ప్రధాన వార్తలు
దిగొచ్చిన కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ
ఏడాదిలో ఇక్విటీ రిటైలర్లను నిఫ్టీ సూచీ ఓ ఆట ఆడేసుకొని చివరకు గరిష్టాలను చేరుకుంది. మొదటి త్రైమాసికంలో నష్టాల్లో ఉన్న నిఫ్టీ సూచీ ఏడాది చివరినాటికి జీవితకాల గరిష్టాలను చేరింది. అందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా కారణాలున్నాయి. ఏడాదిలో చోటుచేసుకున్న చాలా పరిణామాల వల్ల నిఫ్టీ కదలికలపై ఇయర్ ఎండర్ రివ్యూ.భారత స్టాక్ మార్కెట్లకు ప్రధాన కొలమానమైన నిఫ్టీ 50 సూచీకి 2025 సంవత్సరం రికార్డుల ఇయర్గా మిగిలింది. జనవరి 1, 2025న సూచీ ప్రారంభ విలువతో పోలిస్తే ఏడాది ముగిసే నాటికి(డిసెంబర్ 12 వరకు) నిఫ్టీ సుమారు 18.5% నికర వృద్ధిని నమోదు చేసింది. ఇది ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ), దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నుంచి భారీ నిధుల ప్రవాహానికి, స్థూల ఆర్థిక వ్యవస్థలో ఆశాజనకమైన వృద్ధి అంచనాలకు నిదర్శనం.సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నిఫ్టీ సూచీలో సుమారు 4% తగ్గుదల కనిపించింది. అందుకు ప్రధానంగా అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ఆందోళనలు కారణం అయ్యాయి. అయితే, ఏప్రిల్ నుంచి సంవత్సరం చివరి వరకు నిఫ్టీ స్థిరంగా కదలాడుతూ పండుగ సీజన్, కార్పొరేట్ ఆదాయాల ఆశాజనక అంచనాలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకింది.నిఫ్టీ కదలికలపై ప్రభావం చూపిన కీలక అంశాలుభౌగోళిక-రాజకీయ అంశాలుఎర్ర సముద్రంలో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఇది ముడి చమురు ధరలను పెంచి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చింది. తద్వారా నిఫ్టీ ఏడాది ప్రారంభంలో తగ్గుదలకు కారణమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల ప్రభావం వాటి ఆర్థిక విధానాలపై ప్రభావం చూపవచ్చనే అనిశ్చితి నెలకొనడం వల్ల స్వల్పకాలికంగా మార్కెట్లో అస్థిరత ఏర్పడింది.దేశీయ ఆర్థిక పరిస్థితులు2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలు 6.8% - 7.0% మధ్య ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంతో దేశీయ డిమాండ్లో స్థిరత్వం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది.ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల నుంచి ఆశాజనకమైన త్రైమాసిక ఆదాయాలు (క్యూ1 నుంచి క్యూ3 వరకు) నిఫ్టీకి మద్దతునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరమైన వృద్ధి బ్యాంకింగ్ సూచీని కొత్త శిఖరాలకు చేర్చింది.అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ 2025 ద్వితీయార్థంలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయడం వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.యూఎస్ సుంకాలు, వాణిజ్య విధానాలుయూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అనేక అంతర్జాతీయ తయారీ కంపెనీలు తమ దృష్టిని భారతదేశం వైపు మళ్లించాయి. ఈ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం కారణంగా భారతదేశ ఎగుమతి ఆధారిత రంగాల్లో (ముఖ్యంగా కెమికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్) బలమైన వృద్ధి అంచనాలు నిఫ్టీ వృద్ధికి దోహదపడ్డాయి.ఫెడ్ వడ్డీ రేట్ల స్థిరీకరణ2025 చివరిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటానికి, భారత మార్కెట్లోకి ఎఫ్ఐఐల ప్రవాహం పెరగడానికి దారితీసింది.జీఎస్టీ సవరణలు2025-26 కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై భారీ కేటాయింపులు, తయారీ రంగానికి ఉద్దీపనలు ఇవ్వడం వల్ల క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ వంటి రంగాలు లాభపడ్డాయి. 2025 మధ్యలో జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైన రంగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించింది. ఈ నిర్ణయం వినియోగదారుల ఖర్చులకు ఊతమివ్వడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా మార్కెట్కు సానుకూల అంశంగా మారింది.ఇదీ చదవండి: చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు
చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు
వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.ఒప్పందంలోని అంశాలుమిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్, ఇమేజ్ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్స్, వాటి విడిభాగాల తయారీదారులు, ఎంఎస్ఎంఈ రంగాలపై దీని ప్రభావం పడనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మెక్సికో సుంకాల పెంపుఇటీవల మెక్సికన్ సెనేట్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న సుంకాల పెంపును ఆమోదించింది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఈ కొత్త విధానం అమలవుతుందని చెప్పింది. ఈ పెంపులో ఆటోమొబైల్స్ దిగుమతి సుంకం కీలకంగా మారింది. కొత్త నిర్ణయాల్లో భాగంగా ఇది 20 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెరుగుతుంది. భారతీయ కార్ల తయారీదారులు, ఆటో విడిభాగాల సరఫరాదారులకు మెక్సికో ప్రధాన వైవిధ్య మార్కెట్ల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు 50% సుంకం కారణంగా వారి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి, మెక్సికన్ మార్కెట్లో పోటీ పడే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు(అంచనా)అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు తమ వస్తువులను నేరుగా అమెరికాకు ఎగుమతి చేయకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. ఈ వస్తు మళ్లింపును నిరోధించే లక్ష్యంతో మెక్సికో సుంకాలు పెంచింది.యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA)ను సమీక్షించబోతున్న నేపథ్యంలో మెక్సికో తన వాణిజ్య విధానాన్ని అమెరికా వైఖరికి దగ్గరగా ఉండేలా చూసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.మెక్సికోకు భారత్ ఎగుమతులు.. ఏ రంగాలు ప్రభావితం?భారతదేశం నుంచి మెక్సికోకు ఎగుమతయ్యే ప్రధాన అంశాలలో ఆటోమొబైల్స్ ఒకటి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రక్కులు, ఇంజిన్ విడిభాగాలు, టైర్లు వంటి ఆటో విడిభాగాల ఎగుమతులు ప్రభావితం కానున్నాయి.కొన్ని రకాల రసాయనాలు, ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు.రంగులు, రంగుల పదార్థాలు (Dyes and Pigments), ఇతర ఆర్గానిక్ రసాయనాలు.రెడీమేడ్ దుస్తులు, ఇతర వస్త్ర ఉత్పత్తులు.పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు.భారత్కు మెక్సికో దిగుమతులు ఇలా..మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో చమురు అత్యంత కీలకం. చమురు ధరల్లో పెరుగుదల లేదా లభ్యతలో హెచ్చుతగ్గులు భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రవాణా, తయారీ రంగాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.యంత్రాలు, విడిభాగాలుతయారీ, ఇంజినీరింగ్ రంగానికి సంబంధించిన భారీ పారిశ్రామిక యంత్రాలు, టర్బైన్లు, పంపింగ్ పరికరాలు వంటి వాటిని భారత్ మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది.బంగారం, వెండివిలువైన లోహాల రంగంలో భారత్ బంగారం, వెండి లోహాలను (కొన్ని సందర్భాలలో) దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో బంగారం వినియోగం అత్యధికంగా ఉంటుంది.ఖనిజాలుమైనింగ్ రంగంలో కొన్ని రకాల లోహ ఖనిజాలు, ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది.మెక్సికో సుంకాల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా ఉన్నప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి కీలకమైన వస్తువులపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాలో కూడా అనిశ్చితి ఏర్పడవచ్చు.ఇప్పుడు ఏం చేయాలంటే..సుంకాల నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఎగుమతిదారులు లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలు, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించాల్సి ఉంది.లాటిన్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల (ప్రైమరీ ట్రేడ్ అగ్రిమెంట్) కోసం చర్చలను వేగవంతం చేయాలి. ఇది సుంకాల భారం లేకుండా మార్కెట్ అవకాశాన్ని సులభతరం చేస్తుంది.దేశీయంగా తయారీ రంగాన్ని ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచాలి.ఇదీ చదవండి: భారత్లో పెరుగుతున్న ‘ఘోస్ట్ మాల్స్’
రూ.2,00,000 చేరువలో వెండి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ నెలకొనడంతో వెండి ధర వరుసగా మూడో రోజు బలపడి, రూ. 2 లక్షల మార్కుకు మరింత చేరువలోకి వచి్చంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం న్యూఢిల్లీ మార్కెట్లో కిలోకి ఏకంగా రూ.5,100 మేర పెరిగి రూ. 1,99,500 వద్ద క్లోజయ్యింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. ‘దేశీ మార్కెట్లో స్పాట్ వెండి ధరలు మరో కొత్త గరిష్టానికి ఎగిశాయి. అటు బంగారం కూడా భారీగా పెరిగి, రికార్డు స్థాయికి దగ్గర్లో ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా కన్సాలిడేట్ అవుతున్న పసిడి రేటు, రూపాయి బలహీనంగా ఉండటం లాంటి అంశాల కారణంగా, మళ్లీ పెరగడం మొదలైంది‘ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్టు దిలీప్ కుమార్ తెలిపారు. స్థానిక బులియన్ స్పాట్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,100 పెరిగి రూ. 1,33,600 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 58.61 డాలర్లు (1.37 శాతం) పెరిగింది. 4,338.40 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి రేటు 64.95 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో పసిడి, వెండి ధరలు తదనుగుణంగా స్పందిస్తున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (కరెన్సీ, కమోడిటీ) అనింద్య బెనర్జీ పేర్కొన్నారు.
ఎగుమతులకు మెక్సికో టారిఫ్ల దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టారిఫ్ల పెంపు ప్రధానంగా ఆటో, ఆటో విడిభాగాలు, మెటల్, ఎల్రక్టానిక్స్, కెమికల్స్ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన మెక్సికో తాజాగా భారత్ దిగుమతులపై సుంకాల పెంపును చేపట్టింది. ఇవి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోలేని దేశాలపై 5 నుంచి 50 శాతంవరకూ దిగుమతి సుంకాలు వర్తించనున్నాయి. భారత్సహా చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాలలోని వివిధ రంగాలు, పరిశ్రమలపై ఈ టారిఫ్లు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది(2024–25) మెక్సికోకు 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను భారత్ చేపట్టింది. అయితే తాజా టారిఫ్ల పెంపు కారణంగా మెక్సికోకు ఎగుమతులు వ్యయభరితమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ప్రయాణికుల వాహన ఎగుమతులు 938.35 మిలియన్ డాలర్లుకాగా.. 20 శాతం నుంచి 35 శాతం మధ్య టారిఫ్ పెంపు వర్తించనున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనేíÙయేటివ్(జీటీఆర్ఐ) తెలియజేసింది. దీంతో ధరల పోటీతత్వం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఆటో విడిభాగాలపై ఇది మరింత అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల ఎగుమతులు 507.26 మిలియన్ డాలర్లుకాగా.. 10–15% సుంకాలు 35 శాతానికి పెరగనున్నట్లు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలియజేశారు. ఇదేవిధంగా 390.25 మిలియన్ డాలర్ల విలువైన మోటార్సైకిళ్ల ఎగుమతులు సైతం సవాళ్లను ఎదుర్కోనున్నట్లు తెలియజేశారు. వీటిపై సుంకాలు 20% నుంచి 35 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించారు. ఆటో విడిభాగాలపై ఎఫెక్ట్ దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమపై తాజాగా మెక్సికో చేపట్టిన దిగుమతి సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమల సమాఖ్య ఏసీఎంఏ పేర్కొంది. భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో 37 కోట్ల డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. సుంకాలు భారత్ ఎగుమతులపై 35–50% స్థాయిలో పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు వృద్ధిలో ఉన్న ఆటోమోటివ్ వాణిజ్యానికి నిలకడను తీసుకురాగలదని విశ్వసిస్తున్నట్లు దేశీ ఆటోమోటివ్ విడిభాగ తయారీదారుల అసోసియేషన్(ఏసీఎంఏ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు.
కార్పొరేట్
ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను
రిలయన్స్ రిటైల్ సీఈవోగా ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్
ప్రయాణాలకు శీతాకాలమే ఇష్టం: సర్వేలో వెల్లడైన విషయాలు
ప్రైవేటు, చిన్న బ్యాంకులపై ఫిర్యాదులు: ఆర్బీఐ
ఆద్యం హ్యాండ్వోవెన్ బ్రాండ్ అంబాసిడర్గా శోభితా ధూళిపాళ
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
మాకంటూ సొంత బాట
జనవరి 21 నుంచి ఇమ్టెక్స్ ఫార్మింగ్ ఎక్స్పో
బ్యాంక్ ఉద్యోగ నియామకాల్లో మార్పులు
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
మళ్లీ ఈక్విటీ ఫండ్స్ జోరు..!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస...
రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్
బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశ...
నిఫ్టీ నష్టాలకు బ్రేక్.. 427 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయ...
విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? క్రెడిట్ కార...
ట్యాక్స్ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్...
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్
కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట...
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం
దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’గా పిలువబడే ఈ ఫండ్ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్లకు క్యాపిటల్ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్ను నిర్వహించే మొదటి అకడమిక్-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్లకు ఇంక్యుబేషన్, మెంటార్షిప్ సేవలు అందిస్తున్న ఎస్ఐఎన్ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.విస్తృత రంగాలకు మద్దతురొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్ ఎన్విరాన్మెంట్, టెక్ ల్యాబ్లు, వ్యవస్థాపక నెట్వర్క్ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లోని టి-హబ్లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్లకు సహాయపడుతుంది” అన్నారు.
భారత్లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025
పర్సనల్ ఫైనాన్స్
పదేళ్లలో రూ.300 లక్షల కోట్లు!
రిటైల్ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు జెన్ జెడ్, మిలీనియల్స్ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.దీర్ఘకాల దృక్పథం..ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఫండ్స్-ఈక్విటీలకు ప్రాధాన్యం..సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్ పార్ట్నర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ తెలిపారు.
అతిపెద్ద ఆర్థిక పతనం వస్తోంది.. ఇది ఎనిమిదో పాఠం
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.చరిత్ర చూడండి..ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలంప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. LESSON # 8: How you can get richer as the world economy collapses.CRASHES do not happen over night.CRASHES take decades to occur.For Example:Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins…. Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025
22..? 24..? ఏది మంచిది?
ఫైనాన్షియల్ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్ మార్కెటు, మ్యూచువల్ ఫండ్స్.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.బంగారంతరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.స్టాక్ మార్కెట్లు..ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి 2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్ చూడండి. ఫండమెంటల్స్ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.రియల్టీ..నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్గా ఉండే ప్లాటయితే మంచిదా?ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్ అయితే రీసేల్ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు. బ్యాంకింగ్..నేను భవిష్యత్ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేయటం మంచిదా... మ్యూచువల్ ఫండ్స్ మంచివా? దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసేటపుడు మ్యూచ్వల్ ఫండ్స్ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్ మార్కెట్కు ఉంటుంది. పైపెచ్చు ఆర్డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.ఫండ్స్...నేను మ్యూచువల్ పండ్స్లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియోలో 22 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్ ఐతే బెటర్?వాస్తవానికి అన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇన్సూరెన్స్...క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా? మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను తీసుకోవటం సరైనదే.ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..
అంత క్యాష్ కనిపించిందా.. కొరడానే!
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.కొత్త నిబంధనలు ఇవే..కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.వీటికి 100% జరిమానా తప్పదుకొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.ఈ జాగ్రత్తలు అవసరంప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరంపెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.


