Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Elon Musk Tweet After 849 Billion Dollars Net Worth1
నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.Already have thousands of times over. My “net worth” is almost entirely due to my ownership stakes in Tesla and SpaceX. I have <0.1% that is cash. Tesla and SpaceX employees all receive stock/options and Tesla is >80% owned by retail investors and index/pension funds, so value…— Elon Musk (@elonmusk) February 15, 2026

Coding Will No Longer Be Tech Professionals Primary Job Says Infosys Nandan Nilekani2
'టెకీల ప్రైమరీ జాబ్ కోడింగ్ కాదు': నందన్ నీలేకని

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్‌కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.

Maruti Suzuki e Vitara Launched in India3
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే?

చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు. trends.embed.renderExploreWidget("TIMESERIES", {"comparisonItem":[{"keyword":"e Vitara","geo":"IN","time":"now 1-d"}],"category":0,"property":""}, {"exploreQuery":"date=now%201-d&geo=IN&q=e%20Vitara&hl=en-US&legacy","guestPath":"https://trends.google.com:443/trends/embed/"}); మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

Jio Aarogya AI Enables Health Screening in Minutes AI Clinic Model Unveiled4
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో.. జియో పెవిలియన్‌ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki About Stock Market Crash5
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్‌లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?

CCI Fined Rs 27 Crore To Intel6
ఇంటెల్‌కు రూ.27 కోట్ల జరిమానా!

పోటీని దెబ్బతీసే విధానాలను పాటించినందుకు ఇంటెల్‌ కార్పొరేషన్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) రూ. 27.38 కోట్ల జరిమానా విధించింది. డెస్క్‌టాప్‌లో ఉపయోగించే బాక్స్‌డ్‌ మైక్రోప్రాసెసర్లకు (బీఎంపీ) సంబంధించి భారత్‌కి మాత్రమే పరిమితమయ్యే వారంటీ పాలసీని వర్తింప చేయడం ద్వారా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని సీసీఐ పేర్కొంది.చైనా, ఆస్ట్రేలియా, ఇతరత్రా ప్రపంచదేశాల్లో కంపెనీల పాటించే వారంటీ పాలసీలతో పోల్చినప్పుడు భారత్‌లో అమలు చేస్తున్న విధానం వివక్షపూరితమైనదని తెలిపింది. భారత్‌లోని అధీకృత పంపిణీదారు నుంచి కొనుగోలు చేస్తేనే బీఎంపీలకు వారంటీ చెల్లుబాటయ్యేలా, మిగతా ఎక్కడా లేని విధంగా ఇండియాకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పాలసీని ఇంటెల్‌ అమలు చేయడం సరికాదంటూ మ్యాట్రిక్స్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ చేసిన ఫిర్యాదుపై సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది.

Advertisement
Advertisement
Advertisement