Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Can Driving in Slippers Attract a Challan in India1
స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!

Honda CB750 Hornet Gets Rs 1 Lakh Discount2
ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!

హోండా మోటార్‌సైకిల్‌ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్‌తో లభిస్తుంది.సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Gold and Silver Price in India From 2026 Feb 8 to 14th3
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..

బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

AI Brings Risks Says Sebi Chief Tuhin Kanta Pandey4
ఏఐ ప్రమాదం.. సెబీ చైర్మన్ హెచ్చరిక!

ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్‌టెక్ (సూపర్‌వైజరీ టెక్నాలజీస్) & రెగ్‌టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు.

Rising Real Estate Demand in City Outskirts Growing Trend of Weekend Homes5
సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

⁠వీకెండ్‌ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్‌ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్‌ హోమ్స్‌ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్‌ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్‌ హోమ్స్‌లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఎవరు కొంటున్నారంటే.. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్‌ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్‌ హౌస్, ఓపెన్‌ జిమ్‌ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.అద్దెకు కూడా.. వీకెండ్‌ హోమ్స్‌ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్‌ హోమ్స్‌ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్‌ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్‌ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్‌ వెండింగ్స్‌ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.ఈ ప్రాంతాలలో డిమాండ్‌.. నగరం ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్‌పల్లి, జహీరాబాద్‌ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌ ఉంది. చార్టెడ్‌ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్‌ హోమ్స్‌ను డిజైన్‌ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.

China To Ban Half Steering Wheel After Flush Door Handles Know The Details Here6
అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!

చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్‌ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది.

Advertisement
Advertisement
Advertisement