Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

You Can Now Recharge Your Phone From WhatsApp Know The Details1
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్‌లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్‌ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి.

Mukesh Ambani Antilia Chef Earns Rs 24 Lakh2
అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ.. కుటుంబంతో కలిసి అత్యంత ఖరీదైన యాంటిలియాలో నివాసం ఉంటున్నారు. రాజప్రాసాదంలా ఉండే ఈ భవనం లోపల జరిగే ప్రతి పని ఒక పెద్ద సంస్థలో జరిగేలా క్రమబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కిచెన్ పని విధానం చూస్తే.. అదొక 7-స్టార్ హోటల్ స్థాయి నిర్వహణలా ఉంటుంది.యాంటిలియాలో పనిచేసే సుమారు 600 మంది సిబ్బందికి ప్రతిరోజూ భోజనం అందించాలి. దీనికోసం రోజుకు సుమారు 4000 రోటీలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే చెఫ్ బాధ్యత చాలా కీలకమైనది. ఎందుకంటే.. అతను కేవలం వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఒక మేనేజర్‌, ఒక ప్లానర్‌ కూడా.అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్‌ జీతం ఏడాదికి సుమారు 24 లక్షల రూపాయలు (నెలకు రూ.2 లక్షలు) అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే ఎక్కువ జీతం వస్తుందనే మాట ఒక అపోహ మాత్రమే అవుతుంది. ఒక రంగంలో ప్రతిభ, నైపుణ్యం ఉంటే.. ఎక్కడైనా మంచి జీతం లభిస్తుంది.యాంటిలియాలోని చెఫ్‌ పని ఎంతో ఒత్తిడితో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు ఒకే రుచి, ఒకే నాణ్యతతో ఆహారం తయారు చేయాల్సి ఉంటుంది. పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి. తన టీమ్‌ను సమర్థవంతంగా నడిపించాలి. ముఖ్యంగా.. సమయానికి అన్నీ సిద్ధం చేయాలి. ఇంత పెద్ద స్థాయిలో ఒక చిన్న పొరపాటు జరిగినా, అది వెంటనే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by StartupShivay (@startupshivay)

Reliance Jio Expands Market Leadership in AP Telangana Telecom Circle3
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్‌లో వైర్‌లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్‌డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్‌స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్‌లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్‌గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్‌లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్‌డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్‌లైన్ కనెక్షన్లను జియో జోడించింది.

Godrej Industries Sets Sight on Rs 5 Lakh Crore Market Cap by 20314
ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు

ముంబై, సాక్షి బిజినెస్‌ బ్యూరో: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ వచ్చే ఐదేళ్లకు భారీ ప్రణాళికను ప్రకటించింది. 2031 నాటికి రూ. 5 లక్షల కోట్ల మేర దాదాపు రెండింతల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో రెండు కంపెనీలను లిస్ట్‌ చేయడం, అన్ని వ్యాపారాల్లో డబుల్‌ డిజిట్‌ వృద్ధి సాధించడం ద్వారా ఈ టార్గెట్‌ చేరుకోవాలని భావిస్తోంది.సంవత్సరానికి 15 శాతానికి మించి అమ్మకాల వృద్ధి, 20 శాతం కంటే ఎక్కువ ఈపీఎస్‌ వృద్ధి, ప్రతి వ్యాపారంలో 18 శాతం కంటే ఎక్కువ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం గ్రూప్‌ కొత్త బ్రాండ్‌ గుర్తింపు, లోగో ఆవిష్కరణ సందర్భంగా త్వరలో కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న పిరోజ్‌ షా గోద్రెజ్‌ ఈ విషయాలు తెలిపారు. లిస్ట్‌ చేయబోయే సంస్థల్లో గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఉంటుందని చెప్పారు.సస్టైనబిలిటీ, ఉద్యోగుల ప్రాతినిధ్యం అంశాలపై కూడా సంస్థ దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.2031 నాటికి మహిళలు, ఎల్‌జీబీక్యూటీ వర్గాలు, దివ్యాంగుల ప్రాతినిధ్యాన్ని 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వ్యాపార వృద్ధి వ్యూహంలో భాగంగా, లిస్టెడ్‌ సంస్థలు తమకు అవసరమయ్యే నిధులను తామే సమకూర్చుకుంటాయి. లిస్ట్‌ కాని వ్యాపారాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 5,000 నుంచి రూ. 7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గోద్రెజ్‌ తెలిపారు.

Missed Your Home Loan EMI Here is When the Bank Can Seal Your House EMI5
EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) తీసుకుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో ఒకటి రెండు ఈఎంఐలు (EMI) చెల్లించలేకపోతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. ఆ పరిస్థితి అలాగే కొనసాగితే మాత్రం మీ కలల సౌధం వేలం దాకా వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి? 'సర్ఫేసీ' చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు మీకోసం..ఎన్‌పీఏ అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రకటిస్తారు?మీరు మొదటి నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్‌ల ద్వారా గుర్తు చేస్తాయి. రెండో నెలలో కూడా అదే పరిస్థితి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వరుసగా మూడు నెలల పాటు మీరు ఈఎంఐ చెల్లించనట్లయితే, బ్యాంక్ మీ రుణ ఖాతాను ఎన్‌పీఏ (NPA- నిరర్థక ఆస్తి)గా మారుస్తుంది. ఇక్కడి నుంచే అసలు చట్టపరమైన ప్రక్రియ మొదలవుతుంది.సర్ఫేసీ చట్టం.. బ్యాంకుల అస్త్రంరుణగ్రహీత మొండి బకాయిదారుగా మారినప్పుడు బ్యాంకులు సర్ఫేసీ చట్టం, 2002 (SARFAESI act)ని ప్రయోగిస్తాయి. లోన్‌ ఖాతా ఎన్‌పీఏ మారిన తర్వాత, బ్యాంక్ రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో డిమాండ్ నోటీసు ఇస్తుంది. బకాయి ఉన్న మొత్తాన్ని ఈ గడువులోగా చెల్లించాలని కోరుతుంది. ఈ 60 రోజుల వ్యవధిలో మీరు బ్యాంకును సంప్రదించి, మీ ఇబ్బందులను వివరించి చెల్లింపు గడువును పొడిగించుకునే లేదా రీ-స్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇంటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?డిమాండ్ నోటీసు ఇచ్చిన 60 రోజుల తర్వాత కూడా రుణగ్రహీత స్పందించకపోతే, బ్యాంక్ సదరు ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించి, ఇంటిని సీల్ చేసే అధికారం కలిగి ఉంటారు.వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది?ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ దానికి మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది. ఆపై బకాయిలను వసూలు చేసుకోవడానికి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. సాధారణంగా ఈఎంఐ నిలిచిపోయిన నాటి నుండి వేలం దాకా వెళ్లడానికి 5 నెలల నుండి 12 నెలల సమయం పడుతుంది. వేలానికి ముందు కూడా రుణగ్రహీతకు తన బకాయిలను పూర్తిగా చెల్లించి ఇంటిని కాపాడుకోవడానికి చివరి అవకాశం ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలుఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకు నుండి వచ్చే కాల్స్ లేదా నోటీసులను విస్మరించవద్దు. నేరుగా బ్యాంకు అధికారులను కలిసి మీ పరిస్థితిని వివరిస్తే, వారు ఏదైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించకపోతే మీ సిబిల్ (CIBIL) స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మరెక్కడా రుణాలు లభించవు. బ్యాంకు వేలం వేసే ముందు ఆస్తి విలువను సరిగ్గా లెక్కించిందో లేదో తనిఖీ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.ఇది చదివారా? ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?

Stock Market Closing Update April 23rd 20266
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. డీలా పడ్డ బ్యాంక్ షేర్లు!

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 77,664.00 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.90 శాతం నష్టంతో 24,158.50 వద్ద నిలిచాయి.డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, డంగీ డమ్స్ లిమిటెడ్, సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement