Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 21 November 2025 in Telugu states1
బంగారం ధరలు రివర్స్‌.. వెండి భారీ క్రాష్

దేశంలో బంగారం ధరలు రివర్స్‌ అయ్యాయి. పసిడి ధరలు చెన్నైలో మాత్రం దిగువకు రాగా మిగిలిన ప్రాంతాల్లో మళ్లీ ఎగువకు వచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on November 21st 20252
వరుస లాభాలకు బ్రేక్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు సెషన్ల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 26,145కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 85,518 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 21-11-2025(time:9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Yann LeCun Meta Chief AI Scientist departure from Meta to launch startup3
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్

ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్‌ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్‌ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్‌బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్‌గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్‌బుక్) వ్యవస్థాపక డైరెక్టర్‌గా చేరారు.లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్‌కు రిపోర్ట్‌ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్‌కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్‌లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ ఏఐ రీసెర్చ్‌(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్‌డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

how many Ways LIC Earns Money check list4
జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం

భారతదేశంలో కోట్లాది మంది కుటుంబాలకు జీవిత బీమా (Life Insurance) అంటే గుర్తుకొచ్చే పేరు ఎల్‌ఐసీ (LIC). పాలసీదారులకు రక్షణ కల్పించడం, వారి జీవితాలకు భద్రతనివ్వడం ఎల్‌ఐసీ ప్రధాన విధి అయినప్పటికీ కేవలం పాలసీ ప్రీమియంల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటిగా నిలవలేదు. ఎల్‌ఐసీ భారీగా సంపదను పోగుచేయడానికి, ప్రభుత్వానికి సైతం ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి ఉపయోగించే అసలైన వ్యాపార రహస్యం ఏమిటో చూద్దాం.ఎల్‌ఐసీకి వచ్చే ఆదాయం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది.పాలసీ ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం.. ఇది బీమా పాలసీలను విక్రయించడం ద్వారా సంస్థకు లభించే ప్రాథమిక ఆదాయ వనరు.పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం.. ఇదే ఎల్‌ఐసీకి అత్యధిక లాభాన్ని, ఆర్థిక శక్తిని అందించే కీలకమైన వ్యాపారం. పాలసీదారుల నుంచి సేకరించిన నిధులను (పాలసీ మెచ్యూరిటీ చెల్లింపుల కోసం ఉంచాల్సినవి) సంస్థ వివిధ లాభదాయక మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది.స్టాక్ మార్కెట్‌ఎల్‌ఐసీ భారతీయ స్టాక్ మార్కెట్‌లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఎల్‌ఐసీ వద్ద ఉన్న భారీ నిధుల్లో చాలా వరకు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడుతుంది. ప్రైవేట్‌ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మూలధనాన్ని అందిస్తూ ఆయా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేస్తుంది. కంపెనీలు లాభాలు ఆర్జించినప్పుడు ఎల్‌ఐసీకి డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుంది. కంపెనీల షేర్ ధరలు పెరిగినప్పుడు ఎల్‌ఐసీకి ఆయా షేర్లను విక్రయించడం ద్వారా భారీగా పెట్టుబడి లాభాలు లభిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ మార్గం అత్యంత లాభదాయకంగా మారుతుంది.ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లుఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిబంధనల ప్రకారం, ఎల్‌ఐసీ తన నిధుల్లో ఎక్కువ భాగాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లు అతిపెద్ద మార్గంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్రవ్య అవసరాల కోసం జారీ చేసే బాండ్లు, ట్రెజరీ బిల్లులను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తుంది. ఈ పెట్టుబడులు దాదాపు రిస్క్ రహితమైనవి. వీటిపై నిర్ణీత కాల వ్యవధిలో స్థిరమైన, కచ్చితమైన వడ్డీ ఆదాయం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక స్థిరమైన నిధిని అందిస్తుంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యంఎల్‌ఐసీ భారీ మొత్తంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడి పెడుతుంది. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, సామాజిక రంగ పథకాలకు ఎల్‌ఐసీ రుణాలను అందిస్తుంది. కొన్నిసార్లు వాటి బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే రుణ వడ్డీ ఎల్‌ఐసీకి స్థిరమైన, సుదీర్ఘ కాల ఆదాయ వనరుగా పనిచేస్తుంది.రియల్ ఎస్టేట్ఎల్‌ఐసీకి దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు, కార్యాలయ భవనాలు, నివాస సముదాయాలు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా కాలక్రమేణా ఆస్తుల విలువ పెరిగినప్పుడు వాటిని విక్రయించడం ద్వారా సంస్థ ఆదాయాన్ని ఆర్జిస్తుంది.అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదల ద్వారా ఎల్‌ఐసీ తన బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసుకుంటుంది.ఫండ్ మేనేజ్‌మెంట్ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ మేనేజర్‌ల్లో ఒకటిగా ఉంది. కోట్లాది మంది పాలసీదారుల నుంచి సేకరించబడిన వేల కోట్ల రూపాయల నిధులను సురక్షితంగా, లాభదాయకంగా నిర్వహించడం ఎల్‌ఐసీ ప్రధాన వ్యాపారం. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని కాలక్రమేణా అధిక రాబడిని పొందే సామర్థ్యం ఎల్‌ఐసీ సొంతం.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..

Indian banks will feature in the top 100 global banks list says RBI Governor 5
గ్లోబల్‌ టాప్‌ 100లో...  మరిన్ని భారతీయ బ్యాంకులు 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్‌ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్‌ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి. వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్‌ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (73వ ర్యాంకు) మాత్రమే టాప్‌ 100 బ్యాంకుల్లో ఉన్నాయి. దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్‌ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్‌ హంటర్‌ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్‌ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు. మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్‌ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) మ్యూల్‌హంటర్‌డాట్‌ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్‌ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. మనం చేయాల్సింది చేయాలి.. అంతే.. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్‌ టెక్‌ దిగ్గజం, దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్‌ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు. అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం.. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్‌ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్‌ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్‌బీఐ టార్గెట్‌ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్‌ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్‌ పెరిగితే డాలర్లకు డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్‌ అకౌంట్‌పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

India core infrastructure sector posted zero growth in October 20256
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌ 

న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్‌లో ఫ్లాట్‌గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్‌లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్‌ ఉత్పత్తి 6.7%, సిమెంట్‌ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్‌ కార్యకలాపాలపై, విద్యుత్‌ డిమాండ్‌పై అక్టోబర్‌లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్‌ పనితీరు నేపథ్యంలో అక్టోబర్‌ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.

Advertisement
Advertisement
Advertisement