ప్రధాన వార్తలు
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్
శ్రేయి గ్రూప్ మాజీ ప్రమోటర్లు రూ. 2,434 కోట్ల రుణాలకు సంబంధించి మోసానికి పాల్పడినట్లు రిజర్వ్ బ్యాంక్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తెలియజేసింది. శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ (ఎస్ఈఎఫ్ఎల్), శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (ఎస్ఐఎఫ్ఎల్) ప్రమోటర్లు వరుసగా రూ. 1,241 కోట్లు, రూ. 1,193 కోట్ల మేర మోసగించినట్లు పేర్కొంది.ఇప్పటికే ఈ మొత్తానికి 100 శాతం ప్రొవిజనింగ్ చేసినట్లు వివరించింది. ఆర్థిక అవకతవకల ఆరోపణలతో కోల్కతాకి చెందిన కనోడియాల సారథ్యంలోని ఎస్ఐఎఫ్ఎల్, దాని అనుబంధ సంస్థ ఎస్ఈఎఫ్ ఎల్ బోర్డులను 2021లో ఆర్బీఐ రద్దు చేసి, దివాలా చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ. 32,700 కోట్ల పైచిలుకు రుణాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఈ రెండు సంస్థలను ఆ తర్వాత వేలంలో ఎన్ఏఆర్సీఎల్ దక్కించుకుంది.ఈ వ్యవహారంలో ప్రమోటర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. రుణాల మంజూరు సమయంలో నిధుల వినియోగంలో అక్రమాలు, అనుబంధ సంస్థలకు నిధుల మళ్లింపు, ఆస్తుల విలువను ఎక్కువగా చూపడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మోసంగా గుర్తించిన ఖాతాల వివరాలను పీఎన్బీ ఇప్పటికే సంబంధిత దర్యాప్తు సంస్థలకు పంపినట్లు తెలుస్తోంది. అవసరమైతే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల ద్వారా మరింత విచారణ జరిపే అవకాశముందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.ఇక బ్యాంకింగ్ రంగంపై ఈ ఫ్రాడ్ ప్రభావం పెద్దగా ఉండదని పీఎన్బీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే 100 శాతం ప్రొవిజనింగ్ చేసిన నేపథ్యంలో బ్యాంక్ లాభనష్టాలపై అదనపు భారం పడదని పేర్కొన్నాయి. మరోవైపు, ఎన్ఏఆర్సీఎల్ ద్వారా రికవరీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీలు) పర్యవేక్షణను ఆర్బీఐ మరింత కఠినతరం చేసే అవకాశముంది.
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది.
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్
అగర్బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్సైకిళ్ల గురించి తెలుసుకుందాం.హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్బాక్స్తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ & స్లిప్పర్ క్లచ్తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్లో అపాచీ ఆర్టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్ఫామ్పై నిర్మించిన ఈ మోటార్సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్పిఎమ్ వద్ద 46.4 హెచ్పి & 5,650 ఆర్పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్ఎ గోల్డ్స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్పి & 43.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది.
కార్పొరేట్
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్
ప్రాంతీయ భాషలే ప్లస్
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
రూ.26 లక్షల ఆఫర్.. మేనేజర్ వల్ల బంగారంలాంటి ఛాన్స్ మిస్!
ముంబయిలో రెండో ఎయిర్పోర్ట్.. కార్యకలాపాలు షురూ!
వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!
‘కొత్త ఏడాదిలో భారత్ను వదిలి వెళ్తున్నా!’
పెట్రోల్ బంకులు @ 1,00,000
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
అమెజాన్ ఐఎక్స్డీ ప్రోగ్రాంలో నిహార్ ఇన్ఫో
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వ...
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ ...
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
దేశంలో బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగ...
లిస్టింగ్పై 3 కంపెనీల కన్ను
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆ...
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల...
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్కు ప్రేరణనివ్వడం ద్వార...
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధర...
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి.
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది.
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.


