
కేంద్రంలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తా: ఎంపీ కవిత
కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే, అప్పుడు ఆలోచిస్తానని నిజామాబాద్ ఎంపీ ...
నిజామాబాద్ కల్చరల్: కేంద్ర మంత్రివర్గంలో చేరాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానిస్తే, అప్పుడు ఆలోచిస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. నిజామాబాద్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్రంతో తాము ఎప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉండాలనే కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం కేంద్రంతో తమకు ఏలాంటి విభేదాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం తమను వారి ప్రభుత్వంలో కలుపుకోవాలని ఆలోచిస్తే ఆలోచిస్తామన్నారు.