ప్రధాన వార్తలు
AI ఏమి చేయలేదు.. ఈ ఉద్యోగాలు సేఫ్!
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకటన.. రికార్డు స్థాయిలో విండ్ ఎనర్జీ!
దేశంలో పవనవిద్యుత్ (విండ్ ఎనర్జీ) ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదని పేర్కొంది. 2016–17లో ఏర్పాటైన 5.5 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు రికార్డును అధిగమించినట్టు అయింది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.ప్రభుత్వ విధానాల్లో పెరిగిన స్పష్టత, పోటీ మార్గంలో టారిఫ్ల నిర్ణయం, సరఫరా నెట్వర్క్ సిద్ధంగా ఉండడం వంటివి కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరడానికి దారితీసినట్టు పునరుత్పాదక ఇంధన శాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన విండ్ ఎనర్జీలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఉండడం గమనార్హం.
ఫ్రీడమ్ ప్లాన్.. రూ.1కే రోజుకి 2జీబీ డేటా!
ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరోసారి ఫ్రీడమ్ ప్లాన్ను ప్రకటించింది. ఇందులో భాగంగానే.. కేవలం రూ.1 ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. తీసుకొచ్చిన ఒక రూపాయి ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా ఉచిత సిమ్ కార్డు పొందవచ్చు. ఆ తరువాత యూజర్లకు నెల రోజులు (30 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో 30 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ను మరోసారి తీసుకురావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల డిమాండ్ అని తెలుస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు (ఏప్రిల్ 30) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Freedom is back and it’s bigger than ever!Get your FREE SIM at just ₹1 and enjoy unlimited calls, daily data and SMS benefits without breaking the bank.#BSNL #FreedomOffer #1RupeeOffer #BudgetFriendly #UnlimitedCalls #DailyData #TelecomDeals #IndiaOffers @CMDBSNL… pic.twitter.com/cjt1PB61lX— BSNL India (@BSNLCorporate) April 6, 2026
'హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు'
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 త్రైమాసిక రియల్ ఎస్టేట్ నివేదిక విడుదల చేసింది. ఇందులో నగరంలో ఆఫీస్, రెసిడెన్షియల్ మార్కెట్లకు డిమాండ్ అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది.ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 5.86 మిలియన్ చదరపు అడుగులకు చేరుకొని, ఒకే త్రైమాసికంలో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. గత సంవత్సరం పోలిస్తే.. ఇది 48% వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండవ అతిపెద్ద ఆఫీస్ మార్కెట్గా నిలిచింది.ఈ వృద్ధికి ప్రధాన కారణంగా.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) అని తెలుస్తోంది. మొత్తం లీజింగ్లో 43 శాతం వాటాను వీటిదే కావడం గమనార్హం. జీసీసీలు 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే థర్డ్-పార్టీ సర్వీసెస్ రంగం కూడా 1.7 మిలియన్ చదరపు అడుగులతో 29 శాతం వాటా సాధించింది. మరో ముఖ్యమైన అంశం ఫ్లెక్స్ వర్క్స్పేస్లు. ఇవి 457 శాతం వృద్ధితో 1.42 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు, ముఖ్యంగా GCCలు ఈ ఫ్లెక్స్ స్పేస్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.నివాస రంగం విషయానికి వస్తే.. హైదరాబాద్లో గృహ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2026 Q1లో 9,541 గృహాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలీసైతే 1 శాతం వృద్ధిని చూపిస్తుంది. గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ.8,211గా ఉండి 9 శాతం పెరిగింది. ప్రజలు చాలామంది విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక ద్వారా తెలిసింది.
రూ.40 వేలు పెరిగిన 390 డ్యూక్ ధర!
భారతదేశంలో దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్న తరుణంలో.. కేటీఎమ్ ఇండియా కూడా తన 390 డ్యూక్ ధరను రూ. 40,000 పెంచింది. దీంతో ఈ మోటార్సైకిల్ ధర రూ. 3.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.2025 సెప్టెంబర్ చివరిలో.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 కింద ప్రవేశపెట్టిన సవరించిన జీఎస్టీ విధానం నేపథ్యంలో ఈ పెరుగుదల జరిగింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై ఇప్పుడు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. కాబట్టి ఇప్పుడు కంపెనీ బైక్ ధరను పెంచింది.ఇదీ చదవండి: మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!ప్రకటన వెల్లడించిన సమయంలో.. భారతదేశంలో బజాజ్ ఆటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేటీఎం ఇండియా, ట్రయంఫ్ మోటార్సైకిల్స్ రెండూ.. తమ తమ 390 మరియు 400cc మోడళ్ల ధరలు యథాతథంగా ఉంటాయని, అదనపు ఖర్చులను కంపెనీయే భరిస్తుందని పేర్కొన్నాయి.
యస్ బ్యాంక్కు కొత్త సీఈవో
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా వినయ్ మురళీధర్ టోన్సే బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లపాటు వినయ్ బ్యాంకు నిర్వహణను చేపట్టనున్నట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 6తో అదనపు పదవీ కాలం ముగియనున్న ప్రశాంత్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేసింది. వేతనం తదితరాలకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది.వినయ్ గతంలో పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకు ఎండీగా విధులు నిర్వహించారు. యస్ బ్యాంక్లో గతేడాది జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 24 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతిపెద్ద ఇన్వెస్టర్గా నిలుస్తోంది.బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా అనుభవమున్న వినయ్ ట్రెజరీ, రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్యకలాపాలు, అసెట్ మేనేజ్మెంట్ తదితర విభాగాలలో పనిచేశారు. బెంగళూరుకు చెందిన సెయింట్ జోసెఫ్ కామర్స్ కాలేజ్లో కామర్స్ డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా 1988లో కెరీర్ ప్రారంభించారు.Mr. Vinay M. Tonse assumes office as MD & CEO today. YES BANK enters its next phase of growth with a strengthened foundation and a clear strategic direction. Sustained growth, driven by consistency and purpose, remains central to the journey ahead.We extend our best wishes as… pic.twitter.com/mKLrXN8AMl— YES BANK (@YESBANK) April 6, 2026
కార్పొరేట్
మంత్రిత్వ శాఖ ప్రకటన.. రికార్డు స్థాయిలో విండ్ ఎనర్జీ!
యస్ బ్యాంక్కు కొత్త సీఈవో
రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!
కేరళ దేవాలయాలకు అనంత్ అంబానీ భూరి విరాళం
టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు
ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా
హెల్త్కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’!
క్యూ4లో ఐటీ డీలా!
విప్రో రూ. 9,300 కోట్ల డీల్
'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా క...
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద...
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వ...
త్వరలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!
ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్క...
ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్ నేటి నుంచే..
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మా...
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద...
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి
లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్...
రూపాయి రక్షణలో.. మరింత తగ్గిన ఫారెక్స్, బంగారం నిల్వలు
ముంబై: అధిక చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో ‘వీ70 ఎఫ్ఈ’ పేరుతో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 6.83 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. వెనుక అల్ట్రా స్టెబిలైజేషన్ కలిగిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అ్రల్టావైడ్ డ్యూయల్ రియర్ కెమెరాలు కలిగి ఉంది.ముందు భాగంలో 50ఎంపీ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 90వాట్ల ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వచి్చంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.37,999గా, 8జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.40,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.44,999 ఉంది. వివో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో పాటు, రిటైల్ స్టోర్లలో ఏప్రిల్ 9 నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!
టెక్ దిగ్గజం ఆపిల్.. తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'పై డిస్కౌంట్ ప్రకటించింది. కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశం.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.1,49,900. దీనిని కంపెనీ డిస్కౌంట్ కింద రూ.1,02,900కు అందిస్తోంది. అంటే రూ. 47వేలు తగ్గింపు లభిస్తోందన్నమాట. ఇందులో రూ.4000 క్యాష్ బ్యాక్, రూ.1000 తక్షణ తగ్గింపు మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.6000 డిస్కౌంట్ అందిస్తోంది. పాత ఫోన్లపై రూ. 36వేలు వరకు ఎక్స్ఛేంజ్ (మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది) లభిస్తుంది. ఈ ఆఫర్ ఆపిల్ అధీకృత రీసెల్లర్, ఇమాజిన్ స్టోర్లలో లభిస్తుంది.ఈ సేల్లో ఐఫోన్ 17 ప్రో (256GB) కూడా ఉంది. దీనిని ఇప్పుడు రూ. 89,900లకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో తక్షణ డిస్కౌంట్ లభించదు. కానీ.. క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తాయి. స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర కూడా చాలావరకు తగ్గింది. స్మార్ట్ఫోన్ ధరలు మాత్రమే కాకుండా.. ఐప్యాడ్ (2025), వై-ఫై + సెల్యులార్ వెర్షన్, ఐప్యాడ్ ప్రో (M5) లైనప్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.ఇదీ చదవండి: బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
ఒరాకిల్ బాస్కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కుబేరుల జాబితాలో వెనక్కి..బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.షేర్ల పతనమే కొంపముంచింది..ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.భారీగా ఉద్యోగుల తొలగింపు ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.భారత్పై తీవ్ర ప్రభావంమీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది."ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రూ .1.8 కోట్ల జీతం.. భలే జాబ్ కొట్టాడు!!
విదేశీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కన్సల్టెన్సీలు, విదేశాల్లో నెట్వర్కింగ్, లేదా అక్కడే చదువుకుని ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఏ విధమైన విదేశీ కనెక్షన్లు లేకుండా, కేవలం తన గదిలో కూర్చుని పక్కా ప్రణాళికతో రూ. 1.8 కోట్ల అంతర్జాతీయ జాబ్ ఆఫర్ను సొంతం చేసుకున్నాడు కార్తీక్ మోడీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఈ వార్త టెక్ నిపుణుల్లో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తోంది.అసాధ్యం కాదు..తొలుత ఇండియాలో ఉంటూనే రిమోట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కార్తీక్, ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాతే యూకేకి మకాం మార్చారు. ‘విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద నెట్వర్క్ ఉండటం ముఖ్యం కాదు. సరైన నైపుణ్యం, స్పష్టమైన ప్రణాళిక ఉంటే మీ గది నుంచే ప్రపంచాన్ని గెలవొచ్చు’ అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.కార్తీక్ మోడీ సక్సెస్ మంత్రం ఇదే..గుడ్డిగా వందలాది కంపెనీలకు దరఖాస్తు చేయకుండా, కేవలం 25-30 అంతర్జాతీయ కంపెనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వీసా స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీల కోసం లింక్డ్ఇన్, ఇండీడ్, లెవల్స్.ఫై వంటి వేదికలను ఉపయోగించుకున్నారు.సుమారు 40 ఉద్యోగ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి, అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఆశిస్తున్న నైపుణ్యాలను గుర్తించి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం 12 వారాల పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొదటి 5 వారాలు డేటా స్ట్రక్చర్స్ & అల్గోరిథమ్స్ పై పట్టు సాధించారు. వేల సమస్యలు కాకుండా, కేవలం 100 కీలకమైన సమస్యలను ఎంచుకుని, వాటి వెనుక ఉన్న లాజిక్ను అర్థం చేసుకున్నారు.సిస్టమ్ డిజైన్పై పట్టు సాధించేందుకు పేమెంట్స్, సెర్చ్, నోటిఫికేషన్స్ వంటి 8-10 కీలక కోర్ సిస్టమ్స్పై లోతైన అధ్యయనం చేశారు. రియల్ వరల్డ్ ప్రాజెక్టులలో స్కేలబిలిటీ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రాక్టీస్ చేశారు.రిజ్యూమ్ చిన్నగా.. ఇంపాక్ట్ పెద్దగా!అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కేవలం ఒకే ఒక్క పేజీలో తన రిజ్యూమ్ను రూపొందించారు. సుదీర్ఘమైన వివరణలు ఇవ్వకుండా, తాను చేసిన పని వల్ల కలిగిన ఫలితాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. ఇంటర్వ్యూ భయం పోగొట్టుకోవడానికి పలు 'మాక్ ఇంటర్వ్యూలు' కూడా నిర్వహించుకున్నారు.ఏ విధమైన షార్ట్కట్లు వెతక్కుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే ప్రపంచస్థాయి అవకాశాలు మన ముంగిటకే వస్తాయని కార్తీక్ మోడీ నిరూపించారు. కేవలం 10-12 వారాల కఠోర శ్రమ ఆయన జీవితాన్నే మార్చేసింది.
పర్సనల్ ఫైనాన్స్
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి.
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు


