ప్రధాన వార్తలు
ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్!
మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ SUV శ్రేణి మొత్తం అమ్మకాలు 50,000 యూనిట్లను అధిగమించాయి.మార్చి 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6లతో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ శ్రేణి అధిక ప్రజాదరణ పొందగలిగింది. INGLO స్కేట్బోర్డ్ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ మోడళ్లు.. ఎలక్ట్రిక్ SUV రంగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి.మహీంద్రా కంపెనీ మొదటి ఏడు నెలల్లో 30,000 యూనిట్లు, 10 నెలల కాలానికి 41000 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇప్పుడు తాజాగా 50000 యూనిట్ల మార్క్ చేరుకుంది. కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. కాగా ఈ మోడల్స్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప అమ్మకాలను పొందగలవని సమాచారం.
చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కంపెనీలలో ఒకటి అయిన గూగుల్, దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2026 జూన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించింది.సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేసి 1995లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అంటే 31ఏళ్ల తరువాత సుందర్ తాను చదివిన కాలేజీకి ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.సుందర్ పిచాయ్ భారతదేశంలో జన్మించారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదివి ఇన్స్టిట్యూట్ సిల్వర్ మెడల్ పొందారు. తరువాత వార్టన్ స్కూల్ నుండి MBA పూర్తి చేసి.. సీబెల్, పాల్మర్ స్కాలర్ అవార్డులు పొందారు.చదువు పూర్తయిన తరువాత గూగుల్ కంపెనీలో చేరి, గూగుల్ టూల్బార్, గూగుల్ క్రోమ్ వంటి ప్రధాన ప్రాజెక్టులలో పనిచేశారు. ఆ తరువాత ఇది క్రోమ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్ అయింది. 2019లో గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ సీఈఓగా నియమితులు అయ్యారు.
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?
కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.2 months in Bangalore and I miss Mumbai. I miss the people.Every small interaction here feels like a negotiation. Auto drivers, packers, old tenants. Everyone’s trying to squeeze something out of you.In Mumbai a cab driver sees it’s hot and just turns on the AC. Here you have…— poobesh (@pbshgthm) April 3, 2026ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు.
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?
వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ
నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ప్రతిఒక్కరూ ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్లగానే వినియోగదారులకు తలెత్తే ప్రధాన ప్రశ్న.. 'ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? లేక నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా..?' అని. తక్కువ ధరలో వస్తుందని కొందరు, విద్యుత్ ఆదా అవుతుందని మరికొందరు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలు, లాభనష్టాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇన్వర్టర్ ఏసీఇన్వర్టర్ ఏసీ అనేది అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఇందులోని కంప్రెసర్ తన వేగాన్ని వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచు తుంది.నాన్-ఇన్వర్టర్ ఏసీనాన్-ఇన్వర్టర్ ఏసీ అనేది పాత పద్ధతిలో పనిచేస్తుంది. కంప్రెసర్ అయితే పూర్తిగా ఆన్లో ఉంటుంది లేదా పూర్తిగా ఆఫ్లో ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోవడం, మళ్లీ వేడి పెరగగానే వెంటనే స్టార్ట్ కావడం దీని ప్రత్యేకత. ఏసీ అనగానే సామాన్యుడికి గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కానక్కర్లేదు కాబట్టి విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది జేబుకు ఉపశమనాన్ని ఇస్తుంది.అదే నాన్-ఇన్వర్టర్ ఏసీ విషయానికొస్తే.. కంప్రెసర్ ప్రతిసారీ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ కావాల్సి రావడంతో కరెంట్ బిల్లు భారమయ్యే అవకాశం ఉంది. గదిలో ఒకే రకమైన చల్లదనం ఉండాలని కోరుకునే వారికి ఇన్వర్టర్ ఏసీ సరైన ఎంపిక. ఇది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆగిపోయిన ప్రతిసారీ గదిలో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం, మళ్లీ తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.జీవితకాలం పరంగా రెండూ మెరుగైనవే అయినప్పటికీ, నిర్వహణలో తేడాలున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ.. విషయంలో పీసీబీ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. ఒకవేళ ఇవి పాడైతే మరమ్మతు ఖర్చు కాస్త ఎక్కువేగానే ఉంటుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ.. దీని టెక్నాలజీ చాలా సరళంగా ఉంటుంది. విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి. మెకానిక్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడాల్సి వస్తే.. కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ వైపు వెళ్లడమే తెలివైన పని అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం, అప్పుడప్పుడు మాత్రమే వాడే వారైతే నాన్-ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. - పసుపులేటి. వెంకటేశ్వరరావు.
మొన్న పెట్రోల్.. నేడు సీఎన్జీ: పెరిగిన ధరలు!
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఏర్పడింది.ఇలాంటి సమయంలో మన దేశంలోని టొరెంట్ గ్యాస్ సంస్థ జైపూర్లో కేజీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను రూ.2.50 పెంచింది. దీంతో వినియోగదారులపై పెరుగుతున్న వ్యయ భారం మరింత పెరిగింది. ఇంధన ధరలలో విస్తృతమైన పెరుగుదల సవరణల మధ్య ఈ పెంపు చోటుచేసుకుంది, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ఎల్పిజి సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి.ఎల్పీజీ ధరలుసీఎన్జీ ధరల పెంపుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రధాన నగరాల వ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కి చేరింది. 5 కేజీల చిన్న సిలిండర్ల ధరలు కూడా రూ.51 మేర పెరిగింది. కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు ఏకంగా రూ.218 మేర పెరిగాయి.ధరలు పెరుగుదలకు కారణం!మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ పోకడల ఆధారంగా వాణిజ్య ఎల్పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. తాజా ధరల పెంపునకు కారణం.. సౌదీ కాంట్రాక్ట్ ధరలో 44% భారీ పెరుగుదలే అని తెలుస్తోంది. ఈ ధర మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్ల నుంచి ఏప్రిల్లో మెట్రిక్ టన్నుకు 780 డాలర్లకు పెరిగింది. ఎల్పీజీ సరఫరా తగ్గిపోవడం కూడా సిలిండర్ ధరలు పెరగడానికి కారణం అవుతోంది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!
కార్పొరేట్
చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా?
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?
ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ
ఇండక్షన్ హీటర్లపై కేంద్రం ఫోకస్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అసలేం జరుగుతోంది?
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
వేకువజామునే ఈమెయిల్స్.. ఎందుకంటే..
విదేశీ చేతుల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
వైద్యరంగానికి ‘సహకారి’ కరవు
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
ఆఫీస్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ తమ్ముడు
సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ...
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరలు దిగివచ్చాయి. కొనుగోలుదారులకు ఊర...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!
చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98....
పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ ...
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భ...
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొత్త సాంకేతికతలతో దూసుకుపోతున్న ఆంత్రోపిక్ వరుస భద్రతా లోపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారం వ్యవధిలోనే రెండోసారి అంతర్గత కోడింగ్ సమాచారం లీక్ అవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. తాజాగా కంపెనీకి చెందిన అత్యంత కీలకమైన కోడింగ్ సాధనం ‘క్లాడ్ కోడ్’కు సంబంధించిన సోర్స్ కోడ్ లీక్ అయినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.ఏం జరిగింది?ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ తాజా సంఘటనలో క్లాడ్ కోడ్కు అనుసంధానించిన దాదాపు 1,900 ఫైళ్లలో 5,00,000 లైన్ల కోడ్ లీక్ అయింది. సాఫ్ట్వేర్ ప్యాకేజింగ్, డెప్లాయిమెంట్ సమయంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల ఈ డేటా బయటకు వచ్చింది. గత వారమే కంపెనీకి చెందిన ‘మైథోస్’ అనే రహస్య ఏఐ మోడల్ వివరాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడింగ్ టూల్ సోర్స్ కోడ్ బయటకు రావడం కంపెనీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. అయితే, ఈ లీక్ వల్ల కస్టమర్ డేటా లేదా గోప్యమైన క్రెడెన్షియల్స్ ఏవీ బహిర్గతం కాలేదని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.లీక్ అయిన కోడ్ ప్రాముఖ్యతలీకైన ఫైళ్లలో ‘ఏజెంటిక్ హార్నెస్’ అని పిలవబడే కీలకమైన సాఫ్ట్వేర్ లేయర్ భాగాలు ఉన్నాయి. ఇది ఏఐ మోడల్ ఇతర సిస్టమ్లతో, టూల్స్తో ఎలా అనుసంధానం చెందాలో, భద్రతా విధానాలను ఎలా అమలు చేయాలో నియంత్రిస్తుంది. ఎంటర్ప్రైజ్ క్లయింట్లు ఉపయోగించే ఈ టూల్ అంతర్గత నిర్మాణం బయటపడటం ఆందోళన కలిగించే అంశం.లోపం ఎక్కడ జరిగింది?ఈ ఘటన వెనుక ఎటువంటి సైబర్ దాడి లేదని, ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమేనని ఆంత్రోపిక్ పేర్కొంది. డెవలపర్ ప్లాట్ఫారమ్కు ‘కంపైల్డ్ వెర్షన్’ అప్లోడ్ చేయాల్సి ఉండగా పొరపాటున ఫుల్ సోర్స్ ప్యాకేజీని అప్లోడ్ చేయడం వల్ల ఇలా జరిగిందని తెలిపింది. దీనివల్ల సాధారణంగా కంపెనీ పరిధిలోనే ఉండాల్సిన అంతర్గత కోడ్, పబ్లిక్ యాక్సెస్లోకి వెళ్లిపోయింది.భద్రత సవాళ్లుకోర్ ఏఐ మోడల్ లీక్ కానప్పటికీ దాని పరిధిలోని సిస్టమ్ డిజైన్ బయటపడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు ఈ కోడ్ను అధ్యయనం చేయడం ద్వారా ఆంత్రోపిక్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏపీఐ డెవలప్మెంట్ తీరు తెలిస్తే హ్యాకర్లు లేదా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆ రక్షణ లేయర్లను సులువుగా దాటవచ్చు.‘ఏఐ సిస్టమ్స్ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో వాటి భద్రతపై కఠినమైన నిఘా అవసరమని ఈ ఘటన గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా’ అని ఆంత్రోపిక్ ప్రతినిధి తెలిపారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్ హిట్ ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్.ప్లాన్ వివరాలుజియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.డేటా ధమాకాఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!
ఆఫ్రికాలోని గ్రీకు ద్వీపమైన క్రీట్లో బుధవారం ప్రకృతి ఒక వింత దృశ్యాన్ని ఆవిష్కరించింది. తెల్లవారుజాము ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది. చూస్తుంటే భూమి మీద ఉన్నామా లేక ఇతర గ్రహంపై ఉన్నామా అన్నంతగాలా వాతావరణం మారిపోవడంతో స్థానిక నివాసితులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.ఏమిటీ వింత? ఎందుకు ఇలా జరిగింది?శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఇది ఎటువంటి అతీత శక్తి వల్ల కలిగింది కాదు. కేవలం వాతావరణ మార్పుల వల్ల సంభవించిన సహజ పరిణామం. దీనికి ప్రధాన కారణం సహారా ఎడారి నుంచి వీచిన భారీ ధూళి తుఫాను. ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు, టన్నుల కొద్దీ సన్నని ఇసుక, ధూళి కణాలను మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశగా మోసుకొచ్చాయి. ఈ ధూళి మేఘాల మార్గంలో దక్షిణ ఏజియన్ సముద్ర తీరంలో క్రీట్ ద్వీపం ఉండటంతో ఇక్కడ ప్రభావం అత్యధికంగా కనిపించింది.ఆకాశం ఎరుపు రంగులోకి ఎందుకు మారుతుంది?‘వాతావరణంలో ధూళి కణాలు దట్టంగా ఉన్నప్పుడు అవి సూర్యరశ్మిని విడగొడుతాయి(స్కాట్టరింగ్). తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కణాలు చెల్లాచెదురైపోగా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి చేరుతాయి. దీనినే ‘రెడ్ స్కై ఫినామినా’ అంటారు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.పర్యావరణానికి వరప్రసాదం.. కానీ..ఈ ధూళి తుఫాను చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల పర్యావరణానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి ధూళిలో ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నేలపై చేరినప్పుడు మట్టిని, సముద్రంలో పడినప్పుడు సముద్రపు నాచును సారవంతం చేస్తాయి. అయితే, గాలి నాణ్యత (ఏక్యూఐ) భారీగా పడిపోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ఏఐ అప్స్కిల్లింగ్పై ఫోకస్
ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత సుస్థిరం చేసుకునే దిశగా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 50,000 మంది నిపుణులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల కల్పనతోపాటు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతలో ఉద్యోగులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గిస్తున్న తరుణంలో డెలాయిట్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెక్ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.నైపుణ్యాల పెంపే లక్ష్యం!ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డెలాయిట్ దక్షిణాసియా సీఓఓ నితిన్ కిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ హెడ్కౌంట్ను తగ్గించడంపై కాకుండా, సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ‘ఏఐ సాధనాల ద్వారా అత్యంత క్లిష్టమైన, అధిక విలువ కలిగిన పనులను నిర్వహించడానికి మా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నాం. కేవలం పని వేగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులు అధునాతన బాధ్యతలు చేపట్టేలా అప్స్కిల్లింగ్పై దృష్టి సారించాం’ అని తెలిపారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 30,000 మందికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ పూర్తి చేశారు. సంస్థ తన మొత్తం ఆదాయంలో 9% సామర్థ్యం పెంపు, శిక్షణ, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం కేటాయిస్తోంది. డెలాయిట్ అంతర్జాతీయ శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు భారత్లోనే ఉండటం విశేషం.భారతీయ సంస్థల్లో సవాళ్లుఏఐ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ భారతీయ సంస్థల్లో (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద కార్పొరేట్ గ్రూపుల్లో) కొన్ని ప్రాథమిక ఆందోళనలు ఉన్నాయని డెలాయిట్ గుర్తించింది. సున్నితమైన సమాచారం నియంత్రిత వాతావరణంలో భద్రంగా ఉంటుందా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఏఐ మోడళ్ల ధరల నిర్ణయం ఎక్కువగా వినియోగం ఆధారంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్పై భారం పడవచ్చని కంపెనీలు భయపడుతున్నాయి.భద్రత ముఖ్యంఆవిష్కరణలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని నితిన్ కిని నొక్కి చెప్పారు. ‘భారతదేశం ఏఐ అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే బలమైన భద్రతా వ్యవస్థలను నిర్మించడం అనివార్యం’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించే క్రమంలో డెలాయిట్ భారత్లో క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించనుంది. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలకు భారతదేశాన్ని గ్లోబల్ సెంటర్గా మార్చాలని సంస్థ భావిస్తోంది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
పర్సనల్ ఫైనాన్స్
రికార్డ్: ఒక్క నెలలో రూ. 29.53 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్బై ఎండీ ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.
హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?
వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి రెస్టారెంట్కు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. భోజనం ముగించి బిల్లు చేతికి రాగానే అన్నీ సరి చూసుకుంటాం. కానీ అందులో ‘సర్వీస్ ఛార్జీ’ పేరుతో అదనంగా 5 నుంచి 10 శాతం వరకు బిల్లులో వసూలు చేస్తుండడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి అని హోటల్ సిబ్బంది వాదించవచ్చు, లేదా మీ అనుమతి అడగకుండానే బిల్లులో వేసేయవచ్చు. అసలు ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? వంటి అంశాలను చూద్దాం.సర్వీస్ ఛార్జీ ‘ట్యాక్స్’ కాదు!చాలామంది వినియోగదారులు సర్వీస్ టాక్స్ (సేవా పన్ను)కు, ‘సర్వీస్ ఛార్జీ’కి మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతుంటారు. జీఎస్టీ అనేది ప్రభుత్వం విధించే చట్టబద్ధమైన పన్ను. ఇది ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలి. సర్వీస్ ఛార్జీ అనేది రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బంది సేవలకు గుర్తింపుగా (టిప్కు బదులుగా) విధించే రుసుము. ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా ఆప్షనల్. కస్టమర్ అనుమతి లేకుండా దీన్ని బిల్లులో చేర్చడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది.రెస్టారెంట్లు ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?కొన్ని రెస్టారెంట్లు తమ మెనూ కార్డులో ‘మేము సర్వీస్ ఛార్జీ విధిస్తాం’ అని రాసి ఉండవచ్చు. అయితే, కేవలం మెనూ కార్డులో రాసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదని కస్టమర్ను వేధించడం, సర్వీస్ నిరాకరించడం లేదా రెస్టారెంట్లోకి రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. వారి సర్వీసు నచ్చకపోతే లేదా మీకు ఇష్టం లేకపోతే సదరు ఛార్జీని తొలగించమని అడిగే పూర్తి హక్కు కస్టమర్లకు ఉంది.సాధారణంగా వినియోగదారులు ఏం చేస్తారు?రద్దీగా ఉన్న సమయంలో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా చెల్లిస్తుంటారు. కొందరు ఇది ప్రభుత్వ పన్నుగా భావిస్తారు. ఛార్జీని తొలగించమని అడిగితే తక్కువగా చూస్తారేమోనన్న ఇంకొందరు సంకోచిస్తారు. బిల్లులో చివరలో దీన్ని కలపడం వల్ల అది మొత్తంలో భాగమని చెల్లిస్తుంటారు.అసలు ఏం చేయాలి?బిల్లు జనరేట్ కాకముందే సర్వీస్ ఛార్జీని మినహాయించి బిల్లు ఇవ్వమని కోరండి. సిబ్బందితో వాదించకుండా ఇది చెల్లించడం ఆప్షనల్ అని ప్రశాంతంగా హోటల్ యాజమాన్యానికి వివరించండి. ఒకవేళ హోటల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించి బలవంతంగా వసూలు చేస్తే ఆ బిల్లును సాక్ష్యంగా ఉంచుకుని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్(1915)కు ఫిర్యాదు చేయవచ్చు.ఎలాంటి సమయాల్లో చెల్లించవచ్చు?మీకు అందించిన సర్వీసులు అద్భుతంగా ఉందని మీరు భావిస్తే ఆ సిబ్బందిని ప్రోత్సహించడానికి సర్వీస్ ఛార్జీ రూపంలో లేదా నేరుగా టిప్ రూపంలో నగదును స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఏటీఎం రూల్స్.. ఇక మారిపోయాయ్..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇక తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!


