
డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు.