Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

2026 KTM 250 Duke Launched at Rs 2 13 Lakh1
2026 కేటీఎం 250 డ్యూక్ వచ్చేసింది: ధర ఎంతంటే?

కేటీఎం కంపెనీ 250 డ్యూక్ 2026 ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్లేట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ అనే రెండు రంగుల్లో లభించే ఈ బైక్ ధర రూ. 2.13 లక్షలు (ఎక్స్ షోరూమ్).సిల్వర్ మెటాలిక్ వెర్షన్‌ బైక్.. బూడిద రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & సిల్వర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు 250 డెకాల్స్‌ పొందుతుంది. అయితే స్లేట్ గ్రే బైక్ నారింజ రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & బూడిద రంగు ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లతో వస్తుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది.2025 డ్యూక్ 2026 మోడల్ ఎలాంటి యాంత్రిక మార్పులకు లోను కాలేదు. కాబట్టి ఇందులో అదే 248.8 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9250 rpm వద్ద 30.75 BHP & 7,250 rpm వద్ద 25 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

Telangana Launch Ease of Doing Business 2 0 to Attract Global Investments2
తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.మంగళవారం జూబ్లీహిల్స్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు.2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థరాష్ట్ర వృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, అది పక్కా ప్రణాళికతో కూడిన ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగిందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో పని చేస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.రాష్ట్ర అభివృద్ధికి త్రిముఖ వ్యూహంతెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘క్యూర్ - ప్యూర్ - రేర్’ అనే వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. అభివృద్ధిని కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు పని సంస్కృతిని పూర్తిగా మార్చేశాయని మంత్రి అభిప్రాయపడ్డారు.‘రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కంపెనీల కంటే బలమైన ఎకో సిస్టమ్‌కే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే భవిష్యత్తు కోసం వేచి చూడకుండా ఆ భవిష్యత్తును మనమే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం కేవలం అనుమతులు ఇచ్చే యంత్రాంగంలా కాకుండా పరిశ్రమలతో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాంచందర్ రావు, డా.నాగేశ్వర్ రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ కన్వీనర్ పంకజ్ దివాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

India managed funds industry projected AUM grow to Rs 455 lakh crore3
ఫండ్స్‌ ఆస్తులు.. @ రూ.455 లక్షల కోట్లు!

ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు) నిర్వహణలోని మొత్తం ఆస్తులు (మేనేజ్డ్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీ ఏయూఎం) 2025 మార్చి నాటికి రూ.212 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత జీడీపీలో 64 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 73 శాతానికి పెరగనున్నాయి. ఈ వివరాలతో క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ (క్రిసిల్‌ రేటింగ్స్‌ సంస్థ) ఒక నివేదికను విడుల చేసింది. గృహ పొదుపులు ఈక్విటీ, ఏఐఎఫ్‌ల్లోకి వస్తుండడాన్ని ప్రస్తావించింది.2025 మార్చితో ముగిసిన ఐదేళ్ల కాలంలో మేనేజ్డ్‌ ఫండ్‌ అసెట్స్‌ ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని.. అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 11 శాతాన్ని మించినట్టు తెలిపింది. సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా పేర్కొంది. ఏఐఎఫ్‌లు చాలా వేగవంతమైన వృద్ధిని చూస్తున్నాయని.. మేనేజ్డ్‌ ఫండ్స్‌ పరిశ్రమ (నిపుణులు నిర్వహించే ) మొత్తం ఆస్తుల్లో ఏఐఎఫ్‌ల వాటా 2020 మార్చి నాటికి 4 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 9 శాతానికి చేరనున్నట్టు తెలిపింది. క్యాపిటల్‌ మార్కెట్ల వైపు పొదుపు నిధులుగృహ పొదుపుల్లో ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 2020లో 4 శాతంగాఉంటే, 2025 నాటికి 15 శాతానికి చేరిందని.. రిస్క్‌ తీసుకునే ధోరణి, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో భాగస్వామ్యం పట్ల ఆసక్తికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. రిటైర్మెంట్‌ ఫండ్స్, జీవిత బీమా ఆస్తులు సైతం స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితం అవుతుండడం, ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, 8వ వేతన కమిషన్‌ వంటివి అనుకూలిస్తున్నట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి రిటైర్మెంట్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.53.39 లక్షల కోట్లు, జీవిత బీమా నిర్వహణ ఆస్తులు రూ.67.79 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (రీట్‌లు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు) నిర్వహణ ఆస్తులు 2020 మార్చి నాటికి రూ.2.60 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.7.78 లక్షల కోట్లకు పెరిగినట్టు, ఇది ఏటా 25 శాతం వృద్ధికి సమానమని తెలిపింది.ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

Bharat Taxi positioned India first cooperative ride hailing platform4
‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

దేశీయ రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించుతూ డ్రైవర్లే యజమానులుగా సాగే ప్రక్రియకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘భారత్ టాక్సీ’ అనే సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల లాభార్జనే ధ్యేయంగా సాగే ప్రస్తుత వ్యవస్థకు భిన్నంగా ఇది డ్రైవర్ల సంక్షేమం, యాజమాన్య భాగస్వామ్యం ప్రాతిపదికన పనిచేయనుంది.డ్రైవర్ల చేతికే లాభాలుఢిల్లీ-ఎన్‌సీఆర్‌, గుజరాత్‌కు చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ ప్లాట్‌ఫామ్ లాభాల పంపిణీ విధానాన్ని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సంస్థ గడించే నికర లాభాల్లో 80 శాతం మొత్తాన్ని కిలోమీటర్ల ప్రయాణం ఆధారంగా నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని సహకార సంస్థ బలోపేతానికి, సాంకేతిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తారు. ‘ప్రస్తుత ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్లకు కనీస బేస్ రేటును కూడా ఖరారు చేయడం లేదు. కానీ భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్ల కనీస ఆదాయానికి భరోసా ఇస్తాం’ అని షా స్పష్టం చేశారు.రూ.500తో యజమానిగా.. ‘అమూల్’ తరహా మోడల్భారత్ టాక్సీ నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాత అమూల్ డెయిరీ కోఆపరేటివ్‌తో అమిత్ షా పోల్చారు. 36 లక్షల మంది మహిళలు కేవలం రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన అమూల్ నేడు రూ.1.25 లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. కేవలం రూ.500 చెల్లించి భారత్‌ ట్యాక్సీలో షేర్ కొనడం ద్వారా ప్రతి డ్రైవర్ ఈ సంస్థలో సహ యజమాని కావచ్చు. సభ్యుల సంఖ్య పెరిగిన తర్వాత డ్రైవర్లే డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం జరిగినా ప్రశ్నించే హక్కు డ్రైవర్ల ప్రతినిధులకు ఉంటుంది.15 కోట్ల మంది డ్రైవర్లే లక్ష్యంప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌, రాజ్‌కోట్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2 ఏళ్లలో 15 కోట్ల మంది డ్రైవర్లను చేర్చుకోవడమే స్వల్పకాలిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా అంటే 3 ఏళ్లలో దేశంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని చూస్తోంది.మార్కెట్ దిగ్గజాలకు పోటీప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి 25-30% వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా భారత్ టాక్సీ ప్రస్తుతం ఎటువంటి కమీషన్ వసూలు చేయడం లేదు. ఈ లాభాల భాగస్వామ్య వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి మూడు ఏళ్ల సమయం పడుతుందని అంతవరకు డ్రైవర్లు సహకరించాలని అమిత్ షా కోరారు.ఇదీ చదవండి: పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

gold and silver rates on 24 February 2026 in Telugu states5
పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 24 February 20266
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,512 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 706 పాయింట్లు దిగజారి 82,587 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.78బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 72.07 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.04 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 1.13 శాతం దిగజారింది.Today Nifty position 24-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement