Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Awareness Campaign Launched By Herbalife India Against Counterfeit Products1
నకిలీ ఉత్పత్తులపై అవగాహన: హెర్బలైఫ్ ఇండియా సరికొత్త కార్యక్రమం

నేటి కాలంలో ఆరోగ్యం, పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల వల్ల పెరుగుతున్న ముప్పు.. ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్‌నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం-వెల్‌నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు. కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా.. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య; దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్‌నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించి హెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్‌నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ.. వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి: www.herbalife.com/en-in

Meesho Founder Vidit Aatrey Becomes Billionaire Know The Details2
ఐఐటీ చదివి.. మీషో: బిలినీయర్ జాబితాలోకి విదిత్ ఆత్రే

ఈ-కామర్స్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మీషో లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదిత్ ఆత్రే(34) నికర విలువ మంగళవారం ఒక బిలియన్ డాలర్‌ మార్కును అధిగమించి.. బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. మీషో షేర్లు ఒక్కసారిగా 13% పెరగడంతో అతని నికర విలువ రూ.9,142.87 కోట్లకు చేరుకుంది. ఐఐటీ ఢిల్లీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఐటీసీ, ఇన్‌మోబీ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన విదిత్ ఆత్రే.. మీషోకు సారథ్యం వహిస్తూ భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు స్ఫూర్తినిస్తున్నారు.1991లో జన్మించిన విదిత్ ఆత్రే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 2012లో బీటెక్‌ పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ఢిల్లీలో చదవడం ఆయనకు బలమైన సాంకేతిక పునాదిని అందించింది. గ్రాడ్యుయేషన్ తరువాత ఆత్రే తన కెరీర్‌ను ఐటీసీ లిమిటెడ్‌లో ప్రారంభించారు. ఆయన జూన్ 2012 నుంచి మే 2014 వరకు చెన్నైలో ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో పనిచేశారు. ఆ తరువాత మొబైల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌మోబీ(InMobi) సంస్థలో జూన్ 2014 నుంచి జూన్ 2015 మధ్య బెంగుళూరులో పనిచేశారు.మీషో స్థాపనవృత్తిపరమైన అనుభవాన్ని మూటగట్టుకున్న తర్వాత ఆత్రే పారిశ్రామికవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2015 నుంచి ఆయన మీషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) నాయకత్వం వహిస్తున్నారు. మీషోను స్థాపించడంలో, దానిని విజయవంతమైన ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన దూరదృష్టితో భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా జీరో-కమీషన్ మోడల్‌తో విక్రేతలకు, చిరు వ్యాపారులకు ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చారు. తన నాయకత్వంలో మీషో వేగంగా ఎదిగింది. దీని ఫలితంగా ఆత్రే ఫోర్బ్స్ 30 అండర్ 30 (ఆసియా & ఇండియా, 2018), ఫార్చ్యూన్ 40 అండర్ 40 (2021) వంటి ప్రతిష్టాత్మక యువ నాయకత్వ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు.మీషో డిసెంబర్ 10న స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసి తన ఇష్యూ ధరకు ప్రీమియం వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజున రూ.111 ఐపీఓ ధర కంటే 53% ఎక్కువగా ముగించింది. మంగళవారం, స్టాక్ అసాధారణ ర్యాలీని కొనసాగించి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.193.50 కి చేరుకుంది.విదిత్ ఆత్రే నికర విలువమీషోలో విదిత్ ఆత్రేకు 11.1 శాతం వాటా ఉంది. షేరు ధర రూ.193.50 ఇంట్రాడే గరిష్టానికి చేరుకోవడంతో ఆయన వాటా విలువ రూ.9,142.87 కోట్లుగా ఉంది. అంటే సుమారు 1.005 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ బర్న్వాల్ 31.6 కోట్ల షేర్లతో రూ.6,114.6 కోట్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు. మీషో మార్కెట్ క్యాపిటలైజేషన్ పూర్తి ప్రాతిపదికన రూ.85,207.91 కోట్లుగా ఉంది.

PF ATM UPI Withdrawal New Time Says Minister Mansukh Mandaviya3
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా.. కొత్త డెడ్‌లైన్‌

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా స్పందించారు.2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్‌డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ​​ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.

Elon Musk Net Worth Tops 600 Billion Dollars4
భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్‌వర్త్‌ ఎంతంటే?

టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.స్పేస్‌ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది.

India Rise to the World 5th Largest Economy Uneven Gains for Common Investor5
ఐదో స్థానానికి ఎగబాకిన భారత్.. ఎవరి ఆదాయాలు ఎలా?

భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అందరికీ గర్వకారణం. కేవలం 15 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని తొమ్మిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. సేవల రంగంలో గణనీయమైన వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం పెరగడం, జీఎస్టీ, డిజిటలైజేషన్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం.. వంటి కీలకమైన సంస్కరణలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. దాంతోపాటు బలమైన స్థూల ఆర్థిక స్థిరత్వం, అధిక మూలధన వ్యయం ఇందుకు ఎంతో తోడ్పడ్డాయి. అయితే భారత్‌ దశాబ్ద కాలంలో ఏమేరకు వృద్ధి చెందిందో అదే రీతిలో ప్రజల ఆదాయాలు పెరిగాయా అంటే లేదనే చెప్పాలి. ఏయే విభాగాల్లో పెట్టుబడి పెట్టినవారి ఆదాయాలు ఎంతమేరకు వృద్ధి చెందాయో కింద చూద్దాం.ఉద్యోగాలు పెరిగినా..భారతదేశ వృద్ధి పథంలో భాగంగా ఉద్యోగ కల్పన దశాబ్ద కాలంలో మెరుగ్గానే ఉంది. గడిచిన పదేళ్లలో దాదాపు 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2004-2014 కాలంతో పోలిస్తే ఉద్యోగ కల్పనలో తయారీ రంగం వాటా మెరుగుపడగా సర్వీసులు, నిర్మాణ రంగాల్లో అధిక కొలువులొచ్చాయి. అయినప్పటికీ జీవన నాణ్యత సంక్లిష్టంగా ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాల్లో(ఫ్రొఫెషనల్‌ ఉద్యోగాలు) వేతన పెరుగుదల జీడీపీ విస్తరణ కంటే తక్కువగా ఉంది. కొత్తగా ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించిన వారిలో ఎక్కువ భాగం అనధికారిక లేదా గిగ్ (Gig) వర్క్‌లో చేరుతున్నారు. భారతదేశం ఏటా వృద్ధి నమోదు చేస్తున్నట్లుగా ఉద్యోగులు వేతనాలు, వారి ఆదాయాలు వృద్ధి చెందడం లేదు.పెట్టుబడిదారులకు లాభాలుభారతదేశ వృద్ధి దశలో ఇటీవలి కాలంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు లబ్ధిదారులుగా ఉన్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌) ఇన్వెస్టర్ల పొదుపును అమాంతం పెంచేశాయి. సెప్టెంబర్ 2025 నాటికి వివిధ ఈక్విటీల్లో సిప్‌ల కింద ఉన్న ఆస్తులు సుమారు రూ.15.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 10 కోట్లకు పైగా సిప్‌ ఖాతాల ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు రూ.20,000 కోట్లకు పైగా నిధులను ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు.గత ఐదేళ్లలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సుమారు 170-200 శాతం రాబడిని అందించాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 300-380 శాతం వరకు పెరిగాయి. 2010 ప్రారంభంలో సిప్‌లను ప్రారంభించిన పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు రెట్టింపు అయ్యాయి. ఇది ఆర్థికంగా చాలా కుటుంబాలకు సాధికారత కల్పించింది.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లునగరాల్లోని చాలా మంది పొదుపుదారులకు స్టాక్ మార్కెట్‌లోని రాబడులు తమ జీతం పెరుగుదలను అధిగమించాయి. ‍ప్రధానంగా ఎస్ఐపీ ద్వారా సృష్టించిన సంపద వార్షిక వేతన పెంపు కంటే ఎక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా సాంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టినవారికి ఎక్కువగా రాబడులు లేవు. పెద్దగా ఆదరణలేని ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటిలో ఆశించిన రాబడి రాలేదు. ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసరాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది.మీరు నిజంగా ధనవంతులా?భారతదేశం ఆర్థికంగా వేగంగా దూసుకుపోతోంది. అధిక జీడీపీ ర్యాంక్, మెరుగైన మూలధన మార్కెట్లు, బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు దీనికి నిదర్శనం. అయితే, ‘మీరు ధనవంతులా?’ అనే ప్రశ్నకు సమాధానం అసమానంగా ఉంటుంది. స్థిరమైన సిప్‌ పెట్టుబడిదారులు, ఐటీ, ఫైనాన్స్, న్యూఏజ్‌(కొత్తగా, వేగంగా విస్తరిస్తున్న రంగాలు) సర్వీసులు వంటి అధిక వృద్ధి రంగాల్లో నిపుణుల నికర విలువలో అభివృద్ధి కనిపిస్తోంది. అయితే స్థిరమైన వేతనం లేనివారు, ఈక్విటీలో పెట్టుబడులు లేని సాధారణ జీతం పొందే సిబ్బంది ఈ సంపద సృష్టి నుంచి దూరంగా ఉన్నారు.భారతదేశం ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక దేశాల్లో ఐదో స్థానానికి ఎగబాకడం సంతోషకరమైన అంశమే. అయితే ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. దేశ వృద్ధికి అనుగుణంగా అన్ని రంగాల్లోని ప్రజల ఆదాయాలు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాలు అందరికీ అందేలా ప్రభుత్వం, వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ విజయాన్ని ‘ఇండియా గ్రోత్ స్టోరీ’గా మార్చాలంటే, వేతన వృద్ధి, ఉద్యోగ నాణ్యతను మెరుగుపరచడం తదుపరి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యం కావాలి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..

Pathways for Salaried Professionals to Earn Crores full details6
ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..

ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.మ్యూచువల్ ఫండ్స్ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్‌ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్‌ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఈక్విటీ ఫండ్స్దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్‌తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.డెట్ ఫండ్స్ఇవి బాండ్‌లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.ఈక్విటీ, స్టాక్ మార్కెట్పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్‌పై, కంపెనీల ఫండమెంటల్స్‌పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్‌ కంటే అధిక రిస్క్‌తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.రియల్ ఎస్టేట్భౌతిక ఆస్తులుఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.రీట్స్‌(Real Estate Investment Trusts)రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్‌ అనేవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్‌తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.చిన్న వ్యాపారాలుపెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్‌తో కూడుకుంది.ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలుపీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.ఎన్‌పీఎస్‌: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్‌లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్‌గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్‌ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్‌ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement