Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IPO alert sebi green signal for 4 companies 1
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!

తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్‌ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్‌ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్‌ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్‌ చేరాయి. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్‌ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. ఈ నెలలోనే ఆఫర్‌ ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ 49 శాతం వాటా కలిగి ఉంది.ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌(యూకే) ఆఫర్‌ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌(ప్రమోటర్‌)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్‌ ఏఎంసీలు.. హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్, శ్రీరామ్, నిప్పన్‌ లైఫ్‌ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చేరనుంది.పవర్‌ సొల్యూషన్స్‌.. పవర్‌ సొల్యూషన్స్‌ సమకూర్చే పవరికా లిమిటెడ్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.వృథా నీటి సొల్యూషన్లు వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్‌ సంస్థ కార్తకేయ కన్‌స్ట్రక్షన్స్‌ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్ట్‌(ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్‌గా అవతరించింది. మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్‌మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.వేక్‌ఫిట్‌ @ రూ. 185–195 హోమ్, ఫర్నిషింగ్స్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ ఇన్నోవేషన్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్‌ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్‌లీజ్‌ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్‌ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్‌ఫిట్‌ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్‌ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్‌30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, మల్టీబ్రాండ్‌ ఔట్‌లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్‌(తమిళనాడు), సోనిపట్‌(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది.

Wipro acquires Harman digital transformation solutions unit for 375 million2
విప్రో చేతికి హర్మన్‌ డిజిటల్‌

న్యూఢిల్లీ: ఐటీ సర్విసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్స్‌(డీటీఎస్‌) బిజినెస్‌ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 3,270 కోట్లు వెచ్చించింది. 2025 ఆగస్ట్‌ 21న డీటీఎస్‌ను సొంతం చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. డీల్‌ను విజయవంతంగా ముగించడంతో తమ ఇంజినీరింగ్‌ గ్లోబల్‌ బిజినెస్‌లో విభాగంగా డీటీఎస్‌ పనిచేయనున్నట్లు విప్రో తెలియజేసింది.డీటీఎస్‌ కొనుగోలు ద్వారా అడ్వాన్స్‌ ఏఐ సామర్థ్యాలు, ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ నైపుణ్యాల పెంపుపై కంపెనీ కట్టుబాటులో మరో మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. డీటీఎస్‌లో 100 % వాటా కొనుగోలుకి విప్రో.. దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌కు చెందిన హర్మన్‌తో ఆగస్ట్‌లో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Stock markets fall for 3rd day3
Stock market: మూడోరోజూ డీలా

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్షీణత, బ్లూ చిప్‌(అధిక వెయిటేజీ) షేర్లలో షేర్లలో విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 504 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.ఒక దశలో సెన్సెక్స్‌ 589 పాయింట్లు కోల్పోయి 85,053 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పతనమై 25,998 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఫైనాన్సియల్, సర్విసెస్, బ్యాంకులు, ఇండ్రస్టియల్స్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెలికం, కన్జూమర్‌ డ్యూరబుల్స్, టెక్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.49%, 0.14% నష్టపోయాయి. జపాన్‌ కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్లలో అమ్మకాలు, క్రిప్టో కరెన్సీ పతనంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.వరుస అయిదు ట్రేడింగ్‌ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.9,642 కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే రూ.3,642 కోట్ల షేర్లను అమ్మేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(–1.25%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(–1.25%), ఐసీఐసీఐ బ్యాంకు(–1.25%), ఎల్‌అండ్‌టీ(–1%), యాక్సిస్‌ బ్యాంకు (–1.29%)శాతం నష్టపోయి ఇండెక్సు పతనానికి ప్రధాన కారణమయ్యాయి.

Rupee slumps 43 paise to close at all-time low of 89. 96 against US dollar4
అయ్యో... రూ‘పాయే’

న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి భారీగా షార్ట్‌ కవరింగ్, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్‌ కొనసాగడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 43 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 89.96 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు వరుస విక్రయాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 89.70 వద్ద మొదలైంది. ఒక దశలో 47 పైసలు కుప్పకూలి 90.00 స్థాయి వద్ద ఇంట్రాడే రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘సాంకేతికంగా రూపాయి 90 స్థాయిపై ముగిసినట్లయితే.., ఆ పైన స్థాయిల్లో బై–స్టాప్‌ ఆర్డర్లు మరిన్ని ఉండొచ్చు. కావున 90కి దిగువునే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలి.లేకపోతే 91 స్థాయిని ఛేదించేందుకు మరెంతో సమయం పట్టదు. అంతంకంతా పెరుగుతున్న వాణిజ్య లోటు రూపాయిపై మరింత భారాన్ని పెంచుతోంది. అయితే డిసెంబర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చనే ఆశావహ అంచనాలతో రానున్న రోజుల్లో రూపాయి 89.60 – 90.20 శ్రేణిలో ట్రేడవ్వచ్చు’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ, కరెన్సీ హెడ్‌ అనింద్య బెనర్జీ తెలిపారు.

Gold Rate Drops Again Within Hours5
బంగారం ధరల్లో ఇంత మార్పా!: గంటల వ్యవధిలోనే..

బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Paytm CEO Gets His Tesla Model Y Delivered6
పేటీఎం సీఈఓ కొత్త కారు: ధర ఎంతో తెలుసా?

పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ & క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్‌లో మరొకటి ప్లాన్ చేసింది.టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.

Advertisement
Advertisement
Advertisement