ప్రధాన వార్తలు
‘పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక కాలం చెల్లింది’
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఇకనైనా మేల్కొని స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన 'బస్వరల్డ్ ఇండియా కాన్క్లేవ్ 2025'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.శిలాజ ఇంధనాల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం దేశం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ "తీవ్రమైన సమస్యల" నుండి బయటపడాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలే మార్గమని ఆయన పేర్కొన్నారు.‘డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు. తయారీదారులు జీవ ఇంధనాలు (Bio-fuels), సీఎన్జీ (CNG), ఎల్ఎన్జీ (LNG), ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేయాలి’ అని నితిన్ గడ్కరీ అన్నారు.భవిష్యత్తు ఇంధనం 'హైడ్రోజన్'భారతదేశం ఇప్పటికే ప్రయోగాత్మకంగా 10 ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులను నడుపుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో హైడ్రోజన్ అత్యంత కీలకమైన ఇంధనంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇథనాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశ్రమ ఇప్పటికే దృష్టి సారించిందని, ప్రస్తుతం వాహనాలు E20 (20% ఇథనాల్ మిశ్రమం) ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.ప్రజా రవాణాలో భద్రతే ముఖ్యంప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం భౌతిక, వీడియో అనుమతులతో పాటు వివరాలను 'వాహన్' పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. తయారీదారులు కేవలం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంపైనే కాకుండా.. నాణ్యత, భద్రత,ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని ఆయన సూచించారు.ఎలక్ట్రిక్ బస్సులకు భారీ డిమాండ్రాబోయే మూడేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ సుమారు 1,50,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ప్రస్తుత తయారీ సామర్థ్యం ఏడాదికి 70,000 బస్సులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
దూసుకెళ్తున్న బంధన్ బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బంధన్ బ్యాంక్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మంగళవారం మార్కెట్ సెషన్ తర్వాత ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాలకు ప్రతిస్పందనగా బ్యాంకు షేర్లు బుధవారం సుమారు 14 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంధన్ బ్యాంక్ షేర్లు (Bandhan Bank Stock Price) బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 13.8% పెరిగి రూ.203.36 వద్ద ఉన్నాయి. గత నెలలో స్టాక్ 43.9% లాభపడింది. బంధన్ బ్యాంక్ షేర్లు ఏప్రిల్లో ఇప్పటివరకు 27% పెరిగాయి. జూన్ 2020 (47%) నుండి బంధన్ బ్యాంక్ స్టాక్ ఉత్తమ నెలవారీ పనితీరు ఇదే.క్యూ4 ఫలితాలుబంధన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 68 శాతం జంప్చేసి రూ. 534 కోట్లను తాకింది. రుణ నాణ్యత మెరుగుపడటంతోపాటు.. రిటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ విభాగాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రిటైల్ బ్యాంకింగ్ నష్టాల నుంచి బయటపడటమేకాకుండా రూ. 434 కోట్ల లాభం ఆర్జించింది. ఇక ట్రెజరీ కార్యకలాపాల నుంచి రూ. 206 కోట్ల లాభం సమకూరింది. దీంతో హోల్సేల్ బ్యాంకింగ్ రూ. 80 కోట్ల నష్టం నమోదు చేసినప్పటికీ పనితీరు మెరుగుపడింది.స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.7 శాతం నుంచి 3.3 శాతానికి, నికర ఎన్పీఏలు 1.3 శాతం నుంచి 1 శాతానికి దిగివచ్చాయి. అయితే ఈ కాలంలో రూ. 677 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2,796 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3 శాతం పుంజుకుని రూ. 3,567 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 1,224 కోట్లకు పరిమితమైంది. 2024–25లో రూ. 2,745 కోట్లు ఆర్జించింది. అధిక ప్రొవిజన్లు లాభాలను దెబ్బతీశాయి.
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్
క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.ప్రధాన మార్పులు ఇవే..నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడదు.గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.కార్డుదారులకు కాస్త రిలీఫ్వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.ఆర్బీఐ లక్ష్యం ఇదే..వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.అమలు ఎప్పటి నుంచి?ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ఈ గడువును ఇచ్చింది.ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
రూ.లక్ష కోట్లున్నాయ్: ఇన్ఫీ కోఫౌండర్ క్రిస్
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో బిలియన్ డాలర్లుగా (యూనికార్న్) ఎదిగే దేశీ స్టార్టప్లకు అధునాతన తయారీ, డీప్ టెక్నాలజీ దన్నుగా నిలుస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ దశను ఆయన యూనికార్న్ 2.0గా అభివర్ణించారు.అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా సొంత టెక్నాలజీలను సమకూర్చుకోవడం, దీర్ఘకాలం నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్, సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ చైర్మన్ కూడా అయిన గోపాలకృష్ణన్ సీఐఐ యూనికార్న్ సదస్సు 2026లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.‘డీప్టెక్ చాలా కష్టమైన వ్యవహారం. చాలా సమయం పట్టేస్తుంది. పెట్టుబడుల పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. విఫలమయ్యే అవకాశాలు ఎక్కువే. కానీ నిలబడగలగితే ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయి‘ అని క్రిస్ తెలిపారు. ఈ పరివర్తనకు ఊతమిచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి, ఆవిష్కరణలకు (ఆర్డీఐ) సంబంధించిన ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ, విదేశాల నుంచి కూడా వచ్చే పెట్టుబడులతో ఈ వ్యవస్థ 30–40 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందని, రేపటి డీప్టెక్ యూనికార్న్లకు బాటలు వేస్తుందని వివరించారు.
పసిడి ధరలు: నిన్న ఊహించని పతనం.. నేడు ఇలా..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో క్రితం రోజున భారీగా పతనమైన పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ బంగారం రేట్లు పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగడం కొంత ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..
లాభాల్లోకి స్టాక్మార్కెట్.. ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య ఆటో, రియాల్టీ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలకు ప్రారంభం వద్ద నష్టాలు తప్పాయి. ఉదయం 9:49 గంటల సమయానికి నిఫ్టీ 0.68 శాతం లేదా 163.30 పాయింట్ల లాభంతో 24,159.00 వద్ద, సెన్సెక్స్ 535.81 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 77,422.72 వద్ద ట్రేడవుతున్నాయి. మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.57 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.68 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు..
ఒక ప్రీమియం.. జీవితాంతం ఆదాయం!
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. మొబిక్విక్కు NBFC లైసెన్స్!
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
సన్ ఫార్మా మెగా డీల్..!
అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!
"దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు ర...
తగ్గుతున్న బంగారం.. మరో గుడ్ న్యూస్
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. క్రితం రో...
నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్...
బిలియనీర్ల హబ్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల...
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరిం...
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు.
ఊడిపోతున్న ఉద్యోగం.. ఇదిగో ఇదే వచ్చే పరిహారం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.అందుకే ఈ మార్పులు!ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.తొలగించిన వారికి లభించే ప్రయోజనాలుబాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది."ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
వాట్సాప్లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.వాట్సాప్ హోమ్ స్క్రీన్పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి.
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
పర్సనల్ ఫైనాన్స్
ఇన్వెస్కో కొత్త ఫండ్స్!
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ వీటి లో ఉన్నాయి.మొదటిది సెన్సెక్స్ ఇండెక్స్లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎన్ఎఫ్వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్ ఆఫర్లు మే 7న ముగుస్తాయి.
వ్యక్తిగత హెల్త్ పాలసీకి మైగ్రేషన్ ఇలా..
ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్ ప్యాకేజీలో భాగంగా గ్రూప్ మెడికల్ కవరేజ్ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్–డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.పాలసీని ఎలా మార్చుకోవాలంటే ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్’ ప్లాన్గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్’ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.వారి వద్ద ఉన్న వివిధ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకోండి. సరైన ప్లాన్ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్ ఫామ్, మైగ్రేషన్ ఫామ్ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.మైగ్రేషన్తో ప్రయోజనాలు దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్ పీరియడ్’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ కాలం, కొత్త రిటైల్ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్ ప్లాన్లోకి మాత్రమే మర్చుకోగలరు. వైద్య పరీక్షలు: గ్రూప్ పాలసీలో సాధారణంగా మెడికల్ టెస్టులు ఉండవు. కానీ రిటైల్ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్ ఇన్సూర్డ్ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్ పీరియడ్ యథాప్రకారంగానే వర్తిస్తుంది.పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్.
నో కాస్ట్లో అసలు కాస్ట్ ఎంత..?
‘రూ.1.20 లక్షలు ఖరీదు చేసే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్.. ఒకేసారి అంత పెట్టి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. 6–9–12–18–24 నెలల సులభ వాయిదాల్లో, నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేసుకోవచ్చన్న ఆఫర్ ఇస్తే.. చాలా మందికి ముందుకు వస్తారు. రూ.1.20 లక్షల ల్యాప్టాప్ నెలకు రూ.5,000తో చేతికి వస్తుంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? కానీ, ఈ ఆఫర్ల వెనుక వాస్తవ అంశాలను ప్రతి కస్టమర్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఎలాంటి వ్యయాలు ఉండవా? బయటకు చెప్పని చార్జీలేవైనా ఉంటాయా? అసలు ఈ ఆఫర్లు ఎలా పనిచేస్తాయి? అని ప్రశ్నించుకోవాలి. వడ్డీ ఉండదా? 🔸 నో కాస్ట్ ఈఎంఐ అంటే ఎంపిక చేసుకున్నన్ని నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై వడ్డీ పడుతుంది. 🔸 ప్రతీ నెల వాయిదాపై బ్యాంక్ వడ్డీ విధిస్తుంది. 🔸 కాకపోతే ఈఎంఐ స్కీమ్ కాల వ్యవధిలో పడేంత వడ్డీని కొనుగోలు సమయంలోనే తగ్గింపు లభిస్తుంది. 🔸 కనుక కొనుగోలుదారులపై వడ్డీ భారం పడదు. 🔸 ముందే డిస్కౌంట్ ఇచ్చేయడంతో ప్రతి నెలా అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. చార్జీలూ ఉంటాయ్.. 🔸 నిజానికి వడ్డీ ఒక్కటే ఉండదు. మిగిలిన చార్జీలు యథావిధిగా చెల్లించుకోవాల్సిందే. 🔸 ప్రతీ వాయిదాపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. 🔸 ఈఎంఐ లావాదేవీపై ప్రాసెసింగ్ చార్జీ కూడా పడుతుంది. లావాదేవీ విలువ ఆధారంగా ఈ మొత్తం రూ.200–999 మధ్య ఉంటుంది. దీనిపై మరో 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించుకోవాలి. 🔸 ఈఎంఐలన్నింటినీ ముందే చెల్లించేస్తానంటే అందుకు అదనంగా కొంత సమర్పించుకోవాలి. ఒకవేళ 9 నెలల ఈఎంఐని మూడు నెలలకే ముగించేద్దామనుకుంటే బ్యాలన్స్ ఈఎంఐలపై 2–3 శాతం అదనంగా చెల్లించాల్సి రావచ్చు. ఉదాహరణ.. 🔸 రూ.50,000 ఖరీదు చేసే వస్తువు కొన్నారు. ఆరు నెలల ఈఎంఐ పెట్టుకున్నారు. 🔸 దీనిపై వడ్డీ సుమారుగా రూ.2,296 అనుకుందాం. ఇంత మేర కొనుగోలులో తగ్గుతుంది. దీంతో నికర కొనుగోలు ధర రూ.47,704 అవుతుంది. 🔸 తగ్గించిన రూ.2,296 మేర ప్రతి నెలా ఈఎంఐలో మళ్లీ ఆరు నెలల పాటు కలుస్తుంది. రూ.2,296 వడ్డీపై 18 శాతం జీఎస్టీ కింద మరో రూ.413 చార్జీ కూడా పడుతుంది. 🔸 ప్రాసెసింగ్ చార్జీ రూ.300 అనుకుంటే.. దీనికి 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.354 చెల్లించాలి.క్రెడిట్ లిమిట్పై ప్రభావం..🔸 ఈఎంఐపై కొనుగోలు చేసిన వెంటనే అంత మేర కార్డు క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుందని తెలుసుకోవాలి. 🔸 ఉదాహరణకు మీ కార్డుపై రూ.1,00,000 లిమిట్ ఉందనుకుందాం. 🔸 రూ.60,000 ల్యాప్టాప్ లేదా ఫోన్ కొనుగోలుతో లిమిట్ రూ.40,000కు తగ్గిపోతుంది. 🔸 అక్కడి నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఆరు నెలల ఈఎంఐ చెల్లించాలి. మొదటి నెల రూ.10,000 చెల్లించిన వెంటనే లిమిట్ అంత మేర పెరిగి రూ.50,000కు చేరుతుంది. రెండో నెలలో రూ.10,000 ఈఎంఐ చెల్లించిన తర్వాత లిమిట్ రూ.60,000కు పెరుగుతుంది. 🔸 క్రెడిట్ లిమిట్లో వడ్డీకి సరిపడా కూడా లాక్ అవుతుంది. అది కూడా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించిన వెంటనే క్రమంగా విడుదలవుతూ వెళుతుంది. డిస్కౌంట్ ఎవరి ఆఫర్? 🔸 ముందు చెప్పుకున్నట్టు ఈఎంఐ వాయిదాతోపాటు బ్యాంక్లు వడ్డీని కూడా వసూలు చేస్తాయి. 🔸 ఈ వడ్డీని ఎక్కువ సందర్భాల్లో బ్రాండ్ (ఉదాహరణకు శామ్సంగ్ లేదా యాపిల్), రిటైలర్ భరిస్తారు. 🔸 కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సైతం మర్చంట్ టైఅప్లలో భాగంగా కొంత మేర భరిస్తుంది. 🔸 అందుకే ఆరంభంలో అంత మేర డిస్కౌంట్ లభిస్తుంది. 🔸 ఈ ఆఫర్తో బ్రాండ్లు, వర్తకులు విక్రయాలు పెంచుకుంటారు. 🔸 క్రెడిట్ కార్డు సంస్థలకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. 🔸అందుకే ఈ తరహా ఆఫర్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం? 🔸 ఈఎంఐపై కొనుగోలుతో క్రెడిట్ స్కోరుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలకూ చాన్స్ ఉంటుంది. 🔸 ప్రతి నెలా ఈఎంఐని సకాలంలో చెల్లించిన విషయాన్ని బ్యాంక్లు సిబిల్, ఎక్స్పీరియన్ తదితర క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును పెంచుతుంది. 🔸 రుణాల సమతుల్యతకు సాయపడుతుంది. క్రెడిట్ కార్డు స్వైప్నకే పరిమితం కాకుండా, రుణం తీసుకుని చెల్లించడం రుణ పరపతిని పెంచుతుంది. 🔸 విజయవంతంగా ఒక రుణాన్ని ముగించినట్టు మీ రిపోర్ట్లో నమోదు కావడం కూడా స్కోర్ను అధికం చేస్తుంది. 🔸 ఈఎంఐపై కొనుగోలు చేసే ముందు మీ లిమిట్ను ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా క్రెడిట్ లిమిట్లో 30–40 శాతం మించి ఖర్చు చేయకుండా చూసుకోవాలి. లిమిట్లో వినియోగం 60 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. 🔸 ఒక్క ఈఎంఐ చెల్లించడంలో విఫలమైనా అప్పుడు ఆలస్యపు రుసుం, దానిపై అదనపు వడ్డీ రేటు (36–48 శాతం) చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంతో నో కాస్ట్ బదులు కాస్ట్ ఈఎంఐగా మారిపోయే ప్రమాదం ఉంది. 🔸 అంతేకాదు రుణ చెల్లింపుల్లో విఫలమైతే అది క్రెడిట్ స్కోరును బలహీనపరుస్తుంది. ఇవి తెలుసుకోండి.. 🔸 తమ వద్ద కొనుగోలుకు సరిపడా మొత్తం ఉన్నప్పటికీ.. జీరో కాస్ట్ ఉందని చెప్పి ఆఫర్పై కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేమీ కాదు. 🔸 నో కాస్ట్ ఈఎంఐ కాకుండా స్పాట్ పేమెంట్పైనా బ్రాండ్లు, వర్తకులు భారీ డిస్కౌంట్ను ఫెస్టివల్, ప్రత్యేక సేల్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆఫర్ చేస్తుంటారు. 🔸 ఉదాహరణకు రూ.50,000 కొనుగోలుపై 10 శాతం కార్డు డిస్కౌంట్ కింద రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ కంటే స్పాట్ పేమెంట్ నయం. 🔸 అంతేకాదు మార్కెట్లో విచారిస్తే ఇంత కంటే తక్కువ మొత్తానికి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లేదా కార్డు పేమెంట్పై మరింత డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉండొచ్చు.


