Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 20th November 2025 in Telugu states1
తగ్గిన ధరలు.. వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్‌!

దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. క్రితం రోజున భారీగా పెరిగిన ధరలు దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. వెండి ధరలు కూడా గణనీయంగా దిగొచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock Market November 20 Sensex Nifty opens higher 2
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో టెక్ షేర్లు పుంజుకున్న నేపథ్యంలో భారత స్టాక్ సూచీలు ఎగువన పయనిస్తున్నాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 134.43 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 85,320.90 వద్ద, ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 38.65 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 26,091.30 వద్ద ట్రేడవుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేజర్‌‌ ఎన్విడియా బలమైన త్రైమాసిక ఫలితాలను నివేదించింది. వాల్ స్ట్రీట్ ఆదాయాలు, ఆదాయ అంచనాలను అధిగమించింది. పర్యవసానంగా, ఆసియాలోని కీలక సూచీలు 4 శాతం వరకు పెరిగాయి. యూఎస్ బెంచ్ మార్క్ లు 0.1 శాతం నుండి 0.6 శాతం వరకు పెరిగాయి.దేశీయ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు 0.3 శాతం పెరిగాయి.

Apple adds protection for theft loss of devices under AppleCare Plus cover3
యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్‌లో కొత్త ఫీచర్లు

ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో తమ యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్‌ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌ని అపరిమిత స్థాయిలో రిపేర్‌ చేయించుకునేందుకు ప్రొటెక్షన్‌ ప్లాన్‌ కింద కవరేజీ ఉంటోంది.యాపిల్‌కేర్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్‌ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్‌ కొనుక్కున్నప్పుడే ప్లాన్‌ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లుఐఫోన్‌ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.డివైజ్‌ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్‌కేర్‌ ప్లస్‌ ప్లాన్ తీసుకోవచ్చుగమనించాల్సిన అంశాలుథెఫ్ట్‌ & లాస్‌ కవరేజీ కేవలం ఐఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది. (యాపిల్‌ సాధారణంగా రీప్లేస్‌మెంట్‌ ఫీజు వసూలు చేస్తుంది).ప్లాన్‌ ధర డివైజ్‌ మోడల్‌ ఆధారంగా మారుతుంది.

NCLT clears Sequent Scientific Viyash Life Sciences merger4
ఆ రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఓకే..

జంతు ఔషధాల తయారీ సంస్థ సీక్వెంట్‌ సైంటిఫిక్, బల్క్‌ ఔషధాల ఉత్పత్తి సంస్థ వియాష్‌ లైఫ్‌సైన్సెస్‌ విలీన స్కీమునకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోద ముద్ర వేసింది. దీనితో అంతర్జాతీయంగా జంతు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్లో మరింతగా విస్తరించే దిశగా విలీన సంస్థకు మార్గం సుగమం అవుతుందని వియాష్‌ లైఫ్‌సైన్సెస్‌ తెలిపింది.ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇరు సంస్థల ఆదాయాలు రూ. 1,650 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. తమ ఆర్‌అండ్‌డీ, తయారీ సామర్థ్యాలు, విస్తృతమైన సరఫరా వ్యవస్థ దన్నుతో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతామని వియాష్‌ వ్యవస్థాపకుడు హరిబాబు బోడెపూడి ధీమా వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతులు, జంతు సంరక్షణ నిపుణులకు అవసరమైన ఉత్పత్తులను అందించే ప్రపంచ స్థాయి సంస్థగా కంపెనీ ఎదుగుతుందని సీక్వెంట్‌ ఎండీ రాజారామ్‌ నారాయణన్‌ తెలిపారు.

Sebi Extends Mutual Fund Rule Feedback Deadline5
మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త రూల్స్‌పై మరింత గడువు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (టీఈఆర్‌)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్‌ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.అక్టోబర్‌ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది.

CAG to Establish Centre of Excellence in Hyderabad6
హైదరాబాద్‌లో కాగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

న్యూఢిల్లీ: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వివిధ విభాగాల్లోని సిబ్బందికి అత్యుత్తమ ఆడిట్‌ విధానాల్లో శిక్షణనిచ్చేందుకు హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ)ని ఏర్పాటు చేయనుంది. 32వ అకౌంటెంట్స్‌ జనరల్‌ కాన్ఫరెన్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాగ్‌ కె. సంజయ్‌ మూర్తి ఈ మేరకు ప్రకటన చేశారు.ఆవిష్కరణలు, పరిశోధనలు మొదలైన వాటికి ఇది జాతీయ స్థాయి హబ్‌గా ఉంటుందని డిప్యుటీ కాగ్‌ ఏఎం బజాజ్‌ తెలిపారు. అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ ప్రమాణాల అమలు, అధునాతన నైపుణ్యాలను పెంపొందించేందుకు, నాణ్యమైన ఆడిట్‌ విధానాలను వివిధ విభాగాలవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇన్‌క్యుబేటరుగా ఉంటుందని వివరించారు. డేటా, ఏఐని ఉపయోగించుకుని ఆడిట్‌ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement