Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Employees will now get full and final settlement money in just 2 days under new labour law1
రిజైన్‌ చేసిన రెండు రోజుల్లోనే ఫైనల్‌ సెటిల్‌మెంట్

కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తున్న క్రమంలో ఇప్పటి వరకూ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా లేదా అనధికారికంగా అనుసరిస్తున్న పలు ప్రక్రియలు ఇప్పుడు అధికారికంగా ఒకే రకంగా ప్రామాణీకరణ చెందుతున్నాయి. అలాంటి ప్రక్రియల్లో ఒకటే ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ (FnF).ఉద్యోగులు రాజీనామా చేసినప్పుడు లేదా వారిని యాజమాన్యాలు తొలగించిన సందర్భంలో గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, శాలరీ బకాయిలు, బోనస్, ఇన్సెంటివ్‌లు, పీఎఫ్‌/ఈఎస్‌ఐ సంబంధిత ఏర్పాట్లు వంటి అనేక చట్టబద్ధ సెటిల్మెంట్లు ఉంటాయి. వీటిని ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల సర్వీస్‌ కాలం ముగింపు రోజే అంటే చివరి పనిదినమే చెల్లిస్తుండగా మరికొకొన్ని కంపెనీలు 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిలో చెల్లించేవి.ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగుల ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్ డబ్బును రెండు పనిదినాల్లో చెల్లించాలి. ఈ విషయంలో గందరగోళం లేకుండా యాజమాన్యాలన్నీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరించేలా కేంద్ర కార్మిక శాఖ ప్రామాణీకరిస్తోంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపునకు మాత్రం విడిగా కాల వ్యవధి ఉంటుంది.కాగా 2026 ఏప్రిల్ 1 లోపు నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోందని, కొత్త కార్మిక నిబంధనలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయడానికి ఇదే కాలక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించిందని కార్మిక కార్యదర్శి వందన గుర్నానీ తెలిపారు.కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ప్రయోజనాలుఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ రావడంతో కొత్త ఉద్యోగానికి మారుతున్నవారికి లేదా మధ్యలో గ్యాప్‌ తీసుకున్నవారికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.కంపెనీలు ఏదైనా కారణం చెప్పి సెటిల్‌మెంట్ ఆలస్యం చేయడం ఇక సాధ్యం కాదు. మోసాలు, అన్యాయాలపై నియంత్రణ పెరుగుతుంది.సెటిల్‌మెంట్ ఆలస్యం కారణంగా వచ్చే వివాదాలు, కేసులు తగ్గుతాయి.ఇది చదివారా? ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?కంపెనీలపై ప్రభావంహెచ్‌ఆర్‌ & ఫైనాన్స్ ప్రక్రియలలో కఠినమైన క్రమశిక్షణ అవసరమౌతుంది. రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయాలంటే హెచ్‌ఆర్‌ ఎగ్జిట్ ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేయాలి. ఫైనాన్స్ టీమ్ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ మేరకు సిస్టమ్‌లు ఆటోమేటెడ్ కావాలి.రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ పెద్ద కంపెనీలకు సమస్య కాకపోయినా చిన్న, మధ్య తరహా సంస్థలు వెంటనే చెల్లింపుల కోసం క్యాష్ రిజర్వులు ఉంచుకోవాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ ఉల్లంఘనకు జరిమానాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి కంపెనీలు తమ ఎస్‌వోపీలను అప్‌డేట్ చేయాలి.రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ కష్టసాధ్యమౌతుంది. ఫలితంగా ఆటోమేషన్, హెచ్‌ఆర్‌ఎంఎస్‌, పేరోల్ టూల్స్ డిమాండ్ పెరుగుతుంది.

Why Aadhaar cards will no longer accepted as proof of birth? Know details2
జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు

ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు, జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.ఉత్తరప్రదేశ్‌లో..ఉత్తరప్రదేశ్‌లో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా అంగీకరించబోమని ప్రణాళిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ కార్డుకు జనన ధ్రువీకరణ పత్రం జతఅవ్వదు. అందువల్ల దీన్ని బర్త్‌ సర్టిఫికేట్‌గా పరిగణించలేం’ అని ఆ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.మహారాష్ట్రలో..మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. జనన ధ్రువీకరణ పత్రాల జారీలో ఆధార్ కార్డును కీలకంగా పరిగణించబోమని, జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం కేవలం ఆధార్ కార్డు ద్వారా జారీ చేసిన అన్ని జనన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నకిలీ పత్రాలను చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిలిపివేయడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఆధార్ కార్డులను ఉపయోగించి జారీ చేసిన అన్ని అనుమానాస్పద సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఆదేశించారు. అంతేకాక, ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.అక్రమ వలసదారులపై కఠిన వైఖరిమరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించారు. శాంతిభద్రతలు, జాతీయ భద్రత తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు అని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లా యంత్రాంగం తమ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేలా చూడాలని, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రతి జిల్లాలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న అక్రమ వలసదారులను ఈ కేంద్రాల్లో ఉంచి తదుపరి వారి స్వస్థలాలకు పంపాలని తెలిపారు.ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

if Income Tax dept sends notice appropriate reaction check details3
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌)ను దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల బాధ్యత. అయితే, తెలియక చేసిన తప్పులు, ముఖ్యంగా విదేశీ ఆస్తుల వంటి కీలక వివరాలను వెల్లడించకపోవడం వంటి అంశాల్లో ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు (లేదా ఎస్‌ఎంఎస్‌/ఈ-మెయిల్స్) అందుకునే అవకాశం ఉంది. 2025–26 అసెస్‌మెంట్‌ ఇయర్‌ (ఏవై)కి సంబంధించిన ఐటీఆర్‌ల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని పన్నుదారులకు ఇలాంటి నోటీసులు పంపబోతున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.ఐటీ డిపార్ట్‌మెంట్ అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ సమాచార మార్పిడి ఒప్పందాల (ఆటోమేటిక్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ - ఏఈఓఐ) ద్వారా పన్నుదారుల ఆర్థిక లావాదేవీల గురించి సులభంగా తెలుసుకోగలుగుతోంది. విదేశీ జ్యూరిస్‌డిక్షన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి కూడా ఐటీఆర్‌లో ఆ వివరాలను పేర్కొనని వారికి ఐటీ శాఖ ఎస్‌ఎంఎస్‌లు/ఈ-మెయిల్స్‌ పంపడానికి సిద్ధమైంది.‘హై–రిస్క్‌’ కేసులుతొలి దశలో భాగంగా దాదాపు 25,000 ‘హై–రిస్క్‌’ కేసులుగా పరిగణిస్తున్న వారికి త్వరలో ఎస్‌ఎంఎస్‌లు/ఈ–మెయిల్స్‌ పంపనున్నారు. చట్టపరమైన చర్యలను నివారించడానికి వీరు 2025 డిసెంబర్‌ 31లోగా సవరించిన ఐటీఆర్‌ (Revised ITR)ను దాఖలు చేయాలని సూచించారు. గత ఏడాది కూడా ఇలాగే నోటీసులు పంపినప్పుడు మొత్తం 24,678 మంది పన్నుదారులు రూ.29,208 కోట్ల విలువైన విదేశీ అసెట్స్‌ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్‌లను దాఖలు చేశారు. ఇది పన్ను ఎగవేతదారులను గుర్తించే విషయంలో డిపార్ట్‌మెంట్ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.ఐటీ శాఖ ఇప్పటికే జూన్‌ వరకు 1,080 కేసులను మదింపు చేసి రూ.40,000 కోట్లకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు పంపింది. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో సోదాలు కూడా నిర్వహించారు.నోటీసులకు ఎలా స్పందించాలి?ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ లేదా అధికారిక నోటీసు అందుకున్నప్పుడు పన్ను చెల్లింపుదారుడు భయాందోళనకు గురికాకుండా చట్టబద్ధంగా స్పందించాలి. నోటీసులు ఏ సెక్షన్ కింద వచ్చింది? (ఉదాహరణకు, సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమని తెలిపే సమాచార మెయిల్ కావచ్చు, లేదా సెక్షన్‌ 143(2) కింద మదింపు నోటీసు కావచ్చు.) అనే వివరాలు తెలుసుకోవాలి. నోటీసు దేని గురించి.. ఆదాయం తక్కువగా చూపడం, ఖర్చులను ఎక్కువగా చూపడం లేదా విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడం వంటివాటిలో ఏది? అనే దాన్ని పరిశీలించాలి. నోటీసుకు స్పందించడానికి నిర్దిష్టంగా ఇచ్చిన గడువును గుర్తించాలి.సవరించిన ఐటీఆర్‌ దాఖలువిదేశీ ఆస్తుల వెల్లడి విషయంలో డిపార్ట్‌మెంట్ స్నేహపూర్వకంగా సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయమంటూ ఎస్‌ఎంఎస్/ఈ-మెయిల్ పంపