Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

West Asia war, crude oil prices likely to steer stock markets this week1
పశ్చిమాసియాపైనే ఫోకస్‌!

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం... రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్‌ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గణాంకాల విడుదల దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్‌ఎస్‌బీసీ ఫ్లాష్‌ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్‌ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్‌ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్‌ గణాంకాలు విడుదలకానున్నాయి. హార్ముజ్‌పై ఫోకస్‌ కొద్ది రోజులుగా హార్ముజ్‌ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్మూడి ఆర్‌. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్‌ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. గత వారం అక్కడక్కడే తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.సాంకేతికంగా ఈ వారంయుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్‌ను పడగొడుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. → నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు.. యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్‌ డాలర్లు) విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్‌ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Multi-asset funds are the most sought-after investment option2
రక్షణ ప్లస్‌ రాబడి

మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్‌ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్‌ ఫండ్లంటే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్‌ను చూసుకోవాలి. అటు డెట్‌లోను, ఇటు స్టాక్‌ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్‌ ఫండ్స్‌. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్‌లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఈ మల్టీ అసెట్‌ ఫండ్స్‌... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్‌ స్టోరీ... కనీసం మూడు అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌నే మల్టీ అసెట్‌ ఫండ్స్‌గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్‌ సాధనాలు– బాండ్స్‌లో, రిస్క్ లను హెడ్జ్‌ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రతి అసెట్‌ క్లాస్‌కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్‌ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్‌ఫోలియో ఉన్నట్లే లెక్క. ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్‌ని ఎంచుకోవడం కన్నా అసెట్స్‌ అలొకేషన్‌ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్‌ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్‌కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్‌ని నమ్ముకుంటే వర్కౌట్‌ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్‌ ఫండ్స్‌తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్‌ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్‌గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్‌ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి. మల్టీ అసెట్‌ ఎందుకు ఉపయోగకరం అంటే..వివిధ అసెట్స్‌ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్‌ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్‌ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్‌ ఇన్వెస్టింగ్‌ కోసం ఇవి అనువైనవి కూడా.డెట్‌ (బాండ్లు) పాత్ర.. డెట్‌ విభాగమనేది మల్టీ అసెట్‌ ఫండ్స్‌కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్‌ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్‌కి లోనయ్యే సమయంలో పోర్ట్‌ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్‌గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్‌ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి. సరైన ఫండ్‌ని ఎంచుకోవడం ఇలా.. అసెట్‌ అలొకేషన్‌ని పరిశీలించాలి → ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి. → బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి. నిలకడపై ఫోకస్‌ → స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్‌ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి → ఐసీఐసీఐ = కాంట్రేరియన్‌ → ఎస్‌బీఐ = బ్యాలెన్స్‌డ్‌ → క్వాంట్‌ = అగ్రెసివ్‌ మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి→ కన్జర్వేటివ్‌ = ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ → మోడరేట్‌ = ఐసీఐసీఐ, కోటక్‌ → అగ్రెసివ్‌ = నిప్పన్, క్వాంట్‌ ఈ రిస్క్ లుంటాయ్‌.. మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్‌ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.– సాక్షి, వెల్త్‌

BSNL New Recharge Plan 164 Days Validity3
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026

India Set to Become a Wealthy Nation by 2047 Washington Examiner4
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్‌ను (మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్‌కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..

Woman Earning Rs 2 5 Lakh Says She Was Happiest At Rs 150005
రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!

జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.At a salary of:15K per month, I was the happiest.150K per month, I felt it was less - I deserved more.250K per month, I felt I was doing well, but after seeing others, it again felt less.I realised it was never about the salary.It was the comparison that created…— Sakshi (@Sakshi50038) March 20, 2026

Skoda Kushaq Facelift Launched Know The Details Here6
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది: ధర ఎంతంటే?

స్కోడా కంపెనీ.. అప్‌డేటెడ్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్‌లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది.కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement