Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tax Relief for Tech Firms Clarity on Data Center Investments Budget 20261
డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత

భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్‌లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్‌లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్‌లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.ఎందుకు ఈ నిర్ణయం?క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.దీనివల్ల కలిగే ప్రయోజనాలుఅమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలోని కీలక ప్రకటనలు

Key Highlights from Nirmala Sitharaman Speech2
నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలోని కీలక ప్రకటనలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం చేయడం విశేషం. రూ.53.47 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్‌ మంత్రి ప్రకటనలు కీలకంగా కింది విధంగా ఉన్నాయి.ఆదాయపు పన్నుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఈసారి పన్ను శ్లాబుల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సరళీకరణపై దృష్టి సారించారు.కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ఐటీ రిటర్నులను సవరించుకునే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.విదేశీ విద్య, వైద్యం, టూర్ ప్యాకేజీలపై ‘ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్’ (టీసీఎస్‌)ను 5% నుంచి 2%కి తగ్గించారు.మౌలిక సదుపాయాలు, రవాణాదేశాభివృద్ధికి ఇంజిన్లుగా భావించే మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.కొత్తగా 20 జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లను కేటాయించారు.సాంకేతికత, పరిశ్రమలుభారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా చిప్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.40,000 కోట్లు కేటాయించారు.ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.ఎంఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.10,000 కోట్ల నిధిని ప్రకటించారు.ఆరోగ్య, రక్షణ రంగాలుక్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాణరక్షక మందులు చౌకగా లభించనున్నాయి.దేశ భద్రత కోసం రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లను కేటాయించారు.ఆర్థిక లోటు, వృద్ధి రేటుభారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.2026-27 సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

Boost Your House Resale Value: House Construction Tips3
ఇంటికి మంచి రేటు రావాలంటే.. ఇవిగో చిన్న టిప్స్‌..

కొనేటప్పుడు తక్కువ ధర, అమ్మేటప్పుడు ఎక్కువ ధర కావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. నివాసం ఉండేందుకు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు ఇంకొందరు. ఏదేమైనా భవిష్యత్తు అవసరాల కోసం ఇంటిని విక్రయించే సమయంలో అధిక ధర రావాలని కోరుకోవడం సహజం. అయితే సాధారణ ఇళ్లతో పోలిస్తే నిర్వహణ బాగున్న ఇంటికే ధర అధికంగా వస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న టిప్స్‌తో సొంతింటిని లాభదాయక ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చో ఒకసారి చూద్దాం.ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకోవడంతోనే సరిపోదు. ఎలాంటి సమయంలో విక్రయించాలో కూడా తెలిసుండాలి. లేకపోతే ప్రాపర్టీ అమ్ముడుపోకపోవడమే కాదు ఇష్టం వచ్చిన రేటుకు అడిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మార్కెట్‌ బాగున్నప్పుడే ఇంటిని విక్రయించాలే తప్ప ప్రతికూల సమయంలో అమ్మాలనుకుంటే మాత్రం మనం పెట్టిన ధర కంటే తక్కువకు పోయే ప్రమాదం ఉంటుంది.రీసెర్చ్‌ చేశాకే నిర్ణయం.. ముందుగా మీ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్ల ధరలు ఎంత ఉన్నాయో పరిశోధన చేయాలి. రీసేల్‌ ప్రాపరీ్టల మార్కెట్‌ ఎలా ఉంది? ఎంత రేటుకు పోతున్నాయో పరిశీలించాలి. ఒకట్రెండు రీసేల్‌ ప్రాపర్టీ యజమానులతో మాట్లాడి.. ఇల్లు కొనేందుకు ముందుకొచ్చే కొనుగోలుదారుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు విక్రయించాలనుకున్న ఇంటికి ఒక ధరను నిర్ణయించుకోవాలి. అంతే తప్ప మీ పెట్టుబడి, అవసరాలు, లాభం అన్నీ కలుపుకొని ఇంటికి రేటు కట్టకూడదు. అలా చేస్తే అంత రేటుకు రీసేల్‌ ప్రాపర్టీ కొనేబదులుగా కొత్త ఇల్లే వస్తుందని కస్టమర్లు భావిస్తారు. అందమైన ఇంటికే అధిక ధర.. సాధారణ ఇళ్లతో పోలిస్తే మీ ఇంటికి ధర రావాలంటే ముందుగా కొంత ఖర్చు పెట్టక తప్పదు. కంటికి ఇబ్బెట్టుగా, బెదురుకొట్టే రంగులు కాకుండా లేత రంగులను వేసుకోవాలి. మనసుకు ప్రశాంతత కలిగించే తెలుపు, నీలం వంటి వర్ణాలను ఉపయోగించాలి. సాధారణ ఇళ్లతో పోలిస్తే ఆహ్లాదకరంగా, అందంగా ఉండే ఇళ్లు 40–50 శాతం వేగంగా అమ్ముడవుతాయని, 10 శాతం ధర అధికంగా పలుకుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నల్లాలు, పైప్‌లైన్ల లీకేజీలు ఉంటే రిపేర్‌ చేయించాలి. దీంతో ఇంటి యజమానిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తెగిపోయిన విద్యుత్‌ వైర్లు, పలికిన స్విచ్‌ బోర్డ్‌లు వంటివి ఏమైనా ఉంటే సరిచేయాలి. లేకపోతే విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పరిసరాలు పరిశుభ్రంవిక్రయించే ఇంటిని మాత్రమే అందంగా తీర్చిదిద్దితే సరిపోదు.. పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వరద, మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అందమైన పువ్వులు, సువాసన వెదజల్లే మొక్కలను పెంచాలి. దీంతో కొనుగోలుదారులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇల్లు కొనేందుకు వచ్చే కస్టమర్లు ఇంటి లోపల గదులు, కిచెన్, బాత్‌రూమ్‌ వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటి లోపల వస్తువులను ఆకర్షణీయంగా సర్దుకోవాలి. ఇష్టం వచి్చనట్లు వస్తువులు ఉంటే అందవిహీనంగా కనిపించడమే కాకుండా ధర కాస్త తగ్గే ప్రమాదం ఉంటుంది.మొదటి 5 నిమిషాలు కీలకం.. రీసేల్‌ ప్రాపర్టీలు కొనే కస్టమర్లు ఇల్లు చూసే తొలి ఐదు నిమిషాలు కీలకం. అందుకే ఇంటి లోపలికి రాగానే ఆహ్లాదభరిత వాతావరణం కనిపించేలా అందమైన కర్టెన్లు, లేతరంగులతో స్వాగతం పలికేలా చూసుకోవాలి. బెడ్‌రూమ్, కిచెన్‌లో వస్తువులను సరైన రీతిలో సర్దిపెట్టుకోవాలి. వంట గదిలో నూనె మరకలు వంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి. బాత్‌రూమ్‌లో దుర్గంధం లేకుండా చూసుకోవాలి. బాల్కనీలో దుస్తులు ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసే తీగలు వంటివి అడ్డుగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. పూల కుండీలలో అందమైన మొక్కలు పెంచుకోవాలి.రీసేల్‌ చెక్‌ లిస్ట్‌ ఇంటిని శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా ఉండాలి. ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి.మార్కెట్‌లో వాస్తవ ధర ఎంతో ఉందో తెలుసుకున్న తర్వాతే ఇంటికి ధరను నిర్ణయించాలి. అత్యాశకు పోకుండా కస్టమర్‌కు బేరసారాలకు అవకాశం ఇవ్వాలి.అశుభ రోజులు, ప్రతికూల సమయంలో కాకుండా పండుగలు, శుభదినాలలో ఇంటిని విక్రయించడం వల్ల కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.నమ్మకమైన మధ్యవర్తులు, ఏజెంట్లు, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రాపరీ్టల రీసేల్‌ చేస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.కస్టమర్లతో విక్రయ ఒప్పందం, ఇతరత్రా డాక్యుమెంటేషన్‌ పక్కాగా చేసుకోవాలి. పక్కా డాక్యుమెంట్లు.. ఇంటి రిజిస్ట్రేషన్‌ కాగితాలు, నల్లా, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఇల్లు కొనే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ధర అధికంగా వస్తుంది. ఇంటిపై బ్యాంక్‌ రుణం, ఇతరత్రాలు ఏమైనా ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలి.

What Gets Cheaper and What Gets Costlier After Union Budget 20264
బడ్జెట్ 2026: చౌకైనవి.. ఖరీదైనవి ఇవే!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి?, ఖరీదైనవిగా మారిన వస్తువులు ఏవి? అనేది తెలుసుకుందాం.చౌకగా లభించే వస్తువులువిమాన భాగాలుమైక్రోవేవ్ ఓవెన్లుEV బ్యాటరీలుసోలార్ ప్యానెల్‌స్డయాబెటిక్ & క్యాన్సర్ మందులుభారతదేశంలో తయారయ్యే స్మార్ట్‌ఫోన్‌లుటాబ్లెట్‌లుఖరీదైనవిగా మారే వస్తువులులగ్జరీ గడియారాలుదిగుమతి చేసుకున్న మద్యంసిగరెట్లుబీడీలుపాన్ మసాలాగుట్కాకొన్ని ఎరువులుదిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు & సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

EVs to Become More Affordable After Budget Announcement5
ఈవీలపై గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న ధరలు

ఈవీలు కొనుగోలు చేసేవారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వాహనాల ధరలు తగ్గే చర్యలు తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ (Basic Customs Duty) సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించారు.ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా లిథియం-అయాన్ సెల్ తయారీకి మద్దతు ఇవ్వడానికి క్యాపిటల్ గూడ్స్, కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని సున్నాకి తేవడానికి లక్షణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి.ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ పరిస్థితిప్రస్తుతం 35 రకాల క్యాపిటల్ గూడ్స్ (ఈవీ బ్యాటరీ తయారీకి అవసరమైన మెషినరీ/భాగాలు) పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. గత బడ్జెట్‌లోనే (2025-26) ప్రభుత్వం దీన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు తాజా బడ్జెట్‌ 2026-27లో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించాలని ప్రతిపాదించారు.తగ్గనున్న ఈవీల ధరలుఈవీల ధరలో అధిక మొత్తం (సుమారు 40-50%) బ్యాటరీలకే ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గితే, బ్యాటరీ తయారీకి ఉపయోగించే ముఖ్యమైన భాగాలు, మెషినరీ దిగుమతులు చౌకగా అవుతాయి. దీంతో దానికి సంబందించిన ఖర్చు నాటకంగా తగ్గి ఈవీలు, బ్యాటరీల ధరలో కూడా తగ్గుదలకు దారితీస్తుంది. అంతిమంగా ఈవీల ధరలు సుమారు 10-15% వరకు తగ్గొచ్చు.

Budget 2026–27 Sectoral Allocations and Priorities6
బడ్జెట్ 2026: మౌలిక వసతులు, రక్షణ రంగాలకు ప్రాధాన్యం

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)రవాణా: రూ. 5,98,520 కోట్లురక్షణ: రూ. 5,94,585 కోట్లుగ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లుహోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లువ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లువిద్య: రూ. 1,39,289 కోట్లుఇంధనం: రూ. 1,09,029 కోట్లుఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లుపట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లుఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లువాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లుసాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లుశాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లుపన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లువిదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లుఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లుఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812బడ్జెట్‌లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.గ్రామీణ భారతం, వ్యవసాయంగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.విద్య, ఆరోగ్యం, ఐటీమానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026 సమగ్ర స్వరూపం..

Advertisement
Advertisement
Advertisement