Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ICF vs LHB Coaches Which Is Safer and Better for Passengers1
ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?

రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్‌ల గురించి తెలుసుకుందాం.ఐసీఎఫ్ కోచ్‌లుభారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్‌తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్‌లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.ఐసీఎఫ్ కోచ్‌లలో.. స్లీపర్ క్లాస్‌లో 72 బెర్త్‌లు, థర్డ్ ఏసీ క్లాస్‌లో 64 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్‌ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.ఐసీఎఫ్ కోచ్‌లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్‌లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుఇక ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్‌లో 80 బెర్త్‌లను, థర్డ్ ఏసీ క్లాస్‌లో 72 బెర్త్‌లు ఉంటాయి. ఇవి ICF కోచ్‌ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్‌లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Covacent Technologies Partners with Google Cloud2
గూగుల్‌ క్లౌడ్‌తో కోవాసెంట్‌ జట్ట

కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ తాజాగా గూగుల్‌ క్లౌడ్‌తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్‌ప్రైజ్‌ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.తమ ఏజెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూట్‌ని జెమిని ఎంటర్‌ప్రైజ్, గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

Why Has Russia Sold 22000 Kgs of Gold in 20263
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!

గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

Pop Star Rihanna Joins the Ambani Family for an Intimate Cultural Lunch4
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..

ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్‌కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. View this post on Instagram A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly)

Gold Price Next Week Will Gold Rise or Stay5
బంగారం.. వచ్చే వారమూ ఇంతేనా?

దేశంలో బంగారం రేట్లు గత వారంలో సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెలలో అంతకుముందు కనిపించిన భారీ స్థాయి దిద్దుబాట్లు పునరావృతం కాలేదు. పసిడి ధర గత రెండు రోజులుగా స్వల్ప స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. గడిచిన వారం అంతా పసిడి ప్రియులకు మిశ్రమ ఫలితాలను అందించింది.తగ్గిన బంగారం ధరలుఈవారం చివరి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,040, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,200 వద్ద స్థిరపడింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఏప్రిల్ 20 నుండి 23 వరకు 10 గ్రాములకు రూ.2,230 తగ్గుదల నమోదైంది.ఎంసీఎక్స్ మార్కెట్ ధోరణిదేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌ (MCX)లో ఈ వారం బంగారం అల్లకల్లోలంగా గడిచింది. ఏప్రిల్ 20 నుంచి 24 మధ్య ధరలు సుమారు రూ. 400 తగ్గాయి. అయితే, తాజా ట్రేడింగ్ సెషన్‌లో 0.7% పుంజుకుని రూ. 1,52,799 వద్ద ముగిసింది. ఈ స్వల్ప రికవరీ ఉన్నప్పటికీ, వారం మొత్తం పనితీరును పరిశీలిస్తే ధరలు 0.23% తగ్గుదలనే నమోదు చేశాయి.అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంగ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,710.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధరలు 0.38% పెరిగినప్పటికీ, వారం మొత్తంగా చూస్తే 2% పైగా క్షీణత కనిపించింది. బలమైన అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌ బంగారానికి ప్రతికూలంగా మారాయి.వచ్చే వారం అంచనావచ్చే వారం (ఏప్రిల్ 27 - మే 2, 2026) బంగారం ధరలు మిశ్రమ ధోరణిని చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు.. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇది బంగారానికి అవరోధంగా మారుతుంది. అమెరికా-ఇరాన్ చర్చల ఫలితాలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయి. ఇన్వెస్టర్లు ప్రస్తుతం రిస్క్ తీసుకోవాలా లేక జాగ్రత్తగా ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్నారని బ్రిక్ వర్క్ రేటింగ్స్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ అభిప్రాయపడ్డారు.

IDFC First Bank Reports Steady Growth in Q4 no impact of 590 crore fraud6
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు తగ్గని లాభాలు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ. 319 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ4లో నమోదైన రూ. 304 కోట్లతో పోలిస్తే సుమారు 5 శాతం అధికం. సమీక్షాకాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 9,413 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ. 10,553 కోట్లకు చేరింది.నికర వడ్డీ ఆదాయం (చెల్లించినది పోగా) రూ. 4,907 కోట్ల నుంచి రూ. 5,677 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 2 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 5.95 శాతం నుంచి 5.93 శాతానికి నెమ్మదించింది. వ్యాపారం 19 శాతం వృద్ధితో రూ. 5.75 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం అసెట్స్‌లో మొండి పద్దులకు ప్రొవిజనింగ్‌ క్యూ1లో నమోదైన 1.92 శాతం నుంచి క్యూ4లో 1.52 శాతానికి తగ్గింది.మైక్రో ఫైనాన్స్‌ విభాగం మినహా అసెట్‌ క్వాలిటీ స్థిరంగా ఉందని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. పరిశ్రమవ్యాప్తంగా సూక్ష్మ రుణాల విభాగంలో సవాళ్లు ఎదురైనట్లు వివరించారు. ప్రస్తుతం స్థూల మొండిబాకీలు, నికర మొండిబాకీలు వరుసగా 1.61 శాతం, 0.48 శాతానికి దిగి వచ్చినట్లు చెప్పారు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో గత ఫిబ్రవరిలో బయటపడిన రూ.590 కోట్ల ఫ్రాడ్‌ ఉదంతం మార్చి త్రైమాసిక ఫలితాలపై (Q4FY26) ఎటువంటి ప్రభావం చూపలేదని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. ఇతర బ్యాంకులలో ఇలాంటి సంక్షోభాలు సద్దుమణగాలంటే దాదాపు సంవత్సరం పడుతుందని, కానీ ఇక్కడ అలా జరగలేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement