ప్రధాన వార్తలు
అగర్బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్సైకిళ్ల గురించి తెలుసుకుందాం.హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్బాక్స్తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ & స్లిప్పర్ క్లచ్తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్లో అపాచీ ఆర్టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్ఫామ్పై నిర్మించిన ఈ మోటార్సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్పిఎమ్ వద్ద 46.4 హెచ్పి & 5,650 ఆర్పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్ఎ గోల్డ్స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్పి & 43.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది.
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
గ్లోబల్ టెక్ రంగంలో అత్యంత ధనవంతులైన భారతీయ సంతతికి చెందినవారు ఎవరనే ప్రశ్నకు.. చాలామంది సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లు చెబుతారు. అయితే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. అత్యంత ధనవంతులైన భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్ ఆర్టిస్టా నెట్వర్క్స్ సీఈఓ & చైర్పర్సన్ జయశ్రీ ఉల్లాల్ అని తెలిసింది.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్లలో అగ్రస్థానంలో నిలిచిన జయశ్రీ ఉల్లాల్ నికర విలువ రూ.50,170 కోట్లు. కాగా.. సత్య నాదెళ్ల రూ. 9,770 కోట్ల నికర విలువతో రెండవ స్థానంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 5,810 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, పెప్సికో మాజీ చీఫ్ ఇంద్రా నూయి, అడోబ్ శాంతను నారాయణ్, బెర్క్షైర్ హాత్వే అజిత్ జైన్ వంటి వారు ఉన్నారు.2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వంజయశ్రీ ఉల్లాల్ అమెరికాకు చెందిన కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ & సీఈఓ. ఈమె క్లౌడ్ అండ్ డేటా సెంటర్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించారు. 2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వం వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు.అరిస్టా నెట్వర్క్స్ విలువ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. 2024లోనే ఈ సంస్థ దాదాపు 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ అని ఫోర్బ్స్ తెలిపింది. అరిస్టా స్టాక్లో ఉల్లాల్ దాదాపు 3 శాతం వాటాను కలిగి ఉన్నారు, ఇది ఆమె వ్యక్తిగత సంపదలో అతిపెద్ద భాగం అనే చెప్పాలి.1961లో జననం1961 మార్చి 27న లండన్లో భారతీయ సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె.. ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కానీ చిన్నప్పుడు న్యూఢిల్లీలో పెరిగి అక్కడే జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత చదువంతా అమెరికాలోనే సాగింది. అక్కడ ఆమె శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. ఆ తరువాత శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.చదువు పూర్తయిన తరువాత.. ఉల్లాల్ సెమీకండక్టర్ విభాగంలో తన కెరీర్ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఫెయిర్చైల్డ్ సెమీకండక్టర్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్లో పనిచేశారు. అక్కడ ఐబీఎం, హిటాచీ వంటి కంపెనీల కోసం హై-స్పీడ్ మెమరీ చిప్లను రూపొందించారు. 1980ల చివరలో.. 1990ల ప్రారంభంలో, ఆమె నెట్వర్కింగ్లోకి అడుగుపెట్టి, ఉంగర్మాన్-బాస్లో.. ఆ తరువాత క్రెసెండో కమ్యూనికేషన్స్లో చేరారు. క్రెసెండోలో చేరిన ప్రారంభ రోజుల్లో ఈమె ఈథర్నెట్ స్విచింగ్ టెక్నాలజీలపై పనిచేశారు.సిస్కోలో ఉల్లాల్1993లో సిస్కో సిస్టమ్స్ క్రెసెండో కమ్యూనికేషన్స్ను కొనుగోలు చేసినప్పుడు జయశ్రీ ఉల్లాల్ కెరీర్లో పెద్ద మలుపు తిరిగింది. ఆ కొనుగోలు ఉల్లాల్ను సిస్కోలోకి తీసుకువచ్చింది. ఇక్కడే 15 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేశారు. కాలక్రమేణా.. ఆమె సిస్కో డేటా సెంటర్కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు.2008లో అరిస్టా నెట్వర్క్స్ వ్యవస్థాపకులు ఆండీ బెచ్టోల్షీమ్ & డేవిడ్ చెరిటన్ ఆమెకు కంపెనీ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆమె నాయకత్వంలో, అరిస్టా సిలికాన్ వ్యాలీ యొక్క అత్యంత విజయవంతమైన నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటిగా మారింది. 2014లో, ఆమె కంపెనీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్కు తీసుకెళ్లింది. దీంతో ఫోర్బ్స్ ఆమెను నెట్వర్కింగ్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఆమె బారన్ ప్రపంచంలోని ఉత్తమ సీఈఓల జాబితాలో.. ఫార్చ్యూన్ టాప్ గ్లోబల్ బిజినెస్ లీడర్స్ జాబితాలో కూడా చోటు సంపాదించింది.
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
కవాసకి ఇండియా ఇటీవలే 2026 వెర్షన్ నింజా 650ను లాంచ్ చేసింది. ఇప్పుడు బ్రాండ్ తన 'వెర్సిస్ 650' అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లో రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు ప్రవేశపెట్టింది. ధర మునుపటి మోడల్ కంటే రూ. 15,000 ఎక్కువ.కంపెనీ లాంచ్ చేసిన.. లేటెస్ట్ వెర్సిస్ 650 బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. ఎటువంటి యాంత్రిక మార్పులు పొందలేదు. కాబట్టి అదే 649 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ 8,500 ఆర్పిఎమ్ వద్ద 67 హెచ్పి పవర్.. 7,000 ఆర్పిఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి, ఉత్తమ పనితీరును అందిస్తుంది.కవాసకి వెర్సిస్ 650 కొత్త పెయింట్ స్కీమ్ను పొందుతుంది. ఇది మెటాలిక్ స్పార్క్ బ్లాక్తో కూడిన మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, డార్క్ షేడ్. ఈ వెర్షన్ ప్రస్తుతం 2025 వెర్షన్తో పాటు అమ్మకానికి ఉంది. ఈ లేటెస్ట్ బైక్.. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది. కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, ఎకనామిక్ రైడింగ్ ఇండికేటర్, ఫోర్ వే అడ్జస్టబుల్ విండ్స్క్రీన్, ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
కార్పొరేట్
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
రూ.26 లక్షల ఆఫర్.. మేనేజర్ వల్ల బంగారంలాంటి ఛాన్స్ మిస్!
ముంబయిలో రెండో ఎయిర్పోర్ట్.. కార్యకలాపాలు షురూ!
వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!
‘కొత్త ఏడాదిలో భారత్ను వదిలి వెళ్తున్నా!’
పెట్రోల్ బంకులు @ 1,00,000
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
అమెజాన్ ఐఎక్స్డీ ప్రోగ్రాంలో నిహార్ ఇన్ఫో
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
ఈ బ్యాంకుకు 115 ఏళ్లు..
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వ...
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ ...
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
దేశంలో బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగ...
లిస్టింగ్పై 3 కంపెనీల కన్ను
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆ...
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల...
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్కు ప్రేరణనివ్వడం ద్వార...
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధర...
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది.
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్బోర్డ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్బోర్డ్కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్బోర్డ్లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది.
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
పర్సనల్ ఫైనాన్స్
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.


