ప్రధాన వార్తలు
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్ అయ్యాయి. మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు.
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు ఆర్బీఐ పాలసీ డే కోసం సన్నద్ధమవుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం సెషన్ ను 64.61 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 83,249.32 వద్ద ప్రారంభించగా, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 37 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టపోయి 25,605.80 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్ ప్యాక్ లో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ 1.29 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి ఇండియా 1.28 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.20 శాతం, 0.41 శాతం తగ్గాయి. ఎన్ ఎస్ ఈలో సెక్టోరల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఫార్మా, ఆటో, మెటల్, మీడియా సూచీలు 0.80 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫైనాన్షియల్స్ 0.33 శాతం వరకు లాభాలు సాధించాయి.
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్ఫామ్పై గిగ్వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్ కంపెనీ తెలిపింది. అర్బన్ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్డోర్ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.తమ ప్లాట్ఫామ్లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్ కంపెనీ తెలిపింది. తన ప్లాట్ఫామ్పై టాప్–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది.
ఎల్ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్’
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది. ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్ సేవల విస్తరణ, కస్టమర్ సర్వీస్ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్ రిటైల్ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు భారత్లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది.
కార్పొరేట్
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఎల్ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్’
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
ఏసీసీ బ్యాటరీలకు భారీగా డిమాండ్
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
ఆఫీస్ మార్కెట్కు అడ్డా.. హైదరాబాద్
బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!
డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్
రిటైర్మెంట్ వయసు పెరగనుందా?
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వే...
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్...
ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
రూపాయి రయ్.. రయ్..!
ముంబై: భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం...
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!
పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్...
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మ...
పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట
వ్యాపార యజమానులకు, సంస్థలకు భారీ ఊరటనిచ్చే దిశగా క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.రిలయన్స్ జియోరూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి.రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్స్టార్కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
బంపరాఫర్.. ఐఫోన్పై రూ.24000 తగ్గింపు!
గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్సెట్ పొందుతుంది.ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్ను పొందుతుంది.కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం, ఫోన్లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పనిచేస్తుంది.
పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
ఎయిర్టెల్ షాక్.. ఆ ఫ్రీ ఆఫర్ ఇక లేదు
లక్షలాది మంది ఎయిర్టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త. రీఛార్జ్ ప్లాన్లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్స్క్రిప్షన్లను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఆఫర్ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ వివరాలుఎయిర్టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను తాత్కాలిక ప్రయోజనంగా అందించింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.17,000 కాగా, ఎయిర్టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్టెల్ ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది.ఇప్పటికే క్లెయిమ్ చేసినవారికి ప్రభావం ఉంటుందా?జనవరి 16కు ముందే ఆఫర్ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.ఒక ఆఫర్ ముగిసినా… మరో కొత్త అవకాశంపెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ రద్దయినా, ఎయిర్టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఎయిర్టెల్ అడోబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ఎయిర్టెల్కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4,000 ఖర్చయ్యే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా, వినియోగదారులు అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్
భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు
ఒకప్పుడు శుభకార్యం అంటే పలకరింపులు, పట్టుచీరలు, బంగారు కానుకల సందడి. కానీ నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల సెగ మధ్యతరగతి గడప దాటి వారి బంధాలపై ప్రభావం చూపుతోంది. ‘అప్పుడు వారు మాకు తులం బంగారం పెట్టారు, ఇప్పుడు మేము వారికి అంత ఇవ్వలేకపోతున్నామే’ అనే ఆవేదన.. బంధువుల్లో ఆత్మీయతపై ఆందోళన పెంచుతోంది.అసలు కానుకల వెనుక అర్థంసంప్రదాయంగా బంగారం, వెండి బహుమతులు కేవలం ఆడంబరం కోసం పుట్టినవి కావు. దీని వెనుక లోతైన సామాజిక, ఆర్థిక భద్రత దాగి ఉంది. పూర్వకాలంలో ఆడపిల్లకు ఇచ్చే నగలు ఆమె ఆర్థిక భద్రతకు భరోసాగా ఉండేవి. బంధువుల మధ్య బంగారు కానుకల మార్పిడి అనేది ఒక ‘సామాజిక పొదుపు’ లాంటిది. ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ కలిసి ఇచ్చే కానుకలు, ఆ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయని ధోరణి ఉంది.పెరుగుతున్న ధరలు.. అంతరాలుప్రస్తుతం బంగారం ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతంలో తులం బంగారం రూ.50,000 ఉన్నప్పుడు జరిగిన శుభకార్యంతో, ఇప్పుడు తులం రూ.1,40,000 ధరతో బేరీజు వేయడం వల్ల సమస్యలు మొదలవుతున్నాయి. ‘వారు మాకు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మేము ఇవ్వకపోతే తక్కువ చేసి చూస్తారు’ అనే అభద్రతా భావం బంధువుల మధ్య గోడలు కడుతోంది. కానుకలు ఇచ్చుకోలేక చాలామంది సన్నిహితుల వేడుకలకు వెళ్లడమే మానేస్తున్నారు. ఇది పరోక్షంగా సామాజిక దూరాన్ని పెంచుతోంది.మానవ సంబంధాలను కాపాడుకోవడం ఎలా?డబ్బు కన్నా మనుషులు ముఖ్యం అని భావించినప్పుడే బంధాలు నిలుస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనుసరించాల్సిన కొన్ని మార్గాలివే..1. కాలానుగుణ మార్పును అంగీకరించాలి.. పదేళ్ల క్రితం నాటి ధరలు ఇప్పుడు లేవని గ్రహించాలి. ఇచ్చే కానుక బరువును (గ్రాములను) కాకుండా అవతలి వారి ఆర్థిక పరిస్థితిని, ఆత్మీయతను గౌరవించాలి.2. ప్రత్యామ్నాయాల వైపు చూపు.. కేవలం బంగారం, వెండి మాత్రమే కానుకలు కావు. స్థిరాస్తి బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా నగదు రూపంలో చిన్న మొత్తాన్ని అందించడం కూడా గౌరవప్రదమే.3. ముందస్తు ప్రణాళిక.. రాబోయే శుభకార్యాల కోసం ‘గోల్డ్ స్కీమ్స్’ వంటి వాటి ద్వారా చిన్న మొత్తాల్లో పొదుపు చేయడం వల్ల భారంగా అనిపించదు.4. సన్నిహిత బంధువుల మధ్య ఆర్థిక ఇబ్బందుల గురించి మొహమాటం లేకుండా చర్చించుకోవడం వల్ల అపోహలు తొలగిపోతాయి.5. వేడుకకు వెళ్లడం, తోడుగా నిలబడటం అనేది వస్తురూపంలో ఇచ్చే కానుక కంటే గొప్పదని గుర్తించాలి.బంగారం మెరుస్తుంది కానీ మాట్లాడలేదు. బంధం మౌనంగా ఉన్నా మనసును తడుముతుంది. ధరలు పెరిగినప్పుడు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలే తప్ప, ఆత్మీయులను దూరం చేసుకోకూడదు.ఇదీ చదవండి: ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు!
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఈ కీలక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలు పెరుగుతాయా? నిత్యావసరాల ధరలు తగ్గుతాయా? గృహ రుణ గ్రహీతలకు ఊరట లభిస్తుందా? అన్నవి ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్నలు.అయితే, కేంద్ర బడ్జెట్ కేవలం టీవీల్లో చూసే అంకెలు మాత్రమే కాదు; అది నేరుగా మీ ఇంట్లో, మీ పిల్లల చదువులపై, మీ పొదుపుపై ప్రభావం చూపే అంశం. అందుకే, ప్రభుత్వ బడ్జెట్తో పాటు మీ ‘ఇంటి బడ్జెట్’ను ఎలా ప్లాన్ చేసుకోవాలి? పన్ను మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? అసలు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం? వంటి అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇదిగో..పన్ను మార్పులు..ఈసారి కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మరిన్ని మార్పులు లేదా సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీ వార్షిక ఆదాయం ఏ పన్ను స్లాబ్లోకి వస్తుందో లెక్కించుకుని, దానికి అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.ఖర్చుల అంచనాబడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా పెంచడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం లేదా గృహోపకరణాల ధరల్లో మార్పులు ఉండవచ్చు. మీ ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితా ఉంటే బడ్జెట్ తర్వాత ధరల హెచ్చుతగ్గులను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.పొదుపు మంత్రంబడ్జెట్లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలకు పెద్దపీట వేయడం వల్ల దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పై ప్రభావం ఉంటుంది. మీ భవిష్యత్తు అవసరాల కోసం (పిల్లల చదువు, పెళ్లిళ్లు) ఎంత మేర కేటాయించాలో బడ్జెట్ ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి.‘ఇంటి బడ్జెట్’ ఎందుకు?ప్రభుత్వం దేశం కోసం ఎలాగైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో ప్రతి ఇంట్లో కూడా అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే..అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ మార్పులు ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉంటుంది. బడ్జెట్ వేసుకుంటేనే మన దగ్గర ఎంత మిగులు ఉందో తెలుస్తుంది. దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లోని మళ్లించవచ్చు.ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బడ్జెట్ వల్ల అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా, పిల్లల చదువులు సాగాలన్నా.. కచ్చితమైన ప్లానింగ్ అవసరం. నెలకు ఎంత పొదుపు చేస్తున్నామో తెలిస్తేనే లక్ష్యం చేరువవుతుంది.బడ్జెట్ కోసం సింపుల్ టిప్: 50-30-20 రూల్మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. మొత్తం నెలవారీ రాబడిలో..50%: అవసరాలు (అద్దె, కిరాణా, ఫీజులు)30%: కోరికలు (సినిమాలు, విహారయాత్రలు, షాపింగ్)20%: పొదుపు, పెట్టుబడులుకేంద్ర బడ్జెట్ 2026 దేశానికి ఒక రోడ్ మ్యాప్ అయితే, మీరు వేసుకునే ఇంటి బడ్జెట్ మీ కుటుంబ ఆర్థిక భరోసాకు పునాది. ఫిబ్రవరి 1న వెలువడే అధికారిక ప్రకటనలను బట్టి మీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ
రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో పన్నులు, బీమా, పెన్షన్ రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గృహ ఆర్థిక పొదుపును పెంచడం, నియంత్రణ సవాళ్లను తగ్గించడం, దేశంలో సామాజిక భద్రత కవరేజీని మెరుగుపరచడం ఈ సూచనల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.గృహ ఆర్థిక పొదుపులో బ్యాంకు డిపాజిట్ల వాటా 2024 ఆర్థిక సంవత్సరంలో 38.7 శాతం నుంచి 2025లో 35.2 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొదుపును ప్రోత్సహించేందుకు డిపాజిటర్లకు పన్ను ఉపశమన చర్యలు అవసరమని ఎస్బీఐ అభిప్రాయపడింది.బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయానికి వర్తించే పన్ను విధానాన్ని దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల (LTCG, STCG)తో సమానంగా తీసుకురావాలని సూచించింది. అలాగే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల లాక్-ఇన్ వ్యవధిని మూడేళ్లకు తగ్గించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)తో సమానంగా చేయాలని సిఫార్సు చేసింది. చిన్న పొదుపుదారులకు ఉపశమనం కలిగించేలా పొదుపు ఖాతాలపై వడ్డీకి వర్తించే టీడీఎస్ను పూర్తిగా తొలగించాలని లేదా కనీస పరిమితిని పెంచాలని కూడా ఎస్బీఐ సూచించింది.పరోక్ష పన్నుల విషయంలో, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD)కు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని నివేదిక పేర్కొంది. జీఎస్టీ చట్టం, 2017లోని కొన్ని పదాలను సవరించడం ద్వారా వివాదాలు తగ్గించవచ్చని సూచించింది. అలాగే బ్యాంకులు పంపిణీ చేసే ఐఎస్డీపై వాల్యుయేషన్ వివాదాలు లేకుండా ఉండేందుకు సెక్షన్ 20(3)కు వివరణ జోడించాలని ప్రతిపాదించింది.ఎన్పీసీఐ, వీసా, మాస్టర్కార్డ్ వంటి సెటిల్మెంట్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులపై జీఎస్టీ టీడీఎస్ అమల్లో బ్యాంకులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ టీడీఎస్ వర్తించకుండా మినహాయింపు ఇవ్వాలని ఎస్బీఐ సూచించింది.బీమా రంగంలో, భారతదేశంలో బీమా వ్యాప్తి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి తగ్గిందని ఐఆర్డీఏఐ డేటాను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. జీవిత బీమా వ్యాప్తి 2.7 శాతానికి, నాన్-లైఫ్ బీమా 1 శాతానికి పరిమితమైందని పేర్కొంది. “2047 నాటికి అందరికీ బీమా” అనే ఐఆర్డీఏఐ లక్ష్యానికి ఇది సవాలుగా మారిందని హెచ్చరించింది. అలాగే 2025లో వచ్చిన ఫిర్యాదుల్లో 69 శాతం క్లెయిమ్స్కు సంబంధించినవేనని, ముఖ్యంగా ఆరోగ్య బీమా రంగంలో తక్షణ సంస్కరణలు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.పెన్షన్ రంగంలో కనీస పెన్షన్ హామీతో కూడిన బలమైన, సమగ్ర పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎస్బీఐ నొక్కి చెప్పింది. కేంద్ర బడ్జెట్ 2026లో ఈ సూచనలను అమలు చేస్తే దేశ ఆర్థిక భద్రత బలోపేతమవుతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని ఎస్బీఐ పేర్కొంది.
Income Tax: బినామీ వ్యవహారాల జోలికెళ్లొద్దు..
బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్ మార్కెట్ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు. అధికారుల అధికారాలు ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే... (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం. ఇంకా ఏం చేస్తారు నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.ఆద్యులెవరు .. ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.నోటీసు ప్రక్రియ.. నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్ కోడ్ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్మెంట్ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్కంటాక్స్ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్ చేయని ఆస్తులు.. డిక్లేర్ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్మెంట్ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్ చేస్తారు. వారి వలలో పడకండి!


