breaking news
Bollywood Actor
-
వెంటిలేటర్పై సీనియర్ నటుడు ధర్మేంద్ర.. స్పందించిన టీమ్!
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
అమ్మాయిలతో 100 కోడిగుడ్లు కొట్టించుకున్న స్టార్ హీరో!
కొంతమంది హీరోలు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీ అవుతుంటారు. రిస్కీ షాట్స్ సైతం డూప్ లేకుండా ట్రై చేస్తుంటారు. స్టంట్స్ విషయంలోనూ వెనకడుగు వేయరు. ప్రేక్షకులను అలరించడానికి ఎంత కష్టమైన భరిస్తారు. అలాంటి హీరోల్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా జీవించే గొప్ప నటుడు ఆయన. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికైనా రెడీ అవుతుంటాడు. ఓ సినిమాలోని పాట కోసం ఏకంగా 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడట. దుర్వాసనతో పాటు నొప్పి కలిగినా..ఒక్కమాట కూడా అనకుండా షూట్ అయ్యేవరకు అలాగే ఉండిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ చెప్పారు. ‘అంకితభావంతో పనిచేసే అతికొద్ది మంది హీరోల్లో అక్షయ్ ఒకరు. పాత్ర కోసం వందశాతం కష్టపడతాడు. ఆయనతో నేను దాదాపు 50 పాటల వరకు కొరియోగ్రాఫర్గా పనిచేశాను. ఎలాంటి కష్టమైన స్టెప్పులు ఇచ్చినా..ట్రై చేసేవాడు. స్టెప్స్ మార్చమని ఎప్పుడూ అడగలేదు. ‘ఖిలాడి’ చిత్రంలో ఓ పాట కోసం అక్షయ్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు. ఆ సీన్లో ఆయన చుట్టూ అమ్మాయిలు చేరి కోడిగుడ్లతో కొట్టాలి. ఈ విషయం చెప్పగానే వెంటనే చేసేద్దాం అని చెప్పాడు. అమ్మాయిలంతా కోడిగుడ్లని ఆయనపై విసిరేశారు. నొప్పి కలిగినా ఒక్క మాట కూడా అనలేదు. దుర్వాసన పోవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఒక్కరిని కూడా కోపగించుకోలేదు. స్టార్ హీరో అయినప్పటికీ.. చాలా సింపుల్గా ఉంటాడు. అక్షయ్లా కష్టపడే నటీనటులను నేను ఇప్పటివరకు చూడలేదు’ అని చిన్ని ప్రకాశ్ చెప్పకొచ్చాడు. అబ్బాస్, మస్తాన్ దర్శకత్వంలో అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖిలాడి’ చిత్రం 1992లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. -
బాలీవుడ్ బాద్షా లేటేస్ట్ యాక్షన్ మూవీ.. పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్
డంకీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన నెక్ట్స్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ షారూక్ బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ను రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే కింగ్(King Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ గ్లింప్స్ షారూక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. షారూక్ ఖాన్- సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన పఠాన్ సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. Sau deshon mein badnaam, Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal It’s Showtime!In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025 -
సల్మాన్పై పాక్ ఉగ్ర ముద్ర
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల సౌదీ అరేబి యాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర్నుంచి ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం–1997లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాదంతో సంబంధాలున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా పేర్కొనవచ్చు. ఈ చట్టం ప్రకారం సల్మాన్ను పాక్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీన బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను తాజాగా పాక్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన్ను స్వతంత్ర బలూచిస్తాన్ దోహదకారి (ఆజాద్ బలూస్తాన్ ఫెసిలిటేటర్)గా అందులో పేర్కొంది. దీని ప్రకారం ఆయనపై నిఘా, కదలికలపై నియంత్రణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. మధ్యప్రాచ్యం భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణపై చర్చించేందుకు జోయ్ ఫోరం–2025 అక్టోబర్ 17న రియాద్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడారు. ‘హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే సూపర్ హిట్టవడం ఖాయం. తమిళం, తెలుగు, మలయాళ సినిమాలతో ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా దేశాల వారు ఇక్కడ పని చేస్తున్నారు’అంటూ చేసిన ప్రసంగం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది. -
బాలీవుడ్ నటుడు సతీశ్ షా కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. చాలారోజులుగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. ముంబై బాంద్రా ఈస్ట్లోని స్వగృహంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రికి తరలించామని సతీశ్ షా మిత్రుడు అశోక్ పండిట్ చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం సతీశ్ షా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. సతీశ్ షాను బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని హిందూజా హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఆయనను మూడు నెలల క్రితం మూత్ర పిండాల మారి్పడి శస్త్రచికిత్స జరిగినట్లు మిత్రుడొకరు చెప్పారు. ఆదివారం సతీశ్ షా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాజోల్, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఆర్.మాధవన్ తదితరులు సతీశ్ షాతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హాస్యనటుడిగా విశేషమైన గుర్తింపు సతీశ్ షా 1951 జూన్ 25న జని్మంచారు. డిజైనర్ మధు షాను వివాహం చేసుకున్నారు. నటనపై ఆసక్తితో ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1978లో అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, 1979లో గామన్, 1981లో ఉమ్రావ్ జాన్ చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 1983లో విడుదలైన జానే భీ దో యారో చిత్రంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్గా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటారు. 1984లో ప్రసారమైన యే జో హై జిందగీలో 55 ఎపిసోడ్లలో 55 భిన్నమైన పాత్రలు పోషించారు. 2000 సంవత్సరంలో ప్రసారమైన సారాభాయ్ వర్సెస్ సారాభాయి సీరియల్ సతీశ్ షాకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచి్చపెట్టింది. ఇదే సీరియల్ 2017లో పునఃప్రసారమైంది. పలు బాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాల్లో సతీశ్ షా నటించారు. కబీ హా కబీ న, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, మై హూ నా, కల్ హో న హో, ఓం శాంతి ఓం, ఫనా, అఖేలే హమ్ అఖేలే తుమ్, హమ్ ఆప్కే హై కౌన్, ముజ్సే షాదీ కరోగీ, సాతియా, కహో నా ప్యార్ హై, జుడ్వా వంటి చిత్రాల్లో హాస్యరసం పండించి ప్రేక్షకులను అలరించారు. -
స్టార్ హీరోయిన్ బర్త్ డే.. విషెస్ చెప్పిన మాజీ ప్రియుడు!
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్తో అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్కు రిప్లై కూడా ఇచ్చింది. ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్లో అర్జున్ కపూర్ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్కు శుభాకాంక్షలు తెలిపింది.అర్జున్ కపూర్తో డేటింగ్..మలైకా అరోరా- అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్లో మాట్లాడిన అర్జున్ కపూర్.. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది సెప్టెంబర్లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్బౌండ్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.అర్బాజ్ ఖాన్తో పెళ్లి- విడాకులు..కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు. -
షోలే జైలర్
50 ఏళ్ల పాటు వెండితెరపై నవ్వులు పూయించిన ప్రసిద్ధ హాస్యనటుడు అస్రానీ (Asrani) దీపావళి రోజున తారాజువ్వలా ఎగిసి తారల్లో కలిసిపోయారు. ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘అభిమాన్ ’, ‘ఛోటీసీ బాత్’, ‘చుప్కే చుప్కే’... ఇలా అనేక సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు ప్రియమైనవి. ఇక ‘షోలే’లో వేసిన బ్రిటిష్ జమానేకే జైలర్ పాత్ర కోట్ల మందిని అలరిస్తూనే ఉంది. అస్రానీపై నివాళి కథనం.అస్రానీ జైపూర్లో పుట్టాడు. హిట్లర్ జర్మనీలో పుట్టాడు. ఇద్దరికీ లంకె ఉంది. ఒకసారి అస్రానీకి రచయిత జావేద్ అఖ్తర్ నుంచి పిలుపు వచ్చింది. ‘మంచి రోల్ ఉంది. చేయాలి. దానికి ముందు ఈ ఫొటోలు చూడు’ అని ఫొటోలు చూపించాడాయన.ఆ ఫొటోలు హిట్లర్వి. ఆ తర్వాత హిట్లర్ ఉపన్యాసాలు ఎక్కడి నుంచో తెప్పించి ‘వాటిని విను’ అని ఇచ్చాడు. అస్రానీ హిట్లర్ ఉపన్యాసాలు విన్నాడు. ‘ఈ ఉపన్యాసాలతో హిట్లర్ నరరూప రాక్షసుడు కాగలిగాడు. నువ్వు నవ్వుల రాజు కావాలి. హిట్లర్లా కనిపించి, తెలివైన మూర్ఖుడిలా వ్యహరిస్తూ కామెడీ పండించాలి. చేస్తావా’ అన్నాడు జావేద్ అఖ్తర్. ‘చేస్తాను’ అన్నారు అస్రానీ.ఆ వేషం జైలర్. ఆ సినిమా ‘షోలే’. ‘హమ్ బ్రిటిష్ జమానేకే జైలర్ హై’ (నేను బ్రిటిష్ కాలం నాటి జైలర్ను )... అనే ఈ డైలాగ్ 1975లో సినిమా రిలీజ్ అయితే 2025 వరకూ అస్రానీని బతికిస్తూనే ఉంది. ఆ రోల్ అంత హిట్. హిట్లర్లా కనిపిస్తూ, నిరంకుశుడైన జైలర్గా ఖైదీలను బెదిరిస్తూ, తానే పిరికిగా వణికిపోయే పాత్రలో అస్రానీ అద్భుతంగా జనానికి గుర్తుండిపోయాడు. నియంతలు పైకి భయానకంగా కనిపించే పిరికివారు.అస్రానీ ఆ పిరికితనాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని అద్భుతంగా పలికించగలిగాడు. జైలులో ఇతను ప్రతిదీ అనుమానించడం, దానికి విరుగుడుగా ధర్మేంద్ర, అమితాబ్ ఇతణ్ణి ఆటపట్టించడం, ఇతనికి గూఢచారిగా పని చేసే బార్బర్ కెస్టో ముఖర్జీ... ‘మైనే కహా అటెన్షన్’, ‘ఆధే ఉధర్ జావో.. ఆధే ఇధర్ జావో’.. అని అస్రానీ చెప్పే డైలాగులు సినిమాలో రిలీఫ్ ఇస్తూ జనాన్ని భారీగా ఎంటర్టైన్ చేశాయి. అస్రానీ డైలాగులు క్యాసెట్లుగా, రికార్డులుగా కూడా హిట్ అయ్యాయి.⇒ అస్రానీ అసలు పేరు గోవర్థన్ అస్రానీ (Govardhan Asrani). వాళ్లు సింధీలు. స్వస్థలం కరాచీ అయినా దేశవిభజన సమయంలో తండ్రి జైపూర్కు వచ్చి కార్పెట్ల కార్ఖానాలో పని చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అస్రానీ అక్కడే పుట్టి పెరిగాడు. కాని చదువు అబ్బలేదు. సినిమాల మీద ధ్యాస ఉండేది. ఆ పిచ్చితో మెట్రిక్ తర్వాత చదువు మానేసి జైపూర్ ఆల్ ఇండియా రేడియోలో తాత్కాలికంగా పని చేయడం మొదలుపెట్టాడు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదటి బ్యాచ్ విద్యార్థిగా 1964–66 మధ్య నటన నేర్చుకున్నాడు. ఆ సర్టిఫికెట్ పట్టుకుని ముంబై చేరి వేషాలు అడిగితే ‘సర్టిఫికెట్ చూపితే వేషాలు వస్తాయా’ అని అందరూ నవ్వేవారు.బతుకు చాలా కష్టమైంది అస్రానీకి. కొన్నాళ్లు జైపూర్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుకున్నాడో ఆ ఇన్స్టిట్యూట్లోనే పార్ట్టైమ్ టీచర్గా పని చేశాడు. అతని కింద జయభాదురి, శతృఘ్నసిన్హా, నవీన్ నిశ్చల్, డానీ... వీరంతా పాఠాలు నేర్చుకున్నవారే. ‘గుడ్డీ’ సినిమాలో హీరోయిన్ వేషానికి జయభాదురిని సెలెక్ట్ చేసేందుకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన హృషికేశ్ ముఖర్జీని అస్రానీ గట్టిగా పట్టుకున్నాడు. అలా ‘గుడ్డీ’లో వేషం దొరికింది. రిలీజయ్యాక అస్రానీ దశ తిరిగింది.⇒ 1970లు వచ్చేసరికి సీనియర్ కమెడియన్లు జానీ వాకర్, మహమూద్ మెల్లగా రిటైర్మెంట్కు చేరుకుంటున్నారు. కొత్త కమెడియన్లు కావాలి. ఆ సమయంలో అస్రానీ అందుకున్నాడు. అయితే వెకిలి హాస్యం, స్లాప్స్టిక్ కామెడీ చేయలేదు. తన గొంతు, ఎక్స్ప్రెషన్తోనే హాస్యం పండించగలిగాడు. హృషికేశ్ సినిమాల్లో అస్రానీ వేషాలు గట్టిగా పండాయి. ‘అభిమాన్’లో అమితాబ్ సెక్రట్రీగా పని చేస్తాడు అస్రానీ. ఒక దశలో గాయకుడైన అమితాబ్కు చాలా డబ్బు వచ్చేసరికి లెక్క చెబుతున్న అస్రానీకి ఒక కట్ట డబ్బు ఇచ్చి ‘నువ్వు ఉంచుకో’ అంటాడు అమితాబ్. అస్రానీకి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ‘అభిమానంతో నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. బిచ్చగాణ్ణి కాను’ అంటాడు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ సన్నివేశం.‘చుప్కేచుప్కే’లో ధర్మంద్ర ఫ్రెండ్గా నటిస్తాడు అస్రానీ. తన బావగారిని ఆటపట్టించడానికి డ్రైవర్ వేషంలో వచ్చిన ధర్మేంద్రకు తనూ తోడు నిలిచి అల్లరి సృష్టిస్తాడు. చుప్కేచుప్కే సినిమాలో అస్రానీ పాత్రకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. బాసూ చటర్జీ తీసిన ‘ఛోటిసీ బాత్’ లో అస్రానీ పాత్ర అందరికీ గుర్తే. తన చొరవతో, తెలివితో హీరోయిన్ విద్యా సిన్హాను ఎగరేసుకుపోదామనుకుంటాడు. కాని అమాయకమైన హృదయమున్న అమోల్ పాలేకర్ వైపే విద్య మొగ్గుతుంది. ఆమె లాంటి యువతిని పొందాలంటే తనలో రావలసిన మార్పు పొందేందుకు ట్రయినింగ్ కోసం అశోక్ కుమార్ దగ్గరకు అస్రానీ బయలుదేరడంతో ఆ సినిమా గిలిగింతలు పెడుతూ ముగుస్తుంది.⇒ అస్రానీ నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. గుజరాతీలో, హిందీలో ఆయన అరడజనుకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎప్పుడూ తనను తాను లైమ్లైట్లో ఉంచుకుంటూ నటిస్తూ వెళ్లాడాయన. కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. మరణించే వరకూ నటించాలని కోరుకుని అలాగే వీడ్కోలు తీసుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలకు స్నేహితుడిగా మసలిన అస్రానీ జనాన్ని 50 ఏళ్ల పాటు వారి నిత్య గొడవల నుంచి తప్పిస్తూ నవ్విస్తూ వచ్చాడు.ఇలాంటి నటుడు చనిపోతే పోయినందుకు బాధ పడాలో ఆ హాస్య సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకోవాలో తెలియని సందిగ్ధత ప్రేక్షకులది. హాస్యనటులకు మాత్రమే సాధ్యమైన ఇరకాటం ఇది.నిజమైన వికట నటులకు ఇదే కలికితురాయి.తెలుగు అనుబంధంఅస్రానీ 1980–90ల మధ్య కొంత స్ట్రగుల్ అయ్యాడు. యాక్షన్ సినిమాల రోజుల్లో అలాంటి నటులకు తగిన పాత్రలు దొరకలేదు. ఆ సమయంలోనే మన దాసరి, రాఘవేంద్రరావు, తాతినేని రామారావుల సినిమాల్లో నటించా డాయన. మహేశ్బాబు హీరోగా తొలి సినిమా ‘రాజకుమారుడు’లో బ్రహ్మానందంతో పాటు కనిపిస్తాడు. ‘సిరిసిరిమువ్వ’ హిందీ రీమేక్ ‘సర్గమ్’లో, ‘మరో చరిత్ర’ రీమేక్ ‘ఏక్ దూజే కే లియే’లో, ‘ఊరికి మొనగాడు’ రీమేక్ ‘హిమ్మత్వాలా’లో ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. అల్లు రామలింగయ్యకు అచ్చొచ్చిన చిత్రగుప్తుడి వేషాన్ని ‘యమలీల’ రీమేక్ ‘తక్దీర్వాలా’ లో ఆయన పోషించాడు. యముడిగా ఖాదర్ ఖాన్ నటించాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ కామెడీలు హిందీలో మొదలయ్యాక అస్రానీ మరోమారు విజృభించారు. ‘అచ్ఛా హువా మై అంధా హూ’ అని ఆయన చెప్పే డైలాగ్ మీమ్స్లో కనిపిస్తూనే ఉంటుంది. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
దీపావళి పండగ పూట బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అస్త్రాని(Govardhan Asrani ) మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.గోవర్ధన్ అస్రాని 1941లో జైపుర్లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలో జన్మించారు. తండ్రి కార్పెట్ షాప్ రన్ చేసేవాడు. ఫ్యామిలీ బిజినెస్పై అస్రానికి ఆసక్తి ఉండేది కాదు. చదువుతున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్గా పని చేశాడు. దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ‘హమ్ కహా జా రహే హై’(1966) చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘షోలే’లోని జైలర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. -
అభిషేక్ బచ్చన్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. హాజరు కాని ఐశ్వర్య రాయ్!
బాలీవుడ్ హీరో, బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్లో అవార్డ్ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్ అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.అభిషేక్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి' అని పంచుకున్నారు.(ఇది చదవండి: సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!)సతీమణి ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.."ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను బయటకు వెళ్లి నా కల నిజం చేసుకునే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి వారి త్యాగాలే కారణం. ఈ అవార్డును ఇద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు అంకితం చేయాలనుకుంటున్నా. నా తండ్రితో పాటు కుమార్తెకు అంకితం చేయాలనుకుంటున్నా." అని అన్నారు.ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ గైర్హాజరు..అయితే అభిషేక్ బచ్చన్ ఈ అవార్డ్ను తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, మేనకోడలు నవ్య నవేలి నందా సమక్షంలో అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు భార్య ఐశ్వర్య రాయ్ , కుమార్తె ఆరాధ్య హాజరు కాలేదు. కాగా.. గతంలో ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు పలుసార్లు జంటగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది. -
రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు. -
ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
నేనూ సెలవు తీసుకుంటా!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎప్పుడూ వరుస సినిమాలతో, క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉండే ఆయన కూడా సెలవులు తీసుకుంటారట. అది కూడా ఏడాదిలో 125 రోజులట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ‘‘మనందరికీ రోజుకి 24 గంటలుంటాయి. ఏడాదికి 365 రోజులే. అందరిలానే నేను కూడా సెలవులు తీసుకుంటా. అది కూడా దాదాపు 125 రోజులు. ఏడాదిలో 52 ఆదివారాలు, 40 రోజుల వేసవి విహారయాత్ర, క్రిస్మస్కు 12 రోజులు, దీపావళికి 3 రోజులు. ఇవి కాకుండా ప్రతి మూడు నెలలకు కుదిరితే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటాను. నేనయినా.. ఇతరులైనా సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవడమే జీవితమంటే. సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని భూమ్మీదకు పంపించారు. ఎందుకంటే ఈ భూమి కూడా స్వర్గానికి ప్రతిరూపం. ఎలాంటి ఒత్తిడి జోలికి పోకుండా సంతోషంగా ఉండాలి’’ అని అక్షయ్ చెప్పారు. -
అది ఫేక్.. నిజం తెలుసుకొని రాయండి: మీడియాకు హీరో అక్షయ్ విజ్ఞప్తి!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐని వాడేస్తున్నారు. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ వీడియో, ఫోటోలను సృష్టించి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ తారల విషయంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ.. అవే నిజం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు సంబంధించి ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆయన వాల్మీకి మహార్షి పాత్రలో నటిస్తూన్నారంటూ.. ఐఏ సహాయంతో ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రైలర్గా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. ఈ వీడియో వైరల్ కావడంతో... చివరకు అక్షయ్ కుమారే స్పదించాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మొద్దు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.‘నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఓ సినిమా చేస్తున్నానంటూ ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఒకటి వైరల్ చేశారు. అలాంటి వాటిని నమ్మకండి. దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని వార్తా ఛానల్స్ కూడా ఆ వీడియోలు నిజం అనుకొని ఆ ప్రాజెక్ట్ గురించి వార్తలు రాసేశారు. కనీసం రాసేముందు అవి నిజమా, మార్ఫింగ్ చేసినవా అని చూసుకోలేదు. ప్రస్తుతం ఏఐ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అందరూ గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా’అని అక్షయ్ ఎక్స్లో రాసుకొచ్చారు. -
రణ్వీర్ సింగ్ విలన్గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్ను విలన్గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. -
'అతని నుంచి ప్రేరణ పొందా'.. ఫ్యాన్స్కు అమితాబ్ చిరు కానుకలు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.అమితాబ్ తన ట్వీట్లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -17 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety .. A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could .. Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025 -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
ఖరీదైన కారు కొన్న సీనియర్ నటి.. ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్.


