Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

GST disruption slows FMCG sales in September quarter1
ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల వృద్ధి తగ్గుదల 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పరిమాణం పరంగా 5.4 శాతానికి పరిమితమైనట్టు నీల్సన్‌ఐక్యూ సంస్థ తెలిపింది. జీఎస్‌టీ రేట్ల మార్పులకు ముందు నెలకొన్న పరిస్థితులను అవరోధాలుగా పేర్కొంది. అమ్మకాల విలువ మాత్రం 12.9 శాతం పెరిగినట్టు తెలిపింది. ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాల వృద్ధి క్రితం ఏడాది క్యూ2తో పోల్చితే 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిందని.. అయినప్పటికీ వరుసగా ఏడో నెలలోనూ పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక వృద్ధి కనిపించినట్టు తన నివేదికలో నీల్సన్‌ఐక్యూ సంస్థ వెల్లడించింది. చిన్న ప్యాక్‌లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో అధిక వాటా కలిగిన పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డిమాండ్‌ క్రమంగా కోలుకుంటోంది. జూన్‌ త్రైమాసికంతో పోల్చితే మాత్రం పట్టణాల్లో డిమాండ్‌ తగ్గింది. ఇక గ్రామీణ మార్కెట్లో అందుబాటు ధరల ఆధారంగా చిన్న ప్యాక్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌లో గ్రామీణ వాటా 38 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో 7.7 శాతం వృద్ధి నమోదు కాగా, పట్టణాల్లో 3.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. మెట్రోల్లో ఈ–కామర్స్‌ అమ్మకాలు అధికం మెట్రో నగరాల్లో సంప్రదాయ దుకాణాల ద్వారా ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు తగ్గగా, ఈ–కామర్స్‌ విక్రయాలు పెరిగినట్టు నీల్సన్‌ ఐక్యూ నివేదిక తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్‌ వాటా పెరిగినట్టు పేర్కొంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఓమ్ని ఛానల్‌ అమ్మకాలకు (ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌) ఈ–కామర్స్‌ కీలక చోదకంగా ఉందని, సంప్రదాయ రిటైల్‌ వాణిజ్యం సైతం తనవంతు వాటా పోషించినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున వినియోగం పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావం వచ్చే రెండు త్రైమాసికాల విక్రయాల్లో కనిపించొచ్చని అంచనా వేసింది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ జీఎస్‌టీ 2.0 (సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి)కు మారే క్రమంలో హోమ్, పర్సనల్‌కేర్‌ బ్రాండ్ల విభాగంలో తాత్కాలికంగా వృద్ధి నిదానించినట్టు ఈ నివేదిక వివరించింది. ఇక ఆహారోత్పత్తుల వినియోగంలో వృద్ధి స్థిరంగా 5.4 శాతం స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. పార్మసీల ద్వారా విక్రయించే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల విలువ 14.8 శాతం పెరిగినట్టు, ఇందులో ధరల పెంపు రూపంలో 9.7 శాతం సమకూరినట్టు పేర్కొంది.

India and Israel sign terms of reference to guide free trade agreements2
ఇజ్రాయెల్‌  స్టార్టప్‌లతో జత 

టెల్‌అవీవ్‌: భారత్, ఇజ్రాయెల్‌ స్టార్టప్‌లు సాంకేతిక సహకారమందించుకునేందుకు చేతులు కలపవలసి ఉన్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇక్కడ పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా సైబర్‌సెక్యూరిటీ, మెడికల్‌ పరికరాలు తదితరాలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సహకారానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. సొంత స్టార్టప్‌ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇజ్రాయెల్‌తో చేతులు కలపనున్నట్లు పేర్కొన్నారు. పోటీ ధరలలో లోతైన టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన ఆవిష్కరణలను అందించే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. భారత్‌కున్న విస్తారిత వ్యవస్థల ద్వారా ఇందుకు పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్‌ వాణిజ్య మంత్రి నిర్‌ బార్కట్‌తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు గోయల్‌ ఇక్కడకు వచ్చారు.

FM Nirmala Sitharaman chairs 11th Pre-Budget Consultation in New Delhi3
ఇన్‌ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్‌ ఎండీ ఎస్‌.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ మనీష్‌ త్రిపాఠి, జీఎంఆర్‌ గ్రూప్‌ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్‌ డైరెక్టర్‌ సందీప్‌ వాద్వా, ఇన్‌ఫ్రా విజన్‌ ఫౌండేషన్‌ సీఈవో జగదన్‌షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్‌ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్‌ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్‌ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్‌ శాఖ, షిప్పింగ్‌ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్‌ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్‌ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్‌ మార్కెట్‌ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్‌ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం.

SEBI plans REITs index entry to enhance liquidity, participation4
ఇండెక్సులలో రీట్స్‌కు చోటు

న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు(రీట్స్‌)ను మార్కెట్‌ ఇండెక్సులలో చేర్చే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో రీట్స్‌కు లిక్విడిటీ భారీగా మెరుగుపడే వీలున్నట్లు తెలియజేశారు. 2025 రిట్స్, ఇని్వట్స్‌ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ పాండే ఇండెక్సులలో రీట్స్‌ను పొందుపరిచేందుకు పరిశ్రమ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రియల్టీ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు రీట్స్‌ను జారీ చేస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లకు అధిక ధరల రియలీ్టని ఆఫర్‌ చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా డివిడెండ్‌ ఆదాయం ఆర్జించేందుకు వీలు కల్పించడంతోపాటు.. భవిష్యత్‌లో పెట్టుబడుల వృద్ధికి సైతం రీట్స్‌ ఉపయోగపడతాయి. ఇండెక్సులలో చోటు లభిస్తే రీట్స్‌లో లిక్విడిటీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. మరోపక్క రీట్స్, ఇని్వట్స్‌ సంబంధిత బిజినెస్‌ల సులభతర నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎంఎఫ్‌ పథకాలలో.. ఇన్వెస్టర్లకు రక్షణ కలి్పస్తూనే లిక్విడ్‌ ఎంఎఫ్‌ పథకాలలో రీట్స్, ఇన్విట్స్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకున్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు సెబీ చీఫ్‌ పాండే తెలియజేశారు. ఈ బాటలో తగిన రక్షణాత్మక విధానాలకు తెరతీయడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులలో ప్రయివేట్‌ ఇని్వట్స్‌ పెట్టుబడులు చేపట్టేందుకు అవకాశాలను అన్వేíÙస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విధంగా రీట్స్, ఇని్వట్స్‌లో మరిన్ని పెట్టుబడులను చేపట్టేందుకు వీలుగా సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్‌ ఆస్తుల మానిటైజేషన్‌ను పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో పెట్టుబడులపై బీమా రంగ నియంత్రణ సంస్థ, పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత సంస్థ, ఈపీఎఫ్‌వో తదితరాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఎఫ్‌లపై సెబీ ఆంక్షలు ప్రీఐపీవోలో పెట్టుబడులకు చెక్‌ న్యూఢిల్లీ: ప్రీఐపీవోలో షేర్ల కొనుగోలుపై మ్యూచువల్‌ ఫండ్స్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్‌ పెట్టినట్లు తెలుస్తోంది. సంబంధితవర్గాల సమాచారం ప్రకారం ఐపీవోకుముందు షేర్ల జారీ(ప్లేస్‌మెంట్స్‌)లో ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయకుండా సెబీ నిషేధం విధించింది. తద్వారా ఐపీవోలలో లిక్విడిటీని పెంచడంతోపాటు.. కంపెనీల విలువ నిర్ధారణలో పారదర్శకతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రీఐపీవో షేర్ల జారీలో పాల్గొనకుండా ఆదేశించామని, అయితే యాంకర్‌ రౌండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతులు కొనసాగుతాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ నెల మొదట్లో సెబీ యాంకర్‌ ఇన్వెస్టర్‌ కేటగిరీ, షేర్ల కేటాయింపులో సైతం సవరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో మ్యూచువల్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌కు మరింత చోటు కల్పించింది. ఇందుకు వీలుగా యాంకర్‌ పోర్షన్‌ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచిన విషయం విదితమే.

Reliance Stops Russian Crude Imports As Global Restrictions ...5
రష్యా చమురుకు రిలయన్స్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఎగుమతులకు ఉద్దేశించిన రిఫైనరీ యూనిట్‌ కోసం రష్యా చమురు దిగుమతులను నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్య ఆంక్షలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న సంస్థల్లో రిలయన్స్‌ ముందుండడం గమనార్హం. జామ్‌నగర్‌ కాంప్లెక్స్‌లో రిలయన్స్‌కు రెండు రిఫైనరీ యూనిట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేక ఆర్థిక మండలి రిఫైనరీ యూనిట్‌. ఇందులో రష్యా చమురును రిఫైనరీ చేసి యూరప్, యూఎస్, ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. రోజువారీ 1.7–1.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి తక్కువ ధరలపై కొనుగోలు చేస్తూ వచి్చంది. జామ్‌ నగర్‌లోనే ఉన్న మరొక యూనిట్‌ను దేశీ మార్కెట్‌ అవసరాల కోసం వినియోగిస్తోంది. అయితే, రష్యా చమురు దిగుమతి, దాంతో పెట్రోలియం ఉత్పత్తుల తయారీపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడం గమనార్హం. వీటిని అనుసరిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రష్యా చమురు కొనుగోళ్లను నవంబర్‌ 20 నుంచి నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతంలో కొనుగోలు చేసిన చమురు నిల్వల రిఫైనరీ పూర్తయిన అనంతరం, రష్యాయేతర దేశాల చమురునే ఇక్కడ వినియోగించనున్నట్టు తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్‌ ద్వారా ఎగుమతి చేసే ఉత్పత్తులు రష్యాయేతర చమురుతో తయారైనవే ఉంటాయని స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నుంచి ఐరోపా ఆంక్షలు అమల్లోకి రానుండగా, దీనికంటే ముందుగానే రష్యాయేతర చమురుకు మారిపోవడం పూర్తవుతుందన్నారు. తద్వారా ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.

Indian Rupee Falls to Record Low of 89.66 as US Dollar6
రూపాయి భారీ క్రాష్‌..! 

ముంబై: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కె ట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒక్కరోజులో అత్యధికంగా 98 పైసలు కుప్పకూలి చరిత్రాత్మక కనిష్టం 89.66 స్థాయి వద్ద ముగిసింది. అంతకుముందు అక్టోబర్‌ 14న 88.91 జీవితకాల కనిష్టంగా ఉంది. అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో అనూహ్య అమ్మకాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య డీల్‌పై స్పష్టత లేమి కూడా రూపాయి కోతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 97 పైసలు క్షీణించి 89.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న 88.85 వద్ద ఇంట్రాడేలో రికార్డు కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అలాగే జూలై 30న ఒక్కరోజులో 89 పైసల పతన రికార్డునూ చెరిపివేసింది. ‘క్రిప్టో భారీ పతనం, ఏఐõÙర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో అంతర్జాతీయంగా కరెన్సీ మార్కెట్లలో రిస్క్‌ సామర్థ్యం ఒక్కసారిగా తగ్గింది. ఈ పరిమాణం భారత్‌ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెంచింది’ అని ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్స్‌ అండ్‌ కమోడిటీ, కరెన్సీ హెడ్‌ అనింద్య బెనర్జీ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement