Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

why Voltas announced air conditioner prices will be hike1
ఏసీ ధరలు అప్‌! కారణం ఇదే..

రాగి ధరలు పెరగడం, డాలర్‌తో మారకంలో రూపాయి బలహీనతల కారణంగా ఈ ఏడాది ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ) ధరలు 5–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వోల్టాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకుందన్‌ మీనన్‌ తెలిపారు. పీటీఐతో మాట్లాడుతూ..., ఏసీ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది ఎనర్జీ లేబుల్‌ మార్పులు అమలు చేస్తున్నామని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందన్నారు.‘గత ఏడాది రాగి ధర టన్నుకు సుమారు 8,500 డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 12,000–13,000 డాలర్లకు చేరుకుంది. ఏసీల తయారీలో రాగి వినియోగం అధికంగా ఉండటంతో ఉత్పత్తి వ్యయంపై గణనీయ ప్రభావం పడుతోంది. అలాగే ఏసీల్లో వినియోగించే కొన్ని కీలక విడిభాగాలు ఇంకా దిగుమతులపై ఆధారపడటంతో, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా వ్యయాలను పెంచింది. ఈ పరిస్థితుల్లో ఖర్చుల ఒత్తిడిని తగ్గించేందుకు ఏసీ ధరలను 5–15 శాతం వరకు పెంచే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది’ అని మీనన్‌ తెలిపారు. దేశీయ ఏసీ మార్కెట్లో వోల్టాస్‌కు ప్రస్తుతం సుమారు 18 శాతం వాటా ఉందని ఆయన చెప్పారు. ఏసీల తయారీలో చైనా అగ్ర స్థానంలో ఉండగా, థాయిలాండ్‌ రెండో స్థానంలో ఉంది.2026లో అమ్మకాలు 15–20% పెరగొచ్చుగత ఏడాదితో పోలిస్తే 2026లో దేశీయ ఏసీ విక్రయాలు 15–20 శాతం పెరుగుతాయని మీనన్‌ అంచనా వేశారు. మార్కెట్లో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్, తమిళనాడులోని రెండు ప్లాంట్లలో కలిపి 30 లక్షల స్లి్పట్‌ ఏసీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో పాటు మెరుగైన అమ్మకాలు, సేవల మద్దతు ఆధారంగా దేశీయ ఏసీ విభాగంలో అగ్రస్థానాన్ని కొనసాగించడమే లక్ష్యమని చెప్పారు. లోకలైజేషన్‌పై దృష్టిరాబోయే రెండేళ్లలో ఏసీ యూనిట్లలో లోకలైజేషన్‌ స్థాయిని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మీనన్‌ తెలిపారు. తయారీలో వినియోగించే కంప్రెసర్లు, మోటార్లు, పీసీబీలు, రాగి, అల్యూమినియం భాగాల స్థానిక కొనుగోళ్లను విస్తరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం 35–40 శాతంగా ఉన్న లోకలైజేషన్‌ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని వెల్లడించారు. లోకలైజేషన్‌ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని తెలిపారు.ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..

Gold and Silver rates on 26 February 2026 in Telugu states2
స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

IESA Vision Summit 2026 Amitesh Sinha semiconductor push long term commitment3
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు

సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకండక్టర్ల వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) అదనపు కార్యదర్శి అమితేష్‌ సిన్హా తెలిపారు. చిప్‌ల తయారీ యూనిట్లలోని వెండార్లకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సౌలభ్యం కోసం త్వరలో పోర్టల్‌ ప్రారంభించనున్నట్లు చెప్పారు.‘పరిశ్రమకు కావాల్సిన మద్దతు గురించి ప్రభుత్వానికి అవగాహన ఉంది. ఇదేదో కొన్నేళ్ల వ్యవహారం కాదు.. కనీసం 20–25 ఏళ్ల పాటు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన సెమీకండక్టర్‌ వ్యవస్థలు ఉన్న దేశాల్లో రెండు నుంచి అయిదు దశాబ్దాల పాటు ప్రభుత్వాలు వాటికి మద్దతునిచ్చాయి. ఇది టీ20 కాదు. మారథాన్‌లాంటిది. మేము దీని కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని ఐఈఎస్‌ఏ విజన్‌ సదస్సు 2026లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వచ్చే నెలలో ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) 1.0 కింద మరికొన్ని సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఐఎస్‌ఎం 2.0ని ఆవిష్కరించనున్నట్లు సిన్హా పేర్కొన్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

stock market updates on 26 February 20264
25,500 మార్కు వద్ద నిఫ్టీ సూచీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,536 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 148 పాయింట్లు పుంజుకొని 82,424 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.58బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.01 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.81 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.26 శాతం పుంజుకుంది.Today Nifty position 26-02-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

dont want your shopping bills tied to phone number5
షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

షాపింగ్‌ మాల్స్‌ ఎంట్రీ వద్ద.. రిటైల్‌ స్టోర్లలో బిల్లింగ్‌ దగ్గర మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అడుగుతున్నారా..? వారు అడిగిన వెంటనే చెప్పేస్తున్నారా..? అవసరం లేదు. వ్యక్తిగత మొబైల్‌ నంబర్‌ను వాణిజ్య కేంద్రాల వద్ద ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయాన్ని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్, రిటైల్‌ స్టోర్లకు ఈ విషయమై ప్రభుత్వం ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అంటూ లోక్‌సభ ఎంపీ జనార్థన్‌ సింగ్‌ సిగ్రివాల్‌ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా లెవనెత్తగా.. కేంద్రం బదులు ఇచ్చింది.రిటైలర్లకు వాటి అసోసియేషన్ల ద్వారా ఈ విషయంలో 2023 మే 26న సూచలను జారీ చేసినట్టు చెప్పారు. వీటి ప్రకారం.. వినియోగదారుల అభీష్టం మేరకే మొబైల్‌ నంబర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ నంబర్‌ వెల్లడించాలని ఏ నిబంధన కూడా నిర్దేశించడం లేదు. నంబర్‌ వెల్లడించేందుకు వినియోగదారులు తిరస్కరించొచ్చు. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2023, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ రూల్స్‌ 2025 అన్నవి పౌరుల వ్యక్తిగత డేటా (మొబైల్‌ నంబర్లు సహా) దుర్వినియోగం కాకుండా, తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయినట్టు గురిస్తే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

how Investors Arent Excited About IRFC6
ఐఆర్‌ఎఫ్‌సీ వాటా ఆఫర్‌.. స్పందించని ఇన్వెస్టర్స్‌

పీఎస్‌యూ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ)లో ప్రభుత్వం ఆఫర్‌ చేసిన 2 శాతం వాటా విక్రయానికి సరైన స్పందన లభించలేదు. ఆఫర్‌లో భాగంగా ప్రభుత్వం సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేసిన 23.52 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా.. 22.34 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. వెరసి 94.98 శాతం స్పందన నమోదైంది. సంస్థాగత ఇన్వెస్టర్లు షేరుకి రూ. 104.12 సంకేత ధరలో బిడ్స్‌ వేశారు. వీటి విలువ రూ. 2,326 కోట్లుకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లకు గురువారం విండో ఓపెన్‌ కానుంది.కాగా.. ప్రభుత్వం 2 శాతం వాటాకు సమానమైన 26.13 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అధిక డిమాండ్‌ కనిపిస్తే మరో 2 శాతం వాటాను సైతం విక్రయించేందుకు(గ్రీన్‌ షూ ఆప్షన్‌) అవకాశముంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 104 ఫ్లోర్‌ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Advertisement
Advertisement
Advertisement