Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 21st February 2026 in Telugu states1
హ్యాట్రిక్‌ కొట్టిన పసిడి.. వెండి ఒక్కసారిగా రూ.20 వేలు..

దేశంలో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలతో కొనుగోలుదారులకు షాకులిస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) మూడో రోజూ పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

US totally rejects global governance of AI2
ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌కు అమెరికా పూర్తి ‍వ్యతిరేకం

కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్‌ గవర్నెన్స్‌లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ

Indian tech graduate US sparked debate online after company offered 3 USD hike3
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్‌) చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, డాలర్లలో జీతం పొందుతూ స్థిరపడొచ్చని భావించే భారతీయ విద్యార్థుల కలలకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలు విసురుతున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న ఐటీ నిపుణులు అక్కడ ఉండలేక.. అ‍క్కడి నుంచి రాలేక.. సతమతమవుతున్నారు. తాజాగా ఒక భారతీయ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.అవమానకరమైన ఆఫర్కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక ఎంఎన్‌సీ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌గా పనిచేసిన ఒక భారతీయ నిపుణుడు తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. అజూర్, ఎస్‌క్యూఎల్‌ వంటి కీలక టెక్నాలజీలపై పని చేసినప్పటికీ కంపెనీ ఇచ్చిన ఫుల్ టైం ఆఫర్ ఆ విద్యార్థిని విస్మయానికి గురిచేసింది.ప్రస్తుత ఇంటర్న్‌షిప్ స్టైపెండ్‌ కంటే గంటకు కేవలం మూడు డాలర్లు (సుమారు రూ.250) మాత్రమే పెంచుతామని కంపెనీ ప్రతిపాదించింది. సదరు కంపెనీ హెచ్‌1బీ వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి నిరాకరించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ అభ్యర్థికి ‘బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్’ అనే రోల్‌ను ఆఫర్ చేశారు. ఇది భవిష్యత్తులో కెరీర్ వృద్ధిని దెబ్బతీస్తుందని ఆ టెక్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంఎస్‌ డిగ్రీ ఉన్న వ్యక్తికి గంటకు మూడు డాలర్లు పెంచడం అంటే అది నైపుణ్యాన్ని అవమానించడమే. ఇక్కడ ఉండటం వృధా అనిపిస్తోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఉంది’ అని ఆ నిపుణుడు పేర్కొన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్ చాలా దారుణంగా ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారికే కాల్స్ రావడం లేదు. కాబట్టి చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ‘జీతం కంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండటానికి ఉపాధి ముఖ్యం. ఉద్యోగాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని ఇంకొందరు చెబుతున్నారు. ‘స్వదేశానికి వెళ్లడం మంచిదే కానీ, అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉందని గుర్తించాలి. ఏదైనా ఆఫర్ చేతిలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం’ అని కొందరు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు

Tata Punch EV Facelift Launched at Rs 9. 69 lakh4
టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ రెడీ

ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌(పీవీ) కొత్త టాటా పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌ షోరూమ్‌ రూ.9.7 లక్షలుగా ఉంది. బ్యాటరీ యాజ్‌ ఏ సరీ్వసెస్‌(బీఏఏఎస్‌) ఫైనాన్స్‌ ఆప్షన్‌తో రూ.6.5 లక్షలు (ఎక్స్‌–షోరూమ్‌)కే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత కస్టమర్లు ప్రతి కిలోమీటరుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ ఈఐఎంలు కిలోమీటరుకు రూ.2.6 నుంచి ప్రారంభమవుతాయి. బ్యాటరీ–రేంజ్‌ పంచ్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ 40 కేడబ్ల్యూహెచ్, 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఇందులో 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ను సింగిల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో జత చేశారు. ఈ పవర్‌ట్రెయిన్‌ సింగిల్‌ చార్జ్‌పై ఏఆర్‌ఏఐ–సర్టిఫైడ్‌ 468 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. వాస్తవ డ్రైవింగ్‌ పరిస్థితుల్లో 355 కిలోమీటర్ల కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇక 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇది ఏఆర్‌ఏఐ ప్రమాణాల ప్రకారం 365 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ మోడల్‌లో 65 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీనితో బ్యాటరీని 26 నిమిషాల్లో 20–80% వరకు చార్జ్‌ చేయవచ్చు, 15 నిమిషాల్లో 135 కి.మీ రేంజ్‌ టాప్‌–అప్‌ చేయవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్‌లో 40 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో 350 కిలోమీటర్ల రియల్‌–వరల్డ్‌ రేంజ్‌ అందించే తొలి కారు టాటా పంచ్‌ ఈవీగా రికార్డు సృష్టిస్తోందని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు.

Swiss Drug Major Novartis AG To Sell India Arm To ChrysCapital-Led Group5
క్రిస్‌ క్యాపిటల్‌ చేతికి నోవార్టిస్‌ 

న్యూఢిల్లీ: స్విస్‌ దిగ్గజం నోవార్టిస్‌ ఏజీ తాజాగా దేశీ విభాగంలో మెజారిటీ వాటా విక్రయించింది. దేశీ ఫార్మా బిజినెస్‌ నోవర్తిస్‌ ఇండియా లిమిటెడ్‌లో 70.68 శాతం వాటా అమ్మివేసేందుకు క్రిస్‌క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,446 కోట్ల విలువైన డీల్‌కు తెరతీసింది. 2026 అక్టోబర్‌–డిసెంబర్‌కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా. కాగా.. తాజా డీల్‌ నేపథ్యంలో నోవార్టిస్‌ ఇండియా వాటాదారులకు క్రిస్‌క్యాపిటల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనల ప్రకారం పబ్లిక్‌ నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేపట్టవలసి ఉంది. వెరసి షేరుకి రూ. 860.64 ధరలో 64,19,608 షేర్ల కొనుగోలుకి ఆఫర్‌ ఇవ్వనుంది. ఇందుకు రూ. 552 కోట్లకుపైగా వెచి్చంచనుంది. నోవార్టిస్‌ గ్రూప్‌ పూర్తి అనుబంధ సంస్థ నోవార్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రయివేట్‌ ద్వారా నోవర్తిస్‌ ఏజీ దేశీయంగా కార్యకలాపాలు కొనసాగించనుంది. హైదరాబాద్‌లోని నోవార్టిస్‌ కార్పొరేట్‌ సెంటర్, దేశీయంగా 300 ప్రాంతాలలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌టీ బృందాలు హెల్త్‌కేర్‌ విభాగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోవార్టిస్‌ ఇండియా షేరు బీఎస్‌ఈలో అమ్మకందారులు కరవుకావడంతో 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ను తాకి రూ. 997 వద్ద నిలిచింది.

Brigade Group Debuts Flagship Brigade Showcase in Hyderabad6
మూడేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ మార్కెట్లో ప్రాజెక్టులపై వచ్చే 3 సంవత్సరాల్లో సుమారు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈడీ అమర్‌ మైసూర్‌ తెలిపారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మొదలైన వాటికి సంబంధించి సుమారు 3.5 మిలియన్‌ చ.అ. అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇటీవలే దాదాపు రూ. 500 కోట్లతో 4.03 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు కొనసాగుతుండగా, మరో రెండింటిని ప్రారంభించబోతున్నామన్నారు. తమ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్‌ కీలక మార్కెట్‌గా ఉంటుందని అమర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో బ్రిగేడ్‌ షోకేస్‌ పేరిట రెండు రోజుల ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
Advertisement