Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How Many Loans Can One Person Take Know The RBI Clarifies the Rules1
ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?

ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది.

Weekly Gold Price Update Significant Decline Seen Across India2
బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..

భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.వెండి ధరలు ఇలా..బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Suzuki Marks 20 Years in India and Crosses 10 Million Production Milestone3
భారత్‌లో 20 ఏళ్లు.. ఉత్పత్తిలో కోటి!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్‌పాయింట్‌లతో కూడిన విస్తృత నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్‌సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్‌సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్‌ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.

Small but Smart Gadgets That Make Life Easier Every Day4
పరిమాణం కొంచెం.. పనులు ఘనం!

చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్‌ను సేవ్‌ చేసే స్మార్ట్‌ గాడ్జెట్లే ఇవి!చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్‌ మినీ బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్ ఒక స్మార్ట్‌ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌లో మూడు స్పీడ్‌ సెట్టింగ్స్‌ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్ చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్‌ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్‌లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.చిన్న ప్రింటర్‌! ప్రతి చిన్న ప్రింటౌట్‌ కోసం జిరాక్స్‌ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్‌ ప్రింటర్‌ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్‌ థర్మల్‌ ప్రింటర్‌ ఉంటే జిరాక్స్‌తో పని ఉండదు. స్టూడెంట్స్‌కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌ చాయిస్‌. మొబైల్‌తో బ్లూటూత్‌ ద్వారా సులభంగా కనెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్‌ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్‌ చేసుకోవచ్చు. ఇంక్‌ అవసరం లేకుండా థర్మల్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్‌ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్‌ ప్రింట్‌ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్‌ హెల్పర్‌లా ఉంటుంది. ధర రూ. 1,799.చార్జ్‌ కూడా.. స్టాండ్‌ కూడా!మొబైల్‌ను చార్జ్‌ చేస్తూనే వీడియోలు, సీరియల్స్‌ చూడాలా? లేదా గేమ్స్‌ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్‌ వన్ స్మార్ట్‌ చార్జర్‌ కేబుల్‌. ఇది కేవలం కేబుల్‌ మాత్రమే కాదు, చిన్న స్టాండ్‌లా కూడా పనిచేసే స్మార్ట్‌ ఐడియా. ఈ కేబుల్‌లో బిల్టిన్ ఫోల్డబుల్‌ స్టాండ్‌ ఉంటుంది. కేబుల్‌ పెట్టగానే మొబైల్‌ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో మొబైల్, టాబ్లెట్‌ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్‌ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్‌తో తయారైన ఈ కేబుల్‌ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్‌లో లేదా ట్రావెల్‌లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే!

ICF vs LHB Coaches Which Is Safer and Better for Passengers5
ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?

రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్‌ల గురించి తెలుసుకుందాం.ఐసీఎఫ్ కోచ్‌లుభారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్‌తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్‌లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.ఐసీఎఫ్ కోచ్‌లలో.. స్లీపర్ క్లాస్‌లో 72 బెర్త్‌లు, థర్డ్ ఏసీ క్లాస్‌లో 64 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్‌ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.ఐసీఎఫ్ కోచ్‌లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్‌లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుఇక ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్‌లో 80 బెర్త్‌లను, థర్డ్ ఏసీ క్లాస్‌లో 72 బెర్త్‌లు ఉంటాయి. ఇవి ICF కోచ్‌ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్‌లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Covacent Technologies Partners with Google Cloud6
గూగుల్‌ క్లౌడ్‌తో కోవాసెంట్‌ జట్టు

కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ తాజాగా గూగుల్‌ క్లౌడ్‌తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్‌ప్రైజ్‌ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.తమ ఏజెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూట్‌ని జెమిని ఎంటర్‌ప్రైజ్, గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement