Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Is Mobile Recharge to Get Costlier Know The Details1
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.

Suzuki e Access Electric Scooter Launched At Rs 1 88 Lakh2
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనుంది.బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్‌ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Zoho Founder Tweet About Amazed As Engineer Builds Advanced AI Powered Tool3
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.ఇంతవరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool. He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026

IT Hiring in 2026 India Know The Details Here4
కొత్త ఏడాదిలో ఐటీ ఉద్యోగాలు ఇలా..

కొత్త ఏడాదిలో దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి.. రాశి కన్నా వాసికే ప్రాధాన్యమివ్వనున్నాయి. పేరుకి పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేసుకోవడం కాకుండా ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి. సిబ్బంది సంఖ్యను ఊరికే పెంచుకోవడం కన్నా ఆయా విభాగాల్లో సామర్థ్యాలున్న వారినే మరింతగా తీసుకోవాలని భావిస్తున్నాయి.ఉద్యోగాల కల్పన తీరుతెన్నులను ఈ ధోరణులు ప్రభావితం చేస్తాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో 1,800 జీసీసీలు ఉండగా, వాటిలో సుమారు 1.04 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే వారి జీతభత్యాలు 25–30 శాతం అధికంగా ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో 120 పైచిలుకు మధ్య స్థాయి జీసీసీలు ఏర్పాటవుతాయని టీమ్‌లీజ్‌ వర్గాలు తెలిపాయి. ఇవి కొత్తగా సుమారు 40,000 వరకు ఉద్యోగాలను కల్పించవచ్చని వివరించాయి. భారీ జీసీసీల్లో దాదాపు 90 శాతం సెంటర్లు ప్రస్తుతం ఇన్నోవేషన్‌ హబ్‌లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపాయి.కొత్త ఏడాదిలో ఐటీ హైరింగ్‌ అప్‌..కొత్త సంవత్సరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో మొత్తం మీద హైరింగ్‌ 12–15 శాతం పెరగవచ్చని ఐటీ స్టాఫింగ్‌ సంస్థ క్వెస్‌ కార్ప్‌ అంచనా వేస్తోంది. జీసీసీల్లో ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్‌ ప్లాట్‌ఫాంలకి డిమాండ్‌ నెలకొనడం ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, కొత్తగా రాబోయే వాటితో పాటు ఇప్పుడున్న జీసీసీలు కూడా విస్తరణ చేపట్టనున్నాయని ఏఎన్‌ఎస్‌ఆర్‌ అంచనా వేసింది. నూతన సంవత్సరంలో 80–110 కొత్త జీసీసీలు రావొచ్చని, 2,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపింది.పరిశ్రమ ఏటా 12–15 శాతం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆదాయాలు 75 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. జీసీసీల్లో నియామకాలకు సంబంధించి వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేసుకోవడానికి చేపట్టే హైరింగ్‌ వాటా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. 2025లో నికరంగా 1,50,000 మందిని తీసుకోగా, 2026లో మరో 2,00,000 మందిని తీసుకోవచ్చని వివరించారు. అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) 14–18 శాతం ఉంటోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జీసీసీల్లో స్థూల నియామకాలు 5,00,000 స్థాయికి చేరొచ్చని వివరించారు.ద్వితీయ శ్రేణి నగరాలు కీలకం..జీసీసీ విస్తరణ ప్రణాళికల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 13–15 శాతం వాటా వీటిది ఉంటుందని భావిస్తున్నారు. దీనితో కొత్త నిపుణులు లభించడంతో పాటు వ్యయాలు మరీ పెరగకుండా చూసుకోవడానికి కూడా కంపెనీలకు వెసులుబాటు లభిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే 7 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా మార్కెట్లలో జాబ్‌ పోస్టింగ్స్‌ వార్షికంగా 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు 20–30 శాతం తక్కువగా ఉండటంతో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, మంగళూరులాంటి నగరాలు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయని వివరించారు.

Aviva Life Introduces Aviva Smart Vital Plan Term Insurance5
అవీవా లైఫ్‌ నుంచి కొత్త టర్మ్‌ ప్లాన్‌

అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్‌ వైటల్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్‌లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్‌ అష్యూర్డ్‌ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్‌ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్‌ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.

BMW Hits Record High Sales in India6
బీఎండబ్ల్యూ కార్లు.. రికార్డు స్థాయిలో విక్రయాలు

జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ, మనదేశంలో గతేడాది రికార్డు స్థాయిలో కార్లు విక్రయించినట్లు తెలిపింది. 2025లో మొత్తం 18,001 కార్లను విక్రయించామని, ఇందులో 730 యూనిట్లు మినీ బ్రాండ్‌కు చెందినవని ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది(2024)15,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 14% అధికం.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, సులభతర ఫైనాన్సింగ్‌ అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. దేశీయ లగ్జరీ ఎలక్ట్రిక్‌ విభాగంలో అత్యధిక వాటా కలిగిన ఈ సంస్థ గతేడాదిలో 3,573 ఈవీ కార్లను విక్రయించింది. గ్రూప్‌ మొత్తంగా 2025లో 23,842 వాహనాలను విక్రయించామని.. ఇందులో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్లు 18,001 ఉండగా, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ బైక్‌లు 5,841 ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ మూడు బ్రాండ్లలో కలిపి మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ‘‘మునుపెన్నడూ లేనంతగా 2025లో 18,001 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాము. వార్షిక ప్రాతిదికన అమ్మకాలు 14% వృద్ధి నమోదు కావడం లగ్జరీ కార్లపై కస్టమర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్మదీప్‌ సింగ్‌ బర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement