Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Parliament passed SHANTI Bill 2025 Why It Matters1
పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

భారత ఇంధన రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (SHANTI) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించింది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.అడ్డంకుల తొలగింపుసైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం పాత కాలపు అణు ఇంధన చట్టం (1962), సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010)ను రద్దు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమైన అణు విద్యుత్ ఉత్పత్తి, దాని అనుబంధ కార్యకలాపాలు ఇకపై ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.నిరసన సెగమరోవైపు, ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, ఇంజినీర్ల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటీకరణ వల్ల అణు భద్రత, జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమన్వయంతో డిసెంబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.అభ్యంతరం ఎందుకంటే..రియాక్టర్ సరఫరాదారులను (Supplier Liability) సైతం రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. పరికరాల లోపాల వల్ల ప్రమాదం జరిగితే తయారీదారులను కాపాడి ఆ భారాన్ని ప్రభుత్వం, ప్రజలపై వేసేలా ఈ నిబంధన ఉందని ఏఐపీఈఎఫ్‌ చైర్మన్ శైలేంద్ర దూబే విమర్శించారు.ప్రధాన డిమాండ్లుప్రభుత్వం వెంటనే ‘శాంతి’ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వెళ్లాలనుకుంటే కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు.సప్లయర్‌ లయబిలిటీ నిబంధనలను పునరుద్ధరించాలి.స్వతంత్ర అణు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.పర్యావరణ, కార్మిక రక్షణలను పటిష్టం చేయాలి.విదేశీ భాగస్వామ్యంపై పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలి.భారతదేశం తన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులు, నిపుణులు మాత్రం తగిన చర్చ లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 23న జరగబోయే నిరసనలు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: టోకనైజేషన్‌ బిల్లు కోసం పార్లమెంట్‌లో డిమాండ్‌

Bharti Airtel appointed Shashwat Sharma as new MD and CEO2
భారతీ ఎయిర్‌టెల్‌కు నూతన సారథి

దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మేనేజ్‌మెంట్ నిర్మాణంలో కీలక మార్పులను ప్రకటించింది. సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా శశ్వత్ శర్మ నియమితులయ్యారు. ఈ మార్పులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.ప్రస్తుతం ఎయిర్‌టెల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశ్వత్ శర్మ ఐదేళ్ల పాటు ఈ ఉన్నత పదవిని చేపట్టనున్నారు. హెచ్ఆర్, నామినేషన్ కమిటీ సిఫార్సుల మేరకు డిసెంబర్ 18న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శశ్వత్ శర్మ ఇకపై సంస్థ కీలక నిర్వాహక సిబ్బంది(KMP)గా కూడా వ్యవహరిస్తారు.గోపాల్ విట్టల్‌కు పదోన్నతిప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న గోపాల్ విట్టల్ ఇకపై ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జనవరి 1, 2026 నుంచి ఆయన ఐదేళ్ల పాటు పూర్తికాల డైరెక్టర్‌గా కొనసాగుతారు. సంస్థ వ్యూహాత్మక అభివృద్ధిలో ఆయన తన మార్గదర్శకత్వాన్ని కొనసాగించనున్నారు.ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

MP urged govt introduce Tokenization Bill in Parliament check details3
టోకనైజేషన్‌ బిల్లు కోసం పార్లమెంట్‌లో డిమాండ్‌

ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్‌లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.టోకనైజేషన్ అంటే ఏమిటి?సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్‌డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.విదేశీ మూలధనంసింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్‌లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మధ్యతరగతికి మేలుమధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.ప్రయోజనాలుసాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్‌చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

update on Maitri 2 India next generation Antarctic research station4
అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం

మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.మైత్రి-11981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్‌లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.మైత్రి-1 సాధించిన విజయాలుగత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.ప్రస్తుత స్థితి.. సవాళ్లుకేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

NHAI installed QR code boards but users have criticized check details5
ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.ఎన్‌హెచ్‌ఏఐ ఏం చెబుతోంది?బెంగళూరులోని ఎన్‌హెచ్‌-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్‌హెచ్‌-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.పారదర్శకత ఎక్కడ?క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్‌హెచ్‌ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.To enhance transparency and improve ease of travel for National Highway users, NHAI is installing QR code-based information boards on key National Highway corridors in #Bengaluru. These QR boards are currently available on Bengaluru–Nelamangala section of NH-48 and… pic.twitter.com/jzgAfGQwnj— NHAI (@NHAI_Official) December 15, 2025ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలుక్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.‘ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్‌లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం!

AI helps common man in rural areas by improving many ways check list6
సామాన్యుడి చేతిలో సమస్తం!

ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్‌’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్‌బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్‌లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్‌బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్‌లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు

Advertisement
Advertisement
Advertisement