ప్రధాన వార్తలు
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
సైబర్ దాడి జరగకుండా, ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా 132 బిలియన్ డాలర్ల విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్ నాటికి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ (PANW) మార్కెట్ క్యాప్ రికార్డును చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ల్లో ప్రపంచ లీడర్గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలోని ప్రముఖులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో పుట్టి పాలోఆల్టో నెట్వర్క్స్ ఛైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందాం.నికేష్ అరోరా తండ్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసేవారు. నికేష్ క్రమశిక్షణతో కూడిన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1968లో జన్మించిన ఆయన 1990లో వారణాసిలోని ఐఐటీ బీహెచ్యూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి బోస్టన్ కాలేజీ నుంచి ఫైనాన్స్లో మాస్టర్స్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కెరియర్ ప్రారంభంలో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్, పుట్నమ్ ఇన్వెస్ట్మెంట్స్లో పనిచేసి ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై అనుభవాన్ని సంపాదించారు. ఆరంభంలో దాదాపు 400 సార్లు తన జాబ్ అప్లికేషన్ను కంపెనీలు తిరస్కరించాయి. అయినా ఆయన పట్టుదలతో కృషి చేశారు.గూగుల్, సాఫ్ట్బ్యాంక్లో..నికేష్ అరోరా 2004లో గూగుల్లో చేరడం తనకు టర్నింగ్ పాయింటని చెప్పారు. పదేళ్లలో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా ఎదిగారు. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని 2 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెంచడంలో కీలకపాత్ర పోషించారు. యూరప్ కార్యకలాపాల నుంచి ప్రపంచ వ్యాపార వ్యూహం వరకు అన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి.2014లో సాఫ్ట్బ్యాంక్కు ప్రెసిడెంట్, సీఓఓగా వెళ్లి 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్కు బీజం వేశారు. ఈ సమయంలోనే ఓలా, ఒయో, స్నాప్డీల్ వంటి భారతీయ స్టార్టప్లతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భారీ పెట్టుబడులు పెట్టడంలో కీలకంగా మారారు.2018 నుంచి పాలో ఆల్టోలో..జూన్ 2018లో నికేష్ పాలో ఆల్టో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్ ఆధారిత సైబర్ సర్వీసులను బలోపేతం చేయడానికి 15కి పైగా కంపెనీలను విజయవంతంగా కొనుగోలు చేశారు. Prisma Cloud, Cortex XDR, Cortex XSIAM వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించారు. సైబర్ థ్రెట్లను రియల్ టైమ్లోనే ఆపే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించారు.2018లో 180 డాలర్లు ఉన్న కంపెనీ స్టాక్ ధర 2025 నాటికి 400 డాలర్లు పైనే ట్రేడవుతోంది. నికేష్ అరోరా నాయకత్వంలో కంపెనీ కేవలం ఐదేళ్లలోనే దాదాపు 120%కు పైగా రిటర్న్లను అందించింది.రికార్డు పరిహారంనికేష్ అరోరా సంపాదన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో ఆయన అందుకున్న పరిహారం 151.43 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,260 కోట్లు). ఇది అమెరికాలో ఆ సంవత్సరానికి రెండవ అత్యధిక వేతనం పొందిన సీఈఓగా నిలిపింది. 2025 జులై నాటికి ఆయన వ్యక్తిగత నికర విలువ 1.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.12,500 కోట్లకు) చేరింది. ఇందులో ఎక్కువ భాగం పాలో ఆల్టో నెట్వర్క్స్ స్టాక్స్ రూపంలోనే ఉంది.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్బస్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్బస్ ఏ320 విమానాల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.అప్గ్రేడ్ వివరాలుఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్గ్రేడ్ పూర్తి చేసింది.ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: 25 విమానాల్లో 23 అప్గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్ చేయనున్నారు.సమస్య ఏమిటి?ఎయిర్బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్లైన్స్కు తక్షణ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా?
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అరుదైన ఘనత
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్టెక్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్లకు పుట్టినిల్లు అయింది.స్టార్టప్ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.ఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వివరాలు..ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.105 కంటే ఎక్కువ స్టార్టప్లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.దాదాపు 40 శాతం స్టార్టప్లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్ను అందించింది.రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.కీలక రంగాలపై దృష్టిఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా?
జెన్ జెడ్ ఇన్వెస్టర్లకు బీమా.. డైలమా
పూర్తిగా డిజిటల్ శకంలో పెరుగుతున్న జెన్ జెడ్ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.జెన్ జెడ్ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్డీఎఫ్సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్ ఇన్సూరెన్స్పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.జెన్ జెడ్ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్స్టయిల్కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్ పాలసీలను, గ్యాడ్జెట్స్ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను జెన్ జడ్ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.ఏం కోరుకుంటున్నారు..సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.పర్సనలైజేషన్: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్టైమ్ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్–యు–డ్రైవ్ కార్ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్–ఆన్లను చేర్చేందుకు వీలుండే హెల్త్ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.డిజిటల్ ఫస్ట్: ఫోన్తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్ – ఫస్ట్ తరహాలో ఉండాలనుకుంటున్నారు.పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్ వైపు జెన్ జెడ్ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ నేపథ్యంలో జెన్ జడ్ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్నెస్ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.జెన్ జడ్ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్–ఫస్ట్గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్ జడ్ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్ జడ్ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్ సెగ్మెంట్ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది.
వంట గ్యాస్ ధరల తగ్గింపు
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం.. 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ .10 తగ్గింది. కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర గత నెలలోని రూ.1,590.50 నుంచి రూ.1,580.50కు తగ్గింది.కోల్కతాలో కొత్త ధర రూ.1,694 నుంచి రూ.1,684కు తగ్గింది.ముంబయిలో గత నెలలో రూ.1,542గా ఉన్న ధర రూ.1,531.50కి దిగొచ్చింది.చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,750 నుంచి రూ.1,739.50కు తగ్గింది.హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,746 నుంచి రూ.1,736కు తగ్గింది.విశాఖపట్నంలో కొత్త ధర రూ.1,722. ఇది గత నెలలో రూ.1,732 ఉండేది.ఇంధన రిటైలర్లు కమర్షియల్ ఎల్పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సర్దుబాటు చేస్తాయి. అయితే గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ల (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
యాప్లా.. మార్కెటింగ్ యంత్రాలా?
భారత్లో చాలా మొబైల్ యాప్లు అవి అందిస్తున్న సర్వీసుల కంటే కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మార్కెటింగ్ యంత్రాలుగా మారాయనే వాదనలున్నాయి. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సందర్భంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు అందులోని యాడ్లు చూసి ఆశ్చర్యపోయారు. అందులో త్రివర్ణ పతాకంతో ఉన్న క్రికెట్ బ్యాట్ కింద బ్యానర్లో ‘ఈ మ్యాచ్ వీక్లో భారీ స్కోర్ చేయండి. బిర్యానీపై 20% తగ్గింపు!’ అని ఉంది. అసలు ఆ యాప్కు బిర్యానీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇలా ప్రకటనలు వచ్చాయి.గత దశాబ్దంలో భారతీయ యాప్స్ యుటిలిటీ టూల్స్ నుంచి పూర్తిస్థాయి మార్కెటింగ్ కాన్వాస్లుగా మారాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఓలా, పేటీఎం, డంజో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్, బుక్మైషో, ఓయో.. ఇవి కేవలం సర్వీసులకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ బ్రాండ్ ఎకోసిస్టమ్లో భాగమయ్యాయి.తమదైన శైలిలో లేబులింగ్..ఒకప్పుడు యాప్ అంటే సెర్చ్ బార్, మెనూ, చెకౌట్ పేజీ.. ఉండేది. ఇప్పుడు యాప్లో ప్రతి విభాగం కమర్షియల్గా మారింది. హోమ్పేజీలో బ్యానర్లు, స్పాన్సర్డ్ రెస్టారెంట్ వివరాలు, సజెషన్స్, కిరాణా యాప్స్లో స్పాన్సర్డ్ ఉల్లిపాయలు, బిస్కెట్లు.. ఇలా ప్రతి లేబుల్లో యాడ్ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇవి ప్రకటనలని తెలియకుండా కంపెనీలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవి ప్రకటనలుగా లేబుల్ చేయాలి. అయితే అందుకు చాలా కంపెనీలు తమదైన శైలిలో లేబుల్ను చాలా చిన్నదిగా చేసి సాధారణ ఉత్పత్తుల్లో భాగంగానే చూపిస్తున్నాయి. దీనినే ‘నేటివ్ అడ్వర్టైజింగ్’ అని పిలుస్తున్నారు.ఈ యాప్స్ కేవలం స్టాటిక్ బ్యానర్లను మాత్రమే ప్రమోట్ చేయడం లేదనే వాదనలున్నాయి. ఇవి వినియోగదారుల సందర్భాన్ని, భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నాయి.స్విగ్గీ 2025 ఐపీఎల్ (IPL) సమయంలో ‘స్విగ్గీ సిక్సెస్’ ప్రవేశపెట్టింది. ప్రతి సిక్సర్కు డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పింది.జెప్టో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రమోషన్ కోసం ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకుంది.వాహనాల ఆఫర్లను కంపెనీలు పండగలతో లింక్ చేస్తున్నాయి.గూగుల్ పే స్క్రాచ్ కార్డులతో చెల్లింపులు పెంచుకుంటోంది.ఇన్స్టామార్ట్ దీపావళి సమయంలో వర్చువల్ బాణసంచా ఆఫర్లు అందించింది.ఇలా చాలా కంపెనీలు సందర్భోచితంగా, భావోద్వేగపూరిత యాడ్లను అందిస్తున్నాయి.భారతీయులు రోజుకు సగటున 5-6 గంటలు మొబైల్తో గడుపుతున్నారు. అందులోనూ ఎక్కువ భాగం 8-10 యాప్స్నే వాడుతున్నారు. ఇది బ్రాండ్లకు అపార అవకాశం కల్పిస్తుంది. ఇందుకు కంపెనీలు విభిన్నం పంథాలను ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థల యాప్స్ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు కదా?’ అనే ప్రకటనలు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా యాప్స్లో ఆర్డర్ హిస్టరీ, చెల్లింపులు వంటి విస్తృతమైన డేటా ద్వారా వినియోగదారుల మనస్తత్వానికి అనుగుణంగా ప్రకటనలు అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి పర్సనలైజేషన్ ప్రకటనల వెనుక డేటా ఎంతగా సేకరిస్తున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు.. అనేది పారదర్శకంగా లేదు.కొన్నింటికి ప్రకటనలే దిక్కు..2030 నాటికి భారతదేశంలో యాప్ అడ్వర్టైజింగ్ మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తక్కువ మార్జిన్లతో నడిచే డెలివరీ, రైడ్ హెయిలింగ్ కంపెనీలకు ఈ ఆదాయం ఆప్షనల్గా ఉండడంలేదు. అవి మనుగడ సాధించాలంటే తప్పకుండా ప్రకటనల ఆదాయం కావాల్సిందే. అయితే, చైనాలో వీచాట్ ఒకప్పుడు ప్రమోషనల్ ఇంటర్ఫేస్గా ఉండేది. యూజర్లు క్రమంగా తగ్గిపోతుండడంతో తిరిగి తన అసలు బిజినెస్పై దృష్టి సారించింది. బ్రాండింగ్ ప్రమోషన్లో తప్పేంలేదు. కానీ యాప్ ఇంటర్ఫేస్లో ప్రధానంగా బ్రాండ్లనే ప్రమోట్ చేస్తే అసలు సర్వీసులు మరుగునపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
కార్పొరేట్
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
వంట గ్యాస్ ధరల తగ్గింపు
యాప్లా.. మార్కెటింగ్ యంత్రాలా?
ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ
గృహ రుణానికి ముందే గుడ్బై
మీ కార్డు సంపాదిస్తోందా?
హిందుస్తాన్ పవర్కి సౌర విద్యుత్ ప్రాజెక్టు
ఐదేళ్లలో 10 కోట్ల కస్టమర్లు.. అపోలో ఫార్మసీ లక్ష్యం
నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో మస్క్
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబం...
అంతులేని వేగం.. ఆగేదెప్పుడో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
వెండికి హాల్మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్వర్క్
బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేసిన ప్...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కె...
జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు
ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన ...
‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్న...
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భా...
భారత్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అలీబాబా ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ
టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ టెక్ గ్యాడ్జెట్లపై ప్రజలకు ఆసక్తి కూడా అధికమవుతోంది. స్మార్ట్ఫోన్ల తర్వాత ఇప్పుడు ఏఐ పవర్డ్ వేరబుల్స్పై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్లు మార్కెట్ ఏటా పెరుగుతోంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్ 9.6% వృద్ధి చెందింది. చైనాలో 50 మిలియన్ యూనిట్ల స్మార్ట్ గ్లాసెస్ విక్రయించారు. ఈ నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన మొదటి ఏఐ గ్లాసెస్ను ఆవిష్కరించింది. ‘క్వార్క్ ఏఐ గ్లాసెస్’ పేరుతో విడుదల చేసిన ఈ గాడ్జెట్ మెటా గ్లాసెస్కు పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లాసెస్తో అలీబాబా కన్స్యూమర్ ఏఐ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.అలీబాబా క్వెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా క్వార్క్ ఏఐ అసిస్టెంట్తో ఈ గ్లాసెస్ను రెగ్యులర్ ఐవేర్లాగా కనిపించే డిజైన్తో తీసుకొచ్చారు. బ్లాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో స్టైలిష్గా ఉండటం వల్ల ఇవి రోజువారీ ఉపయోగానికి సరిపోతాయని కంపెనీ తెలిపింది. మెటా రేబాన్ డిస్ప్లే గ్లాసెస్ లాంటి హెవీ గ్యాడ్జెట్లకు విరుద్ధంగా ఇవి కేవలం 40 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయని చెప్పింది. ప్రెస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ చేస్తూ వివిధ ఫ్రేమ్ కలర్స్, లెన్స్ ఆప్షన్లతో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.క్వార్క్ ఏఐ గ్లాసెస్ను ఫ్లాగ్షిప్ S1, లైఫ్స్టైల్ ఫోకస్డ్ G1 మోడళ్లలో ఆవిష్కరించారు. మోడల్ను అనుసరించి ఫీచర్లలో తేడాలుంటాయి. ఈ గ్లాసెస్లోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.విదేశీ భాషల్లో సంభాషణలు లేదా టెక్స్ట్ను ఇన్స్టంట్గా అనువదిస్తుంది. ప్రయాణికులకు, బిజినెస్ ప్రొఫెషనల్స్కు ఇది ఎంతో ఉపయోగం.గ్లాసెస్ కెమెరాతో ప్రొడక్ట్ను స్కాన్ చేస్తే తావోబా(చైనా ఈకామర్స్ వెబ్సైట్)లో ధరలు, ఆఫర్లు డిస్ప్లే అవుతాయి. షాపింగ్ను సులభతరం చేస్తుంది.అమాప్తో లింక్ అయి ఏఆర్ ఓవర్లేలతో రోడ్ డైరెక్షన్లు చూపిస్తుంది.టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఆబ్జెక్ట్ రికగ్నిషన్తో చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని తెలుపుతుంది.ఏఐతో మీటింగ్లు రికార్డ్ చేసి సమ్మరీలు జనరేట్ చేస్తుంది.క్వార్క్ గ్లాసెస్ ధర S1కు 3,799 యువాన్ (సుమారు రూ.53,600), G1 మోడల్కు 1,899 యువాన్ (సుమారు రూ.26,800) వరకు ఉంది.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
డిసెంబర్ 11న మరో యాపిల్ స్టోర్: ఈసారి ఎక్కడంటే?
భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్ను ప్రారంభించనుంది.డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్లెట్లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్లెట్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్కాస్ట్లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు
‘సేఫ్ సెకండ్ అకౌంట్’తో డిజిటల్ మోసాలకు చెక్
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్టెల్ సేఫ్ సెకండ్ అకౌంట్ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.ఈ ఖాతా ప్రత్యేకతలు..ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
పర్సనల్ ఫైనాన్స్
డిసెంబర్ డెడ్లైన్లు.. కొత్త మార్పులు
డిసెంబర్ నెలలో పలు బ్యాంకింగ్, పెన్షన్, ఆదాయపు పన్ను సంబంధించిన కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత నుంచి, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పాన్–ఆధార్ లింకింగ్, ఐటీఆర్ గడువులు, ఎన్పీఎస్ నుంచి యూపీఎస్కు మారడానికి ఆప్షన్ గడువు.. ఇలా అనేక అంశాలు గమనించాల్సివి ఉన్నాయి.నవంబర్తో ముగిసే కీలక గడువులుఎస్బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేతస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లో ఎంక్యాష్ (mCASH) సేవలను నిలిపివేస్తోంది. దీని తర్వాత లబ్ధిదారును నమోదు చేయకుండా డబ్బు పంపడం లేదా లింక్ ద్వారా నిధులు స్వీకరించడం సాధ్యం కాదు. బదులుగా వినియోగదారులు యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి సురక్షిత చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది.లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను నవంబర్ 30లోపు తప్పనిసరిగా సమర్పించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇంటి వద్ద సేవల ద్వారా, బ్యాంకులు/పోస్టాఫీసుల ద్వారా, డిజిటల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గడువు దాటితే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.ఎన్పీఎస్ నుండి యూపీఎస్కు మార్పు..ఎన్పీఎస్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి నవంబర్ 30 చివరి అవకాశం ఉంది. దరఖాస్తులు సీఆర్ఏ వ్యవస్థ ద్వారా లేదా నోడల్ కార్యాలయాలకు భౌతికంగా అందించాలి.డిసెంబర్లో కీలక ఆదాయపు పన్ను గడువులుపన్ను ఆడిట్ కేసుల ఐటీఆర్పన్ను ఆడిట్కి అర్హులైన మదింపుదారుల కోసం ఐటీఆర్ దాఖలు గడువును సీబీడీటీ డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 31తోనే ముగిసింది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుఅసలు గడువులో ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(4) కింద డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత దాఖలు చెయ్యడం అసాధ్యం. జరిమానా, వడ్డీ, రిఫండ్ నష్టం వంటి పరిణామాలు ఎదురవచ్చు.పాన్–ఆధార్ లింకింగ్2024 అక్టోబర్ 1 లోపు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వ్యక్తులు తమ పాన్ ఇనాక్టివ్ కాకుండా ఉండాలంటే డిసెంబర్ 31 లోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేయాలి.
ధనికులయ్యే ‘తొలి కిటుకు’ చెప్పేసిన కియోసాకి..
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్ ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.తొలి వ్యూహం ఇదే.. కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్పైనే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్ డాడ్’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.30 YEAR BUBBLE BURSTINGJapan ends “CARRY TRADE” ending.For 30 years Japan has loaned billions to investors in global markets, and money flowed into real estate, stocks, bonds, commodities & businesses. The Japanese “carry trade” blew the assets of the world….into the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్తో కలిసి సమగ్ర పోర్టల్ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్గా పరిగణిస్తున్నారు.
‘శ్రేయోభిలాషుల’తో బతుకు బస్స్టాండ్!
కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని, మీ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా వేసే ప్రతి అడుగును.. మీ చుట్టూ ఉండే కొంతమంది తెలియకుండానే లేదా కావాలనే వెనక్కి లాగుతుంటారు. తరచుగా మన ఆర్థిక కష్టాలకు మార్కెట్ హెచ్చుతగ్గులు, తక్కువ జీతం ఉందని నిందిస్తాం. కానీ నిజమైన శత్రువులు మన పక్కనే ఉంటారని గుర్తుంచుకోండి. వీరి ఆలోచనా విధానాలు, ఆర్థిక అలవాట్లు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపి పేదవారిగా మార్చేస్తుంటారు. మనల్ని పేదవారిగా మార్చే ఈ వ్యక్తులు ఎవరు? వారి మనస్తత్వం మన భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం.ఖర్చులను ప్రోత్సహించడంపేద మనస్తత్వం ఉన్నవారు సాధారణంగా తక్షణ లభించే సంతృప్తిని కోరుకుంటారు. పొదుపు చేయడాన్ని లేదా పెట్టుబడి పెట్టడాన్ని వాయిదా వేస్తూ ‘రేపటి గురించి ఎవరి తెలుసు?’ అనే ధోరణితో ఉంటారు. అలాంటివారు మిమ్మల్ని తరచుగా అనవసరమైన విందులకు, పార్టీలకు లేదా ఫ్యాషన్ వస్తువులకు ఖర్చు పెట్టమని ప్రోత్సహిస్తారు. దీనివల్ల మీ బడ్జెట్ను దాటి ఖర్చు చేస్తారు. ‘అందరూ కొంటున్నారు, నువ్వు కొనకపోతే ఎలా?’ అనే ఒత్తిడికి లోనై అప్పులు చేయక తప్పదు.నిరాశావాదంకొందరు ఆర్థిక విజయానికి కృషి చేయడం కంటే తమ పేదరికానికి వ్యవస్థను, ప్రభుత్వాన్ని, లేదా ఇతరులను నిందించడానికి మొగ్గు చూపుతారు. వారి నిరాశావాదం మీ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ఆటంకం కలిగిస్తుంది. ‘డబ్బు సంపాదించడం కేవలం అదృష్టవంతులకే సాధ్యం’, ‘ఈ వయసులో పొదుపు చేయడం ఎందుకు?’ వంటి మాటలు మీలోనూ నిరుత్సాహాన్ని పెంచి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను చంపేస్తాయి.తప్పుడు సలహాలుకొందరి సొంత ఆర్థిక జీవితాలు గందరగోళంగా ఉన్నప్పటికీ మీకు అనవసరమైన, అధిక రిస్క్ కూడిన పథకాల్లో డబ్బు పెట్టమని సలహా ఇవ్వవచ్చు. వారి సలహాలు విని మీరు పదేపదే తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలనే పథకాలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంపద కరిగిపోతుంది.ఈ విషవలయం నుంచి బయటపడే మార్గంతమ ఆర్థిక స్థితితో మీ స్థితిని పోల్చుకునే వారితో దూరం పాటించండి.‘నో’ అనడం నేర్చుకోండి. అది మీ డబ్బుకి రక్షణ కవచం.మీ ఆర్థిక లక్ష్యాలను ఎవరితోనూ షేర్ చేయకండి. ఎగతాళి చేసే వారు ఎక్కువ.ఆదా, పెట్టుబడి, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడే వారితోనే స్నేహం చేయండి.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు


