పండగ వేళ పెట్రో భారాలు | Petrol Diesel Prices Hiked Sharply | Sakshi
Sakshi News home page

పండగ వేళ పెట్రో భారాలు

Jan 13 2019 12:51 PM | Updated on Jan 14 2019 6:32 PM

Petrol Diesel Prices Hiked Sharply - Sakshi

పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు

సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరలను లీటర్‌కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్‌ ధరలు లీటర్‌కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్‌ ధర లీటర్‌కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ 69.75కు పెరిగింది. డీజిల్‌ ధర లీటర్‌కు రూ 63.69కు చేరింది. ముంబైల్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ 75.39 పలికితే, డీజిల్‌ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్‌కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement