Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India will remain fastest-growing major economy in 2026 and 20271
భారత్‌ వృద్ధి వేగవంతం 

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్‌లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు.. ఇరాన్‌ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్‌ పేర్కొన్నారు.

Mid-Level Talent And Salary Hike Trends2
కార్పొరేట్‌ మిడ్‌ లెవెల్‌ మంత్ర

న్యూఢిల్లీ: అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కార్పొరేట్‌ కంపెనీలు నియామకాల విషయంలో విభిన్న పంథాలో వెళ్తున్నాయి. ప్రధానంగా మధ్య స్థాయి నిపుణులను రిక్రూట్‌ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్టాఫింగ్‌ సర్వీసెస్, హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థ జీనియస్‌ హెచ్‌ఆర్‌టెక్‌ నివేదిలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 49 శాతం కంపెనీలు తాము మిడ్‌ లెవెల్‌ ప్రొఫెషనల్స్‌ని హైర్‌ చేసుకోవడంపై ఫోకస్‌ చేస్తున్నట్లు తెలిపాయి. సిబ్బందిని పెంచుకోవడానికి సంబంధించి 10–15 శాతానికి మించి గణనీయంగా రిక్రూట్‌ చేసుకోనున్నట్లు 28 శాతం సంస్థలు, 0–5 శాతం వరకు పెంచుకునే అవకాశాలున్నట్లు 43 శాతం సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి 2,359 మంది సీఎక్స్‌వో స్థాయి లీడర్లు, సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 34 శాతం సంస్థలు వేతనాల పెంపు 10 శాతానికి మించి ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుండగా, 46 శాతం సంస్థల్లో ఒక మోస్తరుగా 5–10 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. రిపోర్టులోని మరిన్ని కీలకాంశాలు.. → వేతనాల పెంపు విషయంలో రెగ్యులేటరీ, కార్మిక చట్ట సంస్కరణలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. మిడ్‌–సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం 48 శాతంగా ఉండగా, జూనియర్, సీనియర్‌ స్థాయుల్లో వరుసగా 26, 22 శాతంగా నమోదైంది. → అట్రిషన్‌ అంశం చాలా సంస్థలకు ఆందోళనకర విషయంగా ఉంటోంది. మెజారిటీ 55 శాతం సంస్థలు 10–20 శాతం మేర అట్రిషన్‌ ఉంటుందని అంచనా వేస్తుండగా, ఇది 20 శాతానికి మించి ఉంటుందని 15 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిడ్‌–సీనియర్‌ స్థాయి ఉద్యోగుల సెగ్మెంట్‌లో ఇది ఎక్కువగా ఉంటుందని 67 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాది జోన్‌లో అత్యధికంగా అట్రిషన్‌ ఉంటుందని 55 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆకాంక్షలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పనిపరంగా వెసులుబాట్లు, లక్ష్యాలు, కెరియర్‌లో వేగంగా పురోగమించేందుకు అవకాశాలు మొదలైన విషయాల్లో 50 శాతం పైగా ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్‌ అల్ఫా, జెన్‌ జెడ్‌ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులను అట్టే పెట్టుకోవాలంటే నిరంతరం వారితో ఎంగేజ్‌ కావడం, ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుండటం, నేర్చుకునే అవకాశాలు కల్పించడంలాంటివి కీలకాంశాలుగా ఉంటున్నాయని 38 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. → ఉద్యోగ భద్రత గురించి ఆందోళనపై మిశ్రమాభిప్రాయాలు నెలకొన్నాయి. వేతనం, వృద్ధి అంశాలతో పోలిస్తే అట్రిషన్‌పై దీని ప్రభావం ఒక మోస్తరుగానే ఉంటుందని లేదా పరిమిత స్థాయిలోనే ఉంటోందని చెరి 43 శాతం సంస్థలు వెల్లడించాయి. → 2026–27లో డేటా ఆధారిత వ్యూహాలతో, మిడ్‌ లెవెల్‌ నిపుణులు, డిజిటల్‌ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మారే వ్యాపార అవసరాలకు అనుగుణంగా హైరింగ్‌ ఆచితూచి ఉంటుంది. అట్రిషన్‌ రేటు పెరుగుతుండటమనేది మరింత పటిష్టమైన ప్లానింగ్, రిటెన్షన్‌ (ఉద్యోగులు వీడిపోకుండా అట్టే పెట్టుకోవడం) ఆవశ్యకతను తెలియజేస్తోంది. → పరిస్థితి, అవసరాలను బట్టి హైర్‌ చేసుకోవడం, పర్మనెంట్‌–ప్రాజెక్ట్‌ ఆధారిత నియామకాల మధ్య సమతౌల్యత పాటించే దిశగా పరిశ్రమ మళ్లుతోంది. వేగం, నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యాలు, సంస్థ నిలకడగా వృద్ధి చెందేందుకు తోడ్పడే సామర్థ్యాలు మొదలైనవి హైరింగ్‌ని ప్రభావితం చేస్తున్నాయి. → డైవర్సిఫికేషన్‌కి పెద్ద పీట వేస్తూ పురుషులు, మహిళా ఉద్యోగుల హైరింగ్‌లో పురుషులు, మహిళల నిష్పత్తి 50:50 స్థాయిలో ఉండేలా 27 శాతం కంపెనీలు చూసుకుంటున్నాయి. ఇది 60:40 స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు 31 శాతం కంపెనీలు ప్రయతి్నస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పురుషులను రిక్రూట్‌ చేసుకోవడం వైపే చాలా మటుకు పరిశ్రమలు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. → చెరో 32 శాతం వాటాతో పశ్చిమ, ఉత్తరాదిలో హైరింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఉండనున్నాయి. తూర్పు, దక్షిణాది ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

AI Growth In India Masks Deep Regional Capability Gaps3
ఏఐ వినియోగంలో భారత్‌ టాప్‌.. కానీ.. 

న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్‌లాంటి అంశాల్లో భారత్‌ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్‌ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్‌ అయిదు దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్‌లో మిగతా ప్రాంతాల కన్నా టాప్‌ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్‌ఏఐ తెలిపింది. రిపోర్ట్‌ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్‌ వినియోగంలో కూడా భారత్‌కి పటిష్టమైన ర్యాంకింగ్‌ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్‌ఏఐ కోడెక్స్‌ (కోడింగ్‌ టూల్‌) యాప్‌ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్‌డ్‌ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్‌ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్‌ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్‌డ్‌ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్‌ సిటీల్లో డేటా అనాలిసిస్‌ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్‌ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్‌ (కోడెక్స్‌) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్‌లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్‌గఢ్‌లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్‌ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి.

Golden Deals in Dubai Top Jewelry Brands Unveil Festive Offers for Akshaya Tritiya 4
దుబాయ్‌లో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ ఆఫర్లు!

ప్రపంచ పసిడి రాజధానిగా పిలిచే దుబాయ్‌లో అక్షయ తృతీయ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న రానున్న ఈ శుభదినాన్ని పురస్కరించుకుని, అక్కడి ప్రముఖ జ్యువెలరీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. భారతీయ సమాజానికి ఎంతో ముఖ్యమైన ఈ పండుగ నాడు బంగారం కొనుగోలు చేయడం శ్రేయస్కరమని భావిస్తారు కాబట్టి, కస్టమర్లను ఆకర్షించేందుకు జీరో మేకింగ్ ఛార్జీలు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ వోచర్లతో మార్కెట్ కళకళలాడుతోంది.ముఖ్యంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్, మీనా జ్యువెలర్స్ వంటి బ్రాండ్లు ప్రత్యేక అక్షయ తృతీయ కలెక్షన్లను పరిచయం చేశాయి. మలబార్ గోల్డ్ వజ్రాల ఆభరణాలపై 40% వరకు తగ్గింపుతో పాటు, పాత బంగారం మార్పిడిపై 'జీరో-లాస్' పథకాన్ని అందిస్తోంది. అలాగే, మీనా జ్యువెలర్స్ వజ్రాలు, పోల్కీ ఆభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను, భారీ కొనుగోళ్లపై గోల్డ్ బార్లను బహుమతిగా ఇస్తోంది.మరోవైపు, సిరోయా జ్యువెలర్స్ వజ్రాల ఆభరణాలపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ ప్రకటించగా, అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై 80% వరకు తగ్గింపును ఇస్తోంది. మే 5వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు, కస్టమర్లకు ధరల పరంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున నేరుగా షోరూమ్‌లను సంప్రదించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్ల దుబాయ్‌లోని భారతీయ ప్రవాసుల నుండి మంచి స్పందన లభిస్తుందని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంతోపా దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో, ఈ ఏడాది కూడా విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Air India loss hits 2 4 billion asks Tata Singapore Air for funds5
రూ.22 వేల కోట్ల లాస్‌.. ‘టాటా’ ఆదుకోవాల్సిందే..!

ప్రభుత్వ రంగం నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా 'ఎయిర్ ఇండియా' కష్టాలు తీరడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసిన కాలానికి) ఈ విమానయాన సంస్థ ఏకంగా రూ. 22,000 కోట్లకు (2.7 బిలియన్ డాలర్లు)పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు వాటాదారుల నుంచి భారీగా నిధుల సమీకరణకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం.అంతర్జాతీయ పరిణామాలు, సాంకేతిక సమస్యలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సమస్యలు, పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇవి ఆపరేటింగ్ ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా, ఆదాయ మార్గాలను కూడా ప్రభావితం చేశాయి.సంక్షోభ నివారణకు మెజారిటీ వాటాదారు అయిన టాటా గ్రూప్, 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఎయిర్‌ ఇండియాకు అవసరమైన నగదును ఇన్ఫ్యూషన్ (నగదు ఇంజెక్షన్) రూపంలో అందించే విషయమై ఈ రెండు సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య సంస్థల నుండి అందే నిధులు అవసరానికి సరిపోతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిధుల సమీకరణ పరిమాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాటాదారుల నుండి వచ్చే మొత్తం సరిపోకపోతే, ఎయిర్ ఇండియా ఇతర ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అటు టాటా గ్రూప్ గానీ, ఇటు ఎయిర్ ఇండియా ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Indias first closed door non AC local train in mumbai6
‘వందేభారత్‌ స్టైల్‌’ లోకల్‌ రైలు వచ్చేసింది..

లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్' తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్‌ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధం చేసింది. ఈ కొత్త రైలుకు సంబంధించిన విశేషాలు మీకోసం..ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్‌ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్‌ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది.ఏసీ లేకపోయినా.. గాలికి డోకా లేదు!నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి.అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి 1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది.ప్రయాణికులకు మరిన్ని ఫీచర్లుకేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్‌రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు.12 కోచ్‌ల ఆటోమేటిక్‌ డోర్‌ క్లోజ్‌నాన్‌ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది. ట్రయల్స్ పూర్తయి, సర్టిఫికేషన్ లభించిన వెంటనే ఈ 'వందే భారత్' స్టైల్ లోకల్ రైలు ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement
Advertisement