Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold price could hit 5000 usd in 2026 says Bank of America1
బంగారం ధరలు: ‘కొత్త’ మార్క్‌ తప్పదా?

బంగారం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. డిసెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల బలంతో మంగళవారం (నవంబర్ 25) పసిడి ధరలు గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్‌కు 4,175 డాలర్ల (సుమారు రూ.3.72 లక్షలు) దాకా చేరాయి. పుత్తడి గత కొన్ని నెలలుగా శక్తివంతమైన ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ ధోరణి వచ్చే ఏడాదిలోనూ కొనసాగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) తాజా అంచనాల ప్రకారం.. 2026లో బంగారం సగటు ధర ఔన్స్‌కు 4,538 డాలర్ల వద్ద ఉండొచ్చు. ముఖ్యమైన స్థూల ఆర్థిక టెయిల్‌విండ్స్, అలాగే పెరుగుతున్న సురక్షిత-ఆశ్రయ డిమాండ్ ఈ ధరను మరింతగా 5,000 డాలర్ల వరకు తీసుకెళ్లే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత ధోరణులుఅంతర్జాతీయంగా, గత సెషన్‌లో దాదాపు 2% పెరుగుదల తరువాత బంగారం సోమవారం కూడా బలంగా ట్రేడ్ అయింది. బలహీనమైన దిగుబడులు, స్థూల అనిశ్చితి, సురక్షిత పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి.. ఇవన్నీ స్పాట్ ధరలను చరిత్రాత్మక గరిష్ట స్థాయికి సమీపంలో నిలిపాయి. ఎంసీఎక్స్‌(MCX)లో బంగారం ధరలు ప్రారంభ ట్రేడింగ్‌లో 1% కంటే ఎక్కువ ఎగిశాయి.బంగారం ప్రస్తుతం “ఓవర్ బైట్” గా ఉన్నప్పటికీ, అదే సమయంలో “అండర్ ఇన్వెస్ట్” గా కూడా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా భావిస్తోంది. అంటే ధరలు చరిత్రాత్మకంగా బలంగా పెరిగినా, పెద్ద సంస్థాగత పెట్టుబడులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రవేశించలేదని సూచిస్తుంది. దీంతో భవిష్యత్తులో మరింత పెరుగుదలకు అవకాశం ఉన్నదని సూచిస్తుంది. అయితే ఫెడ్ తిరిగి తీవ్రమైన ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి పెట్టి వడ్డీ రేట్లను పెంచితే, బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.2026లో బంగారం ధర పెరుగుదలకు చోదకాలుపెరుగుతున్న ప్రభుత్వ రుణాలునిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిడితక్కువ వడ్డీ రేట్ల వాతావరణంఅసాధారణమైన యూఎస్‌ ఆర్థిక విధానాల ప్రభావందేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలుప్రస్తుతం (నవంబర్‌ 25) హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం ధరలు రూ. 1,16,450 (22 క్యారెట్స్‌), రూ. 1,27,040 (24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి.చెన్నైలో బంగారం 10 గ్రాముల ధరలు రూ. 1,17,200 (22 క్యారెట్స్‌), రూ. 1,27,860 (24 క్యారెట్స్‌)గా కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ. 1,16,600 (22 క్యారెట్స్‌), రూ. 1,27,190 (24 క్యారెట్స్‌) వద్ద ఉన్నాయి.

SBI Ventures plans to launch Rs 2000 crore climate focussed fund in Jan March2
ఎస్‌బీఐ వెంచర్స్‌ టార్గెట్‌ రూ. 2,000 కోట్లు

బ్యాంకింగ్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ)కు చెందిన ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజర్‌ ఎస్‌బీఐ వెంచర్స్‌ మూడో పర్యావరణహిత ఫండ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధులను సంబంధిత స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉంది.దీంతో పర్యావరణ పరిరక్షిత వృద్ధికి మద్దతివ్వనున్నట్లు ఎస్‌బీఐ వెంచర్స్‌ ఎండీ, సీఈవో ప్రేమ్‌ ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఐవీసీఏ గ్రీన్‌ రిటర్న్స్‌ రెండో సదస్సు సందర్భంగా ఇది కొత్త ఫైనాన్షియల్‌ అవకాశమని తెలియజేశారు. దీనిలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వచ్చే ఏడాది మొదట్లో రోడ్‌షోలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.మార్చికల్లాకొత్త కేలండర్‌ ఏడాది(2026) తొలి త్రైమాసికం(జనవరి–మార్చి)లో క్లయిమేట్‌ ఫండ్‌ను ఆవిష్కరించడం ద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాకర్‌ వెల్లడించారు. నిధులను ప్రధానంగా తొలి దశ, వృద్ధిస్థాయిలో ఉన్న క్లయిమేట్‌ ఫోకస్‌డ్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులకు వినియోగించనున్నట్లు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన సాంకేతికతలు, ఏఐ ఆధారిత క్లయిమేట్‌ ఆవిష్కరణలకు తెరతీసే స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

Rs 79990 iPad Air mistakenly sells for Rs 15003
రూ.80వేల ఐపాడ్‌ రూ.1500లకే.. తీరా కొన్నాక..

ప్రస్తుత రోజుల్లో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌లు, గ్యాడ్జెట్ల కొనుగోలు ఎక్కువగా ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతోంది. ఇలా కొంటున్నప్పుడు ఒక్కొక్కసారి వస్తువుల ధర లిస్టింగ్‌ విషయంలో పొరపాట్లు జరుగుతుంటాయి. వీటిని చూసి దొరికిందిలే ఛాన్స్‌ అంటూ వెంటనే కొనేస్తుంటారు. ఆ తప్పిదాలను గ్రహించి వాటిని రాబట్టుకునేందుకు విక్రేతలు నానా పాట్లు పడుతుంటారు.అచ్చం ఇలాగే జరిగింది ఇటలీలో. ఇటాలియన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ మీడియా వరల్డ్ ఇటీవల తన లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు 13-అంగుళాల యాపిల్ ఐప్యాడ్ ఎయిర్‌ను పొరపాటున 15 యూరోలకే (సుమారు రూ .1,500) విక్రయించింది. ఈ డివైజ్ అసలు ధర సుమారు రూ .79,990. వార్తా సంస్థ వైర్డ్ కథనం ప్రకారం.. రిటైలర్ 11 రోజుల తరువాత పొరపాటును గ్రహించారు. అయితే అప్పటికే ఆన్ లైన్ ఆర్డర్ లు పంపిణీ అయిపోయాయి. చాలా మంది కస్టమర్లు తమ ఐప్యాడ్ లను స్టోర్‌లో తీసుకున్నారు.ధర లిస్టింగ్‌ విషయంలో జరిగిన పొరపాటును గ్రహించిన మీడియా వరల్డ్ వాటిని తిరిగి రాబట్టుకునే పనిలో పడింది. పొరపాటు ధరకు ఐపాడ్‌లను కొనుక్కున్న కస్టమర్లందరినీ సంప్రదించింది. ఆ ఐపాడ్‌లను తిరిగి ఇవ్వాలని లేదా వాస్తవ ధరకు సరిపోయేలా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోరింది. దీనిపై డిస్కౌంట్‌ ఇస్తామని, లేదా ఐపాడ్‌ తిరిగి ఇచ్చేస్తే వారు చెల్లించిన మొత్తం వెనక్కి ఇచ్చి అసౌకర్యానికి పరిహారంగా 20 యూరోల (సుమారు రూ .2,050) వోచర్ కూడా ఇస్తామని వేడుకుంటోంది.

PSU banks expand home loan market share to 50pc in September4
హోమ్‌ లోన్‌ అంటే ప్రభుత్వ బ్యాంకే.. ఎందుకు?

గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్‌ హైమార్క్‌ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్‌లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్‌ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్‌ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ రుణాల విభాగంలో డిమాండ్‌ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్‌ హైమార్క్‌ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్‌ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌ చివరికి 3 శాతానికి తగ్గాయి.ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలువడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటంప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.ప్రభుత్వంపై నమ్మకంఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.ప్రభుత్వ హౌసింగ్ స్కీములుప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.పెద్ద మొత్తాల రుణాలువినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.రిస్క్ తీసుకునే సామర్థ్యంప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.బ్రాంచ్ నెట్‌వర్క్ భారీగా ఉండటంగ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది.

Air India expects most significant customer experience shift in 20265
క్రాష్‌ తర్వాత ఎయిరిండియా కొత్త ఆశలు

వచ్చే ఏడాది (2026) ఆఖరు నాటికి కొత్తగా 26 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ (Air India CEO Campbell Wilson) వెల్లడించారు. అలాగే అప్‌గ్రేడ్‌ చేసిన విమానాలతో 81 శాతం ఇంటర్నేషనల్‌ సర్వీసులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అయితే, మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వివరించారు.‘ఏఐ 171 క్రాష్‌ కావచ్చు లేదా ఇతరత్రా పరిస్థితులు కావచ్చు గత కొద్ది నెలలుగా ఎదురైన ప్రతికూలతలు ఎలా ఉన్నా, 2026లో ఎయిరిండియాలో సుస్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మేము పెట్టుబడుల ప్రణాళికలను కొనసాగిస్తున్నాం‘ అని విల్సన్‌ చెప్పారు. ‘కొత్త విమానాలు వస్తున్నా, కొన్ని విమానాలను లీజుదార్లకు తిరిగి ఇచ్చేయనుండటం, చాలా మటుకు విమానాలకు రెట్రోఫిట్‌ చేస్తుండటం వల్ల వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్యాపరంగా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.ఎయిరిండియా గ్రూప్‌లో ప్రస్తుతం 300 విమానాలు (ఎయిరిండియాకి 187, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కి 110 విమానాలు) ఉన్నాయి. ఎయిరిండియా వద్ద సుదీర్ఘ దూరాలకు ప్రయాణించగలిగే బోయింగ్‌ 777 విమానాలు 22, అలాగే బోయింగ్‌ 787 రకం విమానాలు 32 ఉన్నాయి. వచ్చే ఏడాది ఎయిరిండియాకు 20 చిన్న విమానాలు, 6 పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ అందుబాటులోకి వస్తాయని విల్సన్‌ చెప్పారు. 2026 ఆఖరు నాటికి బోయింగ్‌ 787 విమానాల్లో మూడింట రెండొంతుల ఎయిర్‌క్రాఫ్ట్‌లు అప్‌గ్రేడ్‌ అవుతాయని వివరించారు.

Telangana sets up 1 Bio bioprocess design scale up facility in Hyderabad6
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మరో కొత్త సదుపాయం

హైదరాబాద్: నగరంలోని జీనోమ్ వ్యాలీ ఇన్నోవేషన్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించింది. భారతదేశంలోనే తొలి సింగిల్-యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్‌ స్కేల్-అప్ సదుపాయం తెలంగాణ వన్‌ బయో (1 BIO)ను ప్రారంభించింది. దేశ బయోలాజిక్స్, తదుపరి తరం చికిత్సా సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఇదిఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుంది.భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబిటీ), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) సహకారంతో తెలంగాణ లైఫ్‌సైన్సెస్ నేపథ్యంతో వన్‌ బయోను జీనోమ్ వ్యాలీలోని 2 ఎకరాల క్యాంపస్‌లో తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లీడర్ అయిన థర్మో ఫిషర్ సైంటిఫిక్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బయోప్రాసెస్ డిజైన్ సెంటర్, భారత్‌తోపాటు పెరుగుతున్న ప్రపంచ బయోలాజిక్స్ పైప్‌లైన్‌కు అవసరమైన తదుపరి తరం సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో జీఎల్‌పీ, జీఎంపీ గ్రేడ్ బయోమోలిక్యూల్ అభివృద్ధిలో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది.జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కొత్త జీనోమ్ వ్యాలీ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర రహదారి వెంబడి జీనోమ్ వ్యాలీ ప్రవేశద్వారం వద్ద నిర్మించబోయే ల్యాండ్‌మార్క్ గేట్‌వే డిజైన్‌ను సైతం మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జీనోమ్ వ్యాలీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, దాని తదుపరి 25 సంవత్సరాలకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాము. బయోలాజిక్స్ విస్తరణ అవకాశాలను మరింత మెరుగుపరచడం వైపు భారతదేశ అత్యంత ముఖ్యమైన చర్యలలో వన్‌ బయో ఒకటి’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement