Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

staircase of SBI branch demolished during an anti encroachment drive1
నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల తొలగింపు (ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్) సందర్భంగా బ్యాంకు మొదటి అంతస్తు కార్యాలయానికి ఉన్న మెట్లను కూల్చివేశారు. దాంతో కస్టమర్లు, సిబ్బంది బ్యాంకు సర్వీసులు పొందడానికి తాత్కాలికంగా ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చిన నిచ్చెన ద్వారానే బ్యాంకులోకి ప్రవేశించాల్సిన పరిస్థితి నెలకొంది.మెట్లు కూల్చివేతభద్రక్ రైల్వే స్టేషన్ నుంచి చరంపా మార్కెట్ వరకు నవంబర్ 20, 21 తేదీల్లో పెద్ద ఎత్తున క్లియరెన్స్ ఆపరేషన్ జరిగింది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎస్‌బీఐ భవనం ముందు భాగం మెట్లతో సహా అనేక దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయడానికి ముందుగా బహిరంగ ప్రకటనలు చేసి ఆక్రమణదారులకు రెండు రోజుల సమయం ఇచ్చామని అధికారులు చెప్పారు. చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు.SBI, Bhadrak (Odisha).Anti-encroachment drive demolished the bank branch's staircase.Customers are measuring ladder which is placed over tractor-trolley to access the bank.Several questions to ask. But .. leave it! India is not for beginners 😒 pic.twitter.com/tvAgpMZCyi— The Hawk Eye (@thehawkeyex) November 25, 2025అయితే బ్యాంకు భవన యజమానికి అక్రమ నిర్మాణాలపై అనేక నోటీసులు వచ్చినా ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచారం. సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేత ప్రక్రియ జరిగింది.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

Cabinet approved Rs 7280 cr scheme promote manufacturing rare earth magnets2
భారత్‌లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు

భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కీలక రంగాల్లో వీటి ఉపయోగంఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)ఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్వైద్య పరికరాలురక్షణ రంగంలబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.పథకం కాలపరిమితిఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

CITES CoP20 in Samarkand formally endorsed Vantara initiative3
ఐరాస సంస్థ ‘సైట్స్‌’ మెచ్చిన వంతారా

జంతు సంరక్షణలో ఇండియాలోని రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఉన్న వంతారా వండి సంస్థలు చూపుతున్న నిబద్ధతను ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపి 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతోంది. సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు జంతువులను సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.వంతారా అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం. భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Meta reportedly advanced talks to buy Google Tensor AI chips4
ఎన్వీడియాకు గూగుల్‌ గట్టి దెబ్బ

మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్‌ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్‌ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.గూగుల్‌ టెన్సర్‌ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్‌ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్‌వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్‌ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Key Reasons Behind the Delay Income tax Refunds CBDT Chairman comments5
ట్యాక్స్‌ రీఫండ్‌.. ఆలస్యానికి కారణం ఇదే..

ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్‌ల జారీలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులు (Incorrect Deductions) లేదా అధిక విలువ గల క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నందున రీఫండ్‌ల ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఐటీఆర్ (ITR) దాఖలు గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఛైర్మన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో పన్ను చెల్లింపుదారుల లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు.‘తక్కువ విలువ కలిగిన రీఫండ్లను ఇప్పటికే విడుదల చేస్తున్నాం. మిగిలిన రీఫండ్‌లను ఈ నెలలో లేదా డిసెంబర్ నాటికి విడుదల చేస్తాం. పన్ను శాఖ కొన్ని తప్పుడు తగ్గింపులు, అధిక విలువ గల రీఫండ్‌ క్లెయిమ్‌లను గుర్తించింది. వాటిని ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లెయిమ్‌లను సిస్టమ్ ద్వారా రెడ్-ఫ్లాగ్ చేశాం. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులపై విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఇది రీఫండ్‌ల జారీలో జాప్యానికి కారణం అవుతుంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు.మరోవైపు, ఏదైనా తగ్గింపులను మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేయాలని కోరుతూ వారికి లేఖలు రాసినట్లు కూడా ఆయన వెల్లడించారు. టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) రేట్లు హేతుబద్ధీకరించబడటం వల్ల రీఫండ్ క్లెయిమ్‌ల్లో కూడా తేడాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య రీఫండ్‌లు రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి.వ్యాజ్యాల తగ్గింపుపై దృష్టిప్రత్యక్ష పన్ను కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను తగ్గించడానికి డిపార్ట్‌మెంట్, బోర్డు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అప్పీలేట్ అధికారులు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతానికి పైగా అప్పీళ్లు పరిష్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాపై తగ్గని మోజు!

US Hit Record in International Students And India Is Behind the Surge6
అమెరికాపై తగ్గని మోజు!

అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్‌ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్‌పుర్‌.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్‌ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్‌ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్‌లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్‌.. వివరాలివే..

Advertisement
Advertisement
Advertisement