Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PNB Reports Rs 2434 Crore Fraud by Former Shreyas Group Promoters to RBI1
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్‌

శ్రేయి గ్రూప్‌ మాజీ ప్రమోటర్లు రూ. 2,434 కోట్ల రుణాలకు సంబంధించి మోసానికి పాల్పడినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తెలియజేసింది. శ్రేయి ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ (ఎస్‌ఈఎఫ్‌ఎల్‌), శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ (ఎస్‌ఐఎఫ్‌ఎల్‌) ప్రమోటర్లు వరుసగా రూ. 1,241 కోట్లు, రూ. 1,193 కోట్ల మేర మోసగించినట్లు పేర్కొంది.ఇప్పటికే ఈ మొత్తానికి 100 శాతం ప్రొవిజనింగ్‌ చేసినట్లు వివరించింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలతో కోల్‌కతాకి చెందిన కనోడియాల సారథ్యంలోని ఎస్‌ఐఎఫ్‌ఎల్, దాని అనుబంధ సంస్థ ఎస్‌ఈఎఫ్‌ ఎల్‌ బోర్డులను 2021లో ఆర్‌బీఐ రద్దు చేసి, దివాలా చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ. 32,700 కోట్ల పైచిలుకు రుణాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఈ రెండు సంస్థలను ఆ తర్వాత వేలంలో ఎన్‌ఏఆర్‌సీఎల్‌ దక్కించుకుంది.ఈ వ్యవహారంలో ప్రమోటర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. రుణాల మంజూరు సమయంలో నిధుల వినియోగంలో అక్రమాలు, అనుబంధ సంస్థలకు నిధుల మళ్లింపు, ఆస్తుల విలువను ఎక్కువగా చూపడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మోసంగా గుర్తించిన ఖాతాల వివరాలను పీఎన్‌బీ ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థలకు పంపినట్లు తెలుస్తోంది. అవసరమైతే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల ద్వారా మరింత విచారణ జరిపే అవకాశముందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.ఇక బ్యాంకింగ్‌ రంగంపై ఈ ఫ్రాడ్‌ ప్రభావం పెద్దగా ఉండదని పీఎన్‌బీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే 100 శాతం ప్రొవిజనింగ్‌ చేసిన నేపథ్యంలో బ్యాంక్‌ లాభనష్టాలపై అదనపు భారం పడదని పేర్కొన్నాయి. మరోవైపు, ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ద్వారా రికవరీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీలు) పర్యవేక్షణను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసే అవకాశముంది.

Coforge to Acquire US Based AI Company Encora for 2 35 Billion2
అమెరికన్‌ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్‌

అమెరికన్‌ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్‌కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్‌ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్‌ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్‌ లావాదేవీ రూపంలో ఈ డీల్‌ ఉంటుందని వివరించింది. ఎన్‌కోరా ప్రస్తుత షేర్‌హోల్డర్లకు 1.89 బిలియన్‌ డాలర్ల ప్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్‌ పేర్కొంది.ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్‌ ఇంటర్నేషనల్, వార్‌బర్గ్‌ పింకస్‌ మొదలైనవి ఎన్‌కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్‌ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్‌ సీఈవో సుధీర్‌ సింగ్‌ చెప్పారు. ఎన్‌కోరా కలయికతో 2.5 బిలియన్‌ డాలర్ల టెక్‌ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్‌ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్‌ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్‌ వ్యాపారం 1.25 బిలియన్‌ డాలర్లపైగా, క్లౌడ్‌ సేవలు 500 మిలియన్‌ డాలర్లు, డేటా ఇంజనీరింగ్‌ 250 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్‌ పేర్కొంది.

Empowering Frontline Employees with Artificial Intelligence3
ప్రాంతీయ భాషలే ప్లస్‌ 

రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్‌ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్‌లు, స్టోర్‌ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్‌ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్‌ కిచెన్‌ ఆపరేటరు క్యూర్‌ఫుడ్స్‌ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్‌ ల్యాంగ్వేజ్‌ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్‌ను ఆటోమేటెడ్‌ వాయిస్‌బాట్స్‌తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్‌మెంట్‌ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్‌ ఏఐ తదితర థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్‌ స్టార్టప్‌లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్‌ సొల్యూషన్స్‌ అందించే థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్‌ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది.స్టార్టప్‌లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్‌ విధానం ఉపయోగపడుతోందని ఇన్‌స్టాహైర్‌ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్‌ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్‌గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్‌ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్‌ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్‌ బాట్స్‌ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్‌ని హ్యాండిల్‌ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్‌ మార్కెట్‌ప్లేస్‌ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్‌ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్‌కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్‌లో ఫీడ్‌ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్‌ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్‌గా స్క్రీనింగ్‌కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్‌ని అప్నా తమ క్లయింట్‌ కంపెనీలకూ ఆఫర్‌ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్‌ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్‌ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్‌ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్‌లిస్టింగ్‌ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్‌ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్‌ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్‌ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Pralhad Joshi Releases New BIS Standard for Incense Sticks4
అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!

వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్‌బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్‌''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్‌బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్‌బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్‌బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్‌బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్‌బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్‌బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

Top 5 Motorcycle Launches Of The Year 20255
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు

2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్‌, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్పర్ క్లచ్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్‌లో అపాచీ ఆర్‌టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ మోటార్‌సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 46.4 హెచ్‌పి & 5,650 ఆర్‌పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్‌ఎ గోల్డ్‌స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్‌తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్‌ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్‌పి & 43.5 ఎన్ఎమ్‌ టార్క్ అందిస్తుంది.

Will PF Money Get Interest if Quit Job6
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?

ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్‌డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్‌డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది.

Advertisement
Advertisement
Advertisement