-
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్గ్రేడబుల్ ఏటీఎం మెషీన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..!
ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెలలో వివిధ పండగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయినా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లేముందు ఏయే రోజుల్లో వాటికి సెలవులు ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 1: వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశమంతా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి. ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా సందర్భంగా తెలంగాణ, జమ్ముల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9: ఉగాది, తెలుగు సంవత్సరాది, గుడిపడ్వ, సాజిబు నాంగపంబా (చీరావుబా) తొలి నవరాత్రి సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 10: బొహగ్ బిహు, బైశాఖీ, బిజూ ఫెస్టివల్ సందర్భంగా త్రిపుర, అసోం, జమ్ముకశ్మీర్ల్లో బ్యాంకులు పని చేయవు. ఏప్రిల్ 15: బొహగ్ బిగు, హిమాచల్ దినోత్సవం సందర్భంగా అసోం, త్రిపుర, మణిపూర్, జమ్ముకశ్మీర్ల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 16: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 20: గరియా పూజ పండుగ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు! ఏప్రిల్ 13న రెండో శనివారం, 27న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఆదివారాలు కలుపుకుంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది 16 రోజులేనని గమనించాలి. -
‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’
బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్) పరిశ్రమ ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ)ను కోరింది. దాంతోపాటు రీట్స్ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. ప్రస్తుతం బాండ్ల జారీ లేదా బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం రీట్స్కు ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి లేదని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఐఆర్ఏలో 5 నమోదిత సంస్థలు ఉన్నాయి. ఐఆర్ఏకు ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఎంబసీ రీట్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరవింద్ మైయా మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. స్థిరాస్తి పరిశ్రమకు నిధులు భారీ స్థాయిలో కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం రీట్స్ను ‘హైబ్రిడ్’ పెట్టుబడి మార్గంగా వర్గీకరించారని, ఇది మదుపర్లను అయోమయానికి గురి చేస్తోందని బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలోక్ అగర్వాల్ వెల్లడించారు. రీట్స్ను ఈక్విటీలుగా వర్గీకరిస్తే.. ఇవి కూడా సూచీల్లో (ఇండెక్స్) చేరే వీలుండి, రీట్స్లోకి నిధుల రాక పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. భారత్ రీట్స్ నిబంధనల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్తో పాటు అమెరికాలో రీట్స్ను ఈక్విటీగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్లో రీట్స్ రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుతూనే ఉందని ఐఆర్ఏ తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement