Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 27 November 2025 in Telugu states1
వామ్మో వెండి హ్యాట్రిక్‌.. బంగారమే నయం కదా!

దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు కాస్త శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock Market November 27 Nifty hits record high Sensex gains2
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ ఆల్‌టైమ్‌ హిట్‌!

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ ఇండెక్స్ 26,295.55 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. 2024 సెప్టెంబర్ 27 నాటి దాని మునుపటి రికార్డు గరిష్ట స్థాయి 26,277 హిట్‌ను అధిగమించింది. కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకునేందుకు నిఫ్టీ 50 ఇండెక్స్‌కు 287 సెషన్లు పట్టింది.ఉదయం 9:41 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 189 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 85,799 వద్ద ఉంది. నిఫ్టీ 52 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 26,251 వద్ద ట్రేడవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి.సెక్టార్లలో, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగి ఎన్ఎస్ఈలో ప్రధాన లాభం పొందింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 0.35 శాతం లాభపడి రెండో స్థానంలో నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.4 శాతం పెరిగి 59,802.65 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.

Axis Mutual Fund launches micro investment feature for new investors3
రూ.100 నుంచే ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తక్కువ మొత్తంతో ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ నిర్ణయించింది. ఇందుకు వీలుగా మైక్రోసిప్‌ను ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.100 నుంచి యాక్సిస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రూ.1,000 పెట్టుబడిని పది పథకాల్లో రూ.100 చొప్పున ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా.. వాటి పనితీరును పరిశీలిస్తూ నష్టాల భయం లేకుండా మార్కెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవచ్చని పేర్కొంది.మహీంద్రా మాన్యులైఫ్‌ ఇన్‌కమ్‌ ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ ఫండ్‌ మహీంద్రా మాన్యులైఫ్‌ మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా మహీంద్రా మాన్యులైఫ్‌ ఇన్‌కం ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ యాక్టివ్‌ ఎఫ్‌వోఎఫ్‌ పేరిట ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ స్కీమును ఆవిష్కరించింది. పన్ను పరమైన ప్రయోజనాలను అందుకునేందుకు.. 24 నెలలు, అంతకుమించిన దీర్ఘకాలం పెట్టుబడులపై పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్‌ అనుకూలమని సంస్థ ప్రకటించింది.ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) నవంబర్‌ 21న ప్రారంభమై డిసెంబర్‌ 1న ముగుస్తుంది. ‘‘డెట్‌, ఆర్బిట్రేజ్‌ వ్యూహాల సామర్థ్యాలను మేళవించి అన్ని పరిస్థితులకు అనువుగా ఉండే విధంగా ఇన్‌కం ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ యాక్టివ్‌ ఎఫ్‌వోఎఫ్‌ రూపొందించాం. వడ్డీ రేట్లలో అస్థిరతలతో కూడిన అనిశి్చత మార్కెట్లలో, పన్నుల అనంతరం మెరుగైన రాబడులకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని మహీంద్రా మాన్యులైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో ఆంథోనీ హెరెడియా తెలిపారు.ఇదీ చదవండి: ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ సలహా ఇవ్వాలంటే.. రూల్స్‌ మార్చిన సెబీ

Nasscom Foundation IBM to upskill 87K youth in digital tech4
ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి..

అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్‌ తరపు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు టెక్‌ దిగ్గజం ఐబీఎం, నాస్కామ్‌ ఫౌండేషన్‌ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్‌ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణనివ్వనున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్‌ ఇచ్చి వారిలో ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించనున్నాయి.ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌ తదితర అంశాల్లో ఉచితంగా డిజిటల్‌ కోర్సులు, శిక్షణను అందిస్తారు. మెంటార్స్‌ నుంచి కూడా మద్దతు ఉంటుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలన్న ఐబీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు, భారతదేశవ్యాప్తంగా హైబ్రిడ్‌ విధానంలో అమలవుతుంది.ప్రాజెక్ట్‌ ప్రభావంఅట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందుతాయి.భారతదేశంలో డిజిటల్‌ సమానత్వం పెరుగుతుంది.ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలకు స్కిల్‌డ్‌ వర్క్‌ఫోర్స్ లభిస్తుంది.ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్‌ భవిష్యత్తుకు పునాది వేసే ప్రయత్నం.

Sebi eases educational qualification criteria for investment advisers5
ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ సలహా ఇవ్వాలంటే.. రూల్స్‌ మార్చిన సెబీ

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పెట్టుబడి సలహాదారులు(ఐఏలు), పరిశోధనా విశ్లేషకులు(ఆర్‌ఏలు)గా గుర్తింపు పొందేవారి అర్హతల నిబంధనలను సడలించింది. తద్వారా ఇందుకు రిజి్రస్టేషన్‌ చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లను అనుమతించింది. అయితే ఎన్‌ఐఎస్‌ఎం సర్టిఫికేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి నిబంధనగా చేర్చింది.దీంతో అర్హతపొందే వ్యక్తులు సంబంధిత విభాగంలో విజ్ఞానంతోపాటు వృత్తిసంబంధ అవగాహనను కలిగి ఉండే వీలు కల్పించింది. సెబీ తాజాగా జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలో నిబంధనల సవరణలను పేర్కొంది. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఫైనాన్స్‌ సంబంధ విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేయవలసి ఉంది.ఫైనాన్స్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కామర్స్, ఎకనమిక్స్, క్యాపిటల్‌ మార్కెట్లలో డిగ్రీ కలిగినవారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఏ విభాగంలోని గ్రాడ్యుయేట్లకైనా రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. అయితే ఇందుకు ఎన్‌ఎస్‌ఐఎం పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి.

Pharma industry must shift towards innovative products PHARMEXCIL6
వినూత్న ఉత్పత్తులపై ఫార్మా ఫోకస్‌ చేయాలి

ప్రపంచ ఫార్మసీగా భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టాలంటే వచ్చే అయిదేళ్లలో దేశీ ఫార్మా పరిశ్రమ క్రమంగా వినూత్నమైన, సంక్లిష్టమైన జనరిక్స్‌ తయారీ వైపు మళ్లాలని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి చెప్పారు. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, పెప్టైడ్‌లు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.అంతర్జాతీయంగా పోటీ, భౌగోళిక–రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం పేటెంట్లు ముగిసిన ఉత్పత్తులనే తయారు చేయడం కాకుండా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలవైపు మళ్లాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. జనరిక్‌ మార్కెట్‌ స్థాయిని దాటి ఇతర విభాగాల్లోనూ భారత్‌ స్థానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సీపీహెచ్‌ఐ–పీఎంఈసీ ఇండియా 18వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.అమెరికా టారిఫ్‌ల ముప్పుపై ఆందోళన నెలకొన్నప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు ఇప్పటివరకు వృద్ధి బాటలోనే ఉన్నాయని, 2.31 శాతం పెరిగాయని జోషి చెప్పారు. ఇక ఫార్మసీ బోధనాంశాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత సిలబస్‌ అనేది వాస్తవ పరిస్థితులను, నేటి ఫార్మా వ్యవస్థ అవసరాలను ప్రతిబింబించేలా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్‌ డిస్కవరీ, రీసెర్చ్‌ మెథడాలజీల నుంచి ముడి వస్తువుల సేకరణ, ఏఐ ఆధారిత ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌లాంటి అన్ని అంశాల గురించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement