ప్రధాన వార్తలు
జీడీపీ వృద్ధి 7.4 శాతం
న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల బలమైన పనితీరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని, ప్రపంచంలో వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన గుర్తింపును కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ జీడీపీ స్థిర ధరల వద్ద 2025–26లో రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని, 2024–25లో ఉన్న రూ.187.97 లక్షల కోట్ల కంటే 7.4 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. 6.3–6.8 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చన్న గత అంచనాల కంటే ఇది ఎక్కువ. ఆర్బీఐ అంచనా 7.3 శాతం కంటే అధికం కావడం గమనార్హం. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ సెపె్టంబర్ త్రైమాసికంలోనూ బలమైన పనితీరు (8.2 శాతం) నమోదు చేయడం తెలిసిందే. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ ఈ మేరకు తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలతో 375 ఉత్పత్తులపై ధరలు దిగిరావడం, ఆదాయపన్ను కొత్త విధానంలో మినహాయింపులను గణనీయంగా పెంచడం, కార్మిక సంస్కరణలు, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం, ద్రవ్యోల్బణం దిగిరావడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడాన్ని సానుకూలతలుగా గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) 7.3 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది. తయారీ 7 శాతం తయారీ రంగం 7 శాతం వృద్ధిని సాధిస్తుందని (గత ఏడాది 4.5 శాతం) ప్రభుత్వం అంచనా వేసింది. సేవల రంగంలో వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.2 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతానికి విస్తరిస్తుందని
బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్ విల్లా
ఇప్పటివరకూ భారత్లో విలాసవంత కార్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన గ్లోబల్ ఆటో దిగ్గజాలు తాజాగా దేశీ రియల్టీ రంగంపై కన్నేశాయి. ప్రధాన ప్రాంతాలలో రియల్టీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దేశీయంగా సరికొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయనున్నాయి. ఇందుకు 2026 కేలండర్ ఏడాదిలో తెరతీయనున్నాయి. ముంబై, చెన్నై సహా ప్రధాన నగరాలు, గుర్గావ్, హైదరాబాద్ తదితర అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు వివిధ రియల్టీ డెవలపర్స్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగ్జరీ కార్ల దిగ్గజం లాంబోర్గిని ప్రమోటర్ కుటుంబం దేశీ రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుర్గావ్లో విలాసవంత బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మెర్సిడిస్ బెంజ్ రియల్టీ డెవలపర్స్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఎండబ్ల్యూ సైతం దేశీ రియల్టీ గ్రూప్లతో చర్చలు నిర్వహిస్తోంది. అయితే బ్రాండెడ్ ప్రాజెక్ట్ చేపడుతుందా లేక .. రియల్టీలో కార్యకలాపాలు కలిగిన క్రియేటివ్ డిజైన్ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ డిజైన్వర్క్స్పై ముందుకెళుతుందా అనే విషయంపై సందిగ్ధత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ముంబై, చెన్నైలలో హైపెర్ఫార్మెన్స్ కార్లు, ఎస్యూవీలు రూపొందించే లాంబోర్గిని ప్రమోటర్ టోనినో ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు లాంబోర్గిని టోనినో ఎస్పీఏ ద్వారా చర్చలకు తెరతీశారు. కార్ల దిగ్గజం లాంబోర్గినీ వ్యవస్థాపకుడు ఫెరూసియో లాంబోర్గిని కుమారుడితడు. కాగా.. ఇప్పటికే దుబాయ్, మియామీ(ఫ్లోరిడా)లలో ప్రాజెక్టులు చేపట్టిన గ్లోబల్ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ దేశీ ప్రణాళికలు వెల్లడికావలసి ఉంది. ఈ బాటలో ఆటోమొబైల్ దిగ్గజాలేకాకుండా దేశీయంగా రియల్టీ రంగ కార్యకలాపాలపట్ల ప్రీమియం వెల్నెస్ బ్రాండ్లు, ఫ్యాషనబుల్ క్లాతింగ్ సంస్థలు, యూరోపియన్ డిజైన్ స్టూడియోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన నగరాలలో బ్రాండెడ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు రంగాల గ్లోబల్ దిగ్గజాలు ఇప్పటికే డెవలపర్స్తో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. సరికొత్త బ్రాండ్లతో సరికొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు.. నాణ్యతా ప్రమాణాలకు హామీనిచ్చేందుకు వీలుండటంతో దేశీయంగా రియల్టీ డెవలపర్లు సైతం గ్లోబల్ దిగ్గజాలవైపు చూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సంప్రదాయ బ్రాండెడ్ రెసిడెన్షియల్ మార్కెట్లయిన యూఎస్, యూఏఈ, థాయ్లాండ్, వియత్నాం తదితరాల జాబితాలో భారత్ సైతం చేరనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బ్రాండెడ్ రెసిడెన్స్ సరఫరాలు 55 శాతం జంప్చేసినట్లు శావిల్స్ బ్రాండెడ్ రెసిడెన్స్ 2025–26 నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా వియత్నాం, థాయ్లాండ్తోపాటు.. భారత్లో వృద్ధి సహకరించినట్లు తెలియజేసింది. ఈ ప్రభావంతో టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(తాజ్ హోటళ్లు) సైతం చెన్నైలో బ్రాండెడ్ రెసిడెన్సీవైపు దృష్టి పెట్టడం గమనార్హం! కారణాలున్నాయ్.. ప్రస్తుతం లైవ్ బ్రాండెడ్ రెసిడెన్స్ ప్రాజెక్టుల విషయంలో భారత్ ప్రపంచంలో ఆరో ర్యాంకును ఆక్రమిస్తోంది. గ్లోబల్ సరఫరాల్లో నాలుగో స్థానంలో నిలుస్తోంది. చేపట్టనున్న ప్రపంచ ప్రాజెక్టులలో పదో ర్యాంకును అందుకుంది. దేశీ రియల్టీ రంగంలో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించిన గ్లోబల్ బ్రాండ్లలో ఫోర్ సీజన్స్, రిట్జ్ కార్ల్టన్, మారియట్, అర్మాణీ కాసా, వెర్సేస్ హోమ్, ట్రంప్ ఫ్యామిలీ, హయత్, పుల్మ్యాన్, ఐటీసీ, హిల్టన్ తదితరాలున్నాయి. ఈ బాటలో తాజాగా లగ్జరీ బ్రాండ్ల ఆటో దిగ్గజాలు క్యూ కట్టడం గమనించదగ్గ అంశం!ఆకర్షణీయ మార్కెట్గా ఒకప్పుడు దిగ్గజాల లక్ష్యంగా నిలిచిన దుబాయ్, మియామీ, లండన్ బాటలో ఇప్పుడు భారత్ భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రాండెడ్ రెసిడెన్స్లకు దేశీయంగా అత్యంత సంపన్నవర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. నోయిసిస్ క్యాపిటల్ అడ్వయిజర్స్ విశ్లేషణ ప్రకారం టైర్–1 మార్కెట్లు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల బాటలో టైర్–2 పట్టణాలు సైతం దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, గోవా, సూరత్ తదితరాలున్నాయి. గత మూడేళ్లుగా లగ్జరీ ప్రాజెక్టులు జోరందుకోవడం ఇందుకు తోడ్పాటునిస్తోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇది రెండోసారి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
విమానం మొత్తాన్ని బుక్ చేసుకుని..
ప్రత్యేక విమానం.. వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు, క్రీడాకారుల ప్రయాణ సంబంధ వార్తల్లో తరచూ వినే పదం. ప్రైవేట్ జెట్స్లో ప్రయాణం వీరికే పరిమితం కాలేదు. వ్యాపారులు, అధిక ఆదాయ వర్గాల సౌలభ్యం కోసం క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా చార్టర్డ్ విమానాల్లో (Charter flights) భారతీయ నగరాలతోపాటు విదేశాలూ విహరిస్తున్నారు. తమ వాళ్లను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ను ఎల్లప్పుడూ గుర్తుండేలా చేస్తున్న సంపన్నుల సంఖ్యా పెరుగుతోంది. ఇక చార్జీలంటారా.. ‘ప్రత్యేకం’ కదా. ఆ మాత్రం ఉంటుంది మరి. ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా వంటి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ నిర్దేశించిన సమయం, రూట్లలో సేవలు అందిస్తాయి. మనతోపాటు ఇతర ప్రయాణికులూ విమానంలో ఉంటారు. విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్న సందర్భాలూ కోకొల్లలు. నాన్ షెడ్యూల్డ్ సర్వీసులు ఇందుకు భిన్నం. విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్న కస్టమర్ తనకు అనుకూల సమయానికి బయల్దేరవచ్చు. పెద్ద కంపెనీల బిజినెస్ మీటింగ్స్, పెళ్లిళ్ల సీజన్లో వీటికి డిమాండ్ ఎక్కువ. విమానం అందుబాటులో ఉండి, వాతావరణం అనుకూలించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఉంటే చాలు.. జస్ట్ 4 గంటల్లో చార్టర్ టేకాఫ్ అవుతుందని ప్రైవేట్ విమానయాన రంగంలో ప్రముఖ అగ్రిగేటర్ ‘జెట్ సెట్ గో’ చెబుతోంది. రెండు దశాబ్దాల్లో.. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ హోల్డర్స్ 2025 సెప్టెంబర్ నాటికి భారత్లో 133 మంది ఉన్నారు. వీరి వద్ద 455 ఎయిర్క్రాఫ్ట్స్ (విమానాలు+హెలికాప్టర్లు) ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం 156 ఎయిర్క్రాఫ్ట్స్తో 44 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. 20 ఏళ్లలో ఆపరేటర్లు మూడురెట్లు, ఎయిర్క్రాఫ్ట్స్ దాదాపు మూడింతలకు చేరుకున్నాయంటే.. ప్రైవేట్ జెట్స్కు మన దేశంలో ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. 412 విమానాలు, హెలికాప్టర్లతో 2012లో అత్యధికంగా 147 మంది ఆపరేటర్లు ఉండేవారు.హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 7 కంపెనీల వద్ద 11 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ హోల్డర్స్ వద్ద ఉన్న విమానాల్లో గరిష్టంగా 37 మంది ప్రయాణించవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్లైన్స్ సైతం చార్టర్డ్ సర్వీసులను అందిస్తున్నాయి. షెడ్యూల్డ్, నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు గత ఆర్థిక సంవత్సరంలో 50,563 ప్రత్యేక సర్వీసులతో మొత్తం 8,76,646 మందిని దేశ, విదేశాల్లోని గమ్యస్థానాలకు చేర్చాయి. చార్టర్స్ రకాలుప్రైవేట్ చార్టర్: ఒక సమూహం లేదా వ్యక్తి కోసం మొత్తం విమానాన్నిఅద్దెకు తీసుకోవడం. పబ్లిక్ చార్టర్: ట్రావెల్ కంపెనీలు చార్టర్స్లో వ్యక్తిగత సీట్లను విక్రయిస్తాయి. నిర్దిష్ట టూర్ ప్యాకేజీలతో పర్యాటక గమ్యస్థానాలకు ఈ సర్వీసులు నడుపుతాయి. కార్గో చార్టర్: సరుకు రవాణా కోసం ప్రత్యేక ప్రైవేట్ విమానాలు.తేడా ఏమిటంటే.. షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్: కేటాయించిన సమయంలో నిర్దేశిత విమానాశ్రయాలకు ప్రయాణిస్తాయి. ప్రామాణిక సౌకర్యాలు ఉంటాయి.ఎవరైనా సీటు బుక్ చేసుకోవచ్చు. నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్: సౌకర్యవంతమైన సమయం, అనుకూలమైన సేవలు ఉంటాయి. పూర్తిగా ప్రైవేట్. వరంగల్ వంటి చిన్న విమానాశ్రయాలకూ వెళ్లవచ్చు. - నూగూరి మహేందర్
అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ఈమె కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా.. రష్మిక మందన్న సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలలో రూ.4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.కొడగు జిల్లాలోని విరాజ్పేటకు చెందిన రష్మిక.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈమె తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు.విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లిహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ.. వారు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26న విజయ్ - రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..
బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?
కార్పొరేట్
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్: సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్
సోలార్ రూఫ్టాప్లో టాటా పవర్ రికార్డు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు రూ. 5కోట్ల చెక్
విల్సన్కు 'టాటా'.. ఎయిరిండియా సీఈఓ కోసం కసరత్తు!
అమెరికా అలా చేసిందంటే మనకు దెబ్బే..
భలే మంచి బాస్! కార్పొరేట్ ఆఫీస్లో వైరల్ వీడియో
కంటి జబ్బులకు వినూత్న చికిత్స
బ్యాంకులకు ఎల్డీఆర్ టెన్షన్!
పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు
20 నిమిషాల్లో కోటీశ్వరుడైన ట్రేడర్!
బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖా...
బంగారం, వెండి ధరలు.. డబుల్ షాక్!
దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు ఆపలేదు. వరుసగా ర...
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ...
8 కంపెనీల లిస్టింగ్కు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రెండేళ్లుగా కళకళలా...
చెక్కుల తక్షణ క్లియరెన్స్ రెండో దశ వాయిదా
చెక్కుల చెల్లింపులను వేగవంతం చేసే రెండో దశ అమలును ...
న్యూజిలాండ్ ఎఫ్టీఏతో ఎగుమతులకు దన్ను
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంత...
బ్యాంకుల ఆరోగ్యం ఎంతో మెరుగు
బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఎం...
జపాన్ను దాటిన భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస...
ఆటోమొబైల్
టెక్నాలజీ
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.Start the New Year the smart way with #BSNL.Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026
జియో ‘కొత్త’ ప్లాన్లు.. ఇక ఏడాదంతా సిమ్ యాక్టివ్
ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికమ్ కంపెనీ రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు చవక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి నెలా నంబర్ ను రీఛార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏడాది పొడవునా సిమ్ను యాక్టివ్గా ఉంచుకునే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..రూ.3,599 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.రూ .1,748 ప్లాన్కాలింగ్ ఒక్కటే ఉంటే చాలు మొబైల్ డేటా అవసరం లేదు అనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో వ్యాలిడిటీ 336 రోజులు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ ఓన్లీ ప్యాక్ కాబట్టీ ఎలాంటి డేటా రాదు. 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియోఏఐ క్లౌడ్, జియో టీవీలకు యాక్సెస్ పొందుతారు.
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్లు Wi-Fi కనెక్షన్ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్వర్క్ల మధ్య సజావుగా హ్యాండ్ఓవర్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్
పర్సనల్ ఫైనాన్స్
ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా?
దైనందిన ఆర్థిక జీవనంలో మనకు అనేక అనుమానాలు, సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్, బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్.. ఇలా భిన్న అంశాలపై పాఠకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’..రియల్టీ..ఆదాయంతో పోల్చితే గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ ఎంతవరకూ ఉండాలి?సాధారణంగా అయితే గృహరుణంపై చెల్లించే ఈఎంఐగా మీ ఆదాయంలో 30 శాతాన్ని మించకపోతే మంచిది. 35–40 శాతమైతే కాస్త రిస్కే. ఎందుకంటే నెలవారీ క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇక 40 శాతం దాటితే వద్దనే చెప్పాలి. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగలటం చాలా కష్టమవుతుంది. మెడికల్, ఉద్యోగ ఎమర్జెన్సీలు తలెత్తితే మేనేజ్ చేయటం కష్టం. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇరుక్కుపోయే ప్రమాదముంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంపాదిస్తుంటే, 6–12 నెలల ఎమర్జెన్సీ నిధి చేతిలో ఉన్నపుడు, ఇతరత్రా రుణాలేవీ లేనప్పుడు మాత్రం 40 శాతానికి అటూ ఇటుగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు.బ్యాంకింగ్..నా భార్యతో జాయింట్గా ఎఫ్డీలను ఓపెన్ చేయొ చ్చా? పన్ను ప్రయోజనాలు?ఇద్దరూ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేయటానికి ఇబ్బందులుండవు. పన్ను ప్రయోజనాలు ఫస్ట్ హోల్డర్కే వర్తిస్తాయి. ఎఫ్డీ తెరిచేటపుడు దాన్ని విత్డ్రా చేయటం, రెన్యూవల్ చేయటం వంటి హక్కులు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉండేలా స్పష్టంగా పేర్కొనాలి. అలాకాని పక్షంలో ఫస్ట్ హోల్డర్కే ఆ హక్కులుంటాయి. తన మరణం తరువాతే మిగిలిన వ్యక్తికి వస్తాయి. ఇద్దరు కలిసి ఎఫ్డీ తెరిటేపుడు ఒకరు సీనియర్ సిటిజన్ అయితే వారినే ఫస్ట్ హోల్డర్గా పేర్కొంటే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుంది. లేని పక్షంలో ఇద్దరిలో ఎవరు తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వారి పేరిట తెరిస్తే... వడ్డీపై పన్ను తక్కువ చెల్లించాల్సి వస్తుంది.బంగారంబంగారం ఆన్లైన్లో కొన్నాను. దీన్ని తనఖా పెట్టవచ్చా?ఆన్లైన్లో కాయిన్లు, ఆభరణాల రూపంలో కొంటే దాన్ని తనఖా పెట్టవచ్చు. స్వచ్ఛతకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయి. వాటికి లోబడి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తనఖా పెట్టుకుంటాయి. ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బంగారం 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉండాలి. హాల్మార్క్ ఉంటే ఈజీగా అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులైతే ప్రయివేటు మింట్ల నుంచి వచి్చన కాయిన్లను 50 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాంటి పక్షంలో ముత్తూట్, మణప్పురం వంటి ఎన్బీఎఫ్సీలు బెటర్. మీకు బంగారంపై రుణం సత్వరం కావాలంటే ఎన్బీఎఫ్సీలే నయం. బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటాయి.స్టాక్ మార్కెట్...ట్రేడింగ్ ఖాతా ఓపెన్ చేయడానికి నిబంధనలేంటి? సిబిల్ స్కోరు అవసరమా?ట్రేడింగ్ ఖాతా తెరవటానికి సిబిల్ స్కోరు అవసరం లేదు. కాకపోతే 18 ఏళ్లు నిండి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఉండాలి. షేర్లలో ఇన్వెస్ట్ చేయటం వరకూ పర్వాలేదు గానీ... ఎఫ్అండ్ఓ, కమోడిటీ–కరెన్సీ డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయాలంటే మాత్రం ఆదాయపు ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ఐటీఆర్, 3 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, నెట్వర్త్ సర్టిఫికెట్ వంటివాటిలో ఏదైనా సరిపోతుంది. షేర్లను హోల్డ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. మనకైతే మామూలు కేవైసీ సరిపోతుంది. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఎన్ఆర్ఈ ఖాతా అవసరం.మ్యూచువల్ ఫండ్స్...సిప్లలో ఎంతశాతం రాబడిని ఆశించవచ్చు?సిప్లలో రాబడులనేవి అది ఏ తరహా ఫండ్.. ఎంతకాలం ఇన్వెస్ట్ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పదేళ్లకు మించి చూస్తే... లార్జ్క్యాప్ ఫండ్లు 10–012 శాతం, మిడ్ క్యాప్ ఈక్విటీ 12–15 శాతం, స్మాల్ క్యాప్ ఈక్విటీ 14–18 శాతం, హైబ్రిడ్ ఫండ్లు 8–10 శాతం, డెట్ ఫండ్లు 5–7 శాతం రాబడులను అందించిన పరిస్థితి ఉంది. సిప్లు కనీసం ఏడేళ్లకు పైబడి చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. స్వల్పకాలా నికైతే ఒకోసారి నెగెటివ్ రాబడులూ ఉండొచ్చు. మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజం. వాస్తవ రాబడులనేవి మార్కెట్ సైకిల్స్, మీరు ఎంచుకున్న ఫండ్ నాణ్యత, మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలమైతేనే ‘సిప్’ చెయ్యండి.ఇన్సూరెన్స్హెల్త్ ఇన్సూరెన్స్కు టాప్–అప్ చేయించడం మంచిదేనా?హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువగా ఉందని భావిస్తే టాప్–అప్ మంచిదే. మీ అవసరాలు, బడ్జెట్ కూడా చూసుకోవాలి. టాప్–అప్ మీ ఇన్సూరెన్స్ మొత్తం సరిపోని పక్షంలో మాత్రమే అక్కరకొస్తుంది. అంటే మీకు రూ.5 లక్షల బీమా ఉందనుకుందాం. రూ.10 లక్షలకు టాప్–అప్ తీసుకుంటే... మీకు అవసరం వచి్చనపుడు రూ.5 లక్షలు పూర్తయిపోయాక ఈ టాప్ అప్ మొత్తం అక్కరకొస్తుంది. అందుకని మీకు ప్రస్తుత ఇన్సూరెన్స్ సరిపోదని భావిస్తున్నపుడే టాప్–అప్ వైపు చూడాలి. మీరు యువకులై ఉండి, మీకు కవరేజీ గనక రూ.10 లక్షల వరకూ ఉందనుకుందాం. అపుడు టాప్–అప్ అవసరం చాలా తక్కువపడుతుంది.మీ సందేహాలకూ నిపుణుల ద్వారా సమాధానాలు కావాలంటే business@sakshi.com కు మెయిల్ చేయండి.
Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం
ముందుగా టాక్స్ కాలమ్ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్మెంట్ ఇయర్ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్ డిడక్షన్ను, వృత్తి పన్ను డిడక్షన్ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్ VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్ శ్లాబ్ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.ఇప్పుడు రాబోయే మార్పులు: 🔸 చట్టం సులభరీతిలో ఉంది. 🔸 నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 🔸 ఇక నుంచి అకౌంటింగ్ ఇయర్, అస్సెస్మెంట్ సంవత్సరం అని ఉండదు. 🔸 ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్ ఇన్కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 🔸 మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్ పడదు. 🔸 దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్షిప్.. టైటిల్ డీడ్స్లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 🔸 రిబేటు రూపంలో బేసిక్ లిమిట్ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్ లిమిట్... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే. 🔸 అలాగే పాత పద్ధతిలో కూడా...చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి.
70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..ఏమిటీ 70/10/10/10 ఫార్ములామీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.
పోస్టాఫీసు పథకాలు.. కొత్త వడ్డీ రేట్లు
దేశంలో పోస్టాఫీసులు అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. పోస్టాఫీసు స్కీముల్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, స్థిరమైన, కచ్చితమైన రాబడిని పొందుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఇండియా పోస్ట్ దేశంలోనే అత్యధిక స్థాయిలో చిన్న పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి వర్గానికి పథకాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పోస్టాఫీసు స్కీములు ఉన్నాయి. 2026 సంవత్సరానికి గానూ అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్టాఫీస్ పొదుపు పథకాలు.. వాటికి లభించే వడ్డీ రాబడి గురించి తెలుసుకుందాం..సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అన్ని అగ్రశ్రేణి బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఈ పథకంపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును ఈ పథకం అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా అనేది బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం. బాలికల చదువు, భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బాలిక దగ్గర నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు అమ్మాయి పేరు మీద ఎస్ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళలు, బాలికలు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పొదుపు కార్యక్రమం. పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో లభ్యమయ్యే ఈ పథకం స్థిర వడ్డీ ఆదాయంతోపాటు మూలధన సంరక్షణను అందిస్తుంది. రెండేళ్ల గరిష్ట కాల పరిమితితో ఉండే ఈ పథకాన్ని ప్రభుత్వం 2025 మార్చి 31తో నిలిపేసింది. అంతకుముందు ఖాతా తెరిచినవారికి ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది దేశంలో మంచి ఆదరణ పొందిన, స్థిర-ఆదాయ పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద కచ్చితమైన రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై వడ్డీ రేటును 7.7 శాతంగా ఉంచింది.పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (POMIS) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన, ఆమోదించబడిన పెట్టుబడి పథకం. 7.4% వడ్డీ రేటుతో, ఇది అత్యధిక రాబడినిచ్చే పథకాలలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ ఆదాయం నెలవారీగా చేతికొస్తుంది.


