ప్రధాన వార్తలు
జీసీసీల్లో 40 లక్షల కొత్త కొలువులు
ముంబై: దేశీయంగా భారీగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2029–30 నాటికి కొత్తగా 28 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని టీమ్లీజ్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం భారత్లో 1,800 జీసీసీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న జీసీసీల్లో ఇది 55 శాతం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిలో 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉండగా, ఎగుమతులపరంగా 64.6 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. సంఘటిత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి భారత జీసీసీ వ్యవస్థ మూలస్తంభంగా ఎదుగుతోందని టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. కొత్త రిక్రూట్స్లో 14–22 శాతం మంది ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్లాంటి డిజిటల్ నైపుణ్యాలు గల ఫ్రెషర్స్ ఉండబోతున్నారని పేర్కొన్నారు. మిగతా 76–86 శాతం మంది మధ్య స్థాయి ప్రొఫెషనల్స్ ఉంటారని వివరించారు. కఠినతరమైన చట్టాలు.. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఏటా 2,000కు పైగా లీగల్ నిబంధనలను పాటించాల్సి ఉంటోంది. కారి్మక, ట్యాక్స్, పర్యావరణ చట్టాలు మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. వీటికి అనుగుణంగా జీసీసీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందని టీమ్లీజ్ రెగ్టెక్ సహ వ్యవస్థాపకుడు రిషి అగర్వాల్ తెలిపారు. తదుపరి విధానకర్తలు, పరిశ్రమ, విద్యారంగం ఏ విధంగా డిజిటల్ నైపుణ్యాలు గల, నిబంధనలకు అనుగుణంగా పని చేయగలిగే సిబ్బందిని తయారు చేసుకుంటాయనే దానిపైనే జీసీసీల విస్తరణ అనేది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఉదయం గరిష్టంగా రూ. 770 తగ్గింది. అయితే సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు 1580 రూపాయలు తగ్గిందన్నమాట. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,040 వద్దకు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.118400 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,16,450 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 1450 తగ్గిందన్న మాట. (ఉదయం 700 రూపాయలు మాత్రమే తగ్గింది, ఇప్పడు మరో 750 రూపాయలు తగ్గి.. మొత్తం రూ. 1450 తగ్గింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 127040 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 770 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1580 తగ్గింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ. 127190 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1450 తగ్గి.. 1,16,600 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1750 తగ్గడంతో రూ. 128070 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. 117400 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, ఎలా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?, అనే విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం వల్ల.. ఇళ్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇల్లు కొనడం అనేది ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమయంలో ఇల్లు కొనాలంటే అప్పు చేసి (బ్యాంక్ లోన్) కొనమంటున్నారు కియోసాకి. పర్సనల్ ఫైనాన్స్ యూట్యూబర్ శరణ్ హెగ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఇల్లు కొనడంలో తప్పు లేదు. కానీ జీతంతో, లేదా మీరు చేసిన పొదుపుతో ఇల్లు కొనాలని చూస్తే మాత్రం అప్పులపాలైపోతారని కియోసాకి పేర్కొన్నారు. లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేసి.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించాలి. ఆలా వచ్చిన డబ్బు ద్వారా లోన్ చెల్లించాలి. ఇలా చేస్తూ ఉంటే.. చివరికి ఇల్లు మీ సొంతం అవుతుందని ఆయన చెబుతారు. ఇక్కడ మీ చేతి నుంచి చెల్లించిన డబ్బు ఏమీ ఉండదు. అయితే చివరికి ఆస్తి మీదవుతుంది. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని కియోసాకి చెబుతారు.తనకు చాలా ఇల్లు ఉన్నట్లు కియోసాకి ఇంటర్వ్యూలో కియోసాకి పేర్కొన్నారు. ఆ ఇళ్లను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదిస్తాను అని కూడా ఆయన వెల్లడించారు. 2025 రెండవ త్రైమాసికంలో USలో సగటు ఇంటి ధర 4,10,800 డాలర్లు అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ తెలిపిందని కియోసాకి వివరించారు.డబ్బు మీ కోసం పనిచేయాలిరాబర్ట్ కియోసాకి తన ఆర్ధిక సూత్రాలలో కూడా డబ్బు కోసం మీరు పనిచేయకండి, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయండి అని చెబుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, నెలవారీ బిల్లులు చెల్లిస్తారు. మిగిలిన డబ్బు ఖర్చు చేస్తారు. ఇదే జీవితాంతం కొనసాగుతుంది. ఇదే డబ్బు కోసం పనిచేయడం అన్నమాట.ఇదీ చదవండి: ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకిడబ్బు మీ కోసం పనిచేయడం అంటే.. ఒక ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకు ఇస్తారు. మీకు ప్రతి నెలా డబ్బు వస్తుంది. మీరు షేర్లలో పెట్టుబడి పెడితే, కంపెనీ లాభాల్లో భాగంగా డివిడెండ్ వస్తుంది. ఏదైనా వ్యాపారం ఉంటే.. మీరు పని చేయకపోయినా వ్యాపారమే మీకు డబ్బు సంపాదిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. మీరు ఒక బుక్ రాశినా, సాఫ్ట్వేర్ రూపొందించినా, మ్యూజిక్ క్రియేట్ చేసినా అవి అమ్ముడవుతాయి. తద్వారా మీకు డబ్బు వస్తుంది.
రూ.కోట్లు కరిగిస్తున్న ‘షుగర్’!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న జబ్బు మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది. డయాబెటిస్ ఒక కుటుంబానికి కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆర్థిక సమస్య కూడా. మధ్యతరగతి కుటుంబంలో ఒకరికి షుగర్ జబ్బు వస్తే వైద్య ఖర్చులకే ఆ కుటుంబ ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఒక్కరికి డయాబెటిస్ వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతుంది.. వైద్యపరంగా సగటున ఎంత ఖర్చు వస్తుంది.. తాజా డేటాతో సమగ్ర కథనం..భారతదేశంలో డయాబెటిస్ ఒక కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. సగటున ఒక రోగి చికిత్స, మందులు, పరీక్షలు, ఇన్సులిన్ మొదలైన వాటికి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేర్ మార్కెట్ విలువ 2024లో రూ.1.25 లక్షల కోట్లు ఉండగా, అది 2030 నాటికి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.మధుమేహంతో ఆర్థిక ఇబ్బందులు ఇలా..డయాబెటిస్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం మందులు, పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్లు అవసరం. ఇది నెలవారీ స్థిర ఖర్చుగా మారుతుంది. ప్రత్యేక డైట్ ఫుడ్, షుగర్-ఫ్రీ ఉత్పత్తులు, గ్లూకోమీటర్లు వంటి వస్తువులు అదనపు ఖర్చు పెంచుతాయి. జబ్బు కారణంగా రోగి పని సామర్థ్యం తగ్గితే కుటుంబ ఆదాయం కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటిస్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, కంటి సమస్యలు వస్తే అదనపు వైద్య ఖర్చులు పెరుగుతాయి.సగటు వైద్య ఖర్చులుమధుమేహం బారిన పడిన వ్యక్తి మందులు, ఇన్సులిన్ కోసం నెలకు రూ.1,000 నుంచి రూ.4 వేలు.. అంటే సంవత్సరానికి రూ.12 వేల నుంచి రూ.48 వేలు ఖర్చవుతోంది. ఇక HbA1c, బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం సంవత్సరానికి రూ.3వేల నుంచి రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డాక్టర్ కన్సల్టేషన్లకు సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, అదే జబ్బు కాస్త ముదిరితే కిడ్నీ డయాలిసిస్, హృదయ శస్త్రచికిత్స వంటి చికిత్సల కోసం రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటోంది.
పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు
జపాన్ మొబిలిటీ షో 2025లో టయోటా కంపెనీ.. పిల్లల కోసం ప్రత్యేకించి మోబి బబుల్ కారును ఆవిష్కరించింది. ఇది పూర్తిగా అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ లేటెస్ట్ వెహికల్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ.. పనితీరులో మాత్రం చాలా ఉత్తమమైనదనే చెప్పాలి.మొబిలిటీ ఫర్ ఆల్.. చొరవలో భాగంగా టయోటా కంపెనీ మోబి బబుల్ కారును తీసుకొచ్చింది. ఏఐతో పనిచేసే ఈ కారు నావిగేషన్ వంటి వాటిని సొంతంగా నిర్వహస్తుంది. అంటే దీనిని నడపడానికి ప్రత్యేకించి డ్రైవర్లు అవసరం లేదు. అంతే కాకుండా.. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ బోలెడన్ని ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.తల్లిదండ్రులు వెంట లేకపోయినా.. పిల్లలను ఈ కారు స్కూలుకు, టూషన్లకు తీసుకెళ్తుంది. పిల్లకోసమే దీనిని డిజైన్ చేశారు, కాబట్టి ఇందులో పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా ప్రయాణించవచ్చు. చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడటానికి ఇందులో అన్ని దిశల్లో కెమెరాలు, సెన్సర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కారు లోపల కూర్చున్న పిల్లలతో మాట్లాడుతూ.. వారి సందేహాలను తీర్చడానికి ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.టయోటా కంపెనీ ఆవిష్కరించిన మోబి బబుల్ కారు టెస్టింగ్ దశలోనే ఉంది. దీనిని మరిన్ని విధాలుగా చెక్ చేసిన తరువాత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే సంస్థ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది, దీని ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలను వెల్లడించాల్సి ఉంది.Toyota reveals mobi during Japan Mobility Show 2025, an electric bubble car for kids, the prototype forms part of the company's Mobility for All project, which aims to create vehicles that can transport anyone, regardless of age or ability. pic.twitter.com/oqxqJPzzuV— Knowledge Bank (@xKnowledgeBANK) November 1, 2025
రూల్స్ మార్చరూ.. ట్రాయ్కు జియో విన్నపం
5జీ సాంకేతికత రాకతో అంతర్జాతీయంగా మార్కెట్లలో మార్పులు, టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను సడలించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ని రిలయన్స్ జియో కోరింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణతో, గేమింగ్ కోసం తక్కువ లేటెన్సీ ఉండే విధంగా, అప్లోడ్స్ కోసం వేగం ఎక్కువగా ఉండేలా వివిధ అవసరాలకు తగ్గ వేగంతో ఇంటర్నెట్ లభ్యత ఉండేలా ప్రోడక్టులను రూపొందించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని వివరించింది.బ్రిటన్ నియంత్రణ సంస్థ ఆఫ్కామ్ కూడా ప్రత్యేక సర్వీసులు, ప్రీమియం నాణ్యత గల ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు అనుమతిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా కఠినతరమైన నిబంధనలను సడలించాలని కోరింది. జియో, ఎయిర్టెల్లాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏ ఒక్క యాప్, వెబ్సైట్ లేదా సర్వీసులపై పక్షపాతం చూపకుండా అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తూ, ఒకే రకమైన వేగంతో అందించాలని నెట్ న్యూట్రాలిటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.అంతేకాక, నెట్ న్యూట్రాలిటీపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో 5జీ, ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఓటీ వంటి ఆధునిక సాంకేతికతల వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరింత క్లిష్టమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న డేటా వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలంటే నెట్వర్క్లలో ‘క్వాలిటీ ఆఫ్ సర్వీస్’ (QoS) ఆధారంగా ప్రాధాన్యత కేటాయించే అవకాశాలు పరిశీలించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో, వినియోగదారుల ప్రాథమిక హక్కులు, ఏ యాప్కైనా సమాన యాక్సెస్ లభించాలనే సూత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు.
కార్పొరేట్
నిధుల వేటలో క్విక్ కామర్స్..
భారత్లో రూ.10వేల కోట్ల పెట్టుబడి: డీహెచ్ఎల్
అమెరికన్ కంపెనీ లేఆఫ్స్: 15వేల మంది బయటకు!
నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్ అంబానీ వరాలు
ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 విజేతల ప్రకటన
ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు
25 నుంచి ఫార్మా ఎక్స్పో
ఆ ‘సర్దుబాటు’పైనే వొడాఫోన్ ఐడియా ఆశలన్నీ..
నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాహుబలి విమానం
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశా...
పసిడి పిడుగు.. వెండిపై ఏకంగా రూ.9 వేలు..
దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి....
లాభాల స్వీకరణ.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. కొన్ని ర...
ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టే ఎగుమతి ప్రోత్సాహక మిషన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంక...
టెక్నాలజీ అప్గ్రేడ్కు నిధులు
సాంకేతికపరమైన పురోగతికి ప్రత్యేకమైన నిధిని కేటాయిం...
ధరలు.. కూల్!
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి...
పదేళ్లలో ఇండియాలో ఇంధన డిమాండ్ పీక్..
ప్రపంచంలోనే 2035 నాటికి భారతదేశంలో అత్యధికంగా ఇంధన...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వృద్ధుల సంరక్షణకు టీసీఎస్ ఏఐ పరిష్కారం
అనేక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మరో క్లిష్టమైన సామాజిక సమస్యకు ఐటీ పరిష్కారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూరప్లోనే అతిపెద్ద స్వతంత్ర పరిశోధనాభివృద్ధి సంస్థ సింటెఫ్తో చేతులు కలిపింది.ప్రస్తుత రోజుల్లో వయసు పైబడిన పెద్దవారిని చూసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తమ ఉద్యోగాలు, వృత్తి రీత్యా ఎక్కడో ఉంటున్నారు. దీంతో వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమను పట్టించుకునేవారు లేరని ఇలు పెద్దవారు, తమవారి బాగోగులను పర్యవేక్షించే అవకాశం ఉండటం లేదని వారి పిల్లలు మథనపడుతుంటారు.ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని అందిస్తూ.. వృద్ధుల సంరక్షణను సరికొత్తగా మార్చే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టీసీఎస్.. యూరప్లోని అతిపెద్ద స్వతంత్ర పరిశోధనా సంస్థలలో ఒకటైన సింటెఫ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.ఈ భాగస్వామ్యం సింటెఫ్ స్మార్ట్ ఇన్క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE) ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. ఇది ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ సాయంతో ఇళ్లలో వృద్ధుల సంరక్షణను, పర్యవేక్షించడానికి, సహకారం ఇవ్వడానికి ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ను ఏకీకృతం చేస్తుంది.ఒంటరిగా ఉంటూ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తమ ఇతర వయో వృద్ధులతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉంటూ ఇంట్లో తమంతట తాము స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు సహాకారం అందించేలా స్మైల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు.స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి, ఇది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రానున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో సంరక్షకులకు సమాచారం అందిస్తుంది.
స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ బ్రాండ్దే హవా
భాతర స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ వివో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్లలో (రవాణా) 18.3 శాతం వాటాతో వివో మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఒప్పో 13.9 శాతం, శామ్సంగ్ 12.6 శాతం, యాపిల్ 10.4 శాతం, రియల్మీ 9.8 శాతం, షావోమీ 9.2 శాతం చొప్పున మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.వన్ప్లస్ షిప్మెంట్లు ఇదే కాలంలో 30.5 శాతం తగ్గాయి. మోటరోలా 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారెŠక్ట్ పరిశోధనా సంస్థ ఐడీసీ డేటా ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 4.8 శాతం వృద్ధితో 4.8 కోట్ల యూనిట్లకు చేరుకుంది. యాపిల్ సంస్థ 50 లక్షల ఐఫోన్లను రవాణా చేసింది.ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 43.3 శాతం వృద్ధి నమోదైంది. ప్రీమియం స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం ఫోన్లలో 4 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ఇందులో 70 శాతం ఐఫోన్ 16, 15, 17 మోడళ్లున్నాయి. ప్రీమియం స్మార్ట్ఫోన్లలో 66 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ టాప్లో ఉంది. శామ్సంగ్ 31 శాతం వాటాతో తర్వాతి స్థానంలో నిలిచింది.
నియంత్రణలేని కృత్రిమ మేధ.. కట్టుతప్పితే..
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) దిశగా ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ ఏఐ చీఫ్ స్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ అంచనా వేసిన దానికంటే వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇది మానవ నియంత్రణలో ఉండటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.మైక్రోసాఫ్ట్ ప్రత్యేక MAI సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సూపర్ ఇంటెలిజెన్స్ను నిర్మించే క్రమంలో మానవత్వాన్ని, మనం జీవించాలనుకునే భవిష్యత్తును కోల్పోతే ప్రమాదం. మానవులకు ఈ అంశాలపై నియంత్రణ లేకపోతే ప్రమాదం’ అని చెప్పారు.హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్సులేమాన్ పైవ్యాఖ్యలు చేస్తూనే మైక్రోసాఫ్ట్ ఏఐ అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. దీన్ని ‘ఏఐ సెల్ఫ్ సఫిషియన్సీ’ (ఏఐ స్వయం సమృద్ధి) అని అభివర్ణించారు. కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI)తో భాగస్వామ్యంలో ఉన్న పరిమితులను అధిగమించి భారీ స్థాయిలో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐ మోడళ్లకు విచ్చలవిడిగా శిక్షణనిచ్చే అనియంత్రిత శక్తిని లక్ష్యంగా చేసుకున్న పోటీదారుల మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ ‘హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్’ (మానవతా దృక్పథంతో కూడిన సూపర్ ఇంటెలిజెన్స్) ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని సులేమాన్ వివరించారు.ఈ విధానం వల్ల ఏఐను జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. సందర్భోచితంగా పరిమితులకు లోబడి వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రేసులో ప్రత్యర్థుల మాదిరి నియంత్రణ లేకుండా శిక్షణలు ఇవ్వడం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ మానవ అవసరాలను తీర్చే ఆచరణాత్మక వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. మానవాళికి సేవ చేయడానికి స్పష్టంగా రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మిస్తున్నామన్నారు.ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన
పేలుడు ఘటనల్లో సత్య శోధన
ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో నవంబర్ 10న భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ వద్ద నిలిపిన ఐ20 కారు అకస్మాత్తుగా పేలింది. ఈ విస్ఫోటనంతో చుట్టుపక్కల ప్రజలు మరణించడంతోపాటు సమీపంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇటువంటి సంఘటనల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచ్ఛిన్నమైన సాక్ష్యాలను సేకరించి, వాటిని ఏకం చేయాలి. ఒక సంఘటన ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో నిర్ణయించడమే కాకుండా కోర్టులో ఫలితాలు నిలబడేలా చూడాలి. ఈ పేలుడు ఘటనతో న్యూదిల్లీలోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ విషాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్లు కొన్ని అనుమానిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసేందుకు ఎక్స్పర్ట్లు అనుసరించే అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసుకుందాం.ఈ ఘటన జరిగిన అరగంటలోపే ఢిల్లీ ఫోరెన్సిక్ లాబొరేటరీ పేలుడు పదార్థాల విభాగానికి చెందిన నిపుణులు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా సంఘటన స్థలం నుంచి అనుమానిక సాక్ష్యాలను పరిశీలించి వాటిని విశ్లేషిస్తారు. సాంప్రదాయ నేరాల మాదిరిగా కాకుండా పేలుళ్లు ప్రత్యేకమైన సవాళ్లను కలిగి ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి, వేడి కారణంగా వస్తువులు బూడిదవుతాయి. దాంతో ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది.ఫోరెన్సిక్ సైన్స్లో ‘లోకార్డ్ మార్పిడి సూత్రం’ అని ఉంటుంది. ఇది ప్రతి నేరస్థుడు సంఘటనా స్థలంలో ఏదో ఆధారం వదిలివేసి లేదా ఏదో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతుంది. పేలుడు గందరగోళంలో ఒత్తిడికి గురికాకుండా నిపుణులు అనుమానితులను సంఘటన స్థలానికి అనుసంధానించే కోణంలో పరిశోధనలు చేస్తారు. వారు ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవో, వాటి తీవ్రత ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు.కాలి బూడిదైనా...అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిపుణులు ముఖ్యంగా పేలుడు పదార్థాల అవశేషాలు, అగ్ని ప్రమాదానికి కారణమైన పదార్థాల జాడలు, వేడి ప్రభావంతో మారిన వస్తువుల భౌతిక ఆధారాల కోసం వెతుకుతారు. కాలిన శిథిలాల నుంచి చిన్న చిన్న అవశేషాలను చాలా జాగ్రత్తగా కలుషితం కాకుండా ఉండేలా సేకరిస్తారు. సాధారణంగా మండే స్వభావం ఉన్న ద్రవాలు నేలలోకి లేదా ఇతర శోషక పదార్థాలలోకి ఇంకిపోతాయి. కాబట్టి కార్బన్ అవశేషాలు (Soot), కాలిన భాగాల అంచులు, మట్టి నమూనాలను సేకరిస్తారు.ప్యాకేజింగ్సేకరించిన నమూనాలను తక్షణమే గాలి చొరబడని ప్రత్యేక డబ్బాల్లో (Airtight Containers) ప్యాక్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులను నివారిస్తారు. ఎందుకంటే అవి మండే ద్రవాల ఆవిరులను (Vapors) పీల్చుకోవచ్చు లేదా కలుషితం చేయవచ్చు.డాక్యుమెంటేషన్సంఘటన స్థలాన్ని చాలా కోణాల నుంచి ఫోటోలు తీస్తారు. లేజర్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా 3డీ స్కెచ్లు వేయిస్తారు. ఇది అగ్ని వ్యాప్తి చెందిన విధానాన్ని (Fire Propagation), పేలుడు కేంద్ర బిందువును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.సంఘటనకు లింక్ చేయడంఅగ్ని ఎంత వేగంగా, ఏ దిశలో వ్యాపించింది అనే నమూనా, అత్యంత ఎక్కువ నష్టం జరిగిన ప్రదేశం ఆధారంగా పేలుడు/ అగ్ని ప్రారంభ స్థానాన్ని గుర్తిస్తారు. కాలిపోయిన లోహపు శకలాల నమూనా, వాటి కదలికను బట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదమా లేదా పేలుడు పదార్థాలను ఉపయోగించిన దాడినా అని నిర్ధారిస్తారు.గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీఇది అత్యంత ముఖ్యమైన సాంకేతికత. నమూనాలోని మండే ద్రవాల ఆవిరులను (పెట్రోల్, కిరోసిన్ వంటివి) గుర్తించడానికి ఉపయోగిస్తారు. పేలుడు అవశేషాల రసాయన మిశ్రమాలను కూడా వేరు చేసి ఇందులో గుర్తిస్తారు.ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీకాలిన అవశేషాలు కాంతితో ఎలా చర్య చెందుతాయో విశ్లేషించి అందులోని రసాయన బంధాలను గుర్తిస్తుంది. ఇది పేలుడు పదార్థాల రసాయన కూర్పును తెలుసుకోవడానికి సహాయపడుతుంది.స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీపేలుడు శకలాల ఉపరితల స్వరూప శాస్త్రాన్ని (Morphology) పరిశీలిస్తుంది. ముఖ్యంగా పేలుడు తర్వాత మిగిలిపోయిన మూలకాల జాడలను (ఉదా: సల్ఫర్, నైట్రోజన్, లెడ్) గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది పేలుడు పదార్థం రకాన్ని నిర్ధారిస్తుంది.అంతిమంగా దోషులను కనిపెట్టే మార్గాలుదోషులను గుర్తించడానికి ఫోరెన్సిక్ అధికారులు కేవలం రసాయన ఆధారాలపైనే కాకుండా చాలా పద్ధతులను అనుసరిస్తారు. ప్రయోగశాలలో ఏదైనా ప్రత్యేకమైన లేదా వాణిజ్యపరమైన పేలుడు పదార్థాలను గుర్తిస్తే ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిన, తయారు చేసిన లేదా నిల్వ చేసిన వ్యక్తులపై దర్యాప్తు చేస్తారు.వాహనం పేలుడు ఘటనకు కేంద్ర బిందువు అయితే ట్యాంపరింగ్కు గురైన ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను థర్మోకెమికల్ ఎచింగ్ ద్వారా తెలుసుకుంటారు. దీని ద్వారా వాహనం యజమాని వివరాలు తెలుస్తుంది.సంఘటన స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి సంఘటనకు ముందు అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేస్తారు. అనుమానితుల డిజిటల్ పరికరాలలో (ఫోన్లు, కంప్యూటర్లు) పేలుడు తయారీకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారు.ఇదీ చదవండి: అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే..
పర్సనల్ ఫైనాన్స్
మరో గోల్డ్ బాండ్.. రిడంప్షన్ రేటు ప్రకటించిన ఆర్బీఐ
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండటంతో పసిడికొనుగోళ్లు నానాటికి పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నప్పుడు కొనేవారికంటే రేటు తక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు అంచనాతో కొన్నవారే ఎక్కువ ప్రతిఫలం దక్కించుకుంటారు. ఇదే ఆలోచనలో గతంలో చాలా మంది ప్రభుత్వం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేశారు. వారు ఇప్పుడు దాదాపు మూడింతల లాభాన్ని పొందుతున్నారు.2017-18 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) నేటికి (2025 నవంబర్ 13) మెచ్యూరిటీ తీరాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటికి రూ.12,350 రిడంప్షన్ ధర ప్రకటించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. 2017 వవంబర్ 13న వీటిని గ్రాముకు రూ.2934 లకు జారీ చేసింది. డిస్కౌంట్ పోగా వీటి ఆన్లైన్ ధర రూ.2,884. ఇప్పుడీ బాండ్లు 329 శాతం రాబడిని అందుకుంటున్నాయి. అంటే గ్రాముకు రూ.9466 లాభం అన్నమాట.మరో సిరీస్కు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ఆర్బీఐ 2018-19 సిరీస్-3 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు కూడా ముందస్తు రిడంప్షన్ ప్రకటించింది. 2018 నవంబర్ 13న జారీ చేసిన ఈ బాండ్లను ముందస్తుగా 2018 నవంబర్ 13న గ్రాముకు రూ.12,350 ధర వద్ద రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రాముకు రూ.3,146 ధర వద్ద జారీ చేసిన వీటి తుది గడువు 2026 నవంబర్ 13న తీరనుంది. ఇప్పుడు రిడీమ్ చేసుకుంటే గ్రాముకు 288 శాతం అంటే రూ.9204 లాభంతో సొమ్ము చేసుకోవచ్చు.సావరిన్ గోల్డ్ బాండ్ పథకం గురించి..భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. గ్రాములవారీగా ఈ గోల్డ్ బాండ్లపై పెట్టిబడి పెట్టినవారికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందించాయి. ఇష్యూ ధరపై 2.5% స్థిర వార్షిక వడ్డీతో పాటు రిడంప్షన్ నాటికి అప్పటి ధరను పొందే అవకాశం కల్పించాయి.వాస్తవంగా ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ మదుపరులు కోరుకుంటే ఐదేళ్ల తర్వాత వడ్డీ చెల్లింపు తేదీలలో నిష్క్రమించవచ్చు. ఈ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. కాగా రుణ భారం అధికమవడంతో ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో వీటి జారీని నిలిపివేసింది.ఆదాయపు పన్ను చట్టం, 1961 (1961 సెక్షన్ 43) నిబంధనల ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే ఈ బాండ్లను రీడీమ్ చేసినప్పుడు, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ఛేంజీలో బాండ్ల బదిలీ ఫలితంగా వచ్చే ఏదైనా మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.
2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా: ఐఆర్డీఏఐ ఛైర్మన్
2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమా అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఐఆర్డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్ తెలిపారు. హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ కార్యాలయంలో ఈరోజు బీమా లోక్పాల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న బీమా లోకపాల్ కేంద్రాలతో వెబ్కాస్ట్ ద్వారా మాట్లాడారు. పాలసీదారుల ఫిర్యాదులను ఉచితంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం బీమా లోకపాల్ వ్యవస్థను ప్రారంభించిందన్నారు. పాలసీదారుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ సభ్యుడు దీపక్ సూద్ మాట్లాడుతూ ఖైరతాబాద్లోని ది సెంట్రల్ కోర్ట్ హోటల్లో మాట్లాడుతూ బీమా రంగ అభివృద్ధిలో పాలసీదారుల నమ్మకం అత్యంత ముఖ్యమన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడంలో బీమా లోకపాల్ నిరంతరం న్యాయపూర్వక సేవలందిస్తూ కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బీమా లోకపాల్ జీ శోభారెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం సాధించిన పని తీరును, 2025 అక్టోబర్ నెల వరకు ప్రస్తుత సంవత్సరంలో నమోదు చేసిన ఫిర్యాదుల పరిశీలన, పరిష్కార విజయాలను వివరించారు. కరపత్రాలు, బ్రోచర్లు బీమా పాలసీ కొనుగోలు సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య అంశాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లో ‘కరెక్ట్ పద్ధతులు’, ‘ఎలా చేయకూడదు’ వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.బీమా లోకపాల్ కార్యాలయ ప్రాంగణంలో 'బీమా లోకపాల్ - బీమా ఫిర్యాదుల పరిష్కారానికి ఉచిత ప్రత్యామ్నాయ న్యాయ వేదిక' అనే సందేశంతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మెట్రో మార్గాలు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ రైల్వే స్టేషన్లలో చీరాల, తుని, తాడేపల్లిగూడెం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, సామర్లకోట, రేణిగుంటలో సమాచార డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి బీమా లోకపాల్ కార్యాలయాన్ని సంప్రదించే విధానం, ఫిర్యాదు ప్రక్రియ వంటి వివరాలను ప్రజలకు చూపించాయి.'న్యాయమైన పరిష్కారం ద్వారా పాలసీదారులకు సాధికారత కల్పించడం' అనే అంశంతో వాట్సాప్ డిస్ప్లే పిక్చర్స్, స్టేటస్ సందేశాలతో ప్రచారం చేపట్టారు. డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రజలను చేరుకున్నారు. ఈ సమగ్ర చర్యలు పాలసీదారులకు బీమా లోకపాల్ సేవల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడం, ఉచితంగా, నిష్పక్షపాతంగా ఫిర్యాదులను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పబ్లిక్ సెక్టార్ బీమా సంస్థల సీనియర్ అధికారులు, ప్రైవేట్ బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ సంస్థల్లో వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేసే విధానాలపై తమ అనుభవాలు పంచుకున్నారు.
బంగారం మాయలో పడొద్దు!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం చాలా కుటుంబాల్లో బంగారంపై చర్చ జరుగుతుంది. పెళ్లి కుటుంబాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. అయితే పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా ఇదే అదనుగా పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంపదను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి చాలా మంది పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే నేరుగా ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు చేయాలని కొందరు భావిస్తున్నారు. కానీ, కేవలం ‘బంగారం’ అనే భావనతో భౌతిక రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మరి.. ఈ మెరిసే లోహంలో సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలంటే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.భౌతిక బంగారం కొనుగోలుతో..బంగారం కొనుగోలు అనేది తరతరాలుగా వస్తున్న ఒక అలవాటు. అయితే, దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు నేరుగా బంగారం కొనుగోలు చేయడం (ఫిజికల్ గోల్డ్) అనేక ప్రతికూలతలను కలిగి ఉంటుంది. ఆభరణాలు కొన్నప్పుడు బంగారం అసలు ధరతో పాటు అధికంగా 8% నుంచి 30% వరకు తయారీ ఛార్జీలు, తరుగు రూపంలో కొంత చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టబడుల నుంచి లాభాన్ని తగ్గిస్తుంది.బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత (క్యారెట్) విషయంలో అనుమానాలు, మోసాలు జరిగే అవకాశం ఉంది. హాల్మార్క్ ఉన్నప్పటికీ చిన్న దుకాణాల్లో నాణ్యతను తనిఖీ చేయడం కష్టం. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంక్ లాకర్లలో ఉంచినా అద్దె, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిపై రాబడిని తగ్గిస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని త్వరగా సరైన ధరకు అమ్మడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారునికి అదనపు భారం. బంగారు ఆభరణాలు ఖర్చు లేదా అలంకారం కిందకు వస్తాయి తప్ప పూర్తిస్థాయి పెట్టుబడి కిందకు రావని గమనించాలి.గోల్డ్ ఈటీఎఫ్లుబంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా సులభంగా, పారదర్శకంగా ఉండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs). గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ యూనిట్లు అని అర్థం. ఇవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల వలె ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?ముందుగా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ వద్ద డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఇది షేర్లు కొనుగోలు చేయడానికి అవసరం.వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMC) అందించే గోల్డ్ ఈటీఎఫ్ల్లో (ఉదా: నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్..) ఒకదాన్ని ఎంచుకోవాలి.ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీకు కావలసిన గోల్డ్ ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి షేర్లను కొనుగోలు చేసినట్లే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో (సిప్ మాదిరిగా) కొనుగోలు చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్ల వల్ల ప్రయోజనాలుగోల్డ్ ఈటీఎఫ్లు అనేక రకాల ప్రయోజనాలను అందించి, భౌతిక బంగారంపై మెరుగైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయి. ప్రతి ఈటీఎఫ్ యూనిట్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారం కలిగి ఉంటుంది. నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో తయారీ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. కేవలం కొద్దిపాటి బ్రోకరేజ్, ఫండ్ నిర్వహణ ఛార్జీలు (సాధారణంగా 0.5% లోపు) మాత్రమే ఉంటాయి. ఇది లాభాలను పెంచుతుంది.స్టాక్ ఎక్స్ఛేంజ్లో రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేయబడతాయి కాబట్టి, దొంగతనం అయ్యే ప్రమాదం లేదు. లాకర్ ఖర్చులు ఉండవు. కేవలం ఒక యూనిట్ (సుమారు ఒక గ్రాము బంగారానికి సమానం) నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..!
పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచి్చతంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు. కనుక స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్-2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


