Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Microsoft to Intel, the bold bet on India technology ecosystem1
టెక్‌ దిగ్గజాల పెట్టుబడులజోరు.. 

సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ నుంచి ఇంటెల్‌ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్‌ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం. భారత్‌ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్‌ దిగ్గజం ఇంటెల్‌ కూడా భారత్‌ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్‌–బు టాన్‌ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్‌ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్‌ నుంచి 80 బిలియన్‌ డాలర్ల ఈ–కామర్స్‌ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్‌ దిగ్గజం గూగుల్‌ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఓపెన్‌ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్‌ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్‌ ఏఐ, డేటా సెంటర్‌ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్‌ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్‌ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Yuvraj Singh cofounded FINO Tequila launches in India2
భారతదేశంలో ‘ఫినో’ టెకిలా ఆవిష్కరణ

క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్‌ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్‌ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్‌కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్‌లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

IndiGo announced all 65000 employees mobilised to restore operations3
65,000 మంది ఉద్యోగుల సహకారం!

దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ​క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలుఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్‌లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లో కోతలు పెట్టింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

Gautam Adani met Satya Nadella demoed AI applications4
భారత్ ఏఐ భవిష్యత్తుకు 360 డిగ్రీల భాగస్వామ్యం

మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 17.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించిన తరువాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ తన ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ‘సత్య నాదెళ్లను కలవడం, సాంకేతికత భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన భావాలను పొందడం ఎప్పుడూ ఆనందకరం. ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ ప్రపంచాలు కలుస్తున్నందున మైక్రోసాఫ్ట్‌తో మా 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని అదానీ పేర్కొన్నారు. నాదెళ్ల స్వయంగా నిర్మిస్తున్న ఏఐ యాప్‌ల డెమోను చూడటం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.భారత్ గ్లోబల్ టెక్ లీడర్‌గా..అదానీ గ్రూప్ ఎనర్జీ, పోర్ట్‌లు వంటి భౌతిక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మైక్రోసాఫ్ట్ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలతో జతకట్టడం భారతదేశం సాంకేతిక లక్ష్యాలకు కీలకమౌతుంది. అదానీ-నాదెళ్ల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వృద్ధికి (అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణలో సహకారం ఉంది) మరింత ఊతమిస్తుంది. భారత్‌లో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో దేశ డేటా సెంటర్ మార్కెట్ వేగంగా విస్తరించనుంది. ఈ పరిణామం మేక్ ఇన్ ఇండియా, వికసిత్‌ భారత్ 2047 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.Always a pleasure to meet @satyanadella and gain his valuable insights into the future of technology. We are excited to continue building a 360° partnership as the physical and digital worlds converge in the age of AI. Getting a demo from him of the AI apps he is personally… pic.twitter.com/T70YTbjTbT— Gautam Adani (@gautam_adani) December 10, 2025ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

IIT Bombay launched deep tech venture capital fund know the details5
దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం

దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌’గా పిలువబడే ఈ ఫండ్‌ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌లకు క్యాపిటల్‌ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నిర్వహించే మొదటి అకడమిక్‌-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సేవలు అందిస్తున్న ఎస్‌‌ఐఎన్‌ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.విస్తృత రంగాలకు మద్దతురొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్‌ ఎన్విరాన్‌మెంట్‌, టెక్ ల్యాబ్‌లు, వ్యవస్థాపక నెట్‌వర్క్‌ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్‌లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

microsoft partnered with Indian govt to deploy AI chatbots eShram NCS6
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్‌) పోర్టల్‌ల్లో అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్‌ పోర్టల్స్‌లో ఏఐ చాట్‌బాట్‌లుఇండియా ‘ఏఐ-ఫస్ట్‌ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్‌సీఎస్‌లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్‌బాట్‌లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్‌ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్‌ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు

Advertisement
Advertisement
Advertisement