ప్రధాన వార్తలు
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటానికి ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ (TIA) పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండే వాణిజ్య డేటాతో వ్యాపారం మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పారు. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) కోసం ఈ పోర్టల్ సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.చిన్న వ్యాపారాలకు అవకాశంపెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉన్న డేటాను చిన్న వ్యాపారాలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారికి యాక్సెస్ కల్పించడమే టీఐఏ పోర్టల్ ముఖ్య లక్ష్యం అన్నారు. భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTA) మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఎగుమతిదారులకు ఈ వేదిక సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ సుంకాల పరిస్థితిని వేకప్కాల్గా అభివర్ణించిన గోయల్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగం వనరులను సమీకరించాలని పిలుపునిచ్చారు.వాటాదారుల డిమాండ్లకు హామీఈ సందర్భంగా వాటాదారులు తమ డిమాండ్లను తెలియజేయాలని తెలిపారు. వాటిని పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. వాటాదారులు తీసుకొచ్చిన సమస్యలు వాణిజ్య విభాగానికి సంబంధించినవి అయితే త్వరగా పరిష్కరించబడుతాయన్నారు. ఇతర విభాగాలకు సంబంధించినవి అయితే వాణిజ్య శాఖ చురుకుగా సమన్వయం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ ఫ్రేమ్వర్క్ అవసరాన్ని గుర్తించిన వాణిజ్య శాఖ మార్చి 2024లో TIA పోర్టల్ అభివృద్ధిని ప్రారంభించింది. ఈ పోర్టల్ 28 డ్యాష్బోర్డ్ల్లో 270 కంటే ఎక్కువ ఇంటరాక్టివ్ విజువలైజేషన్లను అందిస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మానిటరింగ్ డ్యాష్బోర్డ్, నిర్యాత్ పోర్టల్, ట్రేడ్స్టాట్ పోర్టల్ వంటి పాత వాణిజ్య సమాచార పోర్టల్ల స్థానంలో దశలవారీగా అప్డేట్ అవుతుంది.ఇదీ చదవండి: డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు అమలులోకి రానుండటంతో భారతదేశం చమురు దిగుమతులను పెంచుకోవడానికి మిడిల్ఈస్ట్ దేశాలపై మొగ్గు చూపుతోంది. దాంతో మధ్యప్రాచ్యం(మిడిల్ఈస్ట్) నుంచి భారత్కు సరుకులు తీసుకురావడానికి చమురు ట్యాంకర్ల(క్రూడాయిల్ సరఫరా చేసే షిప్లు) బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి.పెరిగిన డిమాండ్షిప్ బ్రోకర్ నివేదికల ప్రకారం ఈ వారం ఇప్పటివరకు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి ముడి చమురును రవాణా చేయడానికి సుమారు డజను ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ట్యాంకర్లు అరేబియా సముద్రం మీదుగా రవాణా కానున్నాయి. ఇది గత నెలలో ఇదే నమోదైన కేవలం నాలుగు బుకింగ్లతో పోలిస్తే పెరిగింది.ఈ బుకింగ్ల్లో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ) అని పిలువబడే సూపర్ ట్యాంకర్లతో పాటు చిన్న సూయజ్మ్యాక్స్ నౌకలు కూడా ఉన్నాయి. భారతీయ దిగుమతిదారులు ఇంకా అదే మార్గాల్లో మరిన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.నవంబర్ 21 నుంచి ఆంక్షలునవంబర్ 21న రోస్నెఫ్ట్ పీజేఎస్సీ(Rosneft PJSC), లుకోయిల్ పీజేఎస్సీ(Lukoil PJSC)పై ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో భారత చమురు వ్యాపారులు రష్యాయేతర ముడి చమురు కొనుగోళ్లవైపు మళ్లుతున్నారు. భారతదేశంలోని రిఫైనరీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో సహా ఐదు ప్రధాన రిఫైనరీలు ఈ వారం తర్వాత రష్యన్ ముడి చమురు డెలివరీ చేసుకోబోమని ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన కంపెనీలు మాత్రం ఆంక్షలు లేని రష్యా చమురు విక్రేతల నుంచి కొనుగోళ్లు కొనసాగించవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
సముద్ర గర్భంలో కేబుళ్ల ద్వారా నిమిషాల వ్యవధిలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ప్రపంచం నలుమూలలా చేరవేసే శక్తిమంతమైన కేంద్రాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. అవే డేటా సెంటర్లు. డేటా సెంటర్లు డిజిటల్ స్టోరేజ్ కోసం ప్రాసెసింగ్ హౌస్లుగా పని చేస్తాయి. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పనికి (ఉదాహరణకు, గూగుల్లో శోధించడం, యూట్యూబ్ వీడియో చూడటం, జీమెయిల్ పంపడం, ఫొటోను క్లౌడ్లో సేవ్ చేయడం లేదా ఆన్లైన్ గేమ్ ఆడటం) మూల కారణం డేటా సెంటర్లే. ఈ విభాగంలో టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని భారత్పై కేంద్రీకరించాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇదొకవైపు డిజిటల్ ఇండియాకు శుభపరిణామం అయినప్పటికీ, మరోవైపు దేశ ఇంధన భవిష్యత్తుకు పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే వాదనలున్నాయి.భారత్ ఎందుకు?భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్గా ఉంది. కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు, పెరుగుతున్న 5జీ విస్తరణ, యూపీఐ లావాదేవీలు, ఓటీటీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డేటా డిమాండ్ను తీర్చాలంటే వినియోగదారులకు తక్కువ లేటెన్సీ అంటే వేగవంతమైన సేవలు కల్పించాలంటే డేటా సర్వర్లు భౌగోళికంగా వారికి చేరువలో ఉండాలి.భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం దేశానికి సంబంధించిన సున్నిత డేటాను దేశ సరిహద్దుల్లోనే నిల్వ చేయాలని అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీలకు దేశంలోనే డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధపడేలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సులభతరమైన అనుమతులు కల్పిస్తున్నాయి. భారత్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత ఇందుకు సానుకూల అంశంగా ఉంది.డేటా సెంటర్లకు ఎంత విద్యుత్ కావాలంటే..డేటా సెంటర్లకు తరచుగా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి కారణం వాటిలో నిరంతరం 24/7 పనిచేసే వేలాది సర్వర్లు (కంప్యూటర్లు) ఉంటాయి. డేటాను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం వంటి నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి సర్వర్కు గణనీయమైన విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో సర్వర్లన్నీ అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వేడి పెరిగితే సర్వర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, సర్వర్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి భారీ స్థాయిలో కూలింగ్ వ్యవస్థలు పనిచేయాలి. నివేదికల ప్రకారం, ఒక డేటా సెంటర్లోని మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వరకు కేవలం కూలింగ్ కోసమే ఖర్చు అవుతుంది.ఉష్ణోగ్రత నియంత్రణ ఎలా?సర్వర్లలో ఉత్పత్తి అయ్యే అధిక వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ రూమ్ ఎయిర్ కండిషనింగ్/హ్యాండ్లర్ యూనిట్లను ఉపయోగించి సర్వర్ల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తారు. ఇది అత్యంత సాధారణ పద్ధతి.నీటిని ఆవిరి చేసి దాని ద్వారా ఉత్పత్తయ్యే చల్లదనాన్ని ఉపయోగించి వేడి గాలిని చల్లబరచడం ఇంకోపద్ధతి. వేడి వాతావరణం ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మెరుగైన మార్గం అవుతుంది.లిక్విడ్ కూలింగ్ అనేది ఆధునిక పద్ధతి. సర్వర్ చిప్లకు నేరుగా ప్రత్యేకమైన ద్రవాలను పంపడం ద్వారా వేడిని తొలగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చాలా కంపెనీలు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడి నీటిని సమీపంలోని పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారు.ఇంధన సవాళ్లు..భారతదేశం 2070 నాటికి ‘నికర-శూన్య కర్బన ఉద్గారాల (Net-Zero Emissions)’ లక్ష్యాన్ని సాధించాలని, 2030 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% పునరుత్పాదక వనరుల నుంచి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో ప్రస్తుతం అధిక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం థర్మల్ విద్యుత్ (బొగ్గు). డేటా సెంటర్ల కోసం విపరీతంగా పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ థర్మల్ విద్యుత్పై ఆధారపడాల్సి వస్తే అది మన పునరుత్పాదక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.భారత్ ఎంచుకోవాల్సిన పంథా..ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక సమగ్రమైన, పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరించాలి. భారత ప్రభుత్వం ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. డేటా సెంటర్ ఆపరేటర్లు తమకు అవసరమైన విద్యుత్లో కనీసం 60% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందాలని (ఉదాహరణకు, సోలార్ లేదా విండ్ పవర్ ప్లాంట్లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) తప్పనిసరి చేయాలి. విద్యుత్ వినియోగ సమర్థత (Power Usage Effectiveness) వంటి పారామితుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.లిక్విడ్ కూలింగ్, నేచురల్ ఎయిర్ కూలింగ్ (చల్లని ప్రాంతాల్లో) వంటి అత్యంత సమర్థవంతమైన కూలింగ్ సాంకేతికతలను ఉపయోగించే డేటా సెంటర్లకు అధిక రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ను వృథా చేసే వ్యవస్థలకు బదులుగా ఆధునిక, పర్యావరణ అనుకూల యంత్రాలను ఉపయోగిస్తే కొన్ని రాయితీలు పరిశీలించవచ్చు. సౌర, పవన విద్యుత్ నిరంతరంగా లభించదు. కాబట్టి, ఈ విద్యుత్ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలి. ఇది డేటా సెంటర్లకు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
400 రోజుల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు
కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యూటిలిటీ వెహికల్ (CUV) ఎంజీ విండ్సర్ అమ్మకాలు కీలక మైలురాయి చేరుకున్నట్లు ప్రకటించింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. గణాంకాల ప్రకారం ప్రతి గంటకు సగటున 5 యూనిట్ల ఎంజీ విండ్సర్ కార్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇది కంపెనీకి చారిత్రక విజయాన్ని సూచించడమే కాకుండా, భారతదేశంలో ఈవీ విభాగంలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి ఈవీగా విండ్సర్ నిలిచిందని కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ..‘విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు వినియోగదారులకు స్టైలిష్, విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విండ్సర్ ఈవీ వేగంగా విజయం సాధించింది. రికార్డు సమయంలో 50,000 అమ్మకాలను చేరింది. ఈ విజయం న్యూ ఎనర్జీ వాహనాల పట్ల కంపెనీ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి శక్తినిస్తుంది’ అన్నారు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తయారు చేసిన పరిమిత ఎడిషన్ సిరీస్ ఎంజీ విండ్సర్ ఇన్స్పైర్ను ఇటీవల భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.ఎంజీ విండ్సర్ ఫీచర్లుఈ కారు 100 KW శక్తిని 200 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. దీని ప్రారంభ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏరోగ్లైడ్ డిజైన్తో పాటు 135 డిగ్రీల వరకు వాలే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
చాట్జీపీటీ డౌన్ అయితే పరిస్థితేంటి?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్ఫామ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్జీపీటీ(క్లాడ్ఫ్లెయిర్ ఇన్ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్తో రూపొందించారు. గూగుల్ సెర్చ్కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్డేటెడ్, రియల్టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి గూగుల్ ఎకోసిస్టమ్తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్జీపీటీలాగే అదే జనరేటివ్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ప్రముఖ కంటెంట్ క్రియేటర్లలో ఒకరైన అంకుర్ వారికూ తన డ్రైవర్ వేతనం, కుటుంబంలో అతనికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకూ నెటిజన్లు దృష్టిని ఆకర్షించేలా ఆయన చేసిన పోస్ట్ ఏమిటో చూద్దాం.అంకుర్ వారికూ చేసిన పోస్ట్లోని వివరాలు..‘దయానంద్ భయ్యా(డ్రైవర్) తాజా వార్షిక ఇంక్రిమెంట్తో అతని నెలవారీ వేతనం రూ.53,350కు చేరింది. దీనికి ఇన్సూరెన్స్, ఒక నెల దీపావళి బోనస్, తాజాగా ఇచ్చిన స్కూటీ అదనం. అతను 13 సంవత్సరాల క్రితం రూ.15,000 నెలవారీ వేతనంతో ఈ ఉద్యోగంలో చేరారు. తాను కేవలం డ్రైవర్ మాత్రేమే కాదు. మా కుటుంబంలో ఒకరు. నమ్మకమైన వ్యక్తి. అతని వద్ద ఇంటి తాళాలు ఉంటాయి. మా ఏటీఎం పిన్ నంబర్లు కూడా తనకు తెలుసు. అతను అత్యంత సమయపాలన, క్రమశిక్షణ గల వ్యక్తి. రోజూ ఉదయం 4:30 గంటలకు మేల్కొని, రాత్రి 8:30 గంటలకు నిద్రపోతారు. దయానంద్ భయ్యా ముగ్గురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సంతోషంగా వివాహం చేసుకున్నారు. రాబోయే 5-6 సంవత్సరాల్లో అతని జీతం నెలకు రూ.1 లక్షకు చేరుకోవాలని ఆశిస్తున్నాను’ అని వారికూ అన్నారు.2024లో రూ.16.84 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన గుర్గావ్కు చెందిన వారికూ చేసిన పోస్ట్పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. సూరజ్ బాలకృష్ణన్ అనే ఒక యూజర్ ‘ఉద్యోగులతో ఇలా సరైన మార్గంలో వ్యవహరించాలి. నిన్ను చూసి గర్వంగా ఉంది అంకుర్’ అని రాశారు. మరొకరు, ‘రోజువారీ సహాయం చేసే వారిని విస్మరించే ఈరోజుల్లో నిజంగా గౌరవంతో చూస్తున్నారు. మీరు మీ డ్రైవర్పట్ల చాలా విధేయతతో ఉన్నారు. ఉద్యోగుల నమ్మకం, కృషిని గుర్తించడం చాలా సంతోషం’ అని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: బ్యాటరీలతోనే బ్యాటరీలు తయారీ!
కార్పొరేట్
డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!
పసిడి రూ. 3,900 డౌన్
ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లో రాజీనామా!
సోషల్ మీడియా ద్వారా వ్యాపారావకాశాలు
996 ఫార్ములా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై ఆగ్రహం!
ఇంటికీ కావాలి ఆపరేటింగ్ ఆపీసర్..
ఏఐ రేసులోకి జెఫ్ బెజోస్ ఎంట్రీ
మురుగప్ప గ్రూప్ మాజీ సారథి కన్నుమూత
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ ర...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట...
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్...
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్నెఫ్ట్, ...
5.2% వద్దే నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.2 శాతం వద...
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఏఐ వల్ల వైట్కాలర్ (సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.అమెరికాలో ఉద్యోగాల కొరతమహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్కాస్ట్లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.We’re so busy fearing AI will wipe out white-collar jobs that we’re missing a far bigger crisis: the scarcity of skilled trades.Ford CEO @jimfarley98 made a startling revelation in a recent podcast: Ford has 5,000 mechanic jobs unfilled, many paying $120,000 a year, and still…— anand mahindra (@anandmahindra) November 17, 2025భారీ ఆర్థిక నష్టంఈ సంక్షోభం ఫోర్డ్కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
రూ.251 రీఛార్జ్ ప్లాన్: 100జీబీ హైస్పీడ్ డేటా
ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.దేశంలో 4జీ మొబైల్ నెట్వర్క్ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్వర్క్ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.Study, Stream, Succeed with #BSNL !Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu— BSNL India (@BSNLCorporate) November 15, 2025
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్ప్లాన్ను ప్రవేశపెట్టింది.మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.ప్లాన్ ప్రయోజనాలుజియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది.
ట్రాన్స్లేటర్ పెన్.. జేబులోనే థియేటర్!
ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!జేబులోనే థియేటర్!సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!ఖుషీ ఖుషీగా.. కుషన్! లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే!
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు.
ఈ వారం బ్యాంకు సెలవులు ఎన్ని?
బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పలు సేవల కోసం వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారం ప్రారంభం కాగానే బ్యాంకు శాఖలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. సెలవులేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు.సాధారణ వారపు సెలవుల్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ వారం నవంబర్ 22న శనివారం, నవంబర్ 23న ఆదివారం రెండు రోజులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ షెడ్యూల్ సెలవులు కాకుండా, వారంలోని అన్ని ఇతర రోజులలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.సాధారణంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా పాటిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 22న నెలలో నాల్గవ శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజన సెలవు ఉంటుంది.బ్యాంకులు ఎప్పుడు మూసిఉంటాయి?ఆర్బీఐ సెలవుదినాలు మినహా ఆదివారాలు, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.నవంబర్ నెలలో ఇప్పటివరకు, ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మొత్తం ఆరు రోజుల పాటు మూసి ఉన్నాయి.ఈ నెలలో సెలవులు ఏమైనా మిగిలి ఉన్నాయా?ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అన్ని బ్యాంకు శాఖలు మూసిఉంచే ఆదివారాలు మినహా నవంబర్ నెలలో మిగిలిన రోజుల్లో అదనపు బ్యాంకు సెలవులు లేవు. జాబితా చేసిన బ్యాంక్ తదుపరి సెలవుదినం డిసెంబరులో మాత్రమే ఉంటుంది.దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల సందర్భంగా సెలవులను నిర్ణయిస్తారు.
వెల్త్ కంపెనీ నుంచి కొత్త ఫండ్
వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో మెరుగైన రాబడులు అందించేలా హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ను ది వెల్త్ కంపెనీ ఏఎంసీ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఇది ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో (వెండి, పసిడి) ఇన్వెస్ట్ చేస్తుంది.అనిశ్చితి నెలకొన్నప్పుడు, ద్రవ్యోల్బణం నుంచి హెడ్జింగ్ కోసం 50 శాతం వరకు కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంపరంగా హైబ్రిడ్ ట్యాక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చేస్తేనే ఎక్కువ ప్రయోజనం
ఇప్పుడిప్పుడే కెరియర్లో పురోగమిస్తూ, కుటుంబాలను ఏర్పర్చుకునే దశలో ఉన్న యువతకు సాధికారత కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తోడ్పడుతుందని ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) ఎండీ కమలేష్ రావు తెలిపారు. వాస్తవానికి 26–35 ఏళ్ల వయస్సు గ్రూప్లోని వారు దీర్ఘకాలికంగా ఆర్థిక భరోసాను కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కొంత వెనుకబడుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.ఈ సర్వే ప్రకారం 2025 మార్చి ఆఖరు నాటికి ప్రతి నలుగురు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లలో ఈ వయస్సు గ్రూప్లోని వారు ఒకరే ఉంటున్నారని (మొత్తం పాలసీదారుల్లో 25.24 శాతం) వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇది చెప్పుకోతగిన స్థాయే అయినప్పటికీ 36–45 ఏళ్ల గ్రూప్ వారి వాటా అత్యధికంగా 41.68 శాతంగా, 46–55 ఏళ్ల గ్రూప్ వారి వాటా 23.96 శాతంగా ఉందని తెలిపారు.ఈఎంఐలు, ఇతరత్రా ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మొదలైన వాటి కారణంగా అప్పుడప్పుడే కాస్త అధికంగా ఆర్జించడం మొదలుపెట్టిన వారు కీలకమైన కవరేజీని పెద్దగా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా బీమాకు సంబంధించి చిన్న వయస్సులో ప్రీమియంలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అదే వయస్సు పెరిగి అదే నలభైలు, యాభైల్లోకి వచ్చినప్పుడు ప్రీమియంలు పెరిగిపోతాయి.ఈ విషయాలను యువతకు సమర్ధవంతంగా తెలియజేయడంతో పాటు బీమా కేవలం రక్షణ కవచంగానే కాకుండా ఆకాంక్షలను నెరవేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని బీమా సంస్థలు సైతం వివరించాల్సి ఉంటుందని కమలేష్ రావు చెప్పారు. ఇందుకోసం వెల్నెస్ బెనిఫిట్స్, పొదుపునకు ఉపయోగపడే రైడర్లు, జీవితంలోని దశలను బట్టి కాలవ్యవధులను మార్చుకునే ఆప్షన్లు మొదలైనవి ఆఫర్ చేయాల్సి ఉంటుందన్నారు.


