ప్రధాన వార్తలు
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.16 శాతం పుంజుకుంది.Today Nifty position 02-04-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో కృత్రిమంగా ఒత్తిడి పెంచుతున్న స్పెక్యులేటర్ల ఆట కట్టించేలా తాజాగా ఆంక్షలు జారీ చేసింది. ఇది డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో రికవరీకి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఆఫ్-షోర్ స్పెక్యులేషన్లకు బ్రేక్తాజా మార్గదర్శకాల ప్రకారం, భారత్లో నివసించే వారు లేదా ప్రవాస భారతీయులు ఎవరూ రూపాయికి సంబంధించిన నాన్-డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను (ఎన్డీఎఫ్) ఆఫర్ చేయకుండా అధీకృత డీలర్లపై (బ్యాంకులపై) ఆర్బీఐ నిషేధం విధించింది. ముఖ్యంగా ఆన్-షోర్ (భారత మార్కెట్), ఆఫ్-షోర్ (విదేశీ మార్కెట్) ధరల మధ్య ఉన్న తేడాను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు చేసే ఆర్బిట్రేజ్ ట్రేడ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. ఇకపై క్లయింట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్ కాంట్రాక్టులను ఒకసారి రద్దు చేసిన తర్వాత వాటిని తిరిగి బుక్ చేసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.రూపాయిపై ప్రభావంసెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డాలర్-రూపాయి ఫార్వర్డ్స్ ఈ వారం ఇప్పటివరకు 1.4% పడిపోయాయి. ఇది రూపాయి బలపడుతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. గత దశాబ్ద కాలంలో లేనంత సాహసోపేతమైన చర్యగా బ్యాంకుల రోజువారీ ఆన్-షోర్ కరెన్సీ పొజిషన్లను 100 మిలియన్ డాలర్లకు ఆర్బీఐ పరిమితం చేసింది.‘రూపాయికి వ్యతిరేకంగా విదేశీ మార్కెట్లలో జరుగుతున్న స్పెక్యులేషన్లను అరికట్టడానికి ఇది అత్యంత కఠినమైన చర్య. గురువారం మార్కెట్లు తెరుచుకోగానే రూపాయి విలువ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కరెన్సీ ఎక్స్పర్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.బీఐఎస్ నివేదికల ప్రకారం సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో రూపాయి సగటు రోజువారీ ఆఫ్-షోర్ ట్రేడింగ్ 149 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ భారీ మార్కెట్ భారత దేశీయ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ అభిప్రాయం ప్రకారం ‘మారకపు రేటు నిర్ణయాధికారాన్ని ఆన్-షోర్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చంది. దేశ పన్ను చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని.. వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలం నాటి ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో మరింత సరళతర చట్టంగా కేంద్రం దీన్ని రూపొందించడం తెలిసిందే. మరింత స్పష్టత, నిబంధనల అమలు సులభతరం, సరళమైన భాష, చదివే వారు అర్థం చేసుకునేందుకు అనుకూలత ఇందులోని ప్రత్యేకతలుగా సీబీడీటీ పేర్కొంది.కొత్త చట్టానికి మారే క్రమంలో పాత, కొత్త పన్ను చట్టాల పరిధిలో నిబంధనల అమలుకు ఇ–ఫైలింగ్ పోర్టల్ వీలు కలి్పంచనుందని సీబీడీటీ తెలిపింది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయని, అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ఏఐ అప్స్కిల్లింగ్పై ఫోకస్
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.నైపుణ్యాల పెంపే లక్ష్యం!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్కౌంట్ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్స్కిల్లింగ్పై దృష్టి సారించాం’ అని తెలిపారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్లోనే ఉండటం విశేషం.భారతీయ సంస్థల్లో సవాళ్లుఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.భద్రత ముఖ్యంఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చాలని సంస్థ భావిస్తోంది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్)ని యూనిట్లకు ఏడాది కాలం పాటు సుంకాల్లో రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూనిట్లు తమ ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపింది.ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సెజ్ యూనిట్లలో తయారైన వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గనుంది. కొన్ని కేసుల్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) కూడా వర్తించదు. రసాయనాలు, ఎరువులు, టెక్స్టైల్స్, ఫుట్వేర్, మెషినరీ ఇలా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులకు ఈ ప్రయోజనాలు అమలు కానున్నాయి. 