Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

LPG Cylinder Price Today Check Latest Rates in India1
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..

భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్‌లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్‌పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్‌లో ఎల్‌పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.కొత్త ధరలుఢిల్లీడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50ముంబైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836కోల్‌కతాడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50చెన్నైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50హైదరాబాద్‌డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0

Renault Sees India as Global Hub Plans 4 New Models Locally Developed2
2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే!

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్‌ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

Netflix Opens Eyeline Studios in Hyderabad3
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

HCLTech and Infosys Gives WFH Option As Gas Crunch4
గ్యాస్‌ కష్టాలు.. ఆఫీసుకు రాకండి!

దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హెచ్‌సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

Ashok Leyland to Invest up to Rs 500 Crore5
అశోక్‌ లేలాండ్‌ రూ.500 కోట్ల పెట్టుబడి: ఎందుకంటే?

వాణిజ్య వాహన తయారీ హిందుజా గ్రూప్‌ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ తాజాగా గ్రీన్‌ఫీల్డ్‌ బ్యాటరీ ప్యాక్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకు చెన్నై సమీపంలో తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది.వెరసి కొత్త బ్యాటరీ ప్యాక్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వీలుగా పిళ్లైపక్కం(చెన్నై)లో భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై రూ. 400–500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 2025 సెప్టెంబర్‌లోనే హిందుజా గ్రూప్‌ పెట్టుబడులలో భాగంగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రయాణంలో ఇది కీలక ముందడుగుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీయంగా పటిష్ట ఈవీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో తమ కట్టుబాటుకు మరింత మద్దతివ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఈవీ బ్యాటరీ ప్యాక్‌ ఉత్పత్తికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు.

Stock Market Closing Update 12th March 20266
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement