Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India GDP grew by 7. 8percent in the December quarter Q3-FY261
జీడీపీకి కొత్త జోష్‌!

న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల రాణింపుతో దేశ జీడీపీ వృద్ధి రేటు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతంతో పోలి్చతే కీలకమైన పండుగల సీజన్‌లో, అది కూడా జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తర్వాత వృద్ధి వేగం నిదానించడం గమనార్హం. త్రైమాసికంగా నీరసించినప్పటికీ, 2024–25 సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం జీడీపీ వృద్ధి 7.4 శాతంతో పోలి్చతే మెరుగుపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు జీడీపీ గణాంకాలకు 2011–12 బేస్‌ సంవత్సరంగా ఉండేది. దీన్ని 2022–23కు మార్చారు. అలాగే, జీఎస్‌టీ, ఈ–వాహన్‌ పోర్టల్‌పై రిజి్రస్టేషన్ల డేటా, పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌) డేటాను కొత్తగా జీడీపీ గణనలోకి చేర్చారు. దీంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఈ వివరాలు విడుదల చేసింది. పాత కాలం నాటి గణనపై విమర్శలకు సమాధానంగా.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన డేటాకు చోటు కలి్పస్తూ, వాస్తవ వృద్ధిని ప్రతిఫలించేలా కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. → కొత్త బేస్‌ సంవత్సరం ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 జీడీపీ వృద్ధి అంచనా 7.8% నుంచి 6.7 శాతానికి తగ్గింది. → క్యూ 2 (సెపె్టంబర్‌ క్వార్టర్‌) జీడీపీ వృద్ధి అంచనాను పాత బేస్‌ సంవత్సరం ఆధారంగా 8.2 శాతంగా అంచనా వేయగా, కొత్త బేస్‌ సంవత్సరం ఆధారంగా 8.4 శాతానికి సవరించారు. → 2025–26లో రియల్‌ జీడీపీ (స్థిర ధరల వద్ద) రూ.322.58 లక్షల కోట్లుగా ఉంటుంది. 2024–25 అంచనా రూ.299.89 లక్షల కోట్లతో పోలి్చతే వృద్ధి రేటు 7.6%గా ఉంటుంది. 2025–26 సంవత్సరం నామినల్‌ జీడీపీ వృద్ధి 8.6 శాతంగా ఉంటుంది. → కొత్త బేస్‌ సంవత్సరం ఆధారంగా 2023–24లో రియల్‌ జీడీపీ 7.2 శాతం, 2024–25లో 7.1 శాతానికి సవరించారు. → తయారీ రంగం 2025–26లో డబుల్‌ డిజిట్‌ వృద్ధిని సాధిస్తుంది. వాణిజ్యం, రిపెయిర్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ సేవలు, స్టోరేజ్‌ రంగాల్లో వృద్ధి 10.1 శాతంగా ఉంటుంది.అంచనాలను మించే..జీడీపీ వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు మించి ఉన్నట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. ‘వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, నిర్మాణ రంగాల వల్లే జీడీపీ వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితమైంది. తయారీ జీవీఏ మాత్రం వరుసగా ఐదో త్రైమాసికంలోనూ డబుల్‌ డిజిట్‌ వృద్ధి చెందింది. సేవల రంగం జీవీఏ వృద్ధి 7 త్రైమాసికాల గరిష్ట స్థాయి అయిన 9.5%కి మెరుగుపడింది. అంతక్రితం త్రైమాసికంలో (సెప్టెంబర్‌ క్వార్టర్‌) ఇది 9.3%గా ఉంది’ అని నాయర్‌ వివరించారు. 4 ట్రిలియన్‌ డాలర్లు దాటుతుంది..వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను కొత్త సిరీస్‌ ఆధారంగా, 20 బేసిస్‌ పాయింట్లు పెంచి (0.20 శాతం) 7–7.4 శాతానికి సవరించినట్టు.. జీడీపీ 4 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. 2026–27 ఆర్థిక సర్వేలో 6.8–7.2%గా అంచనా వేయడం గమనార్హం. నామినల్‌ జీడీపీ వృద్ధి 11 శాతానికి చేరుకోవచ్చన్నారు. గత మూడేళ్లలో తలసరి ఆదాయం వాస్తవంగా 6.3–6.4 శాతం పెరిగిందని.. అదే నామమాత్ర ప్రమాణంలో 3% కంటే ఎక్కువే ఉంటుందన్నారు. గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ కార్యదర్శి సౌరబ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. జీడీపీ గణనలోకి డేటా వనరులను పెంచడం వల్లే బేస్‌ సంవత్సరాన్ని 2022–23కు మార్చాల్సి వచి్చనట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థలో గత పదేళ్లలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, దీంతో ఎన్నో డేటా వనరులు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.3 శాతంగా ఉండొచ్చన్నారు.

Record Number of Americans Leave US Know The Reasons Here2
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత్సరాలుగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు వలస వెళ్తున్నారు, వారిలో కొందరు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి & అనేక మార్పులు సంభవించాయి. మహా మాంద్యం తరువాత.. 2025లో దేశానికి వచ్చినవారి సంఖ్యకంటే, అమెరికా వీడి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.2026లో పెరిగే అవకాశం2023లో అమెరికా దేశానికి వలస వచ్చినవారి సంఖ్య 60 లక్షలు. ఈ సంఖ్య 2025 నాటికి 26 లక్షల నుంచి 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ సమయంలో (2025లో) యూఎస్ఏ విడిచి వెళ్లినవారు 1.5 లక్షలు కావడం గమనార్హం. 2026లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ప్రజలు అమెరికా విడిచి వెళ్లడానికి ప్రధాన కారణాలు.. పెరుగుతున్న జీవన వ్యయం, సామాజిక హింస, రాజకీయ అస్థిరత అని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ల సంఖ్య పెరుగుదలను డొనాల్డ్ డాష్ అని పిలుస్తున్నారు.విదేశాల్లో అమెరికన్లు2025లో అమెరికా ప్రభుత్వం సుమారు 6.74 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించింది. కాగా మరో 22 లక్షలమంది దేశం విడిచి స్వచ్చందంగా బయటకు వెళ్లారు. కాగా కొన్ని గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 40 లక్షల నుంచి 90 లక్షల మధ్య అమెరికన్లు విదేశాల్లో నివసిస్తున్నారు.పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అనేక మంది అమెరికన్లు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. బాలి, కొలంబియా, థాయిలాండ్‌లలో ఇళ్ల ధరల పెరుగుదలకు కూడా అమెరికన్లు ఎక్కువ కావడం అనే తెలుస్తోంది. ఒక లక్ష మందికి పైగా యువ అమెరికన్లు తక్కువ ఖర్చుతో కూడిన డిగ్రీల కోసం విదేశాలలో చదువుతున్నారు. పదవీ విరమణ చేసినవారు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు, వృద్ధాప్య సంరక్షణ వంటి వాటికోసం మెక్సికోకు వెళుతున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది.విద్యార్థులు సైతంకెనడా, యూకే, మెక్సికో వంటి దేశాలు అమెరికన్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గత ఏడాది 17 శాతం తగ్గింది. అదే సమయంలో యూరప్‌కు వెళ్లే అమెరికన్ విద్యార్థుల సంఖ్య 2011తో పోలిస్తే రెట్టింపైంది. యుకేలో మాత్రం ఈ సంఖ్య గత ఏడాది 14 శాతం పెరిగింది. ఒకప్పుడు అమెరికాకు ఎగబడి వెళ్లేవారు కూడా.. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నారు.1935 మహామాంద్యం సమయంలో అమెరికాకు వచ్చినవారి కంటే.. యూఎస్ వీడి వెళ్లిన వారిసంఖ్య ఎక్కువగా నమోదైంది. అలాంటి పరిస్థితి సుమారు 90ఏళ్ల తరువాత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

JSW Motors Teases Upcoming Jetour T2 3
ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన జెటోర్ టీ2 కారును లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది. దీనిని మహారాష్ట్రలోని దాని రాబోయే ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.జెటోర్ టీ2 గ్లోబల్ మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) & ఆల్-ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం హైబ్రిడ్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అంటే ఇది చిన్న బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్ కూడా పొందుతుందన్నమాటహైబ్రిడ్ వెర్షన్ 26.7kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేసిన.. 154hp / 220Nm అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సింగిల్ మోటార్ FWD సెటప్ లేదా డ్యూయల్-మోటార్ AWD లేఅవుట్‌లో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ రేంజ్ 139 కి.మీ. కాగా పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ద్వారా ఎక్కువ మైలేజ్ లభించనుంది. కాబట్టి మొత్తం మైలేజ్ 1000 కిమీ కంటే ఎక్కువ వస్తుంది. జెటోర్ టీ2 కారు ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

GST and e Vehicle Data in New GDP Series4
కొత్త జీడీపీ సిరీస్‌లో జీఎస్‌టీ, ఈ-వాహన్‌ డేటా

2022-23 బేస్‌ ఇయర్‌గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) సిరీస్‌లో ఈ-వాహన్, వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) డేటాతో పాటు వంటవాళ్లు, డ్రైవర్లు, పనిమనుషులు అందించే ఇంటి పనులకు సంబంధించిన సేవల గణాంకాలు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసిన వివరణ ప్రకారం, కాలక్రమేణా ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులను ప్రతిబింబించేలా బేస్‌ ఇయర్‌ని ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తారు. అయితే కోవిడ్‌ పరిణామాలు, జీఎస్‌టీ అమలు తదితర అంశాల కారణంగా కొన్నాళ్లుగా మార్చలేదు. ప్రస్తుతం 2011-12గా ఉన్న బేస్‌ ఇయర్‌ని 2022-23కి మారుస్తున్నారు.కార్మిక శక్తి సర్వే, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోని సంస్థలపై నిర్వహించే అధ్యయనాలను ఈ గణాంకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, రహదారి రవాణా సర్వీసులకు సంబంధించి ప్రైవేట్‌ వినియోగ వ్యయాలను అంచనా వేసేందుకు ఈ-వాహన్‌ పోర్టల్‌ డేటాను ఉపయోగిస్తారు. జీడీపీలో రాష్ట్రాలవారీగా ప్రైవేట్‌ కంపెనీల వాటాను అంచనా వేసేందుకు జీఎస్‌టీ డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్‌–డిసెంబర్‌ 2025) సంబంధించి కొత్త సిరీస్‌ ప్రాతిపదికగా ఉండే జీడీపీ డేటాను శుక్రవారం (నేడు) విడుదల చేస్తారు.

Deepinder Goyal Startup Temple Is Hiring But Only If You Have Less Body Fat5
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు

జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026

Mercedes Benz Issues Recall in India6
మెర్సిడెస్ బెంజ్ రీకాల్: ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్‌ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement