Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Latest Gold and Silver Price in India1
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..

శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలువెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

Meaning Of Car Back Side Engine Capacity Decoded2
కారు వెనుక నెంబర్స్.. మీనింగ్ ఏంటో తెలుసా?

సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలుకారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్‌ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్‌ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్‌ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

Gold Silver May Hike Amid US Iran Tensions And Fed Rate Cut Uncertainty3
బంగారం రూ.2 లక్షలకు?

ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్‌లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.ప్రస్తుతం తగ్గిన ధరలు!2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది.

After 11000 Layoffs Accenture Says Use AI At Work For Promotion4
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్‌లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

Stock Market Closing Update 20th February 20265
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Releaf Wellness announced first small molecule herbal pharma brand6
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు

ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్‌గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్‌లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.పరిశోధనలే పునాదిగా..రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్‌తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్‌ చాయిస్‌’ అన్నారు.ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్‌లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement