Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Telangana orders 1,085 Olectra e-buses says TGSRTC1
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పీఎం ఈ–డ్రైవ్‌ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డరు వచి్చనట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ద్వారఫ్లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లభించినట్లు వివరించింది. ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం వినియోగించనున్నట్లు సంస్థ ఎండీ మహేష్‌బాబు తెలిపారు. ఇక్కడి రహదారులకు అనుగుణంగా ఏసీ, నాన్‌ ఏసీ వేరియంట్లలో 12 మీటర్ల లో–ఫ్లోర్‌ కాని్ఫగరేషన్స్‌తో ఈ బస్సులను అందించనున్నట్లు వివరించారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా ఇవి ఉంటాయని, సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్‌ చేసేందుకు వీలుంటుందని మహేష్‌బాబు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి చెందిన 3,600 ఎలక్ట్రిక్‌ బస్సులు దేశవ్యాప్తంగా రహదారులపై తిరుగుతుండగా, 10,000 పైగా వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి.

Banks must focus on Core Banking, not Insurance Sales2
బ్యాంకులూ..మీ పని మీరు చూసుకోండి

న్యూఢిల్లీ: బ్యాంకులు తమ అసలు వ్యాపారం అయిన డిపాజిట్లు సమీకరించడం, రుణాలు ఇవ్వడం, తక్కువ వ్యయాలతో కూడిన కాసా డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. అంతేకానీ, బ్యాంకుకు సంబంధం లేని బీమా, ఇతర ఉత్పత్తులను అనుచిత మార్గాల్లో విక్రయించే (మిస్‌ సెల్లింగ్‌) చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ‘‘బ్యాంక్‌లు తమ ప్రధాన వ్యాపార సూత్రాలను దృష్టిలో పెట్టుకోకుండా, వారి రుణ అవసరాలను అర్థం చేసుకోకుండా, వారితో సంబంధాలను బలోపేతం చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవసరం లేకపోయినప్పటికీ బీమా పాలసీల విక్రయాలపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి. దీంతో రెండు స్కూళ్ల పరిధిలోకి (ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ నియంత్రణలు) వచ్చి చేరుతున్నాయి. కస్టమర్లకు అప్పటికే బీమా రక్షణ ఉన్నప్పటికీ, మళ్లీ కొనుగోలు చేయాలని బ్యాంక్‌లు అడుగుతున్నాయి. బీమా ఐఆర్‌డీఏఐ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు విక్రయాలను ఆర్‌బీఐ పర్యవేక్షించడం లేదు. బ్యాంక్‌లు ఆర్‌బీఐ పరిధిలోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ ఊరుకుంటోంది. ఈ పర్యవేక్షణ అంతరాల వల్ల కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’అని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి సీతారామన్‌ వ్యాఖ్యానించారు. మిస్‌ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ ఫిబ్రవరి 11న ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం. వీటి ప్రకారం కస్టమర్లకు అవసరం లేని ఉత్పత్తులను విక్రయించరాదు. అలా చేసినట్టు తేలితే కస్టమర్‌ చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా ఉత్పత్తి లేదా సేవను విక్రయించడం వల్ల కస్టమర్‌ నష్టపోయినట్టు తేలితే, ఆ మేరకు పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. మిస్‌సెల్లింగ్‌ ఆమోదయోగ్యం కాదంటూ ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదని సీతారామన్‌ అన్నారు. బంగారం దిగుమతులపై కన్నేసి ఉంచాం.. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని.. దీనిపై ప్రభుత్వం, ఆర్‌బీఐ కన్నేసి ఉంచినట్టు మంత్రి సీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు బంగారం దిగుమతులు బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 50 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం భారతీయ కుటుంబాలకు ఎల్లప్పుడూ అనుకూల పెట్టుబడి సాధనంగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సైతం ఈ సమావేశంలో భాగంగా మీడియాతో చెప్పారు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కే పరిమితం.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసపూరిత ఘటన వ్యవస్థాపరమైన సమస్య కాదన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా. పరిణామాలను గమనిస్తున్నట్టు చెప్పారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ చండీగఢ్‌ శాఖలో హరియాణా ప్రభుత్వ సంస్థల ఖాతాల నుంచి ఉద్యోగులు నిధులను దారి మళ్లించడం తెలిసిందే. 2024 బేస్‌ సంవత్సరం ఆధారంగా విడుదలయ్యే రిటైల్‌ ద్రవ్యోల్బణం.. కుటుంబాల వినియోగం తీరుతెన్నులను మరింత ప్రభావంతంగా ప్రతిఫలిస్తుందని మల్హోత్రా తెలిపారు.

Why Some Cars Have Blue Colour Number Plates in India Know The Details Here3
బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. వాళ్లకు మాత్రమే ఎందుకు?

సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.ఈ వాహనాల నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

Know The Reasons Of Gold Price Hike Says FM Sitharaman4
'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే.. బంగారం ధర పెరుగుదలకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఫిబ్రవరి 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరుగుదలకు కారణం అవుతోందని అన్నారు.ఇతర కారణాలుకేంద్ర బ్యాంకుల కొనుగోలు మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు & సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గోల్డ్ రేటు అమాంతం పెంచేస్తున్నాయి. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో తెలుగు రాష్ట్రల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,61,350 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,900 వద్ద ఉంది.

2026 Isuzu D Max V Cross Launched5
రూ.25 లక్షల ఇసుజు కారు: దీని గురించి తెలుసా?

2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధరలు రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ 4x2 ఆప్షన్ నిలిపివేయడంతో.. ఈ పికప్ ట్రక్ 4x4 ఎంపికలో మాత్రమే లభిస్తుంది. టయోటా హైలక్స్ ప్రత్యర్థిగా నిలిచే ఈ కారు 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 161 bhp & 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.పరిమాణంలో పెద్దగా ఉండే ఈ పికప్ ట్రక్ డిజైన్ గంభీరంగా ఉంటుంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఉంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అయితే ఇందులో బ్లాక్ వీల్ ఆర్చ్ & సైడ్ క్లాడింగ్ లేదు. లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. రూఫ్-మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ కూడా ఉన్నాయి.360-డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఇసుజు వీ-క్రాస్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్ ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏటీ జెడ్ ప్రెస్టీజ్.

Amazon second largest office in Asia opens in Bengaluru6
అమెజాన్‌ అతిపెద్ద ఆఫీస్‌.. ఇక్కడే..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్‌ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. “భారత్‌ అమెజాన్‌కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది.

Advertisement
Advertisement
Advertisement