Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Government Calls on Corporates to Boost Investments in Food Processing1
ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేయండి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్‌ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్‌ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్‌ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్‌ కోడ్‌లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు.

Will Gold Prices Rise Further Sakshi questions and answers2
పసిడి ధర మరింత పెరుగుతుందా?

బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్‌ క్లాస్‌కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి? – దీపక్‌పెట్టుబడిలో తక్కువ రిస్క్‌ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్‌ విషయంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ లేదా టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ లేదా లో కాస్ట్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్‌ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

SEBI issues guidelines for single window transactions in domestic stock market3
లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్‌ విండో

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్‌ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్‌ విండో ఆటోమేటిక్‌ అండ్‌ జనరలైజ్‌డ్‌ యాక్సెస్‌ ఫర్‌ ట్రస్ట్‌డ్‌ ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌(స్వాగత్‌–ఎఫ్‌ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది. లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్, మలీ్టలేటరల్‌ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్‌ రిటైల్‌ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), విదేశీ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్‌–ఎఫ్‌ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్‌1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్‌లో ఆమోదముద్ర వేసింది.

US Fed decision, FIIs Trading Activity To Drive Stock Markets4
ఫెడ్‌పై మార్కెట్‌ దృష్టి 

ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్‌ పావెల్‌ అధ్యక్షతన ఫెడరల్‌ ఒపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్‌ ఫండ్స్‌(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్‌ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్‌ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్‌లో వాణిజ్య లోటు 59.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో చైనా 90 బిలియన్‌ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్‌బీఐ ఎఫెక్ట్‌ దేశీయంగా ఆర్‌బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్‌బీఐ 5 బిలియన్‌ డాలర్ల రుపీ డాలర్‌ స్వాప్‌నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యలు జీఎస్‌టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్‌ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్‌ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్‌ ధరలు.. నవంబర్‌ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్‌ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్‌ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్‌ దేశీ స్టాక్స్‌లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించిన ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్‌లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్‌లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్‌గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్‌ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Features and Benefits of Corporate Bond Funds5
మీరూ కావచ్చు... మిస్టర్‌ బాండ్‌!

రెండ్రోజుల కిందటే ఆర్‌బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి? చాలామంది స్టాక్‌ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్‌ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరాలకు అనుగుణంగా..కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్‌ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్‌ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్‌ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బాండ్‌ ఫండ్స్‌.. ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్‌ రేటింగ్‌ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. నిప్పన్‌ ఇండియా కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, కోటక్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్, యాక్సిస్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి. ఇదీ.. బాండ్‌ పరిభాష.. కూపన్‌ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ ఈల్డ్‌: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి క్రెడిట్‌ రేటింగ్‌: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం లిక్విడిటీ: బాండ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు కొన్ని రిస్క్ లుంటాయి .. అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్, క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్‌ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్‌ రేటింగ్‌ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్‌ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడ కొనొచ్చు.. జిరోధా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, ఏంజెల్‌ వన్, అప్‌స్టాక్స్‌ ెలాంటి బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్‌ బజార్, గ్రిప్‌ ఇన్వెస్ట్‌లాంటి సెబీ రిజిస్టర్డ్‌ ప్లాట్‌ఫాంల ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్‌ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్‌ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్‌ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్‌ అవుతాయి. ఎంచుకోవడం ఇలా.. తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్‌ లాంటి రేటింగ్‌ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్‌ ఎ, బి ప్లస్‌ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్‌ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్‌ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్‌ ఏ నుంచి ట్రిపుల్‌ బి మైనస్‌ వరకు రేటింగ్‌ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్‌ బీ ప్లస్‌ నుంచి బీ మైనస్‌ వరకు రేటింగ్‌ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.ఎవరికి అనువైనవంటే.. → మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే → బ్యాంక్‌ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే → ఎఫ్‌డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్‌ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా → పిల్లల చదువుల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్‌డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికిరేటింగ్‌ బట్టి రాబడి.. AAA: తక్కువ రిస్కు : 7–8 శాతం AA: మధ్య స్థాయి రిస్కు : 8–9.5 శాతం A: అధిక రిస్కు : 10–12 శాతం

Zomato CEO Deepinder Goyal Tweet About Temple6
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్

జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్‌లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025

Advertisement
Advertisement
Advertisement