ప్రధాన వార్తలు
నింగిలో విమానాలు నేలమీదే లాభాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ముందస్తు అంచనాలకు మించి ఉండనున్నాయి. గతంలో ఇవి రూ. 9,500–10,500 కోట్లుగా ఉంటాయని పరిశ్రమ భావించినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. విమాన ప్రయాణికుల రద్దీ తగ్గుదలతో పాటు ఇతరత్రా అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఇక దేశీ విమానయాన ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి గతంలో భావించినట్లుగా 4–6 శాతంగా కాకుండా 0–3 శాతం స్థాయికే పరిమితం కావొచ్చని అంచనాలను సవరించింది.ఎయిరిండియా బోయింగ్ 787–8 విమాన దుర్ఘటన, వేల కొద్దీ ఇండిగో విమాన సేవల రద్దుతో విమాన ప్రయాణాలపై సెంటిమెంటు దెబ్బతినడం ఇందుకు కారణమని పేర్కొంది. సీమాంతర ఉద్రిక్తతలతో విమాన సేవల్లో అంతరాయాలు, పలు సర్వీసులు క్యాన్సిల్ కావడంలాంటి అంశాల వల్ల ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ప్యాసింజర్ల రద్దీ, ఊహించిన దాని కన్నా తక్కువగా నమోదైనట్లు ఇక్రా వివరించింది. మరిన్ని విశేషాలు.. డిసెంబర్ 3–8 మధ్య ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాల వల్ల సుమారు 4,500 ఫ్లయిట్లు రద్దయ్యాయి. ఇవి మొత్తం పరిశ్రమ వార్షిక డిపార్చర్లలో 0.4% అయినప్పటికీ, విమాన ప్రయాణాలపై ఈ ఉదంతంతో ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల వృద్ధి 7–9 శాతానికి పరిమితం కావచ్చు. గతంలో ఇది 13–15%గా ఉంటుందని అంచనా వేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల వృద్ధి నెమ్మదించడంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ మారకంపరమైన నష్టాలు పెరగడంలాంటి అంశాల వల్ల దేశీ విమానయాన పరిశ్రమ మరింతగా నష్టపోనుంది.2025 నవంబర్లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ 1.54 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఇది 2024 నవంబర్లో నమోదైన 1.42 కోట్లతో పోలిస్తే 8.4%, ఈ ఏడాది అక్టోబర్లో రిజిస్టరయిన 1.40 కోట్లతో పోలిస్తే 10.1% అధికం. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య వార్షికంగా 2.2 % పెరిగి 10.96 కోట్లకు చేరింది. ఈ ఏడాది అక్టోబర్లో దేశీ ఎయిర్లైన్స్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారి సంఖ్య వార్షికంగా 8.3 % పెరిగి 29.9 లక్షలకు చేరింది.
వెండి మెరుపులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి ధరలు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 2.41 లక్షలకు చేరింది. అయితే బంగారం ధర వరుసగా రెండో రోజున క్షీణించింది. 99.9%స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 2,800 తగ్గి రూ. 1,39,000కు పరిమితమైంది. ఎంసీఎక్స్ లో మార్చి వెండి కాంట్రాక్టు రూ. 9,590 పెరిగి రూ. 2,34,019 పలికింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో సిల్వర్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 3.72 డాలర్లు పెరిగి 75.85 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సుకి 69.61 డాలర్లు పెరిగి 4,401.59 డాలర్లు పలికింది.
హుందాయ్ ప్రైమ్ ట్యాక్సీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ తాజాగా కమర్షియల్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ’ప్రైమ్ ట్యాక్సీ’ శ్రేణి కార్లను ఆవిష్కరించింది. ఫ్లీట్ ఆపరేటర్లు, ట్యాక్సీ ఎంట్రప్రెన్యూర్లకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఇందులో ప్రైమ్ హెచ్బీ (హ్యాచ్బ్యాక్), ప్రైమ్ ఎస్డీ (సెడాన్) కార్లు ఉన్నాయి. ఇవి అందుబాటు ధరలో లభించే, సౌకర్యవంతమైన, అధిక ఆదాయార్జన అవకాశాలు కల్పించే వాహనాలుగా కంపెనీ పేర్కొంది. వీటి ధరలు వరుసగా రూ. 5,99,900, రూ. 6,89,900 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతాయని హుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) నూతన ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్ గర్గ్ తెలిపారు. 72 నెలల వరకు చెల్లింపు కాలవ్యవధితో సరళతర రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఏఐపై అంబానీ ఫోకస్
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. ఐడియాలకు ఆహ్వానం.. టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్వేర్, రోబోటిక్స్లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.మేనిఫెస్టో ఇలా..మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 6000తగ్గింది. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.6220 తగ్గి, రూ. 1,36,200 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 5700 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.1,24,850 వద్దకు చేరింది.ఢిల్లీ నగరంలో ధరలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా పెరిగినప్పటికీ.. రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,350 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1,25,000 వద్ద ఉంది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రెండు రోజుల్లో 5450 రూపాయలు తగ్గడం వల్ల.. 10గ్రాముల ధర రూ. 137460 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 5000 తగ్గింది. కాబట్టి రేటు రూ. 1,26,000 వద్ద నిలిచింది.
2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
2026 జనవరిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కియా, మారుతి సుజుకి, మహీంద్రా, రెనాల్ట్, స్కోడా కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కియా సెల్టోస్సెకండ్ జనరేషన్ సెల్టోస్ కారును.. కియా కంపెనీ జనవరి 2న లాంచ్ చేయనుంది. అంటే.. ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ కారు ధరలను ఆరోజు అధికారికంగా వెల్లడిస్తారన్నమాట. ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మారుతి సుజుకి ఈ విటారామారుతి సుజుకి ఈ విటారాతో.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇది 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్డేట్లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే యాంత్రికంగా, పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.ఇదీ చదవండి: కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారురెనాల్ట్ డస్టర్న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్.. జనవరిలో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో ఒకటి. CMF-B ప్లాట్ఫామ్ ఆధారంగా, కొత్త డిజైన్ పొందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని సమాచారం.స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్లు, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.
కార్పొరేట్
వెండి మెరుపులు
దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!
ఆరోగ్య బీమాలో సరికొత్త ట్రెండ్స్
బీమాకు జీఎస్టీ సంస్కరణల జోష్
ఇషా అంబానీ సారథ్యం.. రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డ్!
మీరు బిజినెస్లో కింగ్ అవ్వాలంటే..
‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారి...
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక...
కొత్త మార్క్కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్...
మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ...
భూగర్భంలో విలువైన సంపద.. భారత్లో ఎక్కడుందంటే?
ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ...
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా: ఉన్నత న్యాయస్థానం
ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు క...
బ్యాలెన్స్ లేకుంటే పడతారు..!
కేలండర్ మారుతోంది. కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వ...
గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్ర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది.
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్లు, ఇమెయిల్లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు.
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్ కాలర్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు.
పర్సనల్ ఫైనాన్స్
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
పర్సనల్ లోన్ తీసుకుని ఏంచేశారు వీళ్లు..?
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో పర్సనల్ లోన్స్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో పర్సనల్ లోన్స్ తీసుకున్న యువతరంలో 27 శాతం రుణాలు ‘ట్రావెల్’ కోసం తీసుకోబడ్డాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే మొదటిసారి.‘భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కనిపించిన భారీ మార్పు ఇది. యువతరం పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం...వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఇల్లు కొనడం...మొదలైనవి కాదు. ఒకే ఒక కారణం... ప్రయాణం’ అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రచయిత సార్థక్ అహుజ.ఈ మార్పుకు కారణం ఏమిటి?‘ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటడంతో సొంత ఇల్లు అనే కల యువతరంలో చాలామందికి కలగానే మిగిలిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తక్షణం సంతృప్తిని ఇచ్చే విషయాలకు యువతరం ప్రాధాన్యత ఇస్తోంది. ట్రావెల్, లగ్జరీ వస్తువులు కొనుగోలు... మొదలైనవి అందులో ఉన్నాయి’ ఫిన్టెక్ ఇన్నోవేషన్తో అప్పుల కోసం పడే ఇబ్బందులు యువతరానికి తగ్గాయి. జీరో–కాస్ట్ ఇఎంఐలు, బై నౌ పే ల్యాటర్ (బిఎన్పీఎల్) స్కీమ్లు యువతరానికి స్పీడ్గా చేరువవుతున్నాయి.వాళ్ళు అలా... మనం ఇలా...చైనా యువతరం విషయానికి వస్తే...కోవిడ్ తరువాత ‘రివెంజ్ స్పెండింగ్’ నుంచి ‘రివెంజ్ సేవింగ్’కు మళ్లింది. ఎంతో కొంత అయినా సరే బంగారం మదుపు చేయడంపై మోజు పెరిగింది. బంగారాన్ని మదుపు చేయడం అనేది సరికొత్త స్టేటస్ సింబల్గా మారింది. ‘రేపు నేను సంపాదిస్తాను కాబట్టి ఈరోజు అప్పు చేయాలని మన యువతరం ఆలోచిస్తుంది. రేపు నా ఉద్యోగం ఉండకపోవచ్చు కాబట్టి ఈరోజే ΄పొదుపు చేస్తాను అని చైనీస్ యువతరం అనుకుంటుంది’ అంటున్నారు అహుజ.ఇదీ చదవండి: బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.


