Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Vodafone Idea Strengthens Network in Sabarimala Route1
శబరిమలలో నెట్‌వర్క్‌ను పెంచిన వొడాఫోన్‌ ఐడియా

భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్‌ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్‌ టవర్‌లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్‌డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్‌ బ్యాండ్స్‌కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్‌తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో రిజిస్టర్‌ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్‌ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.

Businessmen devotees of Satya sai baba2
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు

తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను సంపాదించుకున్న సత్య సాయిబాబా (Sri Sathya Sai Baba) ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాలలోనూ సత్య సాయిబాబా భక్తులు ఉన్నారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన ఎందరో ప్రముఖలు, పారిశ్రామికవేత్తలూ ఆయన సేవలో తరించారు. సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా వారిలో కొందరి గురించి..ర్యుకో హిరా: జపాన్‌కు చెందిన హెచ్‌ఎంఐ హోటల్ గ్రూప్ వ్యవస్థాపకులు. ప్రముఖ అంతర్జాతీయ సాయి భక్తులలో ఒకరు. ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ దాత ఈయనే. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ధర్మకర్తగా కూడా ఉన్నారు.రతన్ టాటా: టాటా సన్స్ దివంగత చైర్మన్. సాయిబాబా కార్యక్రమాలకు హాజరై ఆయన పట్ల గౌరవప్రదమైన ఆధ్యాత్మిక అభిమానాన్ని కొనసాగించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమ రూపకల్పనకు సహాయ సహకారాలందించారు.ఇందులాల్ షా: చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఈయన వ్యాపార వర్గాలలో ప్రముఖుడిగా పేరు గాంచారు. సాయి సంస్థల ప్రపంచ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఏవీఎస్ రాజు: పారిశ్రామికవేత్త, ఎన్‌సీపీ (నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ) వ్యవస్థాపకుడు. సాయిబాబాకు అత్యంత భక్తుడు. సాయిబాబాపై అనేక పుస్తకాలు రాశారు.మనోహర్ శెట్టి: ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపారవేత్త. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో అనేక సేవ, నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.వేణు శ్రీనివాసన్: టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్. బాబా దీర్ఘకాల భక్తుడు. సాయిబాబాతో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలుసార్లు పంచుకున్నారు. అనేక సాయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.లియో ముత్తు: లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (తమిళనాడు) వ్యవస్థాపకుడు. సాయి బోధనల ప్రభావానికి గురై ఆయనకు భక్తుడిగా మారారు.క్రిస్ గోపాలకృష్ణన్: యాక్సిలార్‌ వెంచర్స్‌ చైర్మన్‌. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన సత్యసాయి ఆరాధకుడిగా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

QualiZeal Everest Group release whitepaper on AI infused quality engineering3
ఏఐతో సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ వేగవంతం

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్‌గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్‌ఏఐ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్‌ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్‌ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.సాఫ్ట్‌వేర్‌లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్‌ గ్రూప్‌తో కలిసి ‘‘రీఇమేజినింగ్‌ ఎంటర్‌ప్రైజ్‌ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్‌ నివేదికను విడుదల చేసింది.ఆధునిక సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్‌ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్‌ కేస్‌ స్టడీస్‌ని ఇందులో పొందుపర్చింది.

Container homes real estate House construction tips4
ఇవి బిగించుకునే ఇళ్లు..

కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్‌ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్‌ ప్లాట్లకు, ఫామ్‌హౌస్‌లకు డిమాండ్‌ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్‌ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్‌ హోమ్స్‌కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్‌ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో కంటైనర్‌ హోమ్స్‌ ఎక్కువ డిమాండ్‌ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్‌ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్‌లో సరదాగా గడుపుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. కంటైనర్‌ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్‌ స్టీల్స్‌(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్‌ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్‌ బోర్డ్‌ వేస్తారు. దానిపైన పాలీ వినైల్‌ ఫ్లోర్‌(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్‌ బోర్డ్‌ మీద టైల్స్‌ కూడా వేసుకోవచ్చు.ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్‌ స్ట్రక్చర్‌లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్‌ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్‌ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్‌ ప్యానల్స్‌లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ప్రీ ఫినిష్డ్‌ వ్యాల్యుమెట్రిక్‌ కన్‌స్ట్రక్షన్‌(పీపీవీసీ)లతో రూపొందిస్తారు. తలుపులు, కిటికీలు ఇంపాక్ట్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్‌ వుడ్‌ కాంపోజిట్, సిమెంట్‌ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్‌ ఇన్యులేషన్‌తో వాల్‌ ప్యానెల్‌ క్లాడింగ్‌లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్‌ హోమ్‌లో తక్కువగా ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయంటే?విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్‌ హోమ్స్‌ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్‌ హోమ్‌కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్‌ హోమ్‌లో హాల్‌లోనే ఓపెన్‌ కిచెన్, బెడ్‌రూమ్‌లో అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.కంటైనర్‌ హోమ్స్‌లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్‌ ఇంజనీరు, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.మన్నిక ఎన్నేళ్లంటే? ఈ కంటైనర్‌ హోమ్స్‌ స్ట్రక్చరల్‌ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్‌ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్‌మెంట్‌కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్‌ హోమ్స్‌కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్‌ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్‌కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్‌ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్‌తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.ఇదీ చదవండి: ఓపెన్‌ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!

Indkal enters smartphone market launches first device Wobble One5
కొత్త ఫోనొచ్చింది.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి నయా కంపెనీ

కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ సంస్థ ఇండ్‌కాల్‌ మొబైల్‌ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్‌ వన్‌’ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్‌ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), థర్డ్‌పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మాడ్యుల్, హార్డ్‌వేర్‌లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జర్‌ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్‌లో లభ్యం కాని చిప్‌సెట్‌ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.ఆకట్టుకునే ఫీచర్లు: వూబుల్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్‌ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది.

Zomato, Swiggy welcomes to Labour Codes6
లేబర్‌ కోడ్‌తో వర్కర్లకు ప్రయోజనం 

న్యూఢిల్లీ: కొత్తగా నోటిఫై చేసిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ను స్విగ్గీ, జొమాటో మొదలైన అగ్రిగేటర్లు స్వాగతించాయి. ఈ సంస్కరణలతో లక్షల కొద్దీ వర్కర్లకు మేలు జరుగుతుందని స్విగ్గీ పేర్కొంది. తమ వ్యాపార వ్యయాలపై, దీర్ఘకాలికంగా ఆర్థిక పనితీరుపై ఇందుకు సంబంధించిన భారమేమీ ఉండదని వివరించింది. కంపెనీలపై నిబంధనల భారం తగ్గిస్తూ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. మరోవైపు గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత మరింత అందుబాటులోకి వస్తుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్‌ పేర్కొంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేస్తూ, గిగ్‌ వర్కర్ల నిబంధనల్లో ఏకరూపత తెచ్చే దిశగా ఇది సరైన అడుగని తెలిపింది. దీనివల్ల తమ జొమాటో, బ్లింకిట్‌ వ్యాపార విభాగాలపై ఆర్థిక భారమేమీ ఉండదని వివరించింది. గిగ్‌ వర్కర్లకు ఇప్పటికే తాము సమగ్ర బీమాతో పాటు ఇతరత్రా ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఎటర్నల్‌ వివరించింది.

Advertisement
Advertisement
Advertisement