Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 13th December 2025 in Telugu states1
దిగొచ్చిన కనకం ధరలు.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Nifty 50 closed 2025 resilient note Year End Review2
పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ

ఏడాదిలో ఇక్విటీ రిటైలర్లను నిఫ్టీ సూచీ ఓ ఆట ఆడేసుకొని చివరకు గరిష్టాలను చేరుకుంది. మొదటి త్రైమాసికంలో నష్టాల్లో ఉన్న నిఫ్టీ సూచీ ఏడాది చివరినాటికి జీవితకాల గరిష్టాలను చేరింది. అందుకు దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా కారణాలున్నాయి. ఏడాదిలో చోటుచేసుకున్న చాలా పరిణామాల వల్ల నిఫ్టీ కదలికలపై ఇయర్‌ ఎండర్‌ రివ్యూ.భారత స్టాక్ మార్కెట్లకు ప్రధాన కొలమానమైన నిఫ్టీ 50 సూచీకి 2025 సంవత్సరం రికార్డుల ఇయర్‌గా మిగిలింది. జనవరి 1, 2025న సూచీ ప్రారంభ విలువతో పోలిస్తే ఏడాది ముగిసే నాటికి(డిసెంబర్‌ 12 వరకు) నిఫ్టీ సుమారు 18.5% నికర వృద్ధిని నమోదు చేసింది. ఇది ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ), దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నుంచి భారీ నిధుల ప్రవాహానికి, స్థూల ఆర్థిక వ్యవస్థలో ఆశాజనకమైన వృద్ధి అంచనాలకు నిదర్శనం.సంవత్సరం మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) నిఫ్టీ సూచీలో సుమారు 4% తగ్గుదల కనిపించింది. అందుకు ప్రధానంగా అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ఆందోళనలు కారణం అయ్యాయి. అయితే, ఏప్రిల్ నుంచి సంవత్సరం చివరి వరకు నిఫ్టీ స్థిరంగా కదలాడుతూ పండుగ సీజన్, కార్పొరేట్ ఆదాయాల ఆశాజనక అంచనాలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకింది.నిఫ్టీ కదలికలపై ప్రభావం చూపిన కీలక అంశాలుభౌగోళిక-రాజకీయ అంశాలుఎర్ర సముద్రంలో కొనసాగిన ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఇది ముడి చమురు ధరలను పెంచి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చింది. తద్వారా నిఫ్టీ ఏడాది ప్రారంభంలో తగ్గుదలకు కారణమైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల ప్రభావం వాటి ఆర్థిక విధానాలపై ప్రభావం చూపవచ్చనే అనిశ్చితి నెలకొనడం వల్ల స్వల్పకాలికంగా మార్కెట్‌లో అస్థిరత ఏర్పడింది.దేశీయ ఆర్థిక పరిస్థితులు2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలు 6.8% - 7.0% మధ్య ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాంతో దేశీయ డిమాండ్‌లో స్థిరత్వం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల నుంచి ఆశాజనకమైన త్రైమాసిక ఆదాయాలు (క్యూ1 నుంచి క్యూ3 వరకు) నిఫ్టీకి మద్దతునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరమైన వృద్ధి బ్యాంకింగ్ సూచీని కొత్త శిఖరాలకు చేర్చింది.అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ 2025 ద్వితీయార్థంలో ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పులు చేయడం వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.యూఎస్‌ సుంకాలు, వాణిజ్య విధానాలుయూఎస్, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అనేక అంతర్జాతీయ తయారీ కంపెనీలు తమ దృష్టిని భారతదేశం వైపు మళ్లించాయి. ఈ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం కారణంగా భారతదేశ ఎగుమతి ఆధారిత రంగాల్లో (ముఖ్యంగా కెమికల్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్) బలమైన వృద్ధి అంచనాలు నిఫ్టీ వృద్ధికి దోహదపడ్డాయి.ఫెడ్ వడ్డీ రేట్ల స్థిరీకరణ2025 చివరిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటానికి, భారత మార్కెట్‌లోకి ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరగడానికి దారితీసింది.జీఎస్టీ సవరణలు2025-26 కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై భారీ కేటాయింపులు, తయారీ రంగానికి ఉద్దీపనలు ఇవ్వడం వల్ల క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ వంటి రంగాలు లాభపడ్డాయి. 2025 మధ్యలో జీఎస్టీ కౌన్సిల్ కొన్ని కీలకమైన రంగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించింది. ఈ నిర్ణయం వినియోగదారుల ఖర్చులకు ఊతమివ్వడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా మార్కెట్‌కు సానుకూల అంశంగా మారింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో డిస్నీ పాత్రలు

Disney announced 1 billion USD investment in OpenAI3
చాట్‌జీపీటీలో డిస్నీ పాత్రలు

వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్‌ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్‌ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.ఒప్పందంలోని అంశాలుమిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్‌స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్‌లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్‌జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్‌ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్‌జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్‌, ఇమేజ్‌ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..

Mexico Tariff Escalation on india check full details4
భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..

అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్స్, వాటి విడిభాగాల తయారీదారులు, ఎంఎస్‌ఎంఈ రంగాలపై దీని ప్రభావం పడనుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మెక్సికో సుంకాల పెంపుఇటీవల మెక్సికన్ సెనేట్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న సుంకాల పెంపును ఆమోదించింది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఈ కొత్త విధానం అమలవుతుందని చెప్పింది. ఈ పెంపులో ఆటోమొబైల్స్ దిగుమతి సుంకం కీలకంగా మారింది. కొత్త నిర్ణయాల్లో భాగంగా ఇది 20 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెరుగుతుంది. భారతీయ కార్ల తయారీదారులు, ఆటో విడిభాగాల సరఫరాదారులకు మెక్సికో ప్రధాన వైవిధ్య మార్కెట్‌ల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు 50% సుంకం కారణంగా వారి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి, మెక్సికన్ మార్కెట్‌లో పోటీ పడే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు(అంచనా)అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు తమ వస్తువులను నేరుగా అమెరికాకు ఎగుమతి చేయకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. ఈ వస్తు మళ్లింపును నిరోధించే లక్ష్యంతో మెక్సికో సుంకాలు పెంచింది.యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA)ను సమీక్షించబోతున్న నేపథ్యంలో మెక్సికో తన వాణిజ్య విధానాన్ని అమెరికా వైఖరికి దగ్గరగా ఉండేలా చూసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.మెక్సికోకు భారత్ ఎగుమతులు.. ఏ రంగాలు ప్రభావితం?భారతదేశం నుంచి మెక్సికోకు ఎగుమతయ్యే ప్రధాన అంశాలలో ఆటోమొబైల్స్‌ ఒకటి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రక్కులు, ఇంజిన్ విడిభాగాలు, టైర్లు వంటి ఆటో విడిభాగాల ఎగుమతులు ప్రభావితం కానున్నాయి.కొన్ని రకాల రసాయనాలు, ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు.రంగులు, రంగుల పదార్థాలు (Dyes and Pigments), ఇతర ఆర్గానిక్ రసాయనాలు.రెడీమేడ్ దుస్తులు, ఇతర వస్త్ర ఉత్పత్తులు.పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు.భారత్‌కు మెక్సికో దిగుమతులు ఇలా..మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో చమురు అత్యంత కీలకం. చమురు ధరల్లో పెరుగుదల లేదా లభ్యతలో హెచ్చుతగ్గులు భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రవాణా, తయారీ రంగాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.యంత్రాలు, విడిభాగాలుతయారీ, ఇంజినీరింగ్ రంగానికి సంబంధించిన భారీ పారిశ్రామిక యంత్రాలు, టర్బైన్లు, పంపింగ్ పరికరాలు వంటి వాటిని భారత్ మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది.బంగారం, వెండివిలువైన లోహాల రంగంలో భారత్ బంగారం, వెండి లోహాలను (కొన్ని సందర్భాలలో) దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో బంగారం వినియోగం అత్యధికంగా ఉంటుంది.ఖనిజాలుమైనింగ్ రంగంలో కొన్ని రకాల లోహ ఖనిజాలు, ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది.మెక్సికో సుంకాల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా ఉన్నప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి కీలకమైన వస్తువులపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాలో కూడా అనిశ్చితి ఏర్పడవచ్చు.ఇప్పుడు ఏం చేయాలంటే..సుంకాల నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఎగుమతిదారులు లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలు, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించాల్సి ఉంది.లాటిన్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల (ప్రైమరీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌) కోసం చర్చలను వేగవంతం చేయాలి. ఇది సుంకాల భారం లేకుండా మార్కెట్ అవకాశాన్ని సులభతరం చేస్తుంది.దేశీయంగా తయారీ రంగాన్ని ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచాలి.ఇదీ చదవండి: భారత్‌లో పెరుగుతున్న ‘ఘోస్ట్‌ మాల్స్‌’

Silver prices in Delhi jumped to a record Rs 1,94,400 per kilogram5
రూ.2,00,000 చేరువలో వెండి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్‌ నెలకొనడంతో వెండి ధర వరుసగా మూడో రోజు బలపడి, రూ. 2 లక్షల మార్కుకు మరింత చేరువలోకి వచి్చంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం శుక్రవారం న్యూఢిల్లీ మార్కెట్లో కిలోకి ఏకంగా రూ.5,100 మేర పెరిగి రూ. 1,99,500 వద్ద క్లోజయ్యింది. ఇది సరికొత్త రికార్డు స్థాయి. ‘దేశీ మార్కెట్లో స్పాట్‌ వెండి ధరలు మరో కొత్త గరిష్టానికి ఎగిశాయి. అటు బంగారం కూడా భారీగా పెరిగి, రికార్డు స్థాయికి దగ్గర్లో ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా కన్సాలిడేట్‌ అవుతున్న పసిడి రేటు, రూపాయి బలహీనంగా ఉండటం లాంటి అంశాల కారణంగా, మళ్లీ పెరగడం మొదలైంది‘ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్టు దిలీప్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక బులియన్‌ స్పాట్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,100 పెరిగి రూ. 1,33,600 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 58.61 డాలర్లు (1.37 శాతం) పెరిగింది. 4,338.40 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లో వెండి రేటు 64.95 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గించడంతో పసిడి, వెండి ధరలు తదనుగుణంగా స్పందిస్తున్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (కరెన్సీ, కమోడిటీ) అనింద్య బెనర్జీ పేర్కొన్నారు.

Mexico new import duties put pressure on auto component exporters6
ఎగుమతులకు మెక్సికో టారిఫ్‌ల దెబ్బ

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ఆటో, ఆటో విడిభాగాలు, మెటల్, ఎల్రక్టానిక్స్, కెమికల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన మెక్సికో తాజాగా భారత్‌ దిగుమతులపై సుంకాల పెంపును చేపట్టింది. ఇవి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోలేని దేశాలపై 5 నుంచి 50 శాతంవరకూ దిగుమతి సుంకాలు వర్తించనున్నాయి. భారత్‌సహా చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా దేశాలలోని వివిధ రంగాలు, పరిశ్రమలపై ఈ టారిఫ్‌లు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది(2024–25) మెక్సికోకు 5.75 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను భారత్‌ చేపట్టింది. అయితే తాజా టారిఫ్‌ల పెంపు కారణంగా మెక్సికోకు ఎగుమతులు వ్యయభరితమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ప్రయాణికుల వాహన ఎగుమతులు 938.35 మిలియన్‌ డాలర్లుకాగా.. 20 శాతం నుంచి 35 శాతం మధ్య టారిఫ్‌ పెంపు వర్తించనున్నట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనేíÙయేటివ్‌(జీటీఆర్‌ఐ) తెలియజేసింది. దీంతో ధరల పోటీతత్వం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఆటో విడిభాగాలపై ఇది మరింత అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల ఎగుమతులు 507.26 మిలియన్‌ డాలర్లుకాగా.. 10–15% సుంకాలు 35 శాతానికి పెరగనున్నట్లు జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలియజేశారు. ఇదేవిధంగా 390.25 మిలియన్‌ డాలర్ల విలువైన మోటార్‌సైకిళ్ల ఎగుమతులు సైతం సవాళ్లను ఎదుర్కోనున్నట్లు తెలియజేశారు. వీటిపై సుంకాలు 20% నుంచి 35 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించారు. ఆటో విడిభాగాలపై ఎఫెక్ట్‌ దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమపై తాజాగా మెక్సికో చేపట్టిన దిగుమతి సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమల సమాఖ్య ఏసీఎంఏ పేర్కొంది. భారత్‌ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో 37 కోట్ల డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. సుంకాలు భారత్‌ ఎగుమతులపై 35–50% స్థాయిలో పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు వృద్ధిలో ఉన్న ఆటోమోటివ్‌ వాణిజ్యానికి నిలకడను తీసుకురాగలదని విశ్వసిస్తున్నట్లు దేశీ ఆటోమోటివ్‌ విడిభాగ తయారీదారుల అసోసియేషన్‌(ఏసీఎంఏ) డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement