Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Health insurance sector records Strong growth1
వృద్ధి బాటలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌

న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పట్ల పెరుగుతున్న అవగాహన, వైద్య అత్యవసరాల్లో ఆర్థిక రక్షణ ఉండాలని కోరుకోవడం వృద్ధికి దారితీస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సేవల్లో సామర్థ్యం పెరిగేందుకు, పాలసీదారులకు సకాలంలో సాయం అందించే లక్ష్యంతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నగదు రహిత క్లెయిమ్‌ల పరిష్కారానికి నిర్దేశిత గడువులను విధించినట్టు పేర్కొంది. నగదు రహిత ముందస్తు అంగీకారం గంటలోపు తెలియజేయాలని.. క్లెయిమ్‌పై తుది ఆమోదాన్ని మూడు గంటల్లో తెలియజేయాలని నిర్దేశించినట్టు వెల్లడించింది. జాప్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందేందుకు ఈ నిబంధనలు సాయపడతాయని తెలిపింది. వయసు మీద పడతుండడం, అధిక రక్షణ, అదనపు సదుపాయాలతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరుగుతున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అందుబాటు ధరల్లో ఉండాలి...బీమా ఉత్పత్తుల ప్రీమియంలు అన్ని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకుని, సరైన ధరలపై అందుబాటులో ఉండాలంటూ 2024లో ఐఆర్‌డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ప్రస్తావించింది. వీటిని నియమిత యాక్చువరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని తెలిపింది. 2024–25లో బీమా భరోసా పోర్టల్‌పై జనరల్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించి 1,37,361 ఫిర్యాదులు దాఖలయ్యాయని, ఇందులో 93 శాతం అంటే 1,27,755 ఫిర్యాదులు పరిష్కారమైనట్టు వెల్లడించింది. బీమా క్లెయిమ్‌ తిరస్కరణ, రద్దు అన్నవి పాలసీ నియమ, నిబంధనల పరిధిలోనివిగా పేర్కొంది. బీమా రక్షణను మించడం, కో–పేమెంట్‌ క్లాజ్, ఉప పరిమితులు, టాపప్‌ పాలసీల్లో డిడక్టబుల్, రూమ్‌ రెంట్‌ పరిమితి మించడం తదితర అంశాలూ క్లెయిమ్‌ తిరస్కరణ, రద్దుకు సంబంధించి ఉన్నట్టు తెలిపింది.

Infosys To Acquire Optimum Healthcare IT To Strengthen AI Led Healthcare2
ఇన్ఫోసిస్‌ యూఎస్‌ షాపింగ్‌!

న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. ఆరోగ్యపరిరక్షణ సంబంధ డిజిటల్‌ సమాచార కంపెనీ ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీతోపాటు ఇన్సూరెన్స్‌ కన్సల్టింగ్‌ టెక్నాలజీ సంస్థ స్ట్రాటస్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఉమ్మడిగా రూ. 5,260 కోట్లు వెచ్చించనుంది. ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ను ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 46.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది. అయితే మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహకాలు, బోనస్‌లను మినహాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో కొనుగోలు పూర్తికాగలదని అంచనా. ఇందుకు ఫ్లోరిడా(యూఎస్‌) కంపెనీ ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ఐటీతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. క్లాస్‌ హెల్త్‌కేర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్, కన్సల్టింగ్‌ సేవల కంపెనీ ఆప్టిమమ్‌ భారీస్థాయి ట్రాన్స్‌ఫార్మేషన్‌లో క్లయింట్లకు సేవలు అందించడంలో గుర్తింపు పొందినట్లు పేర్కొంది. వెరసి కంపెనీ హెల్త్‌కేర్‌ వృద్ధి వ్యూహాలకు మద్దతు లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ టోపజ్‌ ఏఐ, కోబాల్ట్‌ క్లౌడ్, క్లౌడ్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా సర్వీసులను ఆప్టిమమ్‌ హెల్త్‌కేర్‌ ద్వారా ఆరోగ్యపరిరక్షణ సేవలందించే కంపెనీలు వినియోగించుకునేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ వివరించారు. స్ట్రాటస్‌ డీల్‌ ప్రాపరీ్ట, క్యాజువాలిటీ(పీఅండ్‌సీ) ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తున్న యూఎస్‌ కంపెనీ స్ట్రాటస్‌ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. ఇందుకు ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 9.5 కోట్ల డాలర్ల నగదు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అయితే మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహకాలు, బోనస్‌లనుమినహాయించింది. దీంతో బీమా రంగంలో లీడర్‌షిప్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్‌ పీఅండ్‌సీ ఇన్సూరెన్స్‌ క్లయింట్లకు మరింత విస్తారంగా ఏఐ ఆధారిత డిజిటల్, డేటా ట్రాన్స్‌ఫార్మేషన్‌ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. పరిశ్రమ సంబంధ లోతైన పరిజ్ఞానం కలిగి 450 మంది నిపుణుల బృందాన్ని స్ట్రాటస్‌ కలిగి ఉన్నట్లు పేర్కొంది. కన్సల్టింగ్‌ నైపుణ్యాలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సామర్థ్యాలు కలిగి ఉన్న టీమ్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్‌సహా.. యూఎస్, కెనడాలలో గ్లోబల్‌ డెలివరీ కార్యకలాపాలు విస్తరించిన స్ట్రాటస్‌ ఎండ్‌టుఎండ్‌ గైడ్‌వైర్‌ ఇన్సూరెన్స్‌సూట్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు వివరించింది. వీటిలో పాలసీసెంటర్, క్లెయిమ్‌సెంటర్, బిల్లింగ్‌సెంటర్, అప్‌గ్రేడ్స్, అప్లికేషన్‌ మేనేజ్‌డ్‌ సర్వీసులు తదితరాలున్నట్లు పేర్కొంది.

Best Electric Cars in India 20263
పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారతదేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ.. హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర బారులు తీరారు. ఈ తరుణంలో కొత్త కారు కొనాలకునేవారు ఈవీలపై ద్రుష్టి సారిస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో గొప్ప మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు గురించి తెలుసుకుందాం.👉టాటా టియాగో ఈవీ: 187 కిమీ (24 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా టిగోర్ ఈవీ: 190 కిమీ (26 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ కామెట్ ఈవీ: 193 కిమీ (17.3 కిలోవాట్ బ్యాటరీ)👉సిట్రోయెన్ eC3: 228 కిమీ (29.2 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ విండ్సర్ ఈవీ: 308 కిమీ (38 కిలోవాట్ బ్యాటరీ)👉ఎంజీ జెడ్ఎస్ ఈవీ: 339 కిమీ (50.3 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా నెక్సాన్ ఈవీ: 350 కిమీ (45 కిలోవాట్ బ్యాటరీ)👉కియా కారెన్స్ క్లావిస్ ఈవీ: 364 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా కర్వ్ ఈవీ: 365 కిమీ (55 కిలోవాట్ బ్యాటరీ)👉టాటా హారియర్ ఈవీ: 401 కిమీ (75 కిలోవాట్ బ్యాటరీ)👉హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: 432 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా బీఈ 6: 449 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: 456 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)👉మహీంద్రా XEV 9S: 478 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)

UMANG App Expands Digital Governance Over 2400 Government Services4
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?

ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్‌ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్‌ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా UMANG ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చెందింది. ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

Banks to Remain Closed for Next Four Days5
బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!

మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్‌పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.అందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

India Growth Outlook Brightens S and P Projects 7 1 percent GDP Expansion for FY2026 276
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?

భారత్‌కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్‌పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్‌లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.చమురు ధరల సెగలు.. జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ బ్యారెల్‌కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement