Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Silver Medals Gifted To Retired Railway Staff They Were Made Of Copper Here is Details1
రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!

భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్‌లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్‌కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్‌లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

Rich Dada Poor Dad Robert Kiyosaki Say TESLA Cannot Get Silver2
'వెండి దొరకడం కష్టం': కియోసాకి

సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!

Stock Market Closing Update 16th January 20263
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Mahindra XEV 9S XUV 7XO Log 93689 Bookings Combined on First Day4
నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 2026 జనవరి 14న.. నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్‌లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని కార్ల తయారీదారు తెలిపారు.కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు లాంచ్‌కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్‌లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్‌ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ ధృవీకరించింది.ఇక మహీంద్రా XEV 9S విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఇది 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు కూడా మంచి బుకింగ్స్ పొందింది. మొదటి రోజే ఏకంగా 70000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును మహీంద్రా కార్లు అధిగమించాయి. బుకింగ్లలో ఎప్పటికప్పుడు మహీంద్రా కంపెనీ కొత్త మార్క్ చేరుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి కార్లు కూడా గతంలో గొప్ప అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

Why North Block Remains the union budget papers Printing Hub?5
నార్త్‌ బ్లాక్‌లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ

దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్‌ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్‌ భవనంలోని నార్త్‌ బ్లాక్‌లోనే కొనసాగనుంది.కొత్త భవనంలో లేని సౌకర్యంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్‌లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్‌ బిల్డింగ్‌లోని నార్త్‌ బ్లాక్‌లో ఉన్న ప్రెస్‌లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్‌ రోడ్డులోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ప్రత్యేక ప్రెస్‌కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రతబడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్‌ బ్లాక్‌లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.త్వరలో ‘హల్వా వేడుక’బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

PSBs adopt digital process for MSME loans through JanSamarth6
ఎంఎస్‌ఎంఈ రుణాలకు తోడుగా ‘జన్‌సమర్థ్’

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ వితరణ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అన్నీ కలిసి ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కోసం ఒకే విధమైన, ప్రమాణీకరించిన (Standardized) డిజిటల్ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.జన్‌సమర్థ్ పోర్టల్‌తో వేగంగా రుణాలుకేంద్ర క్యాబినెట్ సూచనల ప్రకారం, రూ.1 కోటి వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలన్నింటినీ ఇకపై ‘జన్‌సమర్థ్’ (JanSamarth) పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను వాడటం వల్ల రుణ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్లు, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్‌), జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్లను బ్యాంకులు ఆటోమేటిక్‌గా పరిశీలిస్తాయి. వ్యక్తిగతంగా పరిశీలన తగ్గడం వల్ల రుణ అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గి వేగంగా నిధులు మంజూరవుతాయి.క్రెడిట్ వృద్ధిగడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి బ్యాంకులు అందించిన మద్దతు గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో సుమారు రూ.26.43 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయి. దాదాపు 13 మిలియన్ల (1.3 కోట్లు) ఖాతాల్లోకి ఈ రుణాలు చేరాయి. 2024 జనవరి-అక్టోబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన క్రెడిట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ఈ నూతన డిజిటల్ ప్రణాళిక వల్ల చిన్న వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులైన ప్రతి చిన్న వ్యాపారికి సకాలంలో పెట్టుబడి అందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

Advertisement
Advertisement
Advertisement