-
వృద్ధులకు ఆరోగ్య ధీమా!
అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. అలాగే, సీనియర్ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. ఒక్క భారత్లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణే దిక్కు. అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. దేశంలోని సీనియర్ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్వర్క్లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్్కలు, సర్జికల్ గ్లోవ్లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్మెంట్కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్మెంట్కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్వర్క్లోని హాస్పిటల్కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..!
జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అదే సమయంలో వైద్య శాస్త్రం పురోగతి, అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్ పుణ్యమా అని మెరుగైన చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, వైద్యుల కృషితో విజయవంతంగా అధిగమించొచ్చు. కానీ, ఇందుకు కావాల్సిందల్లా ముందస్తు సన్నద్ధత. అందుకే ఆరోగ్య బీమా ఎంత అవసరమో.. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో.. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, ముందస్తుగా అనుకుని ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. కానీ, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ (మొండి వ్యాధులు, తీవ్ర అనారోగ్యం) కారణంగా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరం పడితే ఏంటి పరిస్థితి..? రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న కవరేజీ సరిపోతుందా..? చాలకపోవచ్చు. రెగ్యులర్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాల వ్యాధుల్లోనూ గట్టెక్కిస్తుందని అనుకోవద్దు. తీవ్ర వ్యాధుల్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను అధిగమించేందుకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఆదుకుంటుంది. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ విడిగా ప్లాన్ రూపంలోనూ లేదంటే రైడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. పాలసీలో పేర్కొన్న ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తేలితే నిబంధనల మేరకు పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. ఇండెమ్నిటీ పాలసీలు కేవలం ఆస్పత్రిలో అయ్యే వ్యయాలకే పరిహారాన్ని చెల్లిస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అలా కాదు. ఏక మొత్తంలో చెల్లింపులు చేస్తాయి. దీంతో ఆయా తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే భారీ వ్యయాలను తట్టుకోగలరు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కింద ఏకమొత్తంలో వచి్చన పరిహారాన్ని దేనికి అయినా వినియోగించుకోవచ్చు. చికిత్స కోసమే వినియోగించాలని లేదు. కనుక రెగ్యులర్ ఇండెమ్నిటీ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ కింద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, అదనంగా అయ్యే వ్యయాలను క్రిటికల్ ఇల్నెస్ కవరేజీతో గట్టెక్కొచ్చు. కానీ, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ తీసుకున్న వెంటనే అమల్లోకి రాదు. ఓ చిన్న కొర్రీ ఉంటుంది. అదే సర్వైవల్ పీరియడ్. అలాగే, మరికొన్ని షరతులు కూడా ఉంటాయి. వీటిపై అవగాహనతోనే క్రిటికల్ ఇల్నెస్ కవర్ తీసుకోవాలి. సరై్వవల్ పీరియడ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ను ఇండివిడ్యువల్ ప్లాన్గాను, లేదంటే రైడర్గానూ తీసుకోవచ్చు. జీవిత బీమా కంపెనీలు దీన్ని ఎండోమెంట్, టర్మ్ ప్లాన్లకు రైడర్గా అందిస్తుంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాండలోన్ పాలసీగా ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో సరై్వవల్ పీరియడ్ (జీవించి ఉండే కాలం) అనే క్లాజ్ ఉంటుంది. ఏదేనీ క్రిటికల్ ఇల్నెస్ (జాబితాలోని) బారిన పడితే పరిహారం అన్నది, వెంటనే రాదు. క్లెయిమ్ చేసుకోవాలంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరీ్ణత రోజుల పాటు పాలసీదారు జీవించి ఉండాలి . ఉదాహరణకు 30 రోజుల సరై్వవల్ పీరియడ్ ఉందనుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతి నుంచి 30 రోజుల పాటు జీవించి ఉన్నప్పుడే క్లెయిమ్కు అర్హత వస్తుంది. ఈ 30 రోజుల్లోపు మరణించినట్టయితే బీమా సంస్థ నుంచి పరిహారం పొందేందుకు అర్హత లభించదు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా 30 రోజుల సరై్వవల్ పీరియడ్ అమలు చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఈ సరై్వవల్ పీరియడ్ను తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అయితే 30 రోజుల కాలాన్ని, 15 రోజులకు తగ్గించేందుకు అంగీకరిస్తోంది. ఇందుకు గాను 5 శాతం అదనంగా ప్రీమియంను చార్జ్ చేస్తోంది. మరో 5–10 శాతం అదనపు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తే, అప్పుడు సరై్వవల్ పీరియడ్ 7 రోజులకు లేదంటే సున్నాకు తగ్గిస్తోంది’’అని ప్రమోట్ ఫిన్టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిషా సంఘ్వి తెలిపారు. వెయిటింగ్ పీరియడ్... పాలసీ కొనుగోలు చేసిన రోజు నుంచి 90–180 రోజుల వరకు క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా కానీ, క్లెయిమ్కు అర్హత లభించదు. ఈ వెయిటింగ్ పీరియడ్ తర్వాత నుంచి పాలసీ అమలు సమయంలో ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్నా కానీ, కవరేజీ లేని కాలంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రముఖ బీమా సంస్థలు ఎక్కువ శాతం 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ను అమలు చేస్తున్నాయి. ఎన్నింటికి కవరేజీ..? క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో మొత్తంగా ఎన్ని వ్యాధులకు కవరేజీ వరిస్తుందన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. ఎందుకంటే నేడు జీవనశైలి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కొన్ని పాలసీలు లేదా రైడర్లు 10–20 వ్యాధులకు కవరేజీ ఆఫర్ చేస్తున్నాయి. 60 నుంచి 99 వ్యాధుల వరకు కవరేజీనిచ్చేవీ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉంటే, అంత మంచిదనుకుంటారేమో..? కానీ, ఇది తప్పుడు అభిప్రాయం. తీసుకునే ప్లాన్లో ముఖ్యమైన వ్యాధులకు, అది కూడా సమగ్రమైన కవరేజీ ఉందా? అన్నదే కీలకం. ‘‘60 లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీనిచ్చే ప్లాన్, కేన్సర్ను పలు దశలుగా వేరు చేసి ఆఫర్ చేయవచ్చు. మరో పాలసీలో కేవలం 25 వ్యాధులకే కవరేజీ ఉండొచ్చు. ఈ ప్లాన్ అన్ని కేన్సర్లను ఒక్కటిగానే పరిగణించి, నిర్ధారణ అయిన వెంటనే క్లెయిమ్కు అనుమతించొచ్చు’’అని ఎలిఫెంట్ డాట్ ఇన్ (అలియన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్) ప్రొడక్ట్ హెడ్ కల్పేష్ చవాన్ పేర్కొన్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టాప్–5 తీవ్ర వ్యాధులకు సంబంధించి 90% క్లెయిమ్లు వస్తున్నాయి. టాప్–10 క్రిటికల్ ఇల్నెస్లు కాకుండా, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే క్లెయిమ్లు చాలా తక్కువ. కనుక దాదాపు 60 అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉందంటే, వాటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఏ ప్లాన్ తీసుకోవాలనే సందేహం రావచ్చు. అధిక వ్యాధులకు కవరేజీ ఇస్తూ, అందులో ఒక్కో వ్యాధి వారీ కవరేజీ పరిమితి లేకపోవడం, ఉన్నా మెరుగైన కవరేజీ, అన్ని కేన్సర్లను ఒకటిగానే పరిగణించేట్టు అయితే ఆ ప్లాన్ను తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి షరతుల్లేకుండా ఆఫర్ చేసే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, అది టాప్ 25–30 వ్యాధులకు కవరేజీ ఇచ్చేది అయినా నిస్సందేహంగా తీసుకోవచ్చు. సంఖ్య కంటే షరతులు, కవరేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్ – స్టాండెలోన్ ప్లాన్ క్రిటికల్ ఇల్నెస్ను రైడర్గా లేదంటే, స్టాండలోన్ పాలసీగా తీసుకుంటే ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. రైడర్ రూపంలో అయితే సులభంగా తీసుకోవచ్చు. బీమా పాలసీ తీసుకునే సమయంలోనే ఈ రైడర్ను కూడా ఎంపిక చేసుకుంటే, ఒకేసారి వైద్య పరీక్షలు చేస్తారు కనుక, మళ్లీ విడిగా తీసుకోవడాన్ని నివారించొచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు తీసుకుంటే కవరేజీ పరంగా పరిమితి ఉంటుంది. జీవిత బీమా కవరేజీ మించి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవరేజీ తీసుకోవడానికి అనుమతించరు. అంటే కోరుకున్నంత కవరేజీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. జీవిత బీమా ప్లాన్తో వచ్చే రైడర్లలో సాధారణంగా వ్యాధి ముదిరిన దశలోనే కవరేజీ అనే షరతు ఉంటుంది. ఉదాహరణకు కేన్సర్ మొదటి దశను ఇవి కవర్ చేయవు. అలాగే, రైడర్లలోనూ రెండు రకాలు ఉన్నాయి. కాంప్రహెన్సివ్ రైడర్ అయితే, బేస్ పాలసీ కవరేజీకి అదనంగా ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ అయితే, బేస్ పాలసీలో భాగంగానే కవరేజీ ఉంటుంది. యాక్సిలరేటెడ్ రైడర్ తీసుకుని ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడి క్లెయిమ్కు వెళితే, ఆ మేరకు బేస్ కవరేజీ తగ్గిపోతుంది. స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లో కవరేజీ విస్తృతంగా ఉంటుంది. పైగా జీవిత బీమా లేదా టర్మ్ ఇన్సూరెన్స్తో తీసుకునే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ జీవితాంతం పనిచేయదు. జీవిత బీమా ఎంత కాలానికి తీసుకుంటారో? అంత వరకే పరిమితం అవుతుంది. విడిగా తీసుకుంటే మీరు జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ సమగ్రంగా చదవడం ద్వారా వేటికి కవరేజీ వస్తుంది, వేటికి రాదు? షరతులు అన్నీ తెలుస్తాయి. స్టాండలోన్ ప్లాన్ ప్రీమియం, రైడర్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. స్టాండలోన్ ప్లాన్లో ప్రీమియం ప్రతి కొన్నేళ్లకోసారి పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుదల, రైడర్తో పోలి్చనప్పుడు అధికంగా ఉంటుంది. రైడర్లో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, ప్రతికూలతలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. జీవితాంతం రెన్యువల్కు అవకాశం ఉందా? వ్యాధులకు విస్తృతమైన కవరేజీ ఉందా? సర్వైవల్ పీరియడ్ జీరో లేదంటే 7–15 రోజులుగా ఉందా? (వీలైనంత తక్కువ) అని కూడా చూడాలి. అలాగే, విడిగా ఒక్కో వ్యాధికి సంబంధించి కవరేజీ ఎందులో ఎక్కువ ఉంటే, అదే అనుకూలంగా పరిగణించొచ్చు. ఒకవేళ రైడర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తే, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ను 85–90 ఏళ్ల కాలానికి తీసుకుని, రైడర్ను జోడించుకోవడం సరైనది. అప్పుడు జీవితాంతం టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే జీవిత బీమా పాలసీ తీసుకుని ఉంటే, అటువంటి వారు ఎలాంటి సందేహం లేకుండా స్టాండలోన్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవడం సరైనది. మరీ ముఖ్యంగా కవరేజీ విస్తృతంగా ఉండాలని చెప్పి, భారీ ప్రీమియంతో కూడిన ప్లాన్ తీసుకుంటే, ఆర్థికంగా భారం అవుతుందేమో ఓసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వ్యాధి బారిన పడితే, ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి, ప్రస్తుత బడ్జెట్ను భారంగా మార్చుకోరాదు. కనుక తమ పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, వ్యాధుల రిస్్కను వైద్య నిపుణుల సూచనతో మదింపు వేసుకుని, అప్పుడు ఎంతకు కవరేజీ తీసుకోవాలనే విషయంలో స్పష్టతకు రావాలి. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, సాధారణ అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే ఆదుకోదు. కనుక రెగ్యులర్ హెల్త్ ప్లాన్ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే క్రిటికల్ ఇల్నెస్ను బెనిఫిట్ ప్లాన్గా చెబుతారు. రెగ్యులర్ హెల్త్ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను ఒకే సంస్థ నుంచి తీసుకుంటే కొంత అనుకూలం. టాప్ క్రిటికల్ ఇల్నెస్లు / చికిత్సలు కేన్సర్, యాంజియోప్లాస్టీ(ప్రొసీజర్), హార్ట్ఎటాక్, అరోటా సర్జరీ, హార్ట్ వాల్వ్ వైఫల్యం, కార్డియో మయోపతి, ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్, సీఏబీజీ, క్రానిక్ లంగ్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమ, స్ట్రోక్, అల్జీమర్స్, మసు్క్యలర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, బ్రెయిన్ సర్జరీ, పోలియోమైలైటిస్, మోటార్ న్యూరాన్ డిసీజ్, బ్యాక్టీరియల్ మెనింజైటిస, ఎన్సెఫలైటిస్, ఎయిడ్స్ (రక్త మార్పిడి వల్ల), థర్డ్ డిగ్రీ కాలిన గాయాలు. కవరేజీ ఎంత..? గుండె జబ్బులకు సంబంధించి శస్త్రచికిత్సల ఖరీదు నేడు 2–5 లక్షల మధ్య ఉంది. వైద్య ద్రవ్యోల్బణం 10 శాతం పైనే ఉంటోంది. కనుక భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత చికిత్సల చార్జీలకు ఐదు నుంచి పది రెట్లు అధికంగా కవర్ తీసుకోవాలి. లేదంటే కనీసం నాలుగైదేళ్ల వార్షిక ఆదాయానికి సమానమైన కవర్ తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.5 లక్షలు ఉందంటే, కనీసం రూ.25 లక్షలు అవసరం. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి, ఇండెమ్నిటీ హెల్త్ కవరేజీ చాలనప్పుడు, అదనంగా అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు, ఆ కాలంలో నిలిచిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. -
అనివార్య ఖర్చులు, సరదా ఖర్చులు, పొదుపు
ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు... సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. పబ్లిక్ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎర్లీ ఏజ్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్బడ్జెట్ను ప్లాన్చేసుకుంటున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు. ‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి. ‘మిలీనియల్స్లో చాలామంది ఇన్సూరెన్స్ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు. దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటైర్మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది. ‘రిటైర్మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్మెంట్ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ. స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది. స్టాక్మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్. -నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ -
బీమా ప్రీమియం చెల్లించేందుకు రుణాలు
న్యూఢిల్లీ: ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫిన్కేస్’ బీమా ప్రీమియం చెల్లింపుల కోసం రుణ సాయాన్ని అందిస్తోంది. 2025 మార్చి నాటికి ఇలా 10 లక్షల మంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు రుణ సాయాన్ని సమకూర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను గడువులోపు చెల్లించడం తప్పనిసరి. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండదు. ఏడాదికి ఒకే ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంత ప్రీమియం ఒకేసారి చెల్లించడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఈ సంస్థ రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే, ఆర్థిక ఆస్తులపైనా రుణాలను సమకూరుస్తుంటుంది. ఫిన్కేస్ అందించే రుణంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించి.. ఆ తర్వాత నెలవారీ ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్లో వెటరన్ అయిన అలోక్ భటా్నగర్ను ఆపరేషన్స్ హెడ్గా నియమించుకుంది. కాగా, దేశంలో 51.4 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణలో ఉన్నట్టు ఫిన్కేస్ తెలిపింది. ఇందులో కేవలం 10 కోట్లు మాత్రమే రిటైల్ హెల్త్ పాలసీలని (సొంతంగా తీసుకున్నవి) పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement