ప్రధాన వార్తలు
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్..
ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్లోని ఒక బ్రాంచ్లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్’ ట్రిపుల్ కెమెరాతో..
న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్ పార్ట్నర్షిప్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.50 మెగా పిక్సెల్(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ జీస్ ఫ్రంట్ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్లతో ప్రీమియం లుక్ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేటుకు, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తాయి.ఈ రెండూ ఆండ్రాయిడ్ 16తో కూడిన ఆరిజన్ ఓఎస్6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 11 గంటల నావిగేషన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్ తగ్గించడానికి ‘బైపాస్ ఛార్జింగ్’ సౌకర్యం కూడా ఉంది.వివో వీ70 ఇందులో స్నాప్డ్రాగన్ 7 జెన్4 ప్రాసెసర్ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.49,999కు లభిస్తుందివివో వీ70 ఎలైట్ ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్జెన్3 చిప్సెట్తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్ ధర రూ.61,999గా నిర్ణయించింది.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ కార్డులపై 10% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్ బడ్స్ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, వివో ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి.
సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..
ఓ సామాన్యుడు నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనే ఆశకు రోజురోజుకూ దూరమవుతున్నాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలు ఆలోచనను వెనక్కి నెడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ అనుమతుల జాప్యం, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్య కార్మికుల కొరత.. వంటి రకరకాల కారణాలతో తక్కువ ఆదాయం కలిగిన వారికి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు గృహాల నిర్మాణం కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం పన్నులు, రుసుములను తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సరసమైన గృహాల నిర్మాణానికి చేయూత అందిస్తే.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందని నిర్మాణ సంఘాలు సూచిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్కెట్లో సరసమైన ఇళ్ల లభ్యత మున్ముందు మరింత తగ్గిపోనుంది. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెరిగిన ఇళ్ల ధరల తీరు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. సొంతిల్లు కొనగలమా లేదా? అని సామాన్య మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అన్ని వర్గాలకు నగర మార్కెట్లో గృహాలు అందుబాటులో ఉన్నాయని, బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవచ్చని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. బడ్జెట్ ప్రధానం అనుకున్నప్పుడు విస్తీర్ణం పరంగా కొంత రాజీపడితే సరసమైన ఇళ్లు దొరుకుతాయని నిర్మాణదారులు సూచిస్తున్నారు.సొంతింటి కోసం సాయం అందుకోలేని దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని నిర్మాణ రంగ సంఘాలు కోరుతున్నాయి. భూమి ధరలు పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తోంది. శ్రీమంతులు విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ సాయం అందక సొంతంగా కట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యను గురించి అప్పట్లో నేషనల్ అర్బన్ హౌసింగ్ హ్యాబిటేట్ పాలసీ(ఎన్యూహెచ్హెచ్పీ) తీసుకొచ్చింది. వీరి కోసం కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్ట్లలో 10 నుంచి 15 శాతం భూమిని, 20–20 శాతం ఫ్లోర్ ఏరియా రేషియో(ఎఫ్ఏఆర్)ను రిజర్వ్ చేసేవారు.ఆ రకంగా ప్రైవేటు డెవలపర్లు సరసమైన గృహాలను నిర్దేశిత శాతం మేరకు నిర్మించేవారు. ప్రభుత్వం బిల్డర్లకు తక్కువ ధరలో భూమి ఇస్తే అక్కడ నిర్మాణాలు చేపట్టి తక్కువ ధరకు ఇల్లు అందించేవారు. కొత్తపేటలో నిర్మించిన హుడా కాలనీ ఇందుకు నిదర్శనం. హెచ్ఎండీఏ లే అవుట్లలోనూ ఎల్ఐజీ పేరుతో తక్కువ విస్తీర్ణంలో 60 గజాల్లో దొరికే స్థలాలు ఉండేవి. ఈ నిబంధన తొలగించడంతో 150 నుంచి 160 గజాల కంటే తక్కువ దొరకడం లేదు. దీంతో స్థలాలు కొని ఇల్లు కట్టుకుందామంటే ఖరీదుగా మారాయి.అదనపు వసూళ్లతో మరింత భారం.. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చదరపు అడుగు ధర సగటున రూ.6 వేలకు పైగానే పలుకుతోంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రూ.4 వేలకు చ.అ. విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్నా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, మెరుగైన మౌలిక సదుపాయలు ఉన్నచోట రూ.80 లక్షలు లేనిదే ఇల్లు రావడం లేదు. ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటికి రూ.కోటి పెట్టాల్సిందే. ఐటీ కారిడార్లో ఏకంగా రూ.కోట్ల పైమాటే.. అదనపు వసూళ్లతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఒక్కోటి కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో కారు పార్కింగ్ ఒక్కదానికే ఛార్జ్ చేసేచారు. ఇప్పుడు ఇన్ఫ్రా, క్లబ్హౌస్ చార్జీలు, గ్యాస్ పైపులైన్ కనెన్షన్కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి సామాన్య వర్గాలకు భారంగా మారుతున్నాయి. తక్కువ విస్తీర్ణం కారణంగా.. కొన్ని కొత్త నిర్మాణాల్లో వీటి కోసమే రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా జీఎస్టీ, రిజి్రస్టేషన్, స్టాంప్ డ్యూటీ తలకు మించిన భారంగా సామాన్య, ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కొందరు బిల్డర్లు సరసమైన ధరల ఇళ్లు నిర్మిస్తున్నారు. 800–1,000 చ.అ. విస్తీర్ణంలో రెండు పడక గదుల ఫ్లాట్లు, 350 చ.అ. విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్మెంట్లనూ కడుతున్నారు. ఇవన్నీ సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారుల నుంచి తక్కువ విస్తీర్ణం కారణంగా ఆశించిన మేర స్పందన లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశానికి దూరమని, ఇప్పటికిప్పుడు అక్కడ ఉండలేమని కూడా కొందరు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఫారెక్స్ ఆల్టైమ్ హై.. బంగారం 128.46 బిలియన్ డాలర్లు
ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్ డాలర్లు పెరిగి 573.60 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్ డాలర్ల మేర పెరిగి 128.46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 103 మిలియన్ డాలర్లు పెరిగి 18.92 బిలియన్ డాలర్లకు చేరాయి.
మౌలిక రంగం మందగమనం
న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల్లో పనితీరు జనవరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిదానించింది. వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. గతేడాది జనవరిలో వృద్ధి రేటు 5.1 శాతం కాగా, గత డిసెంబర్లోనూ 4.7 శాతం స్థాయిలో ఉండడం గమనించొచ్చు. ముఖ్యంగా మడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి సైతం ఫ్లాట్గా నమోదైంది. ఇక బొగ్గు ఉత్పత్తి 3.1 శాతానికి పరిమితమైంది. 2025 జనవరిలో బొగ్గు ఉత్పత్తి 4.6 శాతంగా ఉంది. సిమెంట్ ఉత్పత్తి 10.7 శాతం వృద్ధికి తగ్గింది. 2025 జనవరిలో ఇది 14.3 శాతం పెరగడం గమనార్హం. ఎరువులు, స్టీల్, విద్యుదుత్పత్తి గతేడాది జనవరితో పోలి్చతే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 2.8 శాతానికి తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతంగానే ఉంది. ఎనిమిది రంగాలకు గాను ఏడింటిలో వృద్ధి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. ఈ ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2025 డిసెంబర్లో ఉన్న 7.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 5.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు.
డిజిటల్ విప్లవం: క్యాష్కు చెక్.. యూపీఐదే హవా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం సామాన్యుడి జీవనశైలిని సమూలంగా మార్చేసింది. చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. గల్లీ లోని కిరాణా షాపు నుంచి మల్టీప్లెక్స్ల వరకు ఎక్క డ చూసినా ఇప్పుడు ‘స్కాన్ అండ్ పే’ మంత్రమే మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రూపే డెబిట్ కార్డులు, తక్కువ–విలువ కలిగిన భీమ్–యూపీఐ లావాదేవీల వల్ల దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) సంయుక్తంగా విడుదల చేసిన ‘సామాజిక–ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని ఇప్సోస్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించింది. యూపీఐ సంచలనం.. రికార్డుల మోత గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏకంగా 11 రెట్లు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్లుగా ఉన్న ఆన్లైన్ లావాదేవీల సంఖ్య 2024–25 నాటికి 22,831 కోట్లకు చేరింది. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో ఒకప్పుడు కేవ లం 4 శాతంగా ఉన్న యూపీఐ వాటా.. ఇప్పు డు ఏకంగా 80 శాతానికి చేరుకుని అగ్రగామిగా నిలిచింది. పీర్–టు–మర్చంట్ అంటే వినియోగదారు లు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో 26 రెట్ల భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 49% వాటాతో మన దేశం గ్లోబల్ లీడర్గా కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిన ఏటీఎం క్యూలు దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరగడంతో జేబులో నగదు పెట్టుకుని తిరిగే వారి సంఖ్య గ ణనీయంగా తగ్గింది. నివేదిక ప్రకారం.. 59% మంది వినియోగదారులు, 57% మంది వ్యాపారులు తమ దైనందిన జీవితంలో నగదు వాడకం బాగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు. నగదు డ్రా చేసేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారుల సంఖ్య 69% మేర తగ్గిపోగా, ఏటీఎంల నుంచి డబ్బు లు డ్రా చేయడం 62% మేర పడిపోయింది. వ్యాపారుల్లో ఏటీఎం విత్డ్రాలు 61% మేర తగ్గాయి. జీడీపీకి భారీ ఆర్థిక ఊతం నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడం, డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత పెరగడం ద్వారా యూపీఐ ఏకంగా భారత జీడీపీకి (2022 సంవత్సరంలో) అదనంగా 16.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) జోడింపును అందించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లావాదేవీలపై అదనపు రుసుములు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతున్న ‘స్కాన్ అండ్ పే’ డిజిటల్ చెల్లింపుల మద్దతు కేవలం మహానగరాలకే పరిమితం కాలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వృద్ధి రేటును గమనిస్తే.. లక్షదీ్వప్లో ఏకంగా 136%, మేఘాలయలో 83%, జమ్మూకాశీ్మర్లో 76% మేర యూపీఐ లావాదేవీల వృద్ధి నమోదైంది. వినియోగదారులు ఏమనుకుంటున్నారు? చాలా సులభంగా వాడుకునే వీలుండటం (63%), తక్షణమే ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగడం (59%) వల్లే యూపీఐను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వినియోగదారులు సర్వేలో తెలిపారు. క్యాష్బ్యాక్ ఆఫ ర్లు (52%), మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం (37%), మెరుగైన భద్రతా ఫీచర్లు (36%) లాంటివి డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నా యి. మరింత మందికి చేరువయ్యేందుకు స్థానిక భాష ల్లో యాప్స్ అందుబాటులో ఉండాలని 21% మంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నగదు కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరిగిన సగటు భారతీయుడు.. ఇప్పుడు తన స్మార్ట్ఫోన్నే బ్యాంక్గా మా ర్చుకుని పారదర్శకమైన ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.
కార్పొరేట్
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్..
బీమా వృద్ధికి ఎఫ్డీఐల దన్ను
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
25,480 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ము...
డబుల్ షాక్.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చా...
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ...
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా స...
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించ...
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులక...
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్లోడ్లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు.
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్నగర్లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
పర్సనల్ ఫైనాన్స్
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!


