Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 6th February 2026 in Telugu states1
క్రాష్‌.. క్రాష్‌.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి

బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్‌ అయ్యాయి. మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

RBI Maintains Status Quo on Interest Rates in Final FY26 Policy Review2
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్‌ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు.

Stock market updates on 6th​ February 20263
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు ఆర్బీఐ పాలసీ డే కోసం సన్నద్ధమవుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం సెషన్ ను 64.61 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 83,249.32 వద్ద ప్రారంభించగా, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 37 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టపోయి 25,605.80 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్ ప్యాక్ లో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ 1.29 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి ఇండియా 1.28 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.20 శాతం, 0.41 శాతం తగ్గాయి. ఎన్ ఎస్ ఈలో సెక్టోరల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఫార్మా, ఆటో, మెటల్, మీడియా సూచీలు 0.80 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫైనాన్షియల్స్ 0.33 శాతం వరకు లాభాలు సాధించాయి.

Urban Company Workers Earnings Beat Entry Level IT Salaries4
ఐటీ జీతాల కంటే అర్బన్‌ కంపెనీలో అధిక‍ సంపాదన!

ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్‌ఫామ్‌పై గిగ్‌వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్‌ కంపెనీ తెలిపింది. అర్బన్‌ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్‌డోర్‌ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.తమ ప్లాట్‌ఫామ్‌లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్‌ కంపెనీ తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై టాప్‌–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్‌–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్‌–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది.

LIC Posts Strong Q3 Performance with 17pc Jump in Net Profit5
ఎల్‌ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్‌’

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్‌ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్‌) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది. ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్‌ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్‌ సేవల విస్తరణ, కస్టమర్‌ సర్వీస్‌ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

IKEA Indias Losses Widen to Rs 1,325 Crore as Sales Dip and Debt Rises6
భారత్‌లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్‌ రిటైల్‌ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు భారత్‌లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది.

Advertisement
Advertisement
Advertisement