Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mahindra Launches Republic Day Limited Edition Tractors1
మహీంద్రా ‘రిపబ్లిక్‌ డే’ ట్రాక్టర్లు

ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్‌ సంస్థ తమ యువో టెక్‌ప్లస్‌ 585 డీఐ 4డబ్ల్యూడీ శ్రేణి ట్రాక్టర్లలో లిమిటెడ్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. త్రివర్ణ పతాక స్ఫూర్తితో మూడు రంగుల్లో (మెటాలిక్‌ ఆరెంజ్, ఎవరెస్ట్‌ వైట్, మెటాలిక్‌ గ్రీన్‌), పరిమిత సంఖ్యలో ఈ ట్రాక్రట్లు లభిస్తాయని సంస్థ తెలిపింది.జెరీక్యాన్, మహీంద్రా ఫ్లాగ్‌లాంటి యాక్సెసరీలు వీటిలో ఉంటాయని వివరించింది. జనవరి 26 నుంచి ఇవి తమ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని పేర్కొంది. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్తగా తీర్చిదిద్దిన బొలెరో క్యాంపర్, బొలెరో పికప్‌ శ్రేణిని కూడా ఆవిష్కరించింది.క్యాంపర్‌లో ఐమ్యాక్స్‌ టెలీమ్యాటిక్స్‌ సొల్యూషన్, పికప్‌లో ఎయిర్‌ కండీషనింగ్, హీటింగ్‌ ఫీచర్లు ఉంటాయని వివరించింది. క్యాంపర్‌ ధర రూ. 9.85 లక్షల నుంచి, పికప్‌ ధర రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Budget 2026 Farmers and Industry Call for Biofuel Funding Tax Relief2
కేంద్ర బడ్జెట్‌ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..

పన్నులు తగ్గించాలని, బయో ఇంధనాలకు నిధుల మద్దతును వచ్చే బడ్జెట్‌లో (2026 –27) ప్రకటించాలంటూ వ్యవసాయం, అనుబంధ రంగాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరాయి. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సంస్కరణల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత వ్యవసాయ రంగం పోటీపడే విధంగా, వృద్ధికి చోదకంగా తీర్చిదిద్దాలని సూచించారు.బయో ఇంధనాలు, సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ (పెట్రోలియానికి ప్రత్యామ్నాయ ఇంధనం), గ్రీన్‌ హైడ్రెజన్‌కు రూ.2,500 కోట్లు కేటాయించాలని ఆల్‌ ఇండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) డిమాండ్‌ చేసింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న చక్కెర మిల్లులు బయో ఇంధన కేంద్రాలుగా (ఇథనాల్‌ తయారీ ప్లాంట్ల ఏర్పాటు) అవతరించేందుకు మరో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరింది.ఒక కిలో హైడ్రోజన్‌ కోసం 70 యూనిట్ల విద్యుత్‌ అవసరమని.. అదే హైడ్రోజన్‌ తయారీకి ఇథనాల్‌ వినియోగించినట్టయితే చక్కెర పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు, హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని, లీటర్‌ ఇథనాల్‌ కొనుగోలు ధరను రూ.6–8 పెంచాలని కోరింది. చక్కెర కిలో కనీస విక్రయ ధరను రూ.31 నుంచి పెంచాలని డిమాండ్‌ చేసింది. ఆర్గానిక్‌ సాగును ప్రోత్సహించాలి.. అవశేషాలు లేని, పోషకాలు పుష్కలంగా ఉండే సాగును ప్రోత్సహించాలని సొల్యుబుల్‌ ఫెర్టిలైజర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు రాజిబ్‌ చక్రవర్తి కేంద్రాన్ని కోరారు. సబ్సిడీల్లేని సొల్యుబుల్, ఆర్గానిక్, మైక్రో న్యూట్రియంట్, స్టిమ్యులంట్‌ ఫెర్టిలైజర్‌ను కీలక పదార్థాలుగా గుర్తించాలని సూచించారు. పెరిగిపోయిన వాతావరణ మార్పులు, అధి క సాగు వ్యయాలు, కారి్మకుల వ్యయాలతో కాఫీ రంగం సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు కేలచంద్ర కాఫీ ఎండీ రాణా జార్జ్‌ పేర్కొన్నారు. సాగు బీమాతోపాటు, దీర్ఘకాలానికి రుణ సాయం అందించాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకోగల రకాలపై పరిశోధనలకు పెట్టుబడుల సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

India tax-to-GDP ratio stands at 19. 6 percent, says a Bank of Baroda report3
పన్ను వసూళ్లలో ‘పవర్‌’ఫుల్‌ భారత్‌! 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక యవనికపై భారత్‌ తనదైన ముద్ర వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ వడివడిగా పరుగులు పెడుతుండటంతో పాటు.. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీనితో పన్ను వసూళ్ల విషయంలో పలు అభివృద్ధి చెందుతున్న దేశాలను భారత్‌ వెనక్కి నెట్టిందని ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’ తన తాజా పరిశోధన నివేదికలో స్పష్టం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్నుల ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం 19.6 శాతానికి చేరినట్లు తెలిపింది. డిజిటలైజేషన్, పన్నుల సరళీకరణ విధానాలే ఈ వృద్ధికి ఇంధనంగా మారాయని నివేదిక విశ్లేషించింది. సంస్కరణల ఫలితమే ఈ జోరు... పన్నుల వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని నివేదిక తేల్చిచెప్పింది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం, పన్ను విధానాల్లో పారదర్శకత పెంచడం, కార్పొరేట్‌ పన్నుల హేతుబదీ్ధకరణ, అనధికారిక ఆర్థిక వ్యవస్థను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం వంటి ఈ చర్యల వల్ల రానున్న రోజుల్లో పన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ’వివాద్‌ సే విశ్వాస్‌’ వంటి పథకాలు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు .. పారదర్శకతను పెంచాయి. ఏప్రిల్‌ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ‘నూతన ఆదాయ పన్ను చట్టం–2025’ దేశ పన్నుల చరిత్రలో మరో కీలక మలుపు కానుందని నివేదిక అంచనా వేసింది. అగ్రరాజ్యాలకు ఆమడ దూరంలోనే.. నివేదిక ప్రకారం పన్ను వసూళ్లలో పురోగతి సాధించినప్పటికీ .. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మాత్రం భారత్‌ ఇంకా వెనుకబడే ఉంది. ఆయా దేశాల పన్ను ఆదాయ నిష్పత్తితో పోలిస్తే మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యూరప్‌ అగ్రరాజ్యం జర్మనీలో ట్యాక్స్‌–టు–జీడీపీ రేషియో ఏకంగా 38 శాతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 25.6 శాతంగా నమోదైంది. వీటితో పోలిస్తే 19.6 శాతంతో భారత్‌ ఇంకా వెనుకబడే ఉంది. అయితే మన జనాభా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ అంతరాన్ని తగ్గించే సత్తా భారత్‌కు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆసియాలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాల కంటే భారత్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుండటం విశేషం. ఈ విషయంలో మనం ఇతర వర్ధమాన మార్కెట్లయిన హాంకాంగ్‌ (13.1%), మలేషియా (13.1%), ఇండోనేషియా (12.0%) కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఆయా దేశాలకంటే మన పన్ను వసూళ్ల నిష్పత్తి ఎక్కువగా ఉండటం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో పన్నుల ఆదాయం తగ్గినప్పటికీ, ఆ తర్వాత భారత్‌ అద్భుతంగా పుంజుకుంది.

Union Budget 2026 Presentation Time Was Changed Check Here Time And Reason4
బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్

2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్‌లోని గ్రీన్‌విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.

One Week Gold Price in India From 2026 January 18 to 245
168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!

బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది. ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట.

Who Presented First Budget in India Know The Details6
దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.1860లో మొదటి బడ్జెట్1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.స్వాతంత్య్రం వచ్చిన తరువాతభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్‌.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.వీటికే ప్రాధాన్యతతొలి బడ్జెట్‌లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతొలి బడ్జెట్‌లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్‌, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

Advertisement
Advertisement
Advertisement