diesel price
-
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
అక్కడ ఒక్కసారిగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గింది. ఆ తరువాత ధరల తగ్గుదల ఊసేలేదు. అయితే ఇప్పుడు ఇంధన ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది.2019-20లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.72.69, రూ.65.78 వద్ద ఉండేవి. 2023-24లో రూ.96.63, రూ. 89.53 వద్దకు చేరాయి. తాజాగా ఈ ధరలను రూ. 94.74, రూ. 87.64 వద్దకు (ఢిల్లీ) తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి 'సురేష్ గోపి' పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు సుమారు రెండు రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది.ఇంధన ధరలు 2021-22 సమయంలో గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తరువాత ప్రభుత్వం నవంబర్ 2021 - మే 2022లో పెట్రోల్ & డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13, రూ.16 తగ్గించింది. దీంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా ఇంధన ధరలు తగ్గాయని సురేష్ గోపి అన్నారు.ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రేట్లను తగ్గించాలని సురేష్ గోపి సూచించారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా దిగుమతులను తగ్గించి.. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వంటివి కూడా చేస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడించారు.ప్రస్తుతం తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఢిల్లీకి మాత్రమే పరిమితం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో పెట్రోల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువే ఉంది. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
పండుగల సందర్భంగా పెట్రోల్, డీజిల్కు డిమాండ్ ఏర్పడింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణించిన అమ్మకాలు నవంబర్లో తిరిగి పుంజుకున్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల (ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్) గణాంకాల ప్రకారం పెట్రోల్ విక్రయాలు నవంబర్లో 8.3 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.86 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 5.9 శాతం పెరిగి 7.2 మిలియన్ టన్నులకు చేరాయి.వర్షాల సీజన్లో వాహనాల కదలికలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ డిమాండ్ క్షీణిస్తుంటుంది. అదే కాలంలో వ్యవసాయ రంగం నుంచి డీజిల్ డిమాండ్ తగ్గుతుంది. ఇక అక్టోబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే.. నవంబర్లో 4.7 శాతం అధికంగా 2.96 మిలియన్ టన్నులు మేర పెట్రోల్ విక్రయాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. పెట్రోలియం ఇంధన విక్రయాల్లో 40 శాతం వాటా డీజిల్ రూపంలోనే ఉంటుంది. వాణిజ్య వాహనాలు, వ్యవసాయ రంగంలో వినియోగించే పనిముట్లకు డీజిల్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా రవాణా రంగమే 70 శాతం డీజిల్ను వినియోగిస్తుంటుంది.ఇదీ చదవండి: ఇక ఉబర్లో ‘శికారా’ల బుకింగ్!విమానాల ఇంధనంజెట్ ఫ్యూయల్ (విమానాల ఇంధనం/ఏటీఎఫ్) అమ్మకాలు 3.6 శాతం పెరిగి 6,50,900 టన్నులుగా ఉన్నాయి. ఏటీఎఫ్ డిమాండ్ కరోనా పూర్వపు స్థాయిని దాటిపోయింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. 2.76 మిలియన్ టన్నులుగా నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్లో 2.76 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
చౌకగా లభిస్తోన్న ముడి చమురు
రష్యా ముడిచమురు ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దాంతో రష్యన్ కంపెనీల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా ముడిచమురు దిగుమతులపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో రష్యా తక్కువ ధరకు క్రూడాయిల్ విక్రయిస్తోంది.భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన వినియోగదారుల్లో భారత్ ఒకటిగా ఉంది. దేశీయంగా వార్షిక ముడిచమురు శుద్ధి సామర్థ్యం సుమారు 252 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అంటే రోజుకు 50.04 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసే కెపాసిటీ కలిగి ఉంది. భవిష్యత్తులో ఇంధన వినియోగం పెరగనుందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సంవత్సరానికి 300 మిలియన్ మెట్రిక్ టన్నుల (రోజూ 60 లక్షల బ్యారెల్స్) వరకు చమురు శుద్ధి చేసేలా కర్మాగారాల సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్ట్లు అమలులో ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: ఏటా 2.5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరాఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిల్లో ట్రేడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు భారత్కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. చమురు ధరలు జనవరి కంటే కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన పదేళ్లలో గరిష్ఠంగా జూన్ 2022లో బ్యారెల్ ధర 115 డాలర్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర దాదాపు 70 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల గతంలో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉంది. క్రూడ్ ధరలు గరిష్ఠంగా ఉన్నపుడు చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రేట్లను కొద్దిగా తగ్గించినా దిగివస్తున్న క్రూడ్ ధరలకు అనుగుణంగా మాత్రం రేట్లను తగ్గించలేదు. దాంతో కంపెనీలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి.త్వరలో జరగబోయే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అధికారపక్షం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. లీటర్కు నాలుగు నుంచి ఆరు రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?చమురు ధరలు తగ్గుముఖం పట్టడానికి పలు అంశాలు కారణమవుతున్నాయి. లిబియా తన ముడిచమురు సరఫరాలు పెంచింది. అక్టోబర్ నుంచి ఒపెక్ + దేశాలు ఉత్పత్తి కోతలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఒపెక్ దేశాల కాకుండా ముడిచమురు వెలికితీసే ఇతర దేశాలు వాటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. దాంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. -
4 శాతం తగ్గిన డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ ప్రథమార్ధంలో డీజిల్ వినియోగం 4 శాతం క్షీణించింది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వేడి వాతావరణ పరిస్థితులు రవాణాపై ప్రభావం చూపించడం వల్లే వినియోగం తగ్గినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరుణంలో ఇంధన విక్రయాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఎన్నికల సమయంలో వినియోగం నెలవారీగా క్షీణిస్తూ వచి్చంది. ఎన్నికలు ముగిసిన మరుసటి నెలలోనూ వినియోగం తగ్గడం వాతావరణ పరిస్థితుల వల్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 1 నుంచి 15 మధ్య 3.95 మిలియన్ టన్నుల డీజిల్ విక్రయాలు నమోదైనట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 3.9 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఏడాది మార్చిలో 2.7 శాతం, ఏప్రిల్లో 2.3 శాతం, మే నెలలో 1.1 శాతం చొప్పున డీజిల్ విక్రయాలు క్షీణించాయి. ఇక జూన్ మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.42 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ 1.41 మిలియన్ టన్నుల విక్రయాలే జరిగాయి. మే నెల మొదటి అర్ధ భాగంలోని విక్రయాలతో పోల్చి చూస్తే అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. వేసవిలో అధిక వేడి నుంచి ఉపశమనం కోసం కార్లలో ఏసీ వినియోగం పెరుగుతుంది. ఇది అధిక ఇంధన వినియోగానికి దారితీస్తుంది. అయినా కానీ, ఈ వేసవిలో ఇంధన అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున ప్రభుత్వరంగ సంస్థలు తగ్గించడం కూడా అమ్మకాలకు ప్రేరణనివ్వలేదని తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం అమ్మకాల్లో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటోంది. 70 శాతం డీజిల్ వినియోగం రవాణా రంగంలోనే నమోదవుతుంటుంది. పెరిగిన ఏటీఎఫ్ అమ్మకాలు... ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు ఈ నెల మొదటి 15 రోజుల్లో 2.3 శాతం పెరిగి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు) 3,31,000 టన్నలుగా ఉన్నాయి. మే నెల మొదటి 15 రోజులతో పోల్చి చూస్తే 4.5 శాతం తక్కువ. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వినియోగం కరోనా ముందునాటి స్థాయిని దాటిపోవడం గమనార్హం. వంటగ్యాస్ వినియోగం (ఎల్పీజీ) పెద్దగా మార్పు లేకుండా 1.24 మిలియన్ టన్నులుగా నమోదైంది. -
డీజిల్ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు
సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు దిల్లీ-కోల్కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్కతా ట్రిప్ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది. -
పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్ఫాల్ ట్యాక్స్ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ని లీటర్కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
షెల్ డీజిల్ లీటర్ 20 పెంపు
న్యూఢిల్లీ: షెల్ ఇండియా తన అవుట్లెట్ల ద్వారా విక్రయించే డీజిల్ ధరను లీటర్పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్ ఇండియా గత వారం కూడా లీటర్ డీజిల్పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్ డీజిల్ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్ లీటర్ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్ను రూ.95, లీటర్ పెట్రోల్ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. -
పాక్లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!
వారణాసి: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. -
చమురు కంపెనీలకు భారీ షాక్!, బాబోయ్..ఈ నష్టాలు భరించలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) ఎనిమిది నెలల నుంచి విక్రయ ధరలు సవరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని, వాటిని సర్దుబాటు చేయాలంటూ ఆర్థిక శాఖను పెట్రోలియం శాఖ కోరనుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఈ మూడు కంపెనీలు రూ.21,201 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎల్పీజీ సబ్సిడీ రూ.22,000 కోట్లు కూడా వాటికి రావాల్సి ఉంది. విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల అప్పటికే పెరిగిపోయిన ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దృష్ట్యా వాటికి పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణల పరిధి నుంచి తొలగించారు. కనుక ఓఎంసీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ రేట్లను నిర్ణయించొచ్చు. కానీ, అవి తమ ఇష్టానుసారం అవే రేట్లను కొనసాగించాయి’’అని వివరించారు. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ధరల పెంచకపోవడం వల్ల పడే భారంపై అంచనాకు వచ్చిన, ఆ తర్వాత ఆర్థిక శాఖను సంప్రదించొచ్చని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గతంతో పోలిస్తే కొంత దిగొచ్చినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అవి రేట్ల సవరణను నిలిపివేశాయి. -
తెలంగాణ కంటే కర్ణాటకలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ.. ఎందుకు?
‘గొంగట్లో కూర్చుని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవాలనుకునే’వారిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకుల వైఖరి ఉందని పలువురు సామాన్యులు భావిస్తున్నారు. ఎందుకంటే తప్పులన్నీ తాము చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టడాన్ని రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ అధినాయకులు పదే పదే కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనీ, నిధులు ఇవ్వడం లేదనీ అబద్ధాలాడడం ఎంత వరకు సమంజసం? కేంద్రమే నిధులివ్వక పోతే రాష్ట్రంలో ఇన్ని జాతీయ రహదారులు ఎలా రూపుదిద్దుకునేవి? గ్రామ పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులకు ఫైనాన్స్ కమిషన్ల పేరుతో వస్తున్నవి కేంద్రం నిధులే. వీటితోనే గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టించి నిధులు మళ్లించడం మీ తప్పిదం కాదా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ల పేరుతో డాంబికాలకు పోకుండా ఉండి ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలాగా లక్షలాది కుటుంబాలకు కేంద్రం నిధులతో సొంతింటి కల నెరవేరేది కాదా? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ నిధులు కేంద్రానివి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్ర నిధులతో జరుగుతున్న పనులేవీ అనే సందేహం రాకమానదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా రూ. 20 వేలకోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేయడం మీ తప్పు కాదా? హైదరాబాద్ మెట్రోతోపాటు స్కైవేలు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు అంటూ టీఆర్ఎస్వారు గొప్పగా చెప్పుకుంటున్న వాటి అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్నవి కేంద్రం నిధులు కావా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు రాకపోవడానికి కారణం కేంద్ర నిబంధనల ప్రకారం మీరు ప్రతిపాదనలు పంపక పోవడమే కదా! మునుగోడు ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఈ మధ్య చేనేత కార్మికులపై కపట ప్రేమ ఒలకబోస్తూ జీఎస్టీపై మంత్రి కేటీఆర్ ప్రధానికి లేఖ రాయడం ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రతి జీఎస్టీ మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జీఎస్టీ మండలిలో రాష్ట్రాలన్నీ కలిసి ప్రతి నిర్ణయం తీసుకుంటాయి కదా! మరి కేంద్రంపై నిందలు వేయడం ఏంటి? పై పెచ్చు జీఎస్టీ మండలి చేనేత కార్మికుల విషయంలో పన్ను పరిధిని రూ. 40 లక్షలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షలకు మించితే పన్ను వసూలు చేస్తూ ప్రధానికి లేఖ రాయడం ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ లాంటిది కాదా? కేంద్రం నుంచి ప్రతి నెలా చేనేత కార్మికులకు 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి. గతంలో నూలుపై ఉన్న 10 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. నేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా అడ్డుపడుతోంది. కేంద్రానికి పేరు వస్తుందనా? దేశంలోనే తొలి చేనేత బజార్ స్థలం కబ్జాకు గురికాగా ఆ సమస్య పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేసి నిరుపేదల నుంచి కిలో రూపాయి చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఉచిత రేషన్ విషయంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఒక్కో కిలోకి రూ. 28కి పైగా ఉంది. మరి ప్రభుత్వం వాటా ఎంత? ‘మాతా శిశు సంక్షేమ పథకం’ పేరుతో కేంద్రం నిధులిస్తే దానికి కేసీఆర్ కిట్ అంటూ ప్రచారం చేసుకోవడం మీ తప్పిదం కాదా? (క్లిక్ చేయండి: మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి) నోరెత్తితే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని అంటున్నారు. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మన కంటే 10 నుంచి 15 రూపాయలు తక్కువకు పెట్రోల్, డీజిల్ ఎలా లభిస్తుంది? మీకు పేదలపైన అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విధిస్తున్న పన్నులు తగ్గిస్తే సరిపోతుంది. కానీ మీరలా చేయట్లేదు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తుంటే అవినీతి మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారు. కేసీఆర్ కుటుంబంపై, పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్ర విచారణ సంస్థలు నిజాలు నిగ్గుతేల్చే పనిచేస్తే కక్ష సాధింపు చర్యలని కేంద్రాన్నే బదనామ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనామ్ చేయడం ఆపి తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు తీసుకుంటే మంచిది. (క్లిక్ చేయండి: దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ రాష్ట్ర నాయకులు -
డీజిల్ ధరల పెరుగుదల కొండంత.. సెస్ పెంపు గోరంతే
సాక్షి, అమరావతి: అర్ధసత్యాలు, అవాస్తవాలతో ఈనాడు, ఎల్లో మీడియా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కింది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపును వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడింది. రోజుకోరీతిలో వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారమే అజెండాగా వ్యవహరిస్తున్న ఈనాడు పత్రిక ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు విషయంలోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. చంద్రబాబు హయాం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెప్పుకొచ్చిన ఈనాడు పత్రిక ఆ కథనంలో ఎక్కడా కూడా దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని ఒక్క వాక్యం కూడా రాయలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ధర ఎంత.. ప్రస్తుతం రెండేళ్లుగా పెరిగిన డీజిల్ ధరలు ఎంత అన్న లెక్కలు కూడా దాచిపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పొరుగునున్న తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు విధిలేని పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించాయి. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ తక్కువగానే విధించింది. ఈ వాస్తవాలను ప్రస్తావించకుండా చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా తప్పుడు కథనాన్ని ప్రచురించడం ఎల్లో మీడియా కుతంత్రాన్ని మరోసారి బయటపెట్టింది. డీజిల్ ధర పెరుగుదల 104 శాతం.. సెస్ విధింపు 45 శాతం ఇక డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నా సరే వీలైనంత వరకు ప్రయాణికులపై తక్కువ భారం పడేలా ఆర్టీసీ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరలు ఏకంగా 104 శాతం పెరిగాయి. కానీ, ఆర్టీసీ మూడు విడతల్లో కలిపి కేవలం 45 శాతమే డీజిల్ సెస్ విధించింది. ఈ మూడేళ్లలో డీజిల్ ధరల పెరుగుదలను ప్రధానంగా మూడు భాగాలుగా పరిగణిస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నిష్పత్తిలో ఆర్టీసీ డీజిల్ సెస్ను పెంచలేదు. పెరుగుతున్న ధరల్లో రెండొంతుల భారాన్ని ఆర్టీసీనే భరిస్తోంది. ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచిన మూడు సందర్భాల్లోనూ ఇలానే వ్యవహరించింది. అందుకు నిదర్శనం ఈ గణాంకాలే.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఆర్టీసీ చార్జీలు పెరిగాయని చెబుతున్న ఎల్లో మీడియా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెరిగిన తీరు.. ఇప్పుడు పెరిగిన తీరును వివరించలేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలను బట్టి ఆర్టీసీ లీటరు డీజిల్ను రూ.48.46 చొప్పున కొనుగోలు చేస్తే.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.99.06, బల్క్ డీజిల్ అయితే లీటరుకు రూ.134.79 ఉంది. దాంతో ఎప్పుడూ కొనుగోలు చేసే బల్క్ డీజిల్ కాకుండా ఆర్టీసీ ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో డీజిల్ కొనుగోలు చేస్తోంది. అంత హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా ఆర్టీసీపై రోజుకు అదనంగా రూ.2.50 కోట్ల ఆర్థికభారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితులు, రష్యా–ఉక్రేయిన్ యుద్ధ పరిణామాలతో దేశంలో డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే, చంద్రబాబు అధికారంలో ఉన్న 2015లో కంటే ఇప్పటికి బహిరంగ మార్కెట్లో డీజిల్ ధర వంద శాతం పెరగగా.. ఆర్టీసీ సాధారణంగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర దాదాపు 150 శాతం పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రయాణికులపై నామమాత్రపు భారమే... మరోవైపు.. డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న ఈనాడు పత్రిక వాదన పూర్తిగా అవాస్తవం. గతంలో రెండుసార్లు డీజిల్ ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఆర్టీసీ అనివార్యంగా పెంచిన డీజిల్ సెస్తో ఆదాయం నామమాత్రంగానే పెరిగింది. 2019 డిసెంబరులో చార్జీల పెంపుతో ఏడాదికి రూ.844 కోట్ల రాబడి వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కానీ, కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులను సరిగా నిర్వహించలేకపోయింది. ఇక ఏప్రిల్ 2022లో డీజిల్ సెస్ పెంపుతో ఏడాదికి రూ.712 కోట్ల రాబడి వస్తుందని.. రోజుకు రూ.2కోట్ల వరకు రాబడి వస్తుందని భావించారు. కానీ, రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయమే వస్తోంది. ఇక తాజాగా నామమాత్రంగా పెంచిన డీజిల్ సెస్తో కూడా ఆర్టీసీకి అదే రీతిలో నామమాత్రంగానే రాబడి పెరుగుతుందన్నది తెలుస్తూనే ఉంది. అంటే ప్రయాణికులపై పెద్దగా భారం పడబోదన్నది స్పష్టమవుతోంది. తెలంగాణ కంటే తక్కువగా సెస్ ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపీఎస్ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువగానే విధిస్తోంది. తద్వారా ప్రయాణికులపై ఎక్కువ భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపులో ఉన్న వ్యత్యాసమే ఇందుకు నిదర్శనం. ఆ వివరాలు ఇవిగో.. -
ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
సాక్షి, అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్లపై డీజిల్ సెస్ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే. బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131 2019 డిసెంబర్లో డీజిల్ ధర మార్కెట్లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ను ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్ పార్ట్ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్ సెస్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస దూరానికి పెంపులేదు ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. సహృదయంతో సహకరించాలి డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. – ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్), సీహెచ్.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ) -
పెరిగిన డీజిల్ ధరలతో గ్రేటర్ ఆర్టీసీ కుదేల్
సాక్షి, హైదరాబాద్: పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీపై పెరిగిన ఇంధన ధరలు మరింత భారంగా మారాయి. ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఇంధనం కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి టికెట్లపై వచ్చే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయి. విడిభాగాలు, ఇతర నిర్వహణ వ్యయం కంటే డీజిల్ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో ఖర్చవుతున్నట్లు అంచనా. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 2,550కిపైగా సిటీ బస్సులు ప్రతి రోజు 7.20 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇందుకోసం రోజుకు 1.55 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఏటా నష్టాలతో కుదేలైన సంస్థలో కోవిడ్ అనంతరం ఇటీవల కాలంలో క్రమంగా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సైతం 60 శాతానికిపైగా నమోదవుతున్నట్లు అంచనా. కానీ బస్సుల నిర్వహణ భారంగా మారడంతో అధికారులు ఇటీవల పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఒకవైపు ప్రయాణికుల ఆదరణ పెంచుకొనేందుకు చర్యలు చేపడుతూనే తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించేందుకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పొదుపుగా వాడితేనే.. ► ప్రస్తుతం నగరంలో రోజుకు రూ.2.5 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా ఇంధనం, విడిభాగాలు, జీతభత్యాలు, బస్సుల నిర్వహణ తదితర అవసరాల కోసం రూ.3.5 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సివస్తోంది. దీంతో రోజుకు రూ.కోటికిపైగా నష్టంతో సిటీ బస్సులు నడుస్తున్నాయి. ► ఈ క్రమంలో వనరుల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పెరిగిన ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని డీజిల్ను పొదుపుగా వినియోగిస్తే ప్రతినెలా కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని అంచనా. ► సిటీ బస్సులు లీటర్ వినియోగంపై 4.67 (కేఎంపీఎల్) చొప్పున తిరుగుతున్నాయి. డీజిల్ను పొదుపుగా వినియోగించగలిగితే 0.1 కిలోమీటర్ అదనంగా పెంచుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఒక లీటర్పై 4.77 కేఎంపీల్ పెంచుకోవచ్చు. ఇలా 0.1 కి.మీ అదనంగా పెరిగితే ప్రతినెలా రూ.కోటి ఆదా అవుతుంది. నెలకు రూ.12 కోట్లు మిగుతాయని ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. అవగాహన కోసమే నోటీసులు.. డీజిల్ వినియోగంపై డ్రైవర్లలో అవగాహన పెంచి పొదుపు పాటించేందుకు కసరత్తు చేపట్టారు. ఒక డ్రైవర్ అదనంగా డీజిల్ వినియోగించడం వల్ల అయ్యే ఖర్చును నేరుగా అతనికే నోటీసుల రూపంలో అందజేస్తున్నారు. ‘డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు మాత్రమే వారి జీతాల్లోంచి ఎందుకు వసూలు చేయకూడదంటూ హెచ్చరిస్తున్నాం. కానీ అదనపు డీజిల్ భారాన్ని వారిపై మోపేందుకు కాదు’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. డ్రైవర్ల చేతుల్లోనే ‘గేర్’.. ► ఇంధనాన్ని పరిమితంగా వినియోగించే నైపుణ్యం డ్రైవర్ల చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు ఒకే రూట్లో, ఒకే దూరానికి కొంతమంది డ్రైవర్లు 50 లీటర్లు వినియోగిస్తే మరికొందరు 60 లీటర్ల వరకు వినియోగిస్తున్నారు. (క్లిక్: ఆ వెబ్సైట్ మాకు ఇప్పించండి!) ► గేర్లు మార్చే సమయంలో యాక్సిలేటర్ను అవసరానికి మించి నొక్కడం వల్ల ఇంజిన్లోకి డీజిల్ అదనంగా చేరుతుంది. ‘మొదటి గేర్పై బండి నడిపే సమయంలో ఏ మేరకు డీజిల్ అవసరమో ఆ మేరకు యాక్సిలేటర్ నొక్కాలి, కానీ అలా జరగడం లేదు. దీంతో ఎక్కువ డీజిల్ వినియోగమవుతోంది’ అని ఓ అధికారి వివరించారు. (క్లిక్: ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ వర్సిటీ సాధ్యమే) -
కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం
రాజమహేంద్రవరం సిటీ: కరోనా వేవ్ల వల్ల ఆర్టీసీ రూ.5,680 కోట్ల మేర నష్టపోయిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పడిందని తెలిపారు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం వాటిల్లిందని.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రోజుకు రూ.320 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని అప్పుల బారి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మల్లికార్డునరెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఈడీ చింతా రవికుమార్, కోనసీమ డీపీటీవో ఆర్వీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అనివార్యమయ్యే ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంధన సంస్థలు డీజిల్ ధరలను అమాంతం పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధించాల్సి వస్తోందని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో లీటర్ డీజిల్ రూ.67 ఉండగా ప్రస్తు తం రూ.107కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం విజయవాడలోని బస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో టికెట్పై డీజిల్ సెస్ నిమిత్తం రూ.2 చొప్పున, ఎక్స్ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్లు తెలి పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా ఉంటుందన్నారు. పెరిగిన డీజిల్ సెస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. అమాంతం పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై ఏటా రూ.1,100 కోట్లు అదనంగా ఆర్థికభారం పడుతోందని చెప్పారు. డీజిల్ సెస్ ద్వారా ఏడాదికి రూ.720 కోట్లు సమకూరినప్పటికీ అదనంగా దాదాపు రూ.400 కోట్ల భారాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందని వివరించారు. డీజిల్ ధరలు తగ్గితే సెస్ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. తెలంగాణలో కూడా డీజిల్ సెస్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో గత రెండేళ్లలో ఆర్టీసీ దాదాపు రూ.5,680 కోట్ల రాబడి కోల్పోయిందని తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాల కోసం బీవోటీ ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో అనివార్యం గా సెస్ విధించాల్సి రావటాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కోవిడ్ గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామన్నారు. ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల వరకు జీతాల భారాన్ని భరిస్తోందని తెలిపారు. -
TSRTC: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీజిల్ రేట్లు పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నారు. ‘‘పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకి 2 రూపాయలు, ఆపై బస్సులకు 5 రూపాయలు పెంచాం. డీజిల్ ధరలు ఇదే విధంగా పెరిగితే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని’’ సజ్జనార్ పేర్కొన్నారు. చదవండి: గవర్నర్పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు ‘‘కొత్త బస్సుల కొనుగోలు కోసం కొంత మంది బ్యాంకర్లు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లోన్లు రాగానే కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం. ఇప్పటికే ఉన్న కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని’’ ఆర్టీసీ ఎండీ అన్నారు. -
సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!) -
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
-
జనం జేబుకు పెట్రో మంట..హైదరాబాద్లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్ధర రూ.100.10గా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది. -
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
ఆగని పెట్రో బాదుడు.. ఇవాళ ఎంతంటే..?
చమురు సంస్థలు వినియోగదారులపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతుంది. ఇక సోమవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 30పైసలు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.112.35 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది. వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09గా ఉంది ముంబైలో లీటర్ పెట్రోల్ధర రూ.113.88 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.98.13 గా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11 ఉండగా.. డీజిల్ ధర రూ.90.42గా ఉంది కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.93.57గా ఉంది. -
Telangana: సెస్సుల సెగలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభం కోలుకోలేని దెబ్బతీసింది. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలతో పాటే పెరిగిపోతున్న నష్టాలు ఆర్టీసీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బస్సు చార్జీలు పెంచితే తప్ప, ప్రగతిరథం ముందుకు సాగని పరిస్థితిలో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతి పాదన పంపినా ఇంతవరకు ఆమోదం లభించక పోవడంతో రోజు గడవడమే గగనంగా మారింది. దీంతో నేరుగా చార్జీలు కాకుండా, ఇతరత్రా రుసుములు, ఫీజులను పెంచటం ద్వారా ఎక్కడెక్కడ చార్జీలను సవరించేందుకు అవకాశం ఉందో వెతికి మరీ ఆదాయార్జనకు ప్రయత్నిస్తోంది. చిన్నచిన్న రుసుములే అయినా అన్నీ కలిపేసరికి ప్రయాణికుల జేబుకు బాగానే కత్తెర పడుతోంది. ఇతర పట్టణాల నుంచి నగరానికి వచ్చే బస్సుల్లో చార్జీ కేటగిరీల వారీగా కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.10–20 వరకు పెరిగిపోయింది. ఇవేవీ అధికారికంగా వెల్లడించకుండా, అంతర్గత నిర్ణయాలతో ఆర్టీసీ పని కానిచ్చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవిపై, చార్జీల్లో ‘అనధికార పెంపు’ మరింత భారం మోపుతోంది. సేఫ్టీ సెస్తో మొదలు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా సేఫ్టీ సెస్ను విధించాలని నాటి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కానీ అది వెంటనే అమలు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అది గుర్తొచ్చింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయేవారికి చెల్లించే పరిహారం సాలీనా సగటున రూ.30 కోట్ల వరకు ఉంటోంది. దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలని నిర్ణయించి సేఫ్టీ సెస్ పెంపు ప్రతిపాదన ఫైలుకు ఇటీవల దుమ్ముదులిపింది. ప్రతి టికెట్పై రూపాయి చొప్పున చార్జీ విధించింది. వింటే అది చిన్న మొత్తమే.. కానీ, ఆ రూపాయి విధింపుతో మారిన టికెట్ చార్జీలు కండక్టర్లకు–ప్రయాణికుల మధ్య చిల్లర తగాదాలకు కారణమవుతుందని చెప్పి చార్జీని రౌండ్ ఆఫ్ చేసింది. అంటే రూ.15, రూ.20, రూ.25, రూ.30... ఇలా అన్నమాట. దీంతో నిర్ధారిత స్టేజీల తర్వాత రూపాయి చార్జీ కాస్తా రూ.5కు పెరిగిపోయింది. ఎమినిటీస్ (వసతుల) సెస్.. సేఫ్టీ సెస్ విధించి ఐదారురోజులు గడవకముండే ఆర్టీసీకి మరో సెస్ గుర్తొచ్చింది. బస్టాండ్లలో ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్ను సవరించేసింది. పల్లె వెలుగు మినహా ఇతర కేటగిరీ బస్సుల్లో టికెట్పై రూపాయిగా ఉన్న సెస్ను ఒకేసారి రూ.5కు పెంచేసింది. అంటే కొత్తగా రూ.4 పెరిగిందన్నమాట. ఇప్పుడు బేస్ టికెట్ ఫేర్లో దీన్ని కూడా చేర్చి టికెట్ ధరలను రౌండాఫ్ చేసింది. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో తదుపరి రూ.5కు (ధర రూ.21 ఉంటే రూ.25కు), సూపర్ లగ్జరీ నుంచి ఆ పై కేటగిరీ సర్వీసుల్లో రూ.10కి రౌండాఫ్ (టికెట్ ధర రూ.21 ఉంటే రూ.30కి) చేసింది. ఈ కొత్త చార్జీలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చింది. రౌండాఫ్తో పెరిగిన భారం ♦రెండు సెస్లు కలిపి రూ.5 మేర మాత్రమే విధిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రౌండాఫ్ వల్ల టికెట్ ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు చోటుచేసుకుంది. ♦నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు రూ.195గా ఉన్న ఎక్స్ప్రెస్ చార్జీ ఇప్పుడు రూ.205కు, రూ.270గా ఉన్న సూపర్ లగ్జరీ చార్జీ రూ.280కి, రూ.330గా ఉన్న రాజధాని చార్జీ రూ.350కి చేరింది. ♦కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రూ.175గా ఉన్న ఎక్స్ప్రెస్ చార్జీ రూ.190కి, రూ.220గా ఉన్న సూపర్లగ్జరీ చార్జీ రూ.235కు, రూ.305 గా ఉన్న రాజధాని చార్జీ రూ.320కి చేరింది. ♦వరంగల్ నుంచి హైదరాబాద్కు... రూ.190గా ఉన్న డీలక్స్ చార్జీ రూ.200కు, రూ.215గా ఉన్న సూపర్లగ్జరీ చార్జీ రూ.230కి, రూ.295గా ఉన్న రాజధాని చార్జీ రూ.310కి పెరిగింది. త్వరలో సమాచార సెస్! ఇప్పటికే విధించిన సెస్సులకు తోడుగా ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణికుల సమాచార) సెస్ పేరుతో మరో పెంపును త్వరలో అమలు చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. నాలుగు రోజుల క్రితం బస్సు పాస్ ధరలను కూడా సంస్థ పెంచేసిన సంగతి తెలిసిందే. గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ చార్జీలు సవరించారు. ఇక ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి రిజర్వేషన్ చార్జీలను కూడా రూ.20 నుంచి రూ.30కి పెంచేసింది. -
తగ్గని బాదుడు..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్పై 50పైసలు, లీటర్ డీజిల్పై 55పైసలు పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 పైసలు ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.68పైసలుగా ఉంది వైజాగ్లో పెట్రోల్ ధర రూ.113.08 ఉండగా డీజిల్ ధర రూ.99.09 పైసలుగా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.99.11 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.90.42 పైసలుగా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ.113.88 పైసలుగా ఉండగా డీజిల్ ధర రూ.98.13 పైసలుగా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00 పైసలుగా ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.108.53పైసలు ఉండగా డీజిల్ ధర రూ.93.57పైసలుగా ఉంది 'మూడిస్' ఏం చెబుతుందంటే ప్రముఖ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ మూడిస్ ప్రకారం..ఈ ఏడాదిలో జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మనదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచకుండా తటస్థంగా ఉంచాయి. దీని కారణంగా చమురు సంస్థలకు రూ.19వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అదే సమయంలో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వెరసీ కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకునేలా పెట్రో ధరల పెంపు అనివార్యమైనట్లు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
సామాన్యులపై కొనసాగుతున్న పెట్రో బాదుడు
-
వంట గ్యాస్ మంట.. హైదరాబాద్లో సిలిండర్ రూ.1002
న్యూఢిల్లీ: ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచకుండా ఉన్న కంపెనీలు మంగళవారం జూలు విదిల్చాయి. వంటగ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధర జీవితకాల గరిష్టానికి చేరింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం భారీగా పెంచకుండా లీటరుకు దాదాపు 80పైసలతో సరిపెట్టాయి. తాజా పెరుగుదలతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. కొత్త ధరల ప్రకారం సబ్సిడీఏతర ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర ఢిల్లీ, ముంబైలో 949.50 రూపాయలకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఎల్పీజీ రేట్లు సవరించడం ఇదే ప్రథమం. గతేడాది జూలై, అక్టోబర్ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 మేర పెరిగింది. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర సైతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధరంత పలుకుతోంది. గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.600 వరకు సాయం అందించేది. 2020 నుంచి ఈ సబ్సిడీని తొలగించారు. పెంచిన ధరల ప్రకారం 5 కిలోల గ్యాస్ íసిలిండర్ ధర రూ. 349కి, 10కిలోల íసిలిండర్ ధర రూ. 669కి చేరింది. మరోవైపు దేశ రాజధానిలో లీటర్ పెట్రోలు ధర రూ. 95.41 నుంచి 96.21కి, డీజిల్ ధర రూ. 86.67 నుంచి 87.47కు పెరిగింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకొని ధరలు పెరిగాయి. ప్రభుత్వం సిలిండర్ ధర రూ. వెయ్యికి చేర్చాలని కంకణం కట్టుకుందని విపక్షాలు దుయ్యబట్టాయి. పార్లమెంట్లో ఈ విషయమై నిరసనకు దిగాయి. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా ధరలు పెంచాల్సివచ్చిందని ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 119 డాలర్ల వద్ద కదలాడుతోంది. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరిగితే భారత్పై భారం పడుతోంది. నిజానికి తాజా రేట్ల ప్రకారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 15– 25 చొప్పున పెంచాల్సిఉందని, కానీ కంపెనీలు ఆ మొత్తాన్ని తామే భరిస్తున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలో సిలిండర్ రూ. 972 విజయవాడలో గ్యాస్ íసిలిండర్ ధర రూ. 50 పెరిగి రూ. 972కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,185ను తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు 0.96పైసలు(స్థానిక పన్నులు కలుపుకొని) పెరిగి రూ. 110.89కి చేరింది. డీజిల్ 83పైసలు పెరిగి రూ. 96.89కి చేరింది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ. 110. 01కు, డీజిల్ ధర రూ. 96.02కు, తిరుపతిలో పెట్రోల్ధర రూ. 112.02కు, డీజిల్ ధర రూ. 98.00కు చేరాయి. హైదరాబాద్లో సిలిండర్ రూ.1002 తెలంగాణలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ ధర 88 పైసలు (స్థానిక పన్నులు కలుపుకొని) చొప్పున పెరిగాయి. వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగడంతో 14.2 కిలోల గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రంలో పన్నులు కలుపుకొని రూ. 1000 దాటింది. సిలిండర్ ధర తెలంగాణలో ఆదిలాబాద్లో అత్యధికంగా రూ. 1,026కు చేరింది. రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్లు వినియోగంలో ఉండగా, ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. సగటున రాష్ట్రంలో పెట్రోల్వినియోగం నెలకు 15 కోట్ల లీటర్లుండగా, సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్లుంది. -
బాదుడు షురూ..ఒకేసారి డీజిల్పై రూ. 25 పెంపు..! బంకుల మూసివేత..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ భారత్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా జనాలు పెట్రోలు, డిజీల్ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే బల్క్ కస్టమర్లకు చమురు సంస్థలు గట్టి షాకిస్తూ బాదుడు షురూ చేశాయి. లీటరుకు రూ. 25 పెంపు..! బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది. బంకుల మూసివేత యోచనలో..! బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రైవేట్ రిటైల్ కంపెనీలకు బంకుల నిర్వహణ కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే.. బల్క్ డిజీల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి. చదవండి: తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు -
Telangana: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. 20% బస్సులు డిపోల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పెరిగిన ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సుల ట్రిప్పులు కుదించుకోవాలని ఆలోచిస్తోంది. కనీసం 20 శాతం ట్రిప్పులు తగ్గించి ఆ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలనుకుంటోంది. కుదుటపడుతున్న సమయంలో.. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో ట్రిప్పులు తిప్పలేకపోతోంది. ఇప్పుడిప్పుడే అన్ని బస్సులు ఊళ్లకు వెళ్తున్నాయి. పరిస్థితి క్రమంగా కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలో తాజా ‘డీజిల్ సంక్షోభం’ఆర్టీసీని మళ్లీ సమస్యల్లోకి నెట్టింది. ఆర్టీసీ నిత్యం సగటున 5 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ లీటరు ధర రూ.92గా ఉంది. తర్వాతి రోజే అది రూ. 6 మేర పెరిగింది. దీంతో అంతకంటే తక్కువ ధర ఉన్న రీటైల్లో కొనటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగుస్తూనే రిటైల్లోనూ రేట్లు పెరగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ లీటరు ధర రూ.104కు చేరింది. యూపీ ఎన్నికలు ముగిసేనాటికి నాటికి రేటు రూ. 110ని మించుతుందని, ఆర్టీసీకి బల్క్ పర్చేస్ డిస్కౌంట్తో కలుపుకుంటే అది రూ.105 కంటే ఎక్కువే ఉంటుందని ఆర్టీసీ అంచనా. అదే జరిగితే రోజువారీగా అదనంగా రూ.65 లక్షల భారం ఆర్టీసీపై పడుతుంది. దీన్ని భరించటం అసాధ్యమని సంస్థ చెబుతోంది. అందుకే కనీసం 20 శాతం ట్రిప్పులను, ఆ మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. చదవండి: (గుడ్న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) పెళ్లిళ్లూ లేకపోవడంతో.. సాధారణంగా ఆర్టీసీకి పెళ్లిళ్ల సీజన్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు కూడా విరామం వచ్చింది. మరో 20 రోజులు ముహూర్తాల్లేవు. శుభముహూర్తాలు లేకుంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతుంది. బుధవారం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోనే నమోదైంది. ఇది ఇంకా తగ్గే అవకాశముంది. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోను చూపి ట్రిప్పులను తగ్గించి అంతమేర బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. నేరుగా జనంపై డీజిల్ భారం చాలినన్ని బస్సుల్లేక, కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేక పాత బస్సులనే ఆర్టీసీ నడుపుతోంది. వేల సంఖ్యలోని ఊళ్లకు రవాణా వసతిని అందించలేకపోతోంది. దీంతో జనం ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. డీజిల్ ధర పెరగటంతో ఆటో చార్జీలూ భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ట్రిప్పులూ తగ్గితే, బస్సుల్లేవని ఆటోవాలాలు చార్జీలు పెంచే అవకాశం ఉంది. దీంతో డీజిల్ భారం నేరుగా జనం జేబుపై పడబోతోంది. -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..?
ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగినప్పటి నుంచి బంగారం, చమరు ధరలు భారీగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజు బ్యారెల్ బ్రెంట్ క్రూయిడ్ ఆయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. అయితే, ఒకవైపు అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరగడంతో ఆ ధరల నుంచి మన దేశ ప్రజలకు ఉపశమనం అందించడానికి కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది. వినియోగదారులపై చమురు ధరల ప్రభావం పడకుండా ఉండటానికి లీటరు పెట్రోల్, డీజిల్'పై రూ.8-10 ఎక్సైజ్ సుంకన్నీ తగ్గించడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బిజినెస్ టుడే మీడియాకు తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో 68 డాలర్లు ఉన్న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నేడు 115 డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పులేదు. "అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు లీటరుకు రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బిఐ ఎకోర్యాప్ కొద్ది రోజుల క్రితం తన నివేదికలో తెలిపింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లయితే, అప్పుడు ఖజానాకు లక్ష కోట్ల రూపాయలు నష్ట వస్తుంది. కాబట్టి, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో డీజిల్ & పెట్రోల్ ధరలు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరల ప్రభావం వినియోగదారుడి మీద పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే పరిస్థితి చక్కదిద్దుకొనే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగిన ప్రకారం దేశంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం 52-65 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, రేట్లు పెరగకుండా చూడటం కోసం ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.7 తగ్గించినట్లయితే, అప్పుడు నెలకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుంది అని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. చూడాలి మరి మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. (చదవండి: కొత్తగా రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిస్తున్న బ్యాంకులు..!) -
సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!
వంట గ్యాస్ ధరల మార్పు విషయంలో చమరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. మార్చి 1 నుంచి ఎల్పీజీ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్లో ధరల పెంచాలా? వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్, డీజిల్తో పాటు భారత్లో ఎల్పీజీ ధరలు పెరగనున్నాయని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ధరల పెంపు భారత్లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చూడలిమరి చమురు కంపెనీలు రేపు వంట గ్యాస్ ధరలను పెంచుతాయా? లేదా? అనేది. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?) -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో బ్రెంట్ బ్యారెల్ ముడి చమరు ధర $100కు చేరుకుంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.95,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నష్టం కలగవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆర్థిక విభాగం ఒక నివేదికలో తెలిపింది. రెండు రోజుల నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలలో పెద్దగా మార్చలేదు. "ప్రస్తుతం ధరల ప్రకారం.. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $95/బిబిఎల్.-$110 బిబిఎల్ మధ్య ఉంది. అయితే, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఉన్న ప్రస్తుత డీజిల్ & పెట్రోల్ ధరల కంటే రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్బీఐ 'ఎకోర్యాప్' పేర్కొంది. అయితే, ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చిలో పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7 తగ్గించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అప్పుడు నెలకు రూ.8,000 కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. "వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ & డీజిల్ వినియోగం ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగితే అప్పుడు ప్రభుత్వం నష్టం సుమారు 95000 కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతంగా ఉంది. గత ఏడు నెలల కాలంలో ఇదే గరిష్టం. (చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!) -
పోలింగ్ ముగుస్తూనే.. పెట్రో బాంబ్?
(సాక్షి, బిజినెస్/ సాక్షి,అమరావతి): జాతీయ పార్టీల తలరాతలు మార్చే ఉత్తర ప్రదేశ్తో సహా నాలుగు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు... గడిచిన మూడు నాలుగు నెలలుగా పెట్రో ధరల పెంపు నుంచి సామాన్యులను కాపాడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ మేరకు స్థానికంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆ ప్రభావం ఆయా దేశాల ద్రవ్యోల్బణం మీద పడింది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి అగ్రరాజ్యాల్లో సైతం ద్రవ్యోల్బణం (ధరల మంట) విపరీతంగా పెరిగింది. ఎన్నికల్లో విజయావకాశాల దృష్ట్యా కొన్నాళ్లుగా ధరల పెంపు జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లకపోవటంతో దేశంలో ఇంకా ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణికి తగ్గట్టుగా ఇక్కడా ధరలు పెంచక తప్పదు కనక ఎన్నికలు పూర్తయిన మరు క్షణంలోనే ఆ భారాన్ని జనంపై మోపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తోడయింది. ఇది ముడి చమురు ధరలను మరింతగా మండిస్తోంది. ఈ ధరలు ఏ స్థాయికి వెళతాయో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ భారాన్ని కూడా అంతిమంగా జనంపైనే మోపుతారు కనక... ఈ రెండు పరిణామాలూ సామాన్యులపై భరించలేని భారాన్ని మోపే సంకేతాలొస్తున్నాయి. నెల జీతంలో కనీసం 8 నుంచి 15 శాతాన్ని పెట్రోలు, డీజిల్పైనే పెట్టే సామాన్యులకిది మింగుడుపడని వ్యవహారమే. బల్క్ ధరలు ఇప్పటికే పెంపు! నిజానికి కొన్నాళ్లుగా రిటైల్ అవుట్లెట్లలో సామాన్యులు కొనే పెట్రోలు, డీజిల్ ధర పెంచకపోయినా రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు టోకుగా కొనుగోలు చేసే బల్క్ డీజిల్ ధర మాత్రం ఇప్పటికే పెంచేశారు. సహజంగా బల్క్ ధర రిటైల్ ధర కన్నా ఎంతో కొంత తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్లుగా బంకుల్లో సామాన్యులకు విక్రయించే ధరలు పెంచకుండా... బల్క్గా కొనుగోలు చేసేవారికి మాత్రం పెంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే రిటైల్గా కొనుగోలు చేసే లీటర్ డీజిల్ ధర రూ.96 ఉండగా... బల్క్గా కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం ఈ ధర ఇప్పటికే రూ.100 దాటిపోయింది. అంటే.. రిటైల్పై పెంచాల్సిన భారం ఇప్పటికే పెండింగ్లో ఉందన్న మాట!!. మరి దీనికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా అమాంతంగా ఎగసిన ముడిచమురు ధరలు కూడా తోడయితే..? అమ్మో! తలచుకుంటేనే గుండె గుభేల్మనక మానదు. బల్క్కు ఎప్పుడూ తక్కువ ధరే! సాధారణంగా బల్క్ డీజిల్ ధరను 15 రోజులకోసారి నిర్ణయిస్తారు. రవాణా ఛార్జీలు, ఇతరత్రా కలిసొస్తాయి కనక రిటైల్ వినియోగదారులకు విక్రయించే ధరకంటే లీటరుకు రూ.6 నుంచి రూ.10 తక్కువకే ఆయిల్ సంస్థలు బల్క్ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. గతేడాది నవంబరులో రిటైల్ డీజిల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్కు ఏకంగా రూ.15.36 తక్కువ ఉంది. జనవరి నుంచి బల్క్ డీజిల్ ధర పెరుగుతూ వచ్చింది. జనవరి 16న బల్క్ డీజిల్ ధర లీటరుకు రూ.90.68 ఉండగా.. రిటైల్ ధర లీటరుకు రూ.96.02 ఉంది. ఫిబ్రవరి 1 నాటికి రెండు ధరలూ దాదాపు సమానమయ్యాయి. ఇపుడైతే రిటైల్ డీజిల్ ధర రూ.96.02 ఉండగా బల్క్ ధర రూ.100.41కు చేరింది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ డీజిల్ ధర లీటర్కు రూ.4.39 ఎక్కువ.!! రిటైల్ నుంచే కొంటున్న ఆర్టీసీ... రాష్ట్రంలో ఆర్టీసీ సగటున నెలకు 2.50 కోట్ల లీటర్ల డీజిల్ కొంటుంది. ఆ ప్రకారం ఆర్టీసీపై నెలకు ఏకంగా రూ.10 కోట్ల భారం అదనంగా పడుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ డీజిల్ కొనడానికి అనుమతినిచ్చింది. దీనిద్వారా కొంత ఆర్థిక భారం తగ్గుతోంది. రైల్వేలో దేశవ్యాప్తంగా 65 శాతం రైళ్లు విద్యుత్తుతో, 35 శాతం రైళ్లు డీజిల్తో నడుస్తున్నాయి. రైల్వే శాఖ నెలకు 22 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఆ ప్రకారం లీటరుకు సగటున రూ.4.39 చొప్పున రైల్వేపై నెలకు దాదాపు 96.58 కోట్ల ఆర్థికభారం అదనంగా పడుతోంది. ఎన్నికల తరువాత ఎంత బాదుడు? బల్క్– రిటైల్ ధరలను పోల్చినపుడు రిటైల్ ధర బల్క్కన్నా 15–20% ఎక్కువుండేది. అంటే లీటరుపై రూ.15 నుంచి 20 వరకూ పెరగొచ్చు. అది కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం లేనపుడు. మరి యుద్ధంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి కనక రిటైలర్లపై బాదుడు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఊహించుకోవాల్సిందే. ఎన్నికలప్పుడు పెంచకపోవటమనేది కేంద్రంలోని ప్రభుత్వాలకు కొత్త కాదు. 2013 చివర్లోనూ ఇలానే జరిగింది. 2014 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధర పెంచలేదు. బల్క్ ధరను మాత్రం 2013 చివరి నుంచి ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూపోయాయి. ఇప్పుడూ ఇదే పరిస్థితి. ఏపీలో ప్రస్తుతం రోజుకు 84.02 లక్షల లీటర్ల డీజిల్, 52.90 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుండటం గమనార్హం. భయపెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికా–చైనా నాలుగేళ్ల కిందట ప్రారంభించిన టారిఫ్ల యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య ఆంక్షలు ఇప్పటికే చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచేశాయి. ఇక కోవిడ్తో వివిధ దేశాల సరళతర ద్రవ్య విధానాలు మరింత ముమ్మరమై ధరల స్పీడ్ను తెగ పెంచేశాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమన్న పేరుతో అమెరికా రిజర్వు బ్యాంకు ‘ఫెడ్’.. ఎడాపెడా నిధులు కుమ్మరించింది. ఫలితం...అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ 2022 జనవరిలో నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 1982 తరవాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు మరి. చైనాలోనూ ద్రవ్యోల్బణం 10 శాతం స్థాయిలో కొనసాగుతోంది. భారత్ విషయానికొస్తే జనవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా ఏడు నెలల గరిష్ట స్థాయి 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయింది. పెట్రో ధరలు పెంచకపోవటంతో ఇది ఈ స్థాయిలో ఉందని, అదే జరిగితే మరింత పైకెగసే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా తలెత్తిన యూరోప్ భౌగోళిక ఉద్రిక్తతలు మరో నెలపాటు కొనసాగితే... ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 150 నుంచ 200 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
వాహనదారులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికే సై అంటున్నారు. రష్యా తూర్పు ఉక్రెయిన్లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాల డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు రష్యా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మంగళవారం చమురు ధరలు 2014 నుంచి గరిష్టస్థాయికి చేరుకున్నాయి. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. "బ్యారెల్ చమరు ధర $100 కంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది" అని ఆయిల్ బ్రోకర్ పీవిఎంకు చెందిన తమస్ వర్గా అన్నారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.48 డాలర్లు(3.7%) పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. గతంలో ఇంతకు ముందు ఈ ధర 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యుటిఐ) క్రూడ్ ఆయిల్ ధర 4.54 డాలర్లు(4.8%) పెరిగి 95.61 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్, డీజిల్కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల చమరు ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ దేశాలు, ఒపెక్+గా పిలువబడే మిత్రదేశాలు చమరు సరఫరాను ఎక్కువ పెంచడానికి ఆలోచిస్తున్నాయి. మన దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు గతంలో డెలాయిట్ టచి తోమత్సు ఇండియా తన నివేదికలో పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన(మార్చి 10) తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు మిశ్రా తెలిపారు.అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే చమరు కంపెనీ పెంచలేదు అని పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని మిశ్రా పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడం అనేది కేంద్ర బ్యాంకుకు కత్తి మీద సాము కానున్నట్లు తెలిపారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు తగ్గనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: ట్రంప్ అన్నంత పని చేశాడు.. ఇక సోషల్ మీడియాకు చుక్కలే?) -
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు భారీ షాక్.. మళ్లీ పెరగనున్న ధరలు!
గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు అని సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఇది కేవలం కొద్ది రోజుల వరకు మాత్రమే అని సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో భారీగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ టచి తోమత్సు ఇండియా పేర్కొంది. "5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్రం రిటైల్ ధరలను పెంచలేదు" అని డెలాయిట్ భాగస్వామి దేబాసిష్ మిశ్రా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్చి 10 తర్వాత అమ్మకపు ధరలో కొరతను పూడ్చడానికి కంపెనీలు లీటరుకు 8-9 రూపాయలు (11-12 సెంట్లు) ధరలను పెంచాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ధరలను పెంచలేదు అని వివరించారు. అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా కంపెనీలకు ధరలు సవరించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఎన్నికల కారణంగానే పెంచలేదు అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత భారీగా ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన అందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని ప్రజల మీద వేసే అవకాశం ఉన్నట్లు మిశ్రా తెలిపారు. ఇంధన ధరలు పెరగడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సెంట్రల్ బ్యాంకుకు ఇబ్బందేనని పేర్కొన్నారు. చమురు ధరలు పెరగడం వల్ల మళ్లీ నిత్యవసర ధరలు పేరుగుతాయని, దీంతో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారతదేశ ఆర్థిక వృద్ధిని 0.3% నుండి 0.35%కు దెబ్బతీస్తుందని మిశ్రా తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధర 100 డాలర్లకు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడం కష్టం అని అన్నారు. (చదవండి: అమెజాన్ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీగా పెరగనున్న వేతనం!) -
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పెట్రోల్, డీజిల్పై పన్నులు, సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,55,069 కోట్లు వసూలు చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. ఇదే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం రూ.2,02,937 కోట్లు అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)గా వసూలు చేసినట్లు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి తెలియజేశారు. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను, వ్యాట్ రూపంలో గరిష్టంగా 25,430 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రూ.21,956 కోట్లు, తమిళనాడు రూ.17,063 కోట్లు వసూలు చేశాయి. నవంబర్ 3న పెట్రోల్పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించినప్పటికీ దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు ఇంకా ఆకాశాన్ని తాకుతున్నాయి. కేంద్రం ప్రకటన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్ను కూడా తగ్గించాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.88.67గా ఉంది. భారతదేశం తన చమురు డిమాండ్లో 85 శాతం, 55 శాతం సహజ వాయువు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉంది. భారతదేశం 2020-21లో ముడి చమురు దిగుమతుల కోసం 62.71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. (చదవండి: డిస్నీ+ హాట్స్టార్ అదిరిపోయే ప్లాన్..! కేవలం రూ. 49 కే సబ్స్క్రిప్షన్..!) -
వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని భారతదేశం యోచిస్తున్నట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అన్నారు. భారతదేశం, జపాన్తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వ చేస్తుంది. ఇందులో నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ 7-10 రోజులలో ప్రారంభం కానున్నట్లు ఆ అధికారి తెలిపారు. వ్యూహాత్మక నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్పిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)లకు స్టాక్స్ విక్రయించనున్నారు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది. (చదవండి: 5 నిమిషాల ఛార్జ్తో 4 గంటల ప్లేబ్యాక్ హెడ్ఫోన్స్ను లాంచ్ చేసిన సౌండ్కోర్..!) -
బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. చదవండి: అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్రెడ్డి అక్టోబర్లో ధర ఎంత ఉంది? నవంబర్లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్ చేయాలి. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చదవండి: Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. సీఎం జగన్ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. -
స్పెషల్ డిబేట్ ఆన్ పెట్రోల్ డీజిల్ రేట్స్
-
పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు అందించింది. నింగిలోకి దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేలా బుధవారం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. వీటిపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున తగ్గించింది. ఈ తగ్గింపు గురు వారం నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటర్కు రూ.5, డీజిల్ ధర రూ.10 చొప్పున తగ్గనుంది. కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు కొంత తగ్గడంతో ప్రజలకు ఆ మేరకు ఊరట లభించనుంది. వ్యవసాయ రంగానికి మేలు డీజిల్ ధర దిగి రావడం వ్యవసాయ రంగానికి ఎంతగానో మేలు చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘లాక్డౌన్ కాలంలోనూ రైతులు తమ శ్రమ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తోడ్పాటు అందించారు. డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో రాబోయే రబీ సీజన్లో రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగాయి. ఫలితంగా భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఇంధనాల కొరత కనిపించింది. ధరలు పెరిగాయి. మన దేశంలో ఇంధనాల కొరత తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. దేశ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్–19 వ్యాప్తి వల్ల డీలా పడిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. తయారీ, సేవలు, వ్యవసాయం తదితర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇంధనాల వినియోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది..’’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. డీజిల్ రేటు తగ్గడం వల్ల పంటల సాగుకు పెట్టుబడి వ్యయం స్వల్పంగానైనా తగ్గనుంది. తద్వారా రైతాంగంపై కొంత భారం దిగిపోయినట్లే. కాగా వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.32.90, లీటర్ డీజిల్పై రూ. 31.80 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ (సెస్లతో కలిపి) విధిస్తోంది. ఇందులో నుంచి పెట్రోల్పై ఐదు రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించనుంది. దీని ప్రభావం మన రాష్ట్ర పన్నులపై కూడా పడనుంది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై సుమారు రూ.6.81, డీజిల్పై రూ.12.73 తగ్గనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.47, డీజిల్ రూ.107.37 ధరలు ఉండగా, తగ్గిన సుంకంతో పెట్రోల్ రూ.107.66కు, డీజిల్ రూ.94.64కు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.04 నుంచి రూ.105.04కు, డీజిల్ రేటు రూ.98.42 నుంచి రూ.88.42కు తగ్గిపోనుంది. ఎన్నికల్లో పరాజయాలతో అప్రమత్తం దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.100 మార్కును ఎప్పుడో దాటేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్లో అయితే లీటర్ పెట్రోల్ రేటు రూ.120కి చేరింది. ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ప్రజాగ్రహాన్ని గుర్తించిన కేంద్రం ఒక మెట్టు కిందికి దిగిరాక తప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిశీలిస్తే ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.8,700 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే సంవత్సరానికి రూ.లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలానికి రూ.43,500 కోట్ల నష్టం వాటిల్లనుంది. -
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు
-
డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా.. బస్సు చార్జీల సవరణ!
టిమ్స్తో సులువే.. గతంలో టికెట్లు ఇచ్చే విధానం అమల్లో ఉన్నప్పుడు, టికెట్ చార్జీలు సవరిస్తే వాటిపై కొత్త ధరలను ప్రింట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం టిమ్స్ యంత్రాల ద్వారా టికెట్లు ఇస్తున్నారు. వీటిల్లో చార్జీల పట్టికను సవరించటం సులభం. తరచూ ధరలు మారినా, రాత్రికి రాత్రే వాటిల్లో సవరించే వెసులుబాటు ఉన్నందున కొత్త విధానం ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడల్లా టీఎస్ఆర్టీసీ టికెట్ చార్జీలు కూడా మార్చే విధానం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రవేశపెట్టాలన్న నిపుణుల సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించ డంతో పాటు, ఒకేసారి చార్జీలు భారీగా పెంచిన భావన ప్రజల్లో లేకుండా ఉంటుందన్న కోణంలో దీనికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కూడా ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ అంశం చర్చకు వచ్చింది. 2019లో ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె అనంతరం పరిస్థితులు తిరిగి సద్దుమణిగే సమయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరల మార్పులకు తగ్గట్టుగా బస్సు ఛార్జీలు సవరించే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చించారు. కానీ ఆ వెంటనే కోవిడ్ సమ స్య రావటంతో అది కాస్తా పెండింగులో పడింది. నిర్ణయాధికారం ఆర్టీసీకే.. 2019లో ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.66గా ఉంది. ఆ సంవత్సరం ఆరంభంలో అది రూ.62గా ఉంది. రెండేళ్లలో లీటర్పై ఏకంగా రూ.39 వరకు పెరిగింది. ఫలితంగా రోజుకు ఆర్టీసీపై రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇటీవల సీఎం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీలను సవరించాలన్న అంశం చర్చకు వచ్చింది. దీంతో ప్రతిపాదన పంపాలని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గతంలో లాగా కిలోమీటర్కు 20 పైసలు పెంచితే ఉండే ప్రభావం, 25 పైసలు, 30 పైసలు పెంచితే ఎంతుంటుందన్న వివరాలు పొందుపరిచారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్కు 25 పైసలు పెంచాలని ఆర్టీసీ కోరుతోంది. ఇదే సమయంలో ఇలా కొంతకాలం తర్వాత ఒకేసారి భారీగా పెంచటం కంటే, డీజిల్ ధరలు మారినప్పు డల్లా చార్జీలు సవరించే అధికారాన్ని ఆర్టీసీకి కట్టబెట్టాలన్న సూచన మరోసారి తెరపైకి వచ్చింది. ఒకేసారి చార్జీలు పెంచితే ప్రజలు భారంగా భావిస్తారు. డీజిల్ ధరలు మారినప్పుడల్లా అదే దామాషా ప్రకారం చార్జీలు పెంచితే, ఆ భారం కూడా స్వల్పంగానే ఉన్నట్లు ప్రయాణికులకు కన్పిస్తుంది. వెంటవెంటనే చార్జీలు మారితే డీజిల్ పెంపుతో వచ్చే నష్టాలను ఆర్టీసీ అధిగమిస్తూ నష్టాలకు చెక్ పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (చదవండి: యాదాద్రిలో 250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు) -
నిర్మాణ రంగంపై డీజిల్, బొగ్గు దెబ్బ
సాక్షి, అమరామతి: పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం, కోవిడ్ వంటి వరుస దెబ్బలను తట్టుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని డీజిల్ ధరలు, బొగ్గు కొరత మరోసారి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏడాదిన్నరలో లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.28 పెరగడంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఏడాదిన్నర కిందట లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉండగా ఇప్పుడు అది రూ.106 దాటింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత రావడంతో డిమాండ్ లేకున్నా ఉత్పత్తి తగ్గడం వల్ల స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత ప్రభావం అధికంగా స్టీల్ రంగంపై పడింది. కొరత లేకముందు టన్ను స్టీల్ ధర రూ.40–45 వేల మధ్య ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.65,000 మార్కును అధిగమించింది. సిమెంట్ బస్తా రూ.260 నుంచి రూ.370కి చేరింది. డీజిల్ ధరలు పెరగడంతో ఇసుక, కంకర, ఇటుక వంటి వస్తువుల రవాణా వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజాశ్రీనివాస్ చెప్పారు. ముడి సరుకుల వ్యయం భారీగా పెరగడంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 20 శాతం వరకూ పెరుగుతోందన్నారు. దీంతో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టినవారు పని వేగాన్ని తగ్గించినట్టు క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నవాటిని వదిలించుకుందాం.. నిర్మాణ వ్యయం పెరిగినా ధరలు పెంచలేని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ చెప్పారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న తరుణంలో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో నూతన ప్రాజెక్టుల కంటే.. ఇప్పటికే నిర్మించిన వాటిని అమ్ముకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కొత్త వెంచర్లు వేసేందుకు కూడా బిల్డర్లు వెనుకాడుతున్నారని వైజాగ్ క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. క్రెడాయ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 లక్షల ఫ్లాట్స్ నిర్మాణంలో ఉండగా, వాటిలో 56,000 ఫ్లాట్స్ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Petrol Diesel Prices: వరుసగా ఐదో రోజు కూడా బాదుడే...!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో..దేశ వ్యాప్తంగా మరోమారు పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయి. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! వరుసగా ఐదవ రోజూ ఆదివారం (అక్టోబర్ 24, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.96.32పైసలు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.46పై., డీజిల్ రూ.104.38కు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కి చేరింది. డీజిల్ రూ.105.08 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.52, రూ.106.11 గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.111.34, రూ.102.23 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్ల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉండనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలూ 19 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 85 డాలర్లకు చేరుకుంది. చదవండి: 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్సైట్! ఎప్పుడంటే.. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్లోని గంగానగర్లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
సామాన్యుడికి చుక్కలు, మరోసారి పెరిగిన పెట్రో ధరలు
బియ్యం, గోధుమ, వంటనూనెల ధరలు తగ్గుతున్నా..రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటే జంకుతున్నారు.దీంతో నిత్యవసర ధరలతో పాటు పెట్రో ధరల్ని తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇక శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.ముంబై వంటి ప్రధాన నగరాల్లో డీజిల్ ధర కూడా పెట్రోల్తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. శనివారం రోజు లీటర్ పెట్రోల్పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసలు పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా డీజిల్ ధర 100.29 ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 ఉండగా డీజిల్ ధర రూ.92.47 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.27 ఉండగా డీజిల్ ధర రూ.96.93 ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 104.52 ఉండగా డీజిల్ ధర రూ.95.58 ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.108.02 ఉండగా డీజిల్ ధర రూ.100.89 ఉంది బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా డీజిల్ ధర రూ.98.15 ఉంది. -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై 31 పైసలు,డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో వాహనదారులు పెరుగుతున్న ఇంధన ధరలతో చేతి చమురు వదులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇంధన రేట్లను పెంచడం దారుణమని వాపోతున్నారు. రవాణా రంగం మీద ఆధారపడే వాళ్లు సైతం బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.ఇన్ని రోజులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.కానీ రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆఫీస్కు వెళ్లాలంటే జంకుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో రోజురోజుకి పెరగుతున్న ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్ రేటు వంద దాటి పరుగులుపెడుతుండగా.. డీజల్ రేట్లు సైతం వంద మార్క్ను దాటాయి. పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ వివరాలు హైదరాబాద్లో పెట్రోల్ రూ.107.71 ఉండగా డీజిల్ లీటర్ రూ.100.51 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 ఉండగా.. లీటర్ డీజిల్ రూ. 92.12 ఉంది ముంబైలో పెట్రోల్ రూ. 109.54 ఉండగా డీజిల్ రూ .99.92 ఉంది కోల్కతాలో పెట్రోల్ రూ. 104.23 ఉండగా డీజిల్ రూ. 95.23 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ .101.01 డీజిల్ రూ. 96.60 ఉంది. -
స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంతంటే?
వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడింది.ఆదివారం పెట్రోల్పై 25 పైసలు,డీజిల్పై 30 పైసలు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం పెట్రో ధరలు పెరగకపోవడంతో పోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
ఆగని పెట్రోమంట..మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై 25పైసలు, డీజిల్ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు సెంచరీని క్రాస్ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి-డాలర్ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ ధరలు మార్పులు చేస్తారు. దేశంలోని ఇతర నగరాలలో కొత్త ఇంధన రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (చదవండి: పది ఏళ్లుగా ముఖేష్ అంబానీ నెంబర్ 1) -
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు బతుకు జీవుడా అంటూ బతుకు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి పెరిగి పోతున్న ఈ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్ మంగళవారం 25 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 17 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గి 79.36 డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి భయాలు తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని క్రమ క్రమంగా తొలిగించడంతో ఇంధన ధరలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది.(చదవండి: 35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది?) దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు.. City Name Petrol Price Diesel Price హైదరాబాద్ 105.48 97.46 విజయవాడ 107.54 99.25 విశాఖపట్నం 106.77 98.51 ఢిల్లీ 101.39 89.57 ముంబై 107.47 97.21 బెంగళూరు 104.92 95.06 చెన్నై 99.15 94.17 -
TSRTC: కి.మీ.కు 25 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28–30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీని ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు అనివార్యమంటూ మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపాదనలు సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కసరత్తు ప్రారంభించి దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి 25 పైసలైతే ఓకే.. పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.65 ఉంది. ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది. ఈ లెక్కన నిత్యం సగటున రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. అంటే సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పెంపు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
TSRTC: చుక్కలు చూపిస్తున్న చమురు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు పెరుగుతున్న చమురు భారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తీవ్రంగా కలవరపెడుతోంది. చూస్తుండగానే మొత్తం వ్యయంలో డీజిల్ వాటా ఏకంగా 30 శాతాన్ని మించింది. రెండేళ్ల స్వల్ప విరామంలోనే లీటరు డీజిల్పై రూ.24 మేర ధర పెరగటంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. సంస్థ తాజా లెక్కల ప్రకారం.. ఒక కిలోమీటరుకు వ్యయం (కాస్ట్ పర్ కిలోమీటర్) రూ.60గా ఉండగా, అందులో డీజిల్ వాటా రూ.21కి చేరింది. ఉద్యోగుల జీతాల ఖర్చు 53 శాతం ఉండగా, ఇప్పుడు డీజిల్ భారం 30 శాతాన్ని మించటంతో ఈ రెంటినీ ఎలా తగ్గించుకోవాలనే విషయంపై ఆర్టీసీ మేధోమధనం ప్రారంభించింది. సంస్థ కొత్త ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్, వీలైనంత త్వరగా డీజిల్ ఖర్చు తగ్గింపుపై సరికొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రోజుకు 5.4 లక్షల లీటర్ల వాడకం రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.73గా ఉంది. ఆ సమ్మె సమయంలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీపై డీజిల్ భారాన్ని తగ్గించడం కూడా ఒకటి. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ను ఎత్తేయటం ద్వారా ఆర్టీసీని రక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు లీటర్ ధర రూ.97కు చేరింది. ఆర్టీసీకి చమురు కంపెనీలు కొంత తగ్గింపు ధరలకే డీజిల్ను సరఫరా చేస్తున్నా.. లీటర్పై మొత్తం మీద రూ.24 పెరిగిపోవటంతో రోజువారీ వినియోగంలో అదనపు భారం దాదాపు రూ.1.30 కోట్లకు చేరింది. పేరుకుపోతున్న బిల్లులు ఆర్టీసీ నిత్యం 5.4 లక్షల లీటర్ల ఆయిల్ను వాడు తుంది. కోవిడ్ వల్ల ఏడాదిన్నరగా పూర్తిస్థాయి లో బస్సులు తిరగకపోవటంతో ఈ ఖర్చు కొం త ఆదా అయింది. ఇప్పుడు కోవిడ్ దాదాపు తగ్గిపోవటంతో పూర్తిస్థాయిలో బస్సులను నడుపుతున్నారు. దీంతో డీజిల్ వినియోగం మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖర్చును భరించలేక ఆర్టీసీ కిందామీదా పడుతోంది. గతంలో ఇలాగే బిల్లులు పేరుకుపోతే సరఫరా నిలిపేస్తామని ఆయిల్ కంపెనీలు హెచ్చరించటంతో కొంతచెల్లించి సమస్య లేకుండా చూసింది. ఇప్పుడు ప్రతినెలా బిల్లులు పేరుకుపోతుండటంతో కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మళ్లీ ప్రత్యామ్నాయాలపై దృష్టి.. చమురు ధరల భారాన్ని తట్టుకోలేక కొంతకాలం క్రితం ఆర్టీసీ కొన్ని ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించింది. అందులో ముఖ్యమైంది ఎలక్ట్రిక్ కన్వర్షన్. ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చమురు వినియోగం ఉండనందున అటువైపు మొగ్గు చూపింది. అయితే ఆ బస్సుల ఖరీదు ఎక్కువ కావటంతో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇందుకోసం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని యోచించింది. ఈ మేరకు కొన్ని కంపెనీలతో చర్చించింది. కానీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంది. దీంతో కన్వర్ట్ చేసిన కంపెనీలే కొన్నేళ్లు వాటిని నిర్వహించి డీజిల్ ఆదా రూపంలో మిగిలిన మొత్తంలో లాభం తీసుకోవటం లాంటి ఒప్పందాలు చేసుకోవాలని భావించింది. కానీ నాటి ఎండీ దీనిపై ఎటూ తేల్చకుండా పెండింగులో పెట్టారు. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
వరుసగా రెండో రోజు తగ్గిన డీజిల్ ధరలు
హైదరాబాద్: వరుసగా రెండో రోజు డీజిల్ ధరను తగ్గించాయి చమురు కంపెనీలు. లీటరు డీజిల్పై మరోసారి 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్లో లీటరు డీజిల్ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే గత నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం వల్ల సామాన్యులకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. -
ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్,డీజిల్ను ఆదా చేయండి
గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్- డీజిల్ను సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పీడ్ డ్రైవింగ్ చేయకండి మీ మోటారు వాహనాల్ని స్పీడ్గా డ్రైవ్ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్ లేదంటే డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్ చేయడం వల్ల 33శాతం ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమం. ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది. రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం ఏదైనా వస్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్ తో పాటు వాహనం కండీషన్ బాగుండేలా చూసుకోవాలి. మీ కారు అద్దాల్ని క్లోజ్ చేయండి కారు అద్దాల్ని ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ఏసీ వాడకం తగ్గించండి డ్రైవింగ్ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్పై లోడ్ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ బ్రేక్ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. ఇంజన్ వినియోగాన్ని తగ్గించండి ప్రయాణంలో వాహనం ఇంజన్ వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇంజన్ ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. -
దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి కారణం అదేనా?!
దేశంలోని వాహనదారులకు పెట్రోధరలపై ఊరట కలిగింది.గత ఆదివారం నుంచి ఈ రోజు(శనివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు, ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో కరోనా ఎఫెక్ట్తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. ఇక శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా,గత శనివారం లీటర్ పెట్రోల్పైన 30పైసలు పెరిగింది. ఆ తర్వాత ఆదివారం నుండి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జులై నెల 20రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి...మే 3 నుంచి ఇప్పటివరకూ వరుసగా 5 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. గత ఆదివారం ఒపెక్, అనుబంధ దేశాలు ఆగస్ట్ నుంచి చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పదం ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచనున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గురువారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు శుభవార్త
ముంబై: ఇంధన కొనుగోళ్లపై తగ్గింపుల ప్రయోజనాలతో కూడిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంకు విడుదల చేసింది. ‘ఐసీఐసీఐ బ్యాంకు హెచ్పీసీఎల్ సూపర్ సేవర్’ కార్డుతో హెచ్పీసీఎల్ పెట్రోలియం ఔట్లెట్ల వద్ద చేసే చెల్లింపులపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని.. ‘హెచ్పీపే’ యాప్ ద్వారా కార్డుతో చెల్లింపులు చేసినట్టయితే అదనంగా మరో 1.5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్డును ఆఫర్ చేస్తుండగా.. వార్షిక ఫీజు రూ.500గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టాలకు చేరిన తరుణంలో తగ్గింపుల ప్రయోజనాలతో బ్యాంకు ఈ వినూత్నమైన కార్డును ఆవిష్కరించడం మార్కెట్ వాటాను పెంచుకునే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తరచుగా సాంకేతిక అవాంతరాలు తలెత్తుండడంతో నూతన క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పోటీ సంస్థలైన ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు.. క్రెడిట్ కార్డుల్లో వాటాను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. -
స్థిరంగా పెట్రో ధరలు, ఏ నెలలో ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా?
దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది. ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది. విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది. -
రెండు రోజుల సంబరమే,మరోసారి పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు చమురు ధరలు అలాగే ఉన్నా.. గురువారం రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసా వరకు పెరగ్గా..డీజిల్ ధర 15 నుంచి 21 పైసా వరకు పెరిగింది. దీంతో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి. గురువారం రోజు ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52, డీజిల్ ధర రూ.97.96 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54, డీజిల్ ధర రూ.89.87 చెన్నైలో పెట్రోల్ రూ.102.23, డీజిల్ ధర రూ.94.39 ముంబై పెట్రోల్ ధర రూ.107.54 డీజిల్ ధర రూ.97.45 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.74, డీజిల్ ధర రూ.93.02 కాగా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో చమురు ధరల పెరగడానికి కారణమైందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లో క్రూడ్ అయిల్ స్టాక్స్ ప్రభావం లేకపోవడంతో పాటు సెప్టెంబర్ నాటికి చమురు ధరల రవాణా తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. -
Petrol Diesel Prices: వాహనదారులకు ఊరట..స్థిరంగా ధరలు
దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఆల్ మోస్ట్ 2 నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇక మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 39సార్లు పెరగ్గా జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్ - డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.105.15, డీజిల్ ధర రూ.97.78 ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.101.92, డీజిల్ ధర రూ.94.24 ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101, డీజిల్ ధర రూ.89.72 ముంబై పెట్రోల్ ధర రూ.107.20 డీజిల్ ధర రూ.97.29 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.35, డీజిల్ ధర రూ.92.81 -
Petrol Diesel Prices: వాహనదారులకు స్వల్ఫ ఊరట
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
డీజిల్పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
-
పెట్రోల్ ధరలు తగ్గించండి - ఇక్రా
ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం.. ‘ప్రభుత్వ ఆదాయాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా’ ఇంధన సెస్ తగ్గింపునకు దోహదపడుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విశ్లేషించింది. 2020–21లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాల్లో ఎటువంటి ప్రభావం పడకుండా పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.4.5 సెస్ భారం తగ్గించవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల తీవ్రత దీనితో దేశంలో ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇక్రా తాజా సూచనలు చేసింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆందోళనలను కూడా తగ్గించవచ్చని పేర్కొంది. ఇక్రా విశ్లేషణాంశాలను పరిశీలిస్తే.. మహమ్మారి వ్యాప్తికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22లో పెట్రోల్ వినియోగం 6.7 శాతం, డీజిల్ వినియోగం 3.3 శాతం పెరుగుతుందని అంచనా. కాగా, 2020–21లో పోల్చితే పెట్రోల్ వినియోగం 2021–22లో 14 శాతం పెరుగుతుందని అంచనా. డీజిల్ విషయంలో ఈ అంచనా 10 శాతంగా ఉంది. 2020–21లో సెస్ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే అధిక వినియోగం వల్ల ఈ ఆదాయాలు 2021–22లో మరో రూ.40 వేల కోట్లు పెరిగి రూ.3.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న రవాణా, ఎకానమీ రికవరీ దీనికి కారణం. అంటే వినియోగం భారీ పెరుగుదల వల్ల సెస్ల రూపంలో 2021–22లో రూ.40,000 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఈ అదనపు సెస్ రూ.40,000 కోట్ల వసూళ్లను ప్రభుత్వం వదులుకోడానికి సిద్ధపడితే, లీటర్ ఇంధనంపై రూ.4.5 మేర సెస్ భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాలను చూస్తే, ఏప్రిల్, మే నెలల్లో రూ.80,000 కోట్లు ఒనగూరాయి. 2020–21 ఆదాయాలను చేరడానికి మరో రూ.2.4 లక్షల కోట్లు వసూలయితే సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 2 నుంచి 6 శాతం శ్రేణిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికీ రూ.40,000 కోట్ల సెస్ తగ్గింపు నిర్ణయం దోహదపడుతుంది. సెస్ను లీటర్కు రూ.4.5 తగ్గిస్తే, ఇంధనం, లైట్, ఆహార ద్రవ్యోల్బణం 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22లో 5.3 శాతం ఉండే వీలుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం ఇది 5.1 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ ఇటీవలి ద్వైమాసిన సమీక్ష అంచనావేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు తోడు డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి, మార్చి 2020 నుంచీ కేంద్రం విధించిన అధిక సెస్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రెట్లకుపైగా పెంచిన వ్యాల్యూ యాడెడ్ పన్నులు (వీఏటీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు భారీగా పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటర్ రూ.100 దాటేసింది. డీజిల్ విషయంలోనూ ధర మూడంకెలకు చేరవయ్యింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇంధనంపై విధించిన సెస్ను తగ్గించాలన్న డిమాండ్ విస్తృతమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో అదనపు ఆదాయానికి ఒక మార్గంగా 2020 ప్రారంభంలో సెస్ మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది. ఇప్పుడు క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. అయినా ప్రభుత్వం సెస్ను కొనసాగిస్తోంది. ఇది వినియోగదారుపై తీవ్ర భారాన్ని మోపుతోంది. ద్రవ్యోల్బణం ఐదు శాతం: యూబీఎస్ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండే వీలుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనావేసింది. అయితే రూపాయి మరింత బలహీనపడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది. ఇక్రా రేటింగ్స్ విషయంలో ఈ అంచనా 5.3 శాతంగా ఉండగా, ఆర్బీఐ అంచనా 5.1 శాతం -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్పై 26 పైసలు, డీజిల్ లీటర్కు 7 పైసలు వరకు పెరిగాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో పెట్రోల్ రూ.101.60.. డీజిల్ రూ.96.25 పెరిగింది విజయవాడలో పెట్రోల్ రూ.103.53, డీజిల్ రూ.97.61 పెరిగింది ఢిల్లీలో పెట్రోల్ రూ.97.76.. డీజిల్ రూ.88.30 పెరిగింది ముంబైలో పెట్రోల్ రూ.103.89.. డీజిల్ రూ.95.79 పెరిగింది చెన్నైలో పెట్రోల్ రూ.98.88.. డీజిల్ రూ.92.89 పెరిగింది బెంగళూరులో పెట్రోల్ రూ.101.03, డీజిల్ రూ.93.61 పెరిగింది చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు ? -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఇంధన ధరలు ఒకరోజు విరామం తరువాత నేడు మళ్ళీ భారీగానే పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి. ఢిల్లీలో పెట్రోల్ ధరలు 28 పైసలు పెరగడంతో రూ.97.50 చేరుకుంటే, డీజిల్ ధర 26 పైసలు రూ.88.23కు చేరుకుంది. హైదరాబాద్ లో తాజాగా నేడు పెట్రోల్ ధరలు 29 పైసలు, డీజిల్ 28 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.101.33, డీజిల్ ధర రూ.96.17గా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.65, డీజిల్ ధర రూ. 92.83 ముంబైలో పెట్రోల్ ధర రూ. 103.63, డీజిల్ ధర రూ. 95.72 కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 97.38, డీజిల్ లీటరుకు రూ. 91.08 భోపాల్లో పెట్రోల్ ధర రూ. 105.72, డీజిల్ ధర లీటరుకు రూ. 96.93 బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 100.76, డీజిల్ ధర లీటరుకు రూ. 93.54 దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ.100 మార్కును తాకింది. మే 4 నుంచి వేగంగా పెరిగిన చమురు ధరలు. కేవలం 29 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.7.18 పెరిగితే, డీజిల్ ధర రూ .7.45 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలను బట్టి దేశీయ ఇంధన ధరలు మారుతాయి. అంతేగాక, ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్ ధరల పెరుగుదల, పతనానికి కారణం. పన్నులు, సరుకు ఛార్జీలను బట్టి ఇంధన ధరలు రాష్ట్రాన్ని బట్టి మారతాయి.కొత్త ఇంధన ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారుస్తారు. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
దేశంలో పరుగులు పెడుతున్న పెట్రోల్,డీజిల్ ధరలు
సాక్షి,వెబ్డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. జూన్ నెలలో పదో సారి ఇందన రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆయిల్ రిటైలర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర రూ. 96.93 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ.87.69 వద్ద కొనసాగుతుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.08 ఉండగా.. డీజిల్ ధర రూ.95.14కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.14 ఉండగా..డీజిల్ రూ. 92.31 కు పెరిగింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.84 గా ఉంటే లీటర్ డీజిల్ రూ. 90.54కు చేరింది. ఇక భోపాల్లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.105.13 ఉండగా డీజిల్ ధర రూ. 96.35 వద్ద ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.17 ఉండగా డీజిల్ రూ. 92.97 వద్ద అమ్ముడవుతోంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 108.07 ఉండగా డీజిల్ ధర.100.82 గా ఉంది. ఇక మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీకి చేరాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక,లడఖ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కు చేరింది. కాగా,హైదరాబాద్లో పెట్రోల్ రూ.100.74, డీజిల్ రూ.95.59, విజయవాడలో పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.96.97 కు చేరింది. చదవండి: అరే...! ఈ పాట ఎక్కడో విన్నట్టుందే ? -
Fuel Price hike: పెట్రోల్ని క్రాస్ చేసిన డీజిల్
హైదరాబాద్: ఇంధన ధరల పెరుగుదలలో పెట్రోల్ని డీజిల్ క్రాస్ చేసింది. గత నలభై నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే... పెట్రోలు కంటే డీజిల్ ధరలే ఎక్కువగా పెరిగాయి. గడిచిన 44 రోజుల్లో ఇంధన ధరలను 25 సార్లు పెంచాయి చమురు కంపెనీలు. ఇలా 25 సార్లు పెరిగిన ధరల మొత్తాన్ని కలిపితే లీటరు పెట్రోలుపై రూ. 6.26 డీజిల్పై రూ. 6.68 ధర పెరిగింది. మొత్తంగా పెట్రోలు కంటే డీజిల్ ధర 42 పైసలు ఎక్కువగా పెరిగింది. సెంచరీ దిశగా డీజిల్ బెంగాల్ ఎన్నికలు ముగిసింది మొదలు చమురు కంపెనీలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పేరు చెప్పి ఇంధన ధరలు పెంచుకుంటూ పోయాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర వంద దాటగా తాజాగా డీజిల్ సెంచరీకి చేరువగా వస్తోంది. రాజస్థాన్లోని గంగానగర్లో డీజిల్ ధర వందను దాటేసింది. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 100.51గా నమోదైంది. ఇదే ట్రెండ్ మరో నెలరోజులు కంటిన్యూ అయితే తెలుగు స్టేట్స్లోనూ లీటరు డీజిల్ ధర వందను దాటం ఖాయమనేట్టుగా ఉంది పరిస్థితి. చదవండి : హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
వాహనదారులకు చుక్కలే, మరోసారి పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపించాయి. బుధవారం రోజు లీటర్ పెట్రోల్ పై 26 పైసలు,డీజిల్ పై 13పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.100.46 కాగా డీజిల్ ధర రూ. 95.28 గా ఉంది. ఇక హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు కంపెనీలు ధరల్ని పెంచాయి. అధికారిక లెక్కల ప్రకారం..ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లలో చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచాయి. ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66 రూపాయలుగా ఉంది. ఇది నిన్నటితో పోలిస్తే ఈరోజుకి 25 పైసలు పెరిగింది. 13 పైసలు పెరిగి లీటర్ డీజిల్ ధర రూ .87.28కు చేరింది. ముంబై మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటర్ కు రూ.94.84 కు ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107 ఉండగా, డీజిల్ ధర లీటర్ కు రూ.100.51 గా ఉంది. కాగా, వివిధ నగరాల్లో వేర్వేరు ధరల కారణంగా ఢిల్లీ మరియు ముంబై మధ్య ధరల వ్యత్యాసం ఉంది. సరుకు రవాణా, ఛార్జీలు, స్థానిక పన్నులు మరియు వ్యాట్ ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: ధరలకు ఇంధన సెగ! -
పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో రోజు రోజుకి పెట్రోల్, డీజల్ భారీగా పెరుగుతూ పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగతున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ధరల పెరుగుదలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరల పెరగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయిని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. గత నెల మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు. పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు కూడా వివరించారు. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
Petrol, Diesel Prices: మరోసారి పెరగిన ఇంధన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 31 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25 డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్ రేటు రూ.85.95గా ఉన్నాయి. ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.98.76, డీజిల్ రూ.93.70 ► కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.02, లీటర్ డీజిల్ రేటు రూ. 88.80 ► చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47,లీటర్ డీజిల్ ధర రూ. 90.66 చదవండి: GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు -
సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర
సాక్షి, అమరావతి: పెట్రోల్ ధర సెంచరీ కొట్టడమే కాదు.. వంద దాటేసింది. డీజిల్ ధర కూడా దానివెంటే పరుగులు పెడుతూ రూ.వందకు చేరువైంది. విజయవాడలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.11కి, డీజిల్ ధర రూ.95.34కి చేరాయి. గతేడాది జూన్ 1న విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.74.21, డీజిల్ రూ.68.15 ధర ఉండేవి. నాటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలో పెట్రోల్ లీటరుపై రూ.26.90, డీజిల్పై రూ.27.19 ధర పెరిగాయి. దీంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఇది నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రో ధరలపై 2017లో కేంద్రం నియంత్రణ ఎత్తేసింది. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు ఏ రోజుకారోజు సమీక్షించి.. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి. రిఫైనరీ నుంచి ప్రాంతాల దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చులను కలిపి ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఉత్పత్తి సంస్థలు ఖరారు చేస్తాయి. అయితే, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో వైఎస్సార్, ప్రకాశం విశాఖపట్నం జిల్లాలు మినహా పది జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే డీజిల్ ధర కూడా రూ.వంద దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రో డీలర్లు చెబుతున్నారు. -
Petrol, Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.47, డీజిల్ ధర లీటరుకు రూ. 92.25 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.94.23, డీజిల్ రూ.85.15. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు.. పెట్రోల్ లీటరు ధర రూ. 3.83, డీజిల్ రేటు రూ.4.42 పెరగటం గమనార్హం. ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.92.54 చదవండి: నేడు 2020–21 జీడీపీ గణాంకాలు! -
Petrol, Diesel Prices Hike: సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శనివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ముంబైలో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడం ఇదే మొదటిసారి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94, డీజిల్ రూ.84.89. దేశంలో మే4 నంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది 15వ సారి. ►హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 97.63, డీజిల్ రూ. 92.54 ►కోల్కతా లీటర్ పెట్రోల్ రూ. 93.97, డీజిల్ రూ. 87.74 ►చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 95.51, డీజిల్ రూ. 89.65 ►బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 97.07, డీజిల్ రూ. 89.99 చదవండి: సైకిల్ అమ్మకాల స్పీడ్ -
Petrol, Diesel Prices: మళ్లీ పెరిగిన ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే!
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్ ధరపై 25 పైసలు, డీజిల్పై 32 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరువలో ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.99.94, డీజిల్ ధర లీటరుకు 91.87 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.68, డీజిల్ ధర 84.61కు పెరిగింది. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది పద్నాలుగోసారి. ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.39 ► చెన్నైలో పెట్రోల్ రేటు 95.28, డీజిల్ ధర లీటరుకు రూ.89.39 ► కోల్కతాలో ధరలు పెట్రోల్ ధర 93.72 కాగా లీటర్ డీజిల్ రేటు రూ.87.46 చదవండి: అమెజాన్ చేతికి ఎంజీఎం -
ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ ఒక రోజు విరామం తర్వాత మే 16న ఆదివారం పెరిగాయి. మే 4 నుండి పెరుగుతూ వస్తున్న ధరలు ఆదివారం తొమ్మిదవసారి పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ ధరలు 30 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటేశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కూడా కొట్టేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.34 నుంచి రూ.92.58కు పెరిగితే, డీజిల్ ధర లీటరుకు రూ 82,95 నుంచి రూ.83.22 చేరుకుంది. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ లీటరుకు 98.88 రూపాయలకు, డీజిల్ లీటరుకు రూ.90.40 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల సమయం ముగిసిన తర్వాత మే 4 నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు చమురు ధరలను పెంచుతూ పోతున్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. ఇంధన ధరలలో ఏవైనా మార్పులు జరిగితే ఆ ధరలు 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. నేడు హైదరాబాదులో పెట్రోలు ధర రూ.96.22,డీజిల్ ధర రూ.90.73గా ఉంది. చదవండి: Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు -
సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు కంపెనీలు
న్యూఢిల్లీ: ఏ ముహూర్తన ఎన్నికలు అయిపోయాయో గానీ అప్పటి నుంచి చమురు కంపెనీలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఒక పక్క సామాన్యుడు కరోనా మహమ్మరితో పోరాడతుంటే మరోపక్క చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఏది కొనాలి అన్న భయమేస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై రూ..1.94, డీజిల్పై రూ.2.22 పెరిగింది. చమురు కంపెనీలు ఒక రోజు విరామం తీసుకుని నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర 28-30 పైసలు పెరగగా, డీజిల్ ధర 34-40 పైసలు పెరిగింది. తాజా పెంపుతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, డీజిల్ రూ.82.95కు చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.65, డీజిల్, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్కతాలో రూ.92.16, డీజిల్ రూ.85.45, జైపూర్లో రూ.99.02, డీజిల్ రూ.91.80కి చేరాయి. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.95.97కు చేరుకుంటే, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.90.43 చేరుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పలు చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను కూడా దాటింది. రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ మార్పిడి రేటుపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు వివిధ పన్నులు విధిస్తాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60శాతం, డీజిల్ 54 శాతంపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయి. చదవండి: గూగుల్ క్రోమ్ యాప్తో జర జాగ్రత్త! -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్పై 34 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరగా, డీజిల్ ధర రూ. 82.06 కి చేరింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.86, డీజిల్ రూ .89.17 చెన్నై పెట్రోల్ రూ .93.38, డీజిల్ రూ .86.96 కోల్కతాలో పెట్రోల్ రూ .91.66, డీజిల్ రూ.84.90 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47 విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43 చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ -
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ
హైదరాబాద్: అసలే దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోపక్క నిత్యవసర, అత్యవస వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో స్థానిక లాక్ డౌన్ లతో ఉద్యోగాలు పోయి సామాన్య ప్రజానీకం భాదపడుతుంటే స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోగా పొగ.. ప్రజల బాధలతో సంబంధం లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ చేశాయి. ఆదేమని అడిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి అందుకే మేము కూడా పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం పెరిగింది పైసాలలోనైన ఇలా కొన్ని రోజులు పెరగిన పెంపును కలిపితే అవి మనకు రూపాయిల్లో కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది ఎంత ఎక్కువ పెంచేశారో అని. చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యవసర వస్తువు మీద పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 23 తర్వాత వచ్చిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి నుంచి పెట్రో ధరలను పెంచలేదు. అవి అయిపోయిన వెంటనే ధరలను మళ్లీ పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెంచింది. మంగళవారం పెట్రోల్ లీటరుకు రూ.90.55, డీజిల్ లీటరుకు రూ.80.91 చొప్పున రిటైల్ కు అమ్ముతున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కి రూ.0.17 పైసలు పెరిగి రూ.94.16కి చేరుకుంటే, డీజిల్ ధర లీటర్ రూ.0.20 పెరిగి రూ.88.25 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 92.12 ఉండగా డీజిల్ ధర రూ.89.72 ఉంది. ధరలు పెరుగుదలకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచితే ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయరన్న ఉద్దేశంతో బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంధన ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. చదవండి: భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు -
ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగినప్పటికి దేశంలో ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు రెండు నెలలుగా సవరించలేదు. ఇందుకు ప్రధాన కారణం అందరూ భావిస్తున్నట్లు దేశంలో ఎన్నికలు జరగడమే. మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ఇందన ధరలో మార్పు రావొచ్చు. నాలుగు రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగిన దేశంలోని కంపెనీలు పెంచలేదు. ప్రస్తుతం ఎన్నికల వల్ల ఏర్పడిన నష్టాలను తిరిగి పూడ్చుకోవడానికి ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. అలాగే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల నష్టాలను పూడ్చడానికి డీజిల్, పెట్రోల్ ధరలను దశలవారీగా కనీసం రూ.2-3 పెంచాలని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓఎంసిలు ఆలోచిస్తున్నాయి. రేటు పెంపు అనేది మే మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 నుంచి పెట్రో ధరలను పెంచకపోవడంతో త్వరలోనే పెట్రో షాక్ లకు వాహనదారులు సిద్ధం కావాలనే సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి కేంద్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునేది. 2021లో పెట్రోల్, డీజిల్ ధరలను 26 రెట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటరుకు 7.46 రూపాయలు, డీజిల్ రేట్లు వరుసగా లీటరుకు 7.60 రూపాయలు పెరిగాయి. చదవండి: ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు? -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: భారత్లో కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడింది. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు తగ్గింది. సుమారు 15 రోజుల విరామం తర్వాత నేడు(ఏప్రిల్ 15) చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.73గా ఉంది. రాష్ట్రాలు విధించే పన్నులు ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. ఆరు నెలల నుంచి పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు పెరగ్గా, మార్చి 24 నుంచి స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.93.99 ఉండగా, డీజిల్ ధర రూ.88.05గా ఉంది. చదవండి: ఫ్లిప్కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్ట్రిప్ -
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో గత పది, పదిహేను రోజుల్లోనే ముడి చమురు ధరలు 10 శాతం మేర తగ్గిపోతే భారత్లో మాత్రం పెట్రో ధరలు స్థిరంగా ఉండటం విశేషం. అయితే గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చెక్ పెడుతూ.. ఇతర ప్రాంతాల్లో ధరల్లో తగ్గుదల కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు నేడు నాలుగు మహానగరాలలో అంతటా స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.78, లీటరు డీజిల్ ధర రూ.81.10గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉంటే డీజిల్ రూ. 88.20గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.82గా ఉంటే డీజిల్ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.94.39, లీటరు డీజిల్ ధర రూ.88.45గా ఉంది. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
ఒక్క ఎస్ఎంఎస్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోండిలా?
గత కొంతకాలంగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు ధరలు ప్రతి రోజు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇంధన రేట్లను తెలియజేయడం కోసం స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎస్ఎంఎస్ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాలలో ఉన్న వినియోగదారులు క్షణాలలో మొబైల్లోనే రోజువారీ పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవలను పొందటానికి వినియోగదారుడు 9224992249 నెంబర్ కు కంపెనీ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ నుంచి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఉదా: హైదరాబాద్ - RSP 134483, విజయవాడ - RSP 127611, విశాఖపట్నం RSP 127290. ఇలా మీ ప్రాంత కోడ్ లను RSP 134483 అని టైపు చేసి 9224992249 నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీ మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ల జాబితాను క్రియేట్ చేసింది. చదవండి: కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
సామాన్యుడిపై మరో పిడుగు
ఇప్పటికే చమురు ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా డీజిల్ ధరలు 30 నుంచి 35 శాతం పెరిగాయి. దీని కారణంగా రవాణా ఛార్జీలను 25 శాతం నుండి 30 శాతం పెంచడం తప్ప మాకు మరో మార్గం లేదు అని సింఘాల్ అన్నారు. సాధారణంగా ఇటువంటి ఒప్పందాలు కంపెనీల మధ్య వార్షిక, అర్థ సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఇప్పటికే మార్కెట్ లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా మధ్యలో రేట్లు పెంచడానికి సాధ్యపడదు. ఆ భారాన్ని మేమే భరించాలి అని అన్నారు. మార్కెట్ ధరలు అనుగుణంగా ధరలను పెంచకపోతే ఆ ప్రభావం రవాణ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మా మూలధన వ్యయాలు పెరుగుతాయి. అందుకే డీజిల్ ధరలను తగ్గించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది అన్ని పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. అందుకే చమురు ధరలు భారతదేశం అంతటా ఒకేలా ఉండాలి. అప్పుడే అన్ని ప్రదేశాలకు మా ట్రక్కులను పంపిస్తాము. చమురు ధరల సవరింపు అనేది కూడా నెలకు ఒకసారి మాత్రమే చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రదీప్ అన్నారు. ఒకవేల రవాణా ఛార్జీలు పెంచినట్లయితే ఈ ప్రభావం ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
నేపాల్ నుంచి భారత్ కు పెట్రోల్ అక్రమ రవాణా
గత కొద్దీ రోజుల నుంచి భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చర్చ జరుగుతుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూలేనంతగా ఆకాశాన్ని తాకాయి. మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ.100గా ఉంది. కానీ, మన పొరుగు దేశమైన నేపాల్లో ఇంధన ధరలు దీనికి విరుద్దంగా ఉన్నాయి. మన దేశానితో పోలిస్తే పెట్రోల్ ధరలు నేపాల్లో రూ.22 తక్కువగా ఉండటం విశేషం. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ధరలను ఆసరా చేసుకొని నేపాల్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రా ప్రజలు కొత్త దందాను తెరమీదకు తీసుకొచ్చారు. నేపాల్ సరిహద్దు రాష్ట్ర ప్రజలు అక్కడి నుంచి భారతదేశంలోకి పెట్రోల్ ను అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించారు. బీహార్లోని అరియారియా జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.93.50 కాగా, నేపాల్లో లీటరుకు రూ.70.62 మాత్రమే ఉంది. దీనితో బీహార్ రాష్ట్రంలోని అరియారియా, కిషన్ గంజ్ జిల్లా ప్రజలు ఇరుకైన రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దును దాటుతున్నారు. ఈ మార్గాలు ప్రధాన రహదారి లేదా సరిహద్దు చెక్పోస్టుకు దూరంగా ఉన్నందున అధికారులు వీటిని గుర్తించలేక పోతున్నారు. అక్కడ తక్కువగా ధరకే కొన్న పెట్రోల్ ను బంకులతో పోల్చితే నాలుగైదు రూపాయలు తక్కువకే వస్తుండటంతో వాహనదారులు కూడా వీరి దగ్గరే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా అమ్ముకుంటున్న వారు రోజుకు కనీసం రూ.2,500 సంపాదిస్తున్నారు. స్థానిక పోలీసులు, ఎస్ఎస్బి అధికారులు అక్రమంగా పెట్రోల్ తరలిస్తున్న చాలా మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఒక్క ట్వీట్తో లక్ష కోట్ల నష్టం..! మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు -
పెట్రో మంట.. ఆర్టీసీకి కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటం ఆర్టీసీని తీవ్రంగా కలవరపరుస్తోంది.. ఆ భారాన్ని మోయలేమంటూ ఇటీవల ఏకంగా ముఖ్యమంత్రికే మొరపెట్టుకుంది. కానీ ఇప్పుడు అవే చమురు ధరల పెంపు తమకు మరో రకంగా కలిసొచ్చిందని సంబరపడుతోంది. గత కొన్నిరోజులుగా వరుసపెట్టి పెరుగుతున్న చమురు ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులు, సొంత బండ్లకు కాస్త విరామం ఇచ్చి బస్కెక్కేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. మళ్లీ మునుపటి రోజులు.. గతేడాది మార్చి 21.. ఆర్టీసీకి టికెట్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.13 కోట్లు.. ఇక అంతే మళ్లీ ఒకరోజు రూ.13 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కళ్ల చూడలేదు. మధ్యలో సంక్రాంతి సందర్భంగా ఆమేర ఆదాయం నమోదైనా.. అది ప్రత్యేక బస్సుల చలవే.. సాధారణ రోజుల్లో రూ.10 కోట్లను మించటమే గగనంగా మారింది. బస్సులు నడుస్తున్నా సగం సీట్లు ఖాళీగానే ఉంటుండటంతో ఆక్యుపెన్సీ రేషియో లేక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు డీజిల్, పెట్రోలు ధరలు భారీగా పెరిగిపోవటంతో సొంత వాహనాల్లో తిరిగే చాలామంది బస్సుల వైపు మళ్లటం కనిపిస్తోంది. ఫలితంగా వారం రోజులుగా ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాకాలం తర్వాత గత సోమవారం (15వ తేదీ) ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.13.25 కోట్లుగా నమోదైంది. అంతకుముందు మూడ్రోజుల పాటు కూడా రూ.13 కోట్లకు కాస్త చేరువగా నమోదైంది. వెరసి లాక్డౌన్కు పూర్వం ఉన్న పరిస్థితి దాదాపు కనిపిస్తోంది. సాధారణంగా మంగళవారాల్లో ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. లాక్డౌన్కు పూర్వం మంగళవారం రోజు సగటు ఆదాయం రూ.11.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల మధ్య నమోదయ్యేది. గత మంగళవారం (16వ తేదీ) రూ.11.72 కోట్లు రికార్డయింది. ఏడాది క్రితం ఇదే రోజు ఆదాయం రూ.11.53 కోట్లుగా నమోదైంది. లాక్డౌన్ తర్వాత మంగళవారాల్లో ఇంత మొత్తం వసూలు కావటం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఆక్యుపెన్సీ రేషియో 66 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే రోజు నమోదైన ఓఆర్ 63 శాతమే.. కిలోమీటరుకు ఆదాయం సగటు రూ.34.70గా ఉండగా, గతేడాది ఇదే రోజు రూ.33.25గా నమోదైంది. గతేడాది ఇదే రోజు రాష్ట్రంలో బస్సులు 34.69 లక్షల కిలోమీటర్లు తిరిగితే, గత మంగళవారం (16వ తేదీ) 33.80 లక్షల కి.మీ. తిరిగాయి. అంటే గతేడాది ఇదే రోజు కంటే ఈసారి తక్కువ తిరిగినా ఆదాయం ఎక్కువగా రావటం విశేషం. కోవిడ్ భయం తగ్గినా.. లాక్డౌన్ సమయంలో సొంత వాహనాల్లో తిరిగేందుకు ప్రాధాన్యమిచ్చిన చాలామంది బస్సులు ఎక్కేందుకు భయపడ్డారు. కానీ కోవిడ్ భయం దాదాపు సమసినా కూడా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సొంత వాహనాల్లో తిరిగే అలవాటు నుంచి బస్సుల వైపు మళ్లలేకపోయారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతాన్ని దాటేందుకు చాలా సమయం పట్టింది. క్రమంగా జిల్లా సర్వీసుల్లో అది 60 శాతాన్ని మించినా సిటీ బస్సుల్లో మరీ తక్కువగా 45 శాతంగానే ఉంటూ వచ్చింది. హైదరాబాద్లో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో రోడ్లు విపరీతంగా రద్దీగా మారటమే దీనికి నిదర్శనం.. అంతకుముందు క్రమం తప్పకుండా బస్సుల్లో తిరిగిన వారు కూడా సొంత వాహనాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక్కసారిగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో పెట్రోలు ఖర్చును చూసి బెంబేలెత్తి మళ్లీ బస్సులెక్కేందుకు ఆసక్తి చూపటం ప్రారంభించినట్టు ఆర్టీసీ గుర్తించింది. ఆదాయం ఒక్కసారిగా పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని తేల్చింది. పాత ట్రిప్పుల పునరుద్ధరణ.. తాజాగా ఆర్టీసీ ఆదాయం పెరగటంతో లాక్డౌన్కు పూర్వమున్న ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లాక్డౌన్ తర్వాత బస్సులు తిరిగి ప్రారంభమైనా.. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండటంతో చాలా ప్రాంతాలకు ట్రిప్పులు రద్దు చేశారు. కొన్ని ఊళ్లకు అసలు బస్సులే వెళ్లటం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో పెరగటంతో మళ్లీ పాత ట్రిప్పులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. డిపోల వారీగా అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, ఇదే మంచి తరుణమని, ప్రజలు తిరిగి బస్సులెక్కేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. ఒకసారి బస్సులెక్కటం తిరిగి మొదలైతే మళ్లీ వారు సొంత వాహనాల వినియోగానికి ఇష్టపడరన్న విషయాన్ని గుర్తించి సిబ్బంది వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఈ విషయంలో బాగా పనిచేసే సిబ్బందికి పురస్కారాలు ఇవ్వాలని కూడా నిర్ణయించటం విశేషం.. -
సామాన్యుడిపై మరోభారం!
హైదరాబాద్: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత సుమారు రూ.200 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. ఇప్పటికే వీటి విషయంపై మండిపోతున్న ప్రజలు వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా పాల ధరలు పెరగనున్నాయి అని సమాచారం. ప్రస్తుతం పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.60గా ఉంది. పదకొండు రోజుల నుంచి డీజిల్ రేట్లు ఏకధాటిగా పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా పెరుగడంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడాయినికి అయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నట్లు పాల ఉత్పత్తి దారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పెరిగిన ధరలను ప్రజలపై వేయక తప్పదని ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెరిగే పాల ధర కనీసం లీటర్ మీద రూ.2 వరకు పెరగొచ్చని ప్రతినిధి చెప్పారు. భవిష్యత్ లో ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పాల ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: జీఎస్టీపై కేంద్రం కీలక నిర్ణయం? బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ధరలతో సామాన్య ప్రజల జోబులకు చిల్లు పడుతున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజూ పెరగడంతో నిత్యావసర ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్పై 30 పైసల నుంచి రూ.50 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. సాధారణ పెట్రోల్ ధర రూ. 97.38గా ఉంది. అదే ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ.95.21కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23 చేరుకున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఆధారంగా మారుతూ ఉంటాయి. చదవండి: ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
పెట్రో ధరలు; వామ్మో.. ఇదేం బాదుడు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను అంచనా వేస్తూ ధరలను ప్రతిరోజూ సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు నాలుగు రోజుల నుంచి ధరలను పెంచేస్తున్నాయి. శుక్రవారం సైతం పెట్రోల్ ధర లీటర్పై 30 పైసలు, డీజిల్పై 39 పైసల మేర పెరిగింది. నిజానికి గడిచిన సోమవారం హైదరాబాద్లో లీటర్ పెట్రల్ ధర రూ.90.42 ఉండగా, మంగళవారం 36 పైసలు పెరిగింది. అప్పటినుంచి రోజూ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ధర 91.65కి చేరింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.1.23 మేర పెరిగింది. ఇక ఈ నెల ఒకటవ తారీఖు ధరలతో పోలిస్తే ఆయిల్ కంపెనీలు వాహనదా రులపై ఏకంగా రూ.1.88 మేర బాదేశాయి. ఈ నాలుగు రోజుల వ్యవధిలో డీజిల్ ధర సైతం రూ.1.36 మేర పెరిగి లీటర్ రూ.85.50కి చేరింది. ఫిబ్రవరి ఒకటిన ఉన్న ధరలతో పోలిస్తే 2.04 మేర పెరిగింది. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 15 కోట్ల లీటర్ల పెట్రోల్, 21 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ లెక్కన 12 రోజుల్లోనే రాష్ట్రంలోని వాహనదారులపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తున్నా, ఆయిల్ కంపెనీలు మాత్రం ధరల పెంపునకే మొగ్గుచూపుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో లీటర్ ధరలు రూ.100 కొట్టొచ్చనిపిస్తోంది. -
పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ రికార్డు
పెట్రోల్, డీజిల్ ధరలు భగభగలాడుతున్నాయి. అంతకంతకూ పైపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆదివారం పెట్రో ఉత్పత్తుల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్లో అత్యధికం కాగా, పెట్రోల్ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్టైమ్ రికార్డును సైతం అధిగమించింది. సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్లో అత్యధికం కాగా, పెట్రోల్ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్ ధర ఆల్టైమ్ రికార్డును సైతం అధిగమించింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ రూ.82.80కు చేరింది. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నెలలో రోజువారీ ధరల సవరణలో భాగంగా లీటర్ పెట్రోల్పై రూ. 2.10, డీజిల్పై 2.20 బాదేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి. రికార్డు స్థాయిలో .. చమురు ధరలు ఆల్టైమ్ గరిష్ట రికార్డును అధిగమించాయి. రెండేళ్ల క్రితం 2018, అక్టోబర్ 4న లీటర్ పెట్రోల్ ధర రూ.89.11తో ఇప్పటివరకు ఆల్టైమ్ రికార్డుగా నమోదైంది. దానికంటే ఐదేళ్ల క్రితం 2013, సెప్టెంబర్ నెలలో పెట్రోల్ లీటర్ ధర రూ. 83.07తో ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇక డీజిల్ 2018, అక్టోబర్ 18న లీటర్ ధర రూ.82.38తో ఆల్టైమ్ రికార్డును నమోదు చేసుకోగా ప్రస్తుతం గరిష్టానికి చేరిన ధరతో పాత రికార్డును అధిగమించినట్లయింది. పన్నులు అధికమే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల వడ్డింపు ఉంది. మొత్తం ధరల్లో పెట్రోల్పై 57 శాతం, డీజీల్పై 44 శాతం పన్నులు ఉంటాయి. వాస్తవంగా పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగుతోంది. -
మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం వాహనదారుల జేబులకు చిల్లుపడుతుంది. సోమవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 84.95 రూపాయలకు చేరుకుంది. ముంబైలో లీటరుకు పెట్రోల్ ధర రూ.91.56గా ఉంది. హైదరాబాద్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై 26 పైసలు చొప్పున పెరగడంతో దీంతో లీటర్ ధర రూ.88.37కు, డీజిల్ ధర రూ.81.99గా ఉంది. పెరుగుతున్న ధరలను చూస్తుంటే త్వరలోనే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటిపోయేలా కనిపిస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు జనవరి 7న పెట్రోల్కు 0.23 రూపాయలు, లీటరుకు 0.26 డీజిల్ పెంపును ప్రకటించడంతో గత 15 రోజుల్లో రెండవసారి ధరల పెంచారు. 2020 సంవత్సరం మధ్యలో పెట్రోల్ ధర మొదటిసారిగా లీటరుకు 80 రూపాయలకు చేరుకోగా.. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇంతకుముందు అక్టోబర్ 4, 2018న అత్యధికంగా నమోదైన పెట్రోల్ రేటు లీటరుకు 84 రూపాయలు. ఐఓసిఎల్ ధరల ప్రకారం పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్కతాలో రూ.78.72గా ఉంది. -
మళ్లీ చమురు సెగ- ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు?
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్డవున్లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్టైమ్ హై) పన్నుల వాటా అధికం ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది. చమురు కంపెనీలూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) మళ్లీ ధరల సెగ విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
ధరల మంట- పెట్రోల్ @ఆల్టైమ్ హై
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు నెల రోజుల తదుపరి బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి బలపడ్డాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇంధన రంగ పీఎస్యూలు ధరలను వరుసగా రెండో రోజు పెంచాయి. లీటర్ పెట్రోల్పై తాజాగా 23 పైసలు, డీజిల్పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్ పెట్రోల్ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20ను తాకింది. డీజిల్ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. ఇది ఆల్టైమ్ గరిష్టం కాగా.. ప్రస్తుతం ఈ స్థాయిని ధరలు అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్ ధరలైతే 2018 అక్టోబర్ 4న లీటర్కు రూ. 75.45 వరకూ ఎగసింది. కాగా.. 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్ ధరలు లీటర్కు రూ. 14.51 పుంజుకోగా.. డీజిల్ ధర రూ. 12.09 ఎగసింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) ముంబైలో మరింత దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల సంగతి చూస్తే.. ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 90.83ను తాకగా.. డీజిల్ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్ రూ. 86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. కోల్కతాలో పెట్రోల్ రూ. 85.68 వద్ద, డీజిల్ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరల సెగ- రెండేళ్ల గరిష్టం
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సగటున పెట్రోల్పై 30-33 పైసలు, డీజిల్ లీటర్పై రూ. 25-31 పైసల చొప్పున ఎగశాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు బలపడి రూ. 83.71కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 25 పైసలు అధికమై రూ. 73.87ను తాకింది. వెరసి పెట్రోల్, డీజిల్ ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. కాగా.. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 17 రోజుల్లో గత 17 రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 2.65 పెరిగినట్లు ఇంధన రంగ విశ్లేషకులు తెలియజేశారు. ఇదేవిధంగా డీజిల్ లీటర్పై మరింత అధికంగా రూ. 3.40 పెంపు అమలైనట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ 33 పైసలు బలపడి రూ. 90.34కు చేరింది. కోల్కతాలోనూ రూ. 84.86 నుంచి రూ. 85.19కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 20 పైసలు పెరిగి రూ. 86.51 అయ్యింది. డీజిల్ ధరలు ఇలా ఢిల్లీలో డీజిల్ ధరలు లీటర్కు రూ. 25 పైసలు పెరిగి 73.87కు, ముబైలో 31 పైసలు బలపడి 80.51కు, కోల్కతాలో 29 పైసలు అధికమై 77.44కు చేరాయి. చెన్నైలోనూ డీజిల్ లీటర్ 28 పైసలు పెరిగి 79.21ను తాకింది. కోతల ఎఫెక్ట్ రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగుతున్నాయియి.వారాంతాన దాదాపు 10 నెలల గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 0.5 శాతం నీరసించి 49 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 0.54 శాతం క్షీణించి 46.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్కతాలో డీజిల్ ధరలు లీటర్కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్ లీటర్ రూ. 79.93గా, పెట్రోల్ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 86కు చేరగా.. డీజిల్ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కోతల ఎఫెక్ట్ తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం 1.4 శాతం జంప్చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
రెండో రోజూ పెట్రో ధరల వడ్డింపు
న్యూఢిల్లీ, సాక్షి: వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో సగటున 15-25 పైసల మధ్య ధరలు ఎగశాయి. తాజాగా న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 81.38ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్కు 20 పైసలు అధికమై 70.88కు చేరాయి. ఇదే విధంగా ముంబైలో పెట్రోల్ లీటర్ 17 పైసలు పెరిగి రూ. 88.09కు చేరగా.. డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 77.34ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర 15పైసలు బలపడి రూ. 84.46కాగా.. డీజిల్ 20 పైసలు పెరిగి రూ. 76.37కు చేరింది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర 16 పైసలు బలపడి రూ. 82.95ను తాకగా.. డీజిల్ 21 పైసలు హెచ్చి రూ. 74.45కు చేరింది. ముందు రోజు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 17-28 పైసల స్థాయిలో ఎగసిన విషయం విదితమే. వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదవుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి! విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ దాదాపు 2 శాతం జంప్చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు పీఎస్యూలు.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ సవరిస్తుంటాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ, సాక్షి: సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు తాజాగా రేట్లను పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి 81.23ను తాకింది. ఈ బాటలో డీజిల్ ధరలు సైతం లీటర్కు 22 పైసలు అధికమై 70.68కు చేరాయి. అయితే వ్యాట్ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలలో వ్యత్యాసాలు నమోదయ్యే సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 22 పైసలు పెరిగి రూ. 85.47కు చేరగా.. డీజిల్ ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడి రూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది.పెట్రోల్, డీజిల్ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా నాలుగు మెట్రోలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా నమోదయ్యాయంటే.. ముంబైలో పెట్రోల్ లీటర్ రూ. 87.92కు చేరగా.. డీజిల్ రూ. 77.11ను తాకింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 84.31కాగా.. డీజిల్ రూ. 76.17గా ఉంది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 82.79కాగా.. డీజిల్ రూ. 74.24కు చేరింది. విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.25 శాతం పెరిగి 44.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 41.74 డాలర్ల వద్ద కదులుతోంది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా చమురు పీఎస్యూలు.. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. -
హైదరాబాద్లో రూ. 85 దాటిన పెట్రోలు
సాక్షి, ముంబై : ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోలు ధరలీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది. (చదవండి: వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు) దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు 85.04 రూపాయలుగాను ఉంది. మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు రూ 80.17 రూపాయలు పలుకుతోంది. -
2015–18 స్థాయికి పెట్రో ధరల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 2015–18 స్థాయికి సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్పై రూ.1.24, డీజిల్పై 93 పైసల చొప్పున వ్యాట్ను పెంచింది. పెట్రోల్పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్పై 22.25 శాతం వ్యాట్తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ► లాక్డౌన్ వల్ల ఆదాయాలు భారీగా పడిపోవడంతో చాలా రాష్ట్రాలు పన్నులు పెంచాయి. అదే బాటలో ఇక్కడ కూడా ధరలు సవరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్ను రేట్లు పెంచాయి. ► లాక్డౌన్ వల్ల ఏప్రిల్లో రాష్ట్రానికి రూ.4,480 కోట్ల సొంత ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ.1,323 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే పరిస్థితి మే, జూన్ నెలల్లోనూ కొనసాగింది. ► ఆదాయం తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వైద్యం, సంక్షేమం పథకాల పరంగా పెద్దఎత్తున నిధులను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ప్రశంసలు వచ్చాయి. ► ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో 2015–18 స్థాయికి దాటకుండా పెట్రోల్, డీజిల్పై పన్ను రేట్లు సవరించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. -
పెట్రోల్తో డీజిల్ ధర సమానం! ఎందుకు?
ఈ నెల(జూన్) మొదటి నుంచీ దాదాపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా అధిక ఎక్సయిజ్ డ్యూటీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)ల మార్జిన్లు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ఇటీవల ముడిచమురు ధరలు బలపడుతుండటం కూడా కారణమవుతున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాల కోసం దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. దీంతో డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరలను ప్రభావితం చేస్తుంటాయని ఫారెక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్సయిజ్ పెంపు సాధారణంగా విదేశాలలో పెట్రోల్ కంటే డీజిల్ ధరలే అధికంగా ఉంటాయి. ఇందుకు ఉత్పత్తి వ్యయాలే కారణం. అయితే దేశీయంగా డీజిల్ కంటే పెట్రోల్ ధరలే ప్రీమియంలో కదులుతుంటాయి. ఇందుకు ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్(వీఏటీ) ప్రభావం చూపుతుంటాయి. కానీ ప్రస్తుతం దేశంలోనూ పెట్రోల్తో పోలిస్తే డీజిల్ ధరలు సమానంగా మారాయి. ఇందుకు అధిక ఎక్సయిజ్ డ్యూటీలు, పెరిగిన పెట్రో కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు కారణమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కొద్ది రోజులుగా ఎక్సయిజ్ డ్యూటీలతోపాటు, వ్యాట్ పెరుగుతూ పోవడంతో పెట్రోల్ ధరలకు డీజిల్ సమానమైనట్లు వివరించాయి. ఫలితంగా ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు ఒకే స్థాయికి చేరినట్లు తెలియజేశాయి. ధరలు తగ్గినా కోవిడ్-19 నేపథ్యంలో గత రెండు నెలల్లో ముడిచమురు ధరలు డీలాపడినప్పటికీ తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 42 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇదే సమయంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ 75 ఎగువనే నిలుస్తోంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం డ్యూటీలను పెంచుతూ వచ్చింది. అయితే రిటైల్ ధరలపై ప్రభావం పడకుండా వీటిని హెచ్చిస్తూ వచ్చింది. ఫలితంగా ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్కు రూ. 20గా ఉన్న ఎక్సయిజ్ డ్యూటీ ప్రస్తుతం రూ. 33కు ఎగసింది. ఈ బాటలో డీజిల్పై ఎక్సయిజ్ డ్యూటీ లీటర్కు రూ. 16 నుంచి రూ. 32కు పెరిగింది. 2014లో పెట్రోల్పై పన్నులు లీటర్కు . 9.5గా నమోదుకాగా.. డీజిల్పై ఇవి రూ. 3.5గా అమలైనట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. పెట్రోల్పై వ్యాట్ రూ. 15.3 నుంచి పెరిగి 17.7కు చేరగా.. డీజిల్పై మరింత అధికంగా రూ.9.5 నుంచి రూ. 17.6కు ఎగసింది. విదేశాలలో చమురు ధరలు పతనమై తిరిగి కోలుకున్నప్పటికీ గత మూడు నెలల్లో అంటే మే చివరి వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు యథాతథంగా కొనసాగాయి. ఇదే సమయంలో పెట్రో మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు లీటర్ ధరపై రూ. 2-3 నుంచి రూ. 13-19 వరకూ ఎగశాయని.. తిరిగి ప్రస్తుతం 5 స్థాయికి చేరాయని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరల్లో 70 శాతంవరకూ ఎక్సయిజ్, వ్యాట్ ఆక్రమిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఢిల్లీ: పెట్రోల్తో పోటీ పడిన డీజిల్ ధర
న్యూఢిల్లీ : వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 79.88 రూపాయలుగా కాగా, డీజిల్ ధర 79.40 రుపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్ డీజిల్పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 9.41రూపాయలు, డీజిల్ 9.58 రూపాయలు పెరిగాయి. ఇంటర్నేషనల్ బెంచ్మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్ ధర డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదుగా మారింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలైన కోల్కత్తా, ముంబై , చెన్నైలలో డీజిల్ రేట్ల కంటే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. (లాక్డౌన్ వేళ పెట్రో సెగలు) ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్ 7 కు ముందు లాక్డౌన్ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్ ధరలు మారకుండా డీజిల్ ధరలను పెంచడంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. (వరుసగా 17వ రోజూ పెట్రో వడ్డన) నగరం పెట్రోల్ డీజిల్ ఢిల్లీ 79.76 79.88 కోల్కత్తా 81,45 75,06 ముంబై 86,54 78,22 చెన్నై 83,04 77,17 (సోర్స్: ఇండియన్ ఆయిల్) -
మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చరిత్రలో ఎన్నడు ఎరగనంతగా పడిపోయాయి. ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఓ బారెల్ ధర కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడి పోయింది. నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడి పోయాయి. అయినా దేశీయంగా భారత్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గక పోవడం ఆశ్చర్యకరం. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు జనవరి నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఇప్పటికీ ముంబైలో లీటరు పెట్రోలు ధర 76.31 రూపాయలు, డీజిల్ ధర 66.21 రూపాయలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరల్లో భారతీయులకు పెద్దగా ప్రయోజనం ఎందుకు కలగలేదు? అందుకు కారణాలేమిటీ? కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మార్చి 14వ తేదీన పెట్రోలు, డీజిల్పై లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచింది. ఈ కారణంగా కేంద్రానికి సమకూరే సొమ్ము 39 వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్ పన్నును పెంచేందుకు వీలుగా దేశ ఆర్థిక బిల్లును సవరించింది. చమురు ధరల హెచ్చింపు, తగ్గింపులపై ఇక తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నాడే నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు భారత్లో పెట్రోలు ధరలు తగ్గుతూ, పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్ పన్నులను పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతగా పన్నులను పెంచడానికి ఆర్థిక అవసరాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య వ్యత్యాసం మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి చేరుకుంటుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్ ఓస్వాల్’ బ్రోకరేజ్ సంస్థ ఏప్రిల్ 13న విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. మరోపక్క డాలర్తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉంది. కేంద్రం నిర్ణయం సరైనది కాదు: కేజ్రీవాల్ -
పడిపోయిన చమురు ధరలు
-
తగ్గిన ‘పెట్రో’ ధరలు
న్యూఢిల్లీ: సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. సోమవారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోల్పై 24–27 పైసలు, డీజిల్పై 25–26 పైసలు తగ్గింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధర లీటర్ రూ.71కి పడిపోయింది. 1991 గల్ఫ్యుద్ధం తర్వాత ఇంత భారీగా ధరలు పడిపోవడం ఇదే ప్రథమం. చమురు ఉత్పత్తి చేసే సౌదీ నేతృత్వంలోని ఒపెక్, రష్యా మధ్య విభేదాలు ధరల యుద్ధానికి తెరలేపాయి. దీంతో సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరుకుంది. 2019 జూలై తర్వాత ఇదే తక్కువ ధర. డీజిల్ ధర కూడా లీటర్ రూ.63.26కి పడిపోయింది. దేశీయ చమురు అవసరాల్లో 84 శాతం వరకు భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ లీటర్ ధర రూ. 68.88గా ఉంది. (చదవండి: చమురు ‘బేజార్’) -
ఆర్టీసీపై ‘ఇరాన్ ఎఫెక్ట్’
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ పరిణామాలతో ఆర్టీసీ బెంబేలెత్తుతోంది. అమెరికా –ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా గత నెలాఖరు నుంచి ఇప్పటివరకు డీజిల్ ధరల్లో లీటరుపై రూ.1.44 మేర పెరుగుదల నమోదైంది. దీంతో ఆర్టీసీ ఆందో ళన చెందుతోంది. వారం రోజుల్లో పెరిగిన ధరల వల్ల సాలీనా డీజిల్ భారంలో రూ.40 కోట్ల పెరుగుదల నమోదైనట్టు లెక్కలేశారు. ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉండటంతో భారం మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇం‘ధన’హాసం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ‘ఇంధనం’ ధరల్లో దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. పెట్రోల్ ధరలో ఏపీ రాజధాని ‘అమరావతి’, డీజిల్ ధరలో తెలంగాణ రాజధాని ‘హైదరాబాద్’ టాప్లో ఉన్నాయి. డీజిల్ ధరలో అమరావతి, పెట్రోల్ ధరలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. రోజువారీగా రెండు మూడు లీటర్లు వినియోగించే వారికి పెద్దగా భారం పడనప్పటికీ.. వందల లీటర్లు వినియోగించే వారికి మాత్రం ఆర్థికంగా భారంగానే ఉంది. దీంతో ఇంధనాన్ని భారీగా వినియోగించే వారు పన్ను తక్కువ ఉన్న ప్రాంతాల నుంచి బల్క్గా తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పన్నుల వాత ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికి పైగా పన్నుల రూపంలోనే ఉన్నాయి. మొత్తం ధరల్లో పెట్రోల్పై 57 శాతం, డీజిల్పై 44 శాతం పన్ను పోటు పడుతోంది. ఇందులో పెట్రోల్, డీజీల్పై కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం పడుతోంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్పై రూ.21.48, డీజిల్పై రూ.17.33 విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్ కింద పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం పన్నుగా వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 32 శాతం వ్యాట్ విధిస్తుండగా.. అదనంగా ప్రతి లీటర్పై రూ.2 వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు. డీజిల్పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్పై రూ.2 అదనపు వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజీల్ ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. అదే పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పెట్రోల్పై 32 శాతం, డీజిల్పై 21 శాతం, తమిళనాడులో పెట్రోల్పై 34 శాతం, డీజిల్పై 25 శాతం పన్ను విధిస్తున్నారు. గత పదిరోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు వారి సవరణతో దూకుడుగా ఉన్నాయి. -
పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర
-
పెరిగిన పెట్రోలు ధర
సాక్షి, ముంబై : పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.16, డీజిల్ ధర 71.80 విజయవాడ : పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్ ధర 70.76 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర 65.79 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్ ధర 68.2 చెన్నై : పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్ ధర 69.54 ముంబై : పెట్రోలు ధర రూ. 79.12, డీజిల్ ధర 69.01 -
పెట్రో ధరలు పైపైకి..
సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు మొదలైంది. పైసా..పైసానే పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్ ఇస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో తిరిగి ఆల్టైమ్ రికార్డు చేరువలోకి ఇంధనం ధరలు దూసుకు పోతున్నాయి. కేవలం ఇరవై రోజుల వ్యవధిలో పెట్రోల్పై రూ.3.07, డీజిల్ రూ.2.12 పెరిగింది. గతేడాది కాలంగా సార్వత్రిక ఎన్నికలు, ఇతరాత్ర కారణాలతో స్వల్ప హెచ్చు తగ్గులతో కొనసాగిన ధరలు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనంతరం మళ్లీ విజృంభించాయి. తాజాగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్ రూ.77.90కు చేరగా.. డీజిల్ ధర కూడా రూ.72.41కి ఎగబాకింది. గతేడాది మే నెలలో పెట్రోల్ రూ.83.08, డీజిల్ రూ.75.34 తో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గత రెండేళ్ల నుంచి పెట్రో ఉత్పత్తుల æధరల రోజువారీ సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రోజు రోజుకు పైసల్లెక్కన ఎగబాకుతోంది. దీంతో ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ను బట్టి ధరల దూకుడు మరింతగా ఉంటుందని విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీ్జల బాదుడు కూడా కారణంగా కనిపిస్తోంది. పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ విధింపు అధికంగానే ఉంది. వాస్తవంగా పెట్రో ఉత్పత్తులపై రెండు రకాల పన్నుల విధిస్తుండటంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ మోత మోగిస్తోంది. దీంతో ఇంధన ధర మరింత పెరిగి వినియోగదారులకు భారంగా మారుతోంది. వినియోగం అధికమే.. రాష్ట్రంలోనే నగరంలో పెట్రోల్, డీజిల్ వినియోగం అధికం. ఇక్కడి వాహనాలతో పాటు రోజు వారిగా బయటి నుంచి వచ్చి వేళ్లే వాహనాల్లో సైతం ఇంధనం నింపుకుంటారు. అధికారికంగా గ్రేటర్ పరిధిలో 60.34 లక్షల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు వాహనాలు 20.30 లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. మహానగరం పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్ బంక్లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. దీంతో ఇంధన ధరల పెరుగుదల మరీ భారమవుతోంది. -
ఆర్టీసీలో మరోసారి చార్జీలు పెరగనున్నాయా..?
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో మరోసారి చార్జీలు పెరగనున్నాయా..ప్రయాణికులపై భారం పడనుందా..పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అదొక్కటే పరిష్కారమా...ఆర్టీసీ అధికారవర్గాలు, రవాణా రంగ నిపుణులు అందుకు అవుననే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే వందల కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీపై తాజాగా పెరిగిన డీజిల్ ధరలు మరింత భారాన్ని మోపాయి. దీంతో చార్జీల పెంపు ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది. తెలంగాణ అంతటా సుమారు రూ.928 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుండగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే ఆర్టీసీ నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. తాజాగా లీటర్కు సుమారు రూ.2.56 చొప్పున పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీపైన ఏటా రూ.70 కోట్ల వరకు భారం పడనున్నట్లు అంచనా. డీజిల్ పై పెరిగిన ధరలు కేవలం ఇంధన వినియోగంపైనే కాకుండా విడిభాగాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులపైన కూడా ప్రభావం చూపుతాయి. దీంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారం నుంచి కొంత మేరకు ఊరట పొందేందుకు చార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించడం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.‘డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఆ భారం ప్రయాణికులపై పడకుండా జాగ్రత్త వహించాం. ఒకవైపు వందల కోట్ల నష్టాలను భరిస్తూ, మరోవైపు ఏటేటా పెరిగే డీజిల్ ధరల భారంతో ఏ మాత్రం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది’ అని పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సైతం చార్జీలపైన నిర్ణయం తీసుకొనే స్వతంత్రత ఆర్టీసీకి ఉండాలని ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించకపోవడంతో చార్జీల పెంపు ప్రస్తావన ముందుకొస్తోంది. అందుకు ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజలపై ఏటా రూ.300 కోట్లకు పైగా భారం... ఆదాయానికి రెట్టింపు ఖర్చు ఆర్టీసీని నిలువునా ముంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి రోజు రూ.3.5 కోట్ల ఆదాయం లభిస్తే ఖర్చు మాత్రం రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. రోజుకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లుతోంది. మొత్తం తెలంగాణలోని సగానికి పైగా నష్టాలు హైదరాబాద్లోనే వస్తున్నాయి. ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణా, స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సుల కారణంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టాలొస్తున్నాయి. వరుస నష్టాలను దృష్టిలో ఉంచుకొని 2016 లో చార్జీలను పెంచారు. మొదట 10 శాతం పెంచాలని భావించినప్పటికీ కొన్ని రూట్లలో చార్జీల హెచ్చుతగ్గులు, హేతుబద్ధత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవడంతో 8.77 శాతం పెంపు అమల్లోకి వచ్చింది. ప్రయాణికులపై కిలోమీటర్కు రూపాయి చొప్పున భారం పడింది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులపై కొద్దిగా తగ్గించి, లగ్జరీ, మెట్రో డీలక్స్, ఓల్వో, గరుడ వంటి వాటిపైన పెంచారు. ఆ ఏడాది పెంచిన చార్జీల వల్ల ప్రజలపైన రూ.250 కోట్లకు పైగా భారం పడింది. ఈ మేరకు ఆర్టీసీకి ఆదాయం లభించినప్పటికీ నష్టాల నుంచి గట్టెక్కేందుకు పెద్దగా దొహదం చేయలేదు. నిర్వహణ భారం అధికంగా ఉండడం, ఇంధన ధరలు, జీతభత్యాల్లో పెంపుదల వంటి అంశాల కారణంగా వరుసగా నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.928 కోట్లకు చేరాయి. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్ధిక సహాయం లభించకపోవడంతో ఆర్టీసీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కనీసం 10 శాతం చార్జీలు పెరిగినా ఆర్టీసీకి రూ.300 కోట్లకు పైగా ఆదాయం లభించగలదని భావిస్తున్నారు. కానీ ఈ మేరకు ఆ భారాన్ని ప్రజలు మోయక తప్పదు. సుంకం పెంపుతో డీజిల్ భారం రూ.70 కోట్లు పెట్రోల్, డీజిల్పై కేంద్రం విధించిన సుంకం పెంపుతో వాటి ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో లీటర్ డీజిల్కు రూ.2.56 చొప్పున ఆర్టీసీపైన సుమారు రూ.70 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు 5,30 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 2 లక్షల లీటర్లకు పైగా డీజిల్ ఖర్చవుతోంది.ఆర్డినరీ బస్సులు ఒక లీటర్ డీజిల్ వినియోగంపై 5.52 కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా, మెట్రో ఎక్స్ప్రెస్లలో ఇది 4.5 కిలోమీటర్ల వరకే ఉంటుంది. ఏసీ బస్సుల్లో ఇంకా తగ్గుతుంది. ఏసీ బస్సులు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. ట్రాఫిక్ రద్దీ, బస్సుల సామర్ధ్యం వంటి అంశాలు కూడా ఇంధన వినియోగంపైన ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు నష్టాలు, మరోవైపు ఇంధన భారాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 10 శాతం పెంచినా కొంత మేరకు ఊరట లభించగలదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
సామాన్యుడికి ‘పెట్రో’ వాత
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో వినియోగదారులకు షాకిచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్లపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూపాయి మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మేరకు ప్రకటన చేశా రు. అలాగే ‘రోడ్లు–మౌలిక వసతుల సెస్’ కింద లీటర్ పెట్రోల్, డీజిల్పై మరో రూపాయిని అదనంగా పెంచుతున్నామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.2.5 వరకూ, లీటర్ డీజిల్ ధర రూ.2.3 వరకూ పెరిగింది. ఈ పెంపు కారణంగా ఖజా నాకు ఏటా రూ.28,000 కోట్ల ఆదాయం చేకూరనుంది. చమురు దిగుమతులపై రూపాయి పెంపు.. కేంద్రం నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.70.51కు, ముంబైలో 76.15కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.64.33కు, ముంబైలో రూ.67.40కు చేరుకుంది. అలాగే భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురుపై టన్నుకు రూపాయి మేర సుంకాన్ని పెంచుతూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనికారణంగా ఖజానాకు రూ.22 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకూ ముడిచమురు దిగుమతులపై టన్నుకు రూ.50 మేర జాతీయ విపత్తు అగంతుక నిధి(ఎన్సీసీడీ) కోసం వసూలుచేస్తున్నారు. భారత్ విదేశాల నుంచి ఏటా 220 మిలియన్ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై రూ.19.98 ఎక్సైజ్ సుంకాన్ని, లీటర్ డీజిల్పై రూ.15.83 సుంకాన్ని కేంద్రం వసూలుచేసినట్లు అయింది. 2018, అక్టోబర్లో ఎన్నికల సందర్భంగా అప్పటి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పెట్రో ఉత్పత్తులపై లీటర్కు రూ.1.50 మేర సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
డీజిలే అసలు విలన్...
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ఉంటే బస్సు ముందుకు పోతుంది. కానీ, డీజిల్ కొంటే ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా వెనక్కి పోతోంది. చమురు ధరల భారంతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత డీజిల్ ధర ఒక్కసారిగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో ఆర్టీసీ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆ భారాన్ని మోయలేక చతికిలబడ్డ రవాణాసంస్థ, భవిష్యత్తు భారాన్ని బేరీజు వేసుకుని కాపాడాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది. విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఒక శాతానికి తగ్గించాలని చాలాకాలంగా ఆర్టీసీ కోరుతోంది. మూడేళ్లుగా బస్సుచార్జీలు పెంచనందున ఈసారి కచ్చితంగా టికెట్ ధరలను సవరించాల్సిందేనని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. అప్పట్లో డీజిల్ ధర లీటరుకు రూ.44.50 ఉంది. అది కొంత పెరుగుతూ, తగ్గుతూ ఇప్పుడు రూ.72కు చేరుకుంది. అంటే లీటరుపై రూ.28 పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి ప్రధానకారణం డీజిల్ భారమేనని, అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటున్నా డీజిల్ భూతం మింగేస్తోందని తాజాగా లెక్కలు తేల్చింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలం(మార్చి లెక్కలు తేల్చాల్సి ఉంది)లో తెలంగాణ ఆర్టీసీ అంతకుముందు సంవత్సరం అదే సమయం కంటే రూ.295 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది. ఇందులో టికెట్ల రూపంలో రూ.165 కోట్లు, స్క్రాప్ విక్రయం, ఇతర వాణిజ్యమార్గాల ద్వారా రూ.56 కోట్లు, బస్ పాస్ రీయింబర్స్మెంటు ద్వారా మిగతా మొత్తం సమకూర్చుకుంది. కానీ, ఇదే సమయానికి పెరిగిన నష్టాలు ఏకంగా రూ.432 కోట్లు ఉన్నాయి. ఇందులో డీజిల్ వాటా రూ.186 కోట్లని లెక్కలు తేల్చారు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధరలను ఏకంగా 130 సార్లు సవరించారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.63గా ఉంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా 2016లో ఫిబ్రవరిలోరూ. 44గా మారింది. ఆ తర్వాత క్రమంగా పెరగటం మొదలుపెట్టి ఇప్పుడు రూ.72కు చేరుకుంది. ►ఆర్టీసీ నిత్యం ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 20 కోట్ల లీటర్లకు పైమాటే.. ►2018–19లో 11 నెలల కాలానికి నష్టాలు రూ.684 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం అదే కాలానికి వచ్చిన నష్టాల కంటే రూ.137 కోట్లు అధికం. ఇదే సమయంలో ముందు సంవత్సరం కంటే పెరిగిన డీజిల్ భారం రూ.186 కోట్లు. 2017–18 సంవత్సరానికి డీజిల్బిల్లు రూ.1,084 కోట్లు నమోదు కాగా, 2018 –19లో రూ.1,270 కోట్లు వచ్చింది. ఇందులో దాదాపు రూ.300 కోట్లు వ్యాట్ కింద రాష్ట్రప్రభుత్వం వసూలు చేసిందే కావటం గమనార్హం. ►2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఆదేశం ఇచ్చారు. హైదరాబాద్లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భర్తీ చేస్తుందన్నది దాని సారాంశం. ఆ మేరకు విడుదల చేసిన ఉత్తర్వులో రూ.336 కోట్లు జీహెచ్ఎంసీ ఆర్టీసీకి ఇవ్వాలంటూ పేర్కొంది. 2015–16కుగాను ఒకసారి జీహెచ్ఎంసీ ఇచ్చింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. ►పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు ఊతం. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బస్సుల రూపంలో ఆర్టీసీకి వచ్చిన నష్టాలు రూ.330 కోట్లు. 60 వేల లోపే... ఇటీవల విమానయాన సంస్థలను ఆదుకునే క్రమంలో ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్ను గతేడాది ఒక శాతంగా మార్చారు. దీంతో విమానయాన సంస్థలు లాభపడ్డాయి. విచిత్రమేంటంటే... మన రాష్ట్రంలో సగటున నిత్యం ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య 60 వేలలోపే. కానీ నిత్యం కోటిమందిని గమ్యం చేరుస్తున్న ఆర్టీసీ మాత్రం అదే ఇంధనంపై ఏకంగా 27 శాతం చెల్లించాల్సి వస్తోంది. ధనికులు ప్రయాణించే విమానాలకు వెసులుబాటు కల్పించినప్పుడు ఎక్కువ మంది పేదలే ప్రయాణించే ఆర్టీసీ బస్సుకు ఎందుకు వెసులుబాటు రాదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విమానయాన సంస్థలు ఆర్థిక ఒడిదొడుకులకు గురైతే దాని ప్రభావం ధనిక వర్గాలపైనే ఉంటుందని, కానీ ఆర్టీసీ ఇబ్బంది పడితే నేరుగా పేదలే సతమతమవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. డీజిల్పై వ్యాట్ తగ్గిస్తే సాలీనా మిగులుబాటు రూ.300 కోట్ల(ప్రస్తుత ధరల ప్రకారం)కే పరిమితమవుతుందని, అదే టికెట్ ధరలను డిమాండ్ చేసిన 30 శాతంలో సగం 15 శాతం పెంచినా రూ.500 కోట్ల లబ్ధి చేకూరుతుండటమే దీనికి కారణం. -
బతుకు ‘బండి’ డీలా?
సాక్షి, ఆసిఫాబాద్అర్బన్: రోజురోజుకు డీజిల్ రేటు పెరుగుతుండడంతో ఆటోవాలాల జీవనం కష్టతరంగా మారుతోంది. ఆటోనే జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొని జీవిద్దామనుకుంటే..రోజు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అనునిత్యం డీజిల్ ధర పెరుగుతోంది. గతంలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.75కు చేరుకుంది. ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆటోవాలాలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే అరకొర డబ్బు డీజిల్కే పోతోందని, ప్రస్తుతం ఉన్న చార్జీలకు ఆటోలను నడిపి, నెల వచ్చే సరికి తీసుకున్న ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఆసిఫాబాద్ మండల పరిధిలో సుమారు 500 వరకు ఆటోలు ఉన్నాయి. బస్సులు లేనప్పుడు ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడి ఇంటికి చేరుతున్నారు. అయితే ఆటోలు నడిపే వా రి పరిస్థితి మాత్రం అంతా ఆశాజనకంగా లేదు. నిర్వహణ ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి.. ఆటోలు నడపడానికి పలు రకాల నిర్వహణ ఖర్చులున్నాయి. అంతంత మాత్రంగా వచ్చే డబ్బుతో ఆటోలకు సర్వీసింగ్ కూడా చేయలేని పరిస్థితి వస్తోందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు అమాంతంగా పెరిగిన బీమా ధరలు, ఎఫ్సీ కాలం ముగిసిన తరువాత వేసే అపరాధ రుసుం ఆటోడ్రైవర్ల జీవనాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. సీఐ చొరవతో ఆటోస్టాండ్ ఆర్టీసీ అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆటో స్టాండ్ను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆటో యజమానులు ఇబ్బందులు పడడంతో స్థానిక సీఐ మల్లయ్య ను ఆశ్రయించారు. అందుకు వారు ఆర్టీసీ అధికా రులతో మాట్లాడి ఆటోస్టాండ్ను యథావిధిగా ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయించారు. డీజిల్ ధరలు ఇలా... సంవత్సరం డీజిల్ ధర (రూ.లలో) 2014 56 2015 58 2016 60 2017 70 2018 72 2019 75 ఇవీ డిమాండ్లు.. ఆటోడ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో ఫైనాన్సర్ల వడ్డీ దోపిడీ అరికట్టాలి. ఆటోలకు భారీగా పెరిగిన థర్డ్పార్టీ బీమా తగ్గించి, 50శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి ఎంవీ, యాక్ట్ సవరణ బిల్లు రద్దు చేయాలి యాక్సిడెంటల్ బీమాను రూ.5 లక్షలను, సాధారణ, మరణాలకు అంగవైకల్యానికి వర్తింప చేయాలి. మండలకేంద్రాల్లో ఆటోలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలి ఆటో బీమా ప్రీమియం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న డబుల్బెడ్ రూం ఇళ్లను పేదలైన ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. వాయిదాలు కట్టలేకపోతున్నాం అప్పుచేసి ఆటోలు కొనుగోలు చేశాం. ప్రస్తుతం డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు భారీగా పెరిగాయి. చార్జీలు మాత్రం పెరగడం లేదు. చార్జీలు పెంచుదామంటే ప్రజలు అంగీకరించరు. ప్రభుత్వం చొరవ చూపి డీజిల్ ధరలు అదుపు చేయాలి. – ఎస్కె.సాజీద్, ఆసిఫాబాద్ -
పండగ వేళ పెట్రో భారాలు
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్ ధరలు లీటర్కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్ ధర లీటర్కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 69.75కు పెరిగింది. డీజిల్ ధర లీటర్కు రూ 63.69కు చేరింది. ముంబైల్లో పెట్రోల్ ధర లీటర్ రూ 75.39 పలికితే, డీజిల్ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి. -
ఆగిన దూకుడు...
నాలుగైదు నెలలపాటు ప్రజలను బెంబేలేత్తించిన ఇంధన ఉత్పత్తుల ధరలు ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు గత అక్టోబర్తో పోలిస్తే జనవరిలో భారీగా తగ్గాయి. గ్యాస్ ధర దాదాపు రూ.250 వరకు తగ్గగా..పెట్రోలు, డీజిల్ ధరలు సైతం రూ.16 వరకు దిగివచ్చాయి. సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన వనరుల ధరలు తగ్గుతుండటంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు కాస్త ఊరట లభిస్తోంది. తాజాగా వంట గ్యాస్(ఎల్పీజీ), పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తున్నాయి. గత ఏదాడి కాలంగా దూకుడు పెంచిన ధరలు తిరుగుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండంతో చమురు ధరల దూకుడును తగ్గించింది. మొన్నటి వరకు వంట గ్యాస్« ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏకంగా సిలిండర్ ధర వెయ్యి వరకు ఎగబాకగా, పెట్రోల్«, డీజీల్ ధర నువ్వా , నేనా అనే విధంగా లీటర్ రూ.90 దగ్గరకు చేరింది. పెరిగిన ధరలు తిరిగి పాత స్థాయికి చేరుకుంటున్నాయి. ఈమేరకు గ్యాస్ సిలిండర్ ధర నగరంలో రూ.744.55 కు చేరింది. గృహ వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్ను నగదు బదిలీ పథకం కింద మార్కెట్ విలువ ప్రకారం పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉన్న కారణంగా భారంగా మారింది. తాజాగా ధర దగివస్తుండటంతో కొంత వెసులుబాటు కలుగుతోంది.మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన డొమెస్టిక్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమాండ్ ఉంటుంది. రోజువారి తగ్గుముఖం పెట్రోల్, డీజిల్ ధరల దూకుడుకు కళ్లెం పడింది. రోజువారి ధరల సవరణతో దూకుడు పెంచి హడలెత్తినంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెనక్కి తగ్గుతున్నాయి. గత నాలుగు మాసాల్లో పెట్రోల్పై రూ.16.46 పైసలు, డీజిల్పై రూ.14.45 పైసలు తగ్గింది. పెట్రోల్ లీటర్ ధర రూ.89.06 వరకు ఎగబాకి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదేబాటలో డీజిల్ ధర కూడా ఎగబాకి దేశంలోనే రికార్డు సృష్టించింది. అప్పట్లో లీటర్ డీజిల్ ధర రూ.82.33 పైసలు పలికింది. తాజాగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలోనే పెట్రోల్ వినియోగంలో సగం భాగం గ్రేటర్ హైదరాబాద్లోనే ఉంటుంది. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా..వాటి ద్వారా ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడు పోతుంది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది . గ్రేటర్ హైదరాబాద్లో ధరలు ఇలా.. ఇంధనం జనవరి డిసెంబర్ నవంబర్ అక్టోబర్ –––––––––––––––––––––––––––––––––––––––––(రూ.లలో) వంట గ్యాస్(14.2 కేజీలు) 744.55 867.00 999.00 936.50 పెట్రోల్(లీటర్) 72.60 76.89 84.14 89.06 డీజిల్ (లీడర్) 67.88 73.17 80.25 82.33 -
డీజిల్ ధర పెరగడంతో ఆర్టీసీకి రూ.900 కోట్ల నష్టం
ప్రొద్దుటూరు టౌన్ : డీజిల్ ధర పెరగడంతో ఆర్టీసీకి రూ.900 కోట్ల నష్టం వచ్చిందని, అది కార్మికుల వల్ల కాదని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డిపోలోని అన్ని సెక్షన్ల రికార్డులను తనిఖీ చేశారు. కార్మికులను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు పీఆర్సీలు, ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల రూ.700 కోట్లు భారం సంస్థపై పడిందన్నారు. ఆర్టీసీకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యలు ఉన్నాయన్నారు. మూడేళ్ల కిందట టికెట్ ధరలు పెంచామన్నారు. అప్పుడు డీజిల్ రూ.48 ఉండేదని, ఇప్పుడు రూ.68 ఉందన్నారు. తలకు మించిన భారం కార్మికులపై మోపితే సంస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు. కార్మికులు సంతోషంగా విధులకు వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని తెలిపారు. కలిసికట్టుగా పని చేస్తే సమస్యలను అధికమిస్తామన్నారు. మేనేజ్మెంట్, కార్మికులు వేరు కాదన్నారు. ఆర్టీసీ మనందరిదీ అని అన్నారు. తాను ఒక డైవర్, కండెక్టర్గా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం చేసుకుని అధికారులు కార్మికులతో వ్యవహరించాలన్నారు. సంస్థ పనితీరుపై కార్మికులు అవగాహన పెంచుకోవాలన్నారు. మేనేజ్మెంట్, కార్మికులు సమన్వయంతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రాణం ఎవరికైనా విలువైనది.. మన తప్పిదం వల్ల, మరి కొన్ని ఎదుటి వారి తప్పిదం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఎండీ అన్నారు. మన తప్పు లేనప్పుడు వారికి చార్జిషీట్ ఇవ్వకూడదన్నారు. రెండు రోజుల కిందట రాయచోటి డిపోకు చెందిన బస్సు తిరుపతి వద్ద జరిగిన ప్రమాదంలో 22 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు మృతి చెందారన్నారు. ఇది చాలా బాధకరమని పేర్కొన్నారు. వారికి ఏమి ఇచ్చినా తక్కువేనన్నారు. ప్రాణం చాలా విలువైనదన్నారు. ఈ ఏడాది ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల్లో 333 మంది మృతి చెందారని తెలిపారు. ప్రతి రోజూ ఏ డ్రైవర్ అయినా క్షేమంగా బస్సును తిరిగి అప్పగిస్తామని అనుకోవాలన్నారు. మద్యం తాగి బస్సు నడపడంపై సీరియస్గా ఉన్నామన్నారు. రెండు, మూడు సార్లు వస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని హెచ్చరించారు. లగేజీ టికెట్ ఇచ్చి, ప్రయాణికునికి టికెట్ ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. డబుల్ డ్యూటీకి రూ.300 ఇస్తున్నా సరిపోదు ఎండీ కార్మికులతో మాట్లాడుతూ డబుల్ డ్యూటీకి రూ.300 ఇస్తున్నామని, అయినా అది సరిపోదని తెలిపారు. అందుకే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ప్రతి ఒక్కరూ సంస్థ బాగు కోసం ఆలోచించాలన్నారు. ఆర్టీసీలో పని చేసే ప్రతి ఉద్యోగి ఉద్యోగ భద్రతతో పని చేయాలన్నారు. ఒక మంచి పని చేయడం వల్ల కొన్ని సమస్యలు అధికమిస్తామన్నారు. మాకు గతంలో కంటే వెసులు బాటు వచ్చింది అని ప్రతి డిపోను పరిశీలించిన సందర్భంలో కార్మికులు చెప్పారన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని నిర్ధారించలేం కాబట్టి వారిపై ఉన్న చార్జిషీట్లు తొలగించాలని ఆదేశించామన్నారు. వారి నుంచి రికవరీలు చేసి ఉంటే అవి కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పానన్నారు. 50 శాతం కేసులు రూ.30 లోపు డబ్బు ఉన్నవే ఉన్నాయన్నారు. సమస్యలను తీరేందకు ఏమైనా చేశామా లేదా అని పరిశీలించుకోవాలన్నారు. చీకటిలో కూర్చొని ఏడుస్తూ కుర్చుంటే అది పోదన్నారు. ప్రొద్దుటూరు డిపోను రోల్ మాడల్గా తీసుకోండి సమస్యలను అధిక మించడానికి ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై ప్రొద్దుటూరు డిపోను రోల్ మాడల్గా తీసుకొని దాన్ని అన్ని డిపోల్లో అనుసరించాలని ఎండీ తెలిపారు. సంస్థకు నష్టం చేకూరిస్తే సహించమన్నారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గత ఏడాదితో పోలిస్తే అన్ని వాటిల్లో ముందంజలో ఉందని ఎండీ అభినందించారు. ఎండీ వెంట అడ్మినిస్ట్రేషన్ ఈడీ కోటేశ్వరరావు, కడప రీజియన్ ఈడీ కేవీఆర్ ప్రసాద్, కమర్షియల్ ఈడీ విజయరావు, ఈడీ రామకృష్ణ, కడప ఆర్ఎం విజయరత్నం, ప్రొద్దుటూరు డిపో మేనేజర్ హరి, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత తదితరులు ఉన్నారు. -
18 రోజులు.. రూ.4 తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.2.33 తగ్గింది. ఆదివారం నాడు లీటరు పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పతనమైంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 78.78, డీజిల్ ధర రూ.73.36 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ. 82.28, డీజిల్ రూ.76.88 వద్ద అమ్ముడవుతోంది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు, ఆగస్టు 16–అక్టోబర్ 4 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ.6.86, డీజిల్ ధర లీటరుకు రూ.6.73 పెరిగింది. -
∙గ్రేటర్ ఆర్టీసీకి భారీ నష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: వరుసగా పెరిగిన డీజిల్ ధరలు, ఆదాయానికి రెట్టింపు నిర్వహణ వ్యయం గ్రేటర్ ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయే కానీ ఒక్క రూపాయి కూడా తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.273 కోట్ల నష్టాలు నమోదు కాగా, అందులో గ్రేటర్ నష్టాలే ఏకంగా రూ.207 కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తూ ఇప్పటికే హైదరాబాద్లో అతిపెద్ద ప్రజారవాణా సంస్థగా వెలుగొందుతున్నప్పటికీ నష్టాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకు రూ.3.68 కోట్ల ఆదాయం వస్తే.. నిర్వహణ ఖర్చు రూ.4.65 కోట్ల చొప్పున నమోదవుతోంది. చివరకు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లోనూ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. గత 2 నెలలుగా నాలుగైదు రోజులు ఆలస్యంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిఇప్పటి వరకు నగరంలో రూ.744 కోట్ల ఆదాయం లభించగా డీజిల్, విడిభాగాలు, బస్సుల మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతభత్యాలు తదితర అవసరాల కోసం రూ.953 కోట్ల మేర ఖర్చయింది. డీజిల్పైనే 30 శాతానికి పైగా భారం పెరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీలో మొత్తం 28 డిపోలు ఉన్నాయి. 3804 బస్సులతో ప్రతిరోజు సుమారు 41 వేల ట్రిప్పుల మేరకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. తాజాగా మెట్రో రైలు నుంచి గట్టి పోటీ మొదలైంది. ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఏసీ బస్సులు తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్నాయి. నాగోల్–సికింద్రాబాద్–అమీర్పేట్ మార్గంలోనూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా, అన్ని మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ఆర్టీసీ మనుగడ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. భారంగా ఇంధనం.... నగరంలోని ప్రతి రోజు సిటీ బస్సులు 9.7 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇందుకోసం 2.19 లక్షల డీజిల్ను వినియోగిస్తున్నారు. ఇంధన సంస్థల నుంచి ఆర్టీసీ పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్న దృష్ట్యా బహిరంగ మార్కెట్లో ఉండే ధరల కంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం లీటర్ ధర రూ.80.33 వరకు ఉండగా ఆర్టీసీకి రూ.77కు లీటర్ చొప్పున అందజేస్తున్నారు. అయినప్పటికీ ఏడాది కాలంలో లీటర్పైన రూ.15 వరకు పెరిగినట్లు అంచనా. నగరంలో వాహనాల రద్దీ, ఎక్కువ సేపు బస్సులను ఐడలింగ్లో ఉంచడం వంటి కారణాల దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీలో డీజిల్ వినియోగం సగటున ఒక లీటర్కు 4 కిలోమీటర్ల చొప్పున ఉంది. ఏసీ బస్సులు ఒక లీటర్కు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు, మెట్రో బస్సులు 4 కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 4.5 కిలోమీటర్ల చొప్పున వినియోగిస్తున్నాయి. మొత్తంగా పెరిగిన డీజిల్ ధరల ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రూ.103 కోట్ల వరకు డీజిల్పైన భారం నమోదు కాగా, హైదరాబాద్లో అది రూ.40 కోట్లకు పైగా ఉంది. పుట్టి ముంచుతున్న అద్దె బస్సులు... అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపైన వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే భారంగా పరిణమించింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న 462 బస్సులపైన గ్రేటర్ ఆర్టీసీ సుమారు రూ.80 కోట్లు అద్దెల రూపంలో చెల్లించింది. కానీ ఆ బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం కేవలం రూ.58 కోట్లు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాది కాలంలోనే వచ్చిన ఆదాయం కంటే అదనంగా రూ.22 కోట్లు చెల్లించవలసి వచ్చింది. అదనంగా చెల్లించిన రూ.22 కోట్లతో కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకొనే అవకాశం ఉండేది. కేవలం ప్రైవేట్ ఆపరేటర్ల స్వలాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకొంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి ... ♦ మొత్తం డిపోలు : 28 , –నగరంలో తిరిగే బస్సులు : 3804 ♦ ప్రయాణికుల సంఖ్య 33 లక్షలు,ఆక్యుపెన్సీ రేషియో : 68 శాతం ♦ రోజూ తిరిగే ట్రిప్పులు 41,110 : కిలోమీటర్లు : 9 లక్షలు ♦ రోజూ వచ్చే ఆదాయం రూ. 3.68 కోట్లు : రోజువారీ ఖర్చు : రూ.4.65 కోట్లు ♦ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి లభించిన ఆదాయం రూ.744 కోట్లు ♦ బస్సుల నిర్వహణ కోసం చేసిన ఖర్చు రూ.953 కోట్లు ♦ సెప్టెంబర్ నాటికి నమోదైన నష్టాలు : రూ.207 కోట్లు -
ఒడిశాలో పెట్రోల్ ధరను దాటిన డీజిల్ ధర
-
మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
ఢిల్లీ: ఇటీవల పెరుగుతూ వచ్చిన చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.38, డీజిల్ రూ. 75.48కి చేరింది. ముంబయిలో పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 11 పైసలు తగ్గడంతో పెట్రోల్ రూ. 87.74, డీజిల్ రూ. 79.13గా కొనసాగుతోంది. గురువారం సైతం పెట్రో ధరలు మోస్తరుగా తగ్గిన సంగతి తెలిసిందే. గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు తగ్గడం అంతంత మాత్రంగానే ఉంది. అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది. ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ సమ్మె... పెట్రోల్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి. దసరా కానుకగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు -
దసరా కానుకగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు
ముంబై : దసరా పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ రేట్లు దిగొచ్చాయి. గత 13 రోజులుగా వాహనదారులకు షాకిస్తున్న ఈ ధరలు, నేడు కాస్త ఉపశమనం కలిగించాయి. న్యూఢిల్లీ, కోల్కతా, ముంబైలలో పెట్రోల్ 21 పైసలు తగ్గగా.. చెన్నైలో 22 పైసలు తగ్గింది. ఇక నాలగు మెట్రోల్లో డీజిల్ ధర 11 పైసలే తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.62గా, కోల్కతాలో రూ.84.44గా, ముంబైలో రూ.88.08గా, చెన్నైలో రూ.85.88గా ఉన్నాయి. ఇక డీజిల్ ధరలు న్యూఢిల్లీలో లీటరు రూ.75.58గా, ముంబైలో రూ.79.24గా, చెన్నైలో రూ.79.93గా, కోల్కతాలో రూ.77.43గా నమోదయ్యాయి. గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు ధరలు దిగిరావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, ఈ ధరలు మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాక ఒక్క రోజు మాత్రమే ఇంధన ధరలు తగ్గాయి. మళ్లీ వెంటనే పెరగడం ప్రారంభించాయి. అయితే దసరా కానుకగా ఈ ధరలు దిగిరావడం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ఆగస్టు మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం ఈ ధరల పెంపుకు కారణమవుతోంది. ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ సమ్మె... పెట్రోల్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఒక రోజు పాటు సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 22 ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబరు 23 ఉదయం ఐదు గంటల వరకు సమ్మె చేస్తామని తెలిపింది. సమ్మెలో భాగంగా ఢిల్లీలోని పెట్రోల్ బంకులు ఆ ఒక్క రోజు మూతపడనున్నాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు : ఏ నగరంలో ఎంత?
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు చేపట్టినా.. ఇవి పైకి ఎగుస్తూనే ఉన్నాయి. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటరుకు 6 పైసలు, 19 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.72గా ఉంది. డీజిల్ ధర రూ.75.38గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో డీజిల్ ధర నిన్నటి కంటే 20 పైసలు పెరిగి, లీటరుకు రూ.79.02గా రికార్డైంది. పెట్రోల్ కూడా 6 పైసలు పెరిగి రూ.88.18గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.99కు, కోల్కతాలో రూ.84.54కు పెరగగా.. లీటరు డీజిల్ ధర చెన్నైలో 19 పైసలు పెరిగి రూ.79.71గా, కోల్కతాలో రూ.77.23గా రికార్డయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఏ మాత్రం తగ్గింపు లేకుండా.. పెరుగుతూ ఉండే సరికి ఏకంగా ఈసారి ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. అన్ని ఆయిల్ కంపెనీల సీఈవోలతో నేడు నరేంద్ర మోదీ సమావేశం కాబోతున్నారు. చమురు సరఫరాల్లో అతి ముఖ్యమైన దేశం అయిన ఇరాన్పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. -
ఆ రాష్ట్రాల్లో పెట్రోల్పై ఐదు రూపాయలు తగ్గింపు
వాహనదారులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఒక గంట క్రితమే గుడ్న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూపాయిని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. అంటే మొత్తం లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.50 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గడంతో, వెంటనే రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్పై ఉన్న వ్యాట్ను తగ్గించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. తమ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై రూ.2.50 తగ్గించాలని నిర్ణయించిందని గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రకటించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, తమ వ్యాట్ తగ్గింపుతో మొత్తంగా తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఐదు రూపాయల మేర తగ్గనున్నట్టు పేర్కొన్నారు. విజయ్ రూపాని మాత్రమే కాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ‘పెట్రోల్, డీజిల్పై రూ.2.50 ధర తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అరుణ్జైట్లీకి కృతజ్ఞతలు. ఇది సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద ఊరట. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సామాన్య ప్రజానీకానికి లీటరు పెట్రోల్కు అదనంగా మరో రూ.2.50 ఊరట ఇవ్వాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా మా రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.5 తగ్గుతుంది’ అని దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ చేశారు. కాగా, ముంబైలోనే అత్యధికంగా పెట్రోల్ ధర రూ.91ను క్రాస్ చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై భారీ ఊరట ఇవ్వడంతో, ముంబై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రకటించారు. దీంతో మొత్తంగా తమ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ఐదు రూపాయలు చౌకగా లభ్యం కానున్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఇక రాష్ట్రాలు సైతం వ్యాట్ను తగ్గించి, వాహనదారులకు ఊరట ఇవ్వాల్సి ఉంది. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం శుభవార్త
-
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది. అటు విపక్షాలు, ఇటు వాహనదారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లతో, దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. అంతేకాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధరను రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.50 తగ్గాయి. తగ్గించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్ను రూ.2.50 తగ్గించాలని అరుణ్జైట్లీ ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు. దీంతో కరెన్సీ మార్కెట్తో పాటు స్టాక్ మార్కెట్పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరలను డీరెగ్యులేషన్ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్, చమురు ధరల సెగ స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించడంతో, వెంటనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశంలో అత్యధికంగా అర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ రూ.89.97 కాగా, డీజిల్ ధర 78.53గా రికార్డు నమోదైంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.87.57, డీజిల్ 80.40, విజయవాడ పెట్రోల్ ధర 86.95 కాగా, డీజిల్ రూ 79.51గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ 82.61, కాగా డీజిల్ ధర 73.77గా ఉంది. భారీ పెట్రోల్ ధరలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారు. ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ మోదీ సర్కార్ను టార్గెట్ చేస్తోంది. పెట్రో భారాలకు నిరసనగా ఆ పార్టీ గతవారంలో దేశవ్యాప్తంగా భారత్ బంద్ను పాటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని ఇటీవల పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతోనే ప్రధాని విధిలేని పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ ద్వారా ఎద్దేవా చేసింది. -
చవకగా పెట్రోల్ కావాలా.. అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యునికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. బండి తీసుకుని రోడ్డు మీదకి వెళ్లాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు ఇలా ఒకటేమిటి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు కన్పిస్తున్నాయి. అయితే పొరుగుదేశం నేపాల్లో మాత్రం ఇంధన ధరలు సాధారణంగానే ఉన్నాయి. ఈ కారణంగా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం నేపాల్కు వెళ్తున్నారు. దూరం, సమయం గురించి ఆలోచించకుండా నేపాల్కు వెళ్లి అక్కడే పెట్రోల్, డీజిల్ రీఫిల్ చేయించుకుంటున్నారు. దీంతో నేపాల్ సరిహద్దు జిల్లాలు భారత ‘ఇంధన సందర్శకుల’తో కళకళలాడుతున్నాయి. 14 రూపాయలు తేడా.. ఉత్తరాఖండ్లోని చంపావట్ జిల్లా ఉద్ధమ్ నగర్లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 82.63గా ఉండగా, లీటర్ డీజిల్ ధర 74.90గా ఉంది. ఇదే సమయంలో భారత సరిహద్దులో గల నేపాల్లోని కాంచన్పూర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 68. 20, డీజిల్ ధర రూ. 58.30గా ఉంది. కాగా ఈ రెండు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో సుమారు 14 రూపాయల వ్యత్యాసం ఉండటంతో కాంచన్పూర్ జిల్లాలో బిజినెస్ ఫుల్గా నడుస్తోంది. దీంతో ఉద్ధమ్నగర్ పెట్రోల్ బంకులన్నీ వెలవెలబోతున్నాయి. పూట గడవాలంటే తప్పదుగా మరి.. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగు దేశానికి వెళ్లి మరీ పెట్రోల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఉద్ధమ్ సింగ్ నగర్ టాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ రామ్ నరేశ్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోజూ 25 టాక్సీలను సరిహద్దులో ఉంచుతున్నాం. దీనికి నంబరింగ్ విధానం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరం వెళ్లి ట్యాంకు ఫుల్ చేయించుకుంటాం. కెపాసిటీకి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ఫిల్ చేయిస్తున్నాం. ఇది కొంత రిస్క్తో కూడుకున్న పనే. అయితే పూట గడవాలంటే టాక్సీ నడపడం తప్పనిసరి కదా. ఇక్కడే పెట్రోల్, డీజిల్ కొని టాక్సీ నడపాలంటే.. మేం పస్తులు ఉండాల్సిందే అంటూ తమ బాధలు చెప్పుకొచ్చారు. రోజుకి 7 లక్షలు.. నెలకి 2.5 కోట్ల రూపాయల నష్టం పెట్రోల్ కోసం నేపాల్కు వెళ్తున్న వారి సంఖ్య పెరగిపోతుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ.. ఈ మూడు రాష్ట్రాల్లోని సరిహద్దు ఇంధన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 7 లక్షల రూపాయల చొప్పున నెలకి 2.5 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నామన్నారు. అంతేకాకుండా కొంత మంది నేపాల్ నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి.. లాభానికి అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. దీంతో ఇటు బంకు వ్యాపారులు, అటు వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే.. ఇక్కడి(భారత్) కంటే అక్కడి(నేపాల్) నుంచి తెచ్చే పెట్రోల్, డీజిల్ ధరలకు రూపాయి వ్యత్యాసం ఉన్నా సరే తమకు లాభమే కదా అంటున్నారు కొంత మంది వినియోగదారులు. ఉదాహరణకు 100 లీటర్లు కొనుగోలు చేస్తే 100 రూపాయలు ఆదా అవుతుంది. ఈ లెక్కన ఇంకో లీటరున్నర పెట్రోల్ వస్తుంది. ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకుండా అధర్మంగా వ్యవహరిస్తుంటే..తాము మాత్రం ఎందుకు ధర్మాన్ని అనుసరించాలని నిలదీస్తున్నారు. ఏదేమైనా సరే భారత్లో ఇంధన ధరలకు రెక్కలు రావడంతో తమ వ్యాపారం బాగా వృద్ధి చెందిందని, సుమారు రోజుకు 9 వేల లీటర్ల పెట్రోల్ అమ్ముతున్నామంటూ నేపాల్ కాంచన్పూర్ జిల్లా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోల్ ధర రూ.100 : బంకులు మూత పడతాయ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడా తగ్గేది లేకుండా.. పెరుగుతూనే ఉంది. కొత్త ఏడాది కానుకగా ప్రభుత్వం పెట్రోల్ను 100 రూపాయలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదికి దగ్గర దగ్గర 100 రోజుల సమయం ఉంది. ఈ వంద రోజుల్లో పెట్రోల్ కూడా 100 రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో లీటరు పెట్రోల్ 100 రూపాయలను దాటిన రికార్డును 2019 సొంతం చేసుకోబోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అలా పెరుగుకుంటూ వెళ్తూ.. 100 రూపాయలను క్రాస్ చేస్తే, పరిస్థితేంటి? అనే భయాందోళనలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాధారణంగా పెట్రోల్ 100 రూపాయలు దాటితే, అవి పాత మిషన్లలో చూపించడం కష్టం. ఎందుకంటే, భారత్లో ఇంధనం సరఫరా చేసే మిషన్లు మూడు అంకెల ధరల విధానాన్ని సపోర్టు చేయడం లేదు. ఆక్టేన్ పెట్రోల్ ప్రస్తుతం లీటరు రూ.100.33గా నమోదవుతోంది. కానీ పెట్రోల్ బంకుల మిషన్లలో ఇది కేవలం 0.33గా మాత్రమే చూపిస్తోంది. దీంతో పెట్రోల్ పంపు ఆపరేటర్లు మాన్యువల్గా పెట్రోల్ ధరలను అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ నార్ముల్ పెట్రోల్ విషయంలోనూ అదే జరిగితే, మాన్యువల్ ధరలను నిర్వహించడం కుదరదు. అది సాధ్యం కాని పని కూడా. పెట్రోల్ 100 రూపాయలు దాటిన తర్వాత మిషన్లను అప్డేట్ చేయడం ప్రారంభిస్తే, సరఫరా కష్టంగా మారుతుంది. అన్ని పెట్రోల్ పంపులు ఆటోమేటెడ్గా రన్ అవుతున్నాయి. సెట్రల్ సర్వర్లో మారిన తర్వాత నుంచే అన్ని సర్వర్లలో మారుతూ ఉంటాయి. ఇలా ధర పెరుగుకుంటూ పోతే మాత్రం, పెట్రోల్ పంపులు మూత పడి, అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాతనే ప్రారంభమవుతాయి. మరి అప్పటి వరకు వాహనదారులు ఎక్కడికి పోవాలి. ఏ వాహనం కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడుతోంది. అలా అయితే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 80 శాతం పెట్రోల్ బంకులు పాత మిషన్లనే వాడుతున్నాయి. ఇప్పటికే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.90లను దాటేసింది. ప్రస్తుతం రూ.91.96 వద్ద నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరో కొత్త సవాల్ను సృష్టించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుదల, రూపాయి పాతాళానికి పడిపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజిల్ ధరలను ఎక్కడా తగ్గనీయ కుండా పరుగులు పెట్టిస్తున్నాయి. అంతేకాకుండా... అమెరికా ఇరాన్పై విధిస్తున్న ఆంక్షలు భారత్కు చుక్కలు చూపిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇరాన్ ఉంది. అయితే తాజాగా ట్రంప్ సర్కార్ ఇరాన్పై విధిస్తున్న ఆంక్షలు, భారత్, ఇరాన్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా.. ఇరాన్ నుంచి చమురు దిగుమతి అయ్యే ట్యాంకర్లను అమెరికా ఆపివేస్తోంది. దీంతో భారత చమురు ఉత్పత్తుల మార్గాల్లో ఒకటైన ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులు మూతపడనున్నాయి. ఇరాన్పై రెండో దశ ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత చుక్కలు చూపిస్తుంటే, అదే రెండో దశ అమల్లోకి వచ్చాక పరిస్థితి మరింత దిగజారనుంది. ఇరాన్ విషయంలో అమెరికా అసలు మెత్తబడే అవకాశం కనిపించడం లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ప్రస్తుతం నడుస్తుందని ట్రయల్ మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను మరింత చుక్కలు చూపించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ను దేశీయంగా జీఎస్టీలోకి తేవాలనే ప్రతిపాదనను పాలకులు చాకచక్యంగా పక్కన పెట్టడం కూడా ప్రతికూలంగా నిలుస్తోంది. -
కర్ణాటకలో ట్యాంకు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు.. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చే వాహనాలు ఈ మధ్య రాష్ట్రంలో డీజిల్ కొట్టించుకోవడం లేదు.. కర్ణాటకలోనే ట్యాంకు ఫుల్ చేయించుకుంటున్నారు. కారణం.. అక్కడితో పోలిస్తే.. రాష్ట్రంలోని డీజిల్ ధరలు చుక్కలు చూపుతుండటమే. తెలంగాణలో లీటరు డీజిల్ ధర సెప్టెంబర్ 18న రూ.80.35ఉండగా కర్ణాటకలో రూ.74.25గా ఉంది. అంటే ఏకంగా రూ.6.10 వ్యత్యాసం ఉంది. దీంతో పొరుగు రాష్ట్రంలోనే ట్యాంకు ఫుల్ చేయిస్తున్నారు. దీని వల్ల రాష్ట్రం డీజిల్ రూపంలో తనకు రావాల్సిన ఆదాయాన్ని కూడా నష్టపోతోంది. సరిహద్దు జిల్లాల్లో.. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే.. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కర్ణాటకను ఆనుకుని ఉంటాయి. దీంతో ఈ జిల్లాల నుంచి కర్ణాటకకు పలు లారీలు, ప్రైవేటు బస్సులు తరచుగా రాకపోకలు సాగిస్తుంటాయి. డీజిల్ ధరల్లో రెండు రాష్ట్రాలకు భారీగా వ్యత్యాసం ఉండటంతో కర్ణాటకకు చెందిన వాహనాలు, ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్లే వాహనాలేవీ తెలంగాణలో డీజిల్ కొట్టించుకోవడం లేదు. కర్ణాటక సరిహద్దుల్లోనే డీజిల్ పోయించుకుంటున్నాయి. బ్లాక్ మార్కెట్.. రోజురోజుకు డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రం ఇటీవల స్థానిక పన్నుల్లో కొంత మినహాయించుకుంది. దీంతో అక్కడ ధరలు కాస్త తగ్గుముఖం పట్టి ఇపుడు రూ.74కు చేరుకున్నాయి. ఇదే అదనుగా సరిహద్దు జిల్లాల్లో అక్రమంగా డీజిల్ విక్రయించేవారు అక్కడ రూ.74కుకొని ఇక్కడ రూ.78 విక్రయిస్తున్నట్లు సమాచారం. అసలు రేటుకంటే లీటరుకు రూ.2 తక్కువగా వస్తుండటంతో కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇక కర్ణాటకకు.. ముఖ్యంగా బెంగళూరు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్, బస్సులు కూడా అక్కడే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. ఇక బెంగళూరుకు వెళ్లే ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లు కర్ణాటకలో డీజిల్ పోయించుకుని, తెలంగాణలో తీసుకున్నట్లు బిల్లులు సృష్టిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని ట్రాన్స్పోర్టు కంపెనీలు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు కూడా భారీగా డీజిల్ను అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తున్నారని సమాచారం. ఇలా బ్లాక్మార్కెట్ పెరుగుతూ పోతే.. తెలంగాణ డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెంటనే తగ్గించాలి.. ఈ ధరలను చూసి మాకు మతిపోతోంది. కేంద్రం మాట అటుంచితే, కనీసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఎంతోకొంత తగ్గించాలి. లేకుంటే.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ అక్కడే డీజిల్ పోయించుకుంటాయి. ఇలా జరిగితే.. రాష్ట్రం ఆదాయం కోల్పోతుంది. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఎంతో కొంత తగ్గిస్తే.. ఇటు మాకు, అటు ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉంటుంది. లేదంటే మా రంగం సంక్షోభంలోకి వెళుతుంది. – భాస్కర్రెడ్డి, తెలంగాణ లారీల యాజమాన్యం అధ్యక్షుడు –––––––––––––––––––– ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలి.. స్థానికంగా వివిధ రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుని రూ.2కు పైగా ధర తగ్గించాయి. ఈ విధంగా తెలంగాణ కూడా చొరవ తీసుకోవాలి. పైగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు ఇదే సరైన సమయం. వ్యాట్ విషయంలో ఆర్టీసీకి మినహాయింపు లేదా సబ్సిడీ ఇవ్వాలి. లేకపోతే ప్రజారవాణా వ్యవస్థ కుంటుపడుతుంది. – నాగేశ్వరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ప్రభుత్వం
బెంగళూరు : పెట్రోల్, డీజిల్ ధరలపై కర్నాటక ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ధరలను నుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలను తగ్గించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొంతమేర ఊరట కలిగించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 90 రూపాయలను క్రాష్ చేస్తోంది. ‘ప్రతిరోజు ఇంధన ధరలు పెరుగుతున్నాయి. కర్నాటక రాష్ట్ర ప్రజలు, పన్నులు తగ్గి, ధరలు తగ్గితే బాగుండని భావించారు. కుల్బర్గి నుంచి ప్రకటిస్తున్నా.. మా సంకీర్ణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై కనీసం రెండు రూపాయల పన్నులను తగ్గించాలని నిర్ణయించింది. మా సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, కర్నాటక ప్రజలకు కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నాం’ అని కుమారస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇంధన ధరలను లీటరుకు రెండు రూపాయలు, రెండున్నర రూపాయలు తగ్గించాయి. కాగా.. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.06గా, కోల్కతాలో రూ.83.91గా, ముంబైలో రూ.89.44గా, చెన్నైలో రూ.85.31గా, బెంగళూరులో రూ.84.74గా ఉంది. డీజిల్ ధర కూడా న్యూఢిల్లీలో లీటరు రూ.73.78గా, కోల్కతాలో రూ.75.63గా, ముంబైలో రూ.78.33గా, చెన్నైలో రూ.78గా, బెంగళూరులో రూ.76.16గా రికార్డైంది. -
ఆల్-టైమ్ గరిష్టంలో పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరగడమే తప్ప, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి, రూ.82.06గా నమోదైంది. ముంబైలో కూడా 15 పైసలు పెరిగి, ఆల్-టైమ్ గరిష్టంలో రూ.89.44 మార్కును టచ్ చేసింది. పెట్రోల్కు తగ్గ రీతిలో డీజిల్ ధరలు కూడా సామాన్యులకు వాత పెడుతున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ.73.78గా నమోదైంది. అలాగే ముంబైలో రూ.78.33గా ఉంది. రాజధానుల పరంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంది కోల్కతాలోనే. ఈ నగరంలో లీటరు పెట్రోల్ను రూ.83.91 వద్ద, లీటరు డీజిల్ను రూ.75.53 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.31కి, డీజిల్ ధర రూ.78 కు పెరిగింది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.86.85గా, లీటరు డీజిల్ ధర రూ.80.19గా నమోదైంది. జనవరి 1 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర 15.4 శాతం పెరిగింది. అంటే రూ.69.97 నుంచి ప్రస్తుతం రూ.82.06కు చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా 22 శాతం ఎగిసింది. ఇంతలా పెట్రోల్, డీజిల్ సామాన్యులను గడగడలాడిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం లేదు. ఆగస్టు నుంచి అయితే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అసలు తగ్గడం లేదు. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఈ ధరల పెరుగదలకు మరింత తోడ్పడుతోంది. -
తిప్పాలంటే అప్పు చేయాల్సిందే!
విజయనగరం, సాలూరు: రాష్ట్రంలో లారీ పరిశ్రమ మాట వినగానే ఠక్కున గుర్తుకువచ్చేది విజయవాడ, ఆ తర్వాత సాలూరే. పట్టణంలో దాదాపు 1200 లారీలు వున్నాయి. 15వేల కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కొద్దికాలంగా పరిశ్రమ ఒడిదుడుకులకు లోనౌతుండడం లారీ యజమానులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. దీనికి కారణం డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడమే. ప్రధానంగా సాలూరు లారీ పరిశ్ర మ విశాఖ నుంచి రాయపూర్కు సరకులను తరలిస్తూ, తీసుకురావడంపైనే ఆధారపడి వుంది. రానూపోనూ దాదాపు 1300 కిలోమీటర్ల దూరం వుంటుంది. వెళ్లి వచ్చేందుకు దగ్గరదగ్గరగా 450నుంచి 500 లీటర్ల వరకు డీజిల్ ఖర్చవుతుంది. విశాఖ నుంచి రాయపూర్కు సరుకులను తీసుకువెళ్లి అక్కడ అన్లోడ్ చేసి, తిరిగి అక్కడి నుంచి సరుకులను లోడ్ చేసుకుని, మళ్లీ విశాఖ చేరుకునేందుకు వారంరోజుల సమయం పడుతుంది. డీజిల్ కొనుగోలుకు దాదాపు రూ. 40వేలు ఖర్చుచేయాల్సిరాగా, మరో రూ. 15వేల వరకు డ్రైవర్, క్లీనర్ ఖర్చులు, టోల్ ట్యాక్స్లు, ఇతర ఖర్చులు అవుతున్నట్టులారీ యజమానులు చెబుతున్నారు. ఐతే సరుకుల తరలింపువల్ల వచ్చేది రూ. 60వేల వరకు ఉండగా, ఇక మిగిలేది కేవలం రూ. 5వేలే. అందులోనే లారీ ఫైనాన్స్ చెల్లింపుతోపాటు టైర్ల కొనుగోలు, సిబ్బంది జీతాలు సైతం సమకూర్చాల్సివుంది. నెలకు 4 ట్రిప్పులు జరిగితే మిగిలేది రూ. 20వేలే. ఆదాయం అత్యల్పంగా వుండడంతో చేసేదిలేక అప్పులు చేయాల్సి వస్తోందని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. డీజిల్ ధరే ప్రధాన భారం డీజిల్ ధరే లారీ పరిశ్రమను కుంగదీస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా ధరను పెంచేస్తుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం లీటరు డీజిల్పై 2రూపాయల ధరను తగ్గించడంతో లారీ యజమానులు సంబరపడిపోయారు. కానీ ఇంతలోనే ధర తారాజువ్వలా దూసుకుపోతుండడంతో లారీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే లీటరుపై రూ. 4ల భారం(తగ్గించిన ధరలను తీసేస్తేనే) పడడంతో మిగులుతున్న రూ. 5వేలు కూడా డీజిల్కు అర్పించేసి... తిరిగి అప్పులపాలవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. పెట్రోల్ వినియోగదారుడిపైనా భారమే ఇదిలావుండగా పెట్రోల్ వినియోగదారులపైనా భారం మరింత పెరిగింది. ఈ ఏడాది జూలై 1న లీటరు పెట్రోల్ రూ. 81.43లుండగా, ప్రస్తుతం రూ. 85.47లకు ఎగబాకింది. ఇలాగైతే లారీలు నడపలేం ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగం స్తంభించాల్సిందే. కిరాయి రేట్లు పెంచడంలేదు. కానీ డీజిల్ ధరలు మాత్రం అమాంతం పెంచేస్తున్నారు. దీనివల్ల రూ. లక్షలు పోసి కొనుగోలుచేసిన లారీలను నడిపేందుకు కూడా అత్యధికంగానే ఖర్చుచేయాల్సి వస్తోంది. నెలంతా లారీ తిప్పినా డీజిల్ ధరల పెరుగుదల వల్ల రూపాయి కూడా మిగిలట్లేదు. ఈ విషయాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. డీజిల్ ధరల పెంపుతో వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయే తప్ప, దానివల్ల పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా లారీ పరిశ్రమను కాపాడి, ప్రజలపై పరోక్షంగా నెలకొంటున్న భారాన్ని తొలగించాలి.– ఇండుపూరి నారాయణరావు, సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి -
పెట్రోల్, డీజిల్ చౌకగా దొరికేది ఇక్కడే!
న్యూఢిల్లీ : భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ.. హడలెత్తిస్తున్నాయి. స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్, రవాణా ఖర్చుల్లో మార్పుతో ఒక నగరానికి, మరో నగరానికి ధరల్లో మార్పు కనిపించినప్పటికీ, చాలా నగరాల్లో మాత్రం ధరలు వాత పెడుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే, మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.45రూపాయలతో అత్యధికంగా ఉంది. లీటర్ డీజిల్ ధర హైదరాబాద్లో అత్యధికంగా 79.73 రూపాయలు ఉంది. ఇంతలా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వాతపెడుతుంటే, భారత్లోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.69.97కే లభ్యమవుతోంది. కానీ అదే ఇంధనం మహారాష్ట్రలో రూ.90.45 పలుకుతుంది. అంటే మహారాష్ట్రలోని పర్బానీతో పోల్చుకుంటే, అండమాన్ నికోబార్లో లీటర్ పెట్రోల్ 20 రూపాయలు తక్కువకు దొరుకుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రెండు వ్యాట్ శ్లాబులు అమలవుతున్నాయి. దీంతో పెట్రోల్ ధరలు ఆ రాష్ట్రంలో వాసిపోతున్నాయి. అండమాన్లోని పోర్ట్ బ్లయర్తో పాటు గోవా రాజధాని పనాజీలో కూడా లీటర్ పెట్రోల్ రూ.74.97, అగర్తలలో 79.71రూపాయలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో 80రూపాయలకు పైగానే ఉంది. ఈ మూడు చోట్ల తప్ప. ఇదిలా ఉంటే, తెలంగాణలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. దీనికి కారణం అధిక వ్యాట్. తెలంగాణలో డీజిల్పై విధించే వ్యాట్ 26.01 శాతంగా ఉంది. దీంతో తెలంగాణలో డీజిల్ ధర అమాంతం పెరిగిపోయి,లీటరు రూ.79.73గా నమోదవుతోంది. చత్తీష్గడ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధర అధికంగా ఉంది. అమరావతిలో లీటరు డీజిల్ ధర రూ.78.81గా, తిరువనంతపురంలో రూ.78.47గా, రాయ్పూర్లో రూ.79.12గా, అహ్మదాబాద్లో రూ.78.66గా ఉన్నాయి. అయితే డీజిల్ కూడా పోర్ట్ బ్లేయర్, ఇటానగర్, ఐజ్వాల్లలో చాలా చౌకగా లభ్యమవుతుంది. పోర్ట్ బ్లేయర్లో రూ.68.58గా ఉన్న డీజిల్ ధర, ఇటానగర్లో రూ.70.44గా, ఐజ్వాల్లో రూ.70.53గా ఉంది. అండమాన్, నికోబార్ ఐల్యాండ్, పోర్ట్ బ్లైర్లు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి బెస్ట్ ప్లేస్గా నిలుస్తున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణమేంటంటే.. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్పై 6శాతం మాత్రమే వ్యాట్ను విధిస్తారు. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. -
లీటరు పెట్రోల్పై రూపాయి తగ్గింపు
కోల్కతా : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి గుద్దిబండలా మారాయి. రోజురోజుకు పైకి ఎగియడమే తప్ప, అసలు తగ్గడం లేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షాలు నిన్న భారత్ బంద్ కూడా చేపట్టాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న ఆందోళనలు పెల్లుబిక్కుతున్న ఈ సమయంలో రాష్ట్రాలు రేట్ల తగ్గింపుపై దృష్టిసారిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరపై వాహనదారులకు ఊరటనిచ్చింది. లీటరు పెట్రోల్, డీజిల్పై ఒక్క రూపాయి ధర తగ్గించింది. ‘తాము పన్నులను పెంచడం లేదు. మేము నిరంతరం సామాన్య ప్రజల గురించే ఆలోచిస్తుంటాం. పెట్రోల్, డీజిల్ పరిమితిని మించి ఎగియడంతో, లీటరు ఇంధన ధరపై ఒక్క రూపాయి తగ్గించాలని నిర్ణయించాం’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వెంటనే సెంట్రల్ సెస్ను కేంద్రం ఉపసంహరించాలని కూడా మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఓ వైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, ధరలను పెంచుతున్నారని, సెస్ను పెంచుతున్నారని, ఈ రెండింటిన్నీ పెంచకూడదని అన్నారు. కాగా, మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. మహారాష్ట్రాలో అయితే ఏకంగా పెట్రోల్ ధర సరికొత్త రికార్డులో రూ.90 క్రాస్ చేసింది. న్యూఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.80.87గా, కోల్కతాలో రూ.83.75గా, ముంబైలో రూ.88.26గా, చెన్నైలో రూ.84.07గా ఉన్నాయి. డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో రూ.72.97గా, కోల్కతాలో రూ.75.82గా, ముంబైలో రూ.77.47గా, చెన్నైలో రూ.77.15గా రికార్డయ్యాయి. ఆదివారం రాజస్తాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్పై పన్నును తగ్గించింది. ఈ ధరలపై 4 శాతం పన్ను రేట్లను తగ్గించినట్టు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు. దీంతో ఆ రాష్టంలో లీటరు ఇంధన ధరలు రూ.2.5 తగ్గాయి. -
ఆగని పెట్రో పరుగు : హైదరాబాద్లో ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలపై దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్నప్పటికి పెట్రో ధరల పరుగుకు అడ్డకట్ట పడటంలేదు. ఇటీవల భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా ఇంకా రికార్డు హైలో కొనసాగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి లీటరు రూ.80.87 పైసలకు చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ. 72.97గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర 14 పైసలు పెరిగి 88.26 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు పెరిగి 77.47 గా ఉంది.చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 14, 15 పైసలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ. 84.05, ధర రూ. 77.13గా ఉంది. కోలకతాలో పెట్రోలు, డీజిల్ ధరలు 14 పైసలు పెరిగి 83.75, 75.82 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో మంగళవారం లీటర్ పెట్రోలు ధర రూ.85.60 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.22గా ఉంది. పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర 24 పైసలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించింది. దీంతో సోమవారం నాటి ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అలాగే రాజస్థాన్ సర్కార్ కూడా 4 శాతం వ్యాట్ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరలపై రూ.2 .50 తగ్గిస్తూ వసుంధరా రాజే సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఇం'ధన' మంట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రవాణా రంగం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇం‘ధన’మంట నేపథ్యంలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అసలే నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు అశనిపాతంలా మారాయి. వారం రోజులుగా పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు వారాల్లోనే లీటరుపై దాదాపుగా రూ.3.18లు పెరిగింది. దీంతో రోజుకు రూ.23 లక్షల భారాన్ని ఆర్టీసీ మోస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ప్రజా రవాణా వ్యవస్థ పరిస్థితీ ఇలానే ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్, లారీలు, క్యాబ్లు, ఆటోల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడమే నేటి భారానికి కారణమని రవాణా రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. లారీ యజమానులకు కోలుకోలేని దెబ్బ పెరుగుతున్న పెట్రోల్ ధరలు రవాణా రంగానికి కీలకంగా ఉన్న లారీల యజమానులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం అన్ సీజన్ కారణంగా లారీలకు గిరాకీ లేదు. దీనికితోడు పెరుగుతున్న డీజిల్ ధరలు వ్యాపారాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయని యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో కేవలం బొగ్గు, సిమెంటు రవాణా లారీలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. తాజా పరిస్థితులతో వ్యాపారం సరిగా సాగక.. యజమానులు వాయిదాలు కట్టలేకపోతున్నారు. రెండు వాయిదాలు దాటితే.. లారీలను ఫైనాన్స్ వ్యాపారులు లాక్కెళ్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకోవాలని తెలంగాణ లారీల అసోషియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మినహాయించి డీజిల్ను జీఎస్టీ పరిధిలో చేర్చాలని కోరారు. -
‘డీజల్ ధరలతో ఆర్టీసీ నష్టపోతుంది’
సాక్షి, విజయవాడ : రోజురోజుకు పెరుగుతున్న డీజల్ ధరలతో ఆర్టీసీ నష్టపోతుందని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై వీ రావు, ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై ఏడాదికి సుమారు 300కోట్ల రూపాయలు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టపోతోందని ఆరోపించారు. డీజల్ ధరలు తగ్గించాలని, లేదంటే పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 128 డిపోలలో, వర్కుషాపుల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
39 పైసలు పెరిగిన పెట్రోల్ ధర
-
పెట్రోల్, డీజిల్ ధరలపై ఊరట?
న్యూఢిల్లీ : సామాన్యులకు పెట్రో వాత మారుమోగిపోతుంది. గత నెల నుంచి పెట్రోల్, డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి, తప్ప అసలు తగ్గడం లేదు. స్కై రాకెట్లాగానే ఈ ధరలు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్, పన్నులు దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటరుకు రూ.80 మార్కును దాటిపోయింది. శనివారం ఒక్క రోజులోనే లీటరు పెట్రోల్ ధర 39 పైసలు పెరిగి, రూ.80.38గా నమోదైంది. డీజిల్ ధరలు కూడా అప్ట్రెండ్లో కొనసాగుతున్నాయి. లీటరు డీజిల్ ధర కూడా 44 పైసలు పెరిగి రూ.72.51గా ఉంది. ముంబైలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు రూ.87.77గా, రూ.76.98గా ఉన్నాయి. ఈ మేర సెగపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు నెలల్లో మనకు ఊరటనియనున్నాయట. రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, ఈ ధరల్లో మార్పులు చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల సమయంలో కూడా 20 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చూడలేదు. కానీ కర్ణాటక ఎన్నికలు అయిపోగానే, ఈ ధరలు ఒక్కసారిగా రయ్మని పైకి ఎగిశాయి. గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్యలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పులు లేకుండా.. అదే విధంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మణిపూర్ ఎన్నికలు ఉండటమే కారణం. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీష్గడ్, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ఏడాది ముగింపునఎన్నికలకు వెళ్లబోతున్నాయి. తెలంగాణకు కూడా ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలను నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కస్టమర్లకు కాస్త ఊరటనిస్తూ... పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ నవంబర్ నుంచి ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఓ వైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్ర నిరసన.. మరోవైపు త్వరలో జరుగబోతున్న రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం. తద్వారా ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకుని, ఓట్లను క్యాష్ చేసుకోబోతుంది. -
బంకు.. చూస్తే జంకు
సాక్షి,హైదరాబాద్: పెట్రోలు బంకు అంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజిల్ ధర పైసా పైసా పెరుగుతూ చుక్కలు చూపిస్తోంది. రోజువారీ ధరల సవరణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు దేశంలోనే రికార్డు సృష్టిస్తుండగా పెట్రోల్ ధరలో మాత్రం ముంబై తర్వాత రెండో స్ధానంలో ఆల్టైం రికార్డుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుదల, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం మధ్య వరుసగా గత పన్నెండు రోజుల్లో ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ధరల సవరణ విషయంలో మధ్యలో ఒక రోజు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ సంస్ధలు మళ్లీ విజృంభించాయి. దీంతో ఇప్పటికే ఆల్టైమ్ హై రికార్డు వద్ద కదలాడుతున్న ధరలు మరింత పెరిగాయి. చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో సైలెంట్గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. కిందటేడాది ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోతే కారణంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్పై రూ. 21.48 లు, డీజిల్పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 31శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 30.71 శాతానికి చేరింది. తెలంగాణలో పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సగటున పెట్రోల్పై 57 శాతం. డీజిల్పై 44 శాతం పన్నుల భారం పడుతోంది. క్రూడాయిల్ దూకుడు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఎగబాగుతోంది. మార్కెట్లో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర రూ.4,872లకు చేరింది. ఒక బాస్కెట్ (బ్యారెల్)లో 159 లీటర్లు చమురు ఉంటుంది. ఈ లెక్కన లీటర్ చమురు ధర రూ.30.64. క్రూడాయిల్ రీఫైనింగ్, రవాణా ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతతో చమురు ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారం వినియోగదారుల మీద పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గతంలో తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు. తాజాగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తోడు పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణ మరింత ఆందోళనకరంగా తయారైంది.