Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Price Drop in India Check Updated Rates in Hyderabad Mumbai and Delhi1
భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!

గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!

Oben Rorr EVO Electric Motorcycle Launched At Rs 99,9992
సరికొత్త రోర్ లాంచ్: ధర రూ.లక్ష!

ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన ఓబెన్ ఎలక్ట్రిక్.. సరికొత్త రోర్ ఈవీఓ లాంచ్ చేసింది. మొదటి 10,000 మంది కస్టమర్లు దీనిని రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. తరువాత దీని ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.కేవలం రూ. 777తో బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, దేశవ్యాప్తంగా ఉన్న 150 షోరూమ్‌లలో టెస్ట్ రైడ్‌లు, కస్టమర్ డెలివరీలు జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. మంచి డిజైన్ కలిగిన ఈ ఓబెన్ రోర్ ఈవీఓ ముందు భాగంలో సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది.రోర్ ఈవీఓ గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ రేంజ్ 180 కిమీ (సింగిల్ ఛార్జ్). రియల్ వరల్డ్ రేంజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 90 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. రోజువారీ ఛార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉపయోగపడుతుంది.ఈ మోటార్‌సైకిల్‌కు IP68-రేటెడ్ మోటార్ శక్తిని అందిస్తుంది. రోర్ ఈవీఓలో ఓబెన్ వారి సొంత 3.4 kWh అధిక-పనితీరు గల LFP బ్యాటరీని అమర్చారు. ఇది సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే 50% అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉండటమే కాకుండా.. రెండు రెట్లు జీవితకాలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!రోర్ ఈవీఓ 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్‌లను అందిస్తుంది. Oben Electric యాప్ ద్వారా, రైడర్‌లు రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, 'ఫైండ్ మై Rorr', 24x7 సర్వీస్ సపోర్ట్‌ను పొందవచ్చు. దీనితో పాటు 68,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ కూడా లభిస్తుంది.

PhonePe Surpasses 700 Million Registered Users3
70 కోట్లు దాటిన ఫోన్‌పే యూజర్లు!

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్‌ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.700 Million 💜A number this big only happens because of the trust you place in us every single day.To our users, merchants and partners across every corner of India thank you for making us 700 Mn strong! 🙏Read More: https://t.co/e9vyvz9uI4#PhonePeFamily #Milestone… pic.twitter.com/mcgjBlEzzR— PhonePe (@PhonePe) April 29, 2026

Fired by Elon Musk, Now Boss for a Rs 19000 Crore Company4
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!

మాజీ ట్విట్టర్‌ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్‌లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్‌లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్‌, రీసెర్చ్‌ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్‌ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు.

SEBI Clears IPO Plans of Hindustan Laboratories and RK Steel Manufacturing for Market Debut5
రెండు ఐపీవోలకు సెబీ అనుమతి

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రెండు కీలక సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జెనెరిక్‌ ఔషధాల తయారీ సంస్థ హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌, స్టీల్‌ పైపుల ఉత్పత్తిదారు ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ప్రాథమిక పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి పొందాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను పరిశీలించిన సెబీ, ఏప్రిల్‌ 27న తుది అనుమతులు (అబ్జర్వేషన్స్‌) మంజూరు చేసింది.హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌: ఫార్మా రంగంలో సేవలందిస్తున్న హిందుస్థాన్‌ లా»ొరేటరీస్‌ ఐపీఓలో భాగంగా 50 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు మరో 91 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ స్థాయిలో జెనెరిక్‌ మందులను సరఫరా చేసే (బీ2బీ) వ్యాపారంలో కొనసాగుతోంది.ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌: స్టీల్‌ ట్యూబ్‌లు, పైపుల తయారీలో ఉన్న ఆర్‌కే స్టీల్‌ సుమారు 2 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ల వాటా విక్రయం (ఓఎఫ్‌ఎస్‌) ఏమీ లేదు. సేకరించిన నిధులను ప్రధానంగా సంస్థకున్న రుణాల చెల్లింపులకు, మూలధన నిర్వహణ, వ్యాపార విస్తరణ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో లిస్ట్‌ కానున్నాయి.

Global Air Travel Faces Turbulence ATF Price Surge Hit International Airlines6
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?

విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీలో కొత్త ధరలుదేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్‌మార్క్‌గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.దేశీయ సంస్థలకు ఊరటప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఎందుకు ఈ పెంపు?ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Advertisement
Advertisement
Advertisement