Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market November 26 Sensex rises Nifty at1
లాభాల్లో​కి స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలలోకి వచ్చాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు క్రితం రోజు నష్టాల నుంచి పుంజుకొని లాభాల్లో కదులుతున్నాయి. ఉదయం 9.30 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు లేదా 0.35 శాతం లాభపడి 84,885 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 100 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 25,985 వద్ద ట్రేడవుతున్నాయి.టాటా మోటార్స్ పీవీ, ట్రెంట్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ ఎం ఈరోజు సెన్సెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారతీ ఎయిర్ టెల్, హెచ్‌యూఎల్, టీసీఎస్ మాత్రమే నష్టపోయాయి. డిసెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై మదుపరులు ఆశావాద దృక్పథంతో ప్రపంచ మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభాలను కలిగి ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగాయి.రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.7 శాతం లాభంతో ర్యాలీలో ముందంజలో ఉంది. నిఫ్టీ పీఎస్‌యూూ బ్యాంక్ ఇండెక్స్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.8 శాతం వరకు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tax cuts dent revenue growth Moodys2
పన్ను కోతలతో ఆదాయ వృద్ధి కష్టమే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయాలు ఆదాయ వృద్ధిని అడ్డుకుంటాయని.. దీంతో ద్రవ్యపరమైన మద్దతుకు పెద్ద అవకాశాల్లేవని మూడిస్‌ రేటింగ్స్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.‘‘ఆదాయ వృద్ధిలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్య స్థిరీకరణ పరంగా అవరోధాలు ఎదుర్కోవచ్చు. కొన్ని పన్ను తగ్గింపులను కూడా చూశాం. ఇది ఆదాయ వృద్ధికి మరింత అడ్డుగా మారొచ్చు. కనుక ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’అని మూడిస్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్టిన్‌ పెట్చ్‌ పేర్కొన్నారు.సెప్టెంబర్‌ చివరికి నికర పన్ను వసూళ్లు 12.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా ఆధారంగా తెలుస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.12.65 లక్షల కోట్ల కంటే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం వేసుకున్న పన్ను వసూళ్ల అంచనాల్లో 43.3 శాతమే సెప్టెంబర్‌ చివరికి (ఆరు నెలల్లో) సమకూరింది.క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం అంచనాల్లో 49 శాతం మేర తొలి ఆరు నెలల్లో రావడం ఉంది. ఆదాయపన్ను మినహాయింపును కొత్త విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ శ్లాబుల్లో తీసుకొచి్చన మార్పులతో 375 ఉత్పత్తులపై పన్ను తగ్గింది. వాస్తవానికి ఈ రేటు తగ్గింపుతో వినియోగం పెరుగుతుందన్నది కేంద్రం అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్రం లక్ష్యం.వినియోగం, వ్యయాలే అండ..ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం, వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహాల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది వినియోగానికి మద్దతునిస్తుందని మార్టిన్‌ పెట్చ్‌ అన్నారు. దేశీ వినియోగానికి తోడు మౌలిక వసతుల అభివృద్ధికి చేసే వ్యయాలు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని.. అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని సర్దుబాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ టారిఫ్‌లు ఇక ముందూ గరిష్ట స్థాయిలోనే కొనసాగితే, అది ఇకపై పెట్టుబడులను ప్రతికూలంగా మారొచ్చన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 7 శాతం, 2026లో 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని గత వారం మూడిస్‌ అంచనాలు వ్యక్తం చేయడం తెలిసిందే.

Tata Motors may hike prices early next quarter3
టాటా కార్‌ల ధరలు పెరగనున్నాయా?

ప్రముఖ దేశీయ వాహన తయారుదారు టాటా మోటర్స్‌ తమ వాహన ధరలను త్వరలో పెంచనున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర ఈ మేరకు సంకేతాలిచ్చారు.గత సంవత్సరంలో ఇన్‌పుట్ ఖర్చులు ఆదాయంలో దాదాపు 1.5 శాతం పెరిగాయని, అయినా పరిశ్రమ ఈ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపలేదని శైలేష్ చంద్ర చెప్పారు.ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ నాలుగో త్రైమాసికంలో ధరల పెంపును అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ధరల సర్దుబాటు ఉండవచ్చన్నారు.అయితే జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్న కొత్త ఎస్‌యూవీ సియెర్రా ధరలను కంపెనీ పెంచబోదని చెప్పారు. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో 16-17 శాతం వాటాను కలిగి ఉందని, సియెర్రా పూర్తిగా పుంజుకుంటే దీనిని 20-25 శాతానికి పెంచుతుందని శైలేష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.టాటా మోటార్స్ సనంద్ -2 ప్లాంట్‌లో కొత్త సియెర్రా వాహనాలను తయారు చేస్తున్నారు. టాటా మోటార్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో సియెర్రా ఎలక్ట్రిక్ ఈవీని కూడా విడుదల చేయనుంది. తద్వారా దాని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తుంది.

Jobs in unincorporated sector rose marginally in Q2 NSO data4
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు

ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో అసంఘటిత రంగ సంస్థల్లో (యూఎస్‌ఈ) ఉద్యోగాలు స్వల్పంగా పెరిగాయి. క్రితం క్వార్టర్‌లో 12,85,72,500గా ఉండగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో 12,85,95,600కి చేరాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన సర్వే డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.తయారీ, వాణిజ్యం, ఇతర సర్వీసులు అనే మూడు వ్యవసాయేతర రంగాల గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం, ప్రత్యేకంగా చట్టబద్ధమైన సంస్థలుగా నమోదు చేసుకోని ఈ తరహా సంస్థల్లో ఉద్యోగాలు జనవరి–మార్చి క్వార్టర్‌లో నమోదైన 13,13,38,000తో పోలిస్తే రెండో ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో తగ్గాయి.ఈ రంగంలో ఇంటర్నెట్‌ వినియోగం జూన్‌ క్వార్టర్‌లో నమోదైన 36 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో 39 శాతానికి పెరిగింది. సెపె్టంబర్‌ త్రైమాసికంలో తయారీలో ఉపాధి పెరిగింది.

India key market in AI strategy and global talent plans: NTT DATA5
ఏఐ వ్యూహంలో భారత్‌ కీలకం

టోక్యో: గ్లోబల్‌ ఐటీ సేవల దిగ్గజం ఎన్‌టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్‌ అత్యంత కీలక మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్‌ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ వపర్‌మ్యాన్‌ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్‌ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్‌ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్‌ మాకు హబ్‌గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్‌కి మా ఆసియా పసిఫిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అనుబంధంగా పని చేస్తోంది. భారత్‌లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్‌ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్‌లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్‌ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్‌ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్‌ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్‌ చేశామని జాన్‌ వివరించారు. నవంబర్‌ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్‌టీటీ ఆర్‌అండ్‌డీ ఫోరమ్‌లో ఎన్‌టీటీ గ్రూప్‌ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్‌ వీటిలో ఉన్నాయి.

India FY26 economic growth projection revised upwards to 7 Percent6
భారత వృద్ధి అంచనాలకు బూస్ట్‌

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచాలను ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) ఎగువకు సవరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వ్యక్తీకరించగా, తాజాగా దీన్ని 7 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. జూన్‌ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటు (7.8 శాతం) నమోదు కావడం, ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం అనుకున్నంత లేకపోవడం 2025–26 వృద్ధి అంచాలను పెంచడానికి కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉండొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా.ఇంతకంటే మెరుగ్గా ఇండ్‌–రా అంచనాలుండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. తాము జూలైలో ప్రకటించిన అంచనాల అనంతరం దేశీయంగా, అంతర్జాతీయంగా పరిణామాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్టు ఇండ్‌–రా తెలిపింది. ద్రవ్యోల్బణం చాలా వేగంగా తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగడం, జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ అంశాలను ఇండ్‌–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్‌ పంత్‌ ప్రస్తావించారు. ముఖ్యంగా జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకంటే ఎంతో అధికంగా నమోదు కావడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఏమంత లేకపోవడం వృద్ధి అంచనాల పెంపులో ప్రధానపాత్ర పోషించినట్టు ఇండ్‌–రా తెలిపింది. సానుకూల పరిస్థితులు.. ‘‘భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం వేగంగా పట్టాలెక్కడం, శీతాకాలంలో సానుకూల వాతావరణ పరిస్థితులు జీడీపీ వృద్ధి రేటును 7 శాతానికి తీసుకెళతాయి. ఒకవేళ డిమాండ్‌ కోలుకోవడం (వినియోగం; పెట్టుబడులు) అన్నది అంచనాలకంటే తక్కువగా ఉంటే కనుక అది జీడీపీ వృద్ధి అంచనాలను కిందకు తీసుకెళ్లొచ్చు’’అని ఇండ్‌–రా తెలిపింది. జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ, తక్కువ ద్రవ్యోల్బణంతో తుది ప్రైవేటు వినియోగం 2025–26లో 7.4 శాతం పెరగొచ్చని పేర్కొంది. ‘‘అమెరికాకు ఎగుమతులు సెపె్టంబర్‌లో 11.9 శాతం (గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు), అక్టోబర్‌లో 8.9 శాతం చొప్పున తగ్గాయి.ఎగుమతులు 2024–25లో సగటున నెలవారీ 7.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు చూస్తే నెలవారీ సగటు 7.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కానీ సెప్టెంబర్‌–అక్టోబర్‌ కాలాన్నే పరిశీలించి చూస్తే నెలవారీ ఎగుమతులు 5.9 బిలియన్‌ డాలర్లకు (టారిఫ్‌ల కారణంగా) తగ్గాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం కావడం లేదంటే భారత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం అన్నది ఎగుమతులు పుంజుకోవడానికి కీలకం’’అని ఇండ్‌–రా తన నివేదికలో పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement