Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Iran-Israel War Sparks LPG Crisis Indian Railways Kitchens Face Disruption1
గ్యాస్ సిలిండర్లకు ఐఆర్‌సీటీసీ స్వస్తి?

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.ఐఆర్‌సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.సంక్షోభానికి కారణాలుభారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్‌లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందుచూపుతో..రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్‌పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్‌సీటీసీ భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

West Asia Tensions Disrupt LPG Supply Hyderabad IT Corridor Hostels Issue2
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Raghav Chadha Questions Nationwide Debate on Taxes Food Prices Accountability3
రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న పన్నులు, విమానాశ్రయాల్లో ఆహార ధరలు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేస్తున్నాం.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా తనకున్న ఆర్థిక అవగాహనతో బడ్జెట్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారికంగా కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు.పన్నుల భారంతో మధ్యతరగతి విలవిలబడ్జెట్ 2026-27పై జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం (సుమారు 6.8%) కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్నును ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్పందన: ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశ మౌలిక సదుపాయాల కల్పన (క్యాపెక్స్‌) కోసం నిధుల సేకరణ అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నామని పేర్కొంది. అయితే నేరుగా ఆదాయపు పన్ను తగ్గింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు.రైట్ టు రీకాల్.. ఓటర్లకే ఆ అధికారం ఇవ్వాలి!ఇటీవల రాఘవ్‌ చద్దా రాజ్యసభలో లేవనెత్తిన ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికైన ప్రతినిధులు పనితీరు నచ్చకపోతే అధికారం తొలగించే హక్కు) అంశం సభ్యుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఎన్నికైన ప్రతినిధుల ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా, పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులను ఓటర్లే తొలగించేలా చట్టం తీసుకురావాలి’ అని చద్దా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ఈ విధానం ఉందని గుర్తుచేశారు.ప్రభుత్వ స్పందన: ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విధివిధానాల ప్రకారం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉందని తెలిపింది. ఇటువంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.విమానాశ్రయాల్లో ఆహార ధరలు..విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో తెలిపారు. సాధారణంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20 ఉంటే.. ఎయిర్‌పోర్ట్‌ల్లో మాత్రం ఇది సుమారు రూ.100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్‌పోర్ట్‌ల్లో అధిక ధరలుంటాయి. ఈ నేపథ్యంలో ‘విమానాశ్రయాల్లో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో స్నాక్స్, పానీయాలు లభించే ఉడాన్ యాత్రి కేఫ్‌ల సంఖ్యను పెంచాలి. వాటిని సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలి’ అని కోరారు.ప్రభుత్వ స్పందన: పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయాల్లో సరసమైన ధరలకు ఆహారం అందించే అవుట్‌లెట్లను పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపింది.సిమ్ కార్డులు - ఇన్‌కమింగ్ కాల్స్‌..రాఘవ్ చద్దా రాజ్యసభలో టెలికాం కంపెనీల దోపిడీని ఎండగట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్‌గోయింగ్ మాత్రమే కాకుండా, ఇన్‌కమింగ్ కాల్స్ కూడా నిలిపివేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వద్ద రీఛార్జ్ చేసుకునే డబ్బు లేకపోయినా తమకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందుకోలేకపోతున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు.బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాలు.. ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్‌కే లింక్ అయి ఉన్న తరుణంలో ఇన్‌కమింగ్ ఆపేయడం వల్ల సామాన్యులు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం, ట్రాయ్ స్పందన: డేటా (ఇంటర్నెట్) అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. గతంలో ఉన్న 90 రోజుల పరిమితిని సడలించి వినియోగదారులు ఏకకాలంలో 365 రోజుల (ఒక ఏడాది) వరకు వాలిడిటీని పొందేలా స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం నుంచి కాకుండా సామాన్యుడి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల చుట్టూ ఉండడం విశేషం. ముఖ్యంగా పన్నుల సంస్కరణలు, వర్కర్ల రక్షణపై ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వక సమాధానాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..

Gold and Silver rates on 11 March 2026 in Telugu states4
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

stock market updates on 11 March 20265
స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.82బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 87.65 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.21 శాతం పడిపోయింది.నాస్‌డాక్‌ 0.01 శాతం పెరిగింది.Today Nifty position 11-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ATMs May Soon Give Rs 10 Notes as Govt Tests Small Denomination Dispensers6
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement