Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Home Value with Stainless Steel Modular Kitchens House construction tips1
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్‌..

ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్‌ రూమ్‌ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్‌లో రకరకాల మాడ్యులర్‌ కిచెన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్‌ వార్డ్‌ రోబ్స్‌ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ మాడ్యులర్‌ కిచెన్స్‌’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్‌లో వినియోగించిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కిచెన్స్‌ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్‌కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కిచెన్‌ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్‌లెస్‌ స్టీల్‌తో తరుచూ కిచెన్‌ కౌంటర్‌ టాప్‌లు, క్యాబినెట్‌ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) సర్టిఫికేషన్, ఇండియన్‌ స్టాండర్డ్‌ ఇనిస్టిట్యూషన్‌(ఐఎస్‌ఐ) మార్క్‌ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి.

Reliance Secures US License for Direct Venezuelan Crude Imports2
రిలయన్స్‌కి వెనెజులా చమురు

న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్‌నగర్‌ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్‌ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్‌ రిఫైనింగ్‌ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్‌ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్‌ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్‌ క్రూడాయిల్‌ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది.

Lenskart Solutions Posts Strong Profit Surge in Q3 FY263
లెన్స్‌కార్ట్‌కు భారీ లాభాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్‌ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్‌చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది.

Tata Capital Launches Loan Awareness Campaign Sawal Karo Phir Loan Lo4
రుణాలపై టాటా క్యాపిటల్‌ అవగాహన కార్యక్రమాలు

ముంబై: ‘సవాల్‌ కరో, ఫిర్‌ లోన్‌ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్‌ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్‌ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ సబర్వాల్‌ తెలిపారు.ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు.

PV dispatches rise 13percent to 4,49616 units in Jan 20265
టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్‌లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్‌ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్‌పోర్ట్స్‌ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతుల్లో మారుతీ టాప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలి్చంది. కంపెనీ ఎక్స్‌పోర్ట్స్‌ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్‌ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్‌ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్‌ గణాంకాల్లో వెల్లడైంది. భారత్‌ నుంచి మొత్తం పీవీల ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ భారతి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్‌ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్‌ చెప్పారు. పరిశ్రమ ఎక్స్‌పోర్ట్స్‌ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్‌పోర్ట్స్‌కి ఊతమిస్తోందని రాహుల్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానంగా యూరప్‌లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా ఎండీ తరుణ్‌ గర్గ్‌ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు.

Bondada Engineering Partners for Green Data Centers in India6
బ్రయాన్‌స్టన్‌తో బొండాడ ఇంజినీరింగ్‌ ఎంవోయూ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హరిత విద్యుత్‌ ఆధారిత డేటా సెంటర్‌ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్‌ (బీఈఎల్‌), దుబాయ్‌కి చెందిన బ్రయాన్‌స్టన్‌ రెన్యువబుల్స్‌ ఎఫ్‌జెడ్‌సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్‌ ఐటీ, మహాజెన్‌కో, ఎన్‌ఎల్‌సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది.

Advertisement
Advertisement
Advertisement