Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Young Professional Caught Scrolling On Reddit During Overtime1
ఓవర్‌టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..

ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు అలాంటిదే.. మరొకటి ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.ఒక 21 ఏళ్ల యువకుడు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ.. తనను తానే సరదాగా 'కార్పొరేట్ మజ్దూర్' (లేబర్) అని చెప్పుకున్నాడు. అతడికి కేటాయించిన పనులన్నింటినీ ఒక గంట ముందే పూర్తి చేశాడు. మేనేజర్ సాయంత్రం 6 గంటలకే వెళ్లిపోయారని భావించి, ఓవర్‌టైమ్ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఉండిపోయాడు. పని లేకపోవడంతో అతడు తన మొబైల్‌లో రెడిట్ నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుండగా, రాత్రి 8 గంటల సమయంలో.. మేనేజర్ అతని డెస్క్ దగ్గర కనిపించాడు.మేనేజర్ అతన్ని చూసి ఎందుకు పని చేయడం లేదు? అని ప్రశ్నించాడు. తనకు అప్పగించిన పనులన్నీ పూర్తయ్యాయని చెప్పగానే.. అయితే ఇంకో పని అడుగు అని మేనేజర్ పేర్కొన్నారు. అక్కడితో ఆ విషయం ఆగలేదు. మేనేజర్.. సీనియర్ మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇచ్చి, ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అన్నది గమనించమని చెప్పాడట. ముఖ్యంగా తననే ఉదాహరణగా చూపిస్తూ, ఇలాగే ఖాళీగా ఉంటే ఓవర్‌టైమ్ జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.జరిగిన సంఘటన ద్వారా.. తాను టార్గెట్ అయ్యానని ఆ యువకుడు బాధపడ్డాడు. అదే సమయంలో ఇతర ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుండగా, వారు మాత్రం మేనేజర్ కంట పడలేదు. సహోద్యోగులు ఈ పరిస్థితిని ఆఫీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా తీసుకుని, కొత్తగా వచ్చిన ఉద్యోగిని క్లాస్‌లో పిల్లాడిని మందలించినట్లు మందలించడాన్ని చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Full Demand In UPVC Doors and Windows Know The Details Here2
మార్కెట్లో ఫుల్ డిమాండ్!.. అందుబాటు ధరలోనే..

ఎవరు ఇంటికొచ్చినా స్వాగతం పలికేవి ఇంటి తలుపులే.. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించినవి వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అన్‌ప్లాస్టిసైజ్డ్‌ పాలీవినైల్‌ క్లోరైడ్‌(యూపీవీసీ) తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. – సాక్షి, సిటీబ్యూరోసౌకర్యాలెన్నో..యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం.సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీలు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారు 30 ఏళ్లు.యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పుపట్టడం వంటివి ఉండవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. నష్టం చాలా వరకు తగ్గుతుంది.యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇంట్లో విద్యుత్‌ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే యూపీవీసీ పర్యావరణహితమైనవి. అంతేకాకుండా వీటికి ఉండే స్కూలు, గ్రిల్స్‌ బయటకు కనిపించవు.

Hyderabad Tops GCC Office Leasing with 6 5 Million Sq Ft in Just 12 Months3
రియల్‌ఎస్టేట్‌: 12 నెలలు.. 65 లక్షల చదరపు అడుగులు

హెచ్‌–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్‌ హాట్‌ ఫేవరెట్‌గా మారుతోంది. – సాక్షి, సిటీబ్యూరో గత ఏడాది హైదరాబాద్‌లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్‌లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్‌ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.వేకెన్సీ 18.2 శాతం.. ఏటేటా హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల మార్కెట్‌ సరికొత్త రికార్డ్‌లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్‌ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్‌ క్వార్టర్‌లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్‌ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్‌ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్‌ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌సైన్సెస్‌ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్‌ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.97 శాతం ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి (పెరిఫెరల్‌ బిజినెస్ట్‌ డిస్ట్రిక్ట్‌) పీబీడీ–వెస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్‌ సర్టిఫైడ్‌ ఆఫీసు స్పేస్‌ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్‌ స్పేస్‌ ఆఫీసులలో హైదరాబాద్‌ వాటా 16 శాతంగా ఉంది.

Union Bank of India, Bank of India may merge by year end4
మరో భారీ విలీనం.. ఏడాదికల్లా ఓ బ్యాంకు మాయం!

దేశంలో మరో రెండు ‍ప్రభుత్వ రంగ బ్యాంకుల భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు బ్యాంకులు అంతర్గత అంచనాలు, కార్యాచరణ ఏకీకరణ, డ్యూ డిలిజెన్స్ వంటి ప్రక్రియలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ విలీనం క్యాలెండర్ సంవత్సరం ముగిసేలోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.నాలుగైదు బ్యాంకులు చాలుప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించి నాలుగు నుంచి ఐదు బ్యాంకులకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు ఒక సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపినట్లుగా ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయడం ద్వారా బలమైన రుణదాతలను సృష్టించడమే ఈ విలీనాల లక్ష్యమట.దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌!ఈ విలీనంతో విస్తృతమైన బ్యాలెన్స్ షీట్, పెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్, విస్తారమైన కస్టమర్ బేస్‌తో దేశంలోని అగ్ర ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి అవతరించనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కలిపిన బ్యాంక్ ఆస్తులు సుమారు రూ.25.4 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీని ద్వారా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండవ అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా, అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా నిలవనుంది.మార్కెట్ క్యాప్‌లో కీలక మార్పులుమార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, ఈ విలీన బ్యాంక్ సుమారు రూ.2.13 లక్షల కోట్ల విలువతో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను అధిగమించి ఆరో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఐదవ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంకులుగా ఉన్నాయి.గత విలీనాల నేపథ్యం2017–2020 మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెగా విలీనాల్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడంతో, పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గింది. దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చడం, భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమర్థంగా పోటీ పడగల శక్తివంతమైన రుణదాతలను రూపొందించడమే ఈ కొత్త విలీనాల వెనుక ప్రభుత్వ లక్ష్యమని విధాన రూపకర్తలు స్పష్టం చేస్తున్నారు.

The Bursted Gold bubble Are William Lee Words Coming True5
పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?

బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్‌లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు.

Bank holidays in India February 20266
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..

2026 జనవరి నెల ముగిసింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా.. భారతదేశంలోని అన్ని బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.➤ఫిబ్రవరి 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 14 (శనివారం) - రెండవ శనివారం కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 18 (బుధవారం)- లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కింలోని గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 19 (గురువారం) - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 20 (శుక్రవారం) - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజ్వాల్ (మిజోరం), ఇంఫాల్ (మణిపూర్)లలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 28 (శనివారం) - నాల్గవ శనివారం కారణంగా భారతదేశం అంతటా సెలవుఅందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement