breaking news
Mamitha Baiju
-
‘డ్యూడ్’ మూవీ 100 కోట్ల జర్నీ ఈవెంట్ (ఫొటోలు)
-
'డ్యూడ్'పై కేసు.. ఇళయరాజాకు కోర్టు అనుమతి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) డ్యూడ్ సినిమా యూనిట్పై దావా వేశారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Raganathan) హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తరెకెక్కించారు. అయితే, డ్యూడ్ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన 'పుదు నెల్లు పుధు నాతు' చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan song) పాటను ఉపయోగించారు. మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు పెళ్లి సమయంలో ఈ సాంగ్ రన్ అవుతుంది.ఏదైనా ఒక పాత సినిమాకు సంబంధించి డైలాగ్స్, పాటలు వంటివి రీక్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఈ మధ్య చాలామంది మేకర్స్ అనుమతి లేకుండా తీసుకోవడంతోనే ఇలాంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్యూడ్ మేకర్స్తో పాటు సోనీ మ్యూజిక్పై ఇళయరాజా దావా వేశారు. గతంలో కూడా అజిత్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఇళయరాజా దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, తాము అనుమతి తీసుకున్న తర్వాతే సాంగ్స్ను ఉపయోగించుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ అన్నారు. ఇప్పుడు డ్యూడ్ సినిమా పరంగా కూడా వారు మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్యూడ్ సినిమా విషయంలో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. -
సెంచరీకి చేరువలో డ్యూడ్.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్ వైడ్గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించగా.. ఆర్. శరత్కుమార్ కీలక పాత్రలో నటించారు. DUDE continues the festivities at the box office 💥💥✨#DUDE grosses over 95 CRORES in 5 days worldwide ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and… pic.twitter.com/Jo9f1ukrW8— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025 -
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
'డ్యూడ్' రివ్యూ.. ప్రదీప్కు హ్యాట్రిక్ విజయం దక్కిందా
టైటిల్: డ్యూడ్నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టినిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్సంగీతం: సాయి అభ్యంకర్సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిఎడిటర్: బరత్ విక్రమన్విడుదల తేది: అక్టోబర్ 17, 2025లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ఆయన నటించిన సినిమా డ్యూడ్ విడుదలైంది.. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి యూత్న్ టార్గెట్ చేస్తూనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా నటించగా.. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. డ్యూడ్ సినిమాతో మలయాళ నటుడు హృదు హరూన్ టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. గతంలో ఆయన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.కథ ఏంటి..?ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన మంత్రిగా ఆదికేశవులు (శరత్ కుమార్) ఉంటాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి. తన కులానికి చెందిన వాడినే అల్లుడిగా చేసుకోవాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తికి కుమార్తె కుందన (మమితా బైజు) ఉంటుంది. ఆమెకు మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఇద్దరి మధ్య చిన్నతనం నుంచే మంచి బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే గగన్ను కుందన ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం మరో అమ్మాయిని ఇష్టపడుతాడు. వారిద్దరి మధ్య బ్రేకప్ కాగానే కుందన తన ప్రేమ విషయాన్ని గగన్తో పంచుకుంటుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. దీంతో కుంగిపోయిన కుందన ఒంటరిగా ఉండేందుకు బెంగళూరు వెళ్లిపోతుంది. ఆమె దూరమే గగన్కు తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తుంది. అయితే, తన ప్రేమ విషయాన్ని మొదట తన మామ (శరత్ కుమార్)తో చెప్తాడు. సంతోషంగా పెళ్లికి ఒప్పుకొని ఏర్పాట్లు కూడా చేస్తాడు. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన కుందన తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అలా కుందన సడెన్గా నిర్ణయం మార్చుకోవడానికి ఉన్న కారణం ఏంటి.. గగన్- కుందన పెళ్లికి ఉన్న చిక్కులు ఎవరి వల్ల వచ్చాయి.. కుందన ఎలాంటి కారణాలు చెబుతుంది... ప్రియురాలి కోసం గగన్ చేసిన త్యాగం ఏంటి.. గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి (శరత్ కుమార్) అన్నాచెల్లెలు.. అయినప్పటికీ ఎందుకు మాట్లాడుకోరు.. ఫైనల్గా కుందనతో గగన్ పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే డ్యూడ్ చూడాల్సిందే.ఎలా ఉందంటే..?డ్యూడ్ సినిమా ప్రమోషన్లో ఈ కథకు స్ఫూర్తి అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రమేనని దర్శకుడు చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారనేది చిత్రం చూసిన తర్వాత తెలుస్తోంది. ఆర్య కాన్సెప్ట్నే డ్యూడ్లో చూపించారు. లవ్ ఫెయిల్ అయితే దేవదాస్లు కానక్కర్లేదు.. ప్రేయసి కోసం ప్రేమికుడిగా ఏం చేయవచ్చో డ్యూడ్ చెప్తాడు. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ, ఫుల్ ఫన్తో ఈ చిత్రం ఉంటుంది. కథ చాలా రొటీన్గా ఉన్నప్పటికీ తెరపై దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో కీర్తిశ్వరన్ విజయం సాధించాడు. కాన్సెప్ట్ అంతా పాతదే అయినప్పటికీ నేటి యూత్ కోసం కొత్తగా చూపించాడు. నిజమైన ప్రేమకు ఎమోషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ పాయింట్నే డ్యూడ్లో చూపించారు. డ్యూడ్ మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ ఆర్య-2 గుర్తకు వస్తుంది. అయితే, ఇక్కడ ఆ సీన్లు చాలా ఫ్రెష్గానే ఉంటాయి. ఈ మూవీలో డైలాగ్స్ చాలా చోట్ల యూత్తో విజిల్స్ వేపించేలా ఉంటాయి. అయితే. క్లైమాక్స్లో మినహా ఎక్కడా కూడా భావోద్వేగంతో కూడిన సీన్స్ కనిపించవ్.. కానీ, కుందన ప్రేమను గగన్ తిరస్కరించిన సమయంలో వచ్చే సీన్ ప్రతి ప్రేమికుడిని గుచ్చేస్తుంది. సినిమా ఎండింగ్ కూడా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..?డ్యూడ్కు ప్రధాన బలం ప్రదీప్ రంగనాథ్.. గత సినిమాల మాదరే ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు తన ఎక్స్ప్రెషన్స్తో దుమ్మురేపాడు. ఆ తర్వాత శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన కాస్త ఫన్నీగా కనిపించడమే కాకుండా అవసరమైన చోట సీరియస్గా కనిపించి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అయితే, మమితా బైజు వారిద్దరితో పోటీ పడుతూ నటించింది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే ఆమెకు దక్కిందని చెప్పవచ్చు. మలయాళ నటుడు హృదు హరూన్, రోహిణి తమ పరిదిమేరకు నటించారు. తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి కీర్తిశ్వరన్.. డ్యూడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మెప్పించాడని చెప్పవచ్చు. డ్యూడ్ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడిలో జోష్ నింపుతుంది. పైనల్గా పుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. యూత్న్ మాత్రం నిరాశపరచదని చెప్పవచ్చు. -
డ్యూడ్ X రివ్యూ: టాక్ ఎలా ఉందంటే?
లవ్టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన సినిమా డ్యూడ్ (Dude Movie X Review). కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం (అక్టోబర్ 17న) డ్యూడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ప్రదీప్ హిట్టు కొట్టాడా? మూవీకి ఏది ప్లస్ అయింది? ఏది మైనస్ అయిందని ఎక్స్ (ట్విటర్)లో నెటిజన్లు చర్చిస్తున్నారు. డ్యూడ్ చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫ్ పోయిందని చెప్తున్నారు. మరింకా ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయో కింద చూసేద్దాం.. మంచి సందేశంకీర్తిశ్వరన్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. ఇది అసలుసిసలైన జెన్ జెడ్ మూవీ. సాయి అభ్యంకర్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకు ప్రధాన బలం. హీరోహీరోయిన్లు వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మంచి సందేశాన్ని వినోదాత్మకంగా అందించారు అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. Dude - Winner 🏆 What a fabulous debut for @Keerthiswaran_ 💯👏 A proper Gen Z rom-com ❤️🔥 @SaiAbhyankkar BGM & songs are a major plus ✨ Both PR & Mamitha were perfect in their roles 🤩 Much needed social message said in the most entertaining way 🔥#Dude #DudeDiwali #DudeReview pic.twitter.com/SdCJTKqxWD— Alex (@callmeajas) October 17, 2025సెకండాఫే..ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ పోయింది. కథ నెమ్మదిగా మొదలై ప్రీ ఇంటర్వెల్కు వేగం పుంజుకుంటుంది. కానీ ఆ వేగం సెకండాఫ్లో ఎక్కడా కనిపించదు. సెకండాఫ్ను ఇంకాస్త బాగా ఎడిట్ చేయాల్సింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. #Dude A Mid Rom-Com with a Fairly Engaging First Half but a Lackluster Second Half!The film hits all the familiar beats of a typical rom-com. The first half starts off a bit slow but picks up well toward the pre-interval, ending with a well-executed interval block. However, the…— Venky Reviews (@venkyreviews) October 17, 2025సూపర్ ఎంటర్టైనర్డ్యూడ్తో ప్రదీప్ మళ్లీ అదరగొట్టాడు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. సంగీతం, విజువల్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించినా ఓవరాల్గా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉంది అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.Just watched #Dude 🎬🔥Pradeep strikes again with youthful energy & emotions!Fun, fresh & emotional ride!💥Pradeep & #MamithaBaiju chemistry 💯🎧 Music & visuals top-notch😅 Few scenes feel stretched, but overall super entertainer!⭐⭐⭐⭐☆ #DudeReview #PradeepRanganathan pic.twitter.com/NRwyKYDHhx— Dragon (@yours_dragon) October 17, 2025మిక్స్డ్ ఫీలింగ్డ్యూడ్ మూవీ చూశాక మిక్స్డ్ ఫీలింగ్ వస్తోంది. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. పర్ఫామెన్స్ అయితే బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Dude Might work / Might not....!!Mixed feeling after watching film, Performances are good, 1st half is Good, and 2nd half moves to the different pattern and completes with okayish watch. Might work for some people. Pradeep with performance 🔥OKAYISH ENTERTAINER 🌟🌟.5/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 17, 2025 #Dude - PR’s Style, his combo with Mamitha Nice. Sarathkumar shines in versatile role. Hridhu Gud addition. Music ok. Slow start, Interval block 20Mins ROFL. Final act could have been better. Though less emotional connect, Humour drives d narration to an extent. ONE TIME WATCH!— Christopher Kanagaraj (@Chrissuccess) October 17, 2025VERY GOOD first half. Right from the first scene, there’s entertainment and the screenplay is engaging. The chemistry of @pradeeponelife and @_mamithabaiju is EXCELLENT. The storyline is good, the moments are cute, emotions land and the music is great. If this holds for the… pic.twitter.com/IrbdKWSbNw— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025 First half is simply excellent #Dude 2nd half idey range lo untey good... https://t.co/YGO1ih1SCq— Ajayvinay (@Ajayvinay1) October 17, 2025#Dude is a partly engaging effort with fine performances but limited emotional resonance.written and directed by Keerthiswaran, #Dude is a modest romantic drama that blends light humor with emotional undertones. The film begins on a slow note but gradually finds its energy,…— Thyview (@Thyview) October 17, 2025#Dude 🌟🌟🌟 /5A very Pradeep Ranganathan coded film. The hidden conflict was a great strategic move. The first and second halves sit on completely opposite sides of the spectrum. Though predictable at times.#BiggBossTamil9 #Bisonpic.twitter.com/EMpTj7TGBQ— Cine News (@cinema_online2) October 17, 2025#Dude #Dudefirsthalf Neither good nor Bad .... Just ok !!!No story !! Routine scenes only music n bgm fresh 🔥🔥🔥🔥#SaiAbhyankkar killed it with BGM N songs..... @Chrissuccess @Karthikravivarm @itisprashanth— Movie Addict 😈 (@Madraspayen) October 17, 2025#Dude - 3.5/5🎯 Hat-trick hero! After Love Today and Dragon, #PradeepRanganathan delivers yet another blockbuster with #Dude! Three in a row — the young sensation is on fire! 🔥— Box Office (@Box_Office_BO) October 17, 2025 -
సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!
హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. తమిళంలో అవకాశాలుప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.తమిళం వచ్చేసిందిఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.చదవండి: ముచ్చటగా మూడోసారి! -
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్ను స్టేజీపై రివర్స్ రోల్స్లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్గా లేదమ్మా.. ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ SWAG ఈవెంట్ (ఫొటోలు)
-
డ్యూడ్లో అందమైన భావోద్వేగాలు ఉంటాయి
‘‘డ్యూడ్’ వైవిధ్యమైన ప్రేమకథ. అందమైన భావోద్వేగాలు ఉంటాయి. కీర్తీశ్వరన్గారు చెప్పిన కథకంటే 20 శాతం ఎక్కువగానే సినిమా తీశారు. మా మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ చెప్పిన విశేషాలు. → ‘డ్యూడ్’ యూత్తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. చాలా కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. ప్రదీప్గారి ‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలు తెలుగులో దాదాపు రూ. 12 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకున్నాయి. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ‘డ్యూడ్’ కచ్చితంగా రూ. 15 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నాం. → ‘డ్యూడ్’ని తమిళంలో ఏజీఎస్ సంస్థ ద్వారా తమిళంలో మేమే విడుదల చేస్తున్నాం. తమిళ్తో సమానంగా తెలుగులోనూ మా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది. → మేము హిందీలో తీసిన ‘జాట్’ మాకు మంచి వెంచర్. ‘జాట్ 2’ కూడా ఉంటుంది. ప్రభాస్గారితో, ఎన్టీఆర్గారితో మేం నిర్మిస్తున్న సినిమాలు 2026లోనే వస్తాయి. రామ్తో తీస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాగుంటుంది. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చ్ 27న కచ్చితంగా విడుదలవుతుంది. ఆ తర్వాత సుకుమార్గారితో సినిమా ఉంటుంది. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్లో చాలా హెల్ప్ ఫుల్గా ఉంటారు. శరత్ కుమార్గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
హీరో ప్రదీప్ డేంజర్ అన్న బ్యూటీ.. బిగ్బాస్ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్
బిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్బాస్ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్. తమిళ, కన్నడ, మలయాళ బిగ్బాస్ల హోస్ట్లతోనూ నాగ్ ముచ్చటించాడు. డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. ప్రదీప్ చాలా డేంజర్పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్లు హౌస్లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి -
హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు మరో మూవీతో వచ్చేస్తున్నాడు. అదే 'డ్యూడ్'. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్ కాగా కీర్తిశ్వరన్ దర్శకుడు. దీపావళి కానుకగా ఈనెల 17న మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)ప్రదీప్ స్వతహాగా దర్శకుడు. కానీ హీరోగా లవ్ టుడే, డ్రాగన్ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశాడు. 'డ్యూడ్' కూడా అదే జానర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అయితే ఈసారి కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్తో చెప్పకనే చెప్పారు. ప్రదీప్-మమిత ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి అనేసరికి మమిత నో చెప్పేస్తుంది. తర్వాత ప్రదీప్.. నేహాశెట్టితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్లో కథని చెప్పి చెప్పనట్లు చూపించారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 'డ్యూడ్'తో పాటు దీపావళికి తెలుగులో మిత్రమండలి, తెలుసు కదా, కె ర్యాంప్ మూవీస్ వస్తున్నాయి. వీటితో పోటీలో మరి 'డ్యూడ్' ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
డ్యూడ్ 'సింగారి చిన్నదాని' గురించి విన్నావా?
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ
ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయింది మమిత బైజు (Mamitha Baiju). ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్తో, దళపతి విజయ్తో సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటోందీ బ్యూటీ. నాకు పెద్దగా గుర్తింపు లభించని సమయంలో హీరో సూర్య సర్తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎగిరి గంతేశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఇప్పుడు సూర్య సర్తో ఓ సినిమా చేస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.అప్పుడు మిస్సయిన ఛాన్స్..బాలా డైరెక్ట్ చేసిన వణంగాన్ మూవీలో మొదట సూర్య, మమిత బైజును సెలక్ట్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. కానీ పలు కారణాల వల్ల సూర్య, మమిత బైజు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకుడు బాలా.. అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) చదవండి: ‘మారీశన్’ మూవీ రివ్యూ: ఒక్క సీన్ కూడా ఊహించలేరు! -
నాగార్జునతో మలయాళ యంగ్ బ్యూటీస్.. ఫొటో వైరల్
నాగార్జున.. రీసెంట్గానే 'కూలీ' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇన్నాళ్లు హీరోగా చేసిన నాగ్.. ఈ సినిమాలో విలన్గా కనిపించాడు. రైటింగ్ పరంగా ఈ పాత్రపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ నాగ్ లుక్స్ మాత్రం తెలుగు-తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. తమిళ యూత్ అయితే నాగ్ హెయిర్ స్టైల్ అనుకరిస్తూ తెగ రీల్స్ చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే నాగ్ క్రేజ్ ఇప్పటితరం హీరోయిన్లలోనూ గట్టిగానే ఉందండోయ్.సందర్భం ఏంటో తెలీదు గానీ మలయాళ యంగ్ హీరోయిన్లు అయిన మమిత బైజు, అనస్వర రాజన్, ప్రియ వారియర్, దీప్తి సతితో నాగ్ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్లామర్ విషయంలో ఈ బ్యూటీస్తో నాగ్ కలిసిపోయి యంగ్గా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. ఒకప్పటి తరం హీరోయిన్లతో చేసిన నాగ్.. 2010ల్లో అప్పటి క్రేజ్ హీరోయిన్లతోనూ సినిమాలు చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో చూస్తుంటే వీళ్లతోనూ మూవీస్ చేస్తాడేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సింగర్తో తిరుమలకు హీరో జయం రవి)నాగ్ జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తదితరుల సినిమాల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీపై అప్పుడప్పుడు ట్రోల్స్ లాంటివి కనిపిస్తుంటాయి కానీ నాగ్ విషయంలో మాత్రం అలాంటి కంప్లైంట్స్ పెద్దగా వినిపించవనే చెప్పొచ్చు. అదన్నమాట విషయం. త్వరలో తన 100వ సినిమా గురించి నాగ్ నుంచి ప్రకటన రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదలయ్యే బిగ్బాస్ 9వ సీజన్ కోసం నాగార్జున సిద్ధమైపోతున్నాడు. 3వ సీజన్ నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. ఈసారి కూడా హోస్ట్గా కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం బిగ్బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసేందుకు గేమ్ నడుస్తోంది. ఇది అయిపోయిన వెంటనే.. అసలు షో షురూ కానుంది. ఈసారి ఇమ్మాన్యుయేల్తో పాటు పలువురు టీవీ యాక్టర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన) -
స్టైలిష్ డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్’పాట లిరికల్ వీడియోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రదీప్, మమితా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్. -
డిష్యుం.. డిష్యుం
డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'ప్రేమలు' బ్యూటీ రెమ్యునరేషన్.. రేటు పెంచేసిందా?
హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు. మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. 'ప్రేమలు' బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది.మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు 'ప్రేమలు' మూవీతో హీరోయిన్ గా బ్రేక్ దొరికింది. అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'డ్యూడ్', దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది. (ఇదీ చదవండి: మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్) ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత.. ఇప్పుడు 'డ్యూడ్' కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటోందట. దళపతి విజయ్ తో చేస్తున్న జన నాయగణ్ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట.ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
'డ్రాగన్' హీరో.. 'ప్రేమలు' హీరోయిన్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషాభేదం లేకుండా పలు భాషల్లోనూ యాక్టర్స్ తెలుగులోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరేందుకు ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్ల కొత్త సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 'కోమలి' సినిమాతో దర్శకుడిగా మారిన ప్రదీప్ రంగనాథన్.. 'లవ్ టుడే' మూవీతో అటు దర్శకత్వం చేస్తూనే హీరోగా మారిపోయాడు. రీసెంట్ గా 'డ్రాగన్' మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇతడిని హీరోగా పెట్టి తెలుగు నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాని ప్రకటించారు. 'డ్యూడ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకాగ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేమలు' మూవీతో ఫేమ్ తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ మమిత బైజు.. డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా నటిస్తోంది. ఈ మేరకు వీళ్లిద్దరూ కలిసున్న లుక్ ని రిలీజ్ చేశారు. షర్ట్ లేకుండా ప్రదీప్ ఉండటం చూస్తుంటే ఇది కూడా కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) -
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
చీరలో అందమైన యువరాణిలా నిధి అగర్వాల్ఫొటోలతో మత్తెక్కించేస్తున్న ఆషికా రంగనాథ్నిషా కళ్లతో మాయ చేసేస్తున్న నేహాశెట్టిక్యూట్ రీల్ తో కిర్రాక్ అనిపించేలా మమిత బైజునాభి అందాలతో షాకిచ్చిన హీరోయిన్ వేదికమేకప్ వీడియో పోస్ట్ చేసిన శ్రుతి హాసన్హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ లో యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
ఆ పని చేయడం బాగా అలవాటైపోయింది: మమితా బైజు
ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju) గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తండ్రి బైజు కృష్ణన్– డాక్టర్. తల్లి హోమ్ మేకర్. మిథున్ అనే అన్నయ్య ఉన్నాడు. తన పదహారవ ఏట– ‘సర్వోపకారి పాలక్కారన్’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సైకాలజీ చదువుతూ, మధ్యలో ఆపేయడం వల్ల ఏమో.. కనబడ్డ ప్రతి ఒక్కరి సైకాలజీ స్టడీ చేయడం అలవాటైపోయింది తనకు.మలయాళంలోనే..తెలుగులో మమితా డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసస నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని, అవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. ‘ప్రేమలు’ సినిమాతో ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాని, మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో చేయడానికి ఇష్టపడటం లేదు మమితా. శ్రీలీల పాత్రలో..తమిళంలో విజయ్ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్’లో మమితా బైజు ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే కూతురిలాంటి పాత్ర. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’ రీమేక్ అంటున్నారు. తెలుగులో శ్రీలీల చేసిన పాత్ర తమిళంలో మమితా బైజు చేస్తోంది. మొదటి రోజు షూటింగ్లో విజయ్ని చూడగానే చాలా థ్రిల్ ఫీలయ్యానంటుంది మమితా. విజయ్ డైరెక్ట్గా తన దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని, ‘ఏమ్మా ఎలా ఉన్నావు’ అని పలకరించినప్పుడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని చెప్పింది. ప్రేమలు పారితోషికం ఎంతంటే?తన బ్యాగ్లో ఎప్పుడూ రంగు రంగుల మట్టి గాజులు , ఓ జత స్పేర్ డ్రెస్, చాక్లెట్లు ఉంటాయని చెప్పింది. రోజూ జిమ్ చేయడం అలవాటు. ‘హెలెన్’, ‘కప్పెలా’ మలయాళ సినిమాలతో పాపులర్ అయిన అన్నా బెన్ జిమ్ మేట్. ఇద్దరూ కలిసి వర్కవుట్స్ చేయడం ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్పింది. ‘ప్రేమలు’ సినిమాకి రూ. 30 లక్షలు ఇచ్చారు. సినిమా సూపర్ హిట్ కావడంతో తన పారితోషికం రూ. 50 లక్షలకు పెంచింది. వేరే లాంగ్వేజెస్కి వెళ్తే, ఇంకా పెరుగుతుంది కాని, మలయాళంలో కంఫర్ట్ లెవెల్ ఎక్కువ అంది. ఆ హీరోనే ఫేవరెట్యూత్కి ఫేవరెట్ క్రష్ అయిన మమితాకి మాత్రం హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి. తమిళ డైరెక్టర్ బాలతో ఓ సినిమా కమిట్ అయింది మమితా. కాని మధ్యలోనే సినిమా నుంచి బయటికి వచ్చింది. షూటింగ్లో బాల మమితాని బూతులు తిట్టి కొట్టాడని, అందుకే మానేసిందని వార్తలు వచ్చాయి. మమితా మాత్రం తన పర్సనల్ రీజన్స్ వలన ఆ సినిమా మానేసిందని చెప్పింది. తనని బాల కొట్టలేదని, అది మీడియా క్రియేషన్ అని కామెంట్ చేసింది. బాల మాత్రం మమితా తన కూతురులాంటిదని, తన డ్రెస్ సెన్స్ నచ్చక తీసేశానని చెప్పాడు.చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్. అంటోన్న ఖుష్బూ కూతురు -
సీనియర్ హీరోతో 'మమితా బైజూ' రొమాన్స్
కాలాల మాదిరి హీరోయిన్లకు ఒక సీజన్ ఉంటుందనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో మాదిరే కోలీవుడ్లో కూడా ఇప్పుడు యువ హీరోయిన్ల సీజన్ నడుస్తోందనే చెప్పవచ్చు. ప్రేమలు చిత్రానికి ముందు మమితా బైజూ(Mamitha Baiju) చిన్న చిన్న పాత్రల్లోనే నటించింది. ఆమె కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం ప్రేమలు చిత్రమే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్, టాలీవుడ్ల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు నాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినా, ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్కు జంటగా ఇరండు వానం చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా డ్రాగన్ చిత్ర హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు సమాచారం. కాగా తాజాగా ధనుష్తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్ మమితా బైజూను వరించినట్లు తెలిసింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కుబేర చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్రను పోషించగా, రష్మిక మందన్నా నాయకిగా నటించారు. ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీన్ని పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించినున్నారని, ఈ క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రాన్ని డా.ఐసరి గణేశ్ తన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకుడికి దీటుగా కథానాయకి పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు నటి మమితాబైజూను ఎంపిక చేసినట్లు ప్రచారం సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం -
ప్రదీప్ రంగనాథన్తో టాప్ బ్యానర్లో సినిమా.. ముగ్గురు హీరోయిన్లకు ఓకే
కోలీవుడ్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. బక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ. 150కోట్ల వరకు రాబట్టింది . కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్ రంగనాథన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'ఎల్కే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం. మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్, సీరియల్ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ!
ఒక్క సక్సెస్ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్కు జంటగా రెబల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. అలా రెండో అవకాశమే దళపతి విజయ్తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే. -
ప్రేమలు బ్యూటీ మమితా బైజు క్యూట్ లుక్స్..(ఫొటోలు)
-
లవ్ అని చెప్పు...
అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరోయిన్ని లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. నిజమెంత?
మలయాళ మూవీ‘ప్రేమలు’సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు(Mamitha Baiju). తెలుగులోనూ ఈ బ్యూటీకి ఫుల్ పాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడీయోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమలు తర్వాత ఈ బ్యూటీ ఆ స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు కానీ వరుస అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తమిళ్లోనూ హీరో సూర్య సరసన నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దర్శకుడు మమితను లాగిపెట్టి కొట్టాడని, దీంతో ఆమె ఆ సినిమా నుంచే తప్పుకుందనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.బాల చేతిలో దెబ్బలు?తమిళ దర్శకుడు బాల వణంగాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య హీరోగా, కృతిశెట్టి, మమిత హీరోయిన్లుగా నటించాల్సింది. కానీ కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కృతి, మమిత కూడా ఈ చిత్రం నుంచి వైదొలిగారు. అయితే సూర్య, కృతి శెట్టి ఎందుకు తప్పుకున్నారనే విషయం చెప్పకుండా సైలెంట్గా వారి పనిలో బిజీ అయిపోయారు. మమిత మాత్రం దర్శకుడు బాల తనను కొట్టాడని, అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత మమిత మాట మార్చింది. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పింది.నా కూతురు లాంటిది: బాలతాజాగా ఈ విషయంపై దర్శకుడు బాల కూడా స్పందించారు. మమితను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. షూటింగ్ సమయంలో ఓవర్ మేకప్ వేసుకొని వస్తేఏ.. ‘ఎందుకు మేకప్ వేసుకున్నావ్?’ అంటూ కొట్టేలా చేయి పైకిఎత్తేవాడినని..అంతేకాని ఆమెపై చేయి చేసుకోలేదని చెప్పారు. మమితా తనకు బిడ్డలాంటిదని..ఒక మహిళను నేను ఎందుకు కొడతాను ’ అని బాల అన్నారు. -
సమంత, సాయి పల్లవి బాటలోనే మమితా బైజూ
ఒక్క చాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన నటీనటులు కష్టపడి అవకాశాలు పొందుతారు. తరువాత ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ కోసం పరితపిస్తారు. అలా ఒక్క సక్సెస్ వస్తే చాలు దాన్ని పట్టుకుని పరుగులు తీస్తుంటారు. ఆ ఒక్క సక్సెస్ వారికి పెద్ద గుర్తింపుగా మారిపోతుంది. ఈ తరువాత ఫ్లాప్స్ వచ్చినా వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. హిట్ చిత్రం గురించే చెప్పుకుంటారు. అలా తెలుగులో సమంతకు ఏమాయ చేసావే చిత్రం కెరీర్లో పెద్ద హిట్గా నిలిచింది. అదేవిధంగా మలయాళంలో ప్రేమమ్ చిత్రం సాయిపల్లవికి చిరునామాగా మారింది. ఇలా చాలామందికి తొలి చిత్రం హిట్ పెద్ద ప్లస్గా మారుతుంది. దాంతోనే చాలా వరకు కాలాన్ని లాగించేస్తారు. తాజాగా మమితా బైజూ పరిస్థితి అంతే. ఈమె మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా మమితా బైజూకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంతే ఆ తరువాత ఇతర భాషల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఈమె తమిళంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ అనే ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరిచినా, ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన చివరి చిత్రంలో నటించే అవకాశాన్ని మమితా బైజూ కొట్టేసింది. ఇప్పుడు ఆ చిత్రంలో విజయ్తో దిగిన ఫొటోలను వాడుకుంటోంది. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ కేరళ కుట్టి మరో తమిళ చిత్ర అవకాశాన్ని దక్కించుకుందన్నది తాజా సమాచారం. యువ క్రేజీ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్తో జతకట్టే చాన్స్ను కొట్టేసిందని తెలుస్తోంది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఈ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగానూ, దర్శకుడిగానూ సూపర్హిట్ కొట్టారు. ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో పాటు డ్రాగన్ అనే మరో చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈయన నటించనున్న చిత్రంలో మమితా బైజూ నాయకిగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
హీరో జీవితంలో జరిగిన మిరాకిల్ ఆధారంగా 'డియర్ కృష్ణ'
అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'డియర్ కృష్ణ'. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజుతో పాటు ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ను ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం.రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తున్నాను. మా కుటుంబమంతా శ్రీ కృష్ణుడిని ఎంతగానో ఆరాధిస్తాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్నే కథగా తీసుకొని డియర్ కృష్ణ సినిమా రూపొందించాం. అదేంటంటే మా కుమారుడు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షయ్నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్ను తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు" అన్నారు.కథానాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, "మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేనీ రోజు మీ ముందున్నాను. దళపతి విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్లో ఆమె పాల్గొంటుంది" అన్నారు.గీత రచయిత గిరిపట్ల మాట్లాడుతూ.. " ఈ సినిమాలో మూడు పాటలు రాసే లభించింది. అందులో ఒక పాటను లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు. హరి ప్రసాద్ సంగీతం అందించగా, దినేష్ బాబు సినిమాటోగ్రాఫర్గా, రాజీవ్ రామచంద్రన్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమాలోనిదే కావడం విశేషం. 'చిరుప్రాయం' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ మామూలుగా లేరు!
మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం వచ్చేసింది. కేరళలో అందరూ వేడుకగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరీ మలయాళ బ్యూటీస్ ఊరుకుంటారా? పద్ధతైన చీరల్లో మెరిసిపోయారు. అందమే అసూయపడేలా ధగధగాలాడిపోయారు. అనుపమ, అమలాపాల్, కల్యాణి ప్రియదర్శన్, మాళవిక మోహనన్, హనీరోజ్, మమిత బైజు.. ఇలా అందరూ తమ అందంతో మాయ చేసేస్తున్నారు. ఆ ఫొటోలపై మీరు లుక్కేసేయండి.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Manjima Mohan (@manjimamohan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by @studio.omal View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by NAMITHA PRAMOD (@nami_tha_) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Sanjana Singh (@actresssanjana) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anjali Nair (@ianjali.nair) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Femina⚡️George (@feminageorge_) -
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్!
కాబోయే అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్ పెళ్లికూతురిలా ముస్తాబైన ప్రేమలు హీరోయిన్ బ్లూ శారీలో కీర్తి సురేశ్ హోయలు.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
విజయ్ 69వ చిత్రంలో మలయాళ బ్యూటీ?
నటుడు విజయ్ కథానాయకుడిగా వెంకట్ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెపె్టంబర్ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్.వినోద్ నటుడు కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్.వినోద్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్.వినోద్ ప్రారంభించారనీ నవంబర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్తో ఇటీవల ఫొటో సెషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్లుక్ పోస్టర్ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్తో కలిసి నటించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
విజయ్ చివరి సినిమాలో మలయాళ బ్యూటీకి ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- వెంకట్ప్రభు కాంబినేషన్లో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్.వినోద్ నటుడు కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్.వినోద్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్.వినోద్ ప్రారంభించారనీ నవంబర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్తో ఇటీవల ఫొటో సెషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్లుక్ పోస్టర్ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్తో కలిసి నటించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
విష్ణు విశాల్కు జంటగా.. 'మమిత బైజూ'
ఏ యాక్టర్కైనా బ్రేక్ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్ కుమార్కు జంటగా రెబల్ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్తో రొమాన్స్ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్ ప్రస్తుతం రామ్కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.దీంతో తాజాగా దర్శకుడు రామ్కుమార్, విష్ణు విశాల్ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట. -
'ప్రేమలు' బ్యూటీ బర్త్ డే స్పెషల్.. రేర్ అండ్ క్యూట్ ఫొటోలు
-
ప్రదీప్ రంగనాథన్తో ఆ ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్
ఏ రంగంలోనైనా లక్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సహాయ దర్శకుడిగా ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదుగానీ, దర్శకుడైన తరువాత ప్రదీప్ రంగనాథన్కు లక్ తేనె తుట్టులా పట్టుకుంది. ఈయన జయంరవి కథానాయకుడిగా నటించిన కోమాలి అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెండో చిత్రంతోనే కథానాయకుడిగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అంతే వరుసగా హీరో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎల్ఐసీ చిత్రం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం హోరేత్తుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం డ్రాగన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలోనే ఆయన సరసన ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారని తాజా సమాచారం. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్, మరొకరు మమితా బైజు అని తెలిసింది. వీరిద్దరూ ఇటీవల మంచి హిట్ కొట్టి మంచి జోరుమీద ఉన్నారన్నది గమనార్హం. అనుపమా పరమేశ్వరన్ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ చిత్ర సక్సెస్ జోష్లో ఉంటే మమితా బైజు మలయాళ చిత్రం ప్రేమలు చిత్ర హిట్ క్రేజ్లో ఉన్నారు. డ్రాగన్ చిత్రం కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ రెండో షె డ్యూల్ త్వరలో చైన్నె, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. -
'ప్రేమలు' హీరోయిన్కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!
'ప్రేమలు' సినిమాతో మనకు బాగా నచ్చేసిన మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటివరకు కేరళలో మాత్రం ఈమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. 'ప్రేమలు' తర్వాత దక్షిణాదిలో ఈమెకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా మమిత, చెన్నై వెళ్లగా ఈమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి పడేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మమిత బైజు.. 'ప్రేమలు' మూవీతో లీడ్ యాక్టర్గా ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ఓ జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అయితే ఊహించని విధంగా చాలామంది కుర్ర అభిమానులు అక్కడికి వచ్చేశారు. కనీసం షాప్ లోపలికి కూడా మమిత వెళ్లకుండా ఇబ్బంది పెట్టేశారు.ఎలాగైతేనేం బౌన్సర్ల సహాయంతో షాప్ లోపలికి మమిత వెళ్లింది. కానీ ఆమె మొహంలో ఇదెక్కడి అభిమానం రా బాబు అనే భయం మాత్రం కనిపించింది! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. కొన్నాళ్ల ముందు కాజల్ అగర్వాల్కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)'#Premalu' actress #MamithaBaiju mobbed at Chennai mall. pic.twitter.com/3TJMxHLwRL— Films Spicy (@Films_Spicy) June 3, 2024Craze for #MamithaBaiju 💥🥰 pic.twitter.com/GxoPfcqKPM— VCD (@VCDtweets) June 2, 2024 -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజూ'కు మరో ఛాన్స్
ఏ రంగంలోనైనా విజయమే కొలమానం. అది లేకపోతే ప్రతిభ ఉంత ఉన్నా శూన్యమే. అందుకే ఒక్క హిట్ కోసం పోరాటం చేస్తుంటారు. అలా మాలీవుడ్ యువ నటి మమితా బైజూ కోలీవుడ్ దృష్టిని తనపై తిప్పుకుంటోందనే చెప్పాలి. కేరళా కుట్టి తన 15వ ఏటనే నటిగా రంగప్రవేశం చేసింది. అంటే 2017 ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం సర్పోపరి పాలక్కారన్. ఆ చిత్రం సక్సెస్తో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా ఇటీవల ఆమె నటించిన 'ప్రేమలు' చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ అనువాదం అయ్యి సూపర్హిట్ అయ్యింది. ముఖ్యంగా 22 ఏళ్ల పరువాల బ్యూటీ మమితా బైజూ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈమె పై కోలీవుడ్ దృష్టి పడింది. అలా రెబల్ చిత్రంతో ఒక్కడ పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితాబైజూకి అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా మరో లక్కీ ఛాన్స్ను ఈ కేరళా కుట్టి కొట్టేసిందని సమాచారం. ఈమె యువ నటుడు , దర్శకుడు ప్రదీప్ రంగనాథన్తో రొమాన్స్కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాధన్, లవ్టుడే చిత్రంతో హీరోగానూ రంగప్రవేశం చేసి సూపర్హిట్ కొట్టారు. ప్రస్తుతం ఈయన ఎల్ఐసీ, డ్రాగన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి మమితా బైజూ నటించడానికి ఎంపిక అయినట్లు సమాచారం. దీనికి దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాల సమాచారం. -
ప్రేమలు హీరోయిన్ మమితా బైజు క్యూట్ పిక్స్
-
చీరలో 'ప్రేమలు' మమిత అలా.. ముక్కెరతో సుప్రీత ఇలా!
కాటన్ చీరలో 'ప్రేమలు' బ్యూటీ మమిత గ్లామర్ టచ్అందాల విందుతో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్కొంగు చాటు పోజుల్లో బిగ్ బాస్ భామ రతికా రోజ్నవ్వుతూ మాయలో పడేస్తున్న హాట్ బ్యూటీ సుప్రీతచీరకట్టులో మహాలక్ష్మిలా కనిపిస్తున్న బిగ్ బాస్ ప్రియాంకగ్లామర్ ట్రీట్ ఇచ్చిన రాగిణి ద్వివేది.. చూస్తే మెంటలే View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Karishma Kotak (@karishmakotak26) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by ESSHANYA S MAHESHWARI (@esshanya_s_maheshwari) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Pragya Nayan Sinha (@pragyanayans) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Sanchana Natarajan (@sanchana.natarajan) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Tarun Koliyot (@tarunkoliyot) -
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
-
ప్రేమలు బ్యూటీ అసలు పేరేంటో తెలుసా? చిన్న పొరపాటు..
మమితా బైజు.. ఇప్పటివరకు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్లో ఒక్కసారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమలుతోనే! ఇప్పటివరకు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ప్రేమలు మూవీతో వచ్చింది. ప్రస్తుతం రెబల్ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది. అసలు పేరు అది కాదు!తెలుగులోనూ అవకాశాలు తలుపుతడుతున్నాయి. అయితే ఈమె అసలు పేరు మమిత కాదట.. నమిత! హాస్పిటల్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్లో ఎన్ అనే అక్షరానికి బదులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో నమిత కాస్త మమిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్నసలు చూసుకోనేలేదు.ఒక్క అక్షరంబడిలో చేర్పించే సమయంలో మమిత అని పడిందని గమనించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉందని అలాగే ఉంచేశారు. మమిత అంటే మలయాళంలో మిఠాయి అని అర్థం. ఈ విషయాన్ని ప్రేమలు బ్యూటీయే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక్క పొరపాటుతో తన జాతకమే మారిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారుచదవండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్ -
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
అఫీషియల్: 'ప్రేమలు' సీక్వెల్.. రిలీజ్ కూడా చెప్పేశారు
సంక్రాంతి తర్వాత అన్ని సినీ ఇండస్ట్రీల్లో డల్ ఫేజ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, జనాల్ని మెప్పించే చిత్రాలు సరిగా రావట్లేదు. కానీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. అన్ సీజన్ ఫిబ్రవరిలోనే ఏకంగా నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటే 'ప్రేమలు'. మలయాళంతో పాటు తెలుగులోనూ యువతని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ చేశారు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) అవును మీరు విన్నది నిజమే. పెద్దగా కథ కాకరకాయ లాంటిది ఏం లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఫన్ ఎలిమెంట్స్ జోడించడంతో 'ప్రేమలు'.. మలయాళంలో పెద్ద హిట్టయిపోయింది. తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సినిమాలో కథంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడం ప్లస్ ట్రెండ్కి తగ్గ డైలాగ్స్ అన్నీ ఉండటం మనోళ్లకు నచ్చేసింది. అయితే కొందరు తెలుగు ఆడియెన్స్కి మాత్రం ఇది పెద్దగా నచ్చలేదు. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2025లో రిలీజ్ ఉంటుందని కూడా చెప్పేసింది. తొలి భాగంలా కాకుండా ఈసారి తెలుగు, తమిళ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పోస్టర్స్ తో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే తొలి భాగం.. హీరో పాత్రధారి యూకే వెళ్లడంతో ముగుస్తుంది. మరి సీక్వెల్ స్టోరీ యూకేలో ఉంటుందా? మళ్లీ హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది చూాడాలి. అలానే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా అని త్వరగా సీక్వెల్ తీసేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి? (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) View this post on Instagram A post shared by Dileesh Pothan (@dileeshpothan) -
సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత కోలీవుడ్లో ఈ బ్యూటీ నటించిన రెబల్ మార్చి 22న విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను తమిళ్లో నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'రెబల్' చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్కుమార్కు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమళ్, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ఫర్వాలేదు అనిపించింది. ఈ వీకెండ్లో మంచి టైమ్పాస్ కలిగించే సినిమాగా రెబల్ ఉంటుందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Studio Green (@studiogreen_official) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చే విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా నస్లేన్ కె.గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఎ.డి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 135 కోట్ల మార్క్ను చేరుకుంది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.17 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ 12 నుంచి ఈ చిత్రం హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్ షాక్
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్లో నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్కుమార్కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. -
ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్.. పారితోషికం పెంచేసిన బ్యూటీ!
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఈ తరం తారలు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. మలయాళ భామ మమితా బైజు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ 22 ఏళ్ల బ్యూటీ క్రేజ్ దక్షిణాది మొత్తం వ్యాపిస్తోంది. 2017లో నటిగా రంగప్రవేశం చేయగా.. ఈమె నటించిన కోకో, సూపర్ శరణ్య వంటి మలయాళ చిత్రాలు విజయం సాధించాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన ప్రేమలు మూవీ మలయాళంలోనే కాకుండా, తమిళం, తెలుగు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఆ సినిమా నుంచి అవుట్ కాగా ఆ మధ్య బాలా దర్శకత్వంలో సూర్యకు జంటగా వణంగాన్ చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యింది. అయితే అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తర్వాత మమితా బైజు కూడా ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. దర్శకుడు బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని ఆరోపణలు చేసింది. ఈ సంఘటన కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇది తన కెరీర్పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని భయపడిందో ఏమోకానీ వెంటనే మాట మార్చేసింది. దర్శకుడు బాలా ఎప్పుడూ కొట్టలేదని, ఆయన దర్శకత్వంలో నటించిన సమయంలో చాలా నేర్చుకున్నానని, ఇతర చిత్రాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి తప్పుకోవలసి వచ్చిందని కవర్ చేసింది. క్రేజీ హీరోయిన్గా.. ప్రస్తుతం ఈమె జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి రానుంది. తదుపరి నటుడు విష్ణువిశాల్కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రేమలు మూవీ తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో మమితా బైజు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా మారనున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుంటోంది బ్యూటీ. మరిన్ని అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని పెంచేసినట్లు టాక్. ఇప్పటివరకు ఒక్క సినిమాకు రూ. 30 లక్షలు పుచ్చుకుందట. దాన్ని కాస్తా రూ.50 లక్షలు చేసిందని ప్రచారం నడుస్తోంది. చదవండి: తమన్నా..పెళ్లెప్పుడో? -
అరె.. ఏంట్రా ఇదీ.. మరీ ఓవర్గా లేదూ..!
ఈ మధ్య జనాలకు పిచ్చి ముదురుతోంది. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రేమలు అనే మూవీ మలయాళంలో సూపర్ హిట్గా నిలిచింది. ఇంకేముంది.. ఈ చిత్రాన్ని వెంటనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన లభించింది. సినిమా క్లిక్ అవడంతో హీరోయిన్ మమిత బైజుకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తుండగా మరో సినిమాకు ఓకే చెప్పేసిందట! ఇకపోతే హైదరాబాద్లో జరిగిన ప్రేమలు సక్సెస్మీట్లో ఓ మీమర్ అతి చేశాడు. సినిమా చూసి పెద్ద అభిమాని అయిపోయానంటూ స్టేజీపైనే మమితకు హారతి ఇచ్చాడు. ఈ రకమైన అభిమానం తొలిసారి చూస్తున్నానంటూ నవ్వేసింది హీరోయిన్. అయితే ఇది చూసిన జనాలు మాత్రం.. కాస్త కాదు.. చాలా అతిగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఒక్క సినిమాకే గుండెలో గుడి కట్టేశావా? పైగా హారతి కూడా రెడీ చేసుకున్నావంటే ముందే అంతా ప్లాన్ చేసుకున్నట్లేగా.. ఎందుకింత ఓవరాక్షనో.. మరీ జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు.. ఫేమస్ అవడానికి ఇలాంటి డ్రామాలు చేయడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కొందరు మాత్రం మా హీరోయిన్ ఎంత క్యూట్గా నవ్వుతుందో.. ఇంతటి గ్రాండ్ వెల్కమ్ మరెవరికీ దక్కలేదని మురిసిపోతున్నారు మమిత ఫ్యాన్స్. Direct ga "Aarathi" ivvatam entraaa🤣❤️🔥#MamithaBaiju craze😍🔥 pic.twitter.com/5OAtrOlJz8 — Anchor_Karthik (@Karthikk_7) March 15, 2024 చదవండి: జీవితం ఎటు పోతోందో.. హృదయం ముక్కలయ్యాక.. -
రాజమౌళి మెచ్చిన నటి మమితా బైజు గురించి ఈ విషయాలు తెలుసా?
-
మరో ఆఫర్ అందుకున్న మలయాళ సెన్సేషన్
కోలీవుడ్లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్కుమార్.. విష్ణువిశాల్తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్లో జీవీ.ప్రకాశ్కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు -
బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి
పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్కి రెడీ) 'కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా చాలా బాగా నటిస్తారు. అలానే ఈ సినిమాలో చేసిన నస్లెన్, మమిత, శ్యామ్ మోహన్, సంగీత ప్రతాప్.. తమ యాక్టింగ్తో అదరగొట్టేశారు. మేం యాక్షన్ సీన్స్తో చాలా కష్టపడుతుంటాం. కానీ వీళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో థియేటర్లలో విజిల్స్ అందుకుంటున్నారు. హీరోయిన్ మమిత అయితే.. 'గీతాంజలి'లో గిరిజ, ఆ తర్వాత వచ్చిన సాయిపల్లవిని గుర్తు చేసింది' అని రాజమౌళి అన్నారు. ఈ సినిమాని తెలుగులో ఎంత తన కొడుకు కార్తికేయ రిలీజ్ చేసినా సరే రాజమౌళి నుంచి ఈ రేంజు ప్రశంసలు వస్తాయని మాత్రం 'ప్రేమలు' టీమ్ ఊహించి ఉండరు. అలానే రాజమౌళి కామెంట్స్తో మలయాళ యాక్టర్స్ కూడా గాల్లో తేలుతూ ఉంటారేమో. అయితే యాక్టింగ్ పరంగా మలయాళీస్ బెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఆడియెన్స్ పరంగా తెలుగోళ్లని కొట్టేవాళ్లు ప్రపంచంలోనే లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 'లవర్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
సూపర్స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన సినిమా 'ప్రేమలు'. గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత) Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!! — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024 -
'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్కి రెడీ
'ప్రేమలు' అనే సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన మమిత బైజు.. ఇదే మూవీ డబ్బింగ్ వెర్షన్తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మాయలో పడేసింది. ఈమె హీరోయిన్గా నటించిన తమిళ సినిమా 'రెబల్'. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ హీరో. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. నికేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తమిళం గురించి బలంగా చెప్పే చిత్రం ఇది అని, దర్శకుడు నికేశ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకున్నాడని, అలా తీసిన సినిమానే 'రెబల్' అని హీరో జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజూ చాలా చక్కగా నటించిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) -
'ప్రేమలు' సినిమా రివ్యూ
సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. వచ్చిన వాటిలో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి గానీ మరీ అంత హిట్ కాలేదు. మరోవైపు మలయాళంలో రీసెంట్గా వరసపెట్టి మూవీస్ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందులో ఒకటే 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన ఈ మలయాళ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. కథేంటి? సచిన్(నస్లేన్) ఇంజనీరింగ్ పూర్తిచేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది ప్లాన్. వీసా రిజెక్ట్ అవ్వడంతో, ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్(GATE) కోచింగ్ కోసం హైదరాబాద్కి వస్తారు. ఓ పెళ్ళిలో రీను(మమిత బైజు)ని చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమకథ కంచికి చేరిందా? చివరకు ఏమైందనేదే 'ప్రేమలు' స్టోరీ. ఎలా ఉంది? ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును ఈ మూవీలో కథ గిదా ఏం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాప్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి.. అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ లవ్లో పడితే ఏమైందనేదే 'ప్రేమలు'. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్టు వుంటది గానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. తెలిసిన కథల్ని, అదీ ప్రేమ కథల్ని చెప్పడం కత్తి మీద సాము. కానీ 'ప్రేమలు' డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్తో ఆడియెన్స్ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్, రీనూ పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత లేత ప్రేమ.. వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలకు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, ఖజాగుడా లేక్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు. తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి.. ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతీ డైలాగ్ని వాడేశారు. వన్ లైనర్స్, పంచ్లు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్టు వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథ కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చదు. అలానే రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చే చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. 'ప్రేమలు' మైనస్సుల విషయానికొస్తే.. ఇది యూత్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్కి స్పేస్ లేదు. తెలుగు వెర్షన్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో ఒకటి రెండు సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్తో అయినా సింగిల్గా అయినా రెండున్నర గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ 'ప్రేమలు'. ఎవరెలా చేశారు? సచిన్ పాత్రలో నస్లేన్.. చాలా బాగా చేశాడు. అమాయకత్వం, ప్రేమ, బిడియం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్ని పండించాడు. రీనుగా చేసిన మమిత అయితే చాలా క్యూట్నెస్తో తనతో ప్రేమలో పడిపోయేలా చేసింది. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్గా చేసిన సంగీత్ ప్రతాప్ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరోయిన్ ని ప్రేమిస్తూ, ఆమెతో పాటు కలిసి పనిచేసే ఆది పాత్రలో చేసిన శ్యామ్ మోహన్.. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కామెడీతో కేక పుట్టించాడు. మిగతా వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే ఫస్ట్ డైరెక్టర్ గిరీష్ని మెచ్చుకోవాలి. క్యూట్ క్యూట్ ప్రేమకథను అంతే క్యూట్గా తీశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే అక్కడే ఉంటాయి. కానీ హైదరాబాద్ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ అజ్మల్ సభు.. హైదరాబాద్ని రోజూ చూసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత అందంగా చూపించాడు. విష్ణు విజయ్ పాటలు కథలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్లే ఉంది. ఓవరాల్గా చెప్పుకుంటే 'ప్రేమలు'.. మీ మనసు దోచే పెర్ఫెక్ట్ సినిమా. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
హీరోయిన్పై చేయి చేసుకున్న డైరెక్టర్.. క్లారిటీ ఇదే!
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు. (ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్) అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది. -
Mamitha Baiju: డైరెక్టర్ చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్ (ఫోటోలు)
-
డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్
మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్. ఎక్స్పర్ట్లా యాక్ట్ చేయాలి.. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను. కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు.. కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్ తిట్టాడు. అయితే సెట్లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా! తిట్టడమే కాదు కొట్టాడు కూడా! హీరో సూర్య సర్కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది.