2025 మార్చి 31కి ముందు సెజ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన యూనిట్లకే ఈ మినహాయింపు వర్తిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో తాము పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకుండా ఉన్నామని, వస్తువులను దేశీ మార్కెట్లో రాయితీ రేట్లపై విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎగుమతి యూనిట్లు డిమాండ్ చేయడం గమనార్హం.తక్కువ రేట్లుసెజ్ యూనిట్లలో తయారైన వస్తువులకు ప్రస్తుతం అమలవుతున్న 7.5 శాతం స్థానంలో 6 శాతం, 10 శాతం బదులు 9 శాతం, 12.5 శాతం, 15 శాతం బదులు 10 శాతం రేట్లు వర్తిస్తాయి. అలాగే, 20 శాతం అమలయ్యే చోట 12.5 శాతం, 20–30 శాతం బ్రాకెట్లోని వాటికి 15 శాతం, 30–40 శాతం సుంకాల పరిధిలోని వాటికి 20 శాతమే ఇకపై అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 9% పెరిగి రూ.2,00,064 కోట్లకు చేరింది. ఇందులో దిగుమతులపై జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 17.8% పెరిగి రూ.53,861 కోట్లుగా ఉంది. 2025–26లో నెలవారీ మూడో అత్యధిక వసూళ్లు ఇవి. 2025 ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్లు వసూలు కాగా, మేలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2025 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది. మార్చి నెలలో రిఫండ్లు 13.8% పెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం 8% వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాదితో పోల్చి చూస్తే 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తులపై పన్ను రేటు దిగిరావడం తెలిసిందే. అయినప్పటికీ జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
కార్పొరేట్
చైనా సీసీ కెమెరాలకు చెక్! ఇక కొత్త నిబంధనలు
ఎయిర్టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్ అంబానీపై కేసు
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
కొచ్చి చేరుకున్న నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత!
ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని వ...
పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ ...
ఐపీఓకు ఆరు కంపెనీలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మా...
80.4 శాతానికి ద్రవ్యలోటు
కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్ర...
ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి బెటర్!
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే ...
ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎర...
రేపటి నుంచి కొత్త లేబర్ కోడ్లు అమలు?
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల జీవితాల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ట్యాబ్లెట్ పీసీల్లో శాంసంగ్ టాప్..
ముంబై: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్ 31% మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్ మార్కెట్లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్గా మారింది. ఈ విభాగంలో షిప్మెంట్లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రధాన అనలిస్ట్ అన్షికా జైన్ తెలిపారు. కొనసాగిన శాంసంగ్ హవా: భారత్ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది కూడా శాంసంగ్ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్ ఏ9 సిరీస్కు మంచి డిమాండ్ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. యాపిల్ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్ (2025) 128జీబీ మోడల్కు మంచి డిమాండ్ ఉండటం గమనార్హం. ఐప్యాడ్ ప్రో సిరీస్లో ఓఎల్ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ స్థానం బలపడింది. లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్మెంట్ పెరు గుదలతో 11% మార్కెట్ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది. ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్ ఎగుమతులు ఒక మిలియన్ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్మెంట్లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్ గ్లోబల్ ట్యాబ్లెట్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్ ఆధారంగా 2026లో మార్కెట్ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్లు, ప్రొడక్టివిటీ డివైజ్లకు పెరుగుతున్న డిమాండ్ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అభిప్రాయపడింది.
జియో మంత్లీ ప్లాన్లు.. 30 రోజులు వ్యాలిడిటీ
మొబైల్ రీచార్జ్కు సంబంధించి సాధారణంగా మంత్లీ రీచార్జ్ ప్లాన్లు అంటే 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంటాయి. కానీ నెలంతటికీ అంటే 30 రోజులూ వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియోలో రెండు చౌకైన రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలకు సరిపడా డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు కళ్లు చెదిరే అదనపు బెనిఫిట్స్, ముఖ్యంగా ఏఐ (AI) ప్రియుల కోసం ఈ ప్లాన్లో భారీ ఆఫర్లను చేర్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..జియో రూ. 365 ప్లాన్జియో తన వెబ్సైట్, యాప్లో రూ. 365 ధరతో కూడిన ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లకు భిన్నంగా ఇది పూర్తి 30 రోజుల కాలపరిమితితో వస్తుంది.ప్రయోజనాలుడేటా: మొత్తం 25 GB హై-స్పీడ్ డేటాకాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.టాక్ టైమ్: అదనంగా రూ. 7.47 విలువైన టాక్ టైమ్ లభిస్తుంది.ఈ ప్లాన్ కేవలం డేటాకే పరిమితం కాకుండా, భారీ సబ్-స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్-స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 2000 GB క్లౌడ్ స్టోరేజ్, అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటాయి. (గమనిక: ఈ బెనిఫిట్ కొనసాగాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లో యాక్టివ్గా ఉండాలి).డిస్నీ+ హాట్స్టార్: 3 నెలల పాటు మొబైల్/టీవీ సబ్-స్క్రిప్షన్.జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud): 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.ఇతర యాప్లు: జియో టీవీ, జియో సినిమా సబ్-స్క్రిప్షన్లు.రూ. 355 'ఫ్రీడమ్ ప్లాన్'దాదాపు ఇవే ప్రయోజనాలతో జియో రూ. 355 కేటగిరీలో మరో ప్లాన్ను కూడా అందిస్తోంది. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 25 GB డేటా, అపరిమిత కాలింగ్ , పైన పేర్కొన్న ఏఐ (AI), ఓటీటీ సబ్-స్క్రిప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా నానో బనానా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ రూ. 365 ప్లాన్లో అపరిమిత 5G డేటా గురించి జియో అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 4G డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
వ్యూహాత్మక ఖనిజాల వేట
సాంకేతిక, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశీయంగా ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల’ (అరుదైన అయస్కాంత ఖనిజాలు) ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 5,000 టన్నుల అరుదైన అయస్కాంత ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు.విశాఖలో ప్లాంట్ ప్రారంభంఅణుశక్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో ‘సమారియం-కోబాల్ట్’ అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 500 టన్నులు. తదుపరి దశలో దీన్ని 2,000 టన్నులకు, ఆపై 2030 నాటికి 5,000 టన్నులకు పెంచనున్నారు. నియోడైమియం-ఐరన్-బోరాన్ వంటి అధునాతన అయస్కాంతాల తయారీపై పైలట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టింది.పెరుగుతున్న డిమాండ్.. ప్రైవేటు భాగస్వామ్యంప్రస్తుతం దేశంలో ఈ అయస్కాంతాల అవసరం ఏడాదికి 4,000 టన్నులుగా ఉండగా 2030 నాటికి అది 8,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. తద్వారా కీలక ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపింది. అయితే, యురేనియం వంటి వ్యూహాత్మక వనరులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది.లిథియం అన్వేషణపై దృష్టిఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన లిథియం కోసం రాజస్థాన్లోని దేగానా, జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దేగానాలో ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ శుద్ధి ప్రక్రియను బలోపేతం చేయనున్నారు.వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?ఈ అరుదైన ఖనిజాలు కేవలం ఎలక్ట్రానిక్స్ కోసమే కాకుండా.. రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ల తయారీలో, అంతరిక్ష రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, గ్రీన్ ఎనర్జీ విభాగంలో విండ్ టర్బైన్లు, ఈవీ మోటార్లలో ఇవి అత్యంత కీలకం. రాజస్థాన్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శిలల రూపంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం కొంత సంక్లిష్టమైనప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సవాలును అధిగమిస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఏప్రిల్ నుంచి ఇక ఉద్యోగాల జాతరే..
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి అర్ధభాగంలో ఉపాధి ఊపందుకోనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ నివేదిక పేర్కొంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఉద్యోగాలు 4.7 శాతం పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్స్, హెల్త్కేర్, ఫార్మా, తయారీ(మ్యాన్యుఫాక్చరింగ్) రంగాలు ఊతమివ్వనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో టీమ్లీజ్ తెలియజేసింది.భారీ ఎంటర్ప్రైజెస్లో ఉపాధి కల్పన కనిపించనున్నట్లు తెలియజేసింది. వీటిలో 74 సంస్థలు విస్తరణ చేపట్టే సంకేతాలిచ్చినట్లు పేర్కొంది. మధ్యస్థాయి సంస్థలు 57 శాతం, చిన్న బిజినెస్లు 38 శాతం విస్తరణ యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. వెరసి విస్తరణ ద్వారా ఉపాధి కల్పన విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇటు డిజిటల్, అటు కీలక ఆర్థికవ్యవస్థ సంబంధిత పరిశ్రమల నుంచి ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఎకానమీ వృద్ధికి కీలకంగా నిలిచే రంగాలలో విద్యుత్, స్టీల్, చమురు గ్యాస్, సిమెంట్, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టులు తదితరాలున్నాయి. 8.9 శాతం ఎన్ఈసీ అత్యధికంగా ఈకామర్స్, టెక్ స్టార్టప్లు 8.9 శాతం నికర ఎంప్లాయ్మెంట్ చేంజ్(ఎన్ఈసీ)కు కారణంకానున్నట్లు టీమ్లీజ్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఫార్మాస్యూటికల్స్ 7 శాతం, తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు 6.6 శాతం ఎన్ఈసీ సాధించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో 4.7 శాతం ఎన్ఈసీ నమోదుకానున్నట్లు అభిప్రాయపడింది. నివేదికను 20 నగరాల నుంచి 23 రంగాలకు చెందిన 1,268 సంస్థల(ఎంప్లాయర్స్) అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా రూపొందించింది.ఇందుకు 2025 నవంబర్ నుంచి 2026 జనవరి కాలంలో సర్వే చేపట్టింది. దేశీయంగా మానవవనరుల పరిస్థితులు సైక్లికల్ డిమాండ్ను అనుసరించడంకాకుండా వ్యవస్థాగత, విధానపరమైన అంశాల ఆధారంగా మా ర్పులకు లోనవుతున్నట్లు వివరించింది. కాగా.. శ్రామిక చట్టాల అమలు కారణంగా ఉద్యోగ వ్య యాలు 80% పెరగనున్నట్లు 64 సంస్థలు తెలియజేశాయని, వేతన వ్యవస్థను పునర్నిర్వచించడం ప్రభావం చూపనున్నట్లు టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026
మ్యూచువల్ ఫండ్స్: ‘సిప్’ ఇన్వెస్టర్లకు షాక్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో పెట్టుబడులు పెడుతున్న వారికి మార్కెట్ పనితీరు షాక్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే గడిచిన ఏడాది, రెండేళ్ల కాలంలో వీటిల్లో రాబడి లేకపోగా, నష్టాలు మిగిలాయి. ముఖ్యంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టపోయినవి ఉన్నాయి. 556 పథకాలను పరిశీలించగా, వీటిల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు ఎంతో కొంత లాభాలను పంచాయి. విదేశీ ఫండ్స్లో లాభాలు.. ముఖ్యంగా గత కొంత కాలంలో దేశీ పథకాలు నష్టాలను మిగల్చగా, అంతర్జాతీయ ఫండ్స్ రాబడులు కురిపించాయి. ఇందులో క్వాంట్ టెక్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఇండియా ఫండ్ సైతం ఉన్నాయి. కారణాలు ఎన్నో.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రాబడులకు గ్యారంటీ లేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక పరిణామాలకు అనుగుణంగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుంటాయి. దిద్దుబాటుకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం పాటు దిద్దుబాటు దశలోకి వెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో స్మాల్, మిడ్క్యాప్లో ఎక్కువ దిద్దుబాటు కనిపిస్తుంటుంది. కనుక స్వల్పకాలానికి ఈక్విటీలు అనుకూలం కాదు. మధ్య, దీర్ఘకాలానికే వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నది నిపుణుల సూచన.కనీసం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయినా సరే ఐదేళ్లలోనే రాబడులు వస్తాయని చెప్పలేం. అనుకోకుండా మార్కెట్లు ఐదేళ్లపాటు దిద్దుబాటు, స్థిరీకరణ దశలోకి వెళితే రాబడులు లేకపోగా, నష్టాలూ ఎదురుకావొచ్చు. లంప్సమ్ అయినా, సిప్ అయినా రాబడులు/నష్టాలు మార్కెట్ గమనంపైనే ఆధారపడి ఉంటాయి. కనీసం 7–10 ఏళ్ల కాలంలో ఈ ప్రతికూలతలను అధిగమించి మెరుగైన రాబడులు అందుకోవచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? రాబడుల వెంట పరుగెత్తకుండా, గడిచిన ఏడాది కాల రాబడులను అనుసరించకుండా ఎంపిక చేసుకున్న పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫండ్స్కు సైతం కొంత కేటాయించుకోవాలన్నది సూచన. అంతర్జాతీయంగా ఏఐ, టెక్ ఫండ్స్కు లేదా చైనా, యూఎస్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని జెడ్ఫండ్స్ సీఈవో మనీష్ కొతారి పేర్కొన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫండ్స్ మంచి పనితీరు వెనుక ఏఐ, టెక్ అంశాలున్నాయని చెప్పారు. సిప్ను కేవలం 2–3 ఏళ్ల కాలానికి చూడొద్దన్నారు. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి, సంపద సృష్టించుకునేందుకు రూపొందించిన సాధనం సిప్ అని చెప్పారు. కనీసం 10–15 ఏళ్ల కాల దృష్టితో చూడాలన్నారు. అంతర్జాతీయ ఫండ్స్కు 10–20 శాతం మేర పెట్టుబడులు కేటాయించుకోవచ్చని, ముఖ్యంగా యూఎస్ మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచించారు.
బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!
మీకు ఈ వారం బ్యాంకు పనులున్నాయా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మార్చి 30 నుండి ఏప్రిల్ 5 మధ్య దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, ఆదివారం సెలవుల కారణంగా ఈ వారంలో దాదాపు ఆరు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సందర్భాలను పురస్కరించుకుని ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ వారంలో ఆరు రోజులు మూతపడనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచేది వారంలో ఒక్క రోజే అన్నమాట.సెలవుల పూర్తి వివరాలు ఇవే..మార్చి 30 (సోమవారం): మహావీర్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు పనిచేయవు.మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో సెలవు.ఏప్రిల్ 1 (బుధవారం): బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Annual Closing) సందర్భంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ వినియోగదారులకు సేవలు నిలిచిపోతాయి.ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కేరళలో బ్యాంకులు మూసివేస్తారు.ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.సాధారణంగా నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కాబట్టి ఏప్రిల్ 4 (శనివారం) నాడు బ్యాంకులు తెరిచి ఉండే అవకాశం ఉంది.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) చెల్లింపులు (GPay, PhonePe మొదలైనవి) ఎప్పటిలాగే పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎం (ATM) కేంద్రాల్లో నగదు ఉపసంహరణ సేవలు కొనసాగుతాయి.ముందస్తు ప్రణాళిక అవసరంవరుస సెలవుల దృష్ట్యా నగదు అవసరాలు లేదా చెక్కుల క్లియరెన్స్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
2022–23 రిటర్నులు వేయకపోతే..
పైన చెప్పినది 2022–23 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించినది. చెప్పాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయం. పరాభవ నామ సంవత్సరం ప్రారంభంలోనే ఇన్కం ట్యాక్స్ డిఫాల్టర్లకు డిపార్ట్మెంట్ వారు షాకిచ్చారు. షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందయ్యా అంటే.. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సైకిల్ 6ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా రిస్క్ మేనేజ్మెంట్లో ఆరు అంశాలు ఉంటాయి. అవేంటంటే..🔸 రిస్క్ని గుర్తించడం 🔸 వాటి విశ్లేషణ 🔸 నిర్ధారణ 🔸 తగిన చర్యలు తీసుకోవడం 🔸 పర్యవేక్షణ 🔸 నివేదికఇంచుమించు ఇదే పంథాలో డిపార్ట్మెంట్ తమ పంజా విసురుతోంది. డిపార్ట్మెంట్ వారి నిర్వహణ నిమిత్తం అంటు 2026 మార్చి 23న ఒక అంతర్గత సూచన అంటూ జారీ చేశారు. విషయం ఏమిటంటే, 2021–22 ఆర్థిక సంవత్సరం.. అంటే 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో జరిగిన పెద్ద వ్యవహారాలను బైటికి తీసి (అలాగని .. వార్తాపత్రికల్లో ప్రచురించరు), వాటిని విశ్లేషించి, అసలు రిటర్నులు వేయనివారిని, అంటే, నాన్–ఫైలర్స్ని గుర్తించి, వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతారు.ఎలా గుర్తిస్తారు?ఆర్థిక వ్యవహారాల పట్టికలు. ప్రతి సంవత్సరం స్థిరాస్తి క్రయవిక్రయాలు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించి వాటి నిర్వాహక సంస్థల నుంచి డిపార్ట్మెంట్ వారికి సమాచారం చేరిపోతుంది. వార్షిక సమాచార రిటర్న్ ద్వారా ఇది జరుగుతుంది.టీడీఎస్ సర్టిఫికెట్లు. ప్రతి డిడక్టర్ టీడీఎస్ మొత్తాన్ని రికవర్ చేసి, సకాలంలో గవర్నమెంట్ ఖజానాకి చెల్లించాలి. ఆ మేరకు సరి్టఫికెట్లు 16 లేదా 16ఏ జారీ చేయాలి. అంతే కాకుండా వాటికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి. వీటిలో మీకు చేసిన చెల్లింపుల వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయి.టీడీఎస్లాగానే, టీసీఎస్పరంగా మీ సంబంధిత సమాచారం ఉంటుంది.జీఎస్టీ రికార్డులుఎగుమతులు–దిగుమతులు. కస్టమ్స్ అధికారి వద్ద రికార్డులు, షిప్మెంట్ రికార్డులు, హెచ్ఎస్ఈ కోడ్లు, వాళ్ల పేర్లు, టర్నోవర్ వివరాలు, విలువ.. ఈ సమాచారం అంతా ఉంటుంది.ట్యాక్స్ పేయర్స్ ప్రొఫైల్స్మీ ఆర్థిక వ్యవహారాల చిట్టాఆస్తులు.. అప్పులుఎవరితో ఏయే వ్యవహారాలు జరిపారు.థర్డ్ పార్టీతో వ్యవహారాలుఇలాంటి వివరాలన్నీ సేకరించి మీ రిటర్న్ ప్రొఫైల్, ఆర్థిక సమాచారపు ప్రొఫైల్, వ్యక్తిగత సమాచారపు ప్రొఫైల్, అకౌంట్స్, ఆస్తుల ప్రొఫైల్, ఎవరితో సంబంధం ఉందో ఆ ప్రొఫైల్, ఇతర ఏజెన్సీల ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి దగ్గర నుండి సమాచారం అందుకోని వారి జాబితా, అందుకుని కూడా రెస్పాన్స్ ఇవ్వని వారి జాబితాలు తయారు చేసి, అందులోని నాన్–ఫైలర్స్ని బైటికి తీస్తారు. ఆ తర్వాత నోటీసులు.. ప్రక్రియ మొదలు.ఈ మేరకు దిశ, సూచనలు, సలహాలు, ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు రిటర్నులు అనవసరమైతే, వారిని వదిలేస్తారు. రిటర్నులు వేయాల్సి ఉన్నా, వేయని డిఫాల్టర్స్ని మాత్రం వదలరు. ‘ఇన్కం – ఎస్కేప్డ్‘ కింద భావించి, కథ నడుపుతారు. ఈ రోజు 2021–22 మొదలు, త్వరలోనే ఆ తర్వాత సంవత్సరాల వ్యవహారాల మీదా నిఘా ఇలాగే ఉంటుంది. తగిన జాగ్రత్త వహించండి. అందాకా కథ పోనివ్వకండి. అప్డేటెడ్ రిటర్న్స్ వేసుకునే అవకాశం ఉన్న కాగితాలతో వృత్తి నిపుణులను సంప్రదించండి.ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన రాసిన పద్యం గుర్తుంచుకోండి ‘వచ్చిన వాడు ఫల్గుణుడు. అవశ్యము గెల్తుమనంగ రాదు‘ అని. దాని అర్థం ఏమిటంటే, ఆ వచ్చిన వాడు అర్జునుడు.. యుద్ధం చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు.. మనం సిద్ధంగా ఉండాలి. దేనికైనా ఓర్చుకోవాలి. సంధి చేసుకోవడం మంచిదని భావం.మనకు అన్వయించుకుంటే.. ఆ వచ్చేవాళ్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విస్తృత అధికారాలతో పాటు సమాచారంతో వస్తారు. సరైన తోవలో నడుచుకోవడం శ్రేయస్కరం.


