Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Wipro acquires Harman digital transformation solutions unit for 375 million1
విప్రో చేతికి హర్మన్‌ డిజిటల్‌

న్యూఢిల్లీ: ఐటీ సర్విసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్స్‌(డీటీఎస్‌) బిజినెస్‌ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 3,270 కోట్లు వెచ్చించింది. 2025 ఆగస్ట్‌ 21న డీటీఎస్‌ను సొంతం చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. డీల్‌ను విజయవంతంగా ముగించడంతో తమ ఇంజినీరింగ్‌ గ్లోబల్‌ బిజినెస్‌లో విభాగంగా డీటీఎస్‌ పనిచేయనున్నట్లు విప్రో తెలియజేసింది.డీటీఎస్‌ కొనుగోలు ద్వారా అడ్వాన్స్‌ ఏఐ సామర్థ్యాలు, ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ నైపుణ్యాల పెంపుపై కంపెనీ కట్టుబాటులో మరో మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. డీటీఎస్‌లో 100 % వాటా కొనుగోలుకి విప్రో.. దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్‌కు చెందిన హర్మన్‌తో ఆగస్ట్‌లో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Stock markets fall for 3rd day2
Stock market: మూడోరోజూ డీలా

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి క్షీణత, బ్లూ చిప్‌(అధిక వెయిటేజీ) షేర్లలో షేర్లలో విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 504 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 26,032 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి.ఒక దశలో సెన్సెక్స్‌ 589 పాయింట్లు కోల్పోయి 85,053 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పతనమై 25,998 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఫైనాన్సియల్, సర్విసెస్, బ్యాంకులు, ఇండ్రస్టియల్స్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెలికం, కన్జూమర్‌ డ్యూరబుల్స్, టెక్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.49%, 0.14% నష్టపోయాయి. జపాన్‌ కీలక వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్లలో అమ్మకాలు, క్రిప్టో కరెన్సీ పతనంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.వరుస అయిదు ట్రేడింగ్‌ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ.9,642 కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం ఒక్కరోజే రూ.3,642 కోట్ల షేర్లను అమ్మేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(–1.25%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(–1.25%), ఐసీఐసీఐ బ్యాంకు(–1.25%), ఎల్‌అండ్‌టీ(–1%), యాక్సిస్‌ బ్యాంకు (–1.29%)శాతం నష్టపోయి ఇండెక్సు పతనానికి ప్రధాన కారణమయ్యాయి.

Rupee slumps 43 paise to close at all-time low of 89. 96 against US dollar3
అయ్యో... రూ‘పాయే’

న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి భారీగా షార్ట్‌ కవరింగ్, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్‌ కొనసాగడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 43 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 89.96 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు వరుస విక్రయాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 89.70 వద్ద మొదలైంది. ఒక దశలో 47 పైసలు కుప్పకూలి 90.00 స్థాయి వద్ద ఇంట్రాడే రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘సాంకేతికంగా రూపాయి 90 స్థాయిపై ముగిసినట్లయితే.., ఆ పైన స్థాయిల్లో బై–స్టాప్‌ ఆర్డర్లు మరిన్ని ఉండొచ్చు. కావున 90కి దిగువునే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాలి.లేకపోతే 91 స్థాయిని ఛేదించేందుకు మరెంతో సమయం పట్టదు. అంతంకంతా పెరుగుతున్న వాణిజ్య లోటు రూపాయిపై మరింత భారాన్ని పెంచుతోంది. అయితే డిసెంబర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చనే ఆశావహ అంచనాలతో రానున్న రోజుల్లో రూపాయి 89.60 – 90.20 శ్రేణిలో ట్రేడవ్వచ్చు’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీ, కరెన్సీ హెడ్‌ అనింద్య బెనర్జీ తెలిపారు.

Gold Rate Drops Again Within Hours4
బంగారం ధరల్లో ఇంత మార్పా!: గంటల వ్యవధిలోనే..

బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Paytm CEO Gets His Tesla Model Y Delivered5
పేటీఎం సీఈఓ కొత్త కారు: ధర ఎంతో తెలుసా?

పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ & క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్‌లో మరొకటి ప్లాన్ చేసింది.టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.

If Mukesh Ambani Spends Rs 5 Crore Every Single Day His Entire Wealth Will End 555 Years6
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు!

కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.రిలయన్స్ ఆదాయం ఇలా..1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement