Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

EPFO Big Update Can Soon Withdraw PF Money Through UPI1
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభం!

ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్‌ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్‌డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్‌మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.యాప్‌లో మీరు ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్‌గా యూపీఐ విత్‌డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు.

Delhi Hotel Rates Go Dizzyingly High On AI Summit Dates2
హోటల్‌లో ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. ఎందుకంటే?

భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్‌లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్‌లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది.

Income Tax Rules 2026 Major Tax Forms Renumbered Under New Income Tax Act 2025 Full List Explained3
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!

కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్‌లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్‌క‌మ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్‌లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.కొత్త మార్పులు➤టాక్స్ ఆడిట్‌కు సంబంధించిన పాత ఫారమ్‌లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.➤ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్‌కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.TDS & TCSకు సంబంధించిన మార్పులు➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.➤డోనీ స్టేట్‌మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్‌కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

New Mutual Fund Schemes Launched Kotak 360 ONE DSP Fresh Investment Options4
మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త స్కీములు

ముంబై: కోటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. కోటక్‌ సర్వీసెస్‌ ఫండ్‌ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్‌ఎఫ్‌వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్‌ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.360 వన్‌ ఎంఎఫ్‌ నుంచి సిఫ్‌ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్‌ మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా డైనాసిఫ్‌ ఈక్విటీ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ పేరిట స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్‌కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌ ద్వారా 25 శాతం వరకు షార్ట్‌ ఎక్స్‌పోజర్‌ తీసుకునేందుకు, డెట్‌ అలాగే ఇని్వట్స్‌లో 20 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మ్యుచువల్‌ ఫండ్స్‌ పరమైన ట్యాక్సేషన్‌ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్‌ ఉంటుందని 360 వన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో రాఘవ్‌ అయ్యంగార్‌ తెలిపారు. డీఎస్‌పీ మల్టీ అసెట్‌ ఆమ్ని ఎఫ్‌వోఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్‌పీ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ మల్టీ అసెట్‌ ఆమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ డీఎస్‌పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్‌ ఆధారిత స్కీములు, గోల్డ్‌..సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది.మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్‌ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్‌–సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్‌ హెడ్‌ సాహిల్‌ కపూర్‌ తెలిపారు.

Chinese Trading Behind Gold Price Swings Says Scott Bessent5
బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్‌ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది.

Gold silver rate predictions Analysts expected Big corrections  this week6
ఈ వారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు?

గత వారం బంగారం, వెండి మార్కెట్లు తీవ్రమైన ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఈ వారం కూడా ధరల్లో భారీ మార్పులు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలపై వ్యాపారుల దృష్టి కేంద్రీకృతమైంది.అమెరికా ద్రవ్యోల్బణ డేటా, జీడీపీ వృద్ధి రేటు, పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి సూచికలు బులియన్ ధరల దిశను నిర్ణయించనున్నాయి. అలాగే చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలు వడ్డీ రేటు తగ్గింపుల సమయంపై స్పష్టతనిచ్చే అవకాశముండటంతో, వాటిని కూడా వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో గత వారం కామెక్స్‌లో బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. ఔన్సుకు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 5,000 డాలర్ల వరకు కోలుకోవడం గమనార్హం. అయితే వెండి ఫ్యూచర్స్‌పై ఒత్తిడి కొనసాగింది. గత వారం వెండి ధరలు 2 శాతానికి పైగా తగ్గాయి.జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ – కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. “బంగారంలో కన్సాలిడేషన్, రికవరీ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ వెండి విషయంలో మాత్రం అస్థిరత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తదుపరి దిద్దుబాట్ల పట్ల జాగ్రత్త అవసరం” అని చెప్పారు.దేశీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు రూ.15,760 లేదా దాదాపు 6 శాతం పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆదివారం కూడా కమోడిటీస్ మార్కెట్ పనిచేయడం విశేషం.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విశ్లేషకుడు మానవ్ మోడీ మాట్లాడుతూ.. “డాలర్ బలపడటం, ఫెడ్ అంచనాల్లో మార్పులు, దూకుడు పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా బంగారం, వెండి అత్యంత అస్థిర వారాన్ని ఎదుర్కొన్నాయి” అన్నారు. వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తగ్గడం వంటి అంశాలు సేఫ్-హావెన్ డిమాండ్‌ను కొంత తగ్గించాయని ఆయన వివరించారు.అయితే, దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ పెట్టుబడులు కొనసాగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బులియన్‌కు మద్దతునిస్తాయని అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా చూస్తే, వచ్చే వారం కూడా బంగారం, వెండి మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు. అయినప్పటికీ, ధరలు తగ్గినప్పుడు ముఖ్యంగా బంగారంలో స్వల్పకాలిక కొనుగోలు అవకాశాలు కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement