Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gst collections hit record high in april 20261
జీఎస్‌టీ వసూళ్ల రికార్డ్‌.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా ఏప్రిల్‌ నెలలో రూ.2.43 లక్షల కోట్ల స్థూల ఆదాయం వసూలైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూళ్లు రూ.2.23 లక్షల కోట్లతో పోల్చిచూస్తే 8.7 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఒక నెలలో అత్యధిక వసూళ్ల రికార్డు. దేశీ విక్రయాలపై జీఎస్‌టీతో పోల్చి చూస్తే, దిగుమతులపై పన్ను ఆదాయమే ఎక్కువ వృద్ధి చూపించడం గమనార్హం. దేశీ విక్రయాలపై జీఎస్‌టీ 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.దిగుమతులపై జీఎస్‌టీ 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లు వసూలైంది.సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.52,140 కోట్లు రాగా, స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.61,331 కోట్లుగా ఉంది.ఐజీఎస్‌టీ రూ.1.29 లక్షల కోట్లు వసూలైంది.రిఫండ్‌లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి.రిఫండ్‌లు సర్దుబాటు అనంతరం నికర జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్‌లో రూ.2.11 లక్షల కోటు.ఈ ఏడాది మార్చి నెలకు స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండడం గమనార్హం.7–8 శాతం వృద్ధి సాధారణమేజీఎస్‌టీ 2.0 అనంతరం ప్రతి నెలా పన్నుల ఆదాయం 7–8 శాతం మేర వృద్ధి చెందడం సాధారణంగా మారినట్టు ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కో ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ ప్రతీక్‌జైన్‌ పేర్కొన్నారు. ఇది బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు చెప్పారు. దిగుమతులపై ఆదాయం దేశీ లావాదేవీలను మించడం అన్నది దేశీ వినియోగం కొంత నిదానించడాన్ని తెలియజేస్తోందని జైన్‌ చెప్పారు.

Nationwide Mobile Alert Test India Trials Sachet Disaster Warning System2
మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత

కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్‌కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్‌ మెసేజ్‌ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.అసలేం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్‌)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్‌ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.మొబైల్ డేటా లేకపోయినా, నెట్‌వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్‌ను చేరుతుంది.అందరి రక్షణే లక్ష్యంగా..ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన

Split Counter Offers India IT Sector Risk or Reward for Mid Level Engineers3
నమ్మావో ముంచేస్తారు!

నేటి వేగవంతమైన ఐటీ రంగంలో ఉద్యోగ మార్పు అనేది సర్వసాధారణం. అయితే, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కెరీర్ విషయంలో ఎదుర్కొన్న సందిగ్ధత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. కొత్త ఉద్యోగ ఆఫర్ ఒకవైపు, ప్రస్తుత సంస్థ ఇస్తున్న స్ప్లిట్ కౌంటర్ ఆఫర్ మరోవైపు.. ఈ మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక ఒక మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పంచుకున్న అనుభవం అనేక మంది ఐటీ నిపుణుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది.ఏమిటీ సమస్య?భారతదేశంలోని ఒక ప్రముఖ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మిడ్-లెవల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సదరు ఉద్యోగికి కుటుంబ బాధ్యతలు పెరగడంతో వేతన పెంపు అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వేరే కంపెనీలో ప్రయత్నించగా తన ప్రస్తుత వేతనం కంటే సుమారు 1.5 రెట్లు ఎక్కువ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. దీంతో ఆయన తన ప్రస్తుత కంపెనీకి రాజీనామా సమర్పించారు.అయితే, ఆయనను వదులుకోవడానికి ఇష్టపడని ప్రస్తుత యాజమాన్యం బయటి ఆఫర్‌తో సమానమైన వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ పెంపును ఒకేసారి కాకుండా కొంత భాగాన్ని వెంటనే, మిగిలిన భాగాన్ని కొన్ని నెలల తర్వాత ఇస్తామని (స్ప్లిట్ ఆఫర్) యాజమాన్యం ప్రతిపాదించింది. దీనిని డాక్యుమెంట్ చేస్తామని హామీ ఇచ్చినా ఈ పరిస్థితి ఆయనను గందరగోళానికి గురిచేసింది.నెటిజన్ల భిన్న అభిప్రాయాలుఈ అనుభవాన్ని ‘బయటి ఆఫర్ లేదా కౌంటర్ ఆఫర్.. ఏది ఎంచుకోవాలి’ అనే శీర్షికతో సదరు ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారిలో మెజారిటీ వర్గం మాత్రం ‘కౌంటర్ ఆఫర్‌ను అంగీకరించకుండా, కొత్త సంస్థకే వెళ్లడం ఉత్తమం’ అని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!నెటిజన్లు లేవనెత్తిన అంశాలుఒకసారి మీరు రాజీనామా చేశారంటే మీరు సంస్థను వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారని యాజమాన్యానికి స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కంపెనీలో ఏవైనా లే-ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) జరిగితే ముందుగా టార్గెట్ అయ్యే అవకాశం మీకే ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.కంపెనీలు వాగ్దానం చేసినట్లుగా కొన్ని నెలల తర్వాత రెండో విడత పెంపును ఇస్తాయనే దానికి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. వ్యాపార పరిస్థితులు మారితే ఆ వాగ్దానాలు పాటించరని అనుభవజ్ఞులు గుర్తు చేస్తున్నారు.ఒక కొత్త సంస్థలో చేరడం వల్ల కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడమే కాకుండా మీ మార్కెట్ విలువ పెరుగుతుందని, అదే పాత సంస్థలో ఉండటం వల్ల కెరీర్ ఎదుగుదల మందగించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాకుండా పని సంస్కృతి, భవిష్యత్తు అవకాశాలు, మానసిక ప్రశాంతతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Gold Rate Today (2nd May 2026) After Crash, Check Latest Prices4
పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

India AI Crossroads Build Global Tech or Harness Existing Tools5
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.ఆలోచనలు పాతబడ్డాయా?భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్‌ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.విశాల్ సిక్కా దార్శనికతవిశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌ల బేస్డ్‌ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Meta Shocks Employees: 10 Percent Job Cuts Amid AI Spending Spree6
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్‌ ఫిక్స్‌

సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణలో భాగంగా మే 20వ తేదీ నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మెటా శ్రామిక శక్తిలో తీవ్ర అనిశ్చితిని నింపుతోంది.ఏమిటీ తాజా పరిణామాలు?ఇటీవల కంపెనీ నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే మెటా ఆర్థికంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థాగత మార్పులు తప్పవని యాజమాన్యం స్పష్టం చేసింది. మే 20న ఈ మొదటి దశలో 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2026 పూర్తయ్యే నాటికి ఈ ఉద్యోగ కోతలు మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.యాజమాన్యం ఏమంటోంది?మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్లె గేల్ మాట్లాడుతూ, తదుపరి రౌండ్ల తొలగింపులు ఉండబోవనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘మేము అత్యంత పోటీ వాతావరణంలో పనిచేస్తున్నాం. వ్యాపార ప్రాధాన్యతలను బట్టి జట్లు, ఖర్చుల విషయంలో చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన కొంతమందిని వేరే విభాగాలకు తరలించే ప్రయత్నం చేస్తామని, మానవతా దృక్పథంతో బాధితులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.ఏఐ పెట్టుబడుల ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా ఉద్యోగాల కోతలకు కారణం కాదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంపెనీ తన బడ్జెట్‌లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం మెటా దాదాపు 125 బిలియన్‌ డాలర్ల నుంచి 145 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ‘ఒక విభాగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మరో విభాగంలో వ్యయం తగ్గించక తప్పదు’ అని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ విస్తరణ కోసం ఉద్యోగ భద్రతను బలి పెడుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.ఉద్యోగుల్లో ఆందోళనప్రస్తుతం మెటాలో 77,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. పనితీరులో సామర్థ్యాన్ని పెంచే పేరుతో సాగుతున్న ఈ తొలగింపుల వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్గత ఫోరమ్‌లలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పారదర్శకమైన కమ్యూనికేషన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Advertisement
Advertisement
Advertisement