ప్రధాన వార్తలు
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో కొనుగోళ్ల మధ్య బెంచ్ మార్క్ సూచీలు 0.1 శాతం పైగా పెరిగాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 127 పాయింట్ల లాభంతో 85,359 వద్ద ట్రేడ్ కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 26,107 వద్ద ట్రేడవుతోంది.అయితే, విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకీ, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఎటర్నల్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, బీఈఎల్, టాటా మోటార్స్ పీవీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్ నష్టాలలో పయనిస్తున్నాయి.నేటి కీలక ఐపీవో అప్ డేట్స్ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్కేటాయింపు తేదీ: నవంబర్ 24జాబితా తేదీ: నవంబర్ 26, 2025ఇష్యూ పరిమాణం: రూ.500 కోట్లు (రూ. 180 కోట్ల తాజా ఇష్యూ + 2.66 కోట్ల షేర్ల OFS)ప్రైస్ బ్యాండ్: ఒక్కో షేరుకు రూ.114– 120లాట్ పరిమాణం: 125 షేర్లు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
న్యూ ఫండ్ ఆఫర్: కొత్త మ్యూచువల్ ఫండ్స్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్ ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్వోఎఫ్ మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్వోఎఫ్ స్వరూపం ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్వోఎఫ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది.
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది..
గడిచిన వారమంతా బుల్ పరుగులే. నిఫ్టీ ఏకంగా 1.64 శాతం పెరగగా సెన్సెక్స్ 1.39 శాతం పెరిగింది. మరి ఈ వారం ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? వాస్తవానికి మార్కెట్లు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలకు దగ్గర్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది.అమెరికాతో వాణిజ్య చర్చలు కొన్నాళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ వారంలో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. డీల్ మాత్రం కుదరటం లేదు. కుదిరినా అది మన వ్యవసాయ రక్షణలకు ప్రతికూలంగా నిలుస్తుందా? అలాంటి ఆందోళనలేవీ అవసరం లేని స్థాయిలో ఉంటుందా? అనేది తెలియదు. దీనికితోడు నవంబరు నెల ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ కూడా ఉంది. ఎక్స్పైరీ రోజుల్లో... అంటే మంగళవారం, గురువారం మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులు చూసే అవకాశముంది. ప్రతికూల, అనుకూల అంశాలివీ...దేశీయంగా...ఈ ఏడాది (2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు 28న వెలువడతాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో దేశ ఆరి్థక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఇది గత ఐదు త్రైమాసికాలలోనే అత్యధికం. ఈ సారి గణాంకాలు ఎలా ఉంటాయో చూడాలి.అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు కూడా 28నే వెల్లడవుతాయి. సెపె్టంబర్లో ఐఐపీ 4% ఎగసింది. ఈసారీ ఆ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి.విదేశీ అంశాలుకొద్ది రోజులుగా ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాకపోతే దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేస్తుండటంతో మార్కెట్లు పెద్దగా పడటం లేదు. యూఎస్ మార్కెట్ల తీరు, అమెరికా, చైనా డేటాను గమనించాల్సి ఉంటుంది.గత వారం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే సరికొత్త ఆల్టైమ్ కనిష్టానికి (89.66) పతనమైంది. ఇది ప్రతికూలమే. ఈ వారం పతనం కొనసాగుతుందా? లేదా? చూడాలి...గమనించాల్సిన ప్రధాన షేర్లు...హెచ్డీఎఫ్సీడిపాజిట్లలో వృద్ధి వివరాలు వెల్లడవుతాయి. మార్జిన్లపై కంపెనీ వెల్లడించే వివరాలు అనుకూల ప్రభావాన్ని చూపించొచ్చు. లిక్విడిటీ బలహీనంగా ఉండటం... కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వంటివి ప్రతికూలాంశాలు.జేఎస్డబ్ల్యూ స్టీల్...ఎగుమతులకు డిమాండ్ బాగుండి, స్టీల్ ధరలు పెరిగితే అది ఈ షేరుకు సానుకూలం.స్టీల్ ధరలు పతనమై.. చైనా నుంచి డిమాండ్ బలహీనపడితే అది షేరుకు ప్రతికూలంటీసీఎస్రూపాయి ధర స్థిరంగా ఉండి, అమెరికా టెక్నాలజీ కంపెనీల ఫలితాలు బాగుంటే అది షేరుకు సానుకూలం.అంతర్జాతీయ టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటిస్తే అది ప్రతికూలం.హెచ్ఏఎల్రక్షణ శాఖ నుంచి, ఎగుమతుల కోసం ఆర్డర్లు వచ్చే చాన్సుంది. విదేశీ భాగస్వామ్యాలపై కొత్త సమాచారం వెలువడితే అది సానుకూలం.ప్రాజెక్టులను పూర్తి చేయటంలో, పేమెంట్లలో జాప్యం వార్తలు ప్రతికూలమనే చెప్పాలి. సాంకేతికంగా.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీకి 26,200 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయి దాటితే 26,350 వద్ద తదుపరి అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. నిఫ్టీ బలహీనపడితే 25,900 పాయింట్ల వద్ద తొలి సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 25,850 పాయింట్ల వద్ద కొనుగోళ్ల మద్దతుకు వీలుంది.
ఇల్లా.. స్థలమా.. !
ఫ్లాటా... ప్లాటా? ఇల్లా... స్థలమా? కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే... లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండాల్సిందే... అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం కొందామనుకున్నది బాగా పెరిగి... కొన్నది అంతగా పెరగనప్పుడు!!. మరి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఏది కొంటే బెటర్? దీనిపై అవగాహన కోసమే ఈ కథనం.. – సాక్షి, వెల్త్ డెస్క్నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది కూడా. అనరాక్లాంటి మార్కెట్ వర్గాల గణాంకాలను బట్టి అయిదారేళ్ల క్రితం హైదరాబాద్లోని కోకాపేట్లో ఫ్లాట్ల రేటు చ.అ.కు సగటున రూ.4,750గా ఉండగా గతేడాది ప్రథమార్ధంలో రెట్టింపై ఏకంగా రూ.9,000కు ఎగిసింది. మరికొన్ని మార్కెట్ వర్గాల ప్రకారం ఇదే వ్యవధిలో విశాఖపట్నంలోని మధురవాడలో రూ. 3,800–4,300గా ఉన్న ధర రూ. 5,2,00–6,200 స్థాయికి చేరింది. అదే మధురవాడ ప్రాంతంలో స్థలాల రేట్లు 2019లో దాదాపుగా గజం 40వేల వరకూ ఉండి... గతేడాది రూ.75000 దాటేశాయి. ఇక హైదరాబాద్లో ఇదే కాలంలో చూస్తే ఫ్లాట్ల ధరలు రెట్టింపయ్యాయేమో కానీ... స్థలాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పెరిగాయి. ఈ లెక్కన చూసినపుడు రెండూ పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి స్థలాలు ఇంకాస్త ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఎంచుకోవటం ఎలా? అవసరానికే పెద్ద పీట... స్థలమైనా, ఫ్లాటైనా... మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే తరువాత రేట్లు పెరగకపోయినా, పెరిగినా పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కొత్త ప్రాజెక్టులొస్తూ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి అక్కడ డిమాండ్ పెరగటం, దానికి తగ్గట్లే రేటూ పెరగటం సహజం. స్థలం ఉంటే అవకాశాలెక్కువ. ఇక ఫ్లాట్ల విషయానికొస్తే అపార్ట్మెంట్ పరిమాణం పరిమితం. పైపెచ్చు పాతబడిపోతూ ఉంటుంది. పెచ్చులూడిపోవడం, పెయింట్లు వెలిసిపోవడం, పైపులు లీక్ కావడం, కామన్ ఏరియాలు పాడైపోవడంలాంటి సవాళ్లుంటాయి. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా, స్థలం మాదిరిగా ఫ్లాట్ విలువ పెరగదు. కాబట్టి ఇన్వెస్టరు కోణంలో ఆలోచించే ఎవరికైనా ఫ్లాట్ కన్నా స్థలం అర్ధవంతంగా ఉంటుంది. స్థలం కొనుక్కుని కాస్త 5–10 ఏళ్లు ఆగితే దాని విలువ రెండు రెట్లు, మూడు రెట్లు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్థలంపై చేసే ఇన్వెస్ట్మెంట్ను సరైన పెట్టుబడిగా చెబుతారు.స్థలం కొనేముందు జాగ్రత్తలెన్నో.... సాధారణంగా ఫ్లాట్లనేవి కొన్ని సందర్భాలు మినహా చాలా మటుకు చట్టపరమైన అన్ని అనుమతులతో లభిస్తాయి. అదే పేరున్న బిల్డర్ దగ్గర్నుంచి కొంటున్నారంటే లీగల్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే, రెరా రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టి ఫికెట్ వంటివి తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా... ఓవరాల్గా రిస్కు తక్కువే ఉంటుంది. స్థలం విషయానికొచ్చే సరికి మాత్రం చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. టైటిల్ ఓనర్íÙప్ ఎవరి పేరిట ఉంది? రెసిడెన్షియలా లేక వ్యవసాయ భూమా? కన్వర్షన్ పరిస్థితి ఏంటి? లీగల్ వివాదాలేవైనా ఉన్నాయా? లే అవుట్కి ఆ ప్రాంత డెవలప్మెంట్ అథారిటినీ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయా? ఇలాంటి విషయాలెన్నీ నిశితంగా చూసి తీరాలి. వీటిల్లో ఏ చిన్న తేడా జరిగినా, మీరు కొనుక్కున్న స్థలాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు. లేదా అది పూర్తిగా చేయి జారిపోనూ వచ్చు. కాబట్టి, స్థలంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయినప్పటికీ పేపర్వర్క్ 100 శాతం కరెక్ట్గా ఉన్నప్పుడే మంచిదవుతుంది. ఇక మెయింటెనెన్స్ విషయంలో ఫ్లాట్తో పోలిస్తే ప్లాట్దే పైచేయి. ఫ్లాట్ కొంటే మనం ఉన్నా... అద్దెకు ఇచ్చినా ప్రతి నెలా లిఫ్టులు, సెక్యూరిటీ, క్లీనింగ్ ఇలాంటివాటన్నింటికీ సంబంధించి మెయింటెనెన్స్ బిల్లు భారం ఉంటుంది. స్విమ్మింగ్ పూళ్లు.. జిమ్ములు గట్రా మీరు వాడకపోయినా కచి్చతంగా కట్టాల్సిందే. అదే స్థలం విషయానికొస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ తప్ప ప్రతి నెలా కచి్చతంగా ఇంత చెల్లించాలనే బాదరబందీ ఉండదు. ఒకవేళ అందులో మీరు కట్టుకున్న నిర్మాణాన్ని బట్టి ఏవైనా మెయింటెనెన్స్ ఉండొచ్చు. ఫ్లాట్లకు రుణాలు సులభం .. స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80–90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60–70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిరీ్ణత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచి్చనప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.ఫ్లాట్ కొనటం, అమ్మటం కాస్త ఈజీ నివసించడం కోసమైతే ఫ్లాట్లను కొనుక్కోవడం సరైన నిర్ణయమని చెప్పాలి. కొనటం కూడా చాలా సులువు. కొనుక్కుని, పేపర్వర్క్ పూర్తి చేసి, షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఒకవేళ నిర్మాణ దశలో ఉన్నదైతే, ఎప్పటికల్లా పూర్తవుతుందనేది ముందే తెలుస్తుంది. అదే స్థలం విషయానికొస్తే కేవలం ప్లాట్ చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని, అందులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అంతా సవ్యంగా సాగి, ఎలాంటి జాప్యాలు జరగకుండా ఉంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి, సత్వరం నివసించేందుకు ఇల్లు కావాలంటే ఫ్లాట్ను ఎంచుకోవచ్చు. అదే కొ న్నాళ్ల తరవాత మారాలనుకుంటే ప్లాట్ ఎంచుకోవచ్చు.
కొనకుండానే..షి‘ కారు’!
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్ డెస్క్ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్పేమెంట్ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్?→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్ సంస్థ నెలరోజుల సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్తో ఈఎంఐ లీజింగ్నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్ → 15–20 శాతం డౌన్పేమెంట్తో పాటు బీమా, ఆన్రోడ్ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్షిప్→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్ లీజింగ్→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్కు → సానుకూలాంశాలు: డౌన్పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్ టు ఓన్ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్ సబ్స్క్రిప్షన్ → దీన్లోనూ డౌన్పేమెంట్ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్తో మైల్స్, రెవ్, క్విక్లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్సైజ్ ఎస్యూవీలకు నెలకు రూ.30వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్స్క్రిప్షన్... → మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్టాప్లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు. డౌన్పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్తో దీర్ఘకాల కమిట్మెంట్లు ఉండవు. సబ్స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్. – ఎడిటర్
బైకర్ల కోసం ఎయిర్బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్సైకిల్పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
కార్పొరేట్
కొనకుండానే..షి‘ కారు’!
యాక్సిస్ బ్యాంక్ శాలరీ ప్రోగ్రాం: వారికోసమే..
తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్
ప్రముఖ సంస్థలతో చేతులు కలిపిన హైదరాబాద్ కంపెనీలు
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
డార్క్ ప్యాటర్న్స్పై 26 సంస్థల సెల్ఫ్ డిక్లరేషన్
బిట్కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటన
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)...
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం, వెండి రేట్లు..
దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. రెండ...
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమ...
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటాని...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్ కోడ్
ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్ కోడ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లేబర్ కోడ్లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్కోడ్ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.అంతేకాకుండా నైట్ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను ప్రకటించింది.ఇది చదివారా?: కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు
ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్ ఎక్స్9 సిరీస్
ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్9 సిరీస్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వేరియంట్ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.హాసెల్బ్లాడ్తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్ టీడబ్ల్యూఎస్ ఎన్కో బడ్స్3 ప్రోప్లస్ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది.హాసెల్బ్లాడ్తో భాగస్వామ్యంఫైండ్ ఎక్స్9 సిరీస్లో ప్రధాన ఆకర్షణ హాసెల్బ్లాడ్తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ కూడా పరిచయమైంది.మెరుగైన బ్యాటరీ, పనితీరుఫైండ్ ఎక్స్9 సిరీస్ స్మార్ట్ఫోన్లలో బలమైన ప్రాసెసర్, ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీటాస్కింగ్ సామర్థ్యం, హై–ఎండ్ గేమింగ్కు సరిపడే పనితీరు ఈ డివైస్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
పాకిస్థాన్ వ్యవస్థలకు డిజిటల్ షాక్!
సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్ సైబర్ ఫోర్స్’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్పోర్ట్ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్పోర్ట్ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై రాన్సమ్వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్లను ఎన్క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
ఆధార్ డేటాపై హాట్మెయిల్ కోఫౌండర్ సంచలన ఆరోపణలు
భారత పౌరుల ఆధార్ డేటా భద్రతపై హాట్ మెయిల్ కోఫౌండర్ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.‘మొత్తం ఆధార్ డేటాబేస్ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్లో పేర్కొన్నారు.భారత ఆధార్ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.సబీర్ భాటియా ఆధార్ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్ డిజైన్, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్ నిర్మాణానికి 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ ఆథెంటికేషన్ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు. There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…— Sabeer Bhatia (@sabeer) November 19, 2025
పర్సనల్ ఫైనాన్స్
ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..
కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రవేశపెట్టింది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం.. అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న 29 కార్మిక చట్టాలను ప్రభుత్వం నాలుగు సరళీకృత లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది.కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, విస్తృత సామాజిక భద్రతా కవరేజ్, మెరుగైన ఆరోగ్య రక్షణ అందించడమే ఈ మార్పుల లక్ష్యం. ఈ సంస్కరణలు అనధికారిక కార్మికులు, గిగ్ , ప్లాట్ఫామ్ వర్కర్లు, వలస కార్మికులు, మహిళా ఉద్యోగులు వంటి విభిన్న వర్గాలకు వర్తిస్తాయి.గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పుపేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం.. ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రాట్యుటీకి అర్హుడు. అయితే, కొత్త లేబర్ కోడ్ల అమలుతో నిర్ణీత కాలానికి అంటే రెండేళ్లకో.. మూడేళ్లకో ఒప్పందంపై చేరే ఉద్యోగులు (ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ (FTEs) కూడా ఇప్పుడు ఏడాది సర్వీస్ అనంతరం గ్రాట్యుటీకి అర్హత పొందుతారు.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మార్పు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులతో సమాన హోదాలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే జీతాలు, సెలవు సదుపాయాలు, వైద్య ప్రయోజనాలు, సామాజిక భద్రతా పరిరక్షణలు పొందుతారు.గ్రాట్యుటీ అంటే..గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలిక సేవకు గుర్తింపుగా కంపెనీల యాజమాన్యాలు చెల్లించే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా, ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు లేదా అర్హతగల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసినప్పుడు ఈ మొత్తం చెల్లిస్తారు.లెక్కిస్తారిలా..ఉద్యోగికి చెల్లించే గ్రాట్యుటీ మొత్తం ఈ ఫార్ములాతో లెక్కిస్తారు. గ్రాట్యుటీ = (చివరిగా అందుకున్న వేతనం) × (15/26) × (సర్వీస్ కాలం సంవత్సరాల్లో)ఇక్కడ చివరిసారిగా అందుకున్న వేతనం అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపి తీసుకోవాలి.ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు పనిచేసి చివరిగా బేసిక్, డీఏ కలిపి రూ.50 వేలు అందుకున్నారనుకుంటే.. గ్రాట్యుటీ రూపంలో సదరు ఉద్యోగి అందే మొత్తం రూ.1,44,230 అవుతుంది.
ట్రేడింగ్లో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు ఆర్బీఐ హెచ్చరిక
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ కొత్తగా అలర్ట్ లిస్ట్లో 7 ప్లాట్ఫామ్స్ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్నెట్ ఎఫ్ఎక్స్, క్యాప్ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్, ట్రైవ్, ఎన్ఎక్స్జీ మార్కెట్స్, నార్డ్ ఎఫ్ఎక్స్ చేరాయి.విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్ఫామ్స్, వెబ్సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాయని తెలియజేసింది.
నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా
సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.11-12-20 ఫార్ములాఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్తో రూ. కోటి పొందవచ్చు.20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం


