Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Berkshire Hathaway New CEO Greg Abel Salary More Than Warren Buffett1
బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?

ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.

Mukesh Ambani Speech in Vibrant Gujarat Regional Conference2
రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు: అంబానీ కీలక ప్రకటన

2026 జనవరి 11న రాజ్‌కోట్‌లో నిర్వహించిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌'లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో.. రిలయన్స్ గుజరాత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో గుజరాత్‌లో సంస్థ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మరో ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ పాలనపై, నాయకత్వంపై, అభివృద్ధి సామర్థ్యంపై రిలయన్స్‌కు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఈ భారీ పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా.. గుజరాత్ ప్రజలు & భారతీయుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ వివరించారు. పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ & గ్రీన్ మెటీరియల్స్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడం రిలయన్స్ అన్నారు.Address by RIL CMD Shri Mukesh D. Ambani at the Vibrant Gujarat Regional Conferences - Kutch & Saurashtra Region pic.twitter.com/21DsQ6Ueuy— Reliance Industries Limited (@RIL_Updates) January 11, 2026

Do You Know About Pre Approved Personal Loan Know The Details Here3
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?

ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.

Toyota Fortuner SUV Range Becomes Costlier4
నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!

భారతదేశంలో టయోటా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. దీంతో.. అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద SUVలలో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్ రేటు గరిష్టంగా రూ. 74వేలు వరకు పెరిగింది.ధరల పెరుగుదల.. వేరియంట్లను బట్టి రూ. 51వేలు నుంచి రూ. 74వేలు మధ్య ఉంది. కాగా కంపెనీ లిమిటెడ్-రన్, డీలర్-లెవల్ లీడర్ వేరియంట్‌లను నిలిపివేసింది. ఫార్చ్యూనర్ & లెజెండర్ వరుసగా ₹ 74,000 మరియు ₹ 71,000 వరకు ధర పెరిగాయి. ఎంట్రీ-లెవల్ మాన్యువల్ వేరియంట్‌ ధర రూ. 51వేలు పెరిగింది. దీంతో ఈ SUV ధర ఇప్పుడు రూ. 33.65 లక్షల నుంచి రూ. 34.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.ఇన్నోవా క్రిస్టా ధరలుభారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్‌ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.

Will Gold Touch Rs 2 Lakh And Silver Rs 3 Lakh Know The Reasons5
2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!

బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.బంగారం రేటు పెరగడానికి కారణాలు!భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

Best 5G Phones Under Rs 15000 In January 20266
రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.పోకో ఎం7 ప్రో 5జీరూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్‌నెస్ & డాల్బీ విజన్‌తో 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.ఒప్పో కే13ఎక్స్ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.రెడ్‌మీ 15సీ12,999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.వివో T4 లైట్ 5జీవివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.మోటరోలా జీ57 పవర్ 5జీమోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను ప్రదర్శిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!

Advertisement
Advertisement
Advertisement