Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reliance Industries Shares Slump 4 Percent1
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!

భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్‌లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్‌లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆర్‌ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About 2026 Crash2
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్‌లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్‌ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్‌లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్‌కాయిన్‌లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు.

Stock Market Closing Update 27th March 20263
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Jio IPO Details4
జియో ఐపీవో ఎప్పుడంటే?

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లోని టెలికం నిర్వాహక హోల్డింగ్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కొత్త ఏడాదిలో ఐపీవో బాట పట్టిన తొలి కంపెనీగా నిలిచే వీలుంది.దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చైర్మన్‌గా 2016లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. ఆయన తనయుడు ఆకాశ్‌ అంబానీ నాయకత్వంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. 125 బిలియన్‌ డాలర్ల విలువను ఆశిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయించే వీలుంది.దీంతో ఐపీవో పరిమాణం 3 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 28,000 కోట్లు)గా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2022 మే నెలలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ 2.5 బిలియన్‌ డాలర్ల ఐపీవో చేపట్టింది. ఇది రికార్డుకాగా.. తదుపరి 2024 అక్టోబర్‌లో ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్‌ 2.97 బిలియన్‌ డాలర్ల సమీకరణతో స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. తద్వారా రికార్డును సవరించింది.

Rs 150 Cr Kotak mahindra Bank Scam Deepens India Banking Security Crisis5
బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

భారతీయ బ్యాంకింగ్ రంగంలో వరుస కుంభకోణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల చండీగఢ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ.590 కోట్ల భారీ మోసం మరవకముందే తాజాగా హరియాణాలోని పంచకుల కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.150 కోట్ల మున్సిపల్ నిధులు మాయమవ్వడం చర్చనీయాంశం అయింది. సామాన్యుడి సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకులు వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరుగుతోంది?వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను పరిశీలిస్తే ఇవి కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదని, వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన వైఫల్యాలని అర్థమవుతోంది. ఐడీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంకు ఉదంతాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు సాధ్యం కాదు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, నకిలీ స్టేట్‌మెంట్లు ఇవ్వడం వంటివి ఉన్నతాధికారుల కళ్లుగప్పి జరగడం వెనుక బ్యాంక్ లోపలి శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.నిఘా వైఫల్యంప్రైవేట్ బ్యాంకుల్లో అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ కేవలం లాభనష్టాల లెక్కలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ రికార్డుల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు వంటివి) బల్క్ డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంకు మేనేజర్లు ఇచ్చే స్టేట్‌మెంట్లను గుడ్డిగా నమ్ముతారు. దీనిని ఆసరాగా చేసుకుని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించడం సులభతరమవుతోంది.వ్యవస్థ ప్రక్షాళనకు కావాల్సిన కఠిన చర్యలుఇలాంటి స్కామ్‌లు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం పోలీసు విచారణ సరిపోదు. బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు రావాలి.ఏడాదికి ఒకసారి జరిగే ఆడిటింగ్ కాకుండా ప్రతి నెలా ప్రభుత్వ నిధులపై థర్డ్-పార్టీ స్వతంత్ర ఆడిట్ జరగాలి.కస్టమర్లు తమ ఎఫ్‌డీ స్టేటస్‌ను బ్యాంక్ పంపే కాగితాల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ సర్వర్ ద్వారా చెక్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ లేదా ప్రత్యేక పోర్టల్ ఉండాలి.భారీ స్కామ్ జరిగినప్పుడు కేవలం కింది స్థాయి క్లర్కులను మాత్రమే కాకుండా సంబంధిత బ్రాంచ్ మేనేజర్, రీజినల్ మేనేజర్లను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచేటప్పుడు ఆయా బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో, గత ట్రాక్ రికార్డును కచ్చితంగా పరిశీలించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలి.ఇదీ చదవండి: సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!

India Accelerates Rare Earth Magnet Exploration Self Reliance by 20306
వ్యూహాత్మక ఖనిజాల వేట

సాంకేతిక, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. దేశీయంగా ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల’ (అరుదైన అయస్కాంత ఖనిజాలు) ఉత్పత్తిని భారీగా పెంచడమే కాకుండా లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 5,000 టన్నుల అరుదైన అయస్కాంత ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.విశాఖలో ప్లాంట్ ప్రారంభంఅణుశక్తి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో ‘సమారియం-కోబాల్ట్’ అయస్కాంతాల తయారీ ప్లాంట్ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. దీని ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 500 టన్నులు. తదుపరి దశలో దీన్ని 2,000 టన్నులకు, ఆపై 2030 నాటికి 5,000 టన్నులకు పెంచనున్నారు. నియోడైమియం-ఐరన్-బోరాన్ వంటి అధునాతన అయస్కాంతాల తయారీపై పైలట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం చేపట్టింది.పెరుగుతున్న డిమాండ్.. ప్రైవేటు భాగస్వామ్యంప్రస్తుతం దేశంలో ఈ అయస్కాంతాల అవసరం ఏడాదికి 4,000 టన్నులుగా ఉండగా 2030 నాటికి అది 8,000 టన్నులకు చేరుతుందని అంచనా. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు తీసుకువచ్చింది. తద్వారా కీలక ఖనిజాల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి పచ్చజెండా ఊపింది. అయితే, యురేనియం వంటి వ్యూహాత్మక వనరులపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది.లిథియం అన్వేషణపై దృష్టిఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన నిల్వలకు అత్యంత కీలకమైన లిథియం కోసం రాజస్థాన్‌లోని దేగానా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాల్లో ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దేగానాలో ప్రాథమిక సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే తవ్వకాలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా ఖనిజ శుద్ధి ప్రక్రియను బలోపేతం చేయనున్నారు.వీటిని ఎందుకు ఉపయోగిస్తారు?ఈ అరుదైన ఖనిజాలు కేవలం ఎలక్ట్రానిక్స్ కోసమే కాకుండా.. రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ల తయారీలో, అంతరిక్ష రంగంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో, గ్రీన్ ఎనర్జీ విభాగంలో విండ్ టర్బైన్లు, ఈవీ మోటార్లలో ఇవి అత్యంత కీలకం. రాజస్థాన్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శిలల రూపంలో ఉన్న ఖనిజ నిక్షేపాలను వెలికితీయడం కొంత సంక్లిష్టమైనప్పటికీ అధునాతన సాంకేతికతతో ఈ సవాలును అధిగమిస్తామని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!

Advertisement
Advertisement
Advertisement