ప్రధాన వార్తలు
పీఎఫ్ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కు వర్తించే వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటివరకు ఈపీఎఫ్ పరిధికి బయట ఉన్న లేదా పరిమిత ప్రయోజనాలకే పరిమితమైన లక్షలాది ఉద్యోగులకు అదనపు భద్రత లభించే అవకాశముంది.ఏమిటీ వేతన పరిమితి?ప్రస్తుతం, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం డీఏతో కలిపి రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఈపీఎఫ్ తప్పనిసరిగా వర్తిస్తోంది. ఆ పరిమితిని పెంచితే, మధ్యస్థ వేతనాలు (వేతన రూ.30 వేల వరకూ పెంచే అవకాశం) పొందే ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ కవరేజీలోకి వస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం, ఎంఎస్ఎంఈలు, సేవారంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ .15 వేల గరిష్ట వేతన పరిమితి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2014 సెప్టెంబర్లో దీన్ని నిర్ణయించారు. గత దశాబ్ద కాలంలో జీతాలు, జీవన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పీఎఫ్ పరిమితి మాత్రం మారకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.వేతన పరిమితి పెంచితే ప్రయోజనాలువేతనంతో పాటు సంస్థ వాటా కూడా ఈపీఎఫ్లో జమ కావడంతో దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది.పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత మెరుగవుతుంది.ఈపీఎస్ పరిధి విస్తరించడంతో పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.ఈపీఎఫ్కు చెల్లించే మొత్తాలపై పన్ను రాయితీలు ఉంటాయి.గృహ నిర్మాణం, వైద్యం, విద్య వంటి అవసరాలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది.యాజమాన్యాలపై ప్రభావంవేతన పరిమితి పెంపుతో యాజమాన్యాలపై చెల్లింపుల భారం కొంత పెరగవచ్చు. అయితే, ఉద్యోగుల నిలుపుదల (రిటెన్షన్) మెరుగవడం, సామాజిక భద్రతతో కూడిన స్థిరమైన వర్క్ఫోర్స్ ఏర్పడటం వంటి దీర్ఘకాలిక లాభాలు సంస్థలకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రతిపాదనపై కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే, దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
సగం ధరకే ఫ్లాట్!! ఇంత తక్కువకు ఇస్తున్నారంటే...
ప్రీలాంచ్.. మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. సాహితీ, జయత్రి, భువన్ తేజ, ఆర్జే, ఏవీ, జేవీ, క్రితిక, భారతీ, జీఎస్ఆర్, శివోం, ఓబిలీ ఇన్ఫ్రా.. ఇలా లెక్కలేనన్ని రియల్ ఎస్టేట్ చీటర్లు కస్టమర్లను నట్టేట ముంచేశారు. ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్, బైబ్యాక్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ), వన్టైం పేమెంట్ (ఓటీపీ).. పేరేదైనా కానివ్వండి వీటి అంతిమ ఎజెండా మాత్రం మోసమే. కళ్లబొళ్లి మాటలతో కొనుగోలుదారులను నట్టేట ముంచేయడమే వీటి లక్ష్యం.ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమీన్పూర్లోని సర్వే నంబర్–343లోని ఖాళీ స్థలం. కానీ, ఈ స్థలంలోనే 32 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నామని ఓ బిల్డర్ తెగ బిల్డప్ ఇచ్చాడు. స్థల యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకొని, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్లో విక్రయాలు మొదలుపెట్టాడు. చ.అ.కు రూ.2,500 చొప్పున సుమారు 2 వేల మంది కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశాడు. ఇప్పటికీ నాలుగేళ్లయినా ఇటుక కూడా పేర్చలేదు. లబోదిబోమంటూ కస్టమర్లు ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి ఠాణా మెట్లెక్కారు. పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. బెయిల్పై బయటకు వచ్చిన సదరు బిల్డర్ పరారీలో ఉన్నాడు. కష్టార్జితాన్ని పోగొట్టుకున్న కస్టమర్లు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై ఉన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇటీవల కాలంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాలు విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. గత 2–3 ఏళ్ల కాలంలో నగరంలో సుమారు రూ.25–30 వేల కోట్ల స్థిరాస్తి మోసాలు జరిగినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణ అనుమతులు, రెరా నమోదిత ప్రాజెక్ట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని, బిల్డర్ల ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నగరం నలువైపులా..చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ప్రీలాంచ్ విక్రయాలు చేస్తున్నాయి. కోకాపేట, ఖానామేట్, నానక్రాంగూడ, కొల్లూరు, పుప్పాలగూడ, నార్సింగి, ఫైనాన్షియల్ వంటి హాట్ ఫేవరేట్ ప్రాంతాలైన పశ్చిమ హైదరాబాద్లో ఎక్కువగా ప్రీలాంచ్ విక్రయాలు సాగుతున్నాయి. హైరైజ్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నామని నమ్మబలికి, కస్టమర్ల నుంచి ముందుగానే సొమ్మంతా వసూలు చేస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్ట్లన్నీ కేవలం బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్ట్ల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. కొన్ని కంపెనీలైతే ఏకంగా కస్టమర్ కేర్ సెంటర్లను తెరిచి మరీ దందా సాగిస్తున్నాయి.ఇంతకంటే తక్కువకు ఇస్తున్నాడంటే మోసమే..నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొలదీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్ + గ్రౌండ్ + ఐదంతస్తుల భవన నిర్మాణానికి చ.అ.కు రూ.3,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.4,500, 15–25 ఫ్లోర్ల వరకు రూ.5,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.6 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్ అయినా ఇంతకంటే తక్కువ ధరకు ఫ్లాట్ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని ఓ బిల్డర్ తెలిపారు.ప్రభుత్వానికీ నష్టమే..ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల విక్రయాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్(యూడీఎస్)ను కస్టమర్లకు రిజి్రస్టేషన్లు చేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజి్రస్టేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్లకు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు.కస్టమర్లకు సూచనలివీనిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్లలోనే కొనుగోలు చేయాలి.ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.పాత ప్రాజెక్ట్లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి.ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: ఆ సంవత్సరం.. రియల్ ఎస్టేట్కు బంగారం!ఇలా చేస్తే కట్టడి..జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ విభాగాల్లో అధికారుల కొరతను తీర్చాలి. నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించాలి.సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి.రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి.రెరా అధికారులు, సిబ్బంది తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఏ బిల్డర్లు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది.ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి.రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేసి ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇటీవల వెలుగు చూసిన ప్రీలాంచ్ మోసాల్లో కొన్ని: (రూ.కోట్లలో)
హోమ్ లోన్ ఏ వయసులో బెస్ట్?
ఈరోజుల్లో బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి. దీంతో పొదుపు చేసిన సొమ్ముతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్ లోన్ తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయో ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండటం బెటర్. రుణానికి అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే లేనిపోని చికాకులు, మానసిక ఒత్తిళ్లకు లోను కావాల్సి వస్తోందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పైసా పైసా కూడబెడుతుంటారు. ఖర్చులను ఆదుపులో పెట్టుకొని పొదుపుపై దృష్టి పెడుతుంటారు. అయితే మన సొంతింటి కలకు బ్యాంక్లు లోన్ రూపంలో సహకారం అందిస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 2.0 అమలులోకి వచ్చాక పన్ను విధానం సరళతరమైంది. స్టీల్, శానిటరీ ఉత్పత్తులు, రంగులు వంటి నిర్మాణ సామగ్రిపై పన్ను శ్లాబ్లు తగ్గాయి. ఇది గృహ కొనుగోలుదారులకు డిస్కౌంట్గానే కాకుండా దీర్ఘకాలంలో పొదుపుగా మారుతుంది. 30 ఏళ్ల వయసులో రుణం.. సాధారణంగా ఇంటి యాజమాన్యానికి దాదాపు 30 సరైన వయసు. ఈ వయస్సులో చాలా మంది తమ కెరీర్ మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబాలతో స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే అంటే 25–30 ఏళ్ల వయస్సులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జేబుకు అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వీలుంటుంది. కెరీర్ ప్రారంభంలోనే ఉండటంతో సిబిల్ స్కోర్కు కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ రుణం తీసుకునే వీలుతో పాటు కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడే బ్యాంక్ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. నలభైలో ఒత్తిళ్లు.. ఉద్యోగ విరమణ లేదా జీవితంలో చివరి దశలో 40– 50 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడమనేది కొంత సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది కాబట్టి జీవితంలోని ఈ దశలో నెలవారీ వాయిదా(ఈఎంఐ) భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే సొంతిల్లుని బ్యాంక్ జప్తు చేసుకుంటుంది. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. అద్దెకూ వయసుందీ.. ఇల్లు కొనడమనేది వ్యక్తి ఆర్థిక సంసిద్ధత, స్థిరత్వం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సొంతిల్లు ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపును, హోదాను తీసుకొస్తుంది. భవిష్యత్తుకు భద్రతా భావాన్ని అందిస్తుంది. అయితే ప్రాపరీ్టని కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయసు ప్రారంభంలో అద్దెకు తీసుకోవడం ఆచరణాత్మకమైంది. ఎందుకంటే యువ నిపుణులు స్థిరమైన ఆదాయం కోసం పలు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయతి్నస్తుంటారు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలను మారుతుంటారు. అందుకే ఆర్థికంగా సిద్ధంగా ఉన్నవారు ఈ దశలో ఇల్లు కొనడాన్ని ఎంచుకోవచ్చు.ఉమ్మడి రుణం.. తగ్గును భారం.. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది.
మళ్లీ పసిడి పిడుగు! భారీగా మారిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. కొనుగోలుదారుల పాలిట పిడుగులా మారుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా ఎగిశాయి. వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఆ సంవత్సరం.. రియల్ ఎస్టేట్కు బంగారం!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల వరద పారుతోంది. గతేడాది సిటీ స్థిరాస్తి రంగంలోకి రూ.3,892 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2024లో వచ్చిన రూ.2,704 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. 2025లో దేశంలోని 8 ప్రధాన మెట్రోల్లోకి 8,474.8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 5 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉందని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.– 2025 సంవత్సరం భారత స్థిరాస్తి రంగానికి బంగారంలాంటిది. గతేడాది దేశీయ రియల్ ఎస్టేట్లోకి 8.5 బిలియన్ డాలర్ల గరిష్ట పెట్టుబడులు వచ్చాయి. 2024తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, సుంకాల పెంపు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్లోకి ఈ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం గమనార్హం.విభాగాల వారీగా చూస్తే.. 2025లో అత్యధికంగా ఆఫీసు విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ సముదాయంలోకి 4,534.6 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఆ తర్వాత నివాస విభాగంలోకి 1,566.9 మిలియన్ డాలర్లు, మిశ్రమ వినియోగ విభాగంలోకి 819.3 మిలియన్ డాలర్లు, పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి 734.2 మిలియన్ డాలర్లు, రిటైల్లోకి 380 మిలియన్ డాలర్లు, డేటా సెంటర్లు, సీనియర్ లివింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ వంటి ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి 272.5 మిలియన్ డాలర్లు, హాస్పిటాలిటీ రంగంలోకి 167.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
Income Tax: కోటీశ్వరులు పెరిగారు..
మన దేశంలో ఆదాయ వివరాలను సమర్పిస్తున్న వ్యక్తుల సంఖ్య అతి స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో రూ. కోటికి మించి వార్షిక ఆదాయం ప్రకటించిన వారు మాత్రం గతం కంటే భారీగా ఉన్నారు. పన్ను ఎగవేతల కట్టడికితోడు భారీ నగదు, విదేశీ రెమిటెన్సులు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్ల వంటి అధిక విలువ కలిగిన లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ట్రాక్ చేయడంతో అధిక ఆదాయ వర్గాలు అన్ని వివరాలు వెల్లడించక తప్పడం లేదు. - సాక్షి, స్పెషల్ డెస్క్అధిక ఆదాయ వర్గాలు పెరగడం, లావాదేవీల వెల్లడి మరింత మెరుగవడం తాజా గణాంకాలను ప్రతిబింబిస్తోందని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృత వృద్ధికి ఈ ధోరణి కారణమని చెబుతున్నారు. వేతన వృద్ధి, బలమైన బోనస్, ఆరోగ్యకరమైన వ్యాపార లాభదాయకత కారణంగా గృహ ఆదాయాల్లో స్పష్టమైన మెరుగుదల నమోదవుతుందని పేర్కొంటున్నారు.ఆదాయ వివరాల వెల్లడిలో కఠిన నిబంధనలు, డేటా అనలిటిక్స్ విస్తృత వినియోగం, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్), మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్)/మూలం వద్ద పన్ను వసూళ్లు (టీసీఎస్) ట్రాకింగ్ కారణంగా పారదర్శకత పెరిగి పన్ను ఎగవేతలు గణనీయంగా తగ్గాయి. కొత్త సంపద ఆకస్మిక సృష్టి కంటే నిబంధనల అమలు మెరుగైన తీరుకు గణాంకాలు నిదర్శనమని ఇతర ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అతి తక్కువగా.. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్లో 9 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 8.92 కోట్లు. దాఖలైన మొత్తం రిటర్నులు ఏడాదిలో 1.22 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. అసెస్మెంట్ సంవత్సరం 2025–26కుగాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. రెండంకెల వృద్ధి.. 2024–25 ఏప్రిల్–డిసెంబర్తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్స రం ఇదే కాలంలో రూ.కోటికిపైగా ఆదాయాన్ని ప్రకటించిన వ్య క్తుల (అసెసీలు) సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కు చేరింది. అంటే 21.65% అధికం కావడం విశేషం. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న అసెసీలు 24.1% తగ్గడం గమనార్హం.ఇతర అన్ని ఆదాయ శ్రేణిలో.. అంటే రూ.5 లక్షలకుపైగా ఆదాయం కలిగిన అసెసీల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి, రూ.1–5 కోట్ల ఆదాయం చూపిన అసెసీలు 21% పెరిగారు. ఇక రూ.5–10 కోట్ల శ్రేణిలో ఏకంగా 29.7 %, రూ.10 కోట్లకుపైగా ఆదాయంతో రిటర్నులు సమర్పించినవారి సంఖ్య 28.3% దూసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆదాయం వెల్లడించాల్సిందే.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అత్యధికులు ఎంచుకుంటున్నారు. అంటే వార్షికాదాయం రూ.12 లక్షల వరకు పన్ను లేదు. అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకుల నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు ఎప్పటికప్పుడు చేరుతోంది. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు ఐటీ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అందుకే అధిక ఆదాయ శ్రేణిలో దాఖలైన రిటర్నుల సంఖ్య భారీగా పెరిగింది. - అరుణ్ రాజ్పుత్, ఫౌండర్, ఆంబర్ గ్రూప్
కార్పొరేట్
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
కొత్త ఏడాదిలో ఐటీ ఉద్యోగాలు ఇలా..
చిక్కుముడిలో రూ.1.52 లక్షల కోట్లు.. ప్రభుత్వం క్షమాభిక్ష?
అప్రెంటిస్షిప్ పట్ల మహిళల్లో ఆసక్తి
బయో ఏషియా 2026 సదస్సు: ఫిబ్రవరి 16 నుంచి..
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్ సెక్యూరిటీ’ అవసరం
కేంద్ర బడ్జెట్ 2026: బియ్యం ఎగుమతులను ప్రోత్సహించండి
75 శాతం సంపద సమాజానికే!.. కొడుకు మరణంతో తండ్రి నిర్ణయం
కొత్త ఆదాయపన్ను చట్టానికి సిద్ధం కండి
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ల...
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సె...
పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. గంటల వ్యవధిలో...
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
విదేశీ కాసుల గలగల.. పెరిగిన ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 26తో ముగిసిన వారంలో...
ఆర్ధిక వ్యవస్థలో భారత్.. జర్మనీని అధిగమించాలంటే?
2025 చివరి నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి.. ప్...
చెక్కుల తక్షణ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ...
న్యూజిలాండ్ ఎఫ్టీఏతో ఎగుమతులకు దన్ను
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026
రూ.150 కోట్లు జరిమానా కట్టండి: ట్రాయ్ పెనాల్టీ
అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్ గతేడాది 21 లక్షల స్పామ్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్లిస్టులో పెట్టింది.4–6 క్లిక్లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్ డీఎన్డీ యాప్ అందుబాటులో ఉంది. కాల్స్ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్ చేసేందుకు 1600 సిరీస్తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయకూడదు. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి.
రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వెల్లడించిన తరువాత.. నెల రోజుల ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు (గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించేది). ఈ ప్లాన్ ఆఫర్ కేవలం ఈ నెల 31వరకు (జనవరి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.BSNL introduces an upgraded ₹225 prepaid recharge plan offering 3GB data per day (earlier 2.5 gb data per day) without any increase in cost.Offer valid till 31 Jan 2026 Recharge smart via #BReX 👉 https://t.co/f8OlvSla9c#BSNL #FestiveOffer #SwadeshiNetwork #DigitalBharat pic.twitter.com/bkTwyNVqtW— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) January 5, 2026బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.
స్టార్లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన
అమెరికా, వెనెజులాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' కీలక ప్రకటన చేశారు. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వెనిజులా ప్రజలకు ఉచితంగానే అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'స్టార్లింక్ ఫిబ్రవరి 3 వరకు వెనెజులా ప్రజలకు ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తుంది, ఇది నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తుంది' అని స్టార్లింక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించగా.. మస్క్ 'వెనెజులా ప్రజలకు మద్దతుగా' అని పేర్కొన్నారు.In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP— Elon Musk (@elonmusk) January 4, 2026వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేయడంతో.. అమెరికా సైన్యం మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను ఎత్తుకొచ్చింది. ఈ పరిణామం తరువాత మస్క్ ఫ్రీ స్టార్లింక్ సర్వీస్ అందిస్తున్నట్లు చేసిన చర్చనీయాంశంగా మారింది.వెనెజులా దేశంలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు మస్క్ స్టార్లింక్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్లింక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!
పర్సనల్ ఫైనాన్స్
అవీవా లైఫ్ నుంచి కొత్త టర్మ్ ప్లాన్
అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్ వైటల్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్ అష్యూర్డ్ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్ ఆధారంగా నిర్ణయిస్తారు.పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్ యాప్లో ‘సేఫ్టీ సెంటర్’
డిజిటల్ మోసాల బారిన పడకుండా కస్టమర్లు తమ ఖాతాలను స్వయంగా నియంత్రించుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్ ‘ఓపెన్’లో ‘సేఫ్టీ సెంటర్’ ఫీచరును ప్రవేశపెట్టింది. సందేహాస్పద సందర్భాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్కి యాక్సెస్ని డిసేబుల్ చేసేందుకు, ఫండ్ ట్రాన్స్ఫర్లను బ్లాక్ చేసేందుకు, యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు, పరిమితులను సెట్ చేసేందుకు, కొత్త పేయీలను జోడించకుండా నివారించేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.దీనితో కస్టమర్ కేర్ సెంటర్ లేదా బ్రాంచీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖాతాను స్వయంగా నియంత్రించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు మెసేజీల ప్రామాణికతను ధృవీకరించేలా ఎస్ఎంఎస్ షీల్డ్ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కళలు, సాహిత్యానికి సంబంధించిన ష్ల్పాష్ 2025 పోటీలను నిర్వహించినట్లు వివరించింది.ఇందులో దేశవ్యాప్తంగా 995 పాఠశాలల నుంచి 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బ్యాంకు పేర్కొంది. దక్షిణాదిలో హైదరాబాద్, వైజాగ్ సహా 308 స్కూళ్ల నుంచి 1.01 లక్షల మంది పాల్గొన్నట్లు వివరించింది. ఇందులో ఆరుగురు విజేతలకు రూ. 1 లక్ష చొప్పున, ఆరుగురు రన్నర్స్ అప్లకు తలో రూ. 50,000 చొప్పున బహుమతి ఉంటుంది.
బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్డీఏఐ
బీమా రంగంలో ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడం (అనైతిక మార్గాల్లో) ఆందోళన కలిగిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్ఈఏఐ) వార్షిక నివేదిక పేర్కొంది. అసలు దీనికి గల కారణాలను గుర్తించేందుకు బీమా సంస్థలు లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది.2023–24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,20,726 ఫిర్యాదులు రాగా, 2024–25లోనూ ఇదే స్థాయిలో 1,20,429 ఫిర్యాదులు దాఖలైనట్టు తెలిపింది. అనైతిక వ్యాపార విధానాలపై మాత్రం ఫిర్యాదులు 23,335 నుంచి 26,667కు పెరిగినట్టు వెల్లడించింది. మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33 శాతం నుంచి 22.14 శాతానికి పెరిగినట్టు పేర్కొంది.వ్యక్తుల అవసరాలకు సరిపడని, నియమ, నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా తెలియజేయకుండా, కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ పాలసీలను విక్రయించడాన్ని మిస్ సెల్లింగ్గా చెబుతుంటారు. బ్యాంక్లు, బీమా ఏజెంట్ల రూపంలో ఈ తరహా విక్రయాలు సాగుతుంటాయి. ‘‘మిస్ సెల్లింగ్ను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. ఉత్పత్తి అనుకూలతను అంచనా వేయడం (పాలసీదారునకు అనుకూలమైనా), పంపిణీ ఛానల్ వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్ సెల్లింగ్పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడం, మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించడమైంది’’అని ఐఆర్డీఏఐ తన 2024–25 నివేదికలో వివరించింది.తప్పుడు మార్గాల్లో బీమా ఉత్పత్తుల విక్రయంపై కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంక్లు, బీమా సంస్థలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండడం గమనార్హం. అనుకూలం కాని పాలసీలను విక్రయించడం పాలసీదారులు తర్వాత రెన్యువల్ చేసుకోరని, దాంతో పాలసీల రద్దునకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బీమా విస్తరణ 3.7 శాతందేశంలో బీమా విస్తరణ 2024–25 సంవత్సరానికి జీడీపీలో 3.7 శాతంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3 శాతం కంటే సగమే. జీవిత బీమా రంగంలో విస్తరణ రేటు 2023–24లో ఉన్న 2.8 శాతం నుంచి 2024–25లో 2.7 శాతానికి తగ్గినట్టు తెలిపింది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణ రేటు మాత్రం యథాతథంగా ఒక శాతం వద్దే ఉంది.ఇదీ చదవండి: బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
పెరిగిన ఆధార్ కార్డు ఛార్జీలు
ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్లెస్ ఆధార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.ధర పెరుగుదలకు కారణంపీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ఉపయోగించాలి.➤యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.You can easily check the delivery status online.To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026


