Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

looking rich vs becoming rich Lets break it down1
రిచ్‌గా కనిపిస్తున్నారా? రిచ్‌గా మారుతున్నారా?

స్పోర్ట్స్ కారు, ఖరీదైన వాచ్, చేతి నిండా షాపింగ్ బ్యాగ్‌లు.. బయటికి చూస్తే అతడు కోటీశ్వరుడు! కానీ తన క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు రుణాల చిట్టా చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రిచ్‌గా కనిపించడానికి భారీగా అప్పు చేశాడు. మరోవ్యక్తి అనవసర ఆండంబరాలకు పోకుండా మంచి పెట్టుబడి సాధనాల్లో పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో భారీ సొమ్ము పోగు చేశాడు. తర్వాత తన అవసరాలకు ఖర్చు చేస్తున్నాడు. నేటి సమాజంలో నిజంగా ధనవంతులుగా మారడానికి ప్రయత్నించే వారి కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ధనవంతులుగా నటించే వారే ఎక్కువైపోతున్నారు. పొరుగువారిని మెప్పించాలనే ఉద్దేశంతో లేనిపోని ఖర్చులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.రిచ్‌గా కనిపించడానికి చేసే ఖర్చులు కొన్ని..చాలామంది వ్యక్తులు ఇతరుల దృష్టిలో ధనవంతులుగా, విజయవంతమైనవారిగా కనిపించడానికి తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు సాధారణంగా అప్పులు లేదా అధిక వడ్డీకి దారితీయవచ్చు.అవసరం లేకపోయినా కేవలం స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, బట్టలు, యాక్సెసరీలు కొంటారు. ఇవి ఆస్తులు కావు, విలువ కోల్పోయే వస్తువులని గుర్తుంచుకోవాలి.స్తోమతకు మించిన లగ్జరీ కార్లు కొనడం, వాటి ఈఎంఐలు, నిర్వహణ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతుంటారు. కారు విలువ తగ్గుతూ ఉంటుంది, కానీ అప్పు భారం మాత్రం పెరుగుతూనే ఉంటుంది.నిత్యం ఖరీదైన రెస్టారెంట్లు, పబ్‌లు, విదేశీ పర్యటనలకు వెళ్లడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని ఆశిస్తారు.అవసరం కంటే పెద్ద ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకుంటారు. కేవలం రిచ్ ఏరియాలో నివసించాలనే ఉద్దేశంతో అధిక అద్దె చెల్లిస్తారు.నిజంగా రిచ్‌గా మారాలంటే అనుసరించాల్సిన మార్గాలునిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు, నిరంతరాయంగా వచ్చే ఆదాయ వనరులు కలిగి ఉండటం. నిజమైన ధనవంతులు ఖర్చు చేయడంలో కాకుండా సంపద సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.ఇతరులను మెప్పించడం అనే ఆలోచనను వదిలి తమ వ్యక్తిగత ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి.ఎంత సంపాదించినా దానికి తగినట్టుగా ఖర్చును పెంచకుండా, ఒక కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.వెంటనే వచ్చే సంతృప్తి (Instant Gratification) కంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేసి ప్రతి నెలా కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు, వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేయాలి.జీతం రాగానే ఖర్చు చేయడానికి ముందే, కొంత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి లేదా పెట్టుబడిలోకి మళ్లించాలి.ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

Oberoi Group opened Rajgarh Palace in Khajuraho2
350 ఏళ్ల చరిత్ర కలిగిన ప్యాలెస్‌ పునరుద్ధరణ

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరమైన ఖజురహోలో ప్రతిష్టాత్మకమైన ‘ది ఒబెరాయ్ రాజ్‌గఢ్‌ ప్యాలెస్’ను ప్రారంభిస్తున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఇది 76 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్. ఈ చారిత్రక వారసత్వ కట్టడాన్ని ఇటీవల ఒబెరాయ్‌ గ్రూప్‌ పునరుద్ధరించింది. సహజ సరస్సు, మనియాఘర్ కొండల వాలుపై సాల్, పలాష్ అడవుల మధ్య వింధ్యాచల్ పర్యాత శ్రేణుల్లో ఈ ప్యాలెస్ ఉంది.యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఖజురహో దేవాలయాలు, పన్నా నేషనల్ పార్క్‌కు సమీపంలో ఈ హోటల్ ఉండటం వల్ల చాలా మంది ఇందులో బస చేసేందుకు అవకాశం ఉందని ఒబెరాయ్‌ గ్రూప్‌ తెలిపింది. ది ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్ ఒబెరాయ్ ఈ పునరుద్ధరణపై స్పందిస్తూ చరిత్రకు తిరిగి జీవం పోసే ప్రయాణంగా దీన్ని అభివర్ణించారు. ఖజురహోలో బుండేలా స్మారక చిహ్నం సమగ్రతను కాపాడుతూనే, ఆధునిక సౌకర్యాలను జోడించినట్లు తెలిపారు.ఈ ఎస్టేట్‌లో మొత్తం 65 గదులు, సూట్‌ రూమ్‌లున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ప్యాలెస్ సూట్లు, ప్రైవేట్ పూల్ విల్లాలు, తోటలు/ టెర్రస్‌లతో కూడిన రూమ్స్‌ ఉన్నాయి. వీటిలో కోహినూర్ సూట్ అత్యంత ప్రత్యేకమైనదని కంపెనీ చెప్పింది. ప్యాలెస్ గదుల నుంచి చుట్టూ ‍ప్రదేశాల 360 డిగ్రీల వ్యూను ఆస్వాదించవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

Apple filed petition Delhi High Court challenging antitrust penalty regime3
జరిమానా నిబంధనలపై హైకోర్టులో సవాల్‌

యాపిల్ ఇంక్ తన ప్రపంచవ్యాప్త టర్నోవర్ జరిమానాలను లింక్ చేసే భారతీయ యాంటీ-ట్రస్ట్ చట్టం నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేసింది. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తుంది. ఈ రిట్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 3న విచారణ చేపట్టనుంది.ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్. భారతీయ పోటీ చట్టం (Competition Act)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలపై విధించే జరిమానాలను వారి ప్రపంచ టర్నోవర్‌తో అనుసంధానించే నిబంధనల రాజ్యాంగబద్ధతను కంపెనీ ప్రశ్నించింది.అసలు సమస్య ఏమిటి?యాపిల్ తన రిట్ పిటిషన్‌లో కాంపిటీషన్ చట్టంలోని సవరించిన సెక్షన్ 27(బి), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 2024 నాటి టర్నోవర్ నిబంధనలను ప్రధానంగా సవాల్ చేసింది. పోటీ చట్టంలో సవరించిన నిబంధనల ప్రకారం.. పెనాల్టీల సమయంలో కంపెనీ ఉత్పత్తులు, సేవల నుంచి పొందిన గ్లోబల్ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా జరిమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆదాయాన్ని లెక్కిస్తారు. దాంతో కంపెనీపై ఏదైనా జరిమానా విధించాల్సి వస్తే గ్లోబల్‌ టర్నోవర్‌ను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఇది కంపెనీకి నష్టం. యాపిల్ ఈ నిబంధనలను కొట్టివేయాలని కోరుతోంది.యాపిల్ న్యాయపరమైన సవాల్‌ 2022లో ప్రారంభమైన యాంటీట్రస్ట్ దర్యాప్తుతో ముడిపడి ఉంది. టిండర్ యజమాని మ్యాచ్ గ్రూప్, కొన్ని భారతీయ స్టార్టప్‌ల ఫిర్యాదుల మేరకు సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. థర్డ్‌ పార్టీ చెల్లింపులను పరిమితం చేస్తున్నట్లు సీసీఐ ప్రాథమికంగా కనుగొంది. ఇన్-యాప్ లావాదేవీలపై 30 శాతం వరకు అధిక కమీషన్లు తీసుకుంటున్నట్లు గమనించింది. దీని ద్వారా ఐఓఎస్ యాప్ స్టోర్‌లో యాపిల్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీసీఐకి ఆధారాలు లభించాయి.అయితే, యాపిల్ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. తాము న్యాయమైన, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఒకవేళ ఈ కేసులో సీసీఐ మరిన్ని ఆధారాలు సేకరిస్తే యాపిల్‌ జరిమానా విధించాల్సి వస్తుంది. సీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఆర్థిక సంవత్సరాల్లో దాని సగటు ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం జరిమానా విధించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 38 బిలియన్ డాలర్లగా ఉంటుందని చెబుతున్నారు.యాపిల్ సంస్థ వైఖరియాపిల్ తన పిటిషన్‌లో కొన్ని కీలక వాదనలను ముందుకు తెచ్చింది. జరిమానాలను గ్లోబల్ టర్నోవర్‌తో లింక్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నట్టేనని యాపిల్ వాదిస్తోంది. ఇది ఏకపక్షం, అసమానమైనది అని పేర్కొంది. సంస్థ మొత్తం గ్లోబల్ ఆదాయాన్ని పరిగణిస్తూ కేవలం ఒక నిర్దిష్ట మార్కెట్‌లో లేదా కొన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఉల్లంఘనకు జరిమానా విధించడం న్యాయం కాదని వివరించింది. యూకే, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ యాంటీ ట్రస్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘన జరిగిన నిర్దిష్ట భౌగోళిక మార్కెట్లో సంబంధిత టర్నోవర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయని కంపెనీ తెలిపింది.డిసెంబర్‌ 3న విచారణఇంటర్‌లిక్డ్‌ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించిన సీసీఐ ‘కాన్ఫిడెన్షియాలిటీ రింగ్’ ఉత్తర్వులోని కొన్ని అంశాలను కూడా యాపిల్ రద్దు చేయాలని కోరింది. యాపిల్ తన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో సీసీఐలో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోర్టును కోరింది. మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 3న ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టనుంది.ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

India crude oil imports from Russia surged record high in November 20254
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్‌ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్‌ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్‌ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్‌ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్‌ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్‌నెఫ్ట్‌(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

Price of luxury homes appreciates 40pc since 2022 Hyderabad Real estate5
ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?

దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్‌ ఎ‍స్టేట్‌ రీసెర్చ్‌ సంస్థ అనరాక్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్‌ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్‌లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలా..ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.

How Life Insurance Helps Women Save on Taxes6
జీవిత బీమాతో మహిళలకు పన్నుల ఆదా

జీవిత బీమాను ఒకప్పు డు పురుషులు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికిమరియు పన్ను భారం తగ్గించుకోవడానికిఉపయోగించేసాధనంగా భావించేవారు. ఇప్పు డు మహిళలు కూడా అదే ప్రయోజనాలు పొందుతూ తమ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తున్నారు.మహిళల కోసం జీవిత బీమా పన్ను ప్రయోజనాలు వారికిపన్ను కు వచ్చే ఆదాయాన్ని తగ్గించడంలో, పన్ను లేకుండా వచ్చే మొత్తాలను పొందడంలో, మరియు ఆర్థిక భదత్రను నిర్మించడంలో సహాయపడుతాయి. ఈ ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మహిళలకు సంపదను పెంచుకోవడంలో మరియు రక్షించుకోవడంలో జీవితబీమాను తెలివైన సాధనంగా మారుస్తుంది.జీవిత బీమాతో ఆదాయ పన్ను ప్రయోజనాలుజీవిత బీమా మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడమేకాదు, ఆదాయ పన్ను చట్టం పక్రారం మంచి పన్ను ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఇప్పు డు ఇవి ఏవో చూద్దాం.1. ప్రీమియంపైపన్ను తగ్గింపు (సెక్షన్ 80C)జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియంపైసెక్షన్ 80C పక్రారం పన్ను తగ్గింపు లభిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ₹1.5 లక్షల వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు . ఇదిమీకు, మీ జీవిత భాగస్వా మికిలేదా మీ పిల్లల కోసం తీసుకున్న పాలసీలకు వర్తిస్తుంది.2. పాలసీమెచ్యూ రిటీమొత్తం పన్ను నుండిమినహాయింపు (సెక్షన్ 10(10D))పాలసీమెచ్యూ రిటీసమయంలో లేదా బీమాదారుడిమరణ సమయంలో కుటుంబం పొందేమొత్తం సెక్షన్ 10(10D) ప్రకారం పూర్తిగా పన్ను రహితం. దీంతో మొత్తం మీ కుటుంబానికిఎలాంటిపన్ను భారంలేకుండా లభిస్తుంది. మహిళలు ఈ ప్రయోజనాన్ని ఉపయోగించి పన్ను రహిత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు .3. యూఎల్ఐపీలు (ULIPs) పైపన్ను ప్రయోజనాలు ULIPలకు చెల్లించిన ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద తగ్గింపుకు అర్హం. కొన్ని షరతులు నెరవేరితేమెచ్యూరిటీ మొత్తం కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితం. ULIPs బీమాతో పాటు పెట్టుబడిఅవకాశం అందిస్తాయి. అందువల్లపన్ను ఆదా చేస్తూ సంపదను పెంచుకోవచ్చు .4. పెన్షన్ లేదా అన్న్యుటీ పాలసీలపై పన్ను లాభంపెన్షన్ లేదా అన్న్యు టీఅందించే జీవిత బీమా పాలసీతీసుకుంటే, చెల్లించిన ప్రీమియం సెక్షన్ 80CCC కింద తగ్గింపునకు అర్హం. పదవీ విరమణ తర్వా త వచ్చే అన్న్యుటీపై పన్ను ఉంటుందేకానీ, పెట్టుబడికాలంలో మీరు ముందుగానే పన్ను ఆదా చేసుకోవచ్చు .పన్ను ప్రయోజనాల కోసం జీవిత బీమాను ఉపయోగించేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయంజీవిత బీమా ద్వా రా పన్ను ప్రయోజనాలు పొందేటప్పుడు ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి.● సరైన పాలసీని ఎంచుకోండి: టర్మ్ ప్లాన్, ఎండోవ్మెంట్ ప్లాన్, ULIP వంటికొన్ని పాలసీలకేపన్ను ప్రయోజనాలు ఉంటాయి. రక్షణ, పెరుగుదల మరియు పన్ను ఆదా మధ్య సరైన సమతుల్యం కలిగిన పాలసీని తీసుకోండి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్షన్ 80C కింద పూర్తిపన్ను తగ్గింపును ఇస్తుంది, ఇదిమహిళలకు మంచి ఎంపిక.● ప్రీమియం పరిమితులు మరియు సామర్థ్యాన్ని తెలుసుకోండి: సెక్షన్ 80C కింద సంవత్సరానికి₹1.5 లక్షల వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి. మీరు ప్రీమియంను ప్లాన్ చేసేటప్పు డు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. అలా చేస్తేమీరు గరిష్టపన్ను ప్రయోజనం పొందగలరు.● పన్ను రహిత చెల్లింపుల నియమాలను అర్థం చేసుకోండి: మెచ్యూ రిటీలేదా మరణ లాభాలు సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉండాలంటేపాలసీకొన్ని నిబంధనలను పాటించాలి. ఇందులో కనీస ప్రీమియం చెల్లింపులు మరియు అవసరమైన పాలసీవ్యవధిఉంటాయి.● లాక్-ఇన్ పీరియడ్ గురించి తెలుసుకోండి: కొన్ని పాలసీలకు, ముఖ్యంగా ULIPsకు, 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలానికి ముందే ఉపసంహరణ చేస్తే పన్ను ప్రయోజనాలు తగ్గవచ్చు.● రికార్డులను సరిగ్గా ఉంచండి: పన్ను తగ్గింపులు క్లెయిమ్ చేసేసమయంలో ప్రీమియం రసీదులు మరియు పాలసీపత్రాలు అవసరం అవుతాయి. అందువల్లవీటిని జాగత్ర్తగా భదప్రరచండి.మహిళలకు జీవిత బీమా రక్షణకన్నా ఎక్కు వని ఇస్తుంది. ఇదిఆర్థిక స్థిరత్వా న్ని మరియు నిజమైన పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. సెక్షన్ 80C తగ్గింపులు మరియు సెక్షన్ 10(10D) మినహాయింపులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ద్వా రా మహిళలు తమ ఆర్థిక పణ్రాళికపైస్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. సరైన నిర్ణయాలు మరియు జాగ్రత్తైన పణ్రాళికతో మహిళలు జీవిత బీమాతో ఉన్న అపోహలను తొలగించి మరింత భద్రమైన మరియు ఆర్థికంగా బలమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు.

Advertisement
Advertisement
Advertisement