ఆ తరువాత కూడా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి. వారు చెప్పిన మొత్తం ముట్టజెప్పకపోతే పథకం అందేది కాదు. రూపురేఖలు మారబడిదేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కలి్పంచారు. అప్పటి వరకూ యూపీ స్కూల్గా ఉండగా.. దీనిని జెడ్పీ హైసూ్కల్గా అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి. పాఠశాల బాగుంది నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది. – మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైసూ్కల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం -
ఈ రోజు నా భర్త ఇలా ఉన్నారంటే ఆయన చలవే
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సమాజంలో వైద్యులను దేవుడితో సమానంగా ప్రజలు చూస్తారు. అలాంటి వైద్యుడికి ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాణాలు కాపాడారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... ‘‘కరోనా రోజుల్లో నా భర్త నర్తు భాస్కరరావు అప్పటి ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. నేను గుంటూరు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్నాను. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ 2021 ఏప్రిల్లో కరోనా బారిన పడ్డాం. కొద్దిరోజుల్లోనే కోలుకున్నా. నా భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంతోమంది మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని మానవత్వంతో సహాయం చేశారు. విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాం. కష్టాలు పడుతూనే వైద్యం అందించాం. ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, మారిస్తేగానీ బతకరని తెలియడంతో చైన్నె తీసుకువెళ్లాలంటే ఎయిర్ లిఫ్టింగ్కే రూ. 26 లక్షలు అవుతాయని చెప్పారు. దీంతో హైదరాబాద్ కిమ్స్కు తీసుకువెళ్లాం. అక్కడ ఎక్మో దొరకడం ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి క్షీణించింది. బ్రెయిన్డెడ్ అని నిర్ధారించి ఇంటికి తీసుకెళ్లమన్నారు. వైద్యురాలిగా బతికించుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని బతిమాలడంతో మరిన్ని పరీక్షలు చేసి మెదడు పని చేస్తుందని గుర్తించారు. హైదరాబాద్ వైద్యులు చికిత్స ప్రారంభించారు. 40 రోజులు ఎక్మో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. జూన్ 4న ఆసుపత్రిలో చేరాం. జూలై 14న ఊపరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఊపిరితిత్తులు డోనర్ దొరకడానికి జాప్యం జరగడంతో 40 రోజులు ఎదురుచూశాం. ఆపరేషన్ సుమారు పది గంటలకు పైగా పట్టింది. మొత్తం ఖర్చు రూ. 1.17 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వమే మంజూరు చేసింది.వంద రోజులకుపైగా బెడ్పైనేఆపరేషన్ అనంతరం వంద రోజులకుపైగా బెడ్పై ఉంచారు. నరాలు చచ్చుపడిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రతి పని నేర్పించాను. ఊపిరితిత్తులు నూతనంగా అమర్చడంతో ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో డాక్టర్ భాస్కరరావు, నేను క్లాస్మేట్స్. 2001లో ఎంబీబీఎస్ అభ్యసించాం. ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లో కూడా ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మార్చడానికి గ్రీన్ చానల్ ఏర్పాటు చేయించారు. జగన్మోహన్రెడ్డి చేసిన సాయం మాకు ఊపిరిగా మారింది. ’’ -
ఐదు ముక్కల్లో జగన్ మార్కు అభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...1. భారీ పెట్టుబడులు..ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. 2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.4. పారిశ్రామిక విధానం..సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్హెచ్జీ గ్రూపు లబ్ధిదారులే.5. పండుగలా వ్యవసాయం..2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది. -
జగనన్న బర్త్డే.. సోషల్ మీడియా షేక్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్లో టాప్ ట్రెండింగ్గా ‘హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్ఫారమ్లలోనూ పోస్టులతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.వైఎస్ జగన్ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్ ట్రెండింగ్లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్ట్యాగ్లు గ్లోబల్ ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. Happy Birthday @ysjagan Anna 🫂🤍నీ నవ్వు వరం…నీ కోపం శాపం…నీ మాట శాసనం…నీ గెలుపు ప్రతి పేదవాడి ఇంటికి వెలుగు….#HappyBirthdayYSJagan pic.twitter.com/lXNmI8pGsE— FREDDY (@Fr9ddyy) December 20, 2025మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏపీవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది. ఇది కేవలం ఏపీకే పరిమితం కాలేదు. ఇటు తెలంగాణలోనూ జగన్ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఒక వేడుకలా నిర్వహిస్తుండడం గమనార్హం.Jagan Anna Bday Massive Celebrations!🔥Bike Rally At HYDERBAD!#HappyBirthdayYSJagan pic.twitter.com/RVWIeoJqal— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 20, 2025 -
చల్లగా ఉండు జగనన్నా..
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీ వద్ద జగనన్నా నిండు నూరేళ్లు చల్లగా ఉండు అంటూ నమస్కరిస్తూ వాసుపల్లి కనిపించారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. -
#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి
నేడు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా బర్త్డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారు. -
వైఎస్ జగన్.. అరుదైన (రేర్) ఫొటోలు
-
ఆత్మబంధువు
సాక్షి, విశాఖపట్నం : ప్రజా సంక్షేమమే పరమావధిగా.. అభివృద్ధే లక్ష్యంగా సాగిన అపూర్వ పాలన అది. కులం చూడకుండా, మతం అడగకుండా, రాజకీయ రంగులతో సంబంధం లేకుండా అర్హతే ప్రాతిపదికగా ప్రతి ఇంటా సంక్షేమ జ్యోతిని వెలిగించిన ధీశాలి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కరోనా వంటి మహమ్మారి కమ్మేసినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. తలవంచకుండా నవరత్నాల రథాన్ని దిగి్వజయంగా ముందుకు నడిపించి, పేదోడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, డిజిటల్ విద్యకు నాంది పలికి భావితరాల భవిష్యత్తుకు బాటలు వేశారు. సచివాలయ వ్యవస్థతో పాలనను గడప వద్దకే చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చిన ప్రజా నాయకుడు ఆయన. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాలనలో లబి్ధపొందిన వారు తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని, పొందిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. నేడు వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని, జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, పార్టీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కుటుంబమంతా రుణపడి ఉంటాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన పథకాలు నా సోదరి అంబటి అచ్చుత కుటుంబంతో పాటు నాకు ఎంతగానో చేదోడుగా నిలిచాయి. వాటి సహకారంతోనే సమస్యలకు ఎదురొడ్డి నిలబడ్డాం. అచ్చుత భర్త 2019లో చనిపోగా వితంతు పింఛన్ లభించింది. దీంతో పాటు అమ్మఒడి పథకం ద్వారా ఆమె ఇద్దరు పిల్లల చదువు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకుసాగింది. అచ్చుతకు గత జగనన్న ప్రభుత్వం శొంఠాంలో ఇల్లు సైతం కేటాయించింది. దీంతోపాటు ఒంటరిగా ఉన్న దివ్యాంగుడునైన నాకు దివ్యాంగ పెన్షన్ లభించింది. దబ్బందలో టిడ్కో ఇల్లు మంజూరైంది. తద్వారా దశాబ్దాల సొంతింటి కల జగన్ ద్వారా నెరవేరింది. అందుకే మా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన నిండినూరేళ్లు చల్లగా ఉండాలి. – సోదరితో కుప్పల రమేష్, ఎంవీపీ కాలనీఫీజు రీయింబర్స్మెంట్తో చదవగలిగాను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్తో డిప్లమో చదవగలిగాను. మేము విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతం నుంచి వచ్చి ఆరిలోవ ప్రాంతం సూర్యతేజానగర్లో నివాసం ఉంటున్నాం. మా నాన్న గ్యాస్బాయ్గా పనిచేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్మెంట్తో మధురవాడ దరి ఓ కళాశాలలో 2020–23 బ్యాచ్లో డిప్లమోలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఐటీ సెజ్లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాలాంటి ఎంతోమంది ఉన్నత విద్యకు దోహదపడ్డారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. – తామరసెల్లి చైతన్య, ఆరిలోవ జగన్ పాలనలో సాగుకు స్వర్ణయుగం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన రైతుకు స్వర్ణయుగమని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. నేను 70 సెంట్లలో పూలతోటలు సాగుచేస్తున్నాను. అప్పటి అయిదేళ్లు ఠంచనుగా పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ.13,500 వంతున అందింది. ఇప్పుడేమే అన్నదాత సుఖీభవ రెండేళ్లలో ఒక్కసారే రూ.5వేలు వచ్చింది. ప్రస్తుతం పంటల బీమా లేకపోవడంతో ఇటీవల మోంథా తుపానుకు పూలతోటలు పాడైనా నష్టపరిహారం రాలేదు. జగన్ పాలనలో గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, ఎరువులు, పురుగు మందులు ఏ రైతూ వీటి కోసం ఎదురు చూడకుండానే అందించారు. దీంతో పంటలు బాగా సాగి ఆదాయానికి లోటు ఉండేది కాదు. – కొయ్య ఈశ్వరరావు, తాటితూరు, భీమిలి మండలంఅప్పట్లో రైతుల చుట్టూ అధికారులు చక్కర్లు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా అధికారులు గ్రామాల్లో ఉండి రైతుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. మట్టి శాంపిళ్ల నుంచి ఏ పంట వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలి, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతు భరోసా కేంద్రాలలో ఉంచిన కియోస్క్ల ద్వారా సాగుకు ముందే అందుబాటులో ఉంచేవారు. చంద్రబాబు పాలనలో రైతులకు యూరియా కూడా అందుబాటులో లేకుండా పోయింది. మేము 50 సెంట్లు సొంత భూమితో పాటు మరో రెండు ఎకరాలు లీజుకు తీసుకుని వరిసాగు చేస్తే పంట కొనుగోలు ఆలస్యమైంది. చివరకు ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయింది. మోంథా తుపాను కారణంగా పంటకు నష్టం కలిగితే అధికారులు కనీసం చూడనైనా చూడలేదు. – పిన్నింటి అప్పలసూరి, మజ్జివలస, భీమిలి మండలంజగన్ మామయ్య పాలన బాగా చేశారు.. నా పేరు బమ్మిడి యోగిత. నాన్న కృష్ణ చికెన్ షాప్ నడుపుతారు. అమ్మ పుష్ప గృహిణి. తొలి నుంచీ నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం మా స్కూల్కి సరిగా బెంచీలు కూడా లేవు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ మామయ్య మా స్కూల్కి చాలా చేశారు. కొత్త బెంచీలు, రూమ్లు ఇచ్చారు. స్కూల్లో అన్నీ బాగు చేయడంతో నా చదువు కూడా మెరుగుపడింది. జగన్ మామయ్య స్ఫూర్తితో బాగా చదువుకుని డాక్టర్ను అవుతాను. అమ్మానాన్న కష్టానికి మంచి గిఫ్ట్ ఇస్తాను. -
ఉచిత పంటల బీమాతో అప్పుల ఊబి నుంచి బయటకు..
నా పేరు సలాది నరసింహమూర్తి. మాది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నాకు భార్య ఆదిలక్ష్మి, కుమారులు శేష శ్రీనివాస్, సుధీర్కుమార్ ఉన్నారు. 2016, 2018లో వరుసగా సంభవించిన తుపానుల కారణంగా మా పొలంలో పంట కోసే పరిస్థితి లేకుండాపోయింది. అదేవిధంగా నాటి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పులపాలై ఆర్థికంగా చితికిపోయాను. చివరికి ఎడ్ల బండిని తోలుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. అప్పుల భారం ఎక్కువకావడంతో ఉన్న రెండు ఎకరాల భూమి అమ్మకానికి పెట్టాను. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు రాయితీపై అందించడంతో ఉపశమనం కలిగింది. నేను పండించిన పంటను కూడా ఆర్బీకేలోనే మద్దతు ధరకే కొనుగోలు చేయడంతో ఆరి్థకంగా మేలు జరిగింది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందాయి. ఇక ముఖ్యంగా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడంతో 2021లో తుపాను వచ్చినప్పుడు ఒకేసారి రూ.1.20లక్షల బీమా సొమ్ము నా ఖాతాలో జమైంది. దీంతో అప్పులు తీర్చుకున్నాను. పొలం అమ్మకం ఆలోచనను విరమించుకుని ఆనందంగా జీవిస్తున్నాము. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక బీమా దూరమైంది. వ్యవసాయానికి భరోసా కరువైంది. – తాళ్లరేవు నాడు ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అప్పుడే.. నా పేరు మార్కపూడి పుల్లారావు. మాది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కె.పొన్నవరం గ్రామం. నాకు ఎకరన్నర పొలం ఉంది. ఏటా నా సొంత పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, మిర్చి సాగు చేస్తున్నాను. నా భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటున్నాం. ఎన్నడూ లేనివిధంగా వైఎస్ జగన్ హయాంలో రైతులకు కష్టం తెలియకుండా ప్రతి దశలోనూ ఆదుకున్నారు. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున నా ఖాతాలో జమ చేశారు. 2022లో మిర్చి భారీగా దెబ్బతిని అప్పులపాలైపోయాను. ఆ సమయంలో ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి రూ.49,500 చొప్పున... రెండు ఎకరాలకు రూ.99,000లను అదే సీజన్లో నా బ్యాంక్ ఖాతాలో జమ చేసి ఆదుకున్నారు. 2023లో తుపానుకు వరి పంట దెబ్బతింటే ఎకరానికి రూ.10 వేలు చొప్పున రెండున్నర ఎకరాలకు రూ.25 వేలను వారం రోజుల్లో జమచేసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించారు. 2022లో వడ్డీ లేని రుణం రూ.లక్ష అందించారు. ఆర్బీకేల ద్వారా సాగుకు అండగా నిలిచారు. ఇలా రాష్ట్రంలో రైతులందరినీ ఆదుకున్న మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కాగా, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20వేలు ఇస్తానని, రెండేళ్లకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.10 వేలు మాత్రమే ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు. -
గిరిజనులకు వరం
వెనుకబడిన గిరిజన ప్రాంతంలో గిరిజనులకు కార్పొరేట్ స్థాయి ఉన్నత వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడేరులో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ఎందరో విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసింది. రూ.500 కోట్లతో ఈ కళాశాల నిర్మాణం చేపట్టారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని జిల్లా సర్వజన ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని సౌకర్యాలను కల్పించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్టును భర్తీ చేయడంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది, టెక్నికల్ సిబ్బందిని నియమించి జిల్లా సర్వజన ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఎన్నికల అనంతరం జాతీయ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు కళాశాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా 50 సీట్లతో గత ఏడాది వైద్య కళాశాల ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా 50 మంది వైద్య విద్యార్థులతో రెండవ బ్యాచ్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల మరో 50 సీట్లు ఈ ఏడాది రాకుండా పోయాయి. ప్రస్తుతం మొదటి, రెండవ ఏడాది విద్యార్థులు 100 మందితో పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల కళకళలాడుతోంది. ఈ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయబట్టే.. ఎంబీబీఎస్ సీట్లు పెరిగి తన లాంటి వారెందరికో సీట్లు వచ్చాయని ఎంతో మంది విదార్థులు కొనియాడుతున్నారు. తమకు మంచి వైద్యం అందుతోందని అటు గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) జగనన్న చొరవతో నాకు సీటొచ్చింది మా నాన్న చాన్నాళ్ల క్రితం చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను చదివిస్తోంది. నాకొచ్చిన ర్యాంకుకు మా ఊళ్లో సీటు రాదు. కొత్తగా జగనన్న మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరిగి, నాకు గత ఏడాది ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తద్వారా నా లాంటి పేద విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం దక్కింది. పాడేరులో మంచి వాతావరణంలో వైద్య కళాశాలను నిర్మించారు. చాలా బాగుంది. ఇక్కడ అధునాతన సదుపాయాలు కల్పించారు. ఇందుకు కృషి చేసిన వైఎస్ జగన్ అన్నకు కృతజ్ఞతలు. ఎందరో పేదలకు వైద్య విద్యను అందించిన ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. – చల్ల అభినయ, పేరేచర్ల, గుంటూరు జిల్లా -
మా ఊళ్లోనే సీటు.. ఎంతో హ్యాపీ
మా అమ్మాయి తన్మయి విద్యాభ్యాసమంతా రాజమహేంద్రవరంలోనే సాగింది. అమ్మాయికి డాక్టర్ అవ్వాలన్నది చిన్నప్పటి నుంచి కోరిక. తల్లిదండ్రులుగా అందుకు ఊతమివ్వడం మా కర్తవ్యం. ఆ దిశగా ఇంటర్ వరకు రాజమహేంద్రవరంలోనే విద్యాభ్యాసం సాగింది. ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ సీటు కూడా ఇక్కడే వస్తే బావుంటుందని ఆశ పడ్డాం. అయితే మొదటి విడత కౌన్సెలింగ్లో మచిలీపట్నం వైద్య కళాశాలలో సీటు వచ్చింది. రెండో విడత ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో లభించింది. ఇక రాజమహేంద్రవరంలో రాదని ఆశలు వదులుకున్నాం. అ తరుణంతో ఊహించని విధంగా రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో సీటు ఖాయం అయింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఒక వైద్య కళాశాల తీసుకురావాలనే సంకల్పం మా అమ్మాయికి కలిసి వచ్చింది. తద్వారా మా కల నిజమైంది. ఇప్పుడు రోజూ ఇంటి నుంచే కళాశాలకు వెళ్లొస్తోంది. ఇప్పుడు ఈ వైద్య కళాశాలలో 450 మంది మెడికోలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్ జగన్ నగర నడిబొడ్డున ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాల ఏర్పాటు చేసి ఎంతో మంది పేద, మధ్యతరగతి పిల్లల కలలను నిజం చేశారు. హ్యాపీ బర్త్ డే టూ జగనన్నా.. – సుధాకర్, మేరీభాను సుజాత దంపతులు ఆ నిర్ణయం నాకు వరమైంది రెండు విడతల కౌన్సెలింగ్లో నాకు దూర ప్రాంతంలో సీటు రావడంతో సొంతూళ్లో సీటు వస్తుందనే ఆశలు వదిలేసుకున్నా. అయితే అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నాకు కలిసి వచ్చింది. జిల్లాకొక మెడికల్ కాలేజీ నిర్ణయంతో మూడో విడతలో నాకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నాను. నేను చిన్నతనంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను. దీంతో మా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ దృష్ట్యా నేను చంటి పిల్లల వైద్య నిపుణురాలు కావాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఈ ప్రయాణంలో తొలి దశ ఎంబీబీఎస్ సీటు ఇంటికి చేరువలోనే రావడానికి కారణమైన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. – తన్మయి -
జగనన్న వల్లే మా అమ్మాయి డాక్టర్
నేను విజయనగరం జిల్లా సంగివలసకు చెందిన చిరు వ్యాపారిని. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హారికను అందరూ డాక్టర్ అని పిలవాలని మా కోరిక. ఆమె తెల్ల కోటు వేసుకుని తిరుగుతుంటే చూడాలన్నది మా కల. అయితే మా ఆర్థిక స్తోమత ఆ కలకు అడ్డంకి అని బాధ పడుతుండేవాళ్లం. ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే తప్ప మా కల నెరవేదని తెలుసు. ఆ తరుణంలో ఆ దేవుడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో వచ్చి మా కోరికను తీర్చాడు. మా అమ్మాయి కోసమే విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిరి్మంచాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు రావాలని మా అమ్మాయి కష్టపడి చదివింది. తొలి కౌన్సెలింగ్లో ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఇక ఆశలు వదిలేసుకున్నాం. అయితే ఇదే ఏడాది విజయనగరంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభం కావడంతో రెండో కౌన్సెలింగ్లో ఇక్కడే సీటు వచ్చింది. మా కుమార్తె ఇప్పుడు ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతోంది. కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకపోతే.. మాలాంటి వారి పరిస్థితి ఏంటని తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇంకో రెండేళ్లలో డాక్టర్ పట్టా పుచ్చుకుంటుంది. ఈ క్రెడిట్ జగనన్నకే దక్కుతుంది. హ్యాపీ బర్త్డే జగనన్నా.. – పీతల వెంకట అప్పారావు, శ్రీదేవి దంపతులు జగనన్న పుట్టినరోజుకు మాకే బహుమతి ఇచ్చారునేను ఇప్పుడు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే చదివించే స్తోమత మా కుటుంబానికి లేదు. తక్కువ కాలేజీలు ఉన్నందున ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే చాలా కష్టం. అందునా మాకు దగ్గరగా ఉండే కళాశాలలో సీటు రావాలంటే ఇంకా కష్టం. జగనన్న కొత్తగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించబట్టే నాలాంటి విద్యార్థులు ఎంతో మంది ఇవాళ ఎంబీబీఎస్ చదువుతున్నారు. హ్యాట్సాఫ్ జగనన్నా.. – పీతల హారిక -
జగనన్నకు జేజేలు
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ఈ నెల 21న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ముందస్తు వేడుకలు నిర్వహించాయి. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించి సేవా సందేశాన్ని చాటాయి. అనంతపురంలోని అంబేడ్కర్ నగర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎస్కే యూనివర్సిటీలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక, పాడేరు, అనకాపల్లిసహా పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్తో పాటు చీరల పంపిణీ, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ దర్శి విజయశ్రీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహíÜ్తలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని సుందరమ్మ కండ్రిగ గ్రామంలో చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు శిబిరాన్ని ప్రారంభించారు. బెంగళూరు వైఎస్సార్సీపీ ఐటీ విభాగం మెగా క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభించింది. బెంగళూరు నగర శివార్లలోని చేతన క్రికెట్ గ్రౌండ్స్లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్పై రూపొందించిన పాటలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆడిపాడారు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ వెంటే..: వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల అధికారంలో ఉన్నా లేకపోయినా జనం ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటారని.. ప్రజలకు మేలు చేయాలన్న ఆయన సంకల్పమే ఇందుకు కారణమని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కుంచనపల్లిలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీల ప్రదర్శనను ఆయన ఈ సందర్భంగా తిలకించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. 40 వేల చదరపు అడుగల భారీ ఫ్లెక్సీ రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు గోదావరి నది మధ్యలోని బ్రిడ్జి లంక వద్ద వినూత్నంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీతో పాటు.. బోట్లపై చేరిన అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కంటే వినయ్తేజ ఆధ్వర్యంలో చేపట్టగా, జక్కంపూడి రాజా పాల్గొని అభినందించారు. -
ఇది జగనన్న ఇచ్చిన సీటు
మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు జయతేజ్, కుమార్తె ఎదు నందిని. మా ఊరు బందరులో శ్రీ సాయిరాఘవేంద్ర హెయిర్ అండ్ బ్యూటీకేర్ సెంటర్ (సెలూన్) నిర్వహిస్తూ జీవిస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మా కుటుంబానిది. మా అమ్మాయి నందిని మచిలీపట్నం మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. జగన్ కొత్తగా మెడికల్ కళాశాలలు కట్టకపోతే మా అమ్మాయికి మచిలీపట్నంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చేది కాదు. మాది బయట ప్రైవేటు కళాశాలలో, హాస్టల్లో డబ్బులు కట్టి చదివించే స్థితి కాదు. ఫ్రీ సీటు రావటంతో ఆనందంగా కూతుర్ని చదివించుకుంటున్నాం. సొంత ఊరిలో ప్రశాంతంగా పైసా ఖర్చు లేకుండా మా అమ్మాయి కాలేజీలో చదువుకుంటోంది. వేరే చోటుకు పంపాలంటే వెళ్లటం, రావటం గురించి ఆందోళన ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు కట్టాను. వేరే చోట అయితే హాస్టల్లో ఉంచాలంటే లక్షలు ఖర్చు అయ్యేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయటం వల్లే మా కల నెరవేరింది. ఆయనకు కృతజ్ఞతలు. హ్యపీ బర్త్డే టు జగనన్న. – వక్కలగడ్డ నాగేంద్రరావు, నాగమాధవి దంపతులు జగనన్నకు కృతజ్ఞతలు మా సొంత ఊరైన బందరు వైద్య కళాశాలలో నాకు ఎంబీబీఎస్ ఫ్రీ సీటు వచ్చింది. ఇప్పుడు ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచి్చన ప్రభుత్వ వైద్య కళాశాలల వల్లే నా కల నెరవేరింది. మా ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. బయట సీటు వస్తే హాస్టల్ ఫీజులు భరించడం మా కుటుంబానికి ఎంతో భారం. ఇప్పుడు సొంత ఊరిలోనే ఎంబీబీఎస్ చదువుతున్నా. ఇంటి నుంచే రోజూ కాలేజీకి వెళ్లి వస్తున్నా. జగనన్న మా ఊళ్లో కాలేజీ కట్టి ఉండకపోతే నా కల నెరవేరేది కాదు. – వక్కలగడ్డ ఎదు నందిని -
ఎదురుగాలికి ఎదురొడ్డి నిలిచి...
నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన రోజు. తెలుగు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తున్న రాజ కీయ నేత ఆయన. వైఎస్సార్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అసాధారణ నాయకత్వ లక్ష ణాలు కలిగి, విలువల కోసం తపించే నేతగా తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. జగన్ రాజకీయంగా వేసిన తొలి అడుగు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అడుగు అనేక ఆటంకా లను అధిగమించింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు అసలు జగన్ రాజకీయాల్లో నిలబడగలడా అన్న అనుమానం కలిగే విధంగా ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక వైపు అధికార కాంగ్రెస్, రెండవ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం – పేరుకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా... జగన్ విషయంలో ఏకమై నాయి. అదెంతగా అంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెడితే విపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసింది. ఈ పరిణామం బహుశా భారతదేశ రాజకీయాలలో అరుదైన ఘటన. అప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన ‘ప్రజా రాజ్యం’ కూడా జగన్కు వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. పార్టీగా ముందుకు సాగుతున్న దశలో 16 నెలలు జైలులో ఉండాల్సిన పరిస్థితి మరోవైపు దాపురించింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అంశం తప్ప చుట్టూ అన్నీ ప్రతికూల పరిస్థితులే. వైఎస్సార్ సాధించి పెట్టిన వెలకట్టలేని ‘ప్రజాభిమానం’ అన్న ఆయుధాన్ని చేపట్టి ‘ఏమైనా సరే నిల బడాల్సిందే, చావో రేవో తేల్చుకోవాల్సిందే’ అని ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం తిరుగులేని నాయకుడిగా, జనం మెచ్చిన నేతగా ఆయన్ని మార్చింది. నాడు జగన్పై నమోదు అయిన సీబీఐ కేసులను నిశితంగా పరిశీలిస్తే... ఆయన్ని వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో పెడితే పురిటిలోనే పార్టీ మట్టిగొట్టుకు పోతుందన్న వ్యూహం కనిపి స్తుంది. ఈ పరిస్థితుల్లో మరో నాయకుడైతే ఏదో ఒక స్థాయిలో రాజీపడి ఉండేవారు. కానీ జగన్ మొండిగా ప్రజలను నమ్ము కుని ముందుకు సాగారు. అందు వల్లే ఆయన రాజకీయంగా హీరోగా, పోరాట యోధుడిగా మారారు. తొలి ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కక పోయినా నిలదొక్కుకున్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు పోరాటాలు విస్తృతంగా నిర్వహించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో పార్టీని విజయం వైపు నడిపారు. ఎన్నికల హామీల అమలుకు విశ్వసనీయతజగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల ప్రాతిపదికన పరిపాలనా ప్రాథమ్యా లను నిర్ణయించుకున్నారు. ప్రజల ముంగిటకు పాలన తీసుకు వెళ్లడం కోసం గ్రామ ‘సచివాలయ’ వ్యవస్థను సృష్టించి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులు, 2.7 లక్షల వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో సైతం విప్లవం తెచ్చారు. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఆఖరికి రాజకీయాలు చూడం... అర్హత ఉంటే చాలు ప్రతి పేదవాడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు’ అంటూ అందరినీ ఆదుకున్న చరిత్ర, సమానంగా ఆదరించిన ఘనత జగన్ది. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుకు ఉన్న పరి మితులు చెప్పడం రాజకీయాల్లో సహజం. కానీ జగన్ అందుకు భిన్నంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఏకంగా ఓ వ్యవస్థనే సృష్టించారు. ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ లను మరిచిపోవడం సాధారణమైన రోజుల్లో... జగన్ అందుకు భిన్నంగా ‘గడప గడపకూ మీ ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సంగతిని ప్రజ లకు గుర్తు చేస్తూ... పాలన చేయడం ఒక సాహసం.అభివృద్ధి–దూరదృష్టి మేళవించిన విజనరీ మెజారిటీ ప్రజలకు తమ అవసరాలు తీరడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంటి వద్దకు తీసుకుపోవడం ఒక గొప్ప ప్రయత్నం. అధికార వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ. గ్రామ ‘సచివాలయ వ్యవస్థ’, ‘ఆర్బీకే’, ‘విలేజ్ క్లినిక్లు’, ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి అనేక వ్యవస్థలు గ్రామంలోనే అన్ని అవసరాలూ తీర్చేలా రూపొందాయి. ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠ శాలలు ఆధునీకరించడం, పట్టణాలకే పరిమితం అయిన ఆంగ్ల బోధనను గ్రామీణ స్థాయికి తీసుకు రావడం ద్వారా... పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించారు. పోర్టులు, షిపింగ్ హార్బర్ల ఏర్పాటు; ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పేరుతో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ సారథ్యంలో నెలకొల్పడం వంటివి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశాయి. కరోనా సమయంలో జనం అతలాకుతలం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఆధునిక వైద్యం ప్రధాన పట్టణాలకు పరిమితం కావడం. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలందించ వచ్చని ఆయన భావించి, వాటి నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే... ప్రజలకు ఏదో చేయాలి అన్న తపన, అందుకోసం ఎంత సాహసం చేయడానికైనా వెనుకాడనితనం కనిపిస్తుంది. ఈ వ్యవహార శైలితోనే తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి తగ్గ వారసుడిగా తెలుగు ప్రజల మధ్య నిలబడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.మాకిరెడ్డి పురుషోత్తమ్రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరమ్సమన్వయ కర్త -
YS Jagan Birthday Special: జనం కోసం జగన్.. జగన్ కోసం జనం
హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కామ్లు, స్కీమ్ల్లో మునిగిన చంద్ర బాబు సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన.. బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయడం మొదలుపెట్టారు.అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జన రంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన.. దిక్కుతోచని ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండ దండ అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన. జనగర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా... ఆయన ప్రతి మలుపు లోనూ... ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే.వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తోన్న ఒకే ఒక్కడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండ దండ ఉంటే చాలని నమ్మిన.. మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు.వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అలవికాని కష్టాలను అనుభవించాడు. భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు. ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో... మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే.. వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహా శక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే...దేశమంతా అబ్బుర పడేలా జనరంజక పాలన చేశాడు. వైఎస్ జగన్కి ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్ జగన్.. ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడుగా ఎలా నిలిచాడు ? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్.. జనమంతా తన వాళ్లు అనుకున్నాడు. జనమంతా.. జగన్ తమ వాడు అనుకున్నారు.మాట తప్పని జగన్కి.. జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి.. అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చేయగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం. జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు దాటిపోయాయి.వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇకలేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతటి దు:ఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించార వైఎస్. జగన్ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండు విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే..కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెర తీశాయి. హస్తినకి లేనిపోనివి నూరి పోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్సార్ తనయుడు ఎందుకవుతాడు?. పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జనపథ్కు తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.సుఖాలు, హోదాలు, పదవులు. వీటన్నింటన్ని కన్నా.. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు.. ప్రజల కిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయిం చుకున్నారు. ఓదార్పు యాత్రని యాథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతే.. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెర తీసింది. చంద్ర బాబుతో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్రెడ్డికడప లోక్సభ నుంచి జగన్ వైఎస్సార్సీపీ తరపున అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో... కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే.. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు.18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ను విచారణకి అని పిల్చి సీబీఐతో అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్ వెనకే ఉన్నామని ఉప ఎన్ని కల సాక్షిగా తేల్చి చెప్పారు.ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు.. దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజావ్యతిరేకత పెరిగినప్పుడు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే.. ప్యాకేజీ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా...మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం లోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని.. 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎఎస్ జగన్.. దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.2014 ఎన్నికలు.. జగన్ని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు.. 6 వందలకు పైగా అలవి కాని హామీలను ప్రకటించి.. భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మ్యానియా హల్చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణ మాఫీ హామీ ఇస్తే.. అధికారంలోకి రావడం ఖాయమని జగన్తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ.. మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్కి తెలీదు. అందుకే.. మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా.. ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేదు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్సార్సీపీ. ఒంటరిగా పోటి చేసినా 67 అసెంబ్లీ స్థానాల్లో, 8 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్య పెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదలుకున్న జగన్.. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వై.ఎస్. జగన్. రైతులను, డ్వాక్రా మహిళ లను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ... ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వా మ్యాన్ని వెక్కిరిస్తూ.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. వారిలో కొందరిని క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వై.ఎస్.జగన్.. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు...పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారు. దీంతో...ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసు కోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్ని చూసి జనం చలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే.. జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్లారా చూడటానికి, కన్నీళ్లు తుడవడానికి తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి... జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడుని, మామయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్. కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పాట మాత్రమే కాదు. సోషల్ మీడియా లో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్. కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్. కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే...నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛంధంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే. ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్టపాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన...2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపిం చారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపెట్టడం మీద దృష్టి పెట్టారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అప్పటి దాకా జగన్లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడుని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడుని, దార్శనికుడుని చూశారు దేశ ప్రజలు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం... సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు.. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాల కులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోన్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన...ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం, ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన.దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు విజన్ అంటే ఏంటో...దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపిం చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానా లో ఉన్న సొమ్ము కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్ల పాటు స్కామ్ల స్కీమ్లతో లక్షల కోట్ల రూపా యల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలం అది. అలాంటి అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితుల చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న వేళే.. కరోనా దాడి చేసింది.ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసు పత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడి నప్పుడు... అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి...మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే...ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే కారణం... జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు... పాలనను ప్రజలు ముగింటకి తీసుకువెళ్లాయి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో సాకారం చేశారు జగన్.సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మో హన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్ అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. ఐదేళ్ల పాలనలో...జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి..., జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి..,జగన్ సాధించిన విజయాలు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పు కుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో... లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. డిజిటల్ క్లాస్రూమ్స్ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే... అవినీతికి తావులేని స్వచ్ఛ మైన పారదర్శక పాలన వరకు... జగన్ మోహన్ రెడ్డి పాలన...అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్ర దేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి.ఐదేళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1 లక్షా 88 వేల 541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే ఏడు మెడికల్ కాలేజీలు సిద్ధమైయ్యాయి. ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలైయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తి అయింది. అలానే...వైజాగ్ని ఐటీ కారిడార్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్తో...ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్, రాండ్స్టాడ్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజర సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా ? కేవలం 34 వేలు మాత్రమే. మరి...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలు సా ? 6 లక్షల 31 వేల 906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి అయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాలం కఠినమైంది. ఐదున్నర కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ...ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే...ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్ర బాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు. ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాలక డలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగ పడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నాన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలన పై సమరశంఖం పూరించారు. -
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు.. జగనన్న నవరత్నాలు
పేదరికం.. పర్యావరణ కాలుష్యం.. సామాజిక వివక్ష.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు బోలెడు. ఒక పద్ధతి ప్రకారం ఈ సమస్యలన్నీ సమసిపోయేలా చేసేందుకు ఐక్యరాజ్య సమితి పదేళ్ల క్రితమే కంకణం కట్టుకుంది. ఈ భూమి సుస్థిరాభివృద్ధికి ఆ 17 లక్ష్యాల సాధన అత్యవసరమని నిర్ణయించింది. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్.. క్లుప్తంగా ఎస్డీజీ గోల్స్ అనే లక్ష్యాలకూ.. 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకూ అతి దగ్గర సంబంధం ఉంది. ఒక్కో పథకం వెనుక ఏ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ (ఎస్డీజీ) లక్ష్య సాధన ఉంది అనేది తెలుసుకుందాంవైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం ప్రధానంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలవడానికి ఉద్దేశించింది. వైఎస్సార్ రైతు భరోసా.. ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు భరోసా కల్పించడంపై దృష్టి పెడుతుంది. ఆశల జూదంగా ఉన్న వ్యవసాయాన్ని మళ్లీ గాడిన పెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.ఏటా రైతులకు రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడం ద్వారా పంటల సాగును సులభతరం చేశారు. గత ఐదేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని అంచనా. ఐక్య రాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా ఈ పథకం ద్వారా పేదరిక నిర్మూలన (SDG-1), ఆకలి లేని ప్రపంచం (SDG-2) బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం (SDG-12) వంటి లక్ష్యాలను సాధించడానికి కృషి జరుగుతోంది.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకం దోహదపడుతోంది. వైద్య సాయం విషయంలో వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించింది. గత ఐదేళ్ల కాలంలో సుమారు కోటి నలభై మంది లబ్ధిదారులు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందారు. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో అందరికీ ఆరోగ్యం, సంక్షేమం (SDG-3)తో పాటు సమాజంలో అసమానతల తొలగింపు (SDG-10) లక్ష్యాలను ఈ పథకం ప్రతిబింబిస్తుంది.నాడు.. నేడు ! ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), మౌలిక వసతులు, సృజనాత్మకత, పరిశ్రమలు (ఎస్డీజీ-9) దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చేసి విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు తదితర సౌకర్యాల కల్పన లక్షించిన పథకం. మూడు దశల్లో ఆంధ్రప్రదేశ్లోని 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేసే యత్నం.వైఎస్సార్ పెన్షన్ కానుక.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1), అసమానతల తొలగింపు (ఎస్డీజీ-10). రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన ఇతరులకు నెలనెలా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు 65 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్ల వ్యవస్థ పుణ్యమా అని బీదాబిక్కీ, వృద్ధుల ఇళ్ల వద్దకే పెన్షన్ సొమ్ము అందింది.జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా నాణ్యమైన విద్య (ఎస్డీజీ-4), లింగ సమానత్వం (ఎస్డీజీ-5). విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్తో పాటు నివాసానికి కూడా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం. మగపిల్లలు, ఆడపిల్లలు అన్న తేడాల్లేకుండా అందరికీ ఈ పథకం వర్తింపజేశారు. ఐదేళ్ల కాలంలో సుమారు అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.పేదలందరికీ ఇళ్లు.. జగనన్న కాలనీలు.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగాసుస్థిర నగరాలు, సమాజాలు (ఎస్డీజీ-11), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేసిన పథకం. ఇళ్లస్థలాలు, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా అందించడంతో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది జగనన్న కాలనీలు వెలిశాయి. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా చౌక, కాలుష్య రహిత విద్యుత్తు (ఎస్డీజీ-7), గౌరవప్రదమైన పని, ఆర్థికాభివృద్ధి (ఎస్డీజీ-8).కరెంటు కోతలతో వ్యవసాయానికి జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టిన పథకం. పగటిపూటే తొమ్మిది గంటలపాటు విద్యుత్తు సరఫరా, అది కూడా ఉచితంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారు.మహిళా సాధికారత (అమ్మ ఒడి, చేయూత)... ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా లింగ సమానత (ఎస్డీజీ-5), పేదరిక నిర్మూలన (ఎస్డీజీ-1). పేదలు చదువుకునేందుకు అడ్డంకిగా మారిన పేదరికాన్ని తొలగించే లక్ష్యంతో మొదలైన పథకం. బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు 'చేయూత' పథకం ద్వారా సాయం. 'అమ్మ ఒడి' ద్వారా 45 లక్షల మంది, 'చేయూత' ద్వారా 25 లక్షల మందికి సాయం అందింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి.. ఐక్య రాజ్య సమితి లక్ష్యాలలో భాగంగా వాతావరణ మార్పులపై చర్యలు (ఎస్డీజీ-13), ఆకలి లేని ప్రపంచం (ఎస్డీజీ-2). వరదలు, కరువు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పథకం. ఐదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మంది సహాయ, సహకారాలు అందుకున్నారు. -
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
-
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
-
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
-
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
-
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
-
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
-
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారుగోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుంచనపల్లిలో..తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
మెల్బోర్న్లో YS జగన్ జన్మదిన వేడుకలు
-
జగన్ వ్యక్తిత్వంపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. .. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు. .. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు.. .. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. -
కార్యకర్తల్లో జోష్.. ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, తాడేపల్లి : రేపు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ప్రజల్లో రియలైజేషన్ మొదలైంది. చంద్రబాబు మాయ మాటలు నమ్మినందుకు ప్రజలే బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నందుకు జనం ఆవేదన పడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. మంచి రోజులు త్వరలోనే వస్తాయి’ అని అన్నారు. శ్రీకాళహస్తి..శ్రీకాళహస్తి లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలుమాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలుకేక్ కట్ చేసిన మధుసూదన్ రెడ్డివైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి రామసేతు బ్రిడ్జ్ మీదుగా నెహ్రు వీధిలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ.వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణి, కళాకారులకు డప్పులు వాయిద్యాలు పంపిణీ చేసిన మధుసూదన్ రెడ్డి. -
కువైట్ లో ఘనంగా YS జగన్ బర్త్ డే వేడుకలు
-
సింగపూర్లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా జూంలో జాయిన్ అయ్యి ప్రసంగించారు. ఈ వేడుకలలో సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ రెడ్డి, అడ్వైసర్ కోటి రెడ్డి, మలేషియా కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చంద్ర, కృష్ణారెడ్డి, సుధీర్, సుహాస్, యుగంధర్, దొరబాబు, సత్యనారాయన రెడ్డి, శ్రీనాథ్, శ్రీని, మధుతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు.సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా జగనన్న నిలిచారని ప్రవాసులు కొనియాడారు. విద్య, వైద్యం, పోర్టులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిరాని ప్రశంసించారు. -
అట్లాంటాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా
అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరైనారు. జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ పార్టీ అభిమానులతోపాటు, ,విదేశాల్లో ఉన్న మన తెలుగు ఎన్నారైలు కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నారని నాగార్జునరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్.6. ప్రజలు గమనిస్తున్నారని,వారి లోపాలను.. మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని అన్నారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎన్నికల ముందు నవరత్నాలు. . పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేసి అధికారులు వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగాఅమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. కులం,మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నీ అందాయని, టిడిపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఇప్పుడు విజన్ 2047.. అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు.. ఇక్కడి తెలుగు ఎన్నారైలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ,దినకర్, ఉదయ్, ముఖ్య అతిథులుగా వెంకట్రామిరెడ్డి గిరీష్ రెడ్డి , సందీప్ పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.ఆస్ట్రేలియా - టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. -
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్లు కట్చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్
-
రాజోలులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
కుప్పంలో వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అమెరికా నార్త్ కరోలినా, సెయింట్ లూయిస్, కెనడా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ, ఖతార్లోని దోహా, కువైట్, న్యూజిలాండ్ దేశాల్లో అభిమానులు కేక్లు కట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్)లో ‘హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో రికార్డు సృష్టించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..ఈ సందర్భంగా పలువురు… pic.twitter.com/AKWOid47tq— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024దోహా ఖతార్ లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొని మన ప్రియతమ నేత మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ @ysjagan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/LA3niEnfUC— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024ఆస్ట్రేలియాలోని , సిడ్నీలో మన ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన ఎన్నారైలు..ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/yPskG9grXo— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024అమెరికాలోని చార్లోట్టే, నార్త్ కారోలినలో తెలుగు ఎన్నారైలు, కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహా దారులు శ్రీ పొతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు.… pic.twitter.com/mJbMzMvTt0— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన @YSRCParty నాయకులు మరియు అభిమానులు.ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తమ సందేశాలను పంచుకున్న వైస్సార్సీపీ ఎంపీ @MithunReddyYSRC గారు, మాజీ మంత్రి @AmbatiRambabu గారు .#HBDYSJagan #YSJagan… pic.twitter.com/kLutnIxDjW— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తన సందేశాన్ని పంచుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే @SilpaRaviReddy గారు.#HBDYSJagan #YSJagan #JaganannaConnects pic.twitter.com/jyKNd7uJnN— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇండియా టాప్ ట్రెండింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 24 గంటల్లో 18 గంటలకుపైగా టాప్ వన్ పొజిషన్లో నిలిచింది. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్కు ఏకంగా 37 లక్షల మందికిపైగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలి. ప్రజా సేవలో సుదీర్ఘకాలం ఉండాలి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కెనడాలో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగన్ గారి వెంట ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడువబోమని పునరుద్ఘాటించారు.#HBDYSJagan #YSJagan… pic.twitter.com/NDWJ3ykVqj— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024 -
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
ఊరూవాడా సంబరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.హైదరాబాద్లో మెగా రక్తదాన శిబిరంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రమ్య గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్రెడ్డి, సునీల్రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.చెన్నైలో ఘనంగా..సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. -
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జిల్లాల వారీగా ఘనంగా YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
-
YS Jagan: చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యం
YS Jagan Mohan Reddy Birthday Special: చదువుతో పాటు ఆటలూ ముఖ్యమే. చిన్న వయసు నుంచే క్రీడల్లో భాగమవడం వల్ల మనోల్లాసం లభించడంతో పాటు.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా పాఠశాల స్థాయి నుంచే ఆటల పట్ల మక్కువ ఎక్కువ. క్రికెట్ ఆడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. హౌజ్ కెప్టెన్గాఅంతేకాదు.. స్కూల్ లెవల్లో వైస్ జగన్ బాస్కెట్ బాల్ కూడా ఆడేవారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించేవారు. హెచ్పీఎస్లో హౌజ్ కెప్టెన్గా జగన్ అరుదైన ఘనత సాధించారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. రెడ్ హౌజ్కు ఆల్రౌండర్ చాంపియన్షిప్ అందించారు. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీల్లోనూ తమ జట్టును విజయపథంలో నిలిపి టైటిల్ కైవసం చేసుకున్నారు.మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకుఇక క్రీడల్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్వతహాగా తెలుసు కాబట్టే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్.. తన హయాంలో విద్యతో పాటు క్రీడా రంగానికీ పెద్దపీట వేశారు. ప్రతిభ ఉండి వెలుగులోకి రాని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.కేవలం రాష్ట్ర స్థాయిలోనే గాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా జగన్ ప్రభుత్వం ఈ మేర ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వంటి ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కె.పవన్ అనే యువకుడిని సీఎస్కే దత్తత తీసుకోవడం విశేషం. విజయనగరం జిల్లాలోని జామి మండలం అలమండకు చెందిన పవన్ అలా ఐపీఎల్కు చేరువయ్యాడు. ఇక ఆడుదాం ఆంధ్రాతో పాటు ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ను కూడా ప్రతిష్టాత్మంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం.ఆంధ్ర ప్రీమిర్ లీగ్ హిట్వైఎస్ జగన్ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ‘ఆంధ్ర ప్రీమిర్ లీగ్’ పేరిట పోటీలు మొదలుపెట్టింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతోంది. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఈ లీగ్లో పాల్గొంటున్నాయి. ఏపీఎల్తో జోనల్ స్థాయి క్రికెటర్లకు కూడా మంచి గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదు. -
ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
మా నమ్మకం నువ్వే అన్నా..(ఫొటోలు)
-
#HBDYSJAGAN ఎన్ఆర్ఐల గ్రాండ్ సెలబ్రేషన్స్
-
YS జగన్ బర్త్ డే వేడుకలో అంబటి రాంబాబు
-
వైఎస్ జగన్ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్ జగన్ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. -
షార్లెట్లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్లో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. జగన్ బర్త్డే సందర్భంగా పిల్లలూ, పెద్దలూ అంతా కేక్ కట్ చేసి తమ ప్రియతమ నేతలకు జన్మదిన శుభాకాంక్షలందించారు. జగనన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరై.. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
HBDYSJAGAN: వైఎస్ జగన్ బర్త్డే వేడుక ఫొటోలు
-
అనంతపురంలో YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో పోతిన మహేష్
-
పిల్లల భవిష్యత్ కు బాటలు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం
-
కర్నూల్ లో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
జగన్ ఒక అరుదైన నేత: సజ్జల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్ల పాలనాకాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ(డిసెంబర్ 21) పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం. అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంధి పలికారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్ రియల్ విజనరీ. నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్... పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అని సజ్జల అన్నారు.సజ్జలతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక.. బర్త్ డే వేడుకల్లో తొలుత.. జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. జగన్పై అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లను సజ్జల అభినందించారు. -
వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో ఆర్కే రోజా
-
#HBDYSJAGAN అక్కాచెల్లెమ్మలకు అండగా, జగన్ మామగా..!
వైఎస్ జ‘గన్’.. ఆ పేరులోనే ఉంది డైనమిజం. జగన్ అంటే జన ప్రభంజనం. జగనన్నగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి రాజకీయ చతురతతో, పాలనా దక్షతతో అనతి కాలంలోనే డైనమిక్ లీడర్గా ఎదిగి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందిన తీరు ఆదర్శప్రాయం.మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ది ముడి పడి ఉందని నమ్మి అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా, మున్నపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆడబిడ్డకు ప్రయోజనం చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు జగనన్న. ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో విద్యార్థినులు విజయపతాకను ఎగురేసేలా విప్లవాత్మక అడుగు వేశారు ‘జగన్ మామ’. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన చరిత్ర ఆయనది. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా, జగనన్న పెళ్లి కానుక, ఇంకా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చారు. అంతేకాదు రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ మహిళా నేతలకు పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. మహిళా భద్రతకు భరోసా ఇచ్చిన ‘దిశ యాప్’ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.అంతేనా.. 2019 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ 'నవరత్నాలు' అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిన జననేత. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత జన నీరాజనాలు అందుకొని, సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొంది, రాజకీయ జీవితంలో శిఖరాలను అధిరోహించినా... ఆయన చూపు జనం మీదనే. ఏ కష్టం కాలం వచ్చినా, తక్షణమే బాధితులకు అండగా నిలబడ్డారు. అకాల వర్షాల్లో రైతులకు భరోసా ఇచ్చినా, వరదల్లో బాధితులకు నేనున్నాంటూ అండగా నిలబడినా, విద్యార్థులకు, మహిళలకు, ఒకరనేమిటి, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు నభూతో నభవిష్యతి. రాజకీయ జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఒదిగి ఉండే నైజం ఆయనది. అంతేకాదు తాజా ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆయన ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ పరిణామానికి సాకులు వెదకలేదు. ఎవర్నీ నిందించలేదు. అత్యంత నిబ్బరంతో ప్రజల ముందుకొచ్చిన వైనమే ఇందుకు నిదర్శనం.పదవి, అధికారంతో సంబంధం లేకుండా, తానెప్పుడూ బాధితుల పక్షమేననీ, జనంతోనే పయనం, జనం కోసమే పోరాటం అంటూ ప్రకటించిన పోరు పతాక వైఎస్ జగన్. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటూ, ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న జననేత జగన్. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై గళం విప్పడంలో మహిళలకు అండగా నిలబడటంలో అప్పుడూ, ఇప్పుడూ అదే తెగువ.. అదే నిబద్ధత!అప్పుడైనా,ఇప్పుడైనా, ఎప్పుడైనా... జగన్ అంటే జనప్రభంజనం అంటోంది బడుగు బలహీన లోకం.ఆనాటి పాదయాత్ర నుంచి నిన్నామొన్నటి కర్నూలు పర్యటన దాకా జగన్ వెంటే జనం, జనంతోనే జగన్ అంటోంది మహిళాలోకం.జగన్ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటోంది చిన్నారి లోకం. -
కూకట్ పల్లిలో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు.. 520 కిలోల భారీ కేక్
-
జగన్ పనితనం.. అనితర సాధ్యం
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్లింది. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిపిన అనితర సాధ్యుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా..రూ.13.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలుఅభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాలను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించారు. అప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేశారు. గత ప్రభుత్వం హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ.. వంటి సంస్థలు ఉన్నాయి.ఎన్నో ప్రాజెక్ట్ల నిర్మాణ పనులుఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనున్నట్లు అప్పటి ప్రభుత్వం తెలిపింది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. అప్పట్లో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.మెరుగైన ప్రణాళికలుఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యోచించింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను కూడా సిద్ధం చేయాలని చూసింది. అందులో భాగంగా ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించింది. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి మెరుగైనా ప్రణాళికలతో పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేశారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?జగన్ హయాంలో ఏపీ నంబర్ వన్జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాజీ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే ఉండడం గమనార్హం. -
Watch Live: తాడేపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి అంక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూటమి కంటగింపు..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై కూడా సర్కార్ ఓవరాక్షన్ చేస్తోంది. పలుచోట్ల వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూడా కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రేణిగుంటలో శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి.. ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని సీఐ వార్నింగ్ ఇచ్చారు.మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు ఓవరాక్షన్కు దిగారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో, ఈఘటనపై మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న వెంట ఎల్లవేళలా ఉంటామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడవబోమని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలను ఆటవిక రాజ్యపు పోకడలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్తామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగనన్న వెంట ఉంటామని తెలియజేశారు.తెలుగుదేశం జనసేన కార్యకర్తల కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా అనుబంధ విభాగాల అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు రోజా, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరే శ్యామల, ఎన్నారై లతో మాట్లాడి వారు చేస్తున్నా ఈ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా చేసే పోరాటంలో ఎన్నారైలు అందరూ సహకరిస్తున్నందుకు వారికి అన్ని విధాలుగా రుణపడి ఉంటామని నాయకులు తెలియజేశారు.అంకుఠిత దీక్షతో మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు అందరికీ వైసీపీ నాయకులు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బిస్మిన్ లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, వంశీ చాగంటి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
సెల్ఫీ విత్ వైఎస్ జగన్ (ఫొటోలు)
-
YS జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
-
హీరో అంటే ఇలా ఉండాలి చిన్నా..!
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం లేదు... ఈ పాఠాలు.. లెక్కలు.. కెమిస్ట్రీ ఇదేం నావల్లకావడం లేదు.. పైగా ఈ సీటు కోసం క్రికెట్.. సినిమాలు.. ఇవన్నీ మానేయాల్సి వస్తోంది.. అందుకే ఈ ఐఐటి వంటి పెద్ద గోల్స్ మానేద్దాం అనుకుంటున్నా.. ఇంకేదైనా చేస్తాను..’’ బాధపడిపోతూ చెప్పాడు శ్రీనాథ్.. కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకున్న గోపాల్ రావు 'అర్రర్రే.. అలగానీస్తే ఎలారా..కష్టంగా ఉందని మానేస్తే నీ టార్గెట్ ఏటవ్వాలి.. ఇదేకాదు ఏ పనిలో అయినా కష్టం ఉంటాది.. లక్ష్యానికి చేరాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి..అప్పుడే నీ ఆశయం నెరవేరుతాది అన్నాడు గోపాల్ రావు.. పెద్దపెద్ద డైలాగులు చెప్పడం సుళువేగానీ ఆ దారిలో వెళ్లడం కష్టం నాన్నా అంటూ మ్రాన్పడిపోతున్నాడు కొడుకు.. ఒరేయ్ అందరూ నీలాగే అనుకుంటే పెద్దపెద్ద లక్ష్యాలకు ఎలా చేరతారు. అంతెందుకు మన జగన్ను చూడు.. ఎన్ని బాధలు పడితేతప్ప సీఎం కాలేదు.. దీనికోసం ఎంత కష్టించాడో.. ఎన్ని ఇష్టాలను వదులుకున్నాడో తెలుసా అన్నాడు తండ్రి.. పళ్లకో నాన్న నువ్వన్నీ ఇచిత్రాలే చెప్తావ్.. జగనుకు యేటి కష్టం.. వాళ్ళనాన్న రాజశేఖర్ రెడ్డి సీఎం కాబట్టి ఈయనా సీఎం అయ్యాడు.. ఏం కష్టం పడ్డాడు చెప్పు అన్నాడు శ్రీనాథ్.. ఒరేయ్ అలాగనీకు యావత్ దేశంలోనే ఒక సంచలనం.. జగన్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. నీలాంటి యువతకు ఒక రిఫరెల్ సక్సెస్ స్టోరీ అన్నాడు గోపాలం. ఏదీ అంత గొప్పేముందని అందులో.. అన్నాడు కొడుకు.. సరే పక్కన కూకో అంటూ.. గోపాలరావు చెప్పాడునువ్వనుకుంటున్నట్లు జగన్ జీవితం కొన్నాళ్లవరకు.. వడ్డించిన విస్తరే కానీ.. ఆ విస్తరి అక్కర్లేదు.. తనకోసం కొత్తబాట వేసుకుందాం అనుకున్నాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు అన్నాడు తండ్రి.. అదెలా అన్నాడు శ్రీనాథ్.. అవును వైఎస్సార్ కొడుకుగా జగన్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్.. కానీ తండ్రి మరణం తరువాత తనకంటూ ఒక బాటవేసుకున్నాడు. తండ్రిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలకోసం తానూ అండగా ఉండాలని భావించాడు..' అందుకే సీఎం అయిపోయాడు అన్నాడు శ్రీనాథ్.. నీ తలకాయ.. అయన అంత సులువుగా అవ్వలేదు.. దీనికోసం పడిన కష్టాలు వింటే నువ్వు పడుతున్న ఇబ్బందులు కూడా ఒక సమస్యేనా అంటావు.. అన్నాడు నాన్న ఏం కష్టాలు నాన్నా.. సులువుగానే సీఎం అయ్యాడు కదా అన్నాడు శ్రీనాథ్. కాదురా బాబు.. వైయస్ మరణం తరువాత పొలిటికల్ స్క్రీన్ మీద అయన పాత్రను ముగించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. వైయస్సార్ పుణ్యాన మాంత్రులు అయినవాళ్లు.. ఎంపీలు అయినవాళ్లను సైతం జగన్ వెంట గోతులు తీశారు. అయినా ఈయనవెరవలేదు. నీలాగా భయం వేస్తోందని పారిపోలేదు.పరిస్థితులకు ఎదురీది.. సవాళ్లకు ఎదురేగి నిలబడ్డాడు.. కాలంతో కలబడ్డాడు... ఢిల్లీ పెద్దలతో తలపడ్డాడు.. అది కదా పోరాటం అంటే.. పోన్లే అలా చేసి గెలిచేసాడు.. సీఎం అయిపోయాడు అంతేనా అన్నాడు శ్రీనాథ్.. జగన్ జీవితం అంతవీజీగా అవ్వలేదురా... తన లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని భావించిన ఎంపీ పదవిని వదిలేసాడు.. నువ్వు ఆఫ్ట్రాల్ సినిమాలు.. క్రికెట్ వదులుకోలేని అంటున్నావు ... లోకాన్ని తెలుసుకోవడానికి వేలకిలోమీటర్ల పాదయాత్రలు చేశాడు.. మొదటిసారి కూడా ప్రజలకు తానూ చేయగలిగేవే చెబుతాను తప్ప మోసం చేయలేను అంటూ సాధ్యాసాధ్యాలు పరిశీలించి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి పోటీ చేసాడు. మంచి సీట్లొచ్చాయి.. కానీ అధికారం రాలేదు.. నీలాగా నావల్ల కాదని పారిపోలేదు.. ఆ వచ్చిన సీట్లలో కొందరు పార్టీమారిపోయారు.. ఆ పరిణామాలను చూస్తూ నవ్వుకున్నాడు.. రాటుదేలాడు తప్ప ఇది కష్టం అని వదులుకోలేదు.. మళ్ళీ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్ర చేశాడు.. నువ్వు కూడా నే సిలబస్ మొత్తం ఆమూలాగ్రం ఇలాగె చదవాలి. ‘‘ఓహో.. ఒకే మరి నడిస్తే ఏమైంది..’’ అన్నాడు కొడుకు.. ఏముంది పాదయాత్రలో భాగంగా తాను చూసినా ప్రజల కష్టాలే అయన మ్యానిఫెస్టో అయింది. అదేమాట చెప్పాడు.. అఖండ మెజార్టీ సాధించాడు. రెండేళ్లు కోవిడ్ కాలంలోనూ ప్రజలను కాపాడుకుని దేశవ్యాప్తంగా పేరుపొందాడు.. రాష్ట్రంలో విద్యావైద్యరంగాలను పరుగులు పెట్టించాడు. పారిశ్రామికరంగం ఉరకలేసింది. అడిగాడా హీరో అంటే.. నీలాగా ఎప్పుడూ ఎక్కడా.. ఏనాడూ భయపడలేదు.. ఎవర్నీ లెక్కచేయలేదు.. అదిరా మగాడితనం అంటే.. అది కదా ఛాలెంజింగ్ అంటే.. నువ్వూ ఆలా ఉండాలి.. హీరోలా ఎదగాలి.. ఈ ఎగ్జామ్స్ నాకొలెక్కా అనేలా ఎదురెళ్లి మరీ నీ దమ్ము చూపాలి అన్నాడు.. ‘‘అవును నాన్న.. నిజమే.. జగన్ రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిమంతం. అయన గమనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం’’ అన్నాడు.. సరే మరి ఇప్పుడేమంటావ్ అన్నాడు గోపాలరావు.. లేదు నాన్న నేను ఈసారి మరింత రెట్టించి చదువుతాను.. సీట్ సాధించి నేనేమిటో చేసి చూపిస్తాను అంటూ బుక్స్ తీసుకుని బయల్దేరాడు.. కొడుకు వంక ఆలా చూస్తూ నిలబడిపోయాడు.. తండ్రి గోపాల రావు .. ఒరేయ్ ఈరోజు జగన్ పుట్టినరోజు.. ఆయనకు విషెస్ చెప్పి నీ చదువు ప్రారంభించు.. ఖచ్చితంగా పాసవుతావు అని చెప్పాడు.. సరే నాన్నా అంటూ కదిలాడు శ్రీనాథ్ :::సిమ్మాదిరప్పన్న -
#HBDYSJAGAN: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
నమ్మినవారికి అండగా నిలిచే జన హృదయ నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తోంది ఆ పార్టీ.. -
వైఎస్ జగన్కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా వైఎస్ జగన్కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.👉జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వర్మవైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ట్విట్టర్ వేదికగా వర్మ..‘వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మిమ్మల్ని మరింత శక్తివంతం చేస్తుంది’ అంటూ పోస్టు షేర్ చేశారు. A VERY HAPPY BIRTHDAY and MANY HAPPY RETURNS of this day @ysjagan garu , and may the coming year make you much more STRONGER 💪💪💪— Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2024 👉వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబువైఎస్ జగన్కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ట్విట్టర్ వేదికగా.. వైఎస్ జగన్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు. Warm birthday greetings to @ysjagan Garu. May he be blessed with good health and long life.— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024 👉వైఎస్ జగన్కు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు..వైఎస్ జగన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ట్విట్టర్ వేదికగా గవర్నర్.. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో వైఎస్ జగన్ సుదీర్ఘ కాలం ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు."I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life in the service of the people."@ysjagan pic.twitter.com/gc7M3EZg45— governorap (@governorap) December 21, 2024 👉వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిజననేత కు జన్మదిన శుభాకాంక్షలు..💐#HBDYSJagan #JaganAnnaBirthday #DR_BuchepalliSivaprasadReddy #DarsiMLA #YSRCP #PrakasamDistrict #president pic.twitter.com/UT1WOPJuz8— BUCHEPALLI SIVAPRASAD REDDY (@mlasivanna) December 21, 2024👉జగన్ననకు జన్మదిన శుభాకాంక్షలు: ఆర్కే రోజాపేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.. పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐#HBDYSJagananna pic.twitter.com/ASyWOWvAvS— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2024పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HBDYSJagananna pic.twitter.com/xJSgYBQgzz— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2024👉అంబటి రాంబాబు శుభాకాంక్షలు.. ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన శుభాకాంక్షలు!ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల "ధీరుడికి" జన్మదిన శుభాకాంక్షలు !@ysjagan— Ambati Rambabu (@AmbatiRambabu) December 20, 2024 -
మార్కాపురంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్గా టాప్ ట్రెండింగ్లో వైయస్ జగన్ బర్త్డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్బుక్లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం! -
జగనన్నతో మేము (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
-
మనసున్న మారాజుకు జన్మదిన శుభాకాంక్షలు
-
ఎవరేమన్నా.. జగన్ వెంటే జనం!
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంతదూరమైన వెళ్తారు. ఆ క్రమంలో.. ఎవరెన్ని రకాలుగా నిందించినా, ట్రోల్ చేసినా ఆయన అడుగులు ఆగిపోవు. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా.. కచ్చితంగా ఎంతో కొంత మందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది!. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బహుశా ఈ గుణమే.. జగన్మోహన్రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో!.జగన్ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటుకి.. ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడి ఈడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే జగన్ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. షేక్హ్యాండ్ ఇవ్వాలని.. ఆయనతో ఓ ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక అంతే ఒద్దికగా స్వీకరిస్తుంటారాయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే!.ఇదీ చదవండి: ఇందుకుకదా జగన్ అంటే జనానికి ఇష్టం!ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే.. దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ల దగ్గరకు వెళ్తారు. అదంతా ‘తరలించిన అభిమానం’ అని కొందరు తీసిపారేయొచ్చేమో!. కానీ, ‘తరలివచ్చిన అభిమానం’ అని నిరూపించిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి కదా!. పైగా మీరంతా ‘నా వాళ్లు’ అని అన్నివర్గాలను ఉద్దేశించి ఆయన అంటుంటారు కదా!. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించరు మరి.జగన్కు ఉన్న ఫాలోయింగ్ను గమనిస్తే.. ఎలాంటి మాస్ లీడర్ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో!. తమ బాగోగుల కోసం జగన్ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. ఇది బలమైన ముద్ర. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా సరే ఇది అంగీకరించాల్సిన విషయం. #HBDYSJaganఇదీ చదవండి: జగన్.. ఆ ఒక్కడు ఈయనే కదా! -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
జగన్ అంటే అలుపెరగని పోరాటం.. పడి లేచే కెరటం.. రాజకీయాల్లో మకుటం
-
టార్చ్ బేరర్
ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లో ఆ కొత్త థాట్ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్ బేరర్ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్చ్ బేరర్గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.ఎంపీగా మొదలైన జగన్ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్ చేసుకున్న లీడర్!జగన్ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపిస్తే జగన్ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్పై జరుగుతోంది. జగన్ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్పై నిత్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!జగన్కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది. నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!– వెంకట్ -
మనసున్న మారాజు.. జగనన్న
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి ప్రత్యేకమైన విజన్ వుండాలి.మొదటగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి..ఆ తర్వాత ఆస్తులను రక్షించాలి. అందుకోసం పాలకులు అధికార యంత్రాంగంలో స్ఫూర్తిని నింపి.. చిత్తశుద్ధితో పని చేయాలి. తన పాలనలో అదే పని చేశారు తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు ప్రజాసేవకున్ని అని నిరూపించుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మనసున్న నాయకునిగా అడుగులు వేశారు.కరోనా సమయంలో రాజీలేని పోరాటంప్రజలకు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు..కరోనాలాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగులు వేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు సర్వత్రా వ్యాపించాయి. కరోనా రోగంతో కొంతమంది..భయంతో అనేక మంది చిగురుటాకుల్లా రాలిపోయిన అత్యంత భయానకమైన రోజులవి..అలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగానే కాదు.. మానవత్వం ఉన్న నాయకునిగా పని చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో, నిపుణులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో భయమనేది పోగొట్టారు..ఇంట్లో నుంచి జనం బయటకు రావాలంటేనే దడుసుకుంటున్న పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఆయన చేయించిన సేవలను జనం ఎప్పటికీ మరిచిపోరు. నిత్యం ఫీవర్ సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని కరోనా భూతాన్ని తరిమికొట్టారు. ప్రజలకు కావాల్సిన మందులు దగ్గర్నుంచి ఆహార పదార్ధాల వరకు అన్నిటినీ అందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా సేవా కార్యక్రమాలు దాదాపు రెండేళ్లపాటు కరోనా సమయంలో చేసి చూపించారు.ఒక ప్రభుత్వ పెద్దగా తన కిందనున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు.మన ఇంట్లో వారే కష్టాల్లో ఉంటే మనం ఎలా స్పందిస్తామో అలా ఆయన పాలన సాగించారు. ఉచితంగానే కరోనా టెస్టులు చేయించటం దగ్గర్నుంచి...ప్రజలకు కావాల్సిన మందులను కూడా నేరుగా వారి ఇంటికి పంపించారు. పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఖర్చయిన కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచితంగానే చేయించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం.క్వారంటైన్ సెంటర్లలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెయ్యి రూపాయల చొప్పున అందించటంతోపాటు, ప్రతి ఇంటికీ నెలకు రెండు సార్లు రేషన్ ను కూడా ఉచితంగా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం, వ్యాపారాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి ఆంధ్రప్రదేశ్కే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో జగన్ పాలనలో ఉన్నాం కాబట్టే మేము బతికి బట్ట కట్టాం అనే మాట చాలామంది నోట విన్నాం.వరద బాధితులకు కొండంత అండగా..వరద బాధితులను కాపాడటంలో వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించటం దగ్గర్నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించటం వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వరదల సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారుల కాళ్లకు అడ్డం పడే పనిని జగన్ ఏనాడూ చేయలేదు. ముందుగా అధికారుల సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక ప్రభుత్వ పెద్దగా పైనుంచి చూసుకునేవారు. అంతేకాదు.. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టి, బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పించారు. వరద సహాయ చర్యలకు ఇబ్బంది వుండదని తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో కలిసి మాట్లాడేటప్పుడు తమకు ఏమీ ఇవ్వలేదన్న మాట వారి నుంచి రాకూడదని ముందుగానే అధికారులకు గట్టిగా చెప్పారు.అక్కడక్కడ ఆకస్మిక తనిఖీలు చేసి బాధితులతో మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రకటించిన సాయమంతా అందిందా? అని నేరుగా బాధితులనే అడిగేవారు. అంతేకాదు.. మీ కలెక్టర్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో మీరే చెప్పండని కూడా ప్రశ్నించేవారు.ప్రకృతి విపత్తుల సమయంలో జనంలోకి వెళ్లి, అందునా వరద బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సాయం పూర్తిగా అందిందా? అని పాలకులు అడగడం ఒక విధంగా సాహసమే అవుతుంది. అయినాసరే ఆ విషయం తెలిసినా సరే వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.తన ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాల మీద, తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది.ప్రతి ఏటా కృష్ణా, గోదావరి వరదల సమయంలో ముంపు బాధితుల విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ తరచూ అధికారులతో చెప్పేవారు. మన సొంత మనుషులు ఆ బాధితుల్లో ఉంటే మనం ఎలా వ్యవహరిస్తామో అలా ఆలోచించండి అంటూ అధికారుల్లో స్ఫూర్తిని నింపి వారిలోని మానవత్వాన్ని బయటకు తీసేవారు. ఇదంతా కేవలం మనుషుల్ని ప్రేమిస్తేనే చేయగలం. ఆ ప్రేమ జగన్ లో పుష్కలం. ఆయన ఓదార్పు, పాదయాత్ర సమయాల్లోనేఅన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూశారు. అందుకే పాలకునిగా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ప్రజల మనసులో జననేతగా పేరు సంపాదించుకున్నారు.కృష్ణలంక వాసుల కష్టాలు తీర్చిన నాయకుడుబుడమేరు వరదలు అనగానే బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు వుండదు. కృష్ణలంక వాసుల కష్టాలయితే పగవాడికి కూడా వద్దనేలాగా వుండేవి. కృష్ణానది పొంగితే అక్కడి వేలాది కుటుంబాల పరిస్థితి మరీ భయంకరం.. గతంలో ఆ ప్రాంత వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక వారధి మీదుగా వెళ్తుండగా కృష్ణలంక వాసుల కష్టాలు కనిపించాయి. ఇక అంతే.. ఆయన వెంటనే అధికారులను పిలిపించి నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.రిటైనింగ్ వాల్ నిర్మించి మమ్మల్ని కాపాడంటూ ఏ ఒక్కరూ ఆయన్ను నేరుగా అడగకపోయినా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కళ్లారా వారి కష్టాలు చూశారు కాబట్టేఆయన ఆ పని మొదలుపెట్టారు. మొత్తం రూ.474 కోట్లు వ్యయం చేసి రెండున్నర కిలోమీటర్ల పొడవునా వాల్ నిర్మాణం చేపట్టారు.దీంతో సుమారు 80 వేల మందిని మొన్నటి వరదల నుంచి కాపాడటానికి వీలైంది.పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఏ ఇబ్బందీ లేకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా కేవలం మనసున్న నాయకుడు వైఎస్ జగన్ వలనే సాధ్యం అయింది. ఎవరూ అడగకుండా అన్ని వేల మందికి ఉపయోగపడే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచారు వైఎస్ జగన్.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదులసంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలావరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యారు. శనివారం(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.. -
వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
-
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఓర్వలేక కూటమి
-
జననేతతో మీ అనుభవం..
నాయకుడంటే.. అధికారం కోసం పాకులాడే వాడు కాదు. అధికారం పేరిట పెత్తనం చెలాయించడమూ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకోవడం అంతకంటే కాదు.. జనాల కోసం.. జనం నుంచి పుట్టేవాడు.. వారి బాగోగులను సొంతింటి మనిషిగా చూసుకునే వాడు. జనం గర్వంగా మనవాడని చెప్పుకోగలిగిన వాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐదేళ్ల పాలనతో అందరి మనసులను చూరగొన్న ‘జగనన్న’! ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం జగనన్న పాలన. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలన్నీ కొత్త పుంతలు తొక్కిన కాలమిది. రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమం విషయంలో ముందు చూపు ఉన్న నేత. అలాంటి నేతతో మీకూ అనుబంధం ఉందా?. 👉ఎప్పుడైనా జగన్తో కలిసి ఫొటోగానీ.. సెల్ఫీగానీ దిగారా? 👉ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి? మాతో పంచుకోండి..మీరు చేయాల్సిందిల్లా... మీ వివరాలతో 9182729310 నెంబర్కు వాట్సాప్ చేయడమే. జగనన్న పుట్టినరోజు (డిసెంబర్ 21న) సందర్భంలో మీ ఫొటోలను, ఆ అనుభవాన్ని మేం ప్రచురిస్తాం.నోట్: సెల్ఫీ వీడియో నిమిషం వీడియో ఉండాలి. -
వైఎస్ జగన్ పుట్టినరోజు.. వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. ఆ రోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్దేశించింది.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాటమరో వైపు, అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు. పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటానికి సిద్ధమైంది. జనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించనున్నారు. -
#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట! అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.పేదలు గెలిచే వరకు.. వారి జీవితం బాగుపడే వరకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.Telugu Rap Song 🔥#HBDYSJagan pic.twitter.com/aQ812SOH5H— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2023ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు. ఉద్ధానమా.. గర్వించు!అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు. -
రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి.అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి.ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది.స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి..పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు సమకూర్చడంలో మేటి..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు..అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారంజగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తుసెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ప్రస్తుతం సగటు ధర యూనిట్కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
సీఎం జగన్కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.— Narendra Modi (@narendramodi) December 21, 2023గవర్నర్ శుభాకాంక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI— governorap (@governorap) December 21, 2023 -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్లెñట్స్♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందంఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్లోని బటన్ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్ను వివిధ యాప్లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ల ఫలితాలు ఈహెచ్ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖపట్నం సినీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లుతుందని అందరూ ఆశించారు. విభజన ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ ప్రారంభించలేదు. బాబు అధికారంలోకి వచ్చాక ఆయనకు అనుకూలంగా ఉండే సినీపెద్దలు విశాఖలోని భూములపై కన్నేశారు. ఆపై ఏపీలోని సినిమా థియేటర్ల లీజులు, క్యాంటీన్ కాంట్రాక్టుల, టికెట్ ధరలు ఇలా అన్నీ బాబుగారి మిత్రులుగా కొనసాగిన కొందరి గుప్పెట్లోకి వెళ్లాయి. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి విషయంలో తొలి అడుగులు పడ్డాయి. సినిమా టికెట్ల ధరలు, బెన్ఫిట్ షోలు, ఏపీలో ప్రతి సినిమా షూటింగ్ కార్యక్రమాల పనులు, ఆన్లైన్లో టికెట్ల విక్రయం ఇలా అనేక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. మొదటి స్టూడియో విశాఖలోనేసాగర తీరాల్లో ప్రపంచంలో ఎన్నో నగరాలు కొలువుదీరినా వాటిలో విశాఖ నగరానిది ప్రత్యేక స్థానం. ఇక్కడి సాగరతీరం.. పచ్చని కొండలు.. పర్యాటక ప్రాంతాలు పర్యాటక రంగానికే కాకుండా.. సినీ షూటింగులకూ స్వర్గధామాలు. అందువల్లే ఇక్కడ ఆంధ్రా సినీటోన్ పేరుతో 1936లోనే ఒక స్టూడియో ఉండేది. ఇది రాష్ట్రంలో రెండవది. అప్పటికే రాజమండ్రిలో దుర్గ సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. విశాఖలో సినీ స్టూడియో నిర్మించి నగరంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్నాధరాజు భావించారు. ఆయనతో సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి ఆంధ్రా సినీ టోన్ స్టూడియోను పూర్తి చేశారు.కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ కావడంతో సినిమా రంగానికి చెందిన వారందరూ కూడా ఆనాడు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విశాఖ వెనుకపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఇండస్ట్రీలో బాబుగారికి భజన చేసే బ్యాచ్కు పెత్తనం అప్పజెప్పడం.. ఆపే వారికి మాత్రమే భూ కేటాయింపులు చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగిపోయాయి. భూములు పొందిన వారు అక్కడ సినీ పరిశ్రమ బాగు కోసం కాకుండా వారి స్వలాభం కోసమే ఉపయోగించుకున్నారు.విశాఖలో స్టూడియోలు, ఇల్లు నిర్మాణలకు స్థలాల కేటాయింపు విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే జగన్ ప్రభుత్వం అడుగులేసింది. విశాఖకు రావాలని సినీ ఇండస్ట్రీ పెద్దలను ప్రత్యక్షంగానే సీఎం జగన్ కోరారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు,ప్రభాస్,రాజమౌళి, ఆర్. నారాయణ మూర్తి, కొరటాల శివ వంటి వారితో సినిమా పరిశ్రమ గురించి చర్చించారు. అపై ఇక్కడే స్టూడియోలు నిర్మించాలని ఆయన కోరారు. అలా ఎవరైనా ముందుకు వస్తే వారికి భూములు కేటాయిస్తామని ఆయన ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈమేరకు విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని అప్పట్లో ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బహిరంగానే ప్రకటించారు.సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతులను మంజూరు చేశారు. ఏపీలో షూటింగ్ జరుపుకుంటున్న పలు టాలీవుడ్ చిత్రాలు ప్రభుత్వం నుంచి ఇతర ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నాయి. విశాఖలో సినీ ప్రముఖులు ఉంటామంటే ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ విధంగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సినీ కార్యకలాపాలు మొదలుపెడితే విశాఖలో మరో ఫిలిమ్నగర్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలు తయారవుతాయని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమిలి బీచ్రోడ్డు నిడిగట్టు పంచాయతీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 316 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూములు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే..సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయంసినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న ఒక మెమో కూడా జారీ చేసి ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోషకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు కలిపి ఒక సినిమాకు బడ్జెట్ రూ.100 కోట్లు దాటాలి.ఆ సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం ఇలా 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలను ఏపీ ప్రభుత్వం పెట్టింది.అలా నిర్మించిన సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చేలా నిబంధనలు పెట్టింది. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ల రేట్లు ఉండాల్సిందే. ఇందులో భాగంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. బెనిఫిట్ షోల పేరుతో ప్రజల డబ్బుల్ని దళారుల రూపంలో దోచుకుంటున్న వ్యవస్థను క్లోజ్ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సామన్య ప్రజల నుంచి సానుకూలత లభించింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత కొందరు హీరోలు సైతం వారి స్వలాభం కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలు తగ్గించడం వల్ల చిన్ని సినిమాలకు మేలు జరుగుతుందని పలువురు నిర్మాతలు బహిరంగంగానే ఒప్పుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే సినిమా చూసేందుకు మరికొందరు థియేటర్కు వస్తారు.. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆలోచించడం సహజం.ఆన్లైన్ టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంఆన్లైన్ టికెట్ల యవ్వారంలో గోల్మాల్ సాగుతోందని చాలా ఏళ్ల నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది. చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు. ఎంతసేపూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే. ఏపీలో షూటింగులు చేయడం లేదు. ఎపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ లేకుండా పోయింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థపై గురిపెట్టారు. ఓ నిర్ణయం తీసుకున్నారు.తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి ఏపీలో షూటింగ్ జరగాల్సిందే అని కొన్ని షరతులు తీసుకురావడం జరిగింది. రైల్వే ఆన్లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకూ ఓ పద్థతి ఉండాలని ఆయ సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ ప్లాట్ఫాం(గేట్వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసింది.ఈ విధానంలో ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎగరగొట్టడం వంటివి జరగవు. దీంట్లో ప్రభుత్వానికి మాత్రమే కాకుండా సినిమా రంగానికి కూడా మంచిదేనని అభిప్రాయాలు కూడా వచ్చాయి. తప్పుడు కలెక్షన్ల రిపోర్టులు, టికెట్లు కోసేసి, తప్పుడు కలెక్షన్లు చూపించేసి, సినిమాలకు ఇబ్బడిముబ్బడి లాభాలు వచ్చాయిని దొంగ లెక్కలు చూపించి, ఆపైన నిర్మాతల దగ్గర హీరోల రెమ్యూనిరేషన్ భారీగా పెంచేయడం అనే పని ఇకపై జరగదని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించగలిగితే, పన్నులు కచ్చితంగా అందడంతో పాటు సినిమా లెక్కలు కూడా కరెక్ట్గా ఉంటాయనేది అందరి ఆలోచనకు తగినట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీనీ పరిశ్రమకు సీఎం జగన్ భరోసా► వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది.►విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.►తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది. ►గతంలో సీఎం జగన్ను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్ జగన్ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ► సినిమా రంగానికి చెందిన వారికి నివాస స్థలాలు ఇస్తామని సీఎం జగన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. -
‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నమెంట్లో 422 టీమ్లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్డే: 20వేల మందితో భారీ ర్యాలీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
సీఎం జగన్ బర్త్డే: 20వేల మందితో భారీ ర్యాలీ
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వంద కిలోల కేక్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 20 వేల మందితో కృష్ణాపురం ఠాణా నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్ పాలన సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యువత ప్లకార్డులతో ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. (చదవండి: సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ) విశాఖ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. బుచ్చయ్య పేట మండలంలోని లోపూడి, ఎల్. సింగవరం, పొట్టి దొరపాలెం, కోమళ్లపూడి గ్రామాల్లో పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు దేవరాపల్లి మండలం తెనుగుపూడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం) ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా కనిగిరి వ్యవసాయ మార్కెట్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సరితా రెడ్డి, బన్నీ, రంగనాయకుల రెడ్డి, అబ్దుల్ గఫార్, మోహన్రడ్డి, టి.సుజాత పాల్గొన్నారు. తూర్పుగోదావరి: పి.గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు భారీ కేక్ను కట్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వరలక్ష్మి చినబాబు, పీకే రావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్లా రెడ్డి.. పంజాగుట్టలో కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
క్యాంపు ఆఫీస్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుక
-
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ) -
సీఎం వైఎస్ జగన్తో బ్యాంకు ప్రతినిధుల భేటీ
-
జగమంత సంబరం
సాక్షి ప్రతినిధి విజయనగరం: ఇంటి బిడ్డ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకుంటామో.. అంతకుమించిన సంబరంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి జిల్లాలోని 444 మంది నేతన్నలకు ఒక్కొక్కరికీ రూ.24వేలు చొప్పున రూ.1,06,56,000 అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పుష్పశ్రీవాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శంబంగి, జిల్లాకలెక్టర్ హరిజవహర్లాల్ తదితరులకు అందజేశారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిధిగా పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు. ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా రక్తదానం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్చేశారు. సాయంత్రం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షత వహించగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి, చెట్టి ఫల్గుణ, మాజీ ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు. విజయనగరంలో మెగా రక్తదాన శిబిరం విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజింగ్ చైర్మన్ సంగంరెడ్డి బంగారునాయుడు, కో చైర్మన్లు అల్లు చాణుక్య, జి.ఈశ్వర్ కౌశిక్ల నేతత్వంలో 356 యూనిట్ల రక్తాన్ని వివిధ రక్తనిధి కేంద్రాల వైద్యులు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నగరంలోని హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు పిళ్ళా విజయకుమార్, కాళ్ల గౌరీ శంకర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ స్థానిక సత్య కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఘోషాస్పత్రి, పూల్బాగ్లోని ద్వారకామయి అంధుల పాఠశాలలో రోగులకు, విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నదానంలో రాజన్నదొర సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీహెచ్సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాలూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వి రమణరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ బీమా చెక్కులను లబి్ధదారులకు అందజేశారు. విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున చేరి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డెంకాడలో దుప్పట్ల పంపిణీ నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడలో నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు. పూసపాటిరేగలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గజపతినగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య స్థానిక సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని దేవీ జంక్షన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులరి్పంచారు. అనంతరం ఎస్కోట ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. గురుదేవా చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో వికలాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ పరికరాలను అందజేశారు. దిశ చట్టం తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎల్కోటలో క్షీరాభిõÙకం నిర్వహించారు. -
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి.. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, సేవాకార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, అధికారుల శుభాకాంక్షలు ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను అధికారుల సమక్షంలో సీఎం జగన్ కట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు అధికారులు శామ్యూల్, ధనుంజయరెడ్డి, విజయకుమార్రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తదితరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రికి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మవరం పర్యటన ముగించుకుని వచ్చాక మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, పి.అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్సభ సభ్యులు వి.బాలశౌరి, నందిగం సురేష్ ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి, దుప్పట్లు పంపిణీ చేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ రాష్ట్రానికి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్ కొండమడుగుల సుధాకర్రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, నడికూడి సూరీరెడ్డి, నాగార్జున యాదవ్, జె శ్రీనివాసులరెడ్డి, షేక్ గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. డెహ్రాడూన్లో కేక్ కట్చేసిన స్పీకర్ తమ్మినేని ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో శనివారం జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్ వెళ్లిన స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి అక్కడ ఓ హోటల్లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గోవా స్పీకర్ రాజేష్ పట్నేకర్, ఢిల్లీ స్పీకర్ రామ్నివాస్ గోయెల్, హిమాచల్ప్రదేశ్ స్పీకర్ రాజీవ్ బిందాల్, ఉత్తరాఖండ్ లైజన్ ఆఫీసర్ కులదీప్ రాణా, కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా అసెంబ్లీల కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, గవర్నర్, కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్కు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రీట్వీట్ చేస్తూ... ‘నరేంద్రమోదీ గారూ! హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ట్విటర్లో శుభాకాంక్షలు అందచేశారు.గవర్నర్కు కూడా జగన్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర గణాంక, ప్లానింగ్ శాఖ మంత్రి రావ్ ఇందర్జిత్సింగ్, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్సారంగి, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, మేఘాలయ ముఖ్యమంత్రి సి.సంగ్మా , నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యాంతుంగో పాఠన్, జార్ఖండ్ ఎంపీ అన్నపూర్ణ దేవి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ డాక్టర్ వల్లభ్ కథిరియా, ఇండియా టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ, తదితరులు ట్విటర్లో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు సీఎం, ప్రతిపక్ష నేత స్టాలిన్ శుభాకాంక్షలు వైఎస్ జగన్కు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తూ సీఎం పళనిస్వామి లేఖ పంపగా.. ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజానేతగా వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఉంటారు: పోసాని
-
‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు’
-
సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్బంగా సేవాకార్యక్రమాలు
-
అందరినీ అశ్చర్యపరుస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలన
-
నెల్లూరులో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కుప్పంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
అనంతపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
గుడివాడలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
తిరుపతిలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
అమలపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
పెద్దపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజుల వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తమ స్వగృహంలో పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుక్మిణీ దేవి, షర్మిలమ్మ జీసస్ ఛార్టిస్ లో అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి మండల ఇంచార్జి శివప్రకాశ్ రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం వరకు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి దంపతులు పాదయాత్ర చేపట్టారు. అలాగే నందలూరు సౌమ్యనాధ స్వామి ఆలయంలో ఆకేపాటి అమరనాథ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు. కమలాపురం : అనాధ శరణాలయంలోజిల్లా కార్యదర్శి సుమిత్రా రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పార్టీ పంచారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప : నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్సీ సెల్ నేత త్యాగరాజు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువజన విభాగం నాయకుడు చల్లా రాజశేఖర్ నేతృత్వంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి, సీ. రామచంద్రయ్య, డిసిసిబి చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరైయ్యారు. ఒంటిమిట్ట ఏకశిలా గ్రాండ్ హోటల్ లో వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం,కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, నందకికిషార్ రెడ్డి, ఒబుల రెడ్డి నాగార్జున పాల్గొన్నారు. జమ్మలమడుగు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందుల : వేంపల్లిలో మాజీ జెడ్పీటీసీ షబ్బీర్ వలి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ 47 వ పుట్టినరోజు సందర్భంగా వేంపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 47 కేజీల భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్ ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవికుమార్ రెడ్డి మండల కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి షబ్బీర్ వలి, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు : వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్సార్పీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి హాజరరైయ్యారు. రాయచోటి : నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, రామపూరం, సంబేపల్లి లలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెయ్యిమందితో రక్తదానం నిర్వహించారు. కాజీపేట : వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
ఏపీ భవన్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు పోతల ప్రసాద్, వైఎస్సార్సీపీ అభిమానులు కేక్ కట్ చేశారు. రూ. 25లకే ఉల్లిగడ్డలను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకోవాలని.. కార్యకర్తలు ఉల్లి గడ్డలను పంచిపెట్టారు. హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని కార్మికనగర్, శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వికలాంగులకు వీల్చైర్స్, అంధ విద్యార్థులకు పరికరాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట : జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అన్నబోయిన అశోక్గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. -
‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీఆర్టీఎస్ రోడ్డులో కేక్ కట్ చేసి పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరునెలల పాలనలో సీఎం జగన్ పథకాలను వివరిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని, ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని ప్రశంసించారు. అందరి సంక్షేమంతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి అందరి అభిప్రాయాలు సేకరించాకే ఎక్స్పర్ట్ కమిటీ మూడు రాజధానులపై సిఫార్సు చేసిందని స్పష్టం చేశారు. అయిదేళ్లు ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన టీడీపీకి సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ దురుద్ధేశంతో టీడీపీ చేస్తున్న టీడీపీ కుట్రలను జనం గమనిస్తున్నారని, ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు ముందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
విశాఖలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
సీఎం జగన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
-
‘ఆయన సైంధవుడిలా అడ్డు పడుతున్నారు’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైంధవుడిలా మారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నాయక్నగర్ వార్డు సచివాలయం వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేస్తుందని పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపుపై టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు అన్యాయం జరగదని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్ జగన్కు లోకేశ్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో వైఎస్ జగన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శనివారం ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను — Lokesh Nara (@naralokesh) December 21, 2019 విశ్వసనీయతకు మారు పేరు జగన్: దేవినేని అవినాష్ ఉత్తమ నాయకత్వం, విలక్షణ దార్శనికత కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘మాట తప్పని మరియు మడమ తిప్పని వ్యక్తిత్వం, విశ్వసనీయతకు మారు పేరు, ప్రజా సంక్షేమ పథకాలతో అందరి కష్టాలను దూరం చేస్తోన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అని అవినాష్ ట్వీట్ చేశారు. వీడియో సందేశంతో మరో ట్వీట్ పెట్టారు. Happy Birthday to Andhra Pradesh Supremo @ysjagan garu. Your exemplary leadership and remarkable vision have been an inspiration to everyone. I wish you the almighty’s continuos guidance,blessings,long life and happiness. #HBDBelovedCMYSJagan #HappyBirthDayCMYSJagan #YSJagan pic.twitter.com/hPc5gaToKb — Devineni Avinash (@DevineniAvi) December 21, 2019 సంబంధిత వార్తలు... సంక్షేమ సారథి.. జననేత జగనన్న రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు సీఎం జగన్ ఆకాంక్ష అదే: విజయసాయిరెడ్డి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు సీఎం జగన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు -
సంక్షేమ సారథి.. జననేత జగనన్న
పట్టుదలకు మరోరూపం ఆయన. నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం ఆయన. అన్నా.. కష్టాల్లో ఉన్నామంటే చాలు అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. చిరునవ్వే ఆయన ఆభరణం. ప్రజలే ఆయన ఆస్తి. తండ్రి ఆశయ సాధన కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎంతటి వారినైనా ఎదిరించే ధీరత్వం ఆయన సొంతం. మాట తప్పని మడమ తిప్పని ముక్కుసూటితనం. పేదవారికోసం నాన్న ఒక అడుగు వేస్తే తాను రెండడుగులేస్తాను అని చెప్పి దాన్ని ఆచరించి చూపిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజల గుండెల్లో జననేతగా ముద్రవేసుకుని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న... సంక్షేమ సారథి సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్ కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో 47 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాలతో పాటు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం: పోలాకిలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్జగన్ జన్మదినం సందర్భంగా రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కో-ఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి విజయలక్ష్మి , బొమ్మన రాజ్కుమార్ , ఆకుల వీర్రాజు, గణేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట, జొన్నాడలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అనంతరం రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న చిన్నారి నందిని చేత కేక్ కటింగ్ చేయించారు. డి కన్వెన్షన్లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీతా, డిసీసీబి చైర్మన్ అనంత బాబు, నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం: హిందూపురం బాలసదన్లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ 47వ జన్మదినం సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద 47 కేజీ భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సోమందేపల్లి, గోరంట్ల, పెనుకొండ, రొద్దం మండల కేంద్రాల్లో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా: పెదపారిపూడి మండలం యలమర్రులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు గోగం సురేష్, గోళ్ళ సోమేశ్వరరావు, కాటూరి అశోక్, కంభం డేవిడ్, గుమ్మడి రామకృష్ణ, మండవ బెనర్జీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఉయ్యూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మైలవరం పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కేక్ కోశారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పామర్థి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షుడు షేక్ కరీమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలంలో జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. జొన్నాల మోహనరెడ్డి, కిలారం శ్రీనివాసరావు, నడకుదురు రాజేంద్ర, మోర్ల రామచంద్రరావు, మర్రెడ్డి శేషిరెడ్డి, మోటూరి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కర్నూలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు,నేతలు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి. వై. రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి: పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జి, డిసీసీబీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, గుంటూరి పెద్దిరాజు, కలిడింది గణపతిరాజు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామవరపుకోట మండలంలో జరిగిన వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా 50 కేజీల కేక్ కట్ చేశారు. అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయి గూడెంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. -
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయనతో ఉన్నతాధికారులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు అదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. (సీఎం జగన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు) సీఎం జగన్కు గవర్నర్ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్కు విషెష్ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan. Praying for his long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2019 ఇవి చదవండి.. సీఎం జగన్ ఆకాంక్ష అదే: విజయసాయిరెడ్డి సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు


