Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Closing Update 5th March 20261
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్‌జిఎస్‌ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్‌లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Morgan Stanley layoffs 2500 jobs cut despite record revenue2
2,500 మందిని తొలగిస్తున్న ప్రముఖ బ్యాంకు

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 2,500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఇటీవలే తన చరిత్రలోనే అత్యంత బలమైన ఆర్థిక సంవత్సరాల్లో ఒకటిని నమోదు చేసింది. అయినప్పటికీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఉద్యోగ కోతలను చేపడుతున్నట్లు సమాచారం.రికార్డు స్థాయి ఆదాయం2025 సంవత్సరానికి మోర్గాన్‌ స్టాన్లీ 70.6 బిలియన్ డాలర్ల పూర్తి సంవత్సర ఆదాయాన్ని నమోదు చేసింది. పెట్టుబడి బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగడంతో బ్యాంక్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా డీల్‌మేకింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పెట్టుబడి బ్యాంకింగ్ ఆదాయం 47% పెరిగింది. ఇదే సమయంలో కంపెనీలకు రుణాలు సమకూర్చడం ద్వారా వచ్చే ఫీజులు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి.లేఆఫ్‌ల ప్రభావం వీరిపైనే.. ఈ ఉద్యోగ కోతలు బ్యాంక్‌కు చెందిన మూడు ప్రధాన విభాగాల్లో ఉండనున్నాయి. అవి ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ (ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ట్రేడింగ్), వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌. అయితే బ్యాంక్‌కు కీలకమైన ఫైనాన్షియల్ అడ్వైజర్లపై ఈ కోతలు ఉండవని సమాచారం.అమలు ఎప్పుడంటే.. వివిధ నివేదికల ప్రకారం, ఈ ఉద్యోగ కోతలు మార్చి ప్రారంభం నుంచే దశలవారీగా అమలు కావచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై బ్యాంక్ అధికారికంగా పూర్తి కాలక్రమాన్ని వెల్లడించలేదు.లాభాలున్నా ఉద్యోగ కోతలు ఎందుకు?బ్యాంక్ లాభాల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది ఆర్థిక బలహీనత కారణంగా కాకుండా వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు, గ్లోబల్ లొకేషన్ వ్యూహంలో సర్దుబాట్లు, వ్యక్తిగత పనితీరు సమీక్షలు వంటి అంశాలు కూడా దీనికి కారణమని తెలుస్తోంది.గత సంవత్సరం కూడా మోర్గాన్‌ స్టాన్లీ సుమారు 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అప్పట్లో పనితీరు సమీక్షలు, కార్యకలాపాల్లో మార్పులు కారణమయ్యాయి.

Delhi Watch Company Launch Limited Edition Tata Sierra Watch3
టాటా సియెర్రా వాచ్.. కేవలం 500 మాత్రమే!

టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వాచ్ కంపెనీ సియెర్రా పేరుతో లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16999.టాటా సియెర్రా వాచ్‌ను కంపెనీ కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ వాచ్.. ఢిల్లీ వాచ్ కంపెనీ లోగో, సియెర్రా పేరును పొందినట్లు తెలుస్తోంది. సాధారణ వాచ్‌లో మాదిరిగా.. ఇందులో కూడా 3,6,9, 12 గంటలను సూచించే గుర్తులు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నీకర్, టోపోగ్రాఫిక్ లైన్లు, గుర్రం చిహ్నం వంటివి ఇందులో కనిపిస్తాయి.సియెర్రా 10000 యూనిట్ల డెలివరీ!టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Delhi Watch Company (@delhiwatchcompany)

Driver Linked to 550 Cr Scam ED Exposes Network4
బైక్‌ డ్రైవర్ ఖాతాలో రూ.550 కోట్లు..

నెలకు పట్టుమని రూ.పది వేలు సంపాదించలేని ఒక సాధారణ డ్రైవర్.. వందల కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమయ్యాడు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా రూ.550 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా మార్గాల ద్వారా ఈ భారీ నెట్‌వర్క్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.రూ.25 వేల ఆశ జూపి..విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్ ఓడే, కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను రూ.25,000కు అద్దెకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను సంతకం చేసిన ప్రతి చెక్కుకు అదనంగా రూ.400 కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రదీప్ పత్రాలను ఉపయోగించి నిందితులు ‘ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో ఒక డమ్మీ సంస్థను స్థాపించారు.ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో రెండు షెల్‌ కంపెనీలను 2024లో నమోదు చేశారు. ఈ సంస్థలకు వాస్తవంగా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. కానీ, వీటి బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూ.550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. మూడు వేర్వేరు కంపెనీలకు వరుసగా రూ.80.50 కోట్లు, రూ. 52.11 కోట్లు, రూ.22.86 కోట్ల చొప్పున డబ్బు బదిలీ అయినట్లు ఈడీ తేల్చింది.క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ఈ భారీ మొత్తమంతా అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం బెట్టింగ్ మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్‌లో ‘సర్క్యులర్ ట్రేడింగ్’(కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచడం) ద్వారా షేర్ల ధరలను తారుమారు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. ‘సాధారణ పొదుపు ఖాతాగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు సంబంధించిన హవాలా ఛానెల్‌గా పనిచేస్తోంది’ అని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఇంపాక్ట్ గురు’ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించి వాటిని మనీ లాండరింగ్‌కు వినియోగించినట్లు తెలుస్తుంది.ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరికి చేరుతోంది? అనే అంశంపై ఈడీ ప్రస్తుతం మనీ ట్రయిల్‌(డబ్బు వెళ్లిన క్రమం)ను ట్రాక్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఆస్తుల అటాచ్‌మెంట్, కీలక వ్యక్తుల అరెస్టులు ఉండొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

War Effect Dubai Real Estate Deals Put on Hold5
స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్‌ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.భారతీయ పెట్టుబడిదారుల ‘బ్రేక్‌’దుబాయ్‌ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బీచ్‌ఫ్రంట్‌ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు చెబుతున్నారు.భద్రమైన పెట్టుబడి కేంద్రం… ఇప్పుడు సందేహాలుఇప్పటివరకు దుబాయ్‌ పెట్టుబడిదారులకు ‘సేఫ్‌ హేవన్‌’ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిస్సైల్‌ దాడుల భయం, ఎయిర్‌స్పేస్‌ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇది కేవలం సెంటిమెంట్ ఆధారిత 'బ్లిప్' మాత్రమేనని డనుబే గ్రూప్‌ వంటి డెవలపర్లు అంటున్నారు.దుబాయ్‌కి ప్రత్యామ్నాయం ఏది? ఈ నేపథ్యంలో ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ అయింది. దుబాయ్ బదులు ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి భారతీయ నగరాలను ప్రత్యామ్నాయాలుగా సూచించారు. దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు భారత్‌లోని ఏ నగరమూ దుబాయ్ స్థాయికి చేరదని, ట్యాక్స్ లాభాలు, లగ్జరీ ఇన్ఫ్రా, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ దుబాయ్‌కే ఉన్నాయని వాదిస్తున్నారు. మరికొందరు గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య)ను భవిష్యత్ పోటీదారుగా చూస్తున్నారు.డీల్స్‌ ఆగినా… పూర్తిగా కుదేలుకాదుదుబాయ్‌లో ప్రస్తుతం కొన్ని ప్రాపర్టీ ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచినా పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే త్రైమాసికంలో నిలిచిపోయిన డీల్స్‌లో 60%–80% వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని అంచనా.క్లిక్‌ చేయండి 👉 దుబాయ్‌ దాటని బంగారం.. ధరలపై ప్రభావం?కొనుగోళ్లు మందగిస్తే వచ్చే కొన్ని నెలల్లో ధరలపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భారీగా కొత్త గృహ ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

India Leads World AdTech AI Adoption Says Taboola CEO Adam Singolda6
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం

సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్‌టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్‌లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్‌లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్‌ ప్లాట్‌ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్‌తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్‌లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్‌ఫామ్ టూల్స్‌ను ఉపయోగించి క్లయింట్‌లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్‌లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్‌కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

Advertisement
Advertisement
Advertisement