Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why does Indian Railways use 10 digit PNR numbers explanation1
రైలు టికెట్‌ రహస్యం తెలుసా?

భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్‌పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?ఏమిటీ పీఎన్ఆర్?పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్‌లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్‌లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.పది అంకెలే ఎందుకంటే..లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్‌ను రైల్వే ఎంచుకుంది.ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్‌ను తెలియజేస్తాయి.చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.పీఎస్‌ఆర్‌ వ్యవస్థ ఎందుకు కీలకం?కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్‌ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్‌ఆర్‌లో గమనించండి.

Central Government has approved 2pc hike in DA for employees2
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.గత అక్టోబర్‌లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.జీతం ఎంత పెరుగుతుందంటే?ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.8వ వేతన సంఘానికి డిమాండ్లుఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

Meta set to fire 16000 employees in coming months 8000 layoffs on May 203
మెటాలో భారీ లేఆఫ్‌లు.. 16,000 మందిపై వేటు?

సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్‌ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్‌ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్‌లు సిద్ధం చేస్తున్నారు.నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్‌లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్‌లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్‌

Indias First LED Credit Card Launched by AU Small Finance Bank and Cheq4
కొత్త క్రెడిట్‌ కార్డు.. ఎల్‌ఈడీ లైట్లతో..

ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్‌ఫాం ‘చెక్‌’, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్‌ ఎల్‌ఈడీ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్‌ ఏయూ క్రెడిట్‌ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.ఎల్‌ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్‌ విధానం ఈ క్రెడిట్‌ కార్డు ప్రత్యేకత అని చెక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్‌ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్‌ కార్డులోని ఎల్‌ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్‌ఎఫ్‌సీ ఫీల్డ్‌ సాయంతో ఎల్‌ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్‌ కార్డు కావాలనుకొనే వారు చెక్‌ యాప్‌ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Cognizant CEO Ravi Kumar 2025 pay jumps 29pc to 10 6 million5
కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్‌

కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ 2025 సంవత్సరానికి గాను మొత్తం 10.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు 29 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ వేతనంలో 1.3 మిలియన్‌ డాలర్లు బేసిక్‌ పే, 4.3 మిలియన్‌ డాలర్లు నగదు ప్రోత్సాహకం, 4.9 మిలియన్‌ డాలర్ల ఆర్‌ఎస్‌యూ (ఈక్విటీ పరిహారం) చెల్లింపులు ఉన్నాయి.అయితే, ఆయన టార్గెట్ టోటల్ డైరెక్ట్ కాంపెన్సేషన్ 19 మిలియన్‌ డాలర్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఎందుకంటే పనితీరు ఆధారిత పీఎస్‌యూ (PSU) గ్రాంట్లు భవిష్యత్తులో లభించనున్నాయి. కాగా, ఇదే ఏడాది భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓసి.విజయకుమార్ (10.8 మిలియన్‌ డాలర్లు) నిలవగా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 80.6 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా రూ. 53.6 కోట్లు ఆర్జించారు.కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, కాగ్నిజెంట్ 2025లో అంచనాలను మించి రాణించింది. కృత్రిమ మేధ (AI), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భారీ ఒప్పందాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 21.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా కంపెనీ అంచనా వేసిన 15.3-15.7 శాతం కంటే మెరుగ్గా 15.8 శాతంగా నమోదైంది. గతంలో ఎదుగుదల విషయంలో వెనుకబడిన తమ సంస్థ, ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీల మధ్య అగ్రస్థానానికి చేరుకుందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కంపెనీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ కూడా తన లక్ష్యం కంటే అధికంగా 6.6 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు.ఇక కంపెనీలోని వేతన వ్యత్యాసాల విషయానికి వస్తే, సీఈఓ వేతనానికి, సాధారణ ఉద్యోగి వేతనానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగి సగటు వేతనం 45,138 డాలర్లుగా ఉండగా, సీఈఓ వేతన నిష్పత్తి 477:1గా నమోదైంది. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 1,40,739 డాలర్లుగా ఉండటంతో అక్కడ నిష్పత్తి 153:1గా ఉంది. అయితే, జీవన వ్యయ సర్దుబాటు చేయకుండా లెక్కిస్తే, భారతీయ ఉద్యోగి సగటు వేతనం కేవలం 14,136 డాలర్లు (సుమారు రూ. 11.8 లక్షలు) మాత్రమే. ఈ క్రమంలో సీఈఓ, భారతీయ ఉద్యోగి వేతన నిష్పత్తి అత్యధికంగా 1,523:1గా ఉండటం గమనార్హం.ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,51,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో మెజారిటీ వాటా భారత్‌దే కావడం విశేషం. మన దేశంలో 2,56,900 మంది ఉద్యోగులు ఉండగా, ఉత్తర అమెరికాలో 41,600 మంది, యూరప్‌లో 14,600 మంది, బ్రిటన్‌లో 7,800 మంది పనిచేస్తున్నారు. కంపెనీ తన మార్జిన్లను మెరుగుపరుచుకుంటూ ఆదాయ వృద్ధి అంచనాలను 4 శాతం నుండి 6.5 శాతానికి పెంచడం, భవిష్యత్తులో ఐటీ మార్కెట్లో సంస్థ మరింత పట్టు సాధిస్తుందనే సంకేతాలను ఇస్తోంది.ఇదీ చదవండి: డ్యాన్స్‌ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!

Budvel The New Epicenter of Hyderabad Real Estate Boom6
హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌.. ఇప్పుడు ఇక్కడే..

15 కి.మీ. దూరంలో సెక్రటేరియట్, లక్డీకాపూల్‌ వంటి హాట్‌ స్పాట్స్‌..20 కి.మీ. దూరంలో ఐటీ హబ్, శంషాబాద్‌ విమానాశ్రయం..చుట్టూ ఆర్మీ కాపలా.. హిమాయత్‌నగర్, గండిపేట జలాశయాలతో కళకళ..కూతవేటు దూరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, వైద్య, వినోద కేంద్రాలు.. ..ఇలాంటి వసతులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుబాటు ధరల్లోనే సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తోంది బుద్వేల్‌. రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్‌పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. -సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్‌ నుంచి మాదాపూర్‌కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్‌ బుద్వేల్‌కు విస్తరించిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణం సులువైంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లతో పాటు ఏరో స్పేస్‌ కంపెనీలకు సులువుగా చేరుకునే అవకాశం కలిగింది. అలాగే ఓఆర్‌ఆర్‌ మీదుగా 40 కి.మీ. దూరంలో షాద్‌నగర్, కొత్తూరులోని లాజిస్టిక్‌ పార్కులకూ చేరుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ధనవంతులు తమ మొదటి ఆస్తిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎంచుకుంటే.. రెండో ఆస్తిని రాజేంద్రనగర్‌లో ఎంచుకుంటున్నారు. ఇది చాలు రాజేంద్రనగర్‌ ఉన్నత శ్రేణి వర్గాలు ఉండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి.. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ.35వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు ఉండే ప్రతి ఉద్యోకి ఇది అనుకూలమైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులందరికీ భారీ వేతనాలు ఉండవు. దీంతో గచి్చబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఉండలేకపోతున్నారు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. రేతిబౌలి ఫ్లైఓవర్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు.అందుకే గతంలో మాదిరిగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ జూబ్లీహిల్స్‌ మీదుగా సైబర్‌ టవర్స్‌కు వెళ్లే బదులు లంగర్‌హౌజ్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఐటీ హబ్‌కు కూతవేటు దూరమే. 20 నిమిషాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులు ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.వంద ఫీట్ల రోడ్డు.. బుద్వేల్‌ నుంచి సన్‌సిటీ మీదుగా బండ్లగూడ జాగీర్‌ వరకూ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఒక ప్రధాన వృద్ధి కారిడార్‌గా ఉండటంతో 3–4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అంచనా. ఈ ప్రాంతం మధ్యస్థాయి, ఉన్నత స్థాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్‌ఐఆర్‌డీ, ఎన్‌జీరంగా వర్సిటీలతో పాటు అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. అప్పా జంక్షన్‌ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు.రిజిస్ట్రేషన్లు రయ్‌.. రయ్‌.. గతేడాది రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 13,423 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,140 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం రిజి్రస్టేషన్లు 10–15 శాతం వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా బుద్వేల్, కిస్మత్‌పూర్, మంచిరేవుల, హైదర్షాకోట్‌ ప్రాంతాల్లో రిజి్రస్టేషన్లు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాపర్టీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్‌ మెంట్లలో ధర చ.అ.కు రూ.10 వేల వరకు, విల్లాలు అయితే రూ.12 వేల వరకు చెబుతున్నారు.బుద్వేల్‌ ఎకో ఫ్రెండ్లీ జోన్‌బుద్వేల్‌ పర్యావరణ అనుకూల ప్రాంతం. జంట జలాశయాలు, గ్రీనరీ, ప్రతిపాదిత కొత్వాల్‌ ఎకో పార్క్‌లకు సమీపంలో ఉండటంతో ఎకో ఫ్రెండ్లీ జోన్‌ అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వైద్యులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.– బూరుగు రాంబాబు, డైరెక్టర్, ప్రణవ గ్రూప్‌ఇది చదివారా? రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్‌!

Advertisement
Advertisement
Advertisement