ప్రధాన వార్తలు
గృహ రుణ మార్కెట్లో పీఎస్బీల దూకుడు
ముంబై: గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో.. నాన్ బ్యాంకింగ్ రుణ దాతల హౌసింగ్ పోర్ట్ఫోలియో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. నాన్ బ్యాంక్ రుణదాతల నిర్వహణలోని రుణ ఆస్తుల విలువ 2025–26లో 12–13 శాతం మేర వృద్ధి చెందొచ్చని.. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 14 శాతంగా ఉందని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీకి తోడు, ప్రీమియం గృహ రుణాల్లో ఆధిపత్యం రూపంలో సవాళ్లను బ్యాంకింగేతర గృహ రుణ సంస్థలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనూ ప్రీమియం గృహ రుణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించించినట్టు తెలిపింది. బ్యాంకులు తక్కువ రేటుపై గృహ రుణాలను అందిస్తుండడం ధరల్లో పోటీకి దారితీసినట్టు పేర్కొంది. 9 శాతంలోపు వడ్డీ రేట్లతో కూడిన గృహ రుణాల పోర్ట్ఫోలియో 2025 మార్చి 31 నాటికి 60 శాతానికి చేరుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 45 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ (మిగిలిన గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం)తో కస్టమర్లు వెళ్లిపోతున్న ధోరణి నెలకొన్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభశ్రీ నారాయణన్ తెలిపారు.ప్రభుత్వరంగ బ్యాంకులు అసాధారణ స్థాయిలో అతి తక్కువ రేట్లపై గృహ రుణాలను మంజూరు చేస్తుండడం పట్ల కొన్ని సంస్థలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నిదానించిన వృద్ధి.. పెరుగుతున్న పట్టణీకరణ, ఇళ్ల ధరల కంటే, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, ఆదాయపన్ను, జీఎస్టీ తగ్గింపు వంటి సానుకులతలు ఉన్నప్పటికీ.. గృహ రుణ మార్కెట్లో వృద్ధి నిదానించినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. మొత్తం మీద 2025–26లో మోర్ట్గేజ్ ఏయూఎం వృద్ధి 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2024–25లో 18.5 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.
విదేశీ పెట్టుబడులకు పుష్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లు, విదేశీ సంస్థాగత పెట్టుబడు(ఎఫ్ఐఐ)లను ఆకట్టుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళతర, సమర్థవంత వేగంతోకూడిన విధానాలకు తెరతీయనున్నారు. ఈ బాటలో ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ విధానాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. తద్వారా దేశంలోకి మరింత వేగంగా పటిష్టస్థాయిలో పెట్టుబడులు ప్రవహించేలా గోయల్ చర్యలు చేపట్టనున్నారు. సమావేశానికిముందు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 98వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులనుద్ధేశించి గోయల్ ప్రసంగించారు. దేశంలోకి మరింత వేగంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు గోయల్ తెలియజేశారు. ఉద్యోగ కల్పన, కొత్త టెక్నాలజీలు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు దారి చూపుతాయని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశీ కరెన్సీకి స్థిరత్వాన్ని కలి్పంచవచ్చని తెలియజేశారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. క్యూ1లో 15 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో దేశంలోకి 15 శాతం అధికంగా ఎఫ్డీఐలు ప్రవహించాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఎఫ్డీఐ ఈక్విటీ పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లను అధిగమించగా.. ఎఫ్డీఐలు 80.6 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! పారిశ్రామికంగా సరఫరా వ్యవస్థలు డైవర్సిఫైకావలసి ఉన్నట్లు గోయల్ ప్రస్తావించారు. దీంతో ఒకే ప్రాంతంపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు.
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ
సాక్షి, బిజినెస్ డెస్క్: ఒకదాని తర్వాత మరొకటిగా లైన్ కట్టిన పబ్లిక్ ఇష్యూలతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల (ఐ–బ్యాంకులు) పంట పండుతోంది. ఫీజుల రూపంలో భారీ రాబడులతో అవి పండగ చేసుకుంటున్నాయి. గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 90 పైగా ఇన్ఫిషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి. కంపెనీలు వీటి ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్లు సమీకరించాయి. సాధారణంగా ఇష్యూలకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించే సంస్థలు సుమారు 1 శాతం నుంచి 8 శాతం వరకు ఫీజులు తీసుకుంటాయి. ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులను బట్టి చూస్తే ఐ–బ్యాంకుల ఫీజులు దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ ఏడాది ముగియడానికి మరో నెలన్నర వ్యవధి మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. గతేడాది కూడా ఐపీవోలు వెల్లువెత్తిన నేపథ్యంలో దాదాపు ఇదే స్థాయిలో రూ. 3,500 కోట్ల వరకు ఐ–బ్యాంకులకు ఫీజుల రూపంలో ముట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారీ ఇష్యూల సందడి ఈ ఏడాది వరుసగా భారీ పబ్లిక్ ఇష్యూలు క్యూ కట్టాయి. వీటిలో టాటా క్యాపిటల్, ఎల్జీ ఇండియా, హెక్సావేర్ టెక్, బిలియన్ బ్రెయిన్స్ మొదలైన ఇష్యూలు ఉన్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం టాటా క్యాపిటల్ రూ. 15,512 కోట్లు సమీకరించగా లీడ్ మేనేజర్లకు రూ. 159 కోట్లు ఫీజుల కింద ముట్టాయి. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 12,500 కోట్ల ఇష్యూని నిర్వహించిన సంస్థలు సుమారు రూ. 104 కోట్లు దక్కించుకోగా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తమ రూ. 11,605 కోట్ల ఐపీవోకి రూ. 226 కోట్లు చెల్లించింది. ఇక టెక్నాలజీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ రూ. 8,750 కోట్లు సమీకరించగా ఫీజుల కింద రూ. 215 కోట్లు చెల్లించింది. అటు గ్రో మాతృసంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ రూ. 6,632 కోట్ల ఇష్యూకి గాను మర్చంట బ్యాంకర్లకు రూ. 152 కోట్లు ముట్టజెప్పగా, లెన్స్కార్ట్ రూ. 7,278 కోట్ల ఇష్యూకి రూ. 129 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు చెల్లించింది. ఇలా మొత్తం మీద రూ. 76,210 కోట్లు సమీకరించిన టాప్ 10 సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లకు రూ. 1,315 కోట్లు ముట్టచెప్పాయి. అనుకూల పరిస్థితులు.. దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు ప్రవహిస్తుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్టార్టప్స్లో వాటాలను లాభాలకు అమ్ముకుని వీలైనంత త్వరగా నిష్క్రమించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ తొందరపడుతుండటం లాంటి అంశాలు ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూల వెల్లువకు కారణంగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, జీడీపీ వృద్ధి, సెకండరీ మార్కెట్లు పటిష్టంగా ఉండటం వల్ల కూడా ఐపీవోల్లోకి సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గణనీయంగా వస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఐపీవో బూమ్తో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చిన చాలా మటుకు కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు సాధారణంగా కంటే అధిక ఫీజులే చెల్లించినట్లు తెలిపారు. ఇష్యూ ధరను ఆకర్షణీయంగా నిర్ణయించడం, కచ్చితంగా ఓవర్ సబ్్రస్కయిబ్ కావడం, లిస్టింగ్లో లాభాలు వస్తుండటంలాంటి అంశాల వల్ల నిధుల సమీకరణకు మార్కెట్లు మంచి మార్గంగా మారాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెకండరీ మార్కెట్లో ట్రేడవుతున్న పోటీ సంస్థల ధరలతో పోలిస్తే ఐపీవో రేటు సుమారు 20–30 శాతం వరకు తక్కువగా ఉండటం ఆకర్షణీయాంశంగా ఉంటుంది. దీనివల్ల – సంస్థలకు పెట్టుబడులు, ఇన్వెస్టర్లకు మార్కె ట్లో ఎంట్రీ, బ్యాంకులకు ఫీజులు – ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. దీనితో సానుకూల పరిస్థితులను సొమ్ము చేసుకునే దిశగా ఈ ఏడాది ఆర్థిక సేవలు, టెక్నాలజీ నుంచి కన్జూమర్ రిటైల్ వరకు వివిధ రంగాలకు చెందిన సంస్థలు పెద్ద ఎత్తున ఐపీవోలకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. దీనితో బ్యాంకర్లు కూడా బిజీగా మారారని, ఐపీవోలు చేపట్టేలా మరిన్ని కంపెనీలకు భరోసానిస్తున్నారని వివరించాయి. ఇష్యూ సైజును బట్టి ఫీజులు.. ఐపీవో విజయవంతమయ్యేందుకు చేసే ప్రయత్నాలకు గాను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, మర్చంట్ బ్యాంకులు ఇలా ఫీజులు వసూలు చేస్తుంటాయి. సాధారణంగా ఇష్యూ పరిమాణం, అలాగే బ్యాంకరు రకాన్ని బట్టి ఫీజులు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 10 కోట్ల లోపు చిన్న, మధ్యతరహా సంస్థల (ఎస్ఎంఈలు) ఇష్యూలపై ఇది దాదాపు 8–10 శాతం, కొన్ని సందర్భాల్లో 15 శాతం వరకు ఇది ఉంటోంది. చిన్న ఐపీవోలకు ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుండగా, ఇతరత్రా అండర్రైటింగ్ ఫీజులు, లీగల్, రెగ్యులేటరీ, ఆడిట్, లిస్టింగ్ ఫీజులు మొదలైనవెన్నో ఉంటాయి. పెద్ద కంపెనీలకు సంబంధించి, ఇష్యూ సైజు రూ. 1,000 కోట్ల వరకు ఉంటే ఫీజులు సుమారు 3–35 శాతం శ్రేణిలో ఉంటుంది. డీల్ సైజు రూ. 2,000 కోట్లు, రూ. 5,000 కోట్ల స్థాయిలో పెరిగే కొద్దీ ఫీజు శాతాల రూపంలో తగ్గినా, అంతిమంగా ఎక్కువగానే ఉంటుంది. దశాబ్దకాలం క్రితం చాలా మటుకు పబ్లిక్ ఇష్యూలపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లకు సుమారు 1–2 శాతమే ఫీజులు వచ్చేవి. ఇక భారీ ఇష్యూలకైతే ఇది మరింత తక్కువగా 0.5 – 1 శాతం శ్రేణిలో ఉండేది. ఈ ఏడాది సెకండరీ మార్కెట్ కూడా మెరుగ్గా ఉండటం, ఐపీవోల జోరు కొనసాగుతుండటంతో మధ్య స్థాయి ఇష్యూలపై ఫీజులు 2–2.5 శాతం స్థాయికి, భారీ డీల్స్పై 1.75 శాతం స్థాయికి పెరిగాయి. కొన్ని ఇష్యూలు.. బ్యాంకర్లు.. ఎల్జీ ఇండియాకి మోర్గాన్ స్టాన్లీ, యాక్సిస్, జేపీ మోర్గాన్, బీవోఎఫ్ఏ, సిటీ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి. అటు టాటా క్యాపిటల్కి కోటక్, యాక్సిస్, బీఎన్పీ, సిటీ, హెచ్డీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్, జేపీ మోర్గాన్, ఎస్బీఐ సేవలందించాయి. ఇక బిలియన్ బ్రెయిన్స్కి కోటక్, జేపీ మోర్గాన్, సిటీ, యాక్సిస్, మోతీలాల్ సర్వీ సులు అందించగా.. లెన్స్కార్ట్ సొల్యూషన్కి కోటక్, మోర్గాన్ స్టాన్లీ, ఎవెండస్, సిటీ, యాక్సిస్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి.
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
సాధారణంగా జీతాల విషయాలు ఎవరూ బయటపెట్టడానికి లేదా వెల్లడించడానికి ఇష్టపడరు. కానీ ఎందుకు జీతాలను దాచిపెట్టాలి? అని వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్, రచయిత అయిన 'అంకుర్ వారికూ' (Ankur Warikoo) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.జీతానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల.. మీరు పనిచేసే ప్రదేశంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇది కొందరిలో అభద్రతను పెంచుతుంది. కాబట్టి బయటకు వెల్లడించ వచ్చు. ఇది మీ క్రమశిక్షణను తెలియజేస్తుందని అంకుర్ వారికూ పేర్కొన్నారు.ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి కాదువ్యక్తిగత ఆర్థిక ప్రపంచంలో నాకు గుర్తింపు రావడానికి కూడా క్రమశిక్షణతో ఉండటం, డబ్బును ఎప్పుడూ వ్యక్తిగతంగా పరిగణించకపోవడమే అని అంకుర్ అన్నారు. నేను కేవలం జీతం మాత్రమే కాకుండా.. నా ఆదాయం, పెట్టుబడి, నేను చేసే పొరపాట్లను కూడా బహిరంగంగా చెబుతాను. ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి మాత్రం కాదు. మీరు కొన్ని విషయాలను దాచిపెట్టడం మానేస్తే.. స్పష్టత ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.జీతాల విషయంలో కంపెనీలే పక్షపాతం చూపిస్తాయి. అలాంటప్పుడే చాలామంది తన జీతాల విషయాన్ని రహస్యంగా దాచేస్తారు. ఇలాంటిది నా స్టార్టప్లో జరగదు. అందరి జీతం పబ్లిక్గా ఉంటుందని ఆయన అన్నారు. జీతాల విషయంలో అందరికీ ఒక స్పష్టత ఇస్తామని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!పారదర్శకత పట్ల తన నిబద్ధతను హైలైట్ చేస్తూ.. వారికూ గతంలో తన డ్రైవర్ ఒక నెలలో ఎంత సంపాదిస్తాడో మరియు అతని జీతం ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించారు. మరో ఐదారు సంవత్సరాల్లో.. డ్రైవర్ జీతం నెలకు లక్ష రూపాయలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ ముగించారు.There is a simple reason I found acceptance in the world of personal finance.Because I treated money as something that should never have been “personal” in the first place.So I put my own numbers on the table.My business income.My investments.My performance.My salary.My…— Ankur Warikoo (@warikoo) November 21, 2025
అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన దాదాపు అందరికీ.. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) గురించి తెలిసే ఉంటుంది. ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో దీనిని 2003లో నీతా అంబానీచే స్థాపించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటున్నారు. అయితే ఈ కథనంలో ఇక్కడ ఫీజులు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS).. కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్), CAIE (కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్) వంటి అనేక కార్యక్రమాలలో విద్యను అందిస్తుంది. అంతే కాకుండా ICSE (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కోసం కూడా విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఈ స్కూల్ పిల్లలను బాధ్యతాయుతమైన, చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా నైపుణ్యంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి విలువనిస్తూ.. ప్రోత్సహిస్తోంది.మొత్తం విద్యార్థులు & ఉపాధ్యాయులు11, 12 తరగతులకు, ఈ పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) ద్వారా IB డిప్లొమా ప్రోగ్రామ్ను అందించడానికి అధికారం పొందింది. ఇందులో సుమారు 1,087 మంది విద్యార్థులు, 187 మంది ఉపాధ్యాయులు (వీరిలో 27 మంది ప్రవాసులు) ఉన్నారు.తైమూర్ అలీ ఖాన్, జెహ్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్ మరియు అబ్రామ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్ల పిల్లలు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో చదువుకుంటున్నారు. కాబట్టి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కరీనా కపూర్, సైఫ్ అలీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ పిల్లల పెర్ఫార్మెన్స్ చూసేందుకు తరచుగా పాఠశాల నిర్వహించే వార్షిక కార్యక్రమంలో కనిపిస్తారు.ఫీజుల వివరాలు2023-2024 విద్యా సంవత్సరానికి ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకరిని కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతికి వరకు చదివించడానికి ఫీజులు రూ. 1,400,000 నుంచి రూ. 2,000,000 ఉంటాయని సమాచారం. పాఠశాల ఫీజులలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలు, రవాణా, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు నిర్మాణం గ్రేడ్ స్థాయి ఆధారంగా మారుతుంది. కిండర్ గార్టెన్ నుంచి 7వ తరగతి వరకు ఫీజులు సంవత్సరానికి రూ. 1.70 లక్షలు లేదా నెలకు సగటున రూ. 14వేలు. 8వ తరగతి నుంచి 10వ తరగతులకు సంవత్సరానికి రూ. 5.9 లక్షలు. 11, 12 తరగతులకు ఏటా రూ. 9.65 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఫీజులు కేవలం అంచనా మాత్రమే.
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
దేశీ విమానయాన కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ విమానాల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్సీ ప్రయివేట్ లిమిటెడ్కు 82 కోట్ల డాలర్లు (రూ. 7,270 కోట్లు) అందించనుంది.ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ ఈక్విటీ షేర్లు, నాన్క్యుములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(ఓసీఆర్పీఎస్) జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనుంది. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలియజేసింది. నిధులను ప్రధానంగా విమానాల కొనుగోలుకి వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ప్లేన్స్పాటర్.నెట్ పేర్కొంది.
కార్పొరేట్
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
డార్క్ ప్యాటర్న్స్పై 26 సంస్థల సెల్ఫ్ డిక్లరేషన్
వందలాది ఇంజినీర్ల తొలగింపు: 2026లో మరోమారు!
కలిసొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
సాఫ్ట్వేర్ స్టార్టప్లో వాటా కొన్న మారుతీ
రష్యా చమురుకు రిలయన్స్ గుడ్బై
అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
నిరాశపరిచిన ఫుజియామా పవర్ సిస్టమ్స్
ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా ప...
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతున్నాయి. ఈ ...
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయ...
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమ...
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటాని...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
పుతిన్ ముందు చిందేసిన రోబో
టెక్నాలజీ పెరుగుతోంది.. ఈ తరుణంలో ప్రపంచంలోని చాలాదేశాలు హ్యుమానాయిడ్ రోబోలను తయారు చేసేపనిలో నిమగమయ్యాయి. ఇందులో రష్యా కూడా ఉంది. ఇటీవల స్బెర్బ్యాంక్ బుధవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక రోబో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్యాలోని స్బెర్బ్యాంక్ తన సాంకేతిక పురోగతిని ప్రదర్శించడానికి రూపొందించిన ప్రదర్శనలో.. బుధవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదురుగా ఒక రోబో డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో.. క్రెమ్లిన్ చీఫ్, హ్యూమనాయిడ్ రోబోట్ ఎదురుగా నిలబడి రోబో గురించి వివరించారు.రోబో తనను తాను పరిచయం చేసుకుంటూ.. ''నా పేరు గ్రీన్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన మొదటి రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. నేను కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు. టెక్నాలజీ యొక్క భౌతిక స్వరూపిని. నేను డ్యాన్స్ కూడా చేయగలను, అని వ్లాదిమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది''. దాని డ్యాన్స్ చూసి ఆయన ఎంతో ముగ్దుడయ్యాడు.Vladimir Putin visits AI exhibition and is treated to a dance by a Sberbank robot 'Dear Vladimir Vladimirovich thank you for your attention!'Putin is certainly stunned pic.twitter.com/FOCZFhg6w8— RT (@RT_com) November 19, 2025వేదికపై పడిపోయిన రోబోనవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా 'ఐడల్' (Aidol) అనే రోబోను ఆవిష్కరించారు. ఇది ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చి.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025
జియో కొత్త ఆఫర్.. 18 నెలలు ఉచితం!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త, అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?18 నెలలపాటు ఉచితంజియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్కు సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.ఆఫర్ ఎలా పొందాలంటే.. ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు.
Vreels: టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ను దాటిపోయే కొత్త డిజిటల్ విశ్వం
డిజిటల్ ప్రపంచం ప్రతీ రోజూ మారుతోంది. నేడు మనం వీడియోల కోసం ఒక యాప్, మెసేజింగ్ కోసం మరో యాప్, షాపింగ్ కోసం ఇంకొకటి వాడుతున్నాం.ఈ మధ్యకాలంలో యూజర్లు ఒక ప్రశ్నను తరచూ అడుగుతున్నారు: “ఈ అన్నింటినీ ఒకే వేదికలో పొందలేమా?”ఇదే ప్రశ్న ఒక కొత్త ఆలోచనకు పుట్టుక ఇచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచానికి అందుతున్న – వీరీల్స్ (Vreels) (www.vreels.com).అమెరికాలో ఉండే మన తెలుగువారి ఆలోచన — ప్రపంచానికి కొత్త వేదిక టెక్ ప్రపంచంలో ముందడుగు వేస్తున్న యువతెలుగువారు. అమెరికాలో ఉండి, ప్రపంచం కోసం ఒక అద్భుతమైన యాప్ను రూపొందించారు."సురక్షితం, అందరికీ సులభం, ప్రపంచస్థాయి ఫీచర్లతో" భారతీయ సృజనకు కొత్త రూపం ఇచ్చిన మేధస్సు ఇది. వీరి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది — భారతీయులకు, ముఖ్యంగా క్రియేటర్లకు, యువతకు, ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీ ఇవ్వగల ఒక సరైన వేదికను అందించడం.వీరీల్స్ ఎందుకు ఇతర యాప్లను దాటిపోతోంది?1) వీడియోలు, చాట్, షాపింగ్ — అన్నీ ఒకే యాప్లో.. - మీరు రీల్స్ చేయాలంటే – Vreels - మిత్రులతో చాట్ చేయాలంటే - Vreels - ప్రోడక్ట్స్ కొనాలంటే - Vreels2) టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ కంటే సురక్షితం, స్పష్టత ఎక్కువ AI పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు డేటా సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో, Vreels ప్రతి డేటాను జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి, ఎన్క్రిప్షన్తో రక్షిస్తుంది. ఇక్కడ యూజర్ డేటా అమ్మకం లేదు, లీక్ భయం లేదు. మీరు చూడమంటేనే, మీ డేటా కనిపిస్తుంది.3) Capsules — ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక ఫీచర్ Vreels లోని Capsules మీ జ్ఞాపకాలను భద్రంగా, సమయంతో తాళం వేసి ఉంచుతుంది. మీరు నిర్ణయించిన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే అవి అన్లాక్ అవుతాయి.4) Vreels Shop/Bid — వినోదం దగ్గరే షాపింగ్ యూజర్లు వీడియో చూస్తూ ఉండగానే ప్రోడక్ట్స్ కొనొచ్చు లేదా బిడ్ చేయొచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను నమ్మకంతో విక్రయించొచ్చు.ఇది షాపింగ్ కాదు— భారతీయ డిజిటల్ వ్యాపారానికి ఒక కొత్త దారితీసే ఫీచర్.5) క్రియేటర్ల కోసం ప్రత్యేక అవకాశాలు రిచ్ ఫీచర్లు, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పారదర్శకత — ఇవి అన్ని కలిపి క్రియేటర్లకు TikTok & Instagram కన్నా మెరుగైన వేదికను ఇస్తాయి.22 దేశాల్లో విడుదల… ఇప్పుడు App Store & Play Store లో అందుబాటులోయువ తెలుగువారి ప్రతిభతో పుట్టిన ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store మరియు Apple App Store లో అందుబాటులో ఉంది.ఇది ప్రారంభం మాత్రమే — ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు రానున్నాయి.Vreels — మీ డిజిటల్ ప్రయాణానికి కొత్త స్వరూపం మీరు క్రియేటర్ అయినా, షాపింగ్ ప్రేమికుడైనా, లేదా కొత్త ఫీచర్లు ప్రయత్నించే టెక్-ఎన్తుజియాస్ట్ అయినా — Vreels మీ కోసం. మీ అనుభవం కోసం. మీ భవిష్యత్తు కోసం.ఇప్పుడే ప్రయత్నించండి Vreels — భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి:
యాపిల్కేర్ ప్లస్ ప్లాన్లో కొత్త ఫీచర్లు
ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ యాపిల్కేర్ ప్లస్ ప్లాన్ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్ని అపరిమిత స్థాయిలో రిపేర్ చేయించుకునేందుకు ప్రొటెక్షన్ ప్లాన్ కింద కవరేజీ ఉంటోంది.యాపిల్కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్ కొనుక్కున్నప్పుడే ప్లాన్ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లుఐఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.డివైజ్ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చుగమనించాల్సిన అంశాలుథెఫ్ట్ & లాస్ కవరేజీ కేవలం ఐఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది. (యాపిల్ సాధారణంగా రీప్లేస్మెంట్ ఫీజు వసూలు చేస్తుంది).ప్లాన్ ధర డివైజ్ మోడల్ ఆధారంగా మారుతుంది.
పర్సనల్ ఫైనాన్స్
నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా
సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.11-12-20 ఫార్ములాఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్తో రూ. కోటి పొందవచ్చు.20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.కో-పేమెంట్ నిబంధనచాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.వెయిటింగ్ పీరియడ్స్బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.రూమ్ రెంట్ క్యాపింగ్చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.క్లెయిమ్ తిరస్కరణదరఖాస్తు ఫామ్లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.సబ్ లిమిట్స్కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.కవర్ కాని అంశాలుసౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.పాలసీదారులు ఏం చేయాలి?బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి.నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025


