ప్రధాన వార్తలు
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.
డీలాపడ్డ టెక్స్టైల్స్ ఎగుమతులు: కారణం ఇదే!
పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్మెంట్లు)లో తగ్గుదల కారణంగా టెక్స్టైల్స్, గార్మెంట్ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్టైల్స్ (–3.9%), రెడీమేడ్ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.భారత్ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్–మేడ్ టెక్స్టైల్స్ రూపాయి పరంగా 3.6% పెరిగినా, డాలర్ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో భారత్ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు.
ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!
భారతదేశంలో టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ ఫాస్ట్ట్యాగ్ (FASTag). ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు, FASTag లోని చిప్ను స్కాన్ చేసి టోల్ చార్జీలు ఆటోమేటిక్గా వాహన యజమాని ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల నగదు చెల్లింపుల అవసరం తగ్గి, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.అయితే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్ట్యాగ్ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్స్క్రీన్పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఎన్హెచ్ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.విండ్స్క్రీన్పై ఫాస్ట్ట్యాగ్ను అమర్చడం వల్ల.. టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్ట్యాగ్ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్ట్యాగ్ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ హెచ్చరించింది.For a smooth and hassle-free journey, ensure your FASTag is pasted on vehicle's windscreen firmly.Holding the FASTag instead of pasting it can lead to blacklisting.#NHAI pic.twitter.com/JdDq4DOJaQ— NHAI (@NHAI_Official) April 28, 2026ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ మోసం!ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్సైట్లు, అనధికారిక లింక్ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఈ పాస్లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్ఫామ్లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్ఫామ్లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్లను నమ్మకూడదని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!
అమ్మకాల్లో హవా.. టీవీఎస్ రికార్డ్!
టీవీఎస్ మోటార్ ఏప్రిల్లో 4,73,970 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి.దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్లో కలకలం
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.నౌక వివరాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.ప్రాంతీయ ఉద్రిక్తతలుప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో న్యూట్రిషన్ నెక్ట్స్ తయారీ ప్లాంటు
హైదరాబాద్: పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులకు సంబంధించి తెలంగాణలోని వర్గల్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు న్యూట్రిషన్ నెక్ట్స్ సహ వ్యవస్థాపకులు వెంకట ధర్మేంద్ర బొప్పన తెలిపారు. కొత్తగా పిల్లుల కోసం పేరెంట్ పేరిట, శునకాల కోసం బోనస్ పేరిట ట్రీట్స్ ఆహారోత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.అంతర్జాతీయ పోషకాహార ప్రమాణాలకి అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ వార్షికంగా 5.2 శాతం వృద్ధి రేటుతో 8.6 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుందని వ్యవస్థాపకుడు, సీఈవో సి. ప్రహర్ష తెలిపారు. తెలిపారు.ఇందులో ఆహారం, ట్రీట్స్ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, 2.52 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పుణె, ముంబై తదితర ఐదు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోను విస్తరించినట్లు చెప్పారు.
కార్పొరేట్
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్లో కలకలం
తెలంగాణలో న్యూట్రిషన్ నెక్ట్స్ తయారీ ప్లాంటు
డాలర్ ‘బిగ్ బాస్’ గుప్తా కన్నుమూత
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం రూ. 4,027 కోట్లు
ఇంధన ధరల ప్రభావం.. అమెరికా విమానయాన సంస్థ క్లోజ్!
బీమా రంగంలో సంచలనం: 100% విదేశీ పెట్టుబడులు!
అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!
పారిపోయిన ‘పైసల దొంగలు’ 21 మంది!
నమ్మావో ముంచేస్తారు!
రెండు ఐపీవోలకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ...
కాసింత చల్లబడిన బంగారం వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
రూ.10 వేలు పెరిగిన వెండి ధర!
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా ఊహకందని...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీ...
పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగ...
భారత్ నెత్తిన చమురు ధరల భారం
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరిత...
ఆయిల్ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఒప్పో, వన్ప్లస్, రియల్మీ విలీనం!
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దిగ్గజ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న మార్కెట్ సమీకరణలు, తీవ్రతరమవుతున్న పోటీని తట్టుకునేందుకు తన అనుబంధ బ్రాండ్లు అయిన వన్ప్లస్, రియల్మీలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఒక కొత్త బిజినెస్ యూనిట్గా విలీనం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో సమన్వయాన్ని పెంచాలని ఒప్పో భావిస్తోంది.ఈ విలీనం ద్వారా వన్ప్లస్, రియల్మీ బ్రాండ్లు తమ గ్లోబల్, దేశీయ కార్యకలాపాలను ఒకే విభాగం కింద నిర్వహించనున్నాయి. వన్ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ ఈ కొత్త ప్రొడక్ట్ హబ్కు నాయకత్వం వహించనున్నారు. ఆయన నేరుగా వన్ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లావుకు రిపోర్ట్ చేస్తారు. ఉత్పత్తుల అభివృద్ధితోపాటు మార్కెటింగ్, సర్వీసు విభాగాలు కూడా ఒకే యూనిట్ కిందకు రానున్నాయి. టీమ్ల మధ్య డూప్లికేషన్ను (ఒకే పనిని రెండు వేర్వేరు బృందాలు చేయడం) తగ్గించి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే సమయాన్ని వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.వినియోగదారులపై ప్రభావం ఎంత?ఈ విలీనం జరిగినప్పటికీ మార్కెట్లో వన్ప్లస్, రియల్మీ తమ వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపును కోల్పోవని తెలుస్తోంది. అంటే, యూజర్లు ఇప్పటిలాగే వన్ప్లస్ నుంచి ప్రీమియం అనుభవాన్ని, రియల్మీ నుంచి బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను ఆశించవచ్చు. అయితే, తెరవెనుక పనిచేసే టెక్నాలజీ, వనరులు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో సమన్వయం కనిపిస్తుంది. భారతదేశం, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో ఒప్పో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది. ముఖ్యంగా భారత్లో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ‘స్థానిక వ్యూహాలతో భారత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడానికే’ అని చెప్పింది.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!
సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..ఆ వ్యక్తి తన పోస్ట్లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.యంత్రంలా మారిన 40ల జీవితం!తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.నేనొక ఏటీఎం మెషీన్నా?ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.Confessions and realities42M, 55LPAI am a 42-year-old man with a senior job in IT. I have a house in Chennai, a supportive wife, and two children. On paper, everything about my life looks perfect. I have achieved all the things society says a man should achieve.In my…— Dr Mouth Matters (@GanKanchi) April 29, 2026
యాపిల్ గ్యాడ్జెట్తో ఐ ఆపరేషన్
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కేవలం విలాసవంతమైన గ్యాడ్జెట్గా భావించిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పుడు ప్రాణాలను రక్షించే, చూపును ప్రసాదించే వైద్య విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్పేషియల్ కంప్యూటింగ్ పరికరాన్ని వైద్యులు విజయవంతంగా ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కంటిశుక్లం ఆపరేషన్లలో..న్యూయార్క్కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్, ఈ గ్యాడ్జెట్ను శస్త్రచికిత్సా పరికరంగా ఉపయోగించారు. 2025 చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణంగా ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కంటిశుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్సల్లో దీని వినియోగం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.‘స్కోప్ ఎక్స్ ఆర్’ పనితీరుఈ సాంకేతికత నేరుగా ఆపరేషన్ గదిలోని సర్జికల్ మైక్రోస్కోప్తో అనుసంధానించబడి ఉంటుంది. మైక్రోస్కోప్ నుంచి వచ్చే ప్రత్యక్ష దృశ్యాలను హై-రిజల్యూషన్ 3డీ నాణ్యతతో సర్జన్ కళ్ల ముందు ఉంచుతుంది. శస్త్రచికిత్స జరుగుతుండగానే రోగి పాత స్కాన్ రిపోర్టులు, కీలక డేటాను సర్జన్ తన చూపును పక్కకు తిప్పకుండానే హెడ్సెట్ స్క్రీన్పై చూసుకోవచ్చు. మానిటర్ల వైపు చూడటానికి పదేపదే తల తిప్పాల్సిన అవసరం లేకపోవడంతో సర్జన్ పూర్తి ఏకాగ్రత రోగి కంటిపైనే ఉంటుంది.‘ఇది ఉన్న పరికరాలను తొలగించదు. కానీ ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అది అంతా మన కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం అద్భుతం’ అని డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్ చెప్పారు.రిమోట్ సహకారంవిజన్ ప్రో ద్వారా మరో కీలక ప్రయోజనం ‘రిమోట్ కొలాబరేషన్’. ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న నిపుణుడైనా వర్చువల్గా ఆపరేటింగ్ థియేటర్లోకి ప్రవేశించవచ్చు. సర్జన్ ఏం చూస్తున్నారో అదే దృశ్యాన్ని రిమోట్ తీసుకున్న నిపుణుడు కూడా చూస్తూ రియల్టైమ్లో సూచనలు ఇచ్చే వీలుంటుంది. ఇది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో, క్లిష్టమైన కేసులలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.సవాళ్లువైద్య రంగంలో మిశ్రమ వాస్తవికత (మిక్స్డ్ రియాలిటీ) ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వాల నుంచి క్లినికల్ అనుమతులు పొందడం క్లిష్టమైన ప్రక్రియ. పరికరాల ధరలు అధికంగా ఉండటం వల్ల సామాన్య ఆసుపత్రులకు ఇవి ఇంకా అందుబాటులో లేవు. దీనిని వాడటానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
పర్సనల్ ఫైనాన్స్
లైవ్ ధరలకు బంగారం.. ‘ధన్ గోల్డ్ వాల్ట్’ లాంచ్
పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ వాల్ట్ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం ధన్ వెల్లడించింది. ఎంసీఎక్స్లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడంతో పాటు అవే లైవ్ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్సీసీఎల్ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్ గ్రేడ్ వాల్ట్లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్ జాదవ్ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత.
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్
క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.ప్రధాన మార్పులు ఇవే..నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడదు.గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.కార్డుదారులకు కాస్త రిలీఫ్వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.ఆర్బీఐ లక్ష్యం ఇదే..వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.అమలు ఎప్పటి నుంచి?ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ఈ గడువును ఇచ్చింది.ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
టాటా ఏఐఏలో సరికొత్త పెన్షన్ ప్లాన్
నేటి కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం నిధిని సమకూర్చుకోవడమే కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలకడగా ఆదాయం పొందే మార్గాన్ని వెతుక్కోవడం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల 'శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్'ను తీసుకువచ్చింది. ఇది జీవితకాలం పాటు స్థిరమైన గ్యారంటీడ్ ఆదాయాన్ని అందిస్తూనే, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను (నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా) మేళవించిన ఒక వినూత్న హైబ్రిడ్ రిటైర్మెంట్ సొల్యూషన్.ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత దాని ఫ్లెక్సిబిలిటీ. పాలసీదారులు తమ అవసరానికి తగ్గట్టుగా 60% నుండి 90% వరకు గ్యారంటీడ్ ఆదాయాన్ని, మిగిలిన 10% నుండి 40% వరకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, పెన్షన్ వెంటనే ప్రారంభమయ్యే లేదా గరిష్టంగా 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకునే సదుపాయం ఉంది. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని నామినీలకు తిరిగి ఇచ్చే 'రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్' ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా కస్టమర్లకు వెసులుబాటు కల్పించారు. ఏకమొత్తంగా లేదా 2 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో ప్రీమియం చెల్లించవచ్చు. 35 ఏళ్ల వయస్సు నుంచే ఈ ప్లానింగ్ ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల, యువ ప్రొఫెషనల్స్ నుండి రిటైర్మెంట్ ముంగిట్లో ఉన్న వారి వరకు అందరికీ ఇది అనువుగా ఉంటుంది.
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.


