Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Union Budget 2026 Presentation Time Was Changed Check Here Time And Reason1
బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్

2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్‌లోని గ్రీన్‌విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.

One Week Gold Price in India From 2026 January 18 to 242
168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!

బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది. ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట.

Who Presented First Budget in India Know The Details3
దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.1860లో మొదటి బడ్జెట్1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.స్వాతంత్య్రం వచ్చిన తరువాతభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్‌.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.వీటికే ప్రాధాన్యతతొలి బడ్జెట్‌లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతొలి బడ్జెట్‌లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్‌, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

Korean American Businessman Reacts to Meeting Mukesh Ambani Anant Radhika Merchant4
అంబానీ ఫ్యామిలీతో కొరియన్‌ బిజినెస్‌మెన్‌.. గర్వంగా ఉందంటూ పోస్ట్‌

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైనప్పటికీ.. చాలా వినమ్రంగా ఉంటారు. చాలా సందర్భాల్లో వ్యక్తులను గౌరవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కొరియన్ - అమెరికన్ వ్యాపారవేత్త 'వారెన్ చాంగ్' ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన తరువాత అనుభవాన్ని పంచుకున్నారు.ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను వారెన్ చాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులు & కుటుంబం. నాకు చాలా గౌరవంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అంబానీ ఫ్యామిలీని ప్రశంసించారు.ఎవరీ వారెన్ చాంగ్?కొరియన్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన వారెన్ చాంగ్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈయన కంపెనీ నిర్వహించడంతో పాటు.. లెగో మినీఫిగర్‌లను (చిన్న బొమ్మలు) సేకరిస్తూ ఉంటారు. అంతే కాకుండా.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వంటి ప్రముఖులను, క్రీడా ప్రముఖులను, రాజకీయ నాయకులు & రాజకుటుంబ సభ్యులను కలిసిన చిత్రాలు చూడవచ్చు. View this post on Instagram A post shared by Warren Chang (@warrenchang)

⁠Hero HF 100 Deluxe Passion Plus Become Pricier Know The Details5
మొన్న బజాజ్.. ఇప్పుడు హీరో మోటోకార్ప్

భారతదేశంలోని అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్ సైకిల్ ధరలు పెంచింది. వేరియంట్‌ను బట్టి ధరలు రూ. 250 నుంచి రూ. 750 వరకు పెరిగాయి. ఇందులో హీరో HF 100 , హీరో HF డీలక్స్ & హీరో ప్యాషన్ ప్లస్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో కూడా తన బైక్ ధరలను పెంచింది.ముడి సరుకుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల బైక్ ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత హీరో HF100 రేటు రూ. 58,739 నుంచి 59,489 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరింది. హీరో HF డీలక్స్ ధరలు 56,742 రూపాయల నుంచి రూ. 69,235 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్.. భారతదేశంలో హీరో HF 100, హీరో HF డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ మొదలైన మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిస్తో ఉండటంతో పాటు.. మంచి మైలేజ్ కూడా అందిస్తున్నాయి. ఈ కారణంగానే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి..

Rich Dad Poor Dad Robert Kiyosaki tweet on silver6
సిల్వర్‌ సెంచరీ.. ‘రిచ్‌ డాడ్‌’ హ్యపీ

వెండి ధరలు రోజుకో రికార్డ్‌ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ సిల్వర్‌ 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది.. యేయ్‌’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్‌లో కియోసాకి తెలిపారు. SILVER to BREAK $100.Yay!!!!— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026

Advertisement
Advertisement
Advertisement