ప్రధాన వార్తలు
బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!
దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బంగారం ధరలు24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్ 28 నాటికి రూ.1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.వెండి ధరలుగత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.పెరుగుదలకు కారణాలివే..అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలుసేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారుఎంసీఎక్స్/కామెక్స్ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.
‘ప్రైవేట్ అప్పు’ ప్రమాదకరం: సెబీ మాజీ చీఫ్
ప్రయివేట్ క్రెడిట్ వృద్ధి చెందడంపట్ల సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రయివేట్ క్రెడిట్ అందిస్తున్న సంస్థలు కొన్ని కారణాలరీత్యా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని వ్యక్తులకు ఫైనాన్స్ సమకూర్చుతుంటాయని తెలియజేశారు.ఇదేవిధంగా బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హతలేని మరికొంతమందికి సైతం రుణ సౌకర్యాలు కల్పిస్తుంటాయని పేర్కొన్నారు. దీంతో త్వరితగతిన, అధిక రిటర్నులకు వీలున్నట్లు తెలియజేశారు. అయితే ప్రత్యామ్నాయ రంగం(ప్రయివేట్ క్రెడిట్) విస్తరిస్తుండటంపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా నియంత్రణ సంస్థలకు సూచించారు. ఈ రంగం భారీగా విస్తరిస్తే వ్యవస్థాగత రిస్కులు పెరుగుతాయని తెలియజేశారు.వెరసి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ఒకస్థాయికి మించి ఈ రంగం వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్పై పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో సిన్హా ప్రసంగించారు. స్టార్టప్ వ్యవస్థ వృద్ధికి వీలుగా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కు మరింత మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా సిన్హా తెలియజేశారు.
బొగ్గు బ్లాక్ల వేలంలో టాప్.. యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్
దేశీయంగా బొగ్గు గ్యాసిఫికేషన్ను, స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తిని పెంచే దిశగా నిర్వహించిన బొగ్గు బ్లాక్ల వేలంలో యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలు టాప్ బిడ్డర్లుగా నిల్చాయి. హైదరాబాద్కి చెందిన పునరుత్పాదక విద్యుత్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా, వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా 17 బ్లాక్లకు బిడ్ చేసినట్లు సాంకేతిక బిడ్స్ను తెరిచిన మీదట వెల్లడైంది.ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ బ్లాక్లు ఉన్నాయి. ఇతరత్రా బిడ్డర్లలో పెన్నా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఒరిస్సాలో ఒక బ్లాక్కి, ఎన్ఆర్ఎస్కే మైన్స్ అండ్ మినరల్స్, క్యాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ చెరి రెండు బ్లాక్లకు బిడ్ చేశాయి. సింగరేణి కాలరీస్–తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్, సాయి సూర్యా ప్రొఫెషనల్ సరీ్వసెస్, ఎంఎంపీఎల్ కమర్షియల్ మైన్స్, మోహిత్ మినరల్స్ మొదలైనవి బిడ్డింగ్లో పాల్గొన్నాయి. బొగ్గును ఉద్గారాలు తక్కువగా ఉండే సింథసిస్ గ్యాస్ (సిన్గ్యాస్) ఇంధనం రూపంలోకి మార్చడాన్ని కోల్ గ్యాసిఫికేషన్గా వ్యవహరిస్తారు. పర్యావరణహిత సిన్గ్యాస్, హైడ్రోజన్, మిథనాల్లాంటివి దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వాయువు, ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తలపెట్టింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలని నిర్దేశించుకుంది.ఇందులో భాగంగా అక్టోబర్లో నిర్వహించిన 14వ విడత వేలం కోసం 41 గనులను ఎంపిక చేసింది. వీటిలో 24 బ్లాక్లకు 49 బిడ్లు వచ్చాయి. రెండు, అంతకు మించిన సంఖ్యలో బిడ్డర్లు ఉన్న బ్లాక్ల బిడ్లను మాత్రమే తెరిచారు. యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్ లాంటి దిగ్గజాలు ఇందులో పాల్గొడమనేది కోల్ గ్యాసిఫికేషన్ పాలసీపై ప్రైవేట్ రంగానికి గల నమ్మకానికి నిదర్శనమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
6 నెలల్లో రూ. 660 కోట్లు కాపాడింది..
ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాంలో 1,000కి పైగా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్లు, పేమెంట్ టెక్నాలజీ సంస్థలు చేరినట్లు టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. అవి అమలు చేస్తున్న ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లతో (ఎఫ్ఆర్ఐ) బ్యాంకింగ్ వ్యవస్థలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 660 కోట్ల ఆర్థిక నష్టాలను నివారించడం సాధ్యపడిందని పేర్కొంది.ఎఫ్ఆర్ఐ అమలుపై అవగాహన పెంచేందుకు సంబంధిత వర్గాల కోసం ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు 16 సెషన్లను నిర్వహించినట్లు డాట్ తెలిపింది. దేశీయంగా సైబర్నేరాల తీరుతెన్నులు నాటకీయంగా మారిపోయాయని పేర్కొంది. మోసగాళ్లు చట్టబద్ధమైన టెలికం మార్గాల కళ్లు గప్పి, డిజిటల్ అరెస్ట్ స్కామ్ల్లాంటి అధునాతన నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది.ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సంచార్ సాథీ ప్లాట్ఫాం ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం తోడ్పడుతోందని డాట్ తెలిపింది. ఈ పోర్టల్, మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
నగరాల్లో రిటైల్ స్పేస్కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లోని షాపింగ్ మాల్స్లో రిటైల్ దుకాణ వసతులకు, ప్రధాన వీధుల్లోని రిటైల్ వసతులకు డిమాండ్ పెరుగుతున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది డిమాండ్ 15 శాతం పెరిగి 9 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) లీజింగ్ చేరుకోవచ్చని అంచనా వెల్లడించింది. రిటైలర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సరఫరా పెరగనున్నట్టు తెలిపింది. 2024లో ఇవే నగరాల్లో రిటైల్ వసతుల లీజింగ్ 7.8 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్తోపాటు చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల డేటా ఇందులో ఉంది. ప్రముఖ ప్రాంతాల్లో ఇలా.. టాప్–8 నగరాల్లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో (హై స్ట్రీట్ లొకేషన్లు) ఈ ఏడాది రిటైల్ వసతుల లీజింగ్ 5.4 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండొచ్చన్నది కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అంచనా. 2024లో ఇది 5.3 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. ఇక షాపింగ్ మాల్స్లోని రిటైల్ దుకాణాల లీజంగ్ పరిమాణం 3.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చని తెలిపింది. 2023లో ఇది 2.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. 2020లో కరోనా విపత్తు అనంతరం ఒక ఏడాదిలో రిటైల్ వసతుల అధిక లీజింగ్ ఈ ఏడాదే నమోదు కానున్నట్టు, క్యూ4లో (అక్టోబర్–డిసెంబర్) కొత్త మాల్స్ అందుబాటులోకి రానున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈడీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. వచ్చే ఏడాది కూడా రిటైల్ వసతుల సరఫరా (కొత్తవి ప్రారంభం) మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కస్టమర్లు భౌతికంగా చూసి, కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ప్రీమియమైజేషన్కు అనుగుణంగా రిటైల్ వసతుల విస్తరణ చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్త గ్రేడ్–ఏ మాల్స్ పూర్తి 0.9 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితం కావొచ్చని, 2025లో కొత్త డెలివరీలు 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండొచ్చని ఈ నివేదిక వెల్లడించింది. మారుతున్న జీవనశైలులు, వినియోగదారుల ప్రాధాన్యతలతో రిటైల్ వసతులకు డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు భారతి రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో ఎస్కే సన్యాల్ తెలిపారు. పట్టణాల్లో అనుసంధానత రిటైల్ వసతుల డిమాండ్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.
ఎకానమీకి దేశీ డిమాండ్ దన్ను
ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది. స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది. పటిష్టంగా దేశీ డిమాండ్ దేశీయంగా బలమైన డిమాండ్ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది. 2025 ఏప్రిల్–అక్టోబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు తెలిపింది. భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అక్టోబర్లో 11.87 బిలియన్ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది.
కార్పొరేట్
‘ప్రైవేట్ అప్పు’ ప్రమాదకరం: సెబీ మాజీ చీఫ్
బొగ్గు బ్లాక్ల వేలంలో టాప్.. యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్
నగరాల్లో రిటైల్ స్పేస్కు డిమాండ్
కొత్త ఏడాదిలో.. ఫిన్టెక్ ఐపీవోల జోరు
క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?
ఇండిగోకు మరో నోటీసు.. భారీ జరిమానా
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్
ప్రాంతీయ భాషలే ప్లస్
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరిక...
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు. వరుసగ...
26,000 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో...
2025లో అహో 2026లో ఒహో
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత...
రూ.10 నోట్లకు గుడ్బై..!
సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న...
చెక్ పవర్ తగ్గిందా?
రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్య...
పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!
తెలంగాణ పల్లెల్లో మళ్లీ కొత్త పాలన మొదలైంది. ఊరూరా...
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా?
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్క్రాఫ్ట్తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి.
పర్సనల్ ఫైనాన్స్
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.


