Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

What Google CEO Sundar Pichai Lifestyle Teaches Discipline Simplicity Habits1
పిచాయ్‌ విజయ రహస్యం ఇదే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సుమారు రూ.12,600 కోట్ల (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) సంపదకు అధిపతి అయినప్పటికీ ఆయన అనుసరించే సరళమైన జీవనశైలి, క్రమశిక్షణ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తులు తమ రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ కోణంలో సుందర్ పిచాయ్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.ఉదయాన్నే స్పష్టమైన ఆలోచనలుచాలామంది మేల్కోగానే స్మార్ట్‌ఫోన్‌ల్లో నోటిఫికేషన్లను తనిఖీ చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. కానీ, పిచాయ్ శైలే వేరు. ఆయన రోజూ ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండడం ఆయనకు ఇష్టం. మేల్కొన్న వెంటనే ఆయన చేసే మొదటి పని వార్తాపత్రికలు చదవడం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా తన మేధస్సును పదును పెడుతుంటారు. ఈ అలవాటే ఆయనకు సమాచార విశ్లేషణలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.పోషకాహారంసుందర్ శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ, తన రోజువారీ అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఉదయం పూట తీసుకునే ప్రోటీన్ మెదడుకు, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందని ఆయన నమ్ముతారు. ఆయన ఉదయం అల్పాహారంలో సాధారణంగా ఒక కప్పు టీ, ఆమ్లెట్, టోస్ట్ ఉంటాయి. ఇందులో ఆమ్లెట్ ప్రోటీన్ కోసం, టోస్ట్ కార్బోహైడ్రేట్ల కోసం దోహదపడతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించినా పోషక విలువల పరంగా ఇది ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్. భారతీయ మూలాలున్న పిచాయ్‌కు టీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉదయాన్నే వేడివేడి టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కొత్త ఉత్సాహంతో డే ప్రారంభించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడతారు.విజయానికి అసలైన సూత్రంసుందర్ పిచాయ్ జీవితం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే.. విజయం అంటే సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కాదు, ఉన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణతో ఆచరించడం.ఉదయాన్నే ప్రశాంతంగా రోజును ప్రారంభించడం.వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడం.సరళమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం.రూ.12,600 కోట్ల ఆస్తులున్న ఒక వ్యక్తి తన దినచర్య పరంగా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే ఆ క్రమశిక్షణను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకోవడం యువతకు ఒక పాఠం. భవిష్యత్తుపై స్పష్టత, సమకాలీన అంశాలపై పట్టు ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుందర్ పిచాయ్ జీవనశైలి నిరూపిస్తోంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Karnataka Semiconductor Ecosystem Applied Materials 140 Acres Bengaluru Airport2
బెంగళూరులో సెమీకండక్టర్ హబ్ కోసం 140 ఎకరాలు

దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్‌బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.కేటాయింపు ముఖ్యాంశాలుప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.కేటాయింపు భూమి: 140 ఎకరాలు.నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యూహాత్మక ప్రాధాన్యతరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.పారదర్శకతకు పెద్దపీటఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్‌బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Gold and Silver Rates on 01 May 2026 in Telugu states3
కాసింత చల్లబడిన బంగారం వేడి!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Viral Office Picnic Redefining Corporate Culture Mandatory Lunch Hour4
‘ఆఫీస్ పిక్నిక్’ వేళ.. అందరూ ఒక్కటే!

ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో డెడ్‌లైన్లు, క్లయింట్ కాల్స్, మీటింగ్‌లు.. అంటూ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడిలో గడుపుతుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా దొరకని ఈ రోజుల్లో ఒక సంస్థ మాత్రం వినూత్న సంస్కృతికి తెరలేపింది. పని వేళల్లో రోజూ తప్పనిసరిగా ఒక గంట పాటు పనులకు బ్రేక్‌ ఇచ్చి ఉద్యోగులందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని ‘కేకే క్రియేట్’(KK Create) వ్యవస్థాపకురాలు కావ్య అమలు చేస్తున్నారు. ఈ ‘ఆఫీస్ పిక్నిక్’ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వర్క్ కల్చర్‌పై చర్చకు దారితీసింది.ఎవరూ ఒంటరిగా తినరుకేకే క్రియేట్ సంస్థలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో కఠినమైన టార్గెట్లతో పని చేసే ఈ బృందం మధ్యాహ్నం 2 గంటలయ్యిందంటే చాలు పని ఒత్తిడిని పక్కనపెట్టాల్సిందే. ఓ గంటపాటు ఎటువంటి మినహాయింపులు ఉండవు. మేనేజర్ నుంచి ఫ్రెషర్ వరకు అందరూ ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తారు.ఈ సంస్కృతిపై కావ్య కర్ణాటక లింక్డ్ఇన్‌లో రాస్తూ ‘మా కార్యాలయంలో ప్రతిరోజూ ఒక గంట పిక్నిక్ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆ సమయంలో ఆఫీసులో హైరార్కీ ఉండదు. అందరం కలిసి కూర్చుంటాం. జోకులు వేసుకుంటాం. ఆటలు ఆడుకుంటాం. దీనివల్ల పని పట్ల భారం తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.పని తర్వాత చూద్దాం.. ముందు భోజనం చేద్దాంసాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీనియర్ సభ్యులే ముందుండి ‘ఆజావో లంచ్ కర్నే, కామ్ బాద్‌ మే కర్నా’ (రండి భోజనం చేద్దాం, పని తర్వాత చూద్దాం) అని ప్రోత్సహిస్తుంటారు. ఈ సమయం కేవలం భోజనానికే పరిమితం కాకుండా ఉద్యోగుల మధ్య బలమైన బంధాలను పెంచే సామాజిక సమయంగా మారుతోందని కావ్య వివరించారు.నెటిజన్ల ప్రశంసల వెల్లువఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. పని సంస్కృతి అంటే కేవలం సమావేశాలు, విధానాలు మాత్రమే కాదని ఇలాంటి చిన్న వ్యవహారాలే అసలైన బంధాలను నిర్మిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రొడక్టివిటీ పెంచమని చెప్పే క్రమంలో చాలా కంపెనీలు మానవ సంబంధాలను మర్చిపోతున్నాయి. కానీ, ఇలాంటి విధానం ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది’ అని ఒక యూజర్‌ కామెంట్ చేశారు. మరోవైపు, అత్యవసరమైన క్లయింట్ కాల్స్ లేదా డెడ్‌లైన్ల సమయాల్లో ఈ ఒక గంట విరామాన్ని ఎలా నిర్వహిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి కావ్య స్పందిస్తూ, ‘ఆ సమయంలో మాకు ఏదీ ముఖ్యం కాదు. ఒక గంట పాటు పని నుంచి పూర్తిగా దూరమవ్వడం వల్ల తిరిగి పనిలో చేరినప్పుడు మరింత సామర్థ్యంతో పనిచేయగలుగుతున్నాం’ అని బదులిచ్చారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Rise Fall of App Based Cab Services Lessons for India Gig Economy5
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..

ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల నమూనా ప్రస్తుతం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు వేల రూపాయల ఆదాయం, విలాసవంతమైన జీవితం అంటూ ఊరించిన ఈ వ్యవస్థ నేడు వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వెహికిల్‌ లోన్లు ఇచ్చిన బ్యాంకులు 30,000లకు పైగా క్యాబ్‌లను జప్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వెనుక ఉన్న చేదు నిజాలు ఏమిటో విశ్లేషిద్దాం.ఓలా/ ఉబెర్ నమూనాయాప్-ఆధారిత క్యాబ్ కంపెనీల వృద్ధిని నిశితంగా పరిశీలిస్తే అవి నాలుగు దశల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించాయి.1. నగదు వెల్లువ: ప్రారంభంలో భారీగా ఇన్సెంటివ్‌లు ఇచ్చి మార్కెట్‌ను ఆక్రమించాయి.2. నమ్మకం: డ్రైవర్లకు నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం వస్తుందనే ఆశ కల్పించాయి.3. ఆధారపడటం: డ్రైవర్లు ఆ ఆదాయాన్ని నమ్మి భారీగా కార్ లోన్లు తీసుకుని సొంత వాహనాలు కొనుగోలు చేశారు.4. నియంత్రణ: మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక ఇన్సెంటివ్‌లను తగ్గించి కమిషన్లను పెంచాయి.అప్పుల ఊబిలో డ్రైవర్లుకంపెనీల వ్యూహాలు మారడంతో డ్రైవర్ల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు తోడు ఇన్సెంటివ్‌లు తగ్గడంతో డ్రైవర్ల చేతికి వచ్చే ఆదాయం రూ.30,000 నుంచి రూ.35,000కు పరిమితమైంది. దీంతో తీసుకున్న కార్ లోన్ల ఈఎంఐలు కట్టడం డ్రైవర్లకు భారమైంది.కొవిడ్ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆదాయం లేక, అప్పులు తీర్చలేక దాదాపు 30,000కు పైగా క్యాబ్‌లను బ్యాంకులు జప్తు చేశాయి. వాహనాల జప్తుతోపాటు లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది.మారుతున్న ధోరణిప్రస్తుతం డ్రైవర్ల ఆలోచనా ధోరణి మారింది. అప్పుల భారం లేని, రిస్క్ తక్కువగా ఉండే డెలివరీ పార్టనర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయం తక్కువైనా సొంత వాహనంపై అప్పుల బాధ్యత లేకపోవడమే వారికి ఇప్పుడు ఊరటనిస్తోంది.ప్రయాణికులపై భారంమరోవైపు, ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఒక సామాన్య ప్రయాణికుడు ప్రధాన నగరాల్లో సరాసరి నెలవారీ క్యాబ్ ప్రయాణాల కోసం దాదాపు రూ.27,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సొంత కారును కొని మెయింటెనెన్స్ చేసుకునే ఖర్చు కంటే ఎక్కువ కావడం గమనార్హం.క్యాబ్-హెయిలింగ్ ఎకోసిస్టమ్ కేవలం డ్రైవర్లకే కాకుండా కంపెనీలకు, ప్రయాణికులకు కూడా నష్టదాయకంగా మారింది. కేవలం గ్రోత్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్ స్థిరత్వం వైపు దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థపై పునసమీక్షించుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Elon Musk vs OpenAI Courtroom Clash Could Redefine Future Artificial Intelligence6
కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కోర్టు విచారణలో ఉత్కంఠ నెలకొంది. సంస్థ సహ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లపై ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 30న జరిగిన విచారణ వాడీవేడిగా సాగింది. ప్రజా ప్రయోజనం కోసం స్థాపించిన లాభాపేక్ష లేని సంస్థ ఇప్పుడు భారీ వాణిజ్య సంస్థగా మారిందని, ఇది విశ్వాసఘాతకమని మస్క్ గట్టిగా వాదించారు.కోర్టు గదిలో మాటల యుద్ధంవిచారణ సందర్భంగా ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్, మస్క్‌ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంస్థ లాభాపేక్ష లేని మార్గంలో కాకుండా వాణిజ్య పరంగా వెళ్తుందని తెలిసినా మస్క్ ఎందుకు మౌనంగా ఉన్నారని, పాత ఒప్పంద పత్రాలను (2017 టర్మ్ షీట్) ఉటంకిస్తూ సావిట్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘నేను ఆ పత్రాల్లోని ఫైన్‌ ప్రింట్‌ చదవలేదు. కేవలం శీర్షికను మాత్రమే చూశాను. ఆల్ట్‌మన్, ఇతరులు ఇచ్చిన హామీలనే నమ్మాను’ అని మస్క్ బదులిచ్చారు. సావిట్ పదేపదే తనను మధ్యలో ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ‘మీరు నన్ను ప్రతిసారీ నియంత్రించాలనుకుంటే సమాధానాలు ఎలా పూర్తవుతాయి?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ స్పందిస్తూ, న్యాయవాదిని హెచ్చరించినప్పటికీ మస్క్ చేసిన అభ్యంతరాలను పూర్తిగా సమర్థించలేదు.నమ్మకద్రోహం జరిగిందితాను ఓపెన్ ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతుందని విశ్వసించి మద్దతు ఇచ్చానని, అయితే ఇప్పుడు అది నిబంధనలను ఉల్లంఘిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఒక స్వచ్ఛంద సంస్థ తీరును మార్చకూడదు’ అని అన్నారు. ఈ కేసులో భాగంగా ఆయన 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు సంస్థ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని, ఆల్ట్‌మన్, బ్రోక్‌మన్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఓపెన్ ఏఐ ప్రతివ్యూహంమరోవైపు, మస్క్ వాదనలను ఓపెన్ ఏఐ తోసిపుచ్చింది. మస్క్ కేసును ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాశకు గురైన మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐకి పోటీగా ఉన్న ఓపెన్ ఏఐని బలహీనపరిచేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. అంతేకాకుండా, మస్క్ కూడా తన సొంత ఏఐ మోడళ్లను ధ్రువీకరించుకోవడానికి ఇతర ఏఐలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.న్యాయమూర్తి క్లాస్విచారణలో ఏఐ వల్ల మానవాళికి రాబోయే ముప్పు గురించి మస్క్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే ప్రమాదం నిజం, మనమందరం చనిపోవచ్చు’ అని వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి రోజర్స్ తోసిపుచ్చారు. ‘మీ క్లయింట్ (మస్క్) కూడా అదే రంగంలో సంస్థను నడుపుతున్నారు కదా.. మరి ప్రమాదాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఇది భద్రతా ప్రమాణాల విచారణ కాదని, ఒప్పంద ఉల్లంఘనల కేసు అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 850 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సంస్థగా ఎదిగిన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే

Advertisement
Advertisement
Advertisement