Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

If Mukesh Ambani Spends Rs 5 Crore Every Single Day His Entire Wealth Will End 555 Years1
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు!

కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.రిలయన్స్ ఆదాయం ఇలా..1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.

Pankaj Chaudhary Says 15 Fugitive Economic Offenders Including Vijay Mallya Nirav Modi Rs 58000 Crore to Banks2
రూ.58 వేలకోట్లు!.. విజయ్ మాల్యాతో సహా 15 మంది అప్పు

ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.అత్యధికంగా విజయ్ మాల్యావిజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్‌బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.

Apple may refused to comply with an govt directive Sanchar Saathi app3
‘సంచార్ సాథీ’పై కలకలం

సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్‌ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్‌ పట్టుడిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్‌, శామ్‌సంగ్‌, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్‌లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్‌ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్‌ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్‌ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్‌ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్‌ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్‌సంగ్‌, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..

Apple New Vice President Of AI Who is Amar Subramanya4
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌: ఎవరీ అమర్ సుబ్రమణ్య?

యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేష‌న్ మోడ‌ల్స్‌, ఎంఎల్ రీస‌ర్చ్‌, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేష‌న్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ పనిచేశారు.పీహెచ్‌డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్‌లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా మైక్రోసాఫ్ట్‌కు మారాడు. గూగుల్‌లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్‌లో సీపీవీగా చేరారు.

why Nita Ambani trending on Google today know the reason5
గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..

భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్‌లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.వైరల్ వీడియోలో..‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్‌తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్‌ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?

reasons for increase in demand for silver check full details6
వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పేదవాడి బంగారంగా పిలిచే వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్దికాలంగా వెండి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా వెండి సరఫరా కావడంలేదనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు వెండిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుందాం.ధరల పెరుగుదలకు కారణంవెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడమేనని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో వెండి సరఫరా కంటే డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ సిల్వర్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.డిమాండ్ ఎందుకు పెరిగింది?బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే, రేకులుగా మలిచే గుణం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్‌లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్‌ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్‌కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గిస్తుంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్‌లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్‌లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, ఫ్యూజులు, కనెక్టర్‌లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్‌ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్‌పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.సరఫరా ఎందుకు లేదు?వెండి అనేది ఒక ఉప ఉత్పత్తి (By-product) లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో సుమారు 70% కంటే ఎక్కువ భాగం ప్రధానంగా రాగి, సీసం, జింక్, బంగారం వంటి ఇతర లోహాల మైనింగ్ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.ప్రధాన లోహాల మైనింగ్‌పై పెట్టుబడులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉప ఉత్పత్తిగా లభించే వెండి పరిమాణం కూడా తగ్గిపోతుంది.వెండిని ప్రధానంగా ఉత్పత్తి చేసే గనుల్లో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమిలో ఉన్న వెండి శాతం (గ్రేడ్) తగ్గిపోతోంది. అంటే ఒకే పరిమాణంలో వెండిని పొందడానికి ఎక్కువ ఖర్చుతో అధిక మట్టిని తవ్వాల్సి వస్తుంది.ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెండిని తిరిగి తీయడం (రీసైక్లింగ్) ఖర్చుతో కూడుకుంది. దీని వల్ల మొత్తం సరఫరాపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు.వెండి కేవలం సంప్రదాయ ఆభరణాల లోహం కాకుండా ఆధునిక సాంకేతికతకు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిసరుకుగా మారింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్తు సాంకేతికతలపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దీనికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో మైనింగ్ నుంచి లభించే సరఫరా పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ - సరఫరా మధ్య అంతరం మరింత అధికమవుతోంది. ఈ అసమతుల్యతే వెండి ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు

Advertisement
Advertisement
Advertisement