Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India TCS, TPG partner to invest 2 billion dollers in AI data centre joint venture1
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్‌

ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్‌వాల్ట్‌ పేరుతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు టీపీజీ బిలియన్‌ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్‌లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది. టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్‌ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్‌ ప్లాట్‌ఫామ్‌కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 6.5 బిలియన్‌ డాలర్లు దేశీయంగా 1 గిగావాట్‌ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్‌ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్‌ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. దీంతో హైపర్‌స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్‌M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్‌ 94 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! టీసీఎస్‌ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది.

India core infrastructure sector posted zero growth in October 20252
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌ 

న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్‌లో ఫ్లాట్‌గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్‌లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్‌ ఉత్పత్తి 6.7%, సిమెంట్‌ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్‌ కార్యకలాపాలపై, విద్యుత్‌ డిమాండ్‌పై అక్టోబర్‌లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్‌ పనితీరు నేపథ్యంలో అక్టోబర్‌ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.

Fujiyama Power Systems shares made a disappointing in share price 3
నిరాశపరిచిన ఫుజియామా పవర్‌ సిస్టమ్స్‌

ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా పవర్‌ సిస్టమ్స్‌ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.228)తో పోలిస్తే బీఎస్‌ఈలో 4% డిస్కౌంటుతో రూ.218 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% క్షీణించి రూ.205 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 9% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,384 కోట్లుగా ఉంది.

Indian banks will feature in the top 100 global banks list says RBI Governor 4
గ్లోబల్‌ టాప్‌ 100లో...  మరిన్ని భారతీయ బ్యాంకులు 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్‌ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్‌ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి. వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్‌ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (73వ ర్యాంకు) మాత్రమే టాప్‌ 100 బ్యాంకుల్లో ఉన్నాయి. దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్‌ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్‌ హంటర్‌ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్‌ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు. మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్‌ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) మ్యూల్‌హంటర్‌డాట్‌ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్‌ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. మనం చేయాల్సింది చేయాలి.. అంతే.. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్‌ టెక్‌ దిగ్గజం, దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్‌ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు. అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం.. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్‌ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్‌ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్‌బీఐ టార్గెట్‌ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్‌ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్‌ పెరిగితే డాలర్లకు డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్‌ అకౌంట్‌పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Karnataka new IT policy offers companies one time incentive of upto Rs500005
ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!

కర్ణాటకలో ఐటీ వృద్ధిని కేవలం బెంగళూరుకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS) 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది.ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..‘బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్‌టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..

KTM Recalled Globally Over Potential Fuel Tank Cap Issue Automobile6
రీకాల్ ప్రకటించిన కేటీమ్

కేటీఎం కంపెనీ తన 2024 లైనప్‌ బైకులకు ప్రపంచవ్యాప్తంగా రీకాల్‌ ప్రకటించింది. ఇందులో 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ వంటివి ఉన్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ సీల్స్ చిన్న పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ రీకాల్ జారీ చేసింది.2024 మోడళ్లను కొనుగోలు చేసిన కేటీఎం బైక్ వినియోగదారులు.. ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం వారు కంపెనీ అధీకృత సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. దీనికోసం బైకర్స్ ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.బజాజ్‌ ఆటో చేతికి కేటీఎమ్‌ దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌ ఆటో తాజాగా ఆ్రస్టియన్‌ బైక్‌ కంపెనీ కేటీఎమ్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్‌ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్‌ ఆటో తెలియజేసింది.

Advertisement
Advertisement
Advertisement