ప్రధాన వార్తలు
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు.
బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?
బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.బంగారం ధరలు తగ్గడానికి కారణాలుఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్గా తగ్గుతాయి.సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు
2025 దాదాపు ముగిసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లాంచ్ అయిన.. అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా హారియార్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టాటా హారియార్ ఈవీ.. 2025లో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఒక బెస్ట్ మోడల్. రూ.21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు.. ఒక ఫుల్ ఛార్జితో 627 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగల ఈ SUV AWD వేరియంట్లో నాలుగు డ్రైవింగ్ మోడ్లను (బూస్ట్, స్పోర్ట్, సిటీ & ఎకో), RWD వేరియంట్లో మూడు డ్రైవింగ్ మోడ్లను (ఎకో, సిటీ & స్పోర్ట్) పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగంలో.. 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.53-అంగుళాల హర్మాన్-సోర్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్తో డ్రైవర్ సీటు, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్రూఫ్, విండో సన్బ్లైండ్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఈవీఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్మార్ట్ (O), ఎక్సలెన్స్ LR అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 42kWh (390 కి.మీ), 51.4kWh (473 కి.మీ.) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. పెద్ద బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది, 11kW AC హోమ్ ఛార్జర్ను ఉపయోగించి 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.2025 బీవైడీ సీల్భారతదేశంలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ అప్డేటెడ్ మోడల్ ఈ ఏడాది లాంచ్ అయింది. రూ. 41 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.BYD సీల్ డైనమిక్ 61.44 kWh బ్యాటరీ ద్వారా 510 కి.మీ పరిధి అందిస్తే.. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో 82.56 kW బ్యాటరీ ప్యాక్.. వరుసగా 650 కి.మీ & 580 కి.మీ పరిధిని అందిస్తుందని సమాచారం.2025 బీవైడీ అట్టోరూ. 24.99 లక్షల ఖరీదైన 2025 బీవైడీ అట్టో కారు.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు, అప్గ్రేడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది కూడా డైనమిక్, ప్రీమియం & సుపీరియర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డైనమిక్ 49.92 kWh బ్యాటరీ 468 కి.మీ, ప్రీమియం & సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 580 కి.మీ. రేంజ్ అందిస్తాయి.BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVలో డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. BYD Atto 3 డైనమిక్ 49.92 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ARAI పరిధి 468 కి.మీ. BYD Atto 3 ప్రీమియం మరియు సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉన్నాయి, ARAI క్లెయిమ్ చేసిన పరిధి 580 కి.మీ.
ఇంతలా పెరిగితే కొనేదెలా?: లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇలా..
నవంబర్ నెల ముగుస్తున్న తరుణంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఈ రోజు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2190 పెరిగింది. దీంతో దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
బ్లాక్ఫ్రైడే గురించి తెలుసా.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే?
ఆఫర్స్ ఎప్పుడెప్పడు వస్తాయా?, నచ్చిన వస్తువులను తక్కువ ధరలో ఎప్పుడు కొనేద్దామా.. అని చాలామంది ఎదురు చూస్తుంటారు. మన దేశంలో కొన్ని సంస్థలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బ్లాక్ఫ్రైడే ఆఫర్స్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి బ్లాక్ఫ్రైడే నవంబర్ 28న వస్తోంది. ఇంతకీ ఈ బ్లాక్ఫ్రైడే ఎలా వచ్చింది? నిజంగానే అనుకున్నంత డిస్కౌంట్స్ లభిస్తాయా?.. అనే ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బ్లాక్ఫ్రైడే ఎలా వచ్చిందంటే?ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్నే బ్లాక్ఫ్రైడేగా పిలుస్తారు. అమెరికాలో అయితే.. బ్లాక్ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ డే పేరుతో సెలబ్రేట్స్ చేసుకుంటారు. బ్లాక్ఫ్రైడే ఎలా వచ్చింది? అనటానికి చాలా సంఘటనలను ఉదాహరణలుగా చెబుతారు.నిజానికి బ్లాక్ఫ్రైడే అనే పదానికి.. షాపింగ్కు సంబంధమే లేదు. 1969 ఆర్ధిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు భారీ పడిపోవడంతో.. దాన్నే బ్లాక్ఫ్రైడేగా పిలుచుకున్నారు.20వ శతాబ్దంలో.. ఒకసారి అమెరికాలో కార్మికుల సెలవు రోజుల తరువాత విధులకు లేటుగా వెళ్లారు.. దీన్ని కూడా బ్లాక్ఫ్రైడే అని పిలిచారు.ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడటంతో.. పోలీసులు దాన్ని బ్లాక్ఫ్రైడేగా పిలిచారు. ఆ తరువాత బ్లాక్ఫ్రైడే అనేది ఆన్లైన్ కొనుగోళ్ళకు.. డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారిపోయింది.శుక్రవారం రోజు మొదలయ్యే వ్యాపారం.. వారాంతంలో కూడా బాగా సాగుతుంది. ఇలా బ్లాక్ఫ్రైడేను వ్యాపారానికి ఆపాదించేసారు. ఆ తరువాత సోషల్ మీడియా / ఇంటర్నెట్ కారణంగా.. బ్లాక్ఫ్రైడే అనే పదం ప్రపంచానికి పరిచయమైంది.2025 బ్లాక్ఫ్రైడే సేల్2023 బ్లాక్ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచంలోని వినియోగదారులు ఏకంగా రూ. 75,000 కోట్లకంటే ఎక్కువ విలువైన షాపింగ్, 2024లో ఇది రూ. లక్ష కోట్లకు చేరింది. అయితే ఈ ఏడాది బ్లాక్ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా.. రూ.1.50 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా.గొప్ప ఆఫర్స్ ఉంటాయా?మంచి ఆఫర్స్ ఉంటాయా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్లాక్ఫ్రైడే సేల్స్ సమయంలో ప్రకటించే ఏడు ఆఫర్లతో ఒకటి మాత్రమే నిజమైందని బ్రెటర్ వినియోగదారుల బృందం 2022లో వెల్లడించింది. కాబట్టి బ్లాక్ఫ్రైడే ఆఫర్స్ కంటే క్రిస్మస్ షాపింగ్ ఉత్తమం అని తెలిపారు.కొన్ని దేశాల్లో అయితే బ్లాక్ఫ్రైడే వస్తోందని ముందుగానే ధరలను పెంచేసి.. ఆ రోజు తగ్గించినట్లు ప్రకటిస్తాయి. దీనిని కొందరు బ్లాక్ ఫ్రాడ్ అని విమర్శించారు. కాబట్టి బ్లాక్ఫ్రైడే సమయంలో ఆఫర్స్ ఉపయోగించే ఉత్పత్తులను కొనాలని చూసేవారు తప్పకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. స్కామర్లు కూడా దీనిని అదనుగా చూసుకుని.. మోసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
టారిఫ్ల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) వృద్ధి రేటు 6.7 శాతం పుంజుకుంటుందని తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమిస్తుందని, దీంతో వృద్ధి రేటు బలపడుతుందని వివరించింది.అమెరికా టారిఫ్ల ప్రభావం నెలకొన్నప్పటికీ.. బలమైన వినియోగంతో దేశీ వృద్ధి పటిష్టంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.అమెరికాతో ఒప్పందంఅమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అది అనిశ్చితులు తగ్గేందుకు, విశ్వాసం పెరుగుదలకు దారితీస్తుందని ఎస్అండ్పీ తెలిపింది. ఇది కార్మికుల ఆధారిత రంగాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ‘‘జీఎస్టీ రేట్లు తగ్గించడం మధ్య తరగతి వినియోగానికి మద్దతునిస్తుంది. దీనికి ఆదాయపన్ను తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా తోడవుతుంది. ఈ మార్పులతో పెట్టుబడుల కంటే వినియోగం వృద్ధిని బలంగా నడిపిస్తుంది’’అని పేర్కొంది.గత బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు (కొత్త పన్ను విధానం కింద) కలి్పంచడం తెలిసిందే. ఇక ఆర్బీఐ వరుస వడ్డీ రేట్ల తగ్గింపుతో రెపో రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.5 శాతానికి దిగిరావడం గమనార్హం. అలాగే, సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ తగ్గడం తెలిసిందే. భారత ఎగుమతుల విస్తరణపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఉందంటూ.. అంతిమంగా భారత ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా తగ్గించే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది.
కార్పొరేట్
జీసీసీ దేశాల్లోకి విస్తరించనున్న ఆర్ఎన్ఐటీ
సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సులకు ఆన్లైన్ ట్రైనింగ్
బ్లాక్ఫ్రైడే గురించి తెలుసా.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే?
ఎన్బీఎఫ్సీల ఏయూఎంలో 18% వృద్ధి
లిస్టింగ్కు 3 కంపెనీలు రెడీ
గేమింగ్ సంస్థల డిపాజిట్లు ఫ్రీజ్
ఎంఎస్ఎంఈ రంగాల కోసం.. సరికొత్త యాప్
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..
రెస్టారెంట్ బిల్లుపై డిస్కౌంట్.. పేటీఎం బాస్పై జోకులు
కొనకుండానే.. షి‘ కారు’!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ...
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది..
గడిచిన వారమంతా బుల్ పరుగులే. నిఫ్టీ ఏకంగా 1.64 శా...
బంగారం ధరలు: వారంలో ఎంత మార్పు?
దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు ...
సీడీఎస్ఎల్ ఐడియాథాన్కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
విద్యార్థుల కోసం తొలిసారిగా రీఇమేజిన్ ఐడియాథాన్ ...
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి...
అల్యూమినియం చౌక దిగుమతులను కట్టడి చేయాలి
చౌక అల్యూమినియం దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపా...
నాస్కామ్ యూకే ఫోరమ్ షురూ
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమల అసోసియేషన్ నాస్కామ్...
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
శబరిమలలో నెట్వర్క్ను పెంచిన వొడాఫోన్ ఐడియా
భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్ మొదలైన వాటిల్లో రిజిస్టర్ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.
ఏఐతో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేగవంతం
సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్ఏఐ ప్లాట్ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.సాఫ్ట్వేర్లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి ‘‘రీఇమేజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్ నివేదికను విడుదల చేసింది.ఆధునిక సాఫ్ట్వేర్ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ ఫ్రేమ్వర్క్ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్ కేస్ స్టడీస్ని ఇందులో పొందుపర్చింది.
కొత్త ఫోనొచ్చింది.. స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి నయా కంపెనీ
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ ఇండ్కాల్ మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్ వన్’ పేరుతో తొలి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్అండ్డీ), థర్డ్పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు. ఈ స్మార్ట్ఫోన్లో కెమెరా మాడ్యుల్, హార్డ్వేర్లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జర్ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్లో లభ్యం కాని చిప్సెట్ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.ఆకట్టుకునే ఫీచర్లు: వూబుల్ వన్ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, ఫోన్కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.ఎక్కువ బేసిక్ పే.. తక్కువ టేక్ హోమ్వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్ అలవెన్స్) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్) పోయి ఎక్కువ జీతం చేతికందేది.రిటైనింగ్ అలవెన్స్ అంటే..రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్ కోడ్లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్& అసోసియేట్స్కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
న్యూ ఫండ్ ఆఫర్: కొత్త మ్యూచువల్ ఫండ్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్వోఎఫ్ స్వరూపం ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్వోఎఫ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు
పెట్టుబడి సురక్షితంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులు.. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, స్థిర రాబడి కూడా పొందవచ్చు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా.. నష్టం మాత్రం ఉండదు. అయితే మీకు వచ్చే రాబడి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథనంలో ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.సాధారణంగా వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదు, కానీ 50 బేసిస్ పాయింట్ల చిన్న వ్యత్యాసం కూడా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. లాభం అనేది ముఖ్యంగా పెట్టుబడి పెట్టిన మొత్తం గణనీయంగా ఉన్నప్పుడు & కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లుHDFC బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్పై 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ అందిస్తుంది.ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు.. సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.6% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9% వడ్డీని అందిస్తుంది. అయితే, 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగినప్పుడు.. బ్యాంక్ అత్యధికంగా 6.7%, 7.2% వడ్డీని అందిస్తుంది.ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు తన మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.7% & సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితాలో ఇది ఒకరి కావడం గమనార్హం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.3% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీని అందిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు కొంత ఎక్కువ వడ్డీ (6.45% & 6.95%) అందిస్తుంది.కెనరా బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25% & సీనియర్ సిటిజన్లకు 6.75 వడ్డీని ఇస్తుంది. అయితే, 444 రోజుల కాలపరిమితి ఉన్నప్పుడు అత్యధిక రేట్లు (6.5% & 7%) పొందవచ్చు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది మూడు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6% & సీనియర్ సిటిజన్లకు 7.1% వడ్డీని అందిస్తుంది.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!
50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!
డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ ఫార్ములా గురించి ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం.ఏమిటీ 50/30/20 ఫార్ములా?50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలు (సరదా ఖర్చులు), 20 శాతం పొదుపు. ఈ ఫార్ములాను యూఎస్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తన పుస్తకం "ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్టైమ్ మనీ ప్లాన్''లో వెల్లడించారు.వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా & ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి) చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములామీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుండాలి, అనుభవం కూడా ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.


