
గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించండి
గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి వినతిపత్రం అం దించారు.
నిజామాబాద్అర్బన్ : గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ లో విదేశాంగ శాఖ మంత్రి సు ష్మా స్వరాజ్ను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎ క్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్లారని,వారి సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాల ని కోరారు.
సోమవారం ఉదయం విదేశాంగ శాఖ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎంపీలు బోయినపల్లి వినోద్, బీబీ పాటిల్, జితేందర్రెడ్డి, బాల్క సుమన్లతో కలిసి మం త్రిని కలిసి ఎంపీ కవిత ఈ సమస్యను మంత్రి దృష్టికి తెచ్చారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కవిత చెప్పిన విషయాలను తమ శాఖ అధికారులతో చర్చించి అమలులో పెడతానని, మరో రెండు వారాల్లో మళ్లీ కలిసి ఇవే అంశాలపై పురోగతిని చర్చిద్దామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
వినతిపత్రంలో పేర్కొన్న అంశాలు
గల్ఫ్లో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తరలించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని తగ్గించి, రెండు మూడు రోజుల్లోనే తెచ్చేలా ప్రయత్నించాలి. ఇందుకు అక్కడి భారతీయ సంఘాలను అక్కడి ఎంబసీ ద్వారా విదేశాంగ శాఖ గుర్తించి ఈ పనిలో చేయూతనందించాలి.
అక్కడ చట్టాల పరిజ్ఞానం లేకపోవడం వల్ల లోపాలు జరగకుండా మన దేశంలో గల్ఫ్ కా ర్మికులు ఎక్కువగా వలస వెళుతున్న నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కలెక్టర్ ప్ర త్యక్ష పర్యవేక్షణలో గల్ఫ్ కార్మికుల సహాయక సెల్లు ఏర్పాటు చేయాలి. ఈ సెల్ ద్వారా గల్ఫ్ వెళ్లిన తరువాత అక్కడ భద్రత విషయమై, కంపెనీ జీతం తదితర అంశాల విచారణకు చర్యలు తీసుకోవాలి. ఒక జిల్లా నుంచి వెళుతున్న వారి పూర్తి వివరాలు ఈ సెల్లో ఉండాలి. దుబాయి వెళ్లేవారి అనుమతి పత్రాలను ఈ సెల్ ముందే సరిచూడాలి.
వలస వెళుతున్న వారు ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో విజిట్ వీసా మీద వెళుతున్నారా లేదా వీసా పొడిగింపు విషయంలో, కల్లివిల్లి వీసాల విషయంలో, జైళ్లలో మగ్గుతు న్న భారతీయ కార్మికుల విడుదల బాధ్యతను కేంద్రం తీసుకోవాలి. అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి కఠిన చర్యలు లేకుండా చూడాలి.
గల్ఫ్ ఏజెంట్ల మోసాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి.