జోకర్ని కాదు.. కవితకు బండ్ల గణేష్ కౌంటర్

సాక్షి, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార టీఆర్ఎస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేయని విమర్శలు ఆయన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ పేరు పొలిటికల్ తెరపైకి వచ్చింది.
(చదవండి : ‘మీకో దండం.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు’)
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన కామెడీలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బండ్ల గణేష్ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. ‘నేను జోకర్ని కాదు.ఫైటర్ని. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి