Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Man Orders Rs 2 9 Lakh Graphics Card Receives Detergent Powder1
రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది!

ఆన్‌లైన్ షాపింగ్‌లో లెక్కకు మించిన మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరోమారు తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్వగత్ నాయక్ అనే వ్యక్తి తన స్టార్టప్ కోసం సుమారు రూ. 2.9 లక్షల విలువ గల హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత అతను ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గ్రాఫిక్స్ కార్డ్ బదులుగా 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఉండటం చూసి షాకయ్యారు.'ఫుల్‌ఫిల్డ్ బై అమెజాన్' (FBA) పద్ధతిలో డెలివరీ జరిగింది. అంటే దీనిని అమెజాన్ గోదాములో నిల్వ చేసి నేరుగా అక్కడి నుంచే రవాణా చేశారని స్వగత్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆర్డర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ స్వయంగా స్టోర్ చేసి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంది.డెలివరీ ప్యాకేజింగ్‌పై అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లు స్వగత్ పేర్కొన్నారు. తయారీదారు పెట్టిన అసలు సీల్ కోసి మళ్లీ టేప్ చేశారు, అలాగే నకిలీ బార్‌కోడ్ కూడా అతికించారని అన్నారు. అదే విధంగా, ప్యాకెట్‌పై ఉన్న షిప్పింగ్ లేబుల్‌లో బరువు 1.56 కేజీలుగా చూపించారు. కానీ ఒక అసలు RTX 5090 గ్రాఫిక్స్ కార్డ్ ప్యాకేజింగ్‌తో కలిపి సుమారు 3 కిలోల వరకు ఉంటుంది.ఇవన్నీ గమనించిన స్వగత్ నాయక్, ఇది స్పష్టంగా మోసం అని పేర్కొన్నాడు. అతను తన అన్‌బాక్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను అమెజాన్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినప్పటికీ, కేవలం 15 నిమిషాల్లోనే అతని కంప్లైంట్‌ను మూసివేశారు. ప్రస్తుతం కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆన్‌లైన్ షాపింగ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్‌లైన్ రిటైలర్లతో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకోగా, మరికొందరు నాయక్ వాదనలను ప్రశ్నిస్తూ, ఆ అన్‌బాక్సింగ్ వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.Scammed for ₹2.9L on @AmazonIN. Ordered a GIGABYTE RTX 5090 for our startup, received 1kg of Ghadi detergent. This was "Fulfilled by Amazon" (FBA), meaning it was stored and shipped directly from an Amazon warehouse. @AmazonHelp #AmazonScam #ConsumerRights [more in thread] pic.twitter.com/NfgUL0jmvL— Swagat Nayak (@autocarrrot) March 22, 2026

Gold and Silver Price Again Hike in India Know The Latest Rates2
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!

వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Reliance Jio Rs 1234 Plan Get 336 Days Validity with Data3
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!

టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్‌కు వెళ్లడం గానీ, ఆన్‌లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ఈ ప్యాక్‌ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్‌ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!

Raghav Chadha Demands Mobile Data Rollover Transfer Among Users Know The Details Here4
టెలికాం కంపెనీల న‌యా దోపిడీ.. రాఘవ్ చద్దా కీల‌క వ్యాఖ్య‌లు

సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్‌ను బట్టి డేటా, టాక్‌టైమ్‌ వేరుగా ఉంటాయి. టాక్‌టైమ్‌ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్‌పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.డేటా రోల్‌ఓవర్‌పై రాఘవ్ చద్దా డిమాండ్మిగిలిపోయిన రోజువారీ డేటాను వృధా చేయకుండా తర్వాతి రోజుకు బదిలీ (Rollover) చేయాలిఉపయోగించని డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్‌లలో తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలిమిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికం కంపెనీలు… pic.twitter.com/mjCA509IK5— greatandhra (@greatandhranews) March 23, 2026పరిష్కార మార్గాలుడేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.డేటా రోల్‌ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్‌లో తగ్గింపు ఇవ్వాలి.డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!

Stock Market Closing Update 24th March 20265
పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు.. లాభాల్లో సూచీలు!

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

After Zomato Swiggy Hikes Platform Fee6
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్‌ఫామ్‌ ఫీజు!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలైన జొమాటో, స్విగ్గీ వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. గత వారంలో జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. ఇప్పుడు స్విగ్గీ అదే బాటలో అడుగులు వేస్తూ.. ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌పై రూ. 14.99 నుంచి రూ.17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. అంటే సంస్థ తాజాగా రూ.2.59 పెంచిందన్నమాట.కొత్తగా పెంచిన ప్లాట్‌ఫామ్ ఫీజు.. స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడానికి మాత్రమే కాకుండా సంస్థ నిర్వహణకు సహాయపడుతుందని కంపెనీ వినియోగదారులకు తెలియజేసింది. ఈ సందేశం ఇప్పుడు చెక్అవుట్ సమయంలో యాప్‌లో కనిపిస్తుంది.జొమాటో కంపెనీ కూడా గత వారంలో ఒక్కో ఆర్డర్‌పై ఛార్జీలను రూ. 2.40 పెంచింది. దీంతో ఫీజు రూ. 12.50 నుండి రూ. 14.90కి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పన్నులతో కలిపి, స్విగ్గీ, జొమాటో రెండూ ఇప్పుడు దాదాపు ఒకే రకమైన ధరలను వసూలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రత్యర్థులు ఒకరి ధరల వ్యూహాలను మరొకరు అనుకరించే దీర్ఘకాలంగా కొనసాగుతున్న ధోరణి ఇప్పుడు కొనసాగుతోంది.ఫుడ్ డెలివరీ బిల్లులలో ప్లాట్‌ఫారమ్ ఫీజులు ఒక చిన్న భాగమే అయినా, అవి క్రమంగా పెరుగుతున్నాయి. అవి విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపించినప్పటికీ, తరచుగా వాడే వినియోగదారులు కాలక్రమేణా గణనీయంగా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సాంకేతిక ఖర్చులు, యాప్ నిర్వహణ మరియు మొత్తం కార్యకలాపాలను భరించడానికి ఈ ఛార్జీలు అవసరమని కంపెనీలు తరచుగా ధరలు పెంచినప్పుడల్లా సమర్ధించుకుంటూనే ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement