Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Price Down Again in india Know The Latest Rates1
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు

భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.వెండి ధరలువెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.

Gold Mines in India Know The Details Here2
భూగర్భంలో విలువైన సంపద.. భారత్‌లో ఎక్కడుందంటే?

ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వాటితో పాటు బంగారం కూడా ముఖ్యమైన ఖనిజ వనరు. ఇతర ఖనిజాల విషయాన్ని పక్కనపెడితే.. బంగారం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో విశిష్ట స్థానం పొందింది. వివాహాలు, పండుగలు, ఆభరణాలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో పసిడిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారతదేశంలోని బంగారు గనులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. అయితే ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేశారు.హట్టి గోల్డ్ మైన్స్కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్.. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న అత్యంత ముఖ్యమైన బంగారు గని. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రస్తుతం ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.రామగిరికర్ణాటక మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి (అనంతపురం జిల్లా) ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలోని రామగిరి (పెద్దపల్లి జిల్లా) ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.ఇవి కాకుండా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగే తవ్వకాలకు పరిమితులు విధించారు. కాబట్టి ఇక్కడ విరివిగా తవ్వకాలు జరపడం నిషిద్ధం.బంగారు గనులు - ఎదుర్కొంటున్న సవాళ్లుబంగారు గనుల తవ్వకాలు అనుకున్నంత సులభమేమీ కాదు. ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది.

Isha Ambani Leads Reliance Retail to a Historic 20000 Stores3
ఇషా అంబానీ సారథ్యం.. రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డ్!

ఇషా అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ రిటైల్ 2025లో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏడాది ముగిసే సమయానికి దేశంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య 7000 కంటే ఎక్కువ నగరాల్లో.. 20వేలకు చేరుకుంది. ఇందులో ఒక బిలియన్ కంటే ఎక్కువ కస్టమర్ లావాదేవీలను నెరవేర్చడమే కాకుండా.. లక్షలాది మంది భారతీయులకు ప్రాథమిక షాపింగ్ గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ఫిజికల్ స్టోర్లే మొత్తం వ్యవస్థకు వెన్నెముక అని ఇషా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది వస్తువులను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో డెలివరీ చేసేలా లాజిస్టిక్స్‌ను మార్చారు. 600 కొత్త డార్క్ స్టోర్లు ఏర్పాటు చేశారు. జియోమార్ట్ 1,000కి పైగా నగరాల్లో విస్తరించింది. Ajio Rush ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా డెలివరీ చేయడం ప్రారంభమైంది. ఇవన్నీ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడ్డాయి.గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను.. భారతీయులకు చేరువ చేయడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'షీన్' బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నారు. ఫ్రెంచ్ బ్రాండ్ Maje, యువత కోసం Yousta, Azorte వంటివాటిని పరిచయం చేశారు. వీటికి పట్టణాల్లో మంచి ఆదరణ లభించింది.ప్రజలను ఆకట్టుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో.. రిలయన్స్ రిటైల్ ఆర్థికంగా 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ FMCG విభాగం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), దాని రెండవ సంవత్సరంలోనే రూ.11,500 కోట్ల మైలురాయి టర్నోవర్‌ను సాధించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

Silver Prices Crashed By Rs 21000 Per Kg in One Day4
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!

భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా భారీగా దిగి వచ్చింది.వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలురష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ

Petrol and CNG Vehicles May Get Costlier in Delhi5
పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్

డీజిల్ కార్లపై ప్రస్తుతం విధించే గ్రీన్ సెస్‌ను.. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్, CNG వాహనాలపై విధించే అవకాశం ఉంది. దీనివల్ల కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదాలో భాగమైన ఈ ప్రతిపాదన ప్రకారం సెస్ అమలు చేయనున్నారు. మార్చి నాటికి ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రభుత్వం.. ఈవీలను ప్రోత్సహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. డీజిల్, పెట్రోల్, CNG వాహనాల కొనుగోలును తగ్గించాలి. దీనికోసం ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు.. రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.సెంట్రల్ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నెలా జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు 12-14% వాటా కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన సుమారు 8,00,000 వాహనాలలో, దాదాపు 1,11,000 ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ సంఖ్యను మరింత పెంచే యోజనలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది.

Stock Market Closing Update 29th Dec 20256
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 345.91 పాయింట్లు, లేదా 0.41 శాతం నష్టంతో 84,695.54 వద్ద, నిఫ్టీ 100.20 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 25,942.10 వద్ద నిలిచాయి.ప్రకాష్ స్టీలేజ్, రాజనందిని మెటల్, కంట్రీ కాండోస్ లిమిటెడ్, ఓరియంట్ బెల్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోడీ రబ్బరు, బ్రూక్స్ లాబొరేటరీస్, టీమో ప్రొడక్షన్స్ హెచ్‌క్యూ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement