Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Bengaluru Rains Trigger 1200 Auto Fare for 15 Km Outrage Floods Social Media1
వర్షం పడితే చాలు దోపిడీ

దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Coding Why Physics Could Be Key Skill for AI Generation NVIDIA CEO Jensen Huang2
కోడింగ్‌ ఒక్కటే సరిపోదు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్‌తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్‌) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.కోడింగ్ మాత్రమే సరిపోదుసాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్‌ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్‌ వరల్డ్‌ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్‌ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Gold and Silver Rates on 06 May 2026 in Telugu states3
ఒక్కసారిగా మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 06 May 20264
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 126 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 359 పాయింట్లు పుంజుకొని 77,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.31బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 108.01 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.81 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.03 శాతం పుంజుకుంది.Today Nifty position 06-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

From Ocean Depths To Tech Heights, Sundar Pichai Calm Leadership Secret Revealed5
ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రాంతం అది..

టెక్ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుసరించే ప్రశాంతమైన నాయకత్వ శైలి వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్‌ చేశారు. దశాబ్దాల క్రితం హవాయి తీరంలో జరిగిన ఒక స్కూబా డైవింగ్ అనుభవం నేడు ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆయనకు ఒక దిశానిర్దేశక సూత్రంగా నిలుస్తున్నట్లు చెప్పారు.అలల గందరగోళం... అడుగున నిశ్శబ్దంచాలా ఏళ్ల క్రితం హవాయి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో పిచాయ్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. సముద్రపు ఉపరితలంపై అలలు ఉధృతంగా ఉన్నాయి. నీటిలోకి దిగగానే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచన ఆయనకు కలిగిందట. అయితే, భయపడకుండా మరింత లోతుకు డైవ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సముద్ర ఉపరితలంపై ఉన్న గందరగోళం, అలల వేగం అంతా కొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి మాయమైపోయింది. అక్కడ అత్యంత ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణాన్ని అనుభవించాను. ఆ క్షణం ఇంకా నా మదిలో నిక్షిప్తమై ఉంది’ అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో స్పష్టతతరువాతి కాలంలో ఆల్ఫాబెట్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ తన నాయకత్వ శైలి గురించి వివరిస్తూ తరచుగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు. గూగుల్ వంటి అతిపెద్ద సంస్థను నడపడం అంటే.. నిరంతరం మారుతున్న నిబంధనలు, కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న పెను మార్పులు, ప్రపంచ ప్రభావం చూపే కీలక నిర్ణయాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ‘ఉపరితలంపై ఉండే గందరగోళానికి వెంటనే ప్రతిస్పందించడం కంటే, లోతుల్లోకి వెళ్లి స్పష్టతను వెతుక్కోవడం ముఖ్యం’ అని ఆయన విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన మార్గమని పిచాయ్ నిరూపించారు.సహకారంతో కూడిన నాయకత్వంసాంకేతిక రంగంలో చాలామంది దిగ్గజాలు దూకుడుగా, ఘర్షణాత్మక శైలిలో నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, పిచాయ్ శైలి పూర్తిగా భిన్నమైనది. ఆయన నిర్ణయాల్లో సహకారం, అంతర్గత సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి.ప్రతి సవాలుకు ఆవేశంగా స్పందించడం కంటే, సంక్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యతను కోల్పోకుండా ఉండటమే గొప్ప నాయకత్వ లక్షణమని పిచాయ్ భావిస్తారు.తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం ఆల్ఫాబెట్ వృద్ధికి దోహదపడింది.అనిశ్చితి నెలకొన్న సమయంలో నాయకుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మొత్తం సంస్థ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన నమ్ముతారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

RBI Tighten Inflation Target India GDP Growth Strong Poonam Gupta6
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు

దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్‌బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్‌ (డీజీ) పూనమ్‌ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్‌బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్‌ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్‌సీఏఈఆర్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్‌బీఐ డీజీగా జైన్‌ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపుఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా (డీజీ) రోహిత్‌ జైన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్‌టెక్‌ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్‌ స్థానంలో జైన్‌ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్‌ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్‌బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్‌), ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి ఎంకామ్‌ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్‌ డీజీ అయిన స్వామినాథన్‌ జానకీరామన్‌ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్‌ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement
Advertisement
Advertisement