Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nikesh Arora overcame 400 job rejections early CEO of Palo Alto Networks1
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్‌ మేకర్‌

సైబర్ దాడి జరగకుండా, ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా 132 బిలియన్‌ డాలర్ల విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్‌ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్‌ నాటికి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ (PANW) మార్కెట్ క్యాప్ రికార్డును చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రపంచ లీడర్‌గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలోని ప్రముఖులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పాలోఆల్టో నెట్‌వర్క్స్ ఛైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందాం.నికేష్‌ అరోరా తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసేవారు. నికేష్‌ క్రమశిక్షణతో కూడిన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1968లో జన్మించిన ఆయన 1990లో వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి బోస్టన్ కాలేజీ నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కెరియర్‌ ప్రారంభంలో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, పుట్నమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పనిచేసి ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై అనుభవాన్ని సంపాదించారు. ఆరంభంలో దాదాపు 400 సార్లు తన జాబ్‌ అప్లికేషన్‌ను కంపెనీలు తిరస్కరించాయి. అయినా ఆయన పట్టుదలతో కృషి చేశారు.గూగుల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌లో..నికేష్ అరోరా 2004లో గూగుల్‌లో చేరడం తనకు టర్నింగ్‌ పాయింటని చెప్పారు. పదేళ్లలో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఎదిగారు. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని 2 బిలియన్‌ డాలర్ల నుంచి 60 బిలియన్‌ డాలర్లకు పెంచడంలో కీలకపాత్ర పోషించారు. యూరప్ కార్యకలాపాల నుంచి ప్రపంచ వ్యాపార వ్యూహం వరకు అన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి.2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, సీఓఓగా వెళ్లి 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్‌కు బీజం వేశారు. ఈ సమయంలోనే ఓలా, ఒయో, స్నాప్‌డీల్ వంటి భారతీయ స్టార్టప్‌లతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భారీ పెట్టుబడులు పెట్టడంలో కీలకంగా మారారు.2018 నుంచి పాలో ఆల్టోలో..జూన్ 2018లో నికేష్‌ పాలో ఆల్టో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్‌ ఆధారిత సైబర్ సర్వీసులను బలోపేతం చేయడానికి 15కి పైగా కంపెనీలను విజయవంతంగా కొనుగోలు చేశారు. Prisma Cloud, Cortex XDR, Cortex XSIAM వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించారు. సైబర్ థ్రెట్‌లను రియల్ టైమ్‌లోనే ఆపే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించారు.2018లో 180 డాలర్లు ఉన్న కంపెనీ స్టాక్ ధర 2025 నాటికి 400 డాలర్లు పైనే ట్రేడవుతోంది. నికేష్ అరోరా నాయకత్వంలో కంపెనీ కేవలం ఐదేళ్లలోనే దాదాపు 120%కు పైగా రిటర్న్‌లను అందించింది.రికార్డు పరిహారంనికేష్ అరోరా సంపాదన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో ఆయన అందుకున్న పరిహారం 151.43 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,260 కోట్లు). ఇది అమెరికాలో ఆ సంవత్సరానికి రెండవ అత్యధిక వేతనం పొందిన సీఈఓగా నిలిపింది. 2025 జులై నాటికి ఆయన వ్యక్తిగత నికర విలువ 1.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.12,500 కోట్లకు) చేరింది. ఇందులో ఎక్కువ భాగం పాలో ఆల్టో నెట్‌వర్క్స్ స్టాక్స్ రూపంలోనే ఉంది.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం

Airbus A320 family aircraft India completed software upgrade know reason2
విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్.. అసలు సమస్యేంటి?

తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్‌బస్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్‌గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.అప్‌గ్రేడ్ వివరాలుఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్‌గ్రేడ్ పూర్తి చేసింది.ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్‌గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్‌లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 25 విమానాల్లో 23 అప్‌గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్‌ చేయనున్నారు.సమస్య ఏమిటి?ఎయిర్‌బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్‌ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్‌లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తక్షణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.ఇదీ చదవండి: యాప్స్‌.. మార్కెటింగ్ యంత్రాలా?

How India Deep Tech Ecosystem New Heights with IIT Madras Incubation Cell3
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అరుదైన ఘనత

ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్‌టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్‌గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్‌ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్‌టెక్ ఎకోసిస్టమ్‌ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్‌గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్‌లకు పుట్టినిల్లు అయింది.స్టార్టప్‌ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్‌ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్‌కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్‌కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్‌ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్‌టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వివరాలు..ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.105 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్‌ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.దాదాపు 40 శాతం స్టార్టప్‌లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్‌ను అందించింది.రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.కీలక రంగాలపై దృష్టిఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్‌టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్‌ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్‌లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: యాప్స్‌.. మార్కెటింగ్ యంత్రాలా?

Gen Z Investors A New Challenge for the Insurance Industry4
జెన్‌ జెడ్‌ ఇన్వెస్టర్లకు బీమా.. డైలమా

పూర్తిగా డిజిటల్‌ శకంలో పెరుగుతున్న జెన్‌ జెడ్‌ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్‌స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్‌ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.జెన్‌ జెడ్‌ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్‌లెస్‌ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్‌ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.జెన్‌ జెడ్‌ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్‌ పాలసీలను, గ్యాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలను జెన్‌ జడ్‌ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.ఏం కోరుకుంటున్నారు..సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్‌ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.పర్సనలైజేషన్‌: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్‌ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్‌టైమ్‌ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్‌–యు–డ్రైవ్‌ కార్‌ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్‌–ఆన్‌లను చేర్చేందుకు వీలుండే హెల్త్‌ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.డిజిటల్‌ ఫస్ట్‌: ఫోన్‌తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్‌ – ఫస్ట్‌ తరహాలో ఉండాలనుకుంటున్నారు.పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్‌ వైపు జెన్‌ జెడ్‌ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్‌.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఈ నేపథ్యంలో జెన్‌ జడ్‌ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్‌ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్‌నెస్‌ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్‌ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.జెన్‌ జడ్‌ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్‌–ఫస్ట్‌గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్‌ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్‌ జడ్‌ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్‌ జడ్‌ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్‌ సెగ్మెంట్‌ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది.

LPG Price Cut gas cylinder becomes cheaper5
వంట గ్యాస్‌ ధరల తగ్గింపు

వంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త! వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్‌ సంస్థలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్లోని తాజా సమాచారం ప్రకారం.. 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ .10 తగ్గింది. కొత్త రేట్లు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ప్రధాన నగరాల్లో గ్యాస్‌ ధరలుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర గత నెలలోని రూ.1,590.50 నుంచి రూ.1,580.50కు తగ్గింది.కోల్‌కతాలో కొత్త ధర రూ.1,694 నుంచి రూ.1,684కు తగ్గింది.ముంబయిలో గత నెలలో రూ.1,542గా ఉన్న ధర రూ.1,531.50కి దిగొచ్చింది.చెన్నైలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1,750 నుంచి రూ.1,739.50కు తగ్గింది.హైదరాబాద్‌లో కమర్షియల్‌ ఎల్‌పీజీ ధర రూ.1,746 నుంచి రూ.1,736కు తగ్గింది.విశాఖపట్నంలో కొత్త ధర రూ.1,722. ఇది గత నెలలో రూ.1,732 ఉండేది.ఇంధన రిటైలర్లు కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సర్దుబాటు చేస్తాయి. అయితే గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్‌ వంట గ్యాస్‌ సిలిండర్ల (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

How Indian Apps Became Marketing Machines know the details6
యాప్‌లా.. మార్కెటింగ్ యంత్రాలా?

భారత్‌లో చాలా మొబైల్‌ యాప్‌లు అవి అందిస్తున్న సర్వీసుల కంటే కూడా బ్రాండ్‌ ప్రమోషన్స్‌ ద్వారా మార్కెటింగ్‌ యంత్రాలుగా మారాయనే వాదనలున్నాయి. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సందర్భంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు అందులోని యాడ్‌లు చూసి ఆశ్చర్యపోయారు. అందులో త్రివర్ణ పతాకంతో ఉన్న క్రికెట్‌ బ్యాట్‌ కింద బ్యానర్‌లో ‘ఈ మ్యాచ్ వీక్‌లో భారీ స్కోర్ చేయండి. బిర్యానీపై 20% తగ్గింపు!’ అని ఉంది. అసలు ఆ యాప్‌కు బిర్యానీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇలా ప్రకటనలు వచ్చాయి.గత దశాబ్దంలో భారతీయ యాప్స్ యుటిలిటీ టూల్స్ నుంచి పూర్తిస్థాయి మార్కెటింగ్ కాన్వాస్‌లుగా మారాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఓలా, పేటీఎం, డంజో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, బుక్‌మైషో, ఓయో.. ఇవి కేవలం సర్వీసులకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ బ్రాండ్ ఎకోసిస్టమ్‌లో భాగమయ్యాయి.తమదైన శైలిలో లేబులింగ్‌..ఒకప్పుడు యాప్ అంటే సెర్చ్ బార్, మెనూ, చెకౌట్ పేజీ.. ఉండేది. ఇప్పుడు యాప్‌లో ప్రతి విభాగం కమర్షియల్‌గా మారింది. హోమ్‌పేజీలో బ్యానర్లు, స్పాన్సర్డ్ రెస్టారెంట్‌ వివరాలు, సజెషన్స్, కిరాణా యాప్స్‌లో స్పాన్సర్డ్ ఉల్లిపాయలు, బిస్కెట్లు.. ఇలా ప్రతి లేబుల్‌లో యాడ్‌ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇవి ప్రకటనలని తెలియకుండా కంపెనీలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవి ప్రకటనలుగా లేబుల్‌ చేయాలి. అయితే అందుకు చాలా కంపెనీలు తమదైన శైలిలో లేబుల్‌ను చాలా చిన్నదిగా చేసి సాధారణ ఉత్పత్తుల్లో భాగంగానే చూపిస్తున్నాయి. దీనినే ‘నేటివ్ అడ్వర్టైజింగ్’ అని పిలుస్తున్నారు.ఈ యాప్స్ కేవలం స్టాటిక్ బ్యానర్లను మాత్రమే ప్రమోట్‌ చేయడం లేదనే వాదనలున్నాయి. ఇవి వినియోగదారుల సందర్భాన్ని, భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నాయి.స్విగ్గీ 2025 ఐపీఎల్ (IPL) సమయంలో ‘స్విగ్గీ సిక్సెస్’ ప్రవేశపెట్టింది. ప్రతి సిక్సర్‌కు డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పింది.జెప్టో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రమోషన్ కోసం ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకుంది.వాహనాల ఆఫర్లను కంపెనీలు పండగలతో లింక్‌ చేస్తున్నాయి.గూగుల్ పే స్క్రాచ్ కార్డులతో చెల్లింపులు పెంచుకుంటోంది.ఇన్‌స్టామార్ట్ దీపావళి సమయంలో వర్చువల్ బాణసంచా ఆఫర్లు అందించింది.ఇలా చాలా కంపెనీలు సందర్భోచితంగా, భావోద్వేగపూరిత యాడ్‌లను అందిస్తున్నాయి.భారతీయులు రోజుకు సగటున 5-6 గంటలు మొబైల్‌తో గడుపుతున్నారు. అందులోనూ ఎక్కువ భాగం 8-10 యాప్స్‌నే వాడుతున్నారు. ఇది బ్రాండ్లకు అపార అవకాశం కల్పిస్తుంది. ఇందుకు కంపెనీలు విభిన్నం పంథాలను ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థల యాప్స్‌ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు కదా?’ అనే ప్రకటనలు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా యాప్స్‌లో ఆర్డర్ హిస్టరీ, చెల్లింపులు వంటి విస్తృతమైన డేటా ద్వారా వినియోగదారుల మనస్తత్వానికి అనుగుణంగా ప్రకటనలు అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి పర్సనలైజేషన్‌ ప్రకటనల వెనుక డేటా ఎంతగా సేకరిస్తున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు.. అనేది పారదర్శకంగా లేదు.కొన్నింటికి ప్రకటనలే దిక్కు..2030 నాటికి భారతదేశంలో యాప్ అడ్వర్టైజింగ్ మార్కెట్ సుమారు 5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తక్కువ మార్జిన్లతో నడిచే డెలివరీ, రైడ్ హెయిలింగ్ కంపెనీలకు ఈ ఆదాయం ఆప్షనల్‌గా ఉండడంలేదు. అవి మనుగడ సాధించాలంటే తప్పకుండా ప్రకటనల ఆదాయం కావాల్సిందే. అయితే, చైనాలో వీచాట్ ఒకప్పుడు ప్రమోషనల్ ఇంటర్‌ఫేస్‌గా ఉండేది. యూజర్లు క్రమంగా తగ్గిపోతుండడంతో తిరిగి తన అసలు బిజినెస్‌పై దృష్టి సారించింది. బ్రాండింగ్‌ ప్రమోషన్‌లో తప్పేంలేదు. కానీ యాప్‌ ఇంటర్‌ఫేస్‌లో ప్రధానంగా బ్రాండ్లనే ప్రమోట్‌ చేస్తే అసలు సర్వీసులు మరుగునపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం

Advertisement
Advertisement
Advertisement