ప్రధాన వార్తలు
రూ.150 కోట్లు జరిమానా కట్టండి: ట్రాయ్ పెనాల్టీ
అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్ గతేడాది 21 లక్షల స్పామ్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్లిస్టులో పెట్టింది.4–6 క్లిక్లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్ డీఎన్డీ యాప్ అందుబాటులో ఉంది. కాల్స్ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్ చేసేందుకు 1600 సిరీస్తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయకూడదు. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి.
స్పీడు తగ్గని సిల్వర్.. బంగారం మాత్రం..
దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు ఆపలేదు. వరుసగా రెండో రోజూ దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తక్కువగా అయినా గణనీయంగానే పెరిగాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Vreels - సోషల్ మీడియాకు మరో ప్రత్యామ్నాయం కాదు - మరో దృక్పథం
డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, యూజర్ డేటా గోప్యతా సమస్యలు, స్పష్టతలేని అల్గోరిథమ్స్, మరియు కొద్ది మంది మాత్రమే లాభపడే ఆదాయ వ్యవస్థలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, Vreels (www.vreels.com) ఒక కొత్త దృష్టికోణాన్ని తీసుకొని వచ్చింది. ఇది యూజర్ గోప్యత, పారదర్శకత, సమాన అవకాశాలు, మరియు కమ్యూనిటీ ఇంటరాక్షన్పై ఆధారపడి రూపుదిద్దబడిన వేదిక.యూజర్కు అనుగుణంగా రూపొందిన వేదికVreels ప్రత్యేకత ఏమిటంటే - ఇది యూజర్ల కోసం మాత్రమే కాకుండా, యూజర్లతో కలిసి నిర్మించబడుతున్న వేదిక. మీటప్లు, ఓపెన్ ఫోరమ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లను, యూజర్లను నేరుగా కలుసుకుంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.ప్రతిభకు సమాన ప్రాధాన్యత, వ్యక్తీకరణ స్వేచ్ఛ, నైతిక ఆదాయ విధానం, మరియు యూజర్ నియంత్రణ వంటి అంశాలే ఈ వేదిక అభివృద్ధికి దిశానిర్దేశకాలు. అల్గోరిథమ్ ప్రయోజనాలకన్నా, కమ్యూనిటీ అవసరాలే ఇక్కడ ప్రధానంగా పరిగణించబడతాయి.విద్యార్థులు మరియు కొత్త ప్రతిభలకు ప్రోత్సాహంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న అపారమైన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు Vreels ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్యాంపస్ స్థాయిలో నిర్వహిస్తున్న కంటెంట్ కార్యక్రమాలు విద్యార్థులను సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.విద్యాసంస్థను వెరిఫై చేసిన యూజర్లు ఇతర కళాశాలల విద్యార్థులతో కనెక్ట్ అవుతూ, దీర్ఘకాలిక సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్క్లను నిర్మించుకోగలరు. గోప్యతా రక్షణలు, కంటెంట్ నియంత్రణలు యువతలోని సందేహాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రారంభ దశలోనే ఆదాయ అవకాశాలుసోషల్ మీడియా రంగంలో అరుదైన అడుగు వేస్తూ, Vreels ఒక స్పష్టమైన మైల్స్టోన్ ఆధారిత ఆదాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం:• ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 చెల్లింపు • గరిష్ట ఆదాయ పరిమితి లేదు (ప్రోగ్రామ్ అమలులో ఉన్నంత వరకు)పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందే, యూజర్ల శ్రమకు విలువ ఇస్తూ, ప్రారంభ దశ నుంచే ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ఈ విధాన ప్రత్యేకత.సోషల్ కామర్స్ దిశగా అడుగు - Vreels Shop2026 తొలి త్రైమాసికంలో Vreels Shop ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారాలు, కొత్త బ్రాండ్లు యూజర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం వెండర్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.ఇది క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్లకు కొత్త ఆదాయ మార్గాలను తెరవనుంది.వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే ఫీచర్లుVreelsలోని ప్రత్యేకమైన ఫీచర్ Memory Capsule — మీరు ఎంచుకున్న ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలను, నిర్ణయించిన సమయానికి, ఎంపిక చేసిన వ్యక్తికే షేర్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది పబ్లిక్ షేరింగ్కు భిన్నంగా, వ్యక్తిగత భావోద్వేగాలకు విలువ ఇస్తుంది.PixPouch ఫీచర్ ద్వారా యూజర్లు తమ విజువల్ జ్ఞాపకాలను సక్రమంగా భద్రపరచుకుని, కావాలనుకున్నప్పుడే ఎంపిక చేసిన వారికి షేర్ చేయవచ్చు.ఒకే యాప్లో సంపూర్ణ అనుభవం• Vreels ఒకే వేదికలో: షార్ట్ వీడియోలు (Reels) • రియల్టైమ్ చాట్ • వాయిస్ & వీడియో కాల్స్అన్నీ అందిస్తూ, యూజర్లు యాప్ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తోంది.గోప్యతే పునాదిప్రకటనల ఆదాయంపై ఆధారపడే వేదికలతో పోలిస్తే, Vreels గోప్యత మరియు డేటా భద్రతను తన మౌలిక నిర్మాణంలోనే సుస్థిరంగా ఏర్పాటు చేసింది. యూజర్ల కంటెంట్, పరస్పర చర్యలపై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.ప్రపంచ దృష్టికోణంఅమెరికా ఆవిష్కరణా దృక్పథ్వం మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ కలయికతో రూపొందిన Vreels, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ పేటెంట్లు దాఖలయ్యాయి. ప్రాంతీయ భాషల మద్దతు కూడా నిరంతరం విస్తరిస్తోంది.Vreels — మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా — మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒక్కే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels - భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి.
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 26,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 263 పాయింట్లు నష్టపోయి 85,176 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.6% పైగా పెరిగిందినాస్డాక్ 0.9 శాతం పెరిగిందిToday Nifty position 06-01-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
8 కంపెనీల లిస్టింగ్కు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ కేలండర్ ఏడాది(2026)లోనూ దూకుడు చూపనున్నాయి. ఇప్పటికే పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిస్టింగ్ బాట పట్టగా.. హిందుస్తాన్ ల్యాబొరేటరీస్ ఐపీవోకు దరఖాస్తు చేసింది. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం..కొత్త ఏడాదిలో విభిన్న రంగాలకు చెందిన 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందాయి. జాబితాలో ఆర్కేసీపీఎల్ లిమిటెడ్, చార్టర్డ్ స్పీడ్, గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా), జెరాయ్ ఫిట్నెస్, శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీ, టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా), ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూలై– సెపె్టంబర్ మధ్య కాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలన్నీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. ప్రధానంగా ఫెర్టిలిటీ సర్వీసులందించే ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసి అనుమతి పొందాయి.ఆర్కేసీపీఎల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కంపెనీ ఆర్కేసీపీఎల్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 550 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కార్యకలాపాలు, బ్యాలెన్స్షీట్ పటిష్టతకు వినియోగించనుంది. రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 130 కోట్లు నిర్మాణ సంబంధ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 188 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.చార్టర్డ్ స్పీడ్ ప్రయాణికుల చేరవేత కంపెనీ చార్టర్డ్ స్పీడ్ లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీ ని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 855 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుండగా, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్ బస్సులపై ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. గ్లాస్ వాల్ ఫ్యాసేడ్ సిస్టమ్స్ తయారీ, ఇన్స్టలేషన్ కంపెనీ గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా) లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.02 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. శ్రీరామ్ ఫుడ్ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యం ఎగుమతి చేసే శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీ ఐపీవోలో భాగంగా 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 52 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2014లో ఏర్పాటైన కంపెనీ బీ2బీ పద్ధతిలో బియ్యం ఎగుమతులను చేపడుతోంది.జెరాయ్ ఫిట్నెస్ ఫిట్నెస్ పరికరాల తయారీ కంపెనీ జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు ఐపీవోలో భాగంగా 43.92 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లకు చేరనున్నాయి. కంపెనీ కస్టమర్లలో కమర్షియల్ జిమ్స్, హోటళ్లు, కార్పొరేషన్లు, దేశ, విదేశాలలోని రియల్టీ ప్రాజెక్టులున్నాయి. జిమ్ పరికరాలను జపాన్, యూఏఈ, ఆ్రస్టేలియా, స్వీడన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. టెంప్సెన్స్ థర్మల్ ఇంజినీరింగ్, కేబుళ్ల తయారీ కంపెనీ టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 118 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.79 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ ఫెర్టిలిటీ సేవల కంపెనీలు ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందాయి. ఇందిరా ఐవీఎఫ్ మెయిన్ బోర్డులో లిస్ట్కానున్నట్లు 2025 జూలైలో ప్రకటించింది. గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ వివరాలను రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చే ముందు వివరాలు వెల్లడించే సంగతి తెలిసిందే.గత రెండేళ్ల రికార్డులిలా 2025 కేలండర్ ఏడాదిలో ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 102 కంపెనీలు లిస్టయ్యాయి. తద్వారా రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. దీంతో 2024లో 90 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా సమీకరించిన రూ. 1.6 లక్షల కోట్ల రికార్డ్ వెనుకబడింది. అంతకుముందు 2023లో 57 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చి రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి.
ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ
రద్దయిన జీవిత బీమా పాలసీలను (ల్యాప్స్డ్ పాలసీలు) పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రకటించింది. మార్చి 2 వరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అన్ని నాన్ లింక్డ్ పాలసీలకు, ఆలస్యపు రుసుము (నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రీమియంపై)లో ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది.ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందొచ్చని వెల్లడించింది. సూక్ష్మ జీవిత బీమా పాలసీలపై ఆలస్యపు రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. పాలసీ కాల వ్యవధి (టర్మ్) ముగిసిపోకుండా, కేవలం ప్రీమియం చెల్లింపుల్లేక రద్దయిన పాలసీలకే పునరుద్ధరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.వైద్య/ఆరోగ్య అవసరాల్లో ఎలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది. సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన వారికి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రయోజనం కల్పిస్తుందని వివరించింది. పాలసీలను పునరుద్దరించుకుని, బీమా కవరేజీని తిరిగి పొందాలంటూ పాలసీదారులకు సూచించింది.ఇదీ చదవండి: ఆన్లైన్లో కొన్న బంగారంపై లోన్ ఇస్తారా?
కార్పొరేట్
పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు
లోకల్ కంపెనీల గ్లోబల్ జంప్
ఎయిర్ ఇండియా సీఈవోను తప్పిస్తున్నారా?
కోటి ఆశలతో కొత్త ఏడాది
మీ ‘లైఫ్’ పాలసీ సరైనదేనా..?
జీఎస్టీ తగ్గించినా లభించని ఊరట!
ఇక పిజ్జా హట్లో కేఎఫ్సీ.. రూ. 8,000 కోట్ల విలీనం!
సిగరెట్లపై భారీ ట్యాక్స్.. వచ్చే 1 నుంచే..
అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..
చైనా కంపెనీ దెబ్బకు.. వెనుకబడ్డ మస్క్ టెస్లా!
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ద...
Stock Market Updates: ఫ్లాట్గా సెన్సెక్స్.. నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స...
బంగారు గృహాల భారతదేశం
ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్ వజ్రాలను ‘...
బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూ...
జపాన్ను దాటిన భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస...
బ్యాంక్లకు ఆర్థిక శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు...
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమ...
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రం...
ఆటోమొబైల్
టెక్నాలజీ
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్లు Wi-Fi కనెక్షన్ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్వర్క్ల మధ్య సజావుగా హ్యాండ్ఓవర్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్
ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా..
రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్ప్రెస్లో భోపాల్కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.LORE UPDATE: I forgot my IPAD on a train to bhopal (Dakshin Express, 28.12.25)Realised an hour later,between all the chaos (and lots of crying 😭) we called #139 and registered a report on #RailMadad app. Amazingly, within minutes we got a call from the helpline, a quick…— Diya (@diyaatwt) December 30, 2025
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?
పర్సనల్ ఫైనాన్స్
70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..ఏమిటీ 70/10/10/10 ఫార్ములామీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.
పోస్టాఫీసు పథకాలు.. కొత్త వడ్డీ రేట్లు
దేశంలో పోస్టాఫీసులు అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. పోస్టాఫీసు స్కీముల్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, స్థిరమైన, కచ్చితమైన రాబడిని పొందుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఇండియా పోస్ట్ దేశంలోనే అత్యధిక స్థాయిలో చిన్న పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి వర్గానికి పథకాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పోస్టాఫీసు స్కీములు ఉన్నాయి. 2026 సంవత్సరానికి గానూ అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్టాఫీస్ పొదుపు పథకాలు.. వాటికి లభించే వడ్డీ రాబడి గురించి తెలుసుకుందాం..సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అన్ని అగ్రశ్రేణి బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఈ పథకంపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును ఈ పథకం అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా అనేది బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం. బాలికల చదువు, భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బాలిక దగ్గర నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు అమ్మాయి పేరు మీద ఎస్ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళలు, బాలికలు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పొదుపు కార్యక్రమం. పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో లభ్యమయ్యే ఈ పథకం స్థిర వడ్డీ ఆదాయంతోపాటు మూలధన సంరక్షణను అందిస్తుంది. రెండేళ్ల గరిష్ట కాల పరిమితితో ఉండే ఈ పథకాన్ని ప్రభుత్వం 2025 మార్చి 31తో నిలిపేసింది. అంతకుముందు ఖాతా తెరిచినవారికి ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది దేశంలో మంచి ఆదరణ పొందిన, స్థిర-ఆదాయ పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద కచ్చితమైన రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై వడ్డీ రేటును 7.7 శాతంగా ఉంచింది.పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (POMIS) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన, ఆమోదించబడిన పెట్టుబడి పథకం. 7.4% వడ్డీ రేటుతో, ఇది అత్యధిక రాబడినిచ్చే పథకాలలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ ఆదాయం నెలవారీగా చేతికొస్తుంది.
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్
ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్లైన్లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు..
2025 ముగియడంతో.. 2026 ప్రారంభం నుంచి అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవి జీతం పొందే వారిని, యువత, సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తాయి. కొత్తగా వచ్చిన రూల్స్ గురించి వివరంగా..పాన్ కార్డుకు ఆధార్ లింక్పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ గడువును పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నేటి నుంచి పాన్ - ఆధార్ లింక్ చేయడం కుదరదు. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.క్రెడిట్ స్కోర్ అప్డేట్ఇప్పటివరకు బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. అంటే.. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్లు మీ క్రెడిట్ స్కోర్లో చాలా వేగంగా ప్రతిబింబిస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలు2026 సంవత్సరం మొదటి రోజు నుంచి ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెరిగింది. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.మెరుగైన డిజిటల్ చెల్లింపు భద్రతమోసాలను అరికట్టడానికి బ్యాంకులు UPI లావాదేవీలపై కఠినమైన తనిఖీలను, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు మరింత బలమైన సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేస్తాయి.పిఎం కిసాన్ గుర్తింపు కార్డులుభారత ప్రభుత్వం PM-Kisan పథకం కోసం కొత్త రైతు ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఐడీకి.. రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్ & బ్యాంక్ వివరాలు అనుసంధానించబడి ఉంటాయి.


