Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market November 24 Sensex Nifty1
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో కొనుగోళ్ల మధ్య బెంచ్ మార్క్ సూచీలు 0.1 శాతం పైగా పెరిగాయి. ఉదయం 9.26 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 127 పాయింట్ల లాభంతో 85,359 వద్ద ట్రేడ్ కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 26,107 వద్ద ట్రేడవుతోంది.అయితే, విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం క్షీణించింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకీ, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సెన్సెక్స్ లో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎటర్నల్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, బీఈఎల్, టాటా మోటార్స్ పీవీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్ నష్టాలలో పయనిస్తున్నాయి.నేటి కీలక ఐపీవో అప్ డేట్స్ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్కేటాయింపు తేదీ: నవంబర్ 24జాబితా తేదీ: నవంబర్ 26, 2025ఇష్యూ పరిమాణం: రూ.500 కోట్లు (రూ. 180 కోట్ల తాజా ఇష్యూ + 2.66 కోట్ల షేర్ల OFS)ప్రైస్ బ్యాండ్: ఒక్కో షేరుకు రూ.114– 120లాట్ పరిమాణం: 125 షేర్లు (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Mutual Funds NFO alerts2
న్యూ ఫండ్‌ ఆఫర్‌: కొత్త మ్యూచువల్‌ ఫండ్స్‌

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) తమ యులిప్‌ ప్లాన్స్‌ కింద డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్‌ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్‌ లక్ష్యం. ఈ ఫండ్‌ ప్రధానంగా డివిడెండ్‌ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్‌.. మనీ మార్కెట్‌ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్‌ చేస్తుంది. మహీంద్రా మాన్యులైఫ్‌ ఇన్‌కం ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ యాక్టివ్‌ ఎఫ్‌వోఎఫ్‌ మహీంద్రా మాన్యులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఇన్‌కం ప్లస్‌ ఆర్బిట్రేజ్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్‌ స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్‌ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మాత్రమే వర్తించేలా ఎఫ్‌వోఎఫ్‌ స్వరూపం ఉంటుంది.యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మల్టీ అసెట్‌ ఎఫ్‌వోఎఫ్‌ యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ మల్టీ–అసెట్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్‌ ఆధారిత మ్యుచువల్‌ ఫండ్స్‌ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్‌ల యూనిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) 2025 నవంబర్‌ 21న ప్రారంభమై డిసెంబర్‌ 5న ముగుస్తుంది.

Stock market outlook this week3
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది..

గడిచిన వారమంతా బుల్‌ పరుగులే. నిఫ్టీ ఏకంగా 1.64 శాతం పెరగగా సెన్సెక్స్‌ 1.39 శాతం పెరిగింది. మరి ఈ వారం ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? వాస్తవానికి మార్కెట్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలకు దగ్గర్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది.అమెరికాతో వాణిజ్య చర్చలు కొన్నాళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ వారంలో ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. డీల్‌ మాత్రం కుదరటం లేదు. కుదిరినా అది మన వ్యవసాయ రక్షణలకు ప్రతికూలంగా నిలుస్తుందా? అలాంటి ఆందోళనలేవీ అవసరం లేని స్థాయిలో ఉంటుందా? అనేది తెలియదు. దీనికితోడు నవంబరు నెల ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ కూడా ఉంది. ఎక్స్‌పైరీ రోజుల్లో... అంటే మంగళవారం, గురువారం మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులు చూసే అవకాశముంది. ప్రతికూల, అనుకూల అంశాలివీ...దేశీయంగా...ఈ ఏడాది (2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్‌) జీడీపీ గణాంకాలు 28న వెలువడతాయి. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో దేశ ఆరి్థక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఇది గత ఐదు త్రైమాసికాలలోనే అత్యధికం. ఈ సారి గణాంకాలు ఎలా ఉంటాయో చూడాలి.అక్టోబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు కూడా 28నే వెల్లడవుతాయి. సెపె్టంబర్‌లో ఐఐపీ 4% ఎగసింది. ఈసారీ ఆ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి.విదేశీ అంశాలుకొద్ది రోజులుగా ఎఫ్‌ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాకపోతే దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేస్తుండటంతో మార్కెట్లు పెద్దగా పడటం లేదు. యూఎస్‌ మార్కెట్ల తీరు, అమెరికా, చైనా డేటాను గమనించాల్సి ఉంటుంది.గత వారం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్టానికి (89.66) పతనమైంది. ఇది ప్రతికూలమే. ఈ వారం పతనం కొనసాగుతుందా? లేదా? చూడాలి...గమనించాల్సిన ప్రధాన షేర్లు...హెచ్‌డీఎఫ్‌సీడిపాజిట్లలో వృద్ధి వివరాలు వెల్లడవుతాయి. మార్జిన్లపై కంపెనీ వెల్లడించే వివరాలు అనుకూల ప్రభావాన్ని చూపించొచ్చు. లిక్విడిటీ బలహీనంగా ఉండటం... కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ వంటివి ప్రతికూలాంశాలు.జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌...ఎగుమతులకు డిమాండ్‌ బాగుండి, స్టీల్‌ ధరలు పెరిగితే అది ఈ షేరుకు సానుకూలం.స్టీల్‌ ధరలు పతనమై.. చైనా నుంచి డిమాండ్‌ బలహీనపడితే అది షేరుకు ప్రతికూలంటీసీఎస్‌రూపాయి ధర స్థిరంగా ఉండి, అమెరికా టెక్నాలజీ కంపెనీల ఫలితాలు బాగుంటే అది షేరుకు సానుకూలం.అంతర్జాతీయ టెక్‌ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటిస్తే అది ప్రతికూలం.హెచ్‌ఏఎల్‌రక్షణ శాఖ నుంచి, ఎగుమతుల కోసం ఆర్డర్లు వచ్చే చాన్సుంది. విదేశీ భాగస్వామ్యాలపై కొత్త సమాచారం వెలువడితే అది సానుకూలం.ప్రాజెక్టులను పూర్తి చేయటంలో, పేమెంట్లలో జాప్యం వార్తలు ప్రతికూలమనే చెప్పాలి. సాంకేతికంగా.. ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 26,200 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయి దాటితే 26,350 వద్ద తదుపరి అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. నిఫ్టీ బలహీనపడితే 25,900 పాయింట్ల వద్ద తొలి సపోర్ట్‌ లభించవచ్చు. తదుపరి 25,850 పాయింట్ల వద్ద కొనుగోళ్ల మద్దతుకు వీలుంది.

House or place which is better, Land is better than flats for investment4
ఇల్లా.. స్థలమా.. !

ఫ్లాటా... ప్లాటా? ఇల్లా... స్థలమా? కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్‌ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే... లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్‌ కొనుక్కుని ఉండాల్సిందే... అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం కొందామనుకున్నది బాగా పెరిగి... కొన్నది అంతగా పెరగనప్పుడు!!. మరి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఏది కొంటే బెటర్‌? దీనిపై అవగాహన కోసమే ఈ కథనం.. – సాక్షి, వెల్త్‌ డెస్క్‌నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది కూడా. అనరాక్‌లాంటి మార్కెట్‌ వర్గాల గణాంకాలను బట్టి అయిదారేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఫ్లాట్ల రేటు చ.అ.కు సగటున రూ.4,750గా ఉండగా గతేడాది ప్రథమార్ధంలో రెట్టింపై ఏకంగా రూ.9,000కు ఎగిసింది. మరికొన్ని మార్కెట్‌ వర్గాల ప్రకారం ఇదే వ్యవధిలో విశాఖపట్నంలోని మధురవాడలో రూ. 3,800–4,300గా ఉన్న ధర రూ. 5,2,00–6,200 స్థాయికి చేరింది. అదే మధురవాడ ప్రాంతంలో స్థలాల రేట్లు 2019లో దాదాపుగా గజం 40వేల వరకూ ఉండి... గతేడాది రూ.75000 దాటేశాయి. ఇక హైదరాబాద్‌లో ఇదే కాలంలో చూస్తే ఫ్లాట్ల ధరలు రెట్టింపయ్యాయేమో కానీ... స్థలాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పెరిగాయి. ఈ లెక్కన చూసినపుడు రెండూ పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి స్థలాలు ఇంకాస్త ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఎంచుకోవటం ఎలా? అవసరానికే పెద్ద పీట... స్థలమైనా, ఫ్లాటైనా... మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే తరువాత రేట్లు పెరగకపోయినా, పెరిగినా పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కొత్త ప్రాజెక్టులొస్తూ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి అక్కడ డిమాండ్‌ పెరగటం, దానికి తగ్గట్లే రేటూ పెరగటం సహజం. స్థలం ఉంటే అవకాశాలెక్కువ. ఇక ఫ్లాట్ల విషయానికొస్తే అపార్ట్‌మెంట్‌ పరిమాణం పరిమితం. పైపెచ్చు పాతబడిపోతూ ఉంటుంది. పెచ్చులూడిపోవడం, పెయింట్లు వెలిసిపోవడం, పైపులు లీక్‌ కావడం, కామన్‌ ఏరియాలు పాడైపోవడంలాంటి సవాళ్లుంటాయి. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా, స్థలం మాదిరిగా ఫ్లాట్‌ విలువ పెరగదు. కాబట్టి ఇన్వెస్టరు కోణంలో ఆలోచించే ఎవరికైనా ఫ్లాట్‌ కన్నా స్థలం అర్ధవంతంగా ఉంటుంది. స్థలం కొనుక్కుని కాస్త 5–10 ఏళ్లు ఆగితే దాని విలువ రెండు రెట్లు, మూడు రెట్లు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్థలంపై చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను సరైన పెట్టుబడిగా చెబుతారు.స్థలం కొనేముందు జాగ్రత్తలెన్నో.... సాధారణంగా ఫ్లాట్లనేవి కొన్ని సందర్భాలు మినహా చాలా మటుకు చట్టపరమైన అన్ని అనుమతులతో లభిస్తాయి. అదే పేరున్న బిల్డర్‌ దగ్గర్నుంచి కొంటున్నారంటే లీగల్‌ విషయాల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే, రెరా రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టి ఫికెట్‌ వంటివి తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా... ఓవరాల్‌గా రిస్కు తక్కువే ఉంటుంది. స్థలం విషయానికొచ్చే సరికి మాత్రం చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. టైటిల్‌ ఓనర్‌íÙప్‌ ఎవరి పేరిట ఉంది? రెసిడెన్షియలా లేక వ్యవసాయ భూమా? కన్వర్షన్‌ పరిస్థితి ఏంటి? లీగల్‌ వివాదాలేవైనా ఉన్నాయా? లే అవుట్‌కి ఆ ప్రాంత డెవలప్‌మెంట్‌ అథారిటినీ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయా? ఇలాంటి విషయాలెన్నీ నిశితంగా చూసి తీరాలి. వీటిల్లో ఏ చిన్న తేడా జరిగినా, మీరు కొనుక్కున్న స్థలాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు. లేదా అది పూర్తిగా చేయి జారిపోనూ వచ్చు. కాబట్టి, స్థలంపై ఇన్వెస్ట్‌ చేయడం మంచిదే అయినప్పటికీ పేపర్‌వర్క్‌ 100 శాతం కరెక్ట్‌గా ఉన్నప్పుడే మంచిదవుతుంది. ఇక మెయింటెనెన్స్‌ విషయంలో ఫ్లాట్‌తో పోలిస్తే ప్లాట్‌దే పైచేయి. ఫ్లాట్‌ కొంటే మనం ఉన్నా... అద్దెకు ఇచ్చినా ప్రతి నెలా లిఫ్టులు, సెక్యూరిటీ, క్లీనింగ్‌ ఇలాంటివాటన్నింటికీ సంబంధించి మెయింటెనెన్స్‌ బిల్లు భారం ఉంటుంది. స్విమ్మింగ్‌ పూళ్లు.. జిమ్ములు గట్రా మీరు వాడకపోయినా కచి్చతంగా కట్టాల్సిందే. అదే స్థలం విషయానికొస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్‌ తప్ప ప్రతి నెలా కచి్చతంగా ఇంత చెల్లించాలనే బాదరబందీ ఉండదు. ఒకవేళ అందులో మీరు కట్టుకున్న నిర్మాణాన్ని బట్టి ఏవైనా మెయింటెనెన్స్‌ ఉండొచ్చు. ఫ్లాట్లకు రుణాలు సులభం .. స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80–90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్‌ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60–70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిరీ్ణత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్‌గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్‌ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచి్చనప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.ఫ్లాట్‌ కొనటం, అమ్మటం కాస్త ఈజీ నివసించడం కోసమైతే ఫ్లాట్లను కొనుక్కోవడం సరైన నిర్ణయమని చెప్పాలి. కొనటం కూడా చాలా సులువు. కొనుక్కుని, పేపర్‌వర్క్‌ పూర్తి చేసి, షిఫ్టింగ్‌ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఒకవేళ నిర్మాణ దశలో ఉన్నదైతే, ఎప్పటికల్లా పూర్తవుతుందనేది ముందే తెలుస్తుంది. అదే స్థలం విషయానికొస్తే కేవలం ప్లాట్‌ చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని, అందులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అంతా సవ్యంగా సాగి, ఎలాంటి జాప్యాలు జరగకుండా ఉంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి, సత్వరం నివసించేందుకు ఇల్లు కావాలంటే ఫ్లాట్‌ను ఎంచుకోవచ్చు. అదే కొ న్నాళ్ల తరవాత మారాలనుకుంటే ప్లాట్‌ ఎంచుకోవచ్చు.

Explanation of the Vehicle leasing policies, sakshi special story5
కొనకుండానే..షి‘ కారు’! 

ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్‌లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్‌. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్‌పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్‌ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్‌? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్‌ డెస్క్‌ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్‌యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్‌ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్‌పేమెంట్‌ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్‌ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్‌...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్‌?→ లీజింగ్‌ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్‌ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్‌ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్‌ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్‌కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్‌ లీజింగ్‌ సేవలందిస్తోంది. లాకిన్‌ పీరియడ్‌ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్‌ లాకిన్‌ పీరియడ్‌ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్‌ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్‌ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్‌ సంస్థ నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్‌తో ఈఎంఐ లీజింగ్‌నూ అందిస్తోంది. హ్యుందాయ్‌ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్‌ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్‌ → 15–20 శాతం డౌన్‌పేమెంట్‌తో పాటు బీమా, ఆన్‌రోడ్‌ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్‌షిప్‌→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్‌ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్‌ లీజింగ్‌→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్‌ ట్యాక్స్, బ్రేక్‌డౌన్‌ సపోర్ట్‌ అన్నీ లీజింగ్‌ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్‌ చేసే ప్రొఫెషనల్స్‌కు → సానుకూలాంశాలు: డౌన్‌పేమెంట్‌ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్‌ పీరియడ్‌. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్‌ టు ఓన్‌ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్‌ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్‌ సబ్‌స్క్రిప్షన్‌ → దీన్లోనూ డౌన్‌పేమెంట్‌ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్‌తో మైల్స్, రెవ్, క్విక్‌లిజ్‌ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీలకు నెలకు రూ.30వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్‌... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్‌కి కనుక తామే డ్రైవ్‌ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్‌కార్, రెవ్, మైల్స్‌ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్‌ పీరియడ్‌ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్‌స్క్రిప్షన్‌... → మారుతి, హ్యుందాయ్‌ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్‌ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్‌ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్‌ సపోర్ట్‌తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్‌దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్‌స్కిప్షన్‌ ఫోన్లు, కో–లివింగ్‌ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్‌ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు. డౌన్‌పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్‌మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్‌తో దీర్ఘకాల కమిట్‌మెంట్లు ఉండవు. సబ్‌స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్‌లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్‌గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్‌. – ఎడిటర్‌

NeoKavach Launches Indias First Wearable Airbag Vest For Bike Riders6
బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!

ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్‌బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్‌ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్‌స్క్రిప్షన్‌ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్‌ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్‌మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్‌ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్‌సైట్‌లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement