Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mahindra BE 6 Batman Edition Sold Out in 7 Minutes1
ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కోసం మరోమారు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం 7 నిమిషాల్లో అన్ని కార్లు అమ్ముడైపోయాయి. డెలివరీలు ఏప్రిల్ 10 మొదలవుతాయి.మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో 999 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అన్ని కార్లు 7 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. అంటే మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర రూ. 28.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధర లాంచ్ చేసిన సమయంలో ప్రకటించిన ధర కంటే రూ. 70వేలు ఎక్కువ. ధర పెంచినప్పటికీ.. డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.Thank you for the overwhelming response. pic.twitter.com/tktaayeRgt— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) March 10, 2026

IndiGo CEO Pieter Elbers Resigns2
ఇండిగో సీఈఓ రాజీనామా

భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్.. తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటీసు పీరియడ్‌ను మినహాయించాలని అభ్యర్థించారు. ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా వెల్లడించబడింది.ఇండిగో తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు స్వీకరిస్తూ.. సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.2025 డిసెంబరులో కొత్త నియమాలను అమలు చేయడంలో ఎదురైన సమస్యల వల్ల భారీ ఆపరేషనల్ సంక్షోభం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు 2,500 పైగా విమానాలు రద్దు కావడం, 1,900 పైగా విమానాలు ఆలస్యం కావడం వల్ల 3 లక్షలకి పైగా ప్రయాణికులు ప్రభావితులు అయ్యారు. DGCA ఈ ఘటనపై రూ. 22.20 కోట్ల రికార్డు జరిమానా విధించింది. అంతే కాకుండా ఎల్బర్స్‌కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.

iPhone on EMI Can You Really Afford It3
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!

ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్‌ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్‌ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

Oil Price Surge May Add 8 Billion Dollars to India Monthly Bill4
జీడీపీకి చిల్లు.. నెలకు 8 బిలియన్‌ డాలర్లు!

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదలతో ఇంధనాల కొనుగోలు కోసం భారత్‌ ప్రతి నెలా 7–8 బిలియన్‌ డాలర్ల మేర అదనంగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి రానుందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ముందు 66 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 120 బిలియన్‌ డాలర్లకు ఎగిసిందని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రేట్లు దాదాపు రెట్టింపై యూనిట్‌కి (ఎంబీటీయూ) 24–25 డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. ఇలా ఇంధనాల రేట్లు ఎగియడం వల్ల రవాణా, తయారీ, ఆహారోత్పత్తులు, కమోడిటీల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేఠి చెప్పారు.భారీ రేట్లు కొనసాగే వ్యవధి, డిమాండ్, పాలసీపరమైన చర్యలను బట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక క్రూడ్‌ రేటు సగటున 10 డాలర్లు పెరిగితే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్‌) 30–40 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ చెప్పారు. ముడిచమురు ధర సగటున 100–105 డాలర్లుగా ఉంటే జీడీపీలో క్యాడ్‌ 1.9–2.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.క్రూడాయిల్‌ ధరలు 10 శాతం పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 80–100 బేసిస్‌ పాయింట్లు, వినియోగదారుల ద్రవ్యోల్బణం 40–60 బేసిస్‌ పాయింట్లు పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. దేశీయ అవసరాలకు సంబంధించి భారత్‌ 85 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటుండగా, ప్రతి రోజూ 50 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ వినియోగం ఉంటోంది.ఐఈఏకి ఇండియా నో..ఆయిల్‌ ధరలకి కళ్లెం వేసేందుకు వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసేలా ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) చేపట్టిన కార్యక్రమంలో భారత్‌ భాగం కాబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షోభాన్ని సృష్టించిన వారిపైనే, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉందనేది ప్రభుత్వ అభిప్రాయమని పేర్కొన్నాయి.దేశీయంగా 5.33 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ని నిల్వ చేశారు. సరఫరాపరమైన సవాళ్లు తలెత్తితే, వాటిని ముందుగా దేశీయంగా ప్రజల అవసరాల కోసమే వినియోగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 2021లో అమెరికా సారథ్యంలో ఇలాంటి కార్యక్రమమే చేపట్టినప్పుడు భారత్‌ 5 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ను విడుదల చేసింది.

Robert Kiyosaki Warns of Massive 2026 Market Crash Urges Investors to Buy Gold, Silver and Bitcoin5
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు.

Stock Market Closing Update 10th March 20266
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్

మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్‌కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement