Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Iran War Sends Retail Petrol Prices Soaring Up To 55pc Globally1
దేశాల్లో పెట్రోల్‌ మంటలు.. దారుణంగా ధరలు!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.

SEBI Proposes Gift Cards for Mutual Fund Investments to Boost Retail Participation2
ఫండ్స్‌లో పెట్టుబడులకు గిఫ్ట్‌ కార్డులు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్‌ కార్డులు లేదా గిఫ్ట్‌ ప్రీ పెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్‌ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్‌ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్‌ పీపీఐలను ఎల్రక్టానిక్‌ బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్‌ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.గిఫ్ట్‌ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్‌ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్‌ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది.

Indian Rupee Sinks to New Lifetime Low as Middle East Conflict Triggers FII Outflow3
పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం

రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్‌ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్‌ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది.

Finance Bill Update 12pc Flat Surcharge Levied on Share Buyback Profits4
బైబ్యాక్‌లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్‌చార్జీ

న్యూఢిల్లీ: వ్యక్తిగత లేదా కార్పొరేట్‌ వాటాదారులు ఎవరైనా బైబ్యాక్‌లో భాగంగా విక్రయించే షేర్లపై ఆర్జించే లాభాలకు 12% సర్‌చార్జీ వర్తించనుంది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫైనాన్స్‌ బిల్లులో సవరణలకు తాజాగా లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.2026 ఫైనాన్స్‌ బిల్లులో 32 సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రేపు(శుక్రవారం) రాజ్యసభలో ఆమో దం కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే రూ. 50 లక్షలవరకూ ఆదాయంగల వారిపై ఎలాంటి సర్‌చార్జీ లేదు.రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ పన్నువర్తించే ఆదాయంగల వారికి బైబ్యాక్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించే లాభాలపై 10% సర్‌చార్జీ అమలు చేస్తున్నారు. అయితే ఫ్లాట్‌ 12% సర్‌చార్జీ విధింపుతో ఆయా పన్ను చెల్లింపుదారులపై భారం పడనుంది.

Silver Soars Gold Glows Precious Metals Witness Massive Single Day Rally5
సిల్వర్‌ హిట్‌.. బంగారం ధగధగలు

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్‌ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్‌ వెండి ఔన్స్‌కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

India should bring household gold stock into financial System6
ఆర్థిక వ్యవస్థలోకి ‘బంగారం’ తేవాలి

న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్‌) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్‌ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) ద్వారా బంగారాన్ని డీమ్యాట్‌ చేసి షేర్ల మాదిరి ట్రేడ్‌ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్‌ తెలిపారు. అయితే, ఈజీఆర్‌ సమయంలో బంగారం డిపాజిట్‌పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్‌ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్‌ చేసి, స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో షేర్ల మాదిరి ట్రేడ్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement