kalvakuntla kavita
-
కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. కేసీఆర్కు నోటీసులిస్తారా?
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: తెలంగాణ సస్యశ్యామలం కావాలని 16 టీఎంసీల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును 141 టీఎంసీలకు పెంచినందుకా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచి్చనట్టేనని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్తో నోటీసులు జారీ చేయించిన కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ కాదు..అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్పై మాకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాగృతి కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కేసీఆర్ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని, 90 శాతం పంప్హౌస్ల పనులు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్హౌస్లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జలదోపిడీ చేసినా బీజేపీ ప్రశ్నించడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని, తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. -
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది నా వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతానని అన్నారు. పార్టీని బీజేపీలో కలుపుతానంటే నేను ఒప్పుకోను. లెటర్ రాయడంలో నా తప్పేమీ లేదు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు. -
'కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్': ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్.. మీద దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని అన్నారు.కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని కవిత అన్నారు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. ఎన్ని కమిషన్లను ఏర్పాటు చేసినా కాలక్రమంలో తప్పకుండా న్యాయం గెలుస్తుందని అన్నారు. నిజాలన్నీ బయటకు వస్తాయి.. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.కాళేశ్వరం కమిషన్ నోటీసులుకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. -
బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం(జనవరి26) జరిగిన సెమినార్లో కవిత మాట్లాడారు.‘నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా.ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి.కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు... ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు’అని కవిత ఫైరయ్యారు.కాగా, శనివారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మ పెడితే కేంద్రం నుంచి ఇళ్లు ఇవ్వమని, ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి: బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
పార్టీ మారిన నేతలు.. అసెంబ్లీలో ఏ ముఖంతో మాట్లాడతారు: కవిత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
ఫామ్హౌజ్లో కేసీఆర్ చండీ యాగం
సాక్షి,సిద్దిపేటజిల్లా: గజ్వేల్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి శుక్రవారం(సెప్టెంబర్6)10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభించారు. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనున్నారని సమాచారం.రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కేసీఆర్ కూతురు, కల్వకుంట్ల కవిత ఐదు నెలలు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉండి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. -
కవిత కేసు వాదించిన లాయర్ ఎవరు?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ సర్కార్ లేకపోతే కాంగ్రెస్ దేశాన్ని ఏడు ముక్కలు చేసేదని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ప్రతీ ఒక్కరినీ బీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ పార్టీలో కొత్త తరం రావాలి. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యం కావాలి. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఎంఐఎపీ లేకుండా చేయాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలి. బీజేపీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ ఏడు ముక్కలు చేసేది. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యం. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగింది. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుంది. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. సభ్యత్వ నమోదు చేసిన వారికే భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ బీఆర్ఎస్ మరిచిపోయింది. కాంగ్రెస్కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీలే. బీఆర్ఎస్కు గుర్తుకు వచ్చేది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అంటూ సెటైర్లు వేశారు.కవితకు బెయిల్ రావడం బీజేపీకి ఏం సంబంధం?. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే. వ్యక్తులు చెబితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా?. న్యాయస్థానాలను అగౌరవపరచవద్దు. కవిత బెయిల్ కోసం వాదించింది అభిషేక్ సింఘ్వీ. ఆయననే ఎందుకు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది?. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయం. బీజేపీ కొట్లడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
లిక్కర్ కేసు: సీఎం కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం వెల్లడించింది.వీరిద్దరికి గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్, కవితను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఆమె తిహార్ జైల్లో శిక్షననుభవిస్తున్నారు. -
కవితకు దక్కని ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దర్యాప్తు సంస్థల వాదన విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ కేవీ.విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కవిత ఐదునెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసిన సుమారు 500 మంది సాక్షుల్ని విచారించారన్నారు. ఈ కేసు కూడా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరుల కేసులాంటిదేనని వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. కవిత మహిళ కావడంతో పీఎంఎల్ఏ సెక్షన్ 45 ఇచ్చే మినహాయింపు వర్తిస్తుందని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ధర్మాసనం కొద్దిసేపు చర్చించుకొని ఈ కేసు పరిశీలిస్తాం అని చెప్పింది. కవిత విద్యావంతురాలు, రాజకీయ నాయకురాలు అని జస్టిస్ బీఆర్. గవాయి వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ అయినంత మాత్రాన పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళకు రక్షణ కల్పించడానికి వీలు లేదనడం సరికాదన్నారు. ‘కవిత సాధారణ మహిళ కాదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది కదా’అని జస్టిస్ బీఆర్.గవాయి స్పష్టం చేశారు. ఈ వర్గానికి చెందినవారు, ఆ వర్గానికి చెందిన వారు అని వాస్తవంగా ఎలా వ్యాఖ్యానించగలుగుతామని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. దీంతో ప్రతివాదులైన దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రోహత్గి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థల వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20కు వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం(ఆగష్టు 12) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరిస్తూ.. న్యాయస్థానాలు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులోనే ఆప్ నేత మనీష్ సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 17 నెలల జైలు జీవితం అనంతరం నేడు సాయంత్రం తిహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో నేత సత్యేంద్ర జైన్ ఇంకా జైలులోనే ఉన్నారు. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీబీఐ కేసులో తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే24 వాయిదా వేసింది.కాగా ఇప్పటికే లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ల విచారణను మే 24న చేపట్టనుంది. ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక మద్యం పాలసీకి సంబంధించి ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్11న కవిత అరెస్ట్ అయ్యారు. -
సీబీఐ కస్టడీలో కవిత.. డే-1 ఇంటరాగేషన్
Updates ► సీబీఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. రూమ్ నంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ► సీబీఐ కస్టడీలో ఉన్న కవిత ఇంటరాగేషన్ సీబీఐ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. ► మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, సభ్యులకు అనుమతి ఉంది. కవిత భర్త అనిల్, కేటీఆర్, పీఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఉంది. ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అనూహ్యరీతిలో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ(శనివారం) తొలిరోజు కవిత ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. సాక్ష్యాలను ముందు పెట్టి సీబీఐ అధికారులు కవితను విచారణ చేయనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు-కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జగరనున్నట్లు తెలుస్తోంది. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక.. నిన్న( శుక్రవారం) కవితను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈనెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్లో కవిత విచారణ జరగనుంది. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటిభోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది. కవిత రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ విషయాలు కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80లక్షల ముడుపులు చెల్లించారు. డబ్బులకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు సీబీఐ పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80లక్షలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారన్న సిబిఐ. మహబూబ్నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనన్న శరత్ చంద్రారెడ్డి. రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఒక్కో రిటైల్ జోన్ కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారన్నసీబీఐ. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే రూ.100కోట్లు చెల్లించారు. ఇండో స్పిరిట్లో 65శాతం వాటా పొందారు. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు. ఈ విషయాలన్నింటి పైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సీబీఐ పేర్కొంది. అందుకే ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. కవిత అరెస్టు అక్రమం.. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ‘కవిత అరెస్టు అక్రమం. కవితను కస్టడీలో ఉంచాలనేది సీబీఐ ధ్యేయంగా కనబడుతోంది. కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. జాతీయ రాజకీయ పార్టీలో కవిత మాస్ లీడర్. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అరెస్ట్ చేయడమనేది కీలకం. కవిత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారు’అని అన్నారు. -
Liquor Case : కవిత బెయిల్పై ఏప్రిల్ 8న తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్పై తీర్పు వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలను ఏప్రిల్ 20కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ మను వాదనలు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కవిత కొడుకు పరీక్షల భయం ఉంది అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత హక్కు పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను ప్రస్తావించారు. తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుంది ఒక మహిళగా కవితకు ఉన్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలి కవితకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలను ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ న్యాయమూర్తికి చూపించారు. అనంతరం వాదనలు వినిపించారు కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్షాలను ధ్వంసం చేస్తారు కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇప్పటికే కవిత తనయుడికి 11 పరీక్షలకు గాను 7 పరీక్షలు పూర్తి అయ్యాయి కొడుకు పరీక్షల ఒత్తిడికి గురవుతున్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవు ఇండో స్పిరిట్లో అరుణ్పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉంది కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఫార్మాట్ చేశారు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫోన్లలో డేటా ఫార్మాట్ జరిగింది డిజిటల్ ఆధారాలు లేకుండా ఉండేందుకే కవిత ఈ పని చేశారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా కవిత తరపు వారు ఒత్తిడి తెస్తున్నారు కవితకు నోటీసు ఇవ్వగానే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు చెప్పాడు బుచ్చిబాబు ఫోన్లోని చాట్స్తో ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నాం ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు ఆమె. చదవండి: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట.. -
Delhi Liquor Scam: ఢిల్లీ కోర్టులో కవితకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4న చేపడతామని తెలిపింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సమన్లకు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 ప్రకారం తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈడీ అధికారులు కవితను ఒక్కోసారి రాత్రి కూడా విచారించారని చెప్పారు. ఈ సందర్భంగా అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ అంశాలను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చారు. ఆయన తొమ్మిది స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే పదో స్టేట్మెంట్ పూర్తి విరుద్దంగా ఉందన్నారు. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అడిషనల్ చార్జ్ షీట్లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు లేదన్నారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
లిక్కర్ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
కేజ్రీవాల్, కవితల అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది. కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్ జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన. 2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్ఎస్, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతం బీఆర్ఎస్ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్ఎస్ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్సీపీ నేతల పట్ల అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు. సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు. సీబీఐ తనను అరెస్టు చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు. కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్ కల్యాణ్ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది! తాజాగా హైదరాబాద్లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు. ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్లో, కేజ్రీవాల్లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్ జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు. అంతేకాక బీఆర్ఎస్ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్లో బీఆర్ఎస్ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్ఎస్ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
కవిత ఇంటి దగ్గర హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కావడంతో ఆమె ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత ఇంటి ముందు బీఆర్ఎస్ శ్రేణుల నిరసనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. కవిత ఇంటికి కేటీఆర్, హరీష్రావు చేరుకున్నారు. రాత్రి 8.45 నిమిషాలకు కవితను ఢిల్లీకి తరలించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత నివాసం వద్ద నిరసనకు దిగిన ఆమె అనుచరులు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కుమార్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్లో ఉంది. కేసు పెండింగ్లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు?. ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉందని తెలిపారు. -
కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్ ఆకస్మిక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్లతో భేటీ అయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. -
లిక్కర్ కేసు.. కవిత పిటిషన్పై విచారణ 19కి వాయిదా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్తో భేటీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
ఆ దందాలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? : సునీతారావు
కరీంనగర్: లిక్కర్ దందాలో ఆధారాలతోసహా చిక్కిన బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలోని జిల్లా, మండల, బ్లాక్, పట్ట ణ, నగర మహిళా విభాగం అధ్యక్షులతో ఆమె వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై కవిత ఎప్పుడూ నోరుమెదపలేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తన తండ్రి, అప్పటి సీఎం కేసీఆర్ను ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కవిత, కేటీఆర్ పాల్గొనలేదని చెప్పారు. బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకువస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఏ అకౌంట్లోనూ రూ.15 లక్షలు వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరో పించారు. ఇన్ని రోజులు బీజేపీ, బీఆర్ఎస్ దోచుకొన్న డబ్బును వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేస్తారని అన్నారు. వాళ్లిచ్చిన డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధి ష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కమిటీల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంద న్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు కనీసం 15 స్థానాలు సాధించేలా పనిచేయాలని ఆమె కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు చర్ల పద్మ, తాటిపర్తి శోభారాణి, పద్మ, ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాప్టర్ సిద్ధం: సీఎం రేవంత్ -
బాలికల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
సాక్షి, యాదగిరిగుట్ట/భువనగిరి: ఇటీవల భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఇద్దరి విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న గదిని మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యార్థినులు ఇద్దరూ ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారని, ఆ భవనం పరిసరాలు, గదిలో లభించిన సూసైడ్నోట్ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్లోకి బయట నుంచి అదనంగా వ్యక్తులు వచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయంలో పోలీసు విచారణ పారదర్శకంగా ఉండాలని కోరారు. ‘మా డిమాండ్కు స్పందించి...ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు’అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఇటీవలి సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినినిపై పోలీసుల దాడి అమానుషమని మండిపడ్డారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న నిరసన చేస్తున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్య ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police. This… pic.twitter.com/p3DH812ZBS — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024 ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రవర్తన ఒక కట్టుబాటు కాదు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ -
పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విధానాలను ఎండగడతామన్నారు. తెలంగాణభవన్లో సోమవారం జరిగిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ఎంపికైన దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న దళితులు, బీసీలకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. శ్వేతపత్రాల పేరిట డ్రామా ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం అప్పులు, శ్వేత పత్రాల పేరిట డ్రామాలు ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశామంటూ కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలన లోపాలను ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనితీరులో మార్పులుచేర్పులు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సరళి మేరకు బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యకర్తలను కలవకుండా అడ్డుపడ్డారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధిష్టానంతో కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ పనితీరు, ఓటమికి కారణాలపై నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కాదు.. బీఆర్ఎస్ ఓటమి : వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడదామని కార్యకర్తలు తమకు భరోసా ఇచ్చారని మాజీమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ది గెలుపు కాదని, బీఆర్ఎస్ ఓటమి మాత్రమేనన్నారు. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశ అనంతరం తెలంగాణభవన్లో ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాదర్బార్ ప్రహసనంగా మారిందని, సీఎం రేవంత్ నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారన్నారు. ప్రజాదర్బార్ ద్వారా నెల రోజుల్లో పరిష్కరించిన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట ప్రజలను బలిపశువులను చేస్తూ దరఖాస్తుల స్వీకరణ పేరిట రోడ్లపైకి తెచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చొప్పున ఇవ్వాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో జిల్లాల సంఖ్య తగ్గించాలని రేవంత్ అనుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు. -
Video: ఆసక్తికర వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆమె ప్రయాణిస్తున్నదారిలో రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశులను చూసిన కవిత.. తన ఫోన్లో చిత్రీకరించి, ట్విట్టర్లో షేర్ చేశారు. ఎన్నికల ప్రచారారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో.. ఆర్మూర్లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టారు. వీటిని చూసి మురిసిపోయిన కవిత.. ఈ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుండే తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అంటూ రోడ్డు పక్కన ఆరబోసిన వరి ధాన్యపు రాశుల వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ !!! అప్పుడు ఎట్లుండే తెలంగాణ !! ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ !! enroute to Jagityal ... This scene is at siddula gutta, Armur. Same scene across Telangana !! Jai Telangan !! Jai KCR !! Vote For CAR to continue the growth story of Telangana !!!… pic.twitter.com/BSK7hxG4tA — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023 -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్ తో సఫలం అయ్యిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానం అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు. చదవండి: Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై 2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)118.2 శాతం పెరగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)155.7 శాతం పెరిగిందని తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందని తెలిపారు.అందరికి సమాన సందప విధానాన్ని సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని వివరించారు. సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్ ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని ప్రస్తావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72815కోట్లు అందించామని చెప్పారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నమనా వివరించారు. పండగలా వ్యవసాయం తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండాలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు. మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం పూర్తి రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్కు దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. 2004-2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ. 7994 కోట్లు ఖర్చు చేస్తే గత తొమ్మిదిన్నరేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. తాగునీటిపై రూ.36 వేల కోట్లు ఖర్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు. 2014లో రూ. 62లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందని గుర్తు చేశారు. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామని చెప్పారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని, 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని, ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. హరితహారం కోసం రూ.10 వేల కోట్లు పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం 2126 యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని ప్రస్తావించారు. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని, అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పామని, ప్రపంచంలో ఈ విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కోట్లలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు. వైద్య రంగంలో ఎంతో పురోగతి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 104కేంద్రాలకు పెంచారన్నారు. మహిళా సాధికారతకు కృషి రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని అన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పలు తీసుకొచ్చామని, 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు అని పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదని తప్పుబట్టారు. -
రాజకీయ కుట్రలో పావును కాను
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో తన పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో బీజేపీ, కాంగ్రెస్ తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశాయని పేర్కొన్నారు. ‘రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పటిమ నాకు ఉంది’అని తేల్చిచెప్పారు. శని వారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ కవిత’కార్యక్రమంలో నెటిజన్లు రాజకీయ, వ్యక్తిగత అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. తమకు రా జకీయ ప్రత్యర్థులతో ఎటువంటి డీల్ లేదని, తమది ‘టీమ్ తెలంగాణ’అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ జట్టు లేదు... తమకు ఏ పార్టీతో జట్టు లేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లలో గెలుస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో గెలుస్తామన్నారు. బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కేనని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నాయకత్వ బాధ్యతల నుంచి బీసీని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారని, వాళ్లు బీసీ సీఎం అంటే ఎవరూ నమ్మరని కవిత చెప్పారు. బీసీల కులగణన చేయకుండా అడ్డుకుంటున్నది బీజేపీయేనని ఆమె ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవడం లేదని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని, మహిళా రిజర్వేషన్లను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణకు రాహుల్ కుటుంబం ద్రోహం తెలంగాణతో తమకున్నది రాజకీయ బంధం కాదని.. కుటుంబ బంధమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలపడం వల్ల 60 ఏళ్లు మోసపోయినట్లు చెప్పారు. అలాగే రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ హయాంలో 1969లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న యువకులపై కాల్పులు జరపడంతో 369 మంది మరణించారని గుర్తుచేశారు. అలాగే రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను అవమానించి ఆ పదవి నుంచి తప్పించారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ 2009లో రాహుల్ తల్లి సోనియా గాంధీ ఆమె జన్మదినం సందర్భంగా ప్రకటించి మళ్లీ వెనక్కి వెళ్లడం వల్ల వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబానికి తెలంగాణతో ఉన్న అనుబంధం పదేపదే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్స్కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్రెడ్డి మాత్రం జీవన్రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్రెడ్డి సర్పంచ్లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. గురువారం పీటీఐ వార్త సంస్థ ఇంటర్వ్యూలో కవిత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇ చ్చిందని, ఆ పార్టీ మాటలు నమ్మశక్యం కావన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ప్రధాని మోదీకి తెలంగాణ అంటే ఎందుకు కక్షనో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో మోదీ అంత పెద్ద మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై స్పందిస్తూ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏ రాష్ట్రంలో చూసినా ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు. ఇలాంటి చర్యలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నది గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. కేంద్రం తలుచుకుంటే అమలు చేయవచ్చని కానీ బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోదని మహిళలకు అర్థమైందని, మహిళా బిల్లు సాధనకు ఉద్యమించిన తరహాలో త్వరగా అమలు చేయాలని కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో కోటా కోసం కూడా మా పోరాటం సాగుతుందని కవిత తెలిపారు. ‘ప్రజల మేలు కోరి సమర్థించి తీరుతాం’ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సమాజంలో అత్యధిక ప్రజల ధోరణి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి. ఈ దొరహంకార దుర్మార్గ పరిపాలన అంతం కావాలి అని కోరుకుంటున్నట్టు అభిప్రాయం వినబడుతున్నది’అని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తాము జరుపుతున్న భేటీలపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ గురువారంరాత్రి ఈ ట్వీట్ చేశారు. ఈ నిజమైన ప్రజాభావాలను దశాబ్దాల తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల మేలు కోరుతూ సమర్థించి తీరుతానని పేర్కొన్నారు. ‘గత కొన్నిరోజులుగా సమావేశమవుతున్న బీజేపీ నేతలందరం.. ప్రజాకంటక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తొలగించగలదనే విశ్వాసంతోనే బీజేపీలో చేరినం. అందుకు మేం సాధ్యమైనంతవరకు అన్నివిధాలుగా ప్రయత్నించడం సహజం. పార్టీకి కూడా అదే తెలియజేసినం. నిజానిజాలు తెలుసుకోగలిగిన విజ్ఞత తెలంగాణ బిడ్డలకు ఎప్పుడూ ఉంటుందని నా విశ్వాసం. ఇదే సత్యం’అని విజయశాంతి ట్వీట్ చేశారు. -
బీసీల హక్కుల కోసం ఎందాకైనా..
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్లో కవితతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఎంపీలు మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు. అరుణ్పిళ్లై ఏం చెప్పారు? ఈ విచారణ సమయంలోనే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్గా మారినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విస్ట్.. ఇదిలా ఉండగా.. తాజాగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. లిక్కర్ స్కాం కేసులో ఇన్ని రోజులు ఎలాంటి విచారణ లేకపోవడంతో ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ తాజాగా కవితను ఈడీ విచారణకు పిలవడం హాట్ టాపిక్గా మారింది. రానున్న కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ -
మహిళా బిల్లు కోసం ఒత్తిడి తేవాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం కలిగిన 47 రాజకీయ పార్టీల అ«ధ్యక్షులతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలకు కవిత మంగళవారం లేఖ రాశారు. రాజకీయాలకతీతంగా మహిళా బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కోరారు. దేశ జనాభాలో మహిళలు 50% ఉన్నా చట్టసభల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే దాదాపు 14 లక్షల మంది మహిళలు క్రియాశీలక ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. లింగ సమానత్వం కోసం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు లేఖలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎంలు వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్కుమార్, నవీన్ పట్నాయక్, హేమంత్ సోరెన్, ఏక్నాథ్ షిండేతో పాటు మాయావతి, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, చంద్రబాబు, వైఎస్ షర్మిల, చంద్రశేఖర్ ఆజాద్, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, అర్వింద్ దేవే గౌడ, ప్రకాశ్ అంబేడ్కర్కు కవిత లేఖలు రాశారు. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఎమ్మెల్సీ కవిత కరచాలనం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు. ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. -
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత మాటలు’
నిజామాబాద్: అవినీతి గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె తండ్రి సీఎంగా ఉన్నా.. జిల్లాలో కవిత చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మాధవ్నగర్ ఆర్వోబీ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈమె కమీషన్లకు భయపడి పారిపోయి న మాట వాస్తవం కాదా అన్నారు. అర్వింద్ ఎంపీ గా గెలిచిన తర్వాత గోవింద్పేట ఆర్వోబీ పనులు పూర్తి చేయించారని, మాధవ్నగర్, ఆర్మూర్ మామిడిపల్లి, అడవి మామిడిపల్లిలో ఆర్వోబీల పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాను చేసిన అ వినీతి గురించి అర్వింద్ రుజువు చేయాలని, లేకపో తే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్న కవిత వ్యాఖ్యలపై స్రవంతిరెడ్డి స్పందించారు. ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ తల నరుక్కోవాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఈడీ విచారిస్తుందని, నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే భవన నిర్మాణాల పనులు కవిత ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తయ్యాయని చెప్పారు. స్పైస్ బోర్డు తానే తెచ్చానని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అర్వింద్ను వెంటాడి ఓడిస్తానన్న కవిత ఇప్పుడు మాట మార్చి, అర్వింద్ మీద ఎవరు నిలబడ్డా గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన సర్వేలో కవిత ఓడిపోతారని తెలవడంతో అర్వింద్పై వేరే వారిని పోటీలో దించాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే అర్వింద్పై పోటీ చేసి గెలవాలన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, కార్పొరేటర్లు సౌజన్య, మమత, ఇందిరా, నాయకురాలు వరలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో బోనాల పండగ.. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, ప్రవాస భారతీయులు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గత 9 ఏళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణ వాసు ల నివాసాల్లో బోనాలను అలంకరించుకొని భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత స్థానిక దేవాలయానికి వెళ్లారు. అక్కడ బోనాలను సమర్పిం చిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని కవిత పేర్కొన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందని చెప్పారు. ఆ్రస్టేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు. బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆ్రస్టేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, బీటీఏ ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన తదితరులు పాల్గొన్నారు. -
లిక్కర్ స్కాం కేసు బలపడుతోంది
పెర్కిట్(ఆర్మూర్): లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎంపీ అర్వింద్ అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నందిపేట మండలం డొంకేశ్వర్, నికాల్పూర్ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లిక్కర్ స్కాం కేసు ఆలస్యమవుతుందని తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడనవసరంలేదన్నారు. ఎంత ఆలస్యమయితే కేసు అంత బలోపేతం అవుతుందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సాగనివ్వమన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ఏ విషయంలో బాగుపడిందో చెప్పాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతితో బ్రష్టుపట్టిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కరువయ్యారన్నారు. ఖరీఫ్ సీజన్లో నార్లు వేసుకుని నిరీక్షిస్తున్న రైతులకు వర్షాలు రాక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు రివర్స్ పంపింగ్ ద్వారా సాగు నీరందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం చుక్క నీటిని వదలడం లేదన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో డీజిల్, పెట్రోల్లో మిలిథం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే.. వరిని విరివిగా సాగు చేసే తెలంగాణలో మాత్రం ఒక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణలో 17 ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తరుగు పేరు తో రూ.12 వందల కోట్ల స్కాం జరిగిందన్నారు. ప్రఽ దాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో రాబోయే కామన్ సివిల్ కోడ్ ప్రయోజనం వల్ల ముస్లిం మహిళలు సైతం నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాలెపు రాజు, సాయి రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఈడీ ముందుకు కవిత .. మరోసారి విచారించనున్న అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ నెల 11న సుమారు 9 గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ.. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కా ర్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్గ్రూపు పాత్ర, ఆప్ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతోపాటు బుచ్చిబాబు, అరుణ్పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబు విచారణ ఈ కేసులో హైదరాబాద్కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఆయనను ఒంటరిగా, అరుణ్ పిళ్లైతో కలిపి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ విచారించారని.. సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హోటళ్లలో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం. ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షి హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమెకు నైతిక మద్దతు అందించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్తోపాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించడంతోపాటు అక్కడి పరిణామాలను మంత్రులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మా పార్టీ అయినా అంతే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలోనూ మహిళలకు 50శాతం గానీ, లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావనగానీ లేకపోవటమే అసలు సమస్య..’’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా మహిళలకు సీట్లు కేటాయించడమనేదీ ఏ పార్టీలోనూ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పి స్తూ చట్టం చేస్తేనే అన్ని రాజకీయ పార్టీలు దారికొస్తాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై భారత్ జాగృతి నేతృత్వంతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా 13 పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ‘‘రాజకీయ పార్టీల రాజ్యాంగాల్లో మహిళలకు 50% లేదా ఇన్ని సీట్లు అనే ప్రస్తావన ఉందా? మీ పార్టీ రాజ్యాంగంలో ఆ విధంగా ఏమైనా పొందుపరిచారా?’’అని అభిమన్యుసింగ్ అనే జర్నలిజం విద్యార్థి ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ‘‘మా పార్టీ సహా ఏ పార్టీ రాజ్యాంగంలో కూడా మహిళలకు ఇన్ని సీట్లు కేటాయించాలని లేకపోవటమే అసలు సమస్య. కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతీ పార్టీలోనూ, ఎన్నికల్లోనూ మహిళలకు తగినన్ని సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా పూనుకుంటేనే మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది’’అని పేర్కొన్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతం రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లోపల, బయట ఒత్తిడి పెంచేందుకే ఎంపీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు డ్రాఫ్ట్తోపాటు పార్లమెంట్లో ఎంపీలు ఎలాంటి ప్రశ్నలు అడిగి మహిళా బిల్లును సాధించేందుకు ముందుకు వెళ్లొచ్చనే మెటీరియల్ను భారత్ జాగృతి తరఫున తయారు చేసి ఇచ్చామన్నారు. త్వరలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో చర్చించామని కవిత తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు సంధించడంతోపాటు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనల ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై పోరాటాన్ని కొనసాగిస్తారని వెల్లడించారు. అందరినీ కలుపుకొని వెళతాం బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ మహిళలకు ఇచ్చి న మాటను నిలబెట్టుకోవాలని.. దేశ మహిళలను మోసం చేయవద్దని కవిత విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు వైఎస్సార్సీపీ, టీడీపీలను భారత్ జాగృతి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆహ్వానించ లేదని.. త్వరలో వారిని కూడా కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినా.. తమతో కలిసి పోరాటం చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు. -
‘లిక్కర్’ కేసులో తీవ్ర చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణ పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయని.. నిందితులు/సాక్షులపై థర్డ్ డిగ్రీ చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా తన ఫోన్ను సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ కుట్రతో కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. అందువల్ల ఈ నెల 11 నాటి విచారణకు సంబంధించిన తదుపరి చర్యలపై, 16న జరగాల్సిన విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వందన సెహగల్ బుధవారం కవిత తరఫున అభ్యర్థనలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విన్నవించారు. ఈ తరహా కేసుల్లో గతంలో కోర్టులు ఇచ్చి న తీర్పులను పిటిషన్లో ప్రస్తావించారు. కవిత పిటిషన్లోని అంశాలివీ.. ‘‘పిటిషనర్ తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మహిళా ఎమ్మెల్సీ. గతంలో లోక్సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పలు కమిటీల్లో పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఈడీ ఉద్దేశ పూర్వకంగా ఇండోస్పిరిట్స్ తదితరుల కేసులో ఆమెను విచారిస్తోంది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు లేదు. కొందరు వ్యక్తుల నిర్దిష్ట వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో పిటిషనర్ పేరును కావాలనే ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు ఈడీ దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్లో పిటిషనర్ వ్యక్తిగత వివరాలు పొందుపరిచింది. అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిటిషనర్పై కేంద్రంలోని అధికారపార్టీ కుట్రలో భాగంగా ఈడీ పనిచేస్తోంది. న్యాయస్థానం జోక్యంతోనే పిటిషనర్పై రాజకీయ కుట్ర ఆగుతుంది. విచారణకు సహకరించినా కూడా.. సీబీఐ 2022 డిసెంబర్ 2న పిటిషనర్కు నోటీసులు జారీ చేసింది. అదే నెల 11న పిటిషనర్ నివాసంలో సుమారు ఏడు గంటలపాటు విచారించింది. అయితే ఈ ఏడాది మార్చి 10న జంతర్మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తామని పిటిషనర్ మార్చి 2న ప్రకటించారు. కానీ దీక్షకు ఒకరోజు ముందు (9న) విచారణకు హాజరుకావాలంటూ 7న ఈడీ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ విజ్ఞప్తి చేయడంతో 11న విచారణ చేపట్టి.. మళ్లీ 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చి ంది. ఇంటి వద్ద విచారించాలని కోరినా అనుమతించలేదు. చట్ట విరుద్ధంగా ఫోన్ సీజ్.. ఈ నెల 7న ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50(2), 50(3) ప్రకారం సమన్లు ఇచ్చింది. అంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి. కానీ ఫోన్ ఇవ్వాలని అందులో పేర్కొనలేదు. విచారణకు హాజరయ్యాక ఫోన్ ఇవ్వాలని అధికారులు కోరగా.. పిటిషనర్ ఫోన్ తెప్పించి అందజేశారు. కానీ ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా ఫోన్ను సీజ్ చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగినా వివరణ ఇవ్వలేదు. పైగా ఫోన్ను పిటిషనరే స్వయంగా అందజేశారని ఈడీ పేర్కొంది. ఇక పిటిషనర్ను నివాసంలో విచారించాలని కోరినా ఈడీ తిరస్కరించిన నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న భావన వ్యక్తమైంది. అలా జరగలేదు. కానీ రాత్రి సుమారు 8.30 గంటలకు వరకూ విచారణ కొనసాగింది. ఆ స్టేట్మెంట్లలో విశ్వసనీయత కనిపించట్లేదు పిటిషనర్పై ఎలాంటి కేసు లేదు. కొందరు ఇచ్చి న స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ విచారిస్తోంది. కానీ తన స్టేట్మెంట్ను ఉపసంహరించుకుంటున్నానని అరుణ్ పిళ్లై కోర్టులో పిటిషన్ వేయడాన్ని చూస్తే.. ఆ స్టేట్మెంట్లు బలవంతంగా సేకరించినట్లు స్పష్టమవుతోంది. ఈడీ చెప్తున్న స్టేట్మెంట్లపై విశ్వసనీయత కనిపించడం లేదు. ఈడీ ఆఫీసులో విచారణ పిటిషనర్కు హానికరం! ఈడీ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని శరత్చంద్రారెడ్డి విచారణ సమయంలో గాయపడిన చందన్రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. పిటిషనర్, ఇతర నిందితులకు ఎదురైన పరిణామాలు చూస్తుంటే శారీరకంగా, మానసికంగా ఈడీ బాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ కార్యాలయంలో విచారించడం పిటిషనర్కు హానికరమే. పిటిషనర్ తన నివాసంలో విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి పారదర్శకత కోసం పిటిషనర్ను న్యాయవాది సమక్షంలో విచారించాలి’’అని పిటిషన్లో పేర్కొన్నారు. అత్యవసర విచారణకు నో.. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ అత్యవసర విచారణకు నిరాకరించిన సీజేఐ.. ఈ నెల 24న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
పిడికిలి ఎత్తి లోపలికి.. థమ్సప్తో బయటికి..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైన నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శనివారం ఉదయం కవిత విచారణకు హాజరయ్యే ముందు నుంచీ విచారణ పూర్తయి రాత్రి బయటికి వచ్చేదాకా ఉత్కంఠ కొనసాగింది. ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారంతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు.. రాత్రి ఎనిమిది గంటలకు ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఈడీ విచారణకు వెళ్లిన కవిత.. పూర్తయ్యాక థమ్సప్ చిహ్నాన్ని చూపిస్తూ బయటికి రావడం గమనార్హం. భారీగా నేతలు, కార్యకర్తల క్యూ కవిత ఈడీ విచారణకు వెళ్లేముందే ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని సీఎం కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణభవన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ విచారణను ఎదుర్కొనే అంశంపై మంత్రులు, న్యాయవాదులతో కవిత సీరియస్గా చర్చలు జరపగా.. ఆమె అరెస్ట్ ప్రచారం నేపథ్యంలో మద్దతుగా వచ్చిన కార్యకర్తలు హడావుడి సృష్టించారు. దీంతో అధికారులు తుగ్లక్రోడ్లో, ఈడీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్, పలువురు న్యాయవాదులు శుక్రవారం రాత్రి నుంచి తుగ్లక్రోడ్ నివాసంలోనే ఉండగా.. శనివారం ఉదయం ఏడున్నర గంటలకు మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గువ్వల బాలరాజు, గణేశ్ గుప్తా, పైలట్ రోహిత్రెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు కవితకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అక్కడే అల్పాహారం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో పరిణామాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్, హరీశ్రావులతో ఆరా తీశారు. పిడికిలెత్తి అభివాదం చేస్తూ.. తుగ్లక్రోడ్ ఇంటికి వచ్చి నేతలందరినీ పలకరించిన కవిత.. పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ, విక్టరీ సంకేతం చూపుతూ 10.58 గంటలకు ఢిల్లీ పోలీసుల భద్రత మధ్య ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. ఆమె వెంట భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కవితకు మద్దతుగా నినాదాలు చేస్తూ వాహనం ముందు నడిచారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని కట్టడి చేయాల్సి వచ్చింది. ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేస్తూ ఒక్కరే లోపలికి వెళ్లారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈడీ కార్యాలయం గేటు వరకు వెళ్లి వెనక్కి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి వచ్చారు. థమ్సప్ చిహ్నాన్ని చూపుతూ కారు ఎక్కి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె కారును చుట్టుముట్టిన నేతలు, కార్యకర్తలు ‘ఆప్ సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారే సాత్ హై’అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. మంగళ హారతులతో స్వాగతం నేరుగా తుగ్లక్రోడ్లోని ఇంటికి వెళ్లిన కవితకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళా నేతలు గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు పట్టారు. తర్వాత కేటీఆర్, హరీశ్లతో కవిత భేటీ అయి.. విచారణ తీరును వివరించారు. సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. కవిత, కేటీఆర్, హరీశ్రావు, ఇతర నేతలు రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్కు చేరుకున్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఉదయం నుంచి రాత్రి దాకా టెన్షన్! కవితకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి రావడంతో తుగ్లక్రోడ్, ఈడీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుగ్లక్రోడ్లో ఉదయం 7 గంటల నుంచే 100 మందికిపైగా పోలీసు సిబ్బందిని, సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ) బలగాలను మోహరించారు. కవిత ఈడీ విచారణకు బయల్దేరుతున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కొంతసేపు హల్చల్ చేయగా పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అన్నివైపులా బారికేడ్లు పెట్టారు. అయినా 30–40 మంది నేతలు ఈడీ కార్యాలయం వద్ద తిరుగుతూ హల్చల్ చేశారు. వారి లో కొందరు మీడియాతో మాట్లాడే ప్రయ త్నం చేయగా పోలీసులు ఆపి అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర, ఢిల్లీ ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి అక్కడి పరిణామాలపై ప్రభుత్వాలకు నివేదించినట్టు తెలిసింది. -
సంజయ్ వ్యాఖ్యలపై మంటలు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంజయ్ దిష్టి బొమ్మల దహనం, ధర్నాలతో నిరసన వ్యక్తం చేశాయి. హైదరాబాద్తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి, బంజారాహిల్స్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టాయి. బండి సంజయ్కు మహిళలను గౌరవించే సంస్కారం లేదని, ఆయన తీరు మార్చుకోలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. రాజ్భవన్ వద్ద ఆందోళన సంజయ్ వ్యాఖ్యల విషయంగా గవర్నర్ తమిళిసైను కలసి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వ విప్ సునీత, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు రాజ్భవన్కు వెళ్లారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గేటు వద్దే ధర్నాకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీకి, మోదీకి, సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్భవన్ ఎదుట రాస్తారోకో చేశారు. దీనితో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి మహిళా నేతలు రాజ్భవన్ ప్రహరీకి, బారికేడ్లకు వినతిపత్రాలు అంటించి నిరసన తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బందులున్నా రాజ్భవన్ గేట్లు తెరిచే ఉంటాయని గవర్నర్ గతంలో చెప్పారని.. ఓ మహిళగా తమ బాధ అర్థం చేసుకుంటారని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఇద్దరు, ముగ్గురిని లోనికి అనుమతించినా బాగుండేదని, కనీసం గవర్నర్ ఓఎస్డీ వచ్చి వినతిపత్రం తీసుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు. గవర్నర్ ఇప్పటికైనా స్పందించి సంజయ్తో క్షమాపణ చెప్పించాలనర్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తలసాని శ్రీనివాస్యాదవ్ కుమారుడు సాయి కిరణ్యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాజీపేట, సుబేదారి పోలీస్స్టేషన్లలో సంజయ్పై ఫిర్యాదులు చేశారు. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, దేవరకొండ, నారాయణపేటలలో ఎమ్మెల్యేలు దివాకర్రావు, మదన్రెడ్డి, చిన్నయ్య, రవీంద్రకుమార్, రాజేందర్రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగతంగా హాజరు కావాలి! సంజయ్కి మహిళా కమిషన్ నోటీసులు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ అంశాన్ని సూమోటోగా తీసుకుని.. బండి సంజయ్కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనను ఆదేశించనున్నట్టు తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. సంజయ్పై కేసు నమోదు బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నాయకుడు చెట్లపల్లి రాంచందర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్, పలువురు మహిళా నేతలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున నల్లగొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేడు ఈడీ ముందుకు కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి శనివారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. సౌత్ గ్రూపు లావాదేవీలు, ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు, కిక్ బ్యాక్లు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై విచారించే అవకాశం ఉందని తెలిసింది. హైదరాబాద్ నివాసంలో, ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగినట్టుగా చెబుతున్న సమావేశాలపై కూడా ప్రశ్నించవచ్చని సమాచారం. ఇండో స్పిరిట్స్ ఎల్1 దరఖాస్తుపై సమస్యలు వస్తే అరుణ్ పిళ్లై ద్వారా తనకు తెలియజేస్తే, తన స్థాయిలో పరిష్కరిస్తానని సమీర్ మహేంద్రుకు ఎమ్మెల్సీ కవిత తెలిపారని ఈడీ చార్జిషీట్లో ఆరోపించిన నేపథ్యంలో దీనిపైనా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలావుండగా జంతర్మంతర్ వద్ద దీక్ష అనంతరం బసకు చేరుకున్న కవిత న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేక కోర్టులో పిళ్లై పిటిషన్ లిక్కర్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని.. కవిత బినామీ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈడీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైను ఈడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో.. పిళ్లై వేసిన పిటిషన్ చర్చనీయాంశమయ్యింది. -
సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీష్ సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ వేదికగా కీలక చర్చలు జరిగినట్లు ఈడీ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కవిత, సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. డిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్లోనే జరిగిందని చెప్పారు. 'హవాలా ద్వారా రూ.100 కోట్ల ముడుపులు పంపామని బుచ్చిబాబు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్తో సిసోడియా, విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపారు. డిల్లీ లిక్కర్ పాలసీలో కవితకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆప్కు ముడుపులు ఇవ్వాలని సమావేశంలో చర్చలు జరిపారు. కవిత తరఫున అరుణ్చంద్ర పిళ్లై, సిసోడియా తరఫున విజయ్ నాయర్ పనిచేశారు. ఈ స్కాంలో సౌత్ గ్రూప్కు అనుకూలంగా వ్యవహరించినందుకు మద్యం కంపెనీలో కవితకు వాటాలు ఇచ్చారు.' అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ -
ప్రీతి మృతిపై విచారం.. తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజి విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు. ప్రీతి మరణంతో ఒక తల్లిగా తనెంతో మనో వేదనకు గురయ్యానన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రీతి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. తల్లిదండ్రులకు లేఖ రాశారు. ‘ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరిని. ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది. మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యావత్ రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని కవిత పేర్కొన్నారు. డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023 -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి తెరమీదకు ఎమ్మెల్సీ కవిత పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి తెరమీదకొచ్చింది. మాగుంట రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇండోస్పిరిట్లో కవిత ప్రతినిధిగా అరుణ్పిళ్లై వ్యవహరించారని ఈడీ.. కోర్టుకు తెలిపింది. కాగా మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ ఉన్నారని తెలిపింది. అనంతరం రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీని కోర్టు విధించింది. చదవండి: ఆడిటర్ బుచ్చిబాబుకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. హైదరాబాద్ ఆడిటర్ గోరంట్ల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం గోరంట్లను ఢిల్లీకి పిలిపించిన సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం ఆయనని అదుపులోనికి తీసుకున్నారు. బుచి్చబాబు విచారణకు సహకరించడంలేదని, అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడంతో అరెస్ట్ చేసినట్టుగా బుధవారం సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ కొత్త మద్యం విధానం 2021–22 రూపకల్పనలో గోరంట్ల బుచి్చబాబు పాత్ర ఉందని హైదరాబాద్కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా ఆయన వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రత్యేక కోర్టులో ఆయనని హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు కస్టడీకి అప్పగించింది. బుచి్చబాబుని సీబీఐ గతేడాది ఆగస్టు, అక్టోబర్ మధ్య కాలంలో 15 సార్లు విచారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు కూడా విచారణ జరిపింది. -
తెలంగాణ గవర్నర్పై మంత్రి తలసాని సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, గణతంత్ర వేడుకల నేపథ్యంలో మాటల దాడి మరింత పెరిగింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాము. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత సైతం గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా.. ‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కవితకు సెక్షన్ 91 కింద మరో నోటీసు.. ‘సౌత్గ్రూప్’తో సంబంధం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ బృందం ఆదివారం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్లో సౌత్గ్రూప్గా పేర్కొంటున్న వారితో ఏమైనా పరిచయం ఉందా? ఎప్పుడైనా కలిశారా? ఇటీవల ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచి్చంది? వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఆదివారం ఉదయం 10.50 గంటలకే కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఆమె వ్యక్తిగత కార్యాలయంలో సాయంత్రం 6.30 వరకు విచారించారు. మధ్యలో మధ్యాహ్నం 1.30 నుంచి సుమారు 45 నిమిషాల పాటు భోజన విరామం తీసుకున్నారు. మొత్తంగా సుమారు ఏడున్నర గంటల పాటు సీబీఐ బృందం కవిత నివాసంలోనే ఉంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా గతంలో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా.. లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక ప్రశ్నలను సంధించి, ఆమె చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నట్టు తెలిసింది. ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు అమిత్ అరోరాను రిమాండ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సమరి్పంచిన రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. స్కామ్లో కీలకమైన సౌత్గ్రూప్ను నియంత్రిస్తున్నవారిలో కవిత కూడా ఉన్నారని అమిత్ అరోరా చెప్పినట్టుగా ఈడీ పేర్కొంది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకున్నా.. ఈడీ రిమాండ్ రిపోర్టు, అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు 160 సీఆరీ్పసీ కింద కవితకు ఈ నెల 2న నోటీసులు జారీ చేసింది. కవిత సూచనల మేరకు ఆదివారం (11న) ఉదయం విచారణ చేపట్టింది. సౌత్ గ్రూప్కు సంబంధించి కీలక ప్రశ్నలు! ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత నివాసంలో విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. పది నిమిషాల ముందు 10.50 గంటలకు సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. అప్పటికే కవిత నివాసానికి ఆమె తరఫు న్యాయ సలహాదారులు చేరుకున్నారు. అధికారులు వారి సమక్షంలోనే కవితను ప్రశ్నించారు. సీబీఐ ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సౌత్ గ్రూప్గా పేర్కొంటున్న వారితో ఏదైనా పరిచయం ఉందా? అనే కోణంలో కవితను ఆరా తీసినట్టు సమాచారం. ‘‘కేసు నిందితులైన అమిత్ అరోరా, ఇతరులను ఎప్పుడైనా కలిశారా? వారితో ఫోన్ సంభాషణలు జరిగాయా? వారితో ఢిల్లీలో ఎప్పుడైనా సమావేశం అయ్యారా? ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ వంటి అంశాలపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఈ కేసు ఫిర్యాదులోగానీ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోగానీ తన పేరు లేని విషయాన్ని విచారణ సందర్భంగా కవిత మరోమారు గుర్తు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి విచారణ ముగిసినా. అవసరమైన పక్షంలో మరోమారు విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ ఆమెను కోరింది. ఈ మేరకు సీఆరీ్పసీ సెక్షన్ 91 కింద మరో నోటీసును అందజేసింది. ఏ రోజున విచారించేదీ త్వరలో నిర్ణయించి చెప్తామని తెలిపింది. విచారణ సందర్భంగా కవిత పేర్కొన్న పలు అంశాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరేందుకు ఈ నోటీసు జారీ చేసినట్టు సమాచారం. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని కవిత చెప్పినట్టు తెలిసింది. విచారణ అనంతరం ప్రగతిభవన్కు.. సీబీఐ బృందం విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలకు కవిత తన నివాసం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ప్రగతిభవన్కు చేరుకున్నారు. సీబీఐ బృందం విచారణ తీరుతెన్నులను ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించినట్టు తెలిసింది. సీబీఐ విచారణకు సంబంధించి ప్రకటన విడుదల చేయాలని కవిత భావించారని.. కానీ సీబీఐ తదుపరి చర్యలపై స్పష్టత వచ్చాకే స్పందించాలని కేసీఆర్ సూచించడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. నివాస పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఎమ్మెల్సీ కవిత నివాసానికి సీబీఐ బృందం రాక నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత నివాసానికి వెళ్లే మార్గాన్ని రెండు వైపులా బారికేడ్లతో మూసివేశారు. సీబీఐ బృందం కవిత నివాసం నుంచి బయటికి వచ్చేంత వరకు ఇతరులెవరినీ అనుమతించలేదు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చంటి క్రాంతి కిరణ్, గొర్రెలు–మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, బ్రూవరీస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, దాసోజు శ్రవణ్, దేవీప్రసాద్రావు తదితరులు కవిత నివాస పరిసరాల్లో మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కవిత నివాసం వద్దకు తరలివచ్చారు. కవితకు సంఘీభావం పలుకుతూ నినాదాలు చేశారు. -
Delhi liquor scam: ఆదివారం కవిత ఇంటికి సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ మహిళా నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారణ చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం(డిసెంబర్ 11వ తేదీన) ఆమె నివాసానికి వెళ్లనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఆర్పీసీ 160 కింద ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ. అంతకు ముందు.. పలానా తేదీల్లో తాను విచారణకు అందుబాబులో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీబీఐకు మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయనున్నారు సీబీఐ అధికారులు. -
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
‘బీఎల్ సంతోష్, కవితను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్ చేశారు. -
‘కవిత వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరాలంటూ తనను ఆఫర్ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ బృందం కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆమె చెప్పిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ శుక్ర వారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్యనేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, అంజన్కుమార్ యాదవ్, ఎంఆర్ జీ వినోద్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ఆ నలుగురి వరకే పరిమితం చేయొద్దని, కవితను కలిసి గానీ, సిట్ కార్యాలయానికి పిలిపించి గానీ వాంగ్మూలం రికార్డు చేయాలని కోరారు. లేదంటే సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కోర్టు ముందు దోషిగా నిలబ డాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో నలుగురు ఎమ్మెల్యేలను బందెల దొడ్డిలో బంధించినట్టు ప్రగతిభవన్లో ఉంచా రని, అమ్ముడుపోయిన వారే మళ్లీ అమ్ముడు పోతుంటే వారితో కేసీఆర్ రాజకీయం చేయా లనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసహ్య పదజాలంతో చిల్లర పంచాయతీలు పెట్టుకుం టున్న టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల ఆలోచన లను కలుషితం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం కాంగ్రెస్లో చేరతానంటూ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసినట్టు ఎంపీ అర్వింద్ చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా తమకు అలాంటి సమాచారం లేదని రేవంత్ బదులిచ్చారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరే అంశం గురించి తమకు తెలు సని, ఆయన్ను చేర్చుకునేందుకు తమకు అభ్యంతరం లేదని ఖర్గేకు చెప్పామన్నారు. తన పాదయాత్రపై ఏఐసీసీ నిర్ణయం తీసు కుంటుందని రేవంత్ చెప్పారు. ప్రజా సమ స్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే టీఆర్ ఎస్, బీజేపీలు వివాదాస్పద అంశాలపైనే చర్చను పక్కదారి పట్టిస్తున్నారని మండిప డ్డారు. రైతుల సమస్యలపై తాము ప్రజాక్షే త్రంలోకి వెళ్తామని, నేటి ముఖ్యనేతల సమా వేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఓబీసీల జనగణ నపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై పోరాడతామని వెల్లడించారు. ఇదీ చదవండి: దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్ -
‘చేతకానితనం అనుకోవద్దు.. మేము బరిలోకి దిగితే తట్టుకోలేరు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు, దాడుల వరకు వెళ్లింది తెలంగాణ రాజకీయం. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణలు చేయడంతో కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక, టీఆర్ఎస్ శ్రేణులు అరవింద్ ఇంటిని ముట్టడించి ఇంట్లో ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఇక, టీఆర్ఎస్ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా?. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు. బీజేపీ సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై డీకే అరుణ కూడా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. దాడికి కారణమైన కవితపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. టీఆర్ఎస్ కార్యకర్తల దాడుల నేపథ్యంలో హైదరాబాద్, ఆర్మూర్లోని అరవింద్ నివాసాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. -
కవిత ఎంట్రీ.. డైలమాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ పాలిటిక్స్కు చిక్కు అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్ లోక్సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి. అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. బరిలోకి అన్న సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది. ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో... అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత! -
లిక్కర్ స్కాం నిందితుడితో కవిత తిరుమల ఎందుకు వెళ్లారు?: రఘునందన్ రావు
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫోటో తాజాగా వైరలవుతోంది. సీబీఐ కేసులో ఏ-14 రామచంద్ర పిళ్లై కుటుంబంతో తిరుమలలో కవిత కనిపించారు. బోయినపల్లి అభిషేక్రావుతో సహా ఆమె తిరుపతి టూర్కు వెళ్లారు. అయితే లిక్కర్ స్కాం నిందితుడితో ఎమ్మెల్యే కవిత తిరుమలకు ఎందుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లైని కలవలేదని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదన్న కవిత.. రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు. మరమనిషి అనేది నిషేధిత పదమా? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. మీరిచ్చే నోటీసులను చట్టబద్దంగా ఎదుర్కొంటామని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఏదో కారణంలో సభ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు. బీఏసీ సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. దర్యాప్తు ముమ్మరం ఢిల్లీ లిక్కర్స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారంతో ముడుపులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ మద్యం టెండర్స్లో కంపెనీల సిండికేట్కు హైదరాబాద్లో రూపకల్పన జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో హైదరాబాద్లో అయిదుచోట్ల ఢిల్లీ ఈడీ బృందం తనిఖీలు చేపట్టింది. రాబిన్ డిస్టలరీస్, డైరెక్టర్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. సికింద్రాబాద్, కోకాపేట్, నార్సింగ్లో సీబీఐ సోదాలు జరిపింది. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలు స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, కర్ణాటక, చెన్నై, ఢిల్లీలోని రామ చంద్రన్ పిళ్లై ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారనుంది. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాపై బీజేపీ రాష్ట్ర నేతలు గానీ, ఎంపీ అర్వింద్ గానీ దృష్టి సారించడంలేదనే ఆరోపణ వినిపిస్తోంది. కేవలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గెలిచినా పార్టీ పటిష్టం కాలేదు. జగిత్యాలకు ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల సీటు ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్నేత జీవన్ రెడ్డి ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజార్టీతో సాధించుకున్నారు జీవన్రెడ్డి. టీఆర్ఎస్లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు ఎమ్మెల్యే సంజయ్కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలకు, నిరసనలకు మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? జగిత్యాల నుంచి పోటీకి ఆ ఇద్దరి ప్రయత్నాలు అయితే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్ధులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. బీజేపీ సైతం ఉనికి పోరాటాలకే పరిమితం అయ్యిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాల కూడా అందులో ఉండటంతో కొంత జోష్ పెరిగినా వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. కొడుకును రంగంలోకి దింపనున్న విద్యాసాగర్ కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి విద్యాసాగర్ తన కుమారుడు సంజయ్ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావారణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్ది రాములు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన జేయన్ వెంకట్ టికెట్టు ఆశిస్తున్నారు. చదవండి: గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్దే విజయం.. టీఆర్ఎస్లో కుమ్ములాటలు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్లో స్థానికంగా కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్వి జయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఎలాగైనా ఈసారైనా ఈశ్వర్ను ఓడించాలని లక్ష్మణ్ కుమార్పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. కొప్పుల ఈశ్వర్కు తలనొప్పి టీఆర్ఎస్లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 లో భాగంగా పైపులైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పులో ఇళ్ళు కోల్పోయినవారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 15 వార్డుల్లో టీఆఆర్ఎస్ ఎనిమిది, కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు తరువాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్కు రెండు పార్టీల కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ధర్మపురిలో బీజేపీ తరపున నిలిచి గెలవాలని ఆయన ఆశిస్తున్నారు. -
ఎమ్మెల్సీ కవిత కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
-
Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..
సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితపై మీడియా, సోషల్ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. చదవండి: రాజాసింగ్ లాయర్కు బెదిరింపులు.. చంపేస్తామంటూ.. -
కూతురుకు ఓ న్యాయం... ఇతరులకు ఓ న్యాయమా?: బండి సంజయ్
-
అసలు సమస్య ఎక్కడిది? ఈ అరెస్టు ఎందుకు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగాంలో అరెస్ఠ్ చేసి కరీంనగర్లోని ఆయన ఇంటికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 21 రోజులుగా యాత్రపైలేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఈరోజే తన యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని నిలదీశారు ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్ తెలిపారు. కూతురిని కాపాడుకునేందుకు తన యాత్రను కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు కేసీఆర్కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూతురికి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడలేదని నిలదీశారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని మండిపడ్డారు. అమిత్ షా ఆరా మరోవైపు పాదయాత్రలో బండి సంజయ్ను అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరా తీశారు. ఈ మేరకు సంజయ్కు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ మండలం పామ్నూర్లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పార్టీ(తెలంగాణ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారాయన. మంగళవారం బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, మరో ఎంపీ పర్వేష్వర్మతో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందన్న ఆయన.. కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే బండి సంజయ్ను ఎందుకు అరెస్టు చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?. రాజకీయ కారణాలతోని అన్యాయంగా అరెస్టు చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో పూర్తిగా శోధించి సత్యాన్ని బయటకి తీస్తాయి. మేం ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు?. ఎంపీగా సంజయ్కు నిరసన తెలిపే హక్కు లేదా? అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం అని ఎంపీ సుధాన్షు వెల్లడించారు. భారీ స్కాం జరిగింది: బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఢిల్లీలో మద్యం దుకాణాలకు ఎల్ - వన్ కమిషన్ రెండు నుంచి 12 శాతం పెంచారని, అది ఎందుకో ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదు ఢిల్లీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ ఎంపీ, బీజేపీ నేత పర్వేష్ వర్మ మండిపడ్డారు. ‘ఢిల్లీలో ఒక బాటిల్కు మరొక బాటిల్ ఉచితంగా ఇచ్చారు. కార్టెల్గా మారి జోన్లు ఇవ్వాలని మద్యం విధానంలో లేదు. మద్యం ఉత్పత్తి , డిస్ట్రిబ్యూషన్ , రిటైలర్.. ఈ మూడు ఒక్కరే. మహాదేవ్, బడి పంజా కంపెనీలు ఈ బిజినెస్ చేస్తున్నాయి. కరోనా నష్టాల పేరుతో 144 కోట్ల రూపాయలు మద్యం మాఫియాకు మాఫీ చేశారు. ఇది మద్యం పాలసీకి వ్యతిరేకం. ఎల్ -1 రిటైలర్ కు క్రెడిట్ నోట్ ఇచ్చి, వారి నుంచి వచ్చే నగదు ఆప్ పార్టీకి తరలించారు. ఆ డబ్బు ఎన్నికలకు వినియోగించి మోదీకి మేమే పోటీ అని అంటున్నారు. ఈ పాలసీ వల్ల విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై పన్ను కూడా తగ్గించారు. పన్నులలో, ఆదాయంలో ప్రభుత్వానికి ఖజానాకు గండి కొట్టారు. మొత్తం 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం జరిగింది. ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది అని ఎంపీ పర్వేష్ వర్మ, ఆప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: 33 జిల్లా కోర్టుల్లో కవిత పరువునష్టం దావా! -
లిక్కర్ స్కాం కేసు: ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు బంజారాహిల్స్ సీఐ నరేందర్ తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరస్ట్ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మేం తలుచుకుంటే మీరుంటారా.. మీ పార్టీ ఆఫీసులు ఉంటాయా: టీఆర్ఎస్ వార్నింగ్ -
ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. సంజయ్కు కేంద్రం నుంచి ఫోన్కాల్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్యీ కవితకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంపై కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. కావాలనే కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ బద్నాం చేస్తున్ననది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ వ్యవహరంలో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తర్వాత బీజేపీ కార్యకర్తలను రిమాండ్కు తరలించకుండా పోలీసులను బీజేపీ నేతలు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట ధర్నాకు యత్నించిన బీజేపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయంపై కేంద్ర పెద్దలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఇదిలా ఉండగా.. కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి రావడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని.. ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా తన సంఘీభావం తెలిపారు. ఇది కూడా చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అట్టుడుకుతున్న పాతబస్తీ -
ఆటా 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై 2న జరిగే ఆటా మహాసభల్లో కవిత చేతుల మీదుగా తెలంగాణ పెవిలియన్ ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం జరిగే ప్రధాన సమావేశంలో కవిత అతిథిగా పాల్గొంటారు. ఇదే సమావేశం వేదికగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణకు 80 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు వెల్లడించారు. -
కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ట్వీట్ల వార్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ధాన్యం కొనుగోలు విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. — Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022 దీనికి ప్రతిగా.. టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల స్పందించారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని రాహుల్ గాంధీ’’ని విమర్శించారు. .@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022 దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్కు, కవితకు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో.. ‘‘కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjM — Revanth Reddy (@revanth_anumula) March 29, 2022 ఇది చదవండి: రాముడు కాదు.. వాళ్లు రావణుడి భక్తులు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు -
క్వారంటైన్లోకి ఎమ్మెల్సీ కవిత కుటుంబం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్వారంటైన్లోకి వెళ్లారు. తన భర్త అనిల్ కోవిడ్–19 బారిన పడటంతో తమ కుటుంబం కూడా క్వారంటైన్లోకి వెళ్లినట్లు బుధవారం కవిత ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు కవిత చెప్పారు. My husband Anil garu has tested positive for #COVID19. He is under home quarentine and is doing well. My family and I have quarantined ourselves and would not be making any public or personal appearances. My office will reschedule all the meetings to avoid inconvenience. — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 24, 2021 దేశంలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతుంది. రోజురోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా కేసులు, 251 మరణాలు సంభవించాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను మూసి వేసిన సంగతి తెలిసిందే. చదవండి: తెలంగాణలో ఇదే తొలిసారి -
అక్షర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మంత్రి శ్రీనివాస్గౌడ్కు పితృ వియోగం
పాలమూరు/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు పితృ వియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి రిటైర్డ్ హెచ్ఎం వి.నారాయణగౌడ్ (73) హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ప్రముఖుల సంతాపం శ్రీనివాస్గౌడ్ తండ్రి మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణగౌడ్ మరణ వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్లు దామోదర్రెడ్డి, బాల్కసుమన్లు యశోదా ఆస్పత్రికి వెళ్లి నారాయణగౌడ్ పార్థివదేహాన్ని సందర్శించారు. మరో మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లు కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్గౌడ్ను పరామర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి శ్రీనివాస్గౌడ్కు ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా ఫోన్లో శ్రీనివాస్గౌడ్ను పరామర్శించారు. మంత్రి జగదీశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్లు వేర్వేరు ప్రకటనల్లో నారాయణగౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
జోకర్ని కాదు.. ఫైటర్ని : బండ్ల గణేష్
సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార టీఆర్ఎస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేయని విమర్శలు ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ పేరు పొలిటికల్ తెరపైకి వచ్చింది. (చదవండి : ‘మీకో దండం.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు’) ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన కామెడీలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. ‘నేను జోకర్ని కాదు.ఫైటర్ని. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయింది. -
ఉప ఎన్నిక: కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు. వార్ వన్ సైడ్: బాజిరెడ్డి నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్ఎస్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమన్నారు. ఆమె రాకతో రాజకీయాలు మారబోతున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు: గణేష్ గుప్తా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి. కవిత సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. నిజామాబాద్కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అనంతరం బోధన్కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినయోగించుకునే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్ క్యాంప్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కార్పొరేటర్లంతా బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రాజేశ్వర్ అక్కడికి చేరుకున్నారు. 24 మందికి కరోనా పాజిటివ్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 824 మంది మొత్తం ఓటర్లు ఉండగా 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రొటోకాల్ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా వెలువడే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీల బలాబలాలు జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే టీఆర్ఎస్కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్ఎస్ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో మాజీ ఎంపీ కవితను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కేటీఆర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చదవండి: ఎన్నికల వేళ.. కేటీఆర్ కీలక నిర్ణయాలు ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారని తెలిపారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ మరోసారి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కులాలు మతాల పేరిట చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. -
కవిత కుమారుడిని పరామర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మనవడు ఆర్యను (నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్ బో హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. -
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు బీ–టీం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘టీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని రాహుల్బాబా అంటున్నారు.. కాంగ్రెస్ బీ టీం అని అమిత్షా అంటున్నారు.. ఈ రెండు పార్టీలు కలసి టీఆర్ఎస్ను బదనాం చేస్తున్నాయి. కానీ టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మాత్రమే బీ టీం’’అని ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రెండు పార్టీలు మందిర్.. మసీద్ల గురించే మాట్లాడుతాయి.. ఒకరు బోఫోర్స్ అంటే., మరొకరు రాఫెల్ అంటారే తప్ప దేశ భవిష్యత్కు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నాణానికి బొమ్మా బొరుసులాంటివని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాంతీయ పార్టీల ద్వారా జాతీయ దృక్పథం వైపు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చెప్పుకొస్తోందని, ఇప్పుడు ఆమె మనవడు రాహుల్గాంధీ కాలం కూడా వచ్చిందని, ఇంకా పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా సుస్థిర పాలనను అందించగలుగుతాయని చెప్పారు, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన టీఆర్ఎస్.. 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే.. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరానికి నిధులివ్వలేదు: మంత్రి వేముల రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. కనీసం 50 శాతం నిధులైనా ఇవ్వాలని, చేసిన పనులకు సంబంధించి రీయింబర్స్మెంట్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం మొండిచెయ్యి చూపిందన్నారు. ఈ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుని భావసారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీతో కలిపి వందసీట్లు సాధించుకుంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి 13 రాష్ట్రాల్లో పసుపు పండుతోందని కవిత తెలిపారు. ఆహార పంటల మాదిరిగానే పసుపునకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. -
విజయ సారధి
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థుల విజయ సాధనలో ఎంపీ కవిత కీలక పాత్ర పోషించారు. రోడ్ షోలు, ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రస్తావిస్తూ ఓటు బ్యాంకును భద్రపరిచారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేశారు. అసమ్మతి గళం వినిపించిన పార్టీ నేతలనూ అభ్యర్థుల వెంట నడిచేలా చేయగలిగారు. ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ, పావులు కదుపుతూ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం వెనుక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక భూమిక పోషించారు. ప్రచార సభలు.. రోడ్షోలు.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున నిత్యం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎంపీ., ఎన్నికల వేళ అభ్యర్థులకు వెన్నంటే ఉన్నారు. రోజురోజుకూ మారిన పరిణామాలను అంచనా వేస్తూ.. వ్యూహాలకు పదును పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్, బోధన్ వంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్మూర్, నిజామాబాద్రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. సామాజికవర్గాలు టీఆర్ఎస్కు బాసటగా నిలిచేలా.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కులసంఘాలు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆయా సామాజికవర్గాల మద్దతును కూడగట్టడం ద్వారా టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కవిత మార్గం సుగ మం చేశారు. ప్రభావం చూపే కుల సంఘా ల నేతలతో చర్చించి.. ఆయా వర్గాలు జిల్లాలో టీఆర్ఎస్కు బాసటగా నిలిచేలా చేశారు. పోలింగ్కు నెల రోజుల ముందు నుంచి ఆయా నియోజవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆమె పాల్గొన్నారు. లుకలుకలున్న చోట్ల సమన్వయం.. ఏ పార్టీలోనైనా నేతల మధ్య లుకలుకలుండటం సాధారణం. ఎన్నికల వేళ ఇవి చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేయడంలో కవిత సఫలీకృతమయ్యారు. నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లోని ముఖ్యనేతల్లో కొంత అసంతృప్తి కనిపించింది. ముందస్తు ఎన్నికల ప్రకటనకు రెండు, మూడు నెలల ముందు నిజామాబాద్ అర్బన్లోని కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి గళాన్ని వినిపించారు. ఇలాంటి అసమ్మతి నేతలంతా టీఆర్ఎస్ అభ్యర్థుల వెంట నడిచేలా చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారు. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. పట్టున్న నేతల చేరికలతో.. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు బాటలు వేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఎంఐఎం నేత మీర్ మజాజ్ అలీ, బోధన్లోనూ సామాజిక పోరాట సమితి నాయకులు ఉప్పు సంతోష్, ఆర్మూర్ కాం గ్రెస్ టికెట్ ఆశించిన రాజారాం యాదవ్ వంటి నాయకులు ఎన్నికల వేళ టీఆర్ఎస్లో చేరారు. ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పావు లు కదుపుతూ టీఆర్ఎస్ పార్టీని విజయతీరానికి చేర్చారు. -
‘కాంగ్రెస్ వెనక చంద్రబాబు నీడ ఉంది’
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ వెనక చంద్రబాబు నీడ ఉంది.. అది గమనించి ప్రజలు ఓట్లు వేయాలంటూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. 60 ఏండ్లలో అన్నదాతలను పట్టించుకున్న ప్రభుత్వాన్ని చూశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ రైతులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. స్థలం ఉండి ఇళ్లు కట్టుకుంటే రూ. 5 లక్షల అప్పు ఇస్తాం అని కాంగ్రెస్ చెబుతోంది.. కానీ టీఆర్ఎస్ ఇచ్చే ఐదు లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. టీఆర్ఎస్కు మత, కుల పిచ్చి లేదని వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలంటే టీఆర్ఎస్ను ఆశీర్వదించండంటూ కవిత ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసింది.. చంద్రబాబు వస్తే వాటిన్నింటికి చంద్ర గ్రహణం పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వెనక చంద్రబాబు నీడ ఉంది.. అది గమనించి ఓటు వేయాలంటూ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
స్క్రిప్ట్ రైటర్ ప్రసంగాలు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాహుల్గాంధీ, నరేంద్ర మోదీలు ప్రజలకు సత్యదూరమైన మాటలు చెబుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్క్రిప్ట్ రైటర్ల ప్రసంగాలు.. మసాలా జోడించే అనువాదకులతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్లో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపుబోర్డు కోసం తాను పార్లమెంట్లో ప్రశ్నిస్తే.. రాహుల్తో సహా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పసుపు రైతుల పట్ల రాహుల్కు చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితులపై రాహుల్ మొసలి కన్నీళ్లు కార్చారని విమర్శించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలు పేదరికం, అక్షరాస్యత వంటి అనేక రంగాల్లో వెనుకబడిందనే విషయాన్ని గమనించాలని కోరారు. పసుపుబోర్డు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, తెలంగాణ పరిశ్రమలకు రాయితీలు వంటి అంశాలపై త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి రాహుల్ మద్దతిస్తారా అని ప్రశ్నించారు. అమరులను చేసింది కాంగ్రెస్సే తెలంగాణ ప్రజల కలను సాకారం చేయకుండా 60 ఏళ్లు జాప్యం చేసింది, తెలంగాణ బిడ్డలను అమరులను చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం గుర్తుంచుకోవాలని కవిత అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 22 వేల ఉద్యోగాలిచ్చారని, తమ ప్రభుత్వం నాలుగేళ్లలో 30 వేల ఉద్యోగాలిచ్చిందని వివరించారు. నిజామాబాద్లో మాట్లాడుతున్న ఎంపీ కవిత -
‘బాబు ఫోటో తెలంగాణలో అవసరమా’?..
సాక్షి, జగిత్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో తెలంగాణలో అవసరమా అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గురువారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోల్వాయి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని అన్నారు. అలాంటి వారు కూటమి పేరుతో ముందుకి వస్తున్నారని, వారిని ఆదరించ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు అని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. నీటికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా నిధులిచ్చే వారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అందరికీ సమానంగా నిధులిస్తోందని చెప్పారు. రైతు బంధు పేరుతో పెట్టుబడి ఇవ్వటమే కాకుండా, సమయానికి ఎరువులు, కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. పేదవాడి కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు. టీఆర్ఎస్ పేదల అభ్యున్నతికి పాటు పడుతుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ దళితుల కోసం ప్రత్యేక పథకాల రూపకల్పన చేస్తున్నారని వెల్లడించారు. అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని వారందరికి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బు చెల్లింపులు జరుగుతాయన్నారు. -
మహిళాబిల్లు తెస్తే మద్దతిస్తాం
హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడితే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్సభ, రాజ్యసభల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్, ఐఎస్బీ సంయుక్త ఆధ్వర్యంలో 2018 ‘యంగ్ థింకర్స్ కాన్ఫరెన్స్’లో కవిత మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారానే రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. లోక్సభలో 542 మంది సభ్యుల్లో 64 (11శాతం), రాజ్యసభలో 245 మందికి 27 మంది(11 శాతం) మహిళలు మాత్రమే ఉన్నారని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 4,198 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 9 శాతమే మహిళా ఎమ్మెల్యేలున్నారని ఆమె వివరించారు. మనీ, మీడియా, మెన్ అనే ఈ మూడు అంశాలతో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రతి ఆడపిల్లను చదివించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 లక్షల డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను మహిళల పేరిట ఇస్తున్నామన్నారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీలో భాగంగా ఇప్పటివరకు 13,000 మందికి పట్టాలివ్వగా అవన్నీ మహిళల పేరిటే ఉన్నాయని చెప్పారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల రాష్ట్ర ఇన్చార్జీ స్వాతి లక్రా మాట్లాడుతూ షీటీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటుతో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ మిలింద్ సోహానీ, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, టీఆర్ఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్, ఇండియన్ నెవీ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి, భారత పర్వాతారోహకులు మాలావత్ పూర్ణ, జాహ్నవి శ్రీపెరంబుదూరు, సామాజికవేత్త తెమ్సుతుల ఇమ్సాంగ్లు పాల్గొన్నారు. -
తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గల్ఫ్ వలసలకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వంద ఎలుకలను మింగిన పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దుబాయ్కి వెళ్లి గల్ఫ్ బాధితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఇక్కడి యువతకు స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ముంబై.. దుబాయ్.. బొగ్గుబాయి అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశా రు. 2006లో గల్ఫ్ సెల్ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ల కాలంలో నయా పైసా బడ్జెట్ కేటాయించకుండా నెట్టుకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం వెచ్చించిందన్నారు. గతంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ మరణిస్తే వారి కుటుంబసభ్యులు కడసారి చూపు కూడా నోచుకోలేని స్థితి ఉండేదన్నారు. టీఆర్ఎస్ హయాంలో వివిధ దేశాల్లో మరణించిన 1,278 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించిందని గుర్తుచేశారు. -
ప్రగతిభవన్లో బతుకమ్మ వేడుకలు
-
‘ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందాలంటే ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులతో కలిసి హైదరాబాద్లోని పోచారం నివాసంలో ఎంపీ కల్వకుంట్ల కవితతో బుధవారం సమావేశమయ్యారు. -
నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత
నిజామాబాద్: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల నిథుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం..లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుంటారా అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తనకు తెలియదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మాకు 100 శాతం మార్కులు వేశారు..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇవే ఫలితాలు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమే..వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్ అని అన్నారు. కొంగర కలాన్ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడంలేదని అన్నారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని చెప్పారు. జోనల్ వ్యవస్థతో పరిపాలనాసౌలభ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. -
‘బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్ పార్టీ’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారిని నిరుద్యోగులుగానే ఉంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్కి ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తానన్న కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను నియంతృత్వ పాలనలో పరిపాలిస్తుందన్నారు. సాగుకోసం రైతులు నీళ్లడిగితే ఊళ్లకు ఊళ్లను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్, కవితలు ఈ చరిత్ర మర్చిపోయారని అందువల్లే ప్రజలకు మేలు చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరిని మూసివేశారని ఆరోపించారు. బీజేపీ ‘బీ’ టీమ్ టీఆర్ఎస్ పార్టీ తన అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ మోడీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారని మధు యాష్కి విమర్శించారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని ప్రజా సంఘాలు, వర్గాలు, మహిళలు ముందుండి ఈ ప్రజాకంటక పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహిళల అక్రమ రవాణాలో మనమే ముందున్నాం : గీతారెడ్డి మహిళల అభివృద్ధికోసం కృషి చేస్తున్నామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి ఎద్దేవాచేశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. దీన్ని బట్టే తెలంగాణలో ఎలాంటి పాలన ఉందో అర్ధమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం చాలా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా మహిళల పేరుతోనే మొదలు పెట్టేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పాలనలో స్వయం ఉపాధి మహిళా సంఘాలకు చాలా అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ మహిళా సంఘాలతో సమావేశం అవుతారని తెలిపారు. అందువల్ల మహిళలు పెద్దఎత్తున ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్ను సెక్రెటేరియట్ కోసం ఇస్తే భారీ ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. -
మా అన్నే నాకు హీరో..!
సాక్షి, హైదరాబాద్/ నిజామాబాద్ : ‘మా అన్న కేటీఆర్ నాకు హీరో.. ఆయనే నా ఇన్స్పిరేషన్’ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బుధవారం నిజామాబాద్లో జరిగిన ఐటీహబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్ కోసమే ఐటీహబ్ను నిర్మిస్తున్నామన్నారు. వాట్సప్ లాంటి ఆవిష్కరణలు పుట్టింది సామాన్యుల ఆలోచనలనుంచేనని, నిజామాబాద్ ఐటీలో అలాంటి ఆవిష్కరణలు కచ్చితంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మేం వచ్చే ఎన్నికల కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్నాం. ఐటీ హబ్లో టాస్క్ ప్రోగ్రామ్తో విద్యార్థులకు మార్గదర్శనం లభిస్తుంది. దీనిలో భాగస్వామ్యం అవుతున్న ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు. జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా స్టేడియంలు నిర్మిస్తున్నాం. రూ. 25 కోట్లతో ప్రత్యేక బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీ స్థాయిని పెంచుతాం. తెలంగాణ వచ్చాక ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగుతోంది. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అందరూ అలవర్చుకోవాలి. నిజామాబాద్లో కళాశాలల విద్యార్థుల సంఖ్య ఎంతో అన్ని మొక్కలు నాటాలి. మొక్కలు నాటి నా ట్విటర్ అకౌంట్కి ట్యాగ్ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ సారూ.. మమ్మల్ని తెలంగాణలో కలపండి..!
సాక్షి, ముంబై : తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పట్ల ఆకర్షితులైన మహా రైతులు ఈ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్.. రైతులకు పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు వీలుగా తమ తాలుకాలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలంటూ నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ తాలుకా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టీఆర్ఎస్ ఎంపీ కవితను కోరినట్లు సమాచారం. నిజామాబాద్లో రైతు బంధు చెక్కుల పంపిణీ చేస్తున్న ఎంపీ కవితను కలిసిన బాబ్లీ గ్రామ సర్పంచ్ తమ సమస్యలను ఆమెకు వివరించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను మరో రాష్ట్రంలో కలపడం అంత తేలికేమీ కాదని తమకు తెలిసినా ఇటువంటి రైతు సంక్షేమ పథకాలు పొందాలంటే మరో మార్గం కనిపించడం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు మహా రైతులు చేసిన అభ్యర్థన అసంబద్ధంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ, వ్యవసాయం కోసం 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, రైతులకు 5 లక్షల జీవిత బీమా కల్పించడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. -
రిజర్వేషన్లు తీసేసే కుట్ర జరుగుతోంది : ఎంపీ కవిత
సాక్షి, నిజామాబాద్ : ఎస్సీ-ఎస్టీ చట్టంలో ఒక్క కామా, ఫుల్స్టాప్ మార్చినా ఊరుకొనేది లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఇవ్వటంలో ఒక తార్కిక విధానం ఉందని, దాని గురించి అంబేద్కర్ అప్పుడే ఆలోచించారని పేర్కొన్నారు. మహిళ హక్కుల గురించి కూడా అప్పడే ఎంతో గొప్పగా ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తోందని, ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం 22,400 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమం, ఉన్నతి కోసం ఖర్చు చేసిందని వెల్లడించారు. వారి అభివృద్ధికి కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లు తీసేయడానికి కుట్ర జరుగుతోందని, ఎస్సీ ఎస్టీ చట్టంలో ఒక్క కామా, ఫుల్స్టాప్ కూడా మార్చినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. ఇది దళితులతో ప్రారంభమైన ఇది తర్వాత అందరి విషయంలో ఇదే విధంగా కొనసాగుతుందని, ఎస్సీ ఎస్టీలకు ఇతర కులాలు, మతాల వారు కూడా బాసటగా నిలవాలని కవిత కోరారు. -
నాలో శ్వాస ఉన్నంతవరకు యోగా చేస్తా..
రోగాల నుంచి విముక్తికి యోగానుఅలవర్చుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను తొమ్మిదేళ్ల వయసప్పుడే యోగా నేర్చుకున్నానని తెలిపారు. 2050 సంవత్సరం కల్లా దేశంలో ఎవరూ రోగాలతో బాధపడకూడదన్నారు. పతాంజలి వస్తువుల విక్రయం ద్వారా వచ్చే లాభాల నుంచి ఆరోగ్యం, చదువు కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దళితులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని అన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరుగనున్న ఉచిత యోగా ధ్యాన శివిరంలో పాల్గొనవలసిందిగా ఎంపీ కవితను బాబా రాందేవ్ ఆహ్వానించారు. కవిత నగరానికి వచ్చిన బాబా రాందేవ్ను కలిశారు. అనంతరం రాందేవ్ మంత్రి హరీష్రావుకు ఫోన్చేసి యోగా శివిరంలో పాల్గొనాలని కోరారు. నిజామాబాద్ సిటీ(నిజామాబాద్అర్బన్): రోగాలతో బాధపడేవారికి యోగా ఒక అద్భుతమైన అవకాశమని, రోగాల నుంచి విముక్తికి యోగాను అలవర్చుకోవాలని బాబా రాందేవ్ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 9ఏళ్ల వయస్సు నుంచే యోగా నేర్చుకున్నానని, తనలో శ్వాస ఉన్నంత వరకు యోగా చేస్తానని అన్నారు. జూలై 21 యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిచోట మూడు రోజుల శివిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. జూలై 21 యోగా డే ప్రపంచం మొత్తం యోగా దినంగా పాటించటం గర్వించదగిన విషయమన్నారు. పతాంజలి వస్తువుల విక్రయించటం ద్వారా వచ్చే లాభాలను ఆరోగ్యం, చదువు కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఇందు లో తనతో పాటు పతాంజలి బాలకృష్ణ ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో యోగా వైద్యుడు జయదీప్ ఆర్యా, భారత్ స్వభిమాన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, యువ భారత్ అధ్యక్షుడు సచిన్, యోగా శిక్షకులు కృపాకర్, మంజుశ్రీ, శివకుమార్, శివుడు పాల్గొన్నారు. దళితులపై దాడులనుఖండించాల్సిందే.. సమాజంలో దళితులు ఒక భాగమని వారిపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని బాబా రాందేవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 10 నుంచి 12 వరకు నిర్వహించే ఉచిత యోగా శిక్షణ, యోగా చికిత్స శివిరం సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన బాబా రాందేవ్ ఆర్యసమాజంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా దేశంలో దళితులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితులో అన్యాయం జరుగరాదన్నారు. దీనిని సాకుగా కొందరు నేతలు, ఇతరులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దన్నారు. దళిత సమాజం సమన్వయం పాటించాలని ఆయన కోరారు. లక్ష మంది విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలో యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. -
డీఎస్ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నిజామాబాద్ : సీనియర్ నేత, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్పై ఆయన తనయుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని డీఎస్ను అరవింద్ కోరుతున్నారు. బీజేపీ నేత అయిన అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని డీ శ్రీనివాస్ను కోరారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు(డీ శ్రీనివాస్) టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని అరవింద్ పేర్కొన్నారు. పనిలో పనిగా ఎంపీ కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని అరవింద్.. ఎంపీ కవితకు సూచించారు. -
జాతీయ సంఘాలను నిలదీయండి
-
జాతీయ సంఘాలను నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను సింగరేణి కార్మికులు నిలదీయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి చెందిన పదకొండు ఏరియా కమిటీల బాధ్యులు, సెంట్రల్ కమిటీ కార్యవర్గం శనివారం టీబీజీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. సింగరేణి అక్షయపాత్ర వంటిదని.. ఇప్పటికే 5,600 ఉద్యోగాలు సృష్టించామని, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఎప్పుడూ గుర్తింపు కోసం పోట్లాడుకునే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసిపోయి టీబీజీకేఎస్ను ఓడించేందుకు కలగంటున్నాయని, ఈ సారీ సింగరేణిపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాటి ఏఐటీయూసీ నేతలు త్యాగాలు చేస్తే, నేటితరం నేతలు భోగాలు అనుభవిస్తున్నారన్నారు. సింగరేణి కార్మికులకు గుడ్డు, పాలు బంద్ చేసినప్పుడు, డిపెండెంట్ ఉద్యోగాలు తీసేసినప్పుడు, ఈ జాతీయ సంఘాలెందుకు నోరు మెదపలేదని నిలదీశారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.. డిపెండెంట్ ఉద్యోగాలకు కోర్టు కొంత వెసులుబాటు కల్పించిందని, కచ్చితంగా అమలు చేస్తామని, సీఎం కేసీఆర్కే అది సాధ్యమని కవిత అన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీలది కార్మిక కూటమి కాదని.. సీఎం కేసీఆర్ వ్యతిరేక కూటమని విమర్శించారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, జీరో వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని, దీనిపై త్వరలో సీఎం ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల క్వార్టర్లలో ఏసీ సౌకర్యం కల్పిస్తామని, బావుల్లో పనిచేసి ఆరోగ్య సమస్యలొచ్చిన వారికి వేతన రక్షణతో ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యసేవలు.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇల్లెందుకు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, కనకరాజు, సింగరేణి ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంతులు నాయక్, భూక్యా నాగేశ్వర్, ఎంపీ సీతారామ్ నాయక్ తదితరలు పాల్గొన్నారు. -
పూలకు మొక్కుత
దేవుడు, ప్రకృతి, సమాజం, మనిషి.. ప్రపంచానికున్న నాలుగు దిక్కులు. దేవుణ్ని ప్రేమించనివాడు... ప్రకృతిని కాపాడనివాడు... సమాజాన్ని గౌరవించనివాడు... సాటి మనిషిని హత్తుకోనివాడు... దైవానుగ్రహానికి అనర్హుడు. పువ్వు ఏ చెట్టుకు పూసినా దేవుని పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. మనిషిలో ఏ మంచి ఆలోచన వచ్చినా సమాజానికి పాదులు తీసి నాటాలనిపిస్తుంది.బతుకమ్మ పండగ.. దేవునికి, సమాజానికి, మనిషికి ప్రకృతి పూలు అద్దే సుగంధం. అలాంటి పూలకు మొక్కుత అలాంటి గుణానికి దండం పెడత. పూలు లేని పూజ ఉండదు. పూలనే పూజించడం అంటే .. ఏమిటీ ఆంతర్యం? బతుకమ్మ అంటే వేదాంతం. ఒక జీవనప్రయాణం ఎలా ఉంటుందో ఈ బతుకమ్మ ద్వారా తెలుసుకోవచ్చు. అడవిలో పూసే గునుగు, తంగేడు.. వంటి పూల చెట్లను మనవెవ్వరమూ నాటం. నీళ్లు పోయం. దేవుడే వాటిని పుట్టించాడు. ఆ పూలను ఏరుకొచ్చి ఒద్దికగా పేర్చి, బతుకమ్మ అని కొలుస్తూ, సంబరం చేసుకుంటాం. మనిషి బతికున్నన్నాళ్లు ఇంత సంబరంగా ఉండాలని ఆడతాం, పాడతాం. తర్వాత అందంగా పేర్చిన ఆ బతుకమ్మను నీళ్లలో వదిలేస్తాం. అంటే ప్రకృతిలో కలిపేస్తాం. మనిషి కూడా చివరకు అంతేగా! ప్రకృతిలో కలిసి పోవాల్సిందే! ఇది వేదాంతం. అందుకే ఈ సందర్భంగా తొలిరోజున పెద్దలను గుర్తుచేసుకొని బతుకమ్మను పేర్చుతాం. అంటే ముందు మరణాన్ని తలుచుకుంటున్నాం. అదే బతుకమ్మ పండగలో భాగమయ్యింది. రెండవది.. ప్రకృతి ఆరాధన. గిరిపుత్రిక పార్వతీ దేవి శివపూజ కోసం పూలన్నీ ఒకచోట చేర్చి తీసుకెళ్లేది. అలా మనం పూలన్నీ తీసుకెళ్లి ఆడి పాడి శివునికి అర్పిస్తున్నాం. పార్వతీ, పరమేశ్వరులు ప్రకృతీ పురుషులు కదా! మూడవది.. పర్యావరణం. ఔషధ గుణాలున్న పూలన్నీ తీసుకెళ్లి నీళ్లలో వదిలితే నీళ్లు శుద్ధి అవుతాయి. దానివల్ల జీవులకు శుద్ధ జలం అందుతుంది. అంటే.. ఈ పండగలో అధ్యాత్మికత, ప్రకృతి, పర్యావరణం అలాగే సామాజికం... ఇవన్నీ ఒకదానికొకటి కలిపి ఉన్నాయి. దేనికీ భంగం కలగకుండా మనిషిగా మన బాధ్యతలేంటో ఈ పండగ తెలియజేస్తుంది. ప్రతీసారి బతుకమ్మ ఉత్సవాలు దేశ విదేశాలలో చేస్తుంటారు. ఈ సారి ఆ హంగామా కనిపించడం లేదు? బతుకమ్మ వేడుక దేశ విదేశాలలో వరుసగా తొమ్మిదేళ్లు చేస్తానని సంకల్పించుకున్నాను. ఇప్పటికి పూర్తయ్యింది. ఈ వేడుక మొదలుపెట్టినప్పుడు టెన్షన్గా ఉండేది. ద్వితీయ శ్రేణి వారు చేసుకునే పండగగా చాలామంది భావించేవారు. ఎన్నో అవమానాలు, అన్నీ అనుమానాలు.. అన్నింటినీ భరించాను. దృఢంగా సంకల్పించుకుంటే ఏ పని అయినా పూర్తవుతుందని నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ పండగలో పాల్గొనేలా చేసినందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉంది. అంతేకాదు ప్రపంచదేశాలలో ఉన్న తెలుగువారూ మన సంస్కృతిని మరిచిపోకుండా ఉండేలా ఆయా దేశాలకు వెళ్లాను. వేడుకలు నిర్వహించాను. ఇన్నాళ్లూ కొనసాగించే శక్తిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాను. మొదట ప్రారంభించినప్పుడు కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనేవారు. తర్వాత్తర్వాత యువతరం అంతా ఈ వేడుకను సొంతం చేసుకున్నారు. అందంగా సంప్రదాయబద్ధంగా అలంకరించుకొని, రంగు రంగుల బతుకమ్మలను తెచ్చి, చుట్టూ చేరి ఆడి పాడుతుండటం పెరిగింది. ఇంతమంది కలిసి ఆడుతూ పాడుతూ సంబురాలు చేస్తుంటే రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది. ఎన్నేళ్లుగా మీరు బతుకమ్మ పూజలు చేస్తున్నారు? నవరాత్రుల సమయంలో ఈ శక్తికి కారణాలేంటి అని ఎప్పుడైనా యోచించారా? పెరిగింది హైదరాబాద్లోనే, అయినా పండగ వచ్చిందంటే చాలు నానమ్మ ఊరు వెళ్లేవాళ్లం. నా చిన్నప్పటి నుంచి బతుకమ్మల సందడి ఉంది. బతుకమ్మలను కొలవడం వల్ల ఒక దైవిక శక్తి మనలోకి చేరుతుంది అనే భావన ఉంది. బహుశా ఇది అందరితో కలిసి పాల్గొనే వేడుక వల్ల కలిగి ఉంటుంది. బతుకమ్మ నాకు ఒక క్రమశిక్షణను నేర్పింది. బతుకమ్మ తొమ్మిదిరోజులు పండ్లు తప్ప వేరే ఆహారం తీసుకోను. అయినా, ఈ తొమ్మిది రోజులు ఉత్సవాల్లో పాల్గొనడానికి కావల్సినంత శక్తి వస్తుంది. ఇది ఒక సంకల్పంగా నాకు నేనే చెప్పుకున్నాను. జీవితాంతం ఈ నియమాన్ని కొసాగిస్తాను. దేవీనవరాత్రులలో అమ్మవారిని ఎలాగైతే కొలుస్తామో, బతుకమ్మ రూపంలో శక్తిని పాటలతో పూజిస్తాం. రంగు రంగు పూలు. అవి కూడా అడవిల పూసే పూలను గుట్టగా పోసి వాటిని అమ్మగా భావిస్తాం. మన మధ్య జరిగే చిన్న చిన్న జగడాలు, ఆనందాలు, బాధలు, శ్రమను మర్చిపోవడానికి తీసే రాగాలు.. ఉయ్యాల పాటలు అయ్యాయి. గంగ గౌరి సంవాదం పాటనే తీసుకుంటే... ‘గంగ, గౌరి గవ్వలు ఆడంగ.. గవ్వలు ఆడంగ కయ్యమయ్యిండ్రి..’ అని ఉంటుంది. పార్వతీ దేవి శివయ్య పూజకు వేళయ్యింది నీళ్లు ఇవ్వమని గంగను బతిమాలుకుంటుంది. గంగేమో శివయ్యను ఇస్తే నీళ్లు ఇస్తానంటుంది గంగ. అలా తనలో సగమైన శివయ్యను ఇస్తే పార్వతికి నీళ్లు ఇచ్చింది గంగ. ఇలాగే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు, అక్కచెల్లెళ్లు.. సామాజికంగా జరిగే సంఘటనలను దేవుళ్లకు ఆపాదించి పాటలుగా చెబుతుంటారు. దేవుళ్లు అంటే ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట అయ్యింది. మీరు ఇష్ట దైవంగా ఎవరిని కొలుస్తారు? దైవానికి సంబంధించి ఒక రూపం అంటూ ఏమీ లేదు. పిల్లలు పుట్టాక ఇలా నా ఆలోచన మారింది. దానికి ముందు అమ్మావాళ్లతో పాటు పూజల్లో పాల్గొనేదాన్ని. ఇప్పటికీ నోములు, వ్రతాలు చేస్తాను. కానీ, ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. పసివాడు కదా... మనం ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఏం జరుగుతుందో అనే భయం. పనిమీద బయటకు వెళ్లి వచ్చేలోపల వీడికేదైనా అయిపోతుందేమో అని భయం. అప్పడు అనుకున్నాను .. భగవంతుడా నువ్వే చూసుకోవాలి అని. భగవంతుడు ఉన్నాడు అని అప్పుడే అర్థమెంది. నా కొడుకు సురక్షితంగా ఉన్నాడంటే దేవుడి దయనే! ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆయన ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. మా ఇద్దరి పిల్లలచేత కూడా అలాగే ప్రార్థన చేయిస్తా. ఏదైనా సమస్య వస్తే కళ్లు మూసుకొని నీ దేవుడు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఊహించుకొని, ఏం కావాలని చెప్పమంటాను. మీ నాన్నగారు ప్రకృతిలో ఉన్న శక్తిని బాగా నమ్ముతారు. అది యాగమైనా, వాస్తు అయినా, మరైదేనా కావచ్చు. దీనిపై మీకేమనిపిస్తుంది. మనం ఎటువైపు వంట చేసుకోవాలి? ఏ వైపు పూజ చేయాలి? ఏ వైపు నిద్రించాలి.. ఈ విధి విధానాలనే వాస్తుగా భావిస్తున్నాం. దీని ప్రకారం ఇల్లు, కార్యాలయం వంటివి ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనం ఉండే చోటుకి వచ్చేస్తుంది. అప్పుడు మరింత శక్తితో ఎక్కువ పని చేయగలం. యాగం అంటే హైందవ ధర్మంలో చెప్పిన అత్యున్నత కర్మ కాబట్టి చేశారు. ఇవన్నీ మన భూమిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకోకుండా కొంతమంది విమర్శిస్తుంటారు. మీకు అమెరికాలో ప్రమాదం జరిగినప్పుడు మీ నాన్న ‘దేవుడే నా బిడ్డను చూస్తాడు’ అన్నారట. మీరు అలా అనుకున్న సందర్భాలు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో చాలా బాధపడేవాళ్లం. ఆ సమయంలో ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని. దేవుడా వీళ్లను కాపాడు అని వేడుకునేదాన్ని! ∙కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెట్టుకోవాలా? విజయాలు కలిగినప్పుడు తలుచుకోవాలా? మన కష్టమేంటో చెప్పుకోవడం అవసరం. అంతటితో పూర్తవుతుంది. విజయం సాధించినప్పుడు దానిని నిలబెట్టుకోవాలంటే దైవశక్తి ఇంకా అవసరం. అందుకే అప్పుడా, ఇప్పుడా అని లెక్కలేమీ లేవు. ఎప్పుడూ తలుచుకోవాలి. ∙మీరు జయశంకర్ని గురువుగా భావిస్తారు. ఆయనేమో దేవుణ్ణి నమ్మేవారు కాదు. దీనిని ఎలా చూస్తారు? ఆయన పూజలు, క్రతువులు నమ్మరు. సంఘాన్ని ప్రేమించేవారిలో దైవత్వం ఉంటుంది. పక్కమనిషి ఆపదలో ఉంటే వెంటనే సహాయం చేయాలనే గుణం అలాంటి వాళ్లలోనే ఉంటుంది. జీవితంలో ఎవరిన్నీ హర్ట్ చేసి ఉండరు. అంతకుమించిన దైవత్వం ఇంకెక్కడ ఉంటుంది? ప్రజలకు అన్యాయం జరగవద్దని జీవితాంతం కష్టపడ్డారు. అంతకుమించిన దైవత్వం ఉండదు. ప్రభుత్వం యాదగిరి గుట్టను బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతోంది. ఈ ఆలయానికి మీరు తరచూ వెళ్లేవారా? ఇంకా ఏయే ఆలయాలను సందర్శించారు? వాటిలో మీకే ఆలయం బాగా నచ్చుతుంది? మా వారికి యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే గట్టి నమ్మకం. కొత్తగా ఏ వాహనం తీసుకున్నా గుట్టకు వెళ్లాల్సిందే! కుటుంబంతో కలిసి కూడా తరచూ వెళుతుంటాం. సెంటిమెంట్ కాదు కానీ, అదొక అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య నా చిన్న కొడుకు పుట్టినరోజు అయితే పెద్దమ్మగుడికి వెళ్లాం. మొన్న అస్సామ్లోని కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లాం. చాలా శక్తివంతమైన ఆలయం. అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు మానసాదేవి ఆలయానికి అమ్మావాళ్లతో కలిసి వెళ్లాను. ఈ గుడి ఉన్న ప్రాంతం... ఆ వాతావరణం సూపర్బ్గా ఉంటుంది. ఆలయాలకే కాకుండా మసీదు, చర్చిలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయా? నేను చదువుకున్నది స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్. ఆ విధంగా ఏసు పాటలు పాడుతుండేదాన్ని. చర్చికి వెళుతుండేదాన్ని. మా అత్తగారి ఇంట్లో మొదటి సంతానానికి దర్గాలో పుట్టెంట్రుకలు తీయాలనే మొక్కు ఉంది. ఆ విధంగా నా పెద్ద కొడుకు పుట్టు వెంట్రుకలు మా ఊరికి దగ్గరలోని పొటంగల్ దర్గాలోనే తీసాం. రాబోయే తరం దైవత్వాన్ని ఎలా అర్ధం చేసుకుంటుంది అని మీ భావన..? పూజాదికాల వంటి క్రియలు నలుగురితో కలిపి చేసుకోవాలనుకున్నా వ్యక్తిగతంగా దైవం అంటే ఏంటో తెలుసుకుంటారు. దైవశక్తిని అర్థం చేసుకునే విధానంలో మంచి మార్పులు వస్తాయనిపిస్తుంది. దేవీ నవరాత్రులలో ఒకరోజు అన్నపూర్ణ, ఒక రోజు శాకంబరి, ఇంకోరోజు సరస్వతి.. ఇలా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కోఅవతారంగా పూజిస్తాం. ఇవన్నీ మనలో ఉండేవే. అన్నపూర్ణను ఎందుకు పూజిస్తాం... అన్నం సమృద్ధిగా లభించాలని, లక్ష్మీదేవిని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, సంతోషంగా చూడాలని..! వైదికంగా పూజించే అమ్మవారైనా, జానపదులు పూజించే బతుకమ్మయినా అభద్రతను భద్రతగా మార్చుకునే దిశగా పయనించేందుకు ఎంచుకుంటాం. ప్రాచీన ఆరాధన పద్ధతులను పరిశీలిస్తే మనకీ విషయం స్పష్టమౌతుంది. దైవం, శక్తి ఆరాధనల గురించి చెప్పుకోవాలంటే ఆఫ్రికన్ దేశాల ఆరాధన పద్ధతులే మొదట ఉన్నాయి. వాళ్లు శక్తిని మధ్యలో పెట్టి చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ కొలిచేవారట. అంతెందుకు... మానవుడు మొదటిసారి నిప్పుని తెలుసుకున్నప్పుడు మధ్యలో అగ్నిని రగిల్చి, చుట్టూ చేరి వారి వారి పద్ధతుల్లో పూజించేవారు. బతుకమ్మ కూడా అలాగే! పూలతో శక్తిని ఆరాధిస్తున్నాం. దేవుళ్లు ఎక్కడో లేరు. మనలోనే ఉన్నారు. మన పాటల్లో ఉన్నారు. మన బతుకులో ఉన్నారు. మన శ్రమలో ఉన్నారు. తెలంగాణ అంటేనే శ్రమ జీవనం. శ్రమలోనుంచే పాట పుట్టింది. అదే బతుకమ్మ పాట . ఆధ్యాత్మికంగా దైవం అంటే ఏంటో తెలిసింది మా పెద్దబాబు పుట్టిన తర్వాత. వాడి పెంపకంలో చాలా భయపడిపోయేదాన్ని. ఒక్కడిని చూసుకోవడానికే నేనింత కష్టపడుతుంటే ఆ దేవుడు ఇంతమందిని ఎలా చూసుకోవాలి? అనిపించింది. అప్పుడే దేవుడితో నాకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
9 దేశాల్లో బతుకమ్మ
♦ జాగృతి అధ్యక్షురాలు కవిత ♦ ఈసారి 1,100చోట్ల సంబురం ♦ బతుకమ్మ పాటల యాప్ విడుదల ♦ వచ్చే నెల 6వ తేదీన 30 వేల మందితో బతుకమ్మ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి తరపున ఈ ఏడాది 9 దేశాల్లో 11 వందల ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నామని సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. జాగృతి తరపున బతుకమ్మ పాటలతో కూడిన మొబైల్ యాప్ను ఆమె తెలంగాణ భవన్లో బుధవారం విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయన్నారు. అక్టోబరు 6న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 30 వేల మందితో గిన్నిస్ రికార్డు సాధించేలా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనుందని చెప్పారు. జాగృతి బతుకమ్మ యాప్లో పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పాటలతో పాటు జాగృతి కార్యకలాపాల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని అన్నారు. గత ంలో ప్రతీ నియోజకవర్గంలో అయిదు చోట్ల మాత్రమే నిర్వహించామని, ఈసారి పది చోట్ల జరపనున్నామని చెప్పా రు. వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ఏపీకి ఇచ్చినంతే తెలంగాణకు ఇవ్వాలి తెలంగాణ విమోచన అన్నప్పుడు మాత్రమే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ గుర్తుకు వస్తుందని, వరదలంటే మాత్రం ఏపీ గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. వరద సాయంగా ఏపీకి ఎంతిస్తే, తెలంగాణకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దె బ్బకొట్టేందుకు ఒక వర్గం మీడియా కుట్ర చేసిందని, హైదరాబాద్ సాంతం మునిగిపోయినట్లు దుష్ర్పచారం చేసిందని అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరదలప్పుడు రాజకీయాలకతీతంగా పనిచేయాల్సిన ప్రతిపక్షాలు వాటినీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి గురించి తాము బయట పెట్టదలుచుకుంటే ఇప్పటి వరదల కంటే వారి అవినీతి వరదే ఎక్కువన్నారు. మిడ్మానేరుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992లో మిడ్మానేరు నిర్మించాలని ప్రతిపాదిస్తే 2006లో తొలిసారి టెండర్లు పిలిచారని గుర్తుచేసిన ఆమె, 2006 నుంచి రెండేళ్ల కిందటి దాకా ఎవరు అధికారంలో ఉన్నారని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో జరగని పనులు ఈ రెండేళ్లలోనే జరుగుతాయా అని నిలదీశారు. వర్షాలు పడినప్పుడు నష్టం జరుగుతుందని, ఈ సమయంలో ప్రజలకు సాయం చేయకుండా రాజకీయం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
ఇంకా 56 మంది ఉన్నారు!
ఈ ఐదుగురు ఎంపీలు శాంపిల్! లోక్సభలో ఇంకా 56 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. వాళ్లందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అవకాశం వస్తే ఎలా మాట్లాడతారో.. వీళ్లైదుగురూ మాట్లాడి చూపించారు! ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ.. ముఖం ఇంతైంది! ‘అరె..వా!’ అన్నారు. బడ్జెట్లో మగ ఎంపీలు రాజకీయాలు చూస్తే..మహిళా ఎంపీలు లెక్కలు సరి చూశారు. సరి చేశారు. ఒకటి నిజం. ముగ్గేసి, దీపం పెట్టిన ఇల్లు.. గర్భగుడి. మహిళలు మాట్లాడని సభ.. మొక్కుబడి. కల్వకుంట్ల కవిత, బుట్టా రేణుక, పూనమ్ మహాజన్, సాధ్వి సావిత్రిబాయి ఫూలే, హీనా గవిట్... ఈ అయిదుగురు ఎంపీలు... ఆర్థికాంశాల మీద మహిళలకు ఎంత అవగాహన ఉంటుందో, భావ వ్యక్తీకరణలో ఎంతటి స్పష్టత ఉంటుందో, ఎంత నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉంటారో నిరూపించారు. మొన్న లోకసభలో సాధారణ బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఈ అయిదుగురు ఎంపీలు చేసిన ప్రసంగం తోటి సభ్యులను, ముఖ్యంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని చాలా ఆకట్టుకుందట. ఈ విషయాన్ని జైట్లీనే స్వయంగా పార్లమెంటులో అందరి ముందూ చెప్పారు. ‘పురుషులు రాజకీయపరమైన ప్రసంగాలకు ప్రాధాన్యమిస్తే మహిళా ఎంపీలు మాత్రం తగు గణాంకాలను ఉటంకిస్తూ సరైన అంశాల మీద స్పందించారు. సమస్యలను ప్రస్తావించారు’ అంటూ ఈ అయిదుగురు ఎంపీలను జైట్లీ ప్రశంసించారు. అరుణ్జైట్లిని అంతగా అబ్బురపరిచిన ఈ అయిదుగురి నేపథ్యం కూడా సామాన్యమైనదేమీ కాదు. ఆయన చెప్పినట్టు రాజకీయాలంటే అవగాహన, ప్రజల సమస్యల మీద లోతైన అధ్యయనం చేసే పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. వీళ్ల వెనక రాజనీతిజ్ఞులైన వాళ్ల తండ్రులున్నప్పటికీ ఈ తనయలు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీళ్ల వివరాలు.. సంక్షిప్తంగా.. బుట్టా రేణుక (44) బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. ఇంటర్ వరకు చదివిన రేణుక... దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికన్నా ధనవంతురాలు. ఈమె ఆస్తి విలువ మొత్తం 300 కోట్ల రూపాయలు. రేణుక భర్త బుట్టా నీలకంఠం తెలుగుదేశం పార్టీ సభ్యుడు. రేణుక రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా ఉన్నారు. మెరిడియన్ స్కూల్ నిర్వహణా బాధ్యతలూ ఆమెవే. హోటల్స్, రిటైల్ వ్యాపారరంగంలోనూ భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. సమాజానికి మరిన్ని సేవలందించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి ప్రాధాన్యం ఇవ్వాలని రేణుక అంటారు. కల్వకుంట్ల కవిత (38) నిజామాబాద్ నియోజకవర్గ ఎంపి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, తెలంగాణరాష్ట్రసమితి సభ్యురాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. 2015లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చీఫ్ కమిషనర్గా ఎన్నికయ్యారు. కరీంనగర్లో జన్మించారు. ప్లస్ టూ వరకు హైదరాబాద్లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదివిన కవిత తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ను విఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూర్తి చేశారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిసిసిప్పిలో మాస్టర్స్ చేయడానికి చేరారు కానీ మధ్యలోనే ఆపేశారు. ఎప్పటికైనా ఎమ్మెఎస్ పూర్తిచేయాలనేది ఆమె లక్ష్యం. అంతేకాదు కెమిస్ట్రీ అంటే అమితాసక్తి ఉన్న కవిత కెమిస్ట్రీలో కూడా మాస్టర్స్ చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు. తెలంగాణ, జమ్ముకశ్మీర్ ప్రజల సమస్యల సాధనలో తనూ భాగం పంచుకోవాలనే ఆశతో ఉన్నారు. లోక్సభలో తెలంగాణ సమస్యల మీద తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. హీనా గవిట్ (28) వృత్తిరీత్యా డాక్టర్ అయిన హీనా ప్రముఖ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, నండుర్బార్ అసెంబ్లీ అభ్యర్థి విజయ్కుమార్ గవిట్ కూతురు. 28 ఏళ్ల హీనా 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున నండూర్బార్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ప్రత్యర్థి అభ్యర్థి, ఇండియన్ నేషనల్కాంగ్రెస్ నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన మాణిక్రావు హోడ్ల్యాను ఓడించారు. సాధ్వి సావిత్రిబాయి ఫూలే (35) బహారైచ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు. సావిత్రి బాల్యవివాహ బాధితురాలు. ఆరేళ్లకే ఆమెకు పెళ్లిచేశారు. 1995, డిసెంబర్ 16న జరిగిన ఓ ధర్నాలో పాల్గొని బుల్లెట్ గాయానికి గురయ్యారు. లక్నో జైలుకీ వెళ్లారు. అప్పుడే నిర్ణయించుకున్నారు తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేయాలని. జైలు నుంచి బయటకు వచ్చాక... తన తండ్రిని, అత్తమామలను పిలిచి చెప్పారు.. వైవాహిక బంధం నుంచి తాను బయటపడి సామాజికసేవా కార్యకర్తగా బతకాలనుకుంటున్నానని. అంతా షాక్ అయ్యారు. అయినా నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆమె. వెంటనే ఆమె కుటుంబసభ్యులు సావిత్రి చెల్లెలిని ఆమె భర్తకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి సావిత్రి సాధ్వి సావిత్రిబాయి ఫూలేగా మారారు. బహరైచ్లోని జన్ సేవా ఆశ్రమంలో చేరారు. ఆమె రాజకీయ జీవితం కూడా అంతే నాటకీయంగా మొదలైంది. తను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు 480 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. కానీ పాఠశాల సిబ్బంది ఆ మొత్తాన్ని తమ దగ్గరే పెట్టుకున్నారు సావిత్రికి ఇవ్వకుండా. విషయం తెలిసిన సావిత్రి నిలదీస్తే సహించని పాఠశాల యాజమాన్యం 3 ఏళ్లు ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. 480 రూపాయల స్కాలర్ షిప్ మీద, చదువుకునే తన హక్కు మీద తను చేసిన పోరాటమే తనలో నేతను, రాజకీయ మహిళను మేల్కొపింది అంటారు సావిత్రి. తన నియోజకవర్గంలో సరైన రహదారులు, మంచినీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు కల్పించడమే ఎంపీగా తన తక్షణ కర్తవ్యం అంటారు. ప్రజలందరికీ ఉద్యోగవకాశాలు రావాలంటే పారిశ్రామికీకరణ ఒక్కటే మార్గం అంటారు. 2012లో ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ జిల్లా బాల్హ అసెంబ్లీస్థానానికి భారతీయ జనతాపార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు సావిత్రి. ఆ తర్వాత 2014 లోకసభ ఎన్నికల్లో బహరైచ్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. సావిత్రి ఎమ్మే చదువుకున్నారు. పూనమ్ మహాజన్ (35) దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు. ముంబై నార్త్ సెంట్రల్ పార్లమెంట్ నియోజక అభ్యర్థి. భారతీయజనతాపార్టీ సభ్యురాలు. 2006లో తన తండ్రి హత్యకు గురవడంతో ఆయన వారసత్వంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. మేనమామ గోపీనాథ్ముండే ప్రోత్సాహంతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. బ్రైట్ఆన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. -
కేంద్రంలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తా: ఎంపీ కవిత
నిజామాబాద్ కల్చరల్: కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే, అప్పుడు ఆలోచిస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. నిజామాబాద్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్రంతో తాము ఎప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉండాలనే కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం కేంద్రంతో తమకు ఏలాంటి విభేదాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం తమను వారి ప్రభుత్వంలో కలుపుకోవాలని ఆలోచిస్తే ఆలోచిస్తామన్నారు. -
ఎంపీ కవితకు అస్వస్థత
రాయికల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యూరు. సోమవారం కరీంనగర్ జిల్లా రారుుకల్లో చిన్న జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కవిత సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయి వాంతి చేసుకున్నారు. 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని యధావిధిగా సభాప్రాంగణానికి వచ్చి వేదికపై కూర్చున్నారు. ప్రయాణం వల్లనే కవిత అస్వస్థతకు గురైనట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
‘రైల్వే బడ్జెట్లో నిజామాబాద్కు అన్యాయం’
నిజామాబాద్: రైల్యే బడ్టెట్లో జిల్లాకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆమె నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైను కేవలం ఇంకా 28 కి.మీటర్లు మాత్రమే ఉందని, ఇది సాధించుకోవడంలో విఫలమయ్యామన్నారు. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రూ. 250 కోట్లు అవసరమన్నారు. పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ల విషయంలో కేంద్రం ఇంకా ఆలోచిస్తోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు అధికారులు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఐఏఎస్ అధికారుల పరిస్థితి త్వరలో తేలిపోతుందన్నారు. -
‘బంగారు తెలంగాణ’కు ఎన్నారైలు కీలకం
రాయికల్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైల పాత్ర చాలా కీలకమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. బంగారు తెలంగాణ సాధన దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వంద రోజుల పాలనపై టీఆర్ఎస్ ఎన్నారై సెల్ రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులర్పించినట్లు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ సోమవారం ఈ మెయిల్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. -
పూల పండుగే.. బతుకమ్మ
-
సీఎం పవర్ను పలుచన చేయం
టీఆర్ఎస్ ఎంపీలతో రాజ్నాథ్సింగ్ గవర్నర్కు ప్రత్యేక అధికారాలపై చర్చ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు రానివ్వం సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతాం రాష్ర్ట అధికారాల్లో జోక్యం చేసుకోం సమావేశం ఫలవంతమైందన్న టీఆర్ఎస్ ఎంపీలు సర్క్యులర్ ఉపసంహరణ పై హామీ ఇవ్వని కేంద్ర హోంమంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బం దులు ఉండబోవని ఈ సందర్భంగా ఎంపీలకు రాజ్నాథ్ భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి, ఎంపీలు బి.వినోద్కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల కవిత, బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్కు ప్రత్యేక బాధ్యతల పేరుతో ముఖ్యమంత్రి అధికారాల్లోకి చొచ్చుకు వచ్చేలా అవకాశం కల్పించడంపై ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు. పోలీస్ బదిలీల వరకూ గవర్నర్కు అధికారాలు కల్పించవద్దని కోరారు. స్టేషన్ హౌస్ అధికారి స్థాయి బదిలీకి కూడా గవర్నర్ ఆమోదం అవసరమని ఇటీవల కేంద్రం జారీ చేసిన సర్క్యూలర్ను ఎంపీలు తప్పుబట్టారు. దీనిపై హోంమంత్రి సర్ది చెప్పినట్టు సమాచారం. అయితే సర్క్యులర్ ఉపసంహరణకు నిరాకరించినట్టు సమాచారం. దీనివల్ల ముఖ్యమంత్రి అధికారాలకు ఎలాంటి ఢోకా ఉండదని అనునయించినట్టు తెలిసింది. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను ఎప్పటికీ చేపట్టబోమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం అనంత రం బయటకు వచ్చిన హోంమంత్రి మీడియా తో ముచ్చటిస్తూ.. ‘ముఖ్యమంత్రి అధికారాల్లో మేం జోక్యం చేసుకోవడం లేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నాం.’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడారు. ‘హోంమంత్రితో సమావేశం ఫలవంతమైంది. గవర్నర్కు అధికారాలపై ఈ నెల 8న హోం శాఖ నుంచి వచ్చిన లేఖ వల్ల మాకు కొంత ఆవేదన కలిగింది. పార్లమెంటులో దాన్ని లేవనెత్తాం. రాజ్నాథ్తో భేటీ లో అన్ని విషయాలు వివరించాం. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఎంత మేరకు జోక్యం చేసుకోగలదో చెప్పాం. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేయబోమని హోంమంత్రి మాకు హామీ ఇచ్చారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు.’ అని కె.కేశవరావు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అధికారాలను ఎలా కలిగి ఉన్నారో.. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వాటినే కలిగి ఉంటారని రాజ్నాథ్ తమకు హామీ ఇచ్చినట్లు ఎంపీ జితేందర్రెడ్డి తెలిపారు. అయితే హోంశాఖ సర్క్యులర్ ఉపసంహరణకు రాజ్నాథ్ హామీ ఇచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని టీఆర్ఎస్ ఎంపీలు దాట వేశారు. ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నాం: కవిత హోం శాఖ సర్క్యులర్ను కేంద్రం ఉపసంహరించుకుంటుందనే భావిస్తున్నట్లు ఎంపీ కవిత చెప్పారు. ‘రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఉండకూడదని మేం కోరాం. దానికి కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. సమాఖ్య స్వరూపాన్ని గౌరవిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అధికారాలకు భంగం ఉండదని చెప్పారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘గవర్నర్ ఒక పెద్దమనిషి తరహాలో మార్గదర్శకత్వం వహిస్తే తప్పేం లేదు. అయితే రోజువారీ వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం నడుచుకుంటే ఫర్వాలేదు. ఈ విషయంపైనే రాజ్నాథ్తో చర్చించాం.’ అని కవిత తెలిపారు. -
ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు
నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్లోని అత్తామామలు ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం. విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘ఉపాధి హామీ’ నుంచి పెన్షన్ నిధి
నెలకు రూ. 5 వేల పెన్షన్పై కవిత న్యూఢిల్లీ: పేదలకు పెద్దమొత్తంలో పెన్షన్ ఇవ్వాలనుకుంటే వారు ప్రభుత్వం ద్వారా పొందే లబ్ధి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి నిధిని ఏర్పాటుచేయాలని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రానికి సూచించారు. అసంఘటిత, ప్రైవేటు రంగాల వ్యక్తులకు నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ ఉండాలంటూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే శుక్రవారం లోక్సభలో ‘జాతీయ కనీస పెన్షన్ హామీ’ పేరుతో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ... తెలంగాణలో వృద్ధులకు ప్రకటించిన రూ. 1000 పెన్షన్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చన్నారు. ‘‘సభ్యుడు దూబే ప్రతిపాదించిన రూ. 5 వేల పెన్షన్ పథకంలో రాష్ట్రాలు భాగస్వాములు కావొచ్చు. రూ. 50 వేల కోట్ల కార్ఫస్ ఫండ్ను కేంద్రం నిధుల నుంచి తీసుకోవాలంటున్నారు. కానీ, ఇది సాధ్యం కాకపోవచ్చు. ఈ రూ. 50 వేలకోట్ల ఫండ్ను మనమే తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు జాతీ య గ్రామీణఉపాధి హామీ నిధుల నుంచి ప్రతి ఒక్కరికి రూ. 150 వేతనం ఇస్తున్నారు. వీటిలో రూ. 10 లేదా రూ. 15లు పొదుపు చేసుకునేలా కేంద్రం ప్రోత్సహించి నిధిని సృష్టించవ చ్చు. దాన్నుంచి వారికి పెన్షన్ ఇవ్వొచ్చు’’ అని ఆమె అన్నారు. -
ఆశల బండి ఆగేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వారం రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని పలు విజ్ఞాపనలు సమర్పించారు. అందులో జిల్లా అవసరాలను విన్నవించామని, ఇటీవల జిల్లాలో జరిగిన పలు సమావేశాలలో ఆమె పేర్కొన్నారు. గతంలో అనేకమార్లు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినా, జిల్లాకు వచ్చేసరికి నిధులు కేటాయింపు, అమలైన అంశాలు తక్కువే. ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పా టు తర్వాత మొట్ట మొదటి సారిగా కేంద్రం రైల్వే బడ్జె ట్ ప్రవేశపెడుతున్నం దున మన ఎంపీలప్రతిపాదనలు ఏ మేరకు అందులో భాగమవుతాయోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా ఇందూరు వాసులకు నిరాశే రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు. ఇంతకు ముందున్న ఎంపీలు మధుయాష్కీ, సురేష్ శెట్కార్ అనేక ప్రతిపాదనలు చేసినట్లు పదే పదే ప్రకటించినా అమలుకు నోచుకున్న వాటికంటే బుట్టదాఖలైనవే ఎక్కువ. 2013-14 బడ్జెట్లో వీరు చేసిన ప్రతిపాదనలలో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ, ఆ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆధునీకరించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా తీర్చిదిద్దటానికి తీసుకున్న చర్యలు కూడా లేవు. బోధన్-బీదర్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైన్లను మరచిపోయారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచారు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతిసారి మొండిచెయ్యే చూపుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన ఎంపీలు సభ్యులు కవిత, పాటిల్ తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి కావాలి 2013-14 రైల్వే బడ్జెట్ కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా, ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా, పెండింగ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో 2014-15 రైల్వేబడ్జెట్ పైన జిల్లా ప్రజలకు ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ కవిత ప్రతిపాదనలు ఫలిస్తే ఈసారి బడ్జెట్లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చగా, ఈ సారి నిధుల పరిపుష్టి ఉంటుందంటున్నారు. అసంపూర్తిగా ఉన్న మోర్తాడ్-ఇందూరు రైల్వేలైన్ పనులు పూర్తి కోసం చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకుంటాయన్న ఆశలు ఉన్నాయి. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు, జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానమైన ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సి ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లై ఓవర్, పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం బడ్జెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్అర్బన్ : గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ లో విదేశాంగ శాఖ మంత్రి సు ష్మా స్వరాజ్ను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎ క్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లారని,వారి సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాల ని కోరారు. సోమవారం ఉదయం విదేశాంగ శాఖ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎంపీలు బోయినపల్లి వినోద్, బీబీ పాటిల్, జితేందర్రెడ్డి, బాల్క సుమన్లతో కలిసి మం త్రిని కలిసి ఎంపీ కవిత ఈ సమస్యను మంత్రి దృష్టికి తెచ్చారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కవిత చెప్పిన విషయాలను తమ శాఖ అధికారులతో చర్చించి అమలులో పెడతానని, మరో రెండు వారాల్లో మళ్లీ కలిసి ఇవే అంశాలపై పురోగతిని చర్చిద్దామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. వినతిపత్రంలో పేర్కొన్న అంశాలు గల్ఫ్లో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని తగ్గించి, రెండు మూడు రోజుల్లోనే తెచ్చేలా ప్రయత్నించాలి. ఇందుకు అక్కడి భారతీయ సంఘాలను అక్కడి ఎంబసీ ద్వారా విదేశాంగ శాఖ గుర్తించి ఈ పనిలో చేయూతనందించాలి. అక్కడ చట్టాల పరిజ్ఞానం లేకపోవడం వల్ల లోపాలు జరగకుండా మన దేశంలో గల్ఫ్ కా ర్మికులు ఎక్కువగా వలస వెళుతున్న నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కలెక్టర్ ప్ర త్యక్ష పర్యవేక్షణలో గల్ఫ్ కార్మికుల సహాయక సెల్లు ఏర్పాటు చేయాలి. ఈ సెల్ ద్వారా గల్ఫ్ వెళ్లిన తరువాత అక్కడ భద్రత విషయమై, కంపెనీ జీతం తదితర అంశాల విచారణకు చర్యలు తీసుకోవాలి. ఒక జిల్లా నుంచి వెళుతున్న వారి పూర్తి వివరాలు ఈ సెల్లో ఉండాలి. దుబాయి వెళ్లేవారి అనుమతి పత్రాలను ఈ సెల్ ముందే సరిచూడాలి. వలస వెళుతున్న వారు ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో విజిట్ వీసా మీద వెళుతున్నారా లేదా వీసా పొడిగింపు విషయంలో, కల్లివిల్లి వీసాల విషయంలో, జైళ్లలో మగ్గుతు న్న భారతీయ కార్మికుల విడుదల బాధ్యతను కేంద్రం తీసుకోవాలి. అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి కఠిన చర్యలు లేకుండా చూడాలి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. -
విజయం అమరులకు అంకితం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పూర్తి మెజార్టీ ఇచ్చి తమపై విశ్వాసం ఉంచిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. ఈ అఖండ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటిం చారు. శనివారం నిజామాబాద్లోని టీఆర్ఎస్ జిల్లా కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కవిత మాట్లాడారు. 1984 తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చారన్నారు. ప్రజల దీవెనలు పార్టీ అధినేత కేసీఆర్కు ఉండటంతోనే ఇది సాధ్యమైందని, జిల్లా సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ బాధితులు, బీడీకార్మికులు, తాగునీరు, సాగునీరు, ఇలా జిల్లాలో చాలా సమస్యలున్నాయని, ప్రజలు ఇచ్చిన స్వీప్ మెజార్టీని వివరించి అవసరమైతే కేసీఆర్ను 10 శాతం అదనపు నిధులు జిల్లాకు కేటాయించాలని కోరుతామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేసి తీరు తామని స్పష్టం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చుతారన్నారు. తెలంగాణ జిల్లాలలోనే ఇందూరును ఆదర్శంగా ఉండేలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో హైదరాబాద్కు పార్టీ కార్యాలయానికి తీసిపోకుండా ‘తెలంగాణ భవన్’ను నిర్మిస్తామని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకుడు డీఎస్ నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకున్న డీఎస్కు ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్పారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అ భివృద్ది నిరోధకుడైన ధర్మపురి శ్రీనివాస్ను ఓడించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేదని, అయితే టీఆర్ఎస్, కేసీఆర్ ద్వారా ఆ కోరిక నెరవేరిందన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, జిల్లా అభివృద్ధికి ఇక ఢోకా ఉండదని అన్నారు. పట్టం కట్టిన ప్రజలను మరవలేం ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా, చివరకు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఉద్యమంపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. గాంధేయవాద ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేసీఆర్తోనే ‘తెలంగాణ’ సాధ్యమైందని భావించిన ప్రజలు ఇతర పార్టీలను పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ అర్బన్లో అసలు టీఆర్ఎస్కు పట్టు లేదని, గెలుపు కష్టమని కొందరు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను గెలిపించి దీటైన జవాబు చెప్పారన్నారు. ఇక్కడి ప్రజలకు సర్వత్రా రుణపడి ఉంటానని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా పరిశీలకులు బాపూరావు, పొలిట్బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు. -
తిక్కుంది కానీ లెక్కలేదు
నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్కు తిక్క ఉందిగానీ లెక్క లేదని టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కల్వకుం ట్ల కవిత విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉద్యమంలో అన్ని పార్టీలను, వ్యక్తులను కలుపుకుని పోరాటం చేశామని అన్నారు. ప్రస్తుత బీజేపీ లోక్సభ్య అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించామన్నారు. ఆయితే ఆయన ఎప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన లేదన్నారు. నిజామాబాద్ నగరాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్తోనే తెలంగాణ వచ్చిందన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉండగా ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. 2004లో కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసిన సోనియా బలిదానాలు జరుగుతున్నా పది సంవత్సరాలు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తూడ్చుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపిస్తే చట్టం తీసుకొచ్చి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు. -
ఆరోపణలు రుజువు చేయండి
ఆర్మూర్, న్యూస్లైన్ : దమ్ముంటే టీఆర్ఎస్ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ఆర్మూర్ మండలం ఆలూర్లో ఆదివారం రాత్రి కవిత, జీవన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే తన స్థాయిని మరిచి ఇష్టానుసారంగా అసత్యపు ఆరోపణలను ప్రచారం చేయిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తో మాత్రమే సాధ్యమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఎర్రజొన్నల బకాయిలు రూ. రూ. పది కోట్ల 83 లక్షలు రైతులకు చెల్లిస్తామన్నారు. టీఆర్ఎస్కు ముంబైకర్ల మద్దతు తెలంగాణ ప్రాంతం నుంచి ఉపాధి వేట లో ముంబయ్కి వలస వెళ్లిన ముంబయ్కర్లు ఆదివారం టీఆర్ఎస్కుమద్దతు తె లుపుతున్నట్లు తీర్మానించారు. ముంబ య్ తెలంగాణ జేఏసీ చైర్మన్ మూల్ ని వాస్ మాల ఆధ్వర్యంలో వలస జీవులు టీఆర్ఎస్ట్కు మద్దతు తెలియజేశారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను, ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎ జీవన్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మద్దతు పలుకుతూ చేసిన తీర్మానం ప్రతిని కవితకు అందజేశారు. ఓసీ పేదల సంక్షేమ సంఘం మద్దతు.. భిక్కనూరు : ఓసీల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చినందున ఆ పార్టీకి ఓసీ పేదల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచర్ల మహేందర్రెడ్డి, కామారెడ్డి కన్వీనర్ బాలుగుప్తా అన్నారు. ఆదివారం వారు జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్తో కలిసి తమ మద్దతును తెలిపారు. -
టీఆర్ఎస్ తరఫున ముంబై టీజాక్ ప్రచారం
సాక్షి, ముంబై: తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముంబై తెలంగాణా జేఏసీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కల్వకుంట కవితకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచార ర్యాలీ లో ముంబై టీ జాక్ బృందం పాల్గొంది. అనంతరం ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముంబైకర్ల పాత్ర ఎంతో ఉందని, ఇక్క డ జరిగిన ప్రతీ ఉద్యమానికి తాము సంఘీభావం తెలిపామని, కొన్ని ఉద్యమాల్లో స్వయంగా తెలంగాణకు వచ్చి పాల్గొన్నామని ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల కిందట బయలుదేరిన ఎనిమిది మంది ముంబై టీ-జాక్ సభ్యు ల్లో ముగ్గురు నల్గొండలో, మిగతా వారు నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సోమవారం ప్రచార సభ ముగియగానే తిరి గి ముంబైకి వస్తున్నట్లు సభ్యులు మూల్నివాసి మాల, బద్ది హేమంత్కుమార్, దేవానంద్ నాగెళ్ల తెలిపారు. -
రైతుల పొట్టకొట్టిన చంద్రబాబు: కవిత
నిజం షుగర్స్ను అమ్మేసిన ఘనత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకే దక్కుతుందని నిజామాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని తానే కట్టించానని చెబుతున్న ఆయన, జిల్లాల్లో మాత్రం రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కాస్తా ఇప్పుడు చంద్రబాబు జేబులో పార్టీగా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పరాయి పాలకుల కిరాయి మనుషులుగా మారారని విమర్శించారు.