Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rich dad poor dad about real estate in ​House Construction Tips1
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!

రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్‌: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్‌లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్‌లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు."

Natural Diamond Jewelry Market Set to Surge to Rs 1.5 Lakh Crore by 20302
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్‌

ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్‌ గ్రూప్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో నేచురల్‌ డైమండ్‌ జ్యుయలరీ మార్కెట్‌ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది. డైమండ్స్‌ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్‌ జెడ్, మిలీనియల్స్‌ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్‌ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్‌ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ ఎస్‌వీపీ శ్వేతా హరిత్‌ తెలిపారు.

Centre Raises Windfall Tax on Diesel and ATF Exports3
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై ఆయిల్‌ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్‌పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్‌ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది.

Gold Rate Today (April 12): Check 22 and 24 carat gold prices4
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..

దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Jaiprakash Gaur Backs Adani Group in Bid for Insolvent JAL Acquisition5
దివాలా తీసిన జేఏఎల్‌ కొనుగోలు.. అదానీకే ‘జై’!

న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్‌ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్‌ వైపై జేపీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జైప్రకాశ్‌ గౌర్‌ మొగ్గు చూపారు. గౌతమ్‌ అదానీ సారథ్యంలో గ్రూప్‌ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్‌ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్‌ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్‌ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్‌ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ ఆరోపించిన నేపథ్యంలో గౌర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్‌లో జేఏఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్‌ బిడ్‌కు గతేడాది నవంబర్‌లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (అలహాబాద్‌ బెంచ్‌) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్‌ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్‌సీఎల్‌టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది.

India's Forex Reserves Rebound to $697.12 Billion6
పసిడి, ఫారెక్స్‌ నిల్వలు పెరిగాయ్‌..

న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్‌ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్‌ డాలర్లు పెరిగి 697.121 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్‌ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్‌ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్‌ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్‌ డాలర్లు పెరిగి 120.742 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Advertisement
Advertisement
Advertisement