Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tech Mahindra net profit for Rs 1,122 crore Q3 FY261
టెక్‌ మహీంద్రా లాభం అప్‌

ముంబై: ఐటీ సరీ్వసుల దిగ్గజం టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం వార్షికంగా 14 శాతం ఎగసి రూ. 1,122 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 983 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే క్యూ3 నికర లాభం నీరసించింది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 13,286 కోట్ల నుంచి రూ. 14,393 కోట్లకు బలపడింది. ఈ క్యూ2లో సాధించిన రూ. 13,994 కోట్లతో చూసినా టర్నోవర్‌ పెరిగింది. నిర్వహణ లాభ మార్జిన్లు 2.9 శాతం మెరుగుపడి 13.1 శాతాన్ని తాకాయి. అయితే కొత్త కార్మిక చట్టాల కారణంగా మార్జిన్లపై 0.2 శాతం ప్రతికూల ప్రభావం పడినట్లు కంపెనీ సీఎఫ్‌వో రోహిత్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. ఇందుకు 3 కోట్ల డాలర్లు(రూ. 270 కోట్లు) కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో కొత్తగా 1.096 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. ఇవి 47 శాతం అధికంకాగా.. 2025 డిసెంబర్‌ 31 కల్లా సిబ్బంది సంఖ్య 872 తగ్గి 1,49,616కు పరిమితమైంది. ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 12.3 శాతంగా నమోదైంది. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 7,666 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టెక్‌ ఎం షేరు బీఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 1,671 వద్ద ముగిసింది.

Wipro Q3 net declines by 7percent to Rs3,119 crores2
విప్రోకు కార్మిక చట్టాల సెగ 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,119 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో చేపట్టిన రూ. 303 కోట్ల వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపాయి. అంతేకాకుండా పునర్‌వ్యవస్థీకరణ పూర్తికావడంతో మరో రూ. 263 కోట్ల వ్యయాలు సైతం లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,354 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం ఎగసి రూ. 23,556 కోట్లకు చేరింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)తో పోలిస్తే నికర లాభం 4 శాతం నీరసించగా.. ఆదాయం 4 శాతం పుంజుకుంది. ఈ నెల 27 రికార్డ్‌ డేట్‌తో వాటాదారులకు షేరుకి రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. వృద్ధి ఓకే విప్రో తాజాగా ఐటీ సరీ్వసుల నుంచి పూర్తి ఏడాదికి 0–2 శాతం వృద్ధితో 263.5–268.8 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించగలమని అంచనా వేసింది. ఏఐ వ్యూహాత్మకంగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పాలియా తెలియజేశారు. వెరసి డీల్స్‌ గెలుచుకోవడంలో విప్రో ఇంటెలిజెన్స్‌ ప్రత్యేకతను చాటుకుంటున్నట్లు వెల్లడించారు. ఇతర విశేషాలు → క్యూ3లో 6 శాతం తక్కువగా 3.3 బిలియన్‌ డాలర్ల(రూ. 29,700 కోట్లు) విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది. → 6,529 మంది ఉద్యోగులను జత కలుపుకుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 2,42,021ను తాకింది. → తాజాగా 400 మంది ఫ్రెషర్స్‌(ఇప్పటివరకూ 5,000మంది)కి ఉపాధి కలి్పంచింది. తద్వారా ఈ ఏడాది చివరికి 8,000 మందిని తీసుకునే వీలున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 267 వద్ద ముగిసింది.

Reliance Industries Net profit rises to Rs 18,645 crore Q3 Results3
అంబానీ సామ్రాజ్యం స్థిరం

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఫ్లాట్‌గా రూ. 18,645 కోట్లను తాకింది. ఇతర విభాగాలు పుంజుకున్నప్పటికీ గ్యాస్‌ ఉత్పత్తి క్షీణించడం, రిటైల్‌ బిజినెస్‌ నీరసించడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,540 కోట్లు ఆర్జించింది. కన్జూమర్‌ బిజినెస్‌ విడదీత, జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ నేపథ్యంలో రిటైల్‌ బిజినెస్‌ ఆర్జన మందగించగా.. ఎనర్జీ, డిజిటల్‌ విభాగాలు మెరుగైన మార్జిన్లు సాధించాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.43 లక్షల కోట్ల నుంచి రూ. 2.69 లక్షల కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 48,003 కోట్లకు చేరింది. విభాగాల వారీగా రిలయన్స్‌ రిటైల్‌ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 3,551 కోట్లను తాకింది. కొత్తగా 431 స్టోర్లను ప్రారంభించింది. ఆదాయం 8 శాతం ఎగసి రూ. 97,605 కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 7,629 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 50.64 కోట్ల నుంచి 51.53 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 213.7 నుంచి రూ. 221.4కు బలపడింది. కేజీ ఫీల్డ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 13 శాతం క్షీణించి రూ. 4,857 కోట్లకు పరిమితమైంది. కేజీడీ6లో సగటున గ్యాస్‌ ఉత్పత్తి 26.1 ఎంఎస్‌సీఎండీకి చేరగా.. రోజుకి 18,400 బ్యారళ్ల చమురును వెలికితీసింది. జియోస్టార్‌ రూ. 8,010 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 1,303 కోట్లుకాగా.. యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 13 శాతం వృద్ధితో నెలవారీ 45 కోట్లను తాకింది. 2025 డిసెంబర్‌31కల్లా ఆర్‌ఐఎల్‌ నికర రుణ భారం రూ. 1.17 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో రూ. 33,286 కోట్ల పెట్టుబడి వ్యయాలను కవర్‌ చేసేలా రూ. 41,303 కోట్ల నగదు ఆర్జన సాధించింది. ఆర్‌ఐఎల్‌ షేరు ఫ్లాట్‌గా రూ.1,458 వద్ద ముగిసింది.ఓ2సీ, న్యూ ఎనర్జీపై దృష్టిఓ2సీ, న్యూ ఎనర్జీ బిజినెస్‌లలో వృద్ధికి వీలుగా ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులపై పెట్టుబడులను వెచి్చస్తున్నాం. అంతేకాకుండా జియో, రిటైల్‌ నెట్‌వర్క్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విస్తరణ, పటిష్టతలకు పెట్టుబడి వ్యయాలను కేటాయిస్తున్నాం. వివిధ విభాగాలలో నిలకడైన ఆర్థిక పనితీరు, నిర్వహణ సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. – ముకేశ్‌ డి.అంబానీ, చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

O Gold launches gold backed Mastercard4
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్‌!

నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను లైఫ్‌స్టైల్ సూపర్ యాప్‌గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్‌‌లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు.

Refunds to all passengers hit by disruptions processed IndiGo tells DGCA5
ఇండిగో బాధితులకు రిఫండ్‌ పూర్తి

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ 3-5 మధ్య విమాన రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణికులందరికీ రిఫండ్‌ ప్రాసెస్ చేసిందని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా తెలిపింది.‘డిసెంబర్ 3-5 వరకు కార్యకలాపాల అంతరాయాల కారణంగా బాధిత ప్రయాణీకులకు అందించే రిఫండ్‌లు, పరిహారాలకు సంబంధించి దేశీయ క్యారియర్ ఇండిగోతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది’ అని డీజీసీఏ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఇండిగో విమానాల రద్దుకు సంబంధింంచి అన్ని రిఫండ్లను పూర్తిగా ప్రాసెస్ చేసి, చెల్లింపులు క్లియర్ చేసినట్లు ఇండిగో తెలియజేసిందని వివరించింది.అంతేకాకుండా ఎక్కువ అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఊరట కల్పించడానికి అదనపు చర్యగా విమానయాన సంస్థ "గెస్చర్‌ ఆఫ్‌ కేర్‌’ పేరుతో ఒక్కొక్కరికీ రెండు రూ.5,000 ట్రావెల్ వోచర్లను అందించినట్లుగా తెలిపింది. వీటికి 12 నెలల చెల్లుబాటు ఉంటుందని, ఆయా తేదీల్లో ఫ్లైట్లు రద్దవడం లేదా మూడు గంటల కంటే ఆలస్యంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీటిని అందించినట్లుగా పేర్కొంది.బాధిత ప్రయాణికులకు రిఫండ్‌ పూర్తయినట్లు ఇండిగో, డీజీసీఏ చెబుతుంటే మరో వైపు తమకు రిఫండ్‌ అందలేదని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇండిగోను, డీజీసీఏ ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.Press note on refunds, compensation to passengers affected by operational disruptions of Indigo between 3rd - 5th Dec 25 Imp Links:Eligibility for Compensation https://t.co/FVXEWXoQotSubmission of Details https://t.co/FdGdQmsLAYList of Flights Covered https://t.co/ks5u0wBVaO pic.twitter.com/adjmIb1nth— DGCA (@DGCAIndia) January 16, 2026

X platform faces major outages again6
‘ఎక్స్‌’లో మరోసారి అంతరాయం

ఎలోన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) ఈ వారం రెండోసారి పెద్ద సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా ప్రభావితం చేసింది.డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎక్స్‌ సేవలు అందుబాటులో లేవని సుమారు 80,000కు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.ఇలాంటి వరుస అంతరాయాల నేపథ్యంలో ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్ స్థిరత్వం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్‌ను సమర్థవంతంగా మోడరేట్ చేయగల సామర్థ్యంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం, సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. దీని కారణంగా సాధారణ కార్యకలాపాలను నిరవధికంగా కొనసాగించడం, హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడం వంటి అంశాలపై అప్పటినుంచి సవాళ్లు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement