breaking news
Bollywood Actor
-
ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
నేనూ సెలవు తీసుకుంటా!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎప్పుడూ వరుస సినిమాలతో, క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉండే ఆయన కూడా సెలవులు తీసుకుంటారట. అది కూడా ఏడాదిలో 125 రోజులట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ‘‘మనందరికీ రోజుకి 24 గంటలుంటాయి. ఏడాదికి 365 రోజులే. అందరిలానే నేను కూడా సెలవులు తీసుకుంటా. అది కూడా దాదాపు 125 రోజులు. ఏడాదిలో 52 ఆదివారాలు, 40 రోజుల వేసవి విహారయాత్ర, క్రిస్మస్కు 12 రోజులు, దీపావళికి 3 రోజులు. ఇవి కాకుండా ప్రతి మూడు నెలలకు కుదిరితే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటాను. నేనయినా.. ఇతరులైనా సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవడమే జీవితమంటే. సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని భూమ్మీదకు పంపించారు. ఎందుకంటే ఈ భూమి కూడా స్వర్గానికి ప్రతిరూపం. ఎలాంటి ఒత్తిడి జోలికి పోకుండా సంతోషంగా ఉండాలి’’ అని అక్షయ్ చెప్పారు. -
అది ఫేక్.. నిజం తెలుసుకొని రాయండి: మీడియాకు హీరో అక్షయ్ విజ్ఞప్తి!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐని వాడేస్తున్నారు. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ వీడియో, ఫోటోలను సృష్టించి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ తారల విషయంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ.. అవే నిజం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు సంబంధించి ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆయన వాల్మీకి మహార్షి పాత్రలో నటిస్తూన్నారంటూ.. ఐఏ సహాయంతో ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రైలర్గా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. ఈ వీడియో వైరల్ కావడంతో... చివరకు అక్షయ్ కుమారే స్పదించాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మొద్దు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.‘నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఓ సినిమా చేస్తున్నానంటూ ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఒకటి వైరల్ చేశారు. అలాంటి వాటిని నమ్మకండి. దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని వార్తా ఛానల్స్ కూడా ఆ వీడియోలు నిజం అనుకొని ఆ ప్రాజెక్ట్ గురించి వార్తలు రాసేశారు. కనీసం రాసేముందు అవి నిజమా, మార్ఫింగ్ చేసినవా అని చూసుకోలేదు. ప్రస్తుతం ఏఐ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అందరూ గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా’అని అక్షయ్ ఎక్స్లో రాసుకొచ్చారు. -
రణ్వీర్ సింగ్ విలన్గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్ను విలన్గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. -
'అతని నుంచి ప్రేరణ పొందా'.. ఫ్యాన్స్కు అమితాబ్ చిరు కానుకలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.అమితాబ్ తన ట్వీట్లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -17 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety .. A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could .. Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025 -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
ఖరీదైన కారు కొన్న సీనియర్ నటి.. ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్.