Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

100X multibagger Abhishek Bachchan investment portfolio1
వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే, తెర వెనుక ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. తాజా అంచనాల ప్రకారం, క్రీడా ఫ్రాంఛైజీల యాజమాన్యం నుంచి గ్లోబల్ బ్రాండ్‌ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల వరకు విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం నికర విలువ సుమారు రూ.280 కోట్లుగా ఉంది. హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అమితాబ్ బచ్చన్ నేతృత్వంలోని బచ్చన్ కుటుంబం మొత్తం విలువ రూ.1,630 కోట్లుగా ఉంది.జైపూర్ పింక్ పాంథర్స్ (JPP)అభిషేక్ బచ్చన్ 2014లో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్ పాంథర్స్ (జేపీపీ) జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 100 రెట్లు పెరిగిందని తానే స్వయంగా వెల్లడించారు. పీకేఎల్ ప్రారంభ సంవత్సరం (2014)లోనే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఈ జట్టు రెండో సీజన్ నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారింది. పీకేఎల్ సీజన్-12 ఆక్షన్‌లో జేపీపీ రైడర్ నితిన్ కుమార్ ధంఖర్‌ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది.ఫుట్‌బాల్.. చెన్నైయిన్ ఎఫ్‌సీ (CFC)కబడ్డీతో పాటు అభిషేక్‌కు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తితో 2014లో ఎంఎస్ ధోనీతో కలిసి చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఐఎస్‌ఎల్) సహ-యాజమానిగా మారారు. 2025-26 సీజన్‌లో కూడా జట్టు పోటీ పడుతోంది. ఇటీవల అక్టోబరు 2025లో జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్‌ సూపర్ కప్‌లో క్లిఫర్డ్ మిరాండా నేతృత్వంలో పాల్గొంది.రియల్ ఎస్టేట్, స్టార్టప్ పెట్టుబడులుఅభిషేక్ బచ్చన్ తన పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆహార బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు. 2020 నుంచి 2024 మధ్య బచ్చన్ కుటుంబం భారతదేశవ్యాప్తంగా రూ.220 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసింది. 2024లో ముంబైలోని ఒబెరాయ్ రియల్టీస్ ఎటర్నియాలో రూ.24.95 కోట్లకు 10 అపార్ట్‌మెంట్లను (అభిషేక్ 6, అమితాబ్ 4), బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రూ.15.42 కోట్లకు 6 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు.2015లో సింగపూర్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ ‘జిడ్డు’లో చేసిన రూ.2 కోట్ల పెట్టుబడి 2017లో లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు సమయంలో బిట్‌కాయిన్ పెరుగుదల వల్ల రూ.112 కోట్ల భారీ లాభాన్ని ఇచ్చింది. ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు ఆమోదించిన వహ్దామ్‌ టీ లేబుల్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. జెప్టో, జీక్యూ‌ఐ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడి పెట్టారు.నిర్మాతగా..అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని ఏబీ కార్ప్ (AB Corp)లో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పా (2009), షమితాబ్ (2015), ఘూమర్ (2023) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. పా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Apple added five devices to its obsolete products list check details2
యాపిల్‌ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..

టెక్ దిగ్గజం యాపిల్‌ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్‌డేట్‌ చేసింది. ఐదు యాపిల్‌ ఉత్పత్తులకు అధికారిక హార్డ్‌వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్‌డేట్‌ చేసిన జాబితాలో కింది ఉ‍త్పత్తులు ఉన్నాయి.ఐఫోన్ SE (మొదటి తరం)12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్ఏడేళ్ల గడువు పూర్తియాపిల్‌ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్‌, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్‌వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్‌ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.వినియోగదారులకు సవాలుయాపిల్‌ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్‌గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్‌వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్‌ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అ‍మ్మాడు.. కానీ..

roadside stone into functional artistic clock selling it for Rs 50003
రాయికి రంగేసి రూ.5 వేలకు అ‍మ్మాడు.. కానీ..

నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన ఓ వీడియా వైరల్‌గా మారింది.రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji)మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్‌తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Satya Nadella says rare quality need to succeed at work know the details4
ఏఐ యుగంలో కావాల్సింది అదే..

కృత్రిమ మేధ(ఏఐ) చాలా సాంకేతిక పనులను నిర్వహిస్తున్నందున ఉద్యోగ ప్రపంచంలో భావోద్వేగ మేధ(EQ), ట్రేడిషనల్‌ ఇంటెలిజెన్స్‌(సాంప్రదాయ మేధ IQ) కీలకమవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అదే సమయంలో భావోద్వేగ మేధ లేకుండా సాంప్రదాయ మేధపై మాత్రమే ఆధారపడలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవల యాక్సెల్ స్ప్రింగర్ సీఈఓ మాథియాస్ డాఫ్నర్‌తో జరిగిన ‘ఎండీ మీట్స్’ పోడ్‌కాస్ట్‌లో నాదెళ్ల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.‘నాయకులకు కేవలం ఈక్యూ లేకుండా ఐక్యూ ఉంటే సరిపోదు. సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ కావాల్సిందే. ఏఐ సాంకేతిక పనులను ఎక్కువగా నిర్వహిస్తున్న తరుణంలో సాఫ్ట్‌ స్కిల్స్‌ కీలకంగా మారాయి. ఇది వ్యాపారంలో ముఖ్యమైన నైపుణ్యంగా, ఒక సూపర్‌ పవర్‌గా మారుతోంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి’ అని చెప్పారు.ఏఐ రేసులో మెరుగైన పోటీ కోసం నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఇటీవల అనేక కీలక మార్పులు చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో విజయం సాధించడానికి ఇటీవల క్లౌడ్‌ ఎక్స్‌పర్ట్‌ రోల్ఫ్ హార్మ్స్‌ను ఏఐ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా నియమించారు. అక్టోబర్ 2025లో మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిజినెస్ సీఈఓని నియమించి తాను పూర్తిగా ఏఐ టెక్నికల్ అంశాలపై దృష్టి పెడుతున్నారు. కంపెనీ తమ కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్‌తో ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(AGI) వైపు పయనిస్తోంది.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

why Anil Ambani approached Supreme Court challenging Bombay High Court order5
‘ఫ్రాడ్‌’ ట్యాగ్‌.. హైకోర్టు తీర్పుపై సవాల్

రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) ఛైర్మన్ అనిల్ అంబానీ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వ్యక్తిగత ఖాతాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’ వర్గీకరించిన నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అప్పీల్ గత వారం చివరిలో దాఖలు చేయబడినప్పటికీ కేసు ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌పై బ్యాంకులు, దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.కేసు వివరాలుఎస్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో ఆర్‌కామ్‌ లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’ గుర్తించింది. రుణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అయితే దీనిపై అనిల్‌ అంబానీ స్పందిస్తూ, ఎస్‌బీఐ సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, విచారణ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషన్‌లో తెలిపారు.బాంబే హైకోర్టు తీర్పుఅక్టోబర్ 3, 2025న బాంబే హైకోర్టులోని జస్టిస్‌ రేవతీ మోహిటే డేరే, నీలా గోఖలేల డివిజన్ బెంచ్ అంబానీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఎస్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాస్టర్ డైరెక్షన్స్‌ను పాటించిందని, అంబానీ కంపెనీ ప్రమోటర్‌గా, కంట్రోలింగ్ పర్సన్‌గా ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఇతర బ్యాంకులుఎస్‌బీఐతో పాటు ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఆర్‌కామ్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’గా వర్గీకరించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025లో రూ.400 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.దర్యాప్తు సంస్థల దూకుడుఎస్‌బీఐ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 21, 2025న కేసు నమోదు చేసి రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆర్‌కామ్, అంబానీ నివాసం సహా పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 2025లో ప్రివెన్షన్‌ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. నవంబర్ 2025లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) కూడా నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాలపై విచారణ ప్రారంభించింది.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Jeetu Patel Cisco CPO works 18 hour day rules to protect work life balance6
‘నా కూతురు ఎప్పుడైనా అనుమతి లేకుండా రావొచ్చు’

టాప్‌ టెక్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో పని చేస్తున్న వ్యక్తి నిత్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మరెన్నో సమావేశాల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. చాలా మంది ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితానికి చాలా తక్కువ సమయం గడుపుతూ, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కానీ టెక్ దిగ్గజం సిస్కో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ జీవితం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు.పనిలో విశ్రాంతి లేకపోయినా తన కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పారు. తన సమావేశంలో ఎప్పుడైనా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. అందరూ కుటుంబ బంధానికి అత్యంత విలువ ఇవ్వాలని పేర్కొన్నారు.ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం, పటేల్ రోజువారీ కార్యకలాపాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉంటాయి. ఈ కఠినమైన పని విధానంలో ఆయన ఒక స్మార్ట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు ముందు సీఈఓ లేదా బోర్డు సమావేశాలు తప్పా మరే ఇతర మీటింగ్‌లకు అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆయన పనిలో విభిన్నంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఆలోచిస్తానని, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఉపయోగిస్తానని చెప్పారు. తర్వాత క్షణం తీరిక లేకుండా రోజువారీ కార్యకలాపాలుంటాయని చెప్పారు.ఈ బిజీ షెడ్యూల్‌లో మొదటి నియమం.. తన కూతురికి సంబంధించింది. అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా సరే ‘నా కుమార్తె ఏ సమావేశానికైనా వచ్చి నన్ను ఏదైనా అడగవచ్చు. తలుపు తట్టాల్సిన అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. ఇది ఒక వ్యక్తిగత అనుభవం నుంచి పుట్టింది. 2023లో తన తల్లి చివరి రోజుల్లో పటేల్ కార్పొరేట్‌ బాధ్యతల నుంచి ఎనిమిది వారాల పాటు దాదాపు పూర్తిగా దూరంగా ఉండి ఆసుపత్రిలో ఆమెతో గడిపారు. ఈ క్షణాలు ఆయనకు ఒక చేదు సత్యాన్ని నేర్పాయని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ సమతుల్యంగా ఉండదు. చాలాసార్లు కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది. మీ కోసం పనిచేసే వ్యవస్థను మీరే రూపొందించుకోవాలి, మరెవరూ ఈ పని చేయరు’ అని చెప్పారు.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Advertisement
Advertisement
Advertisement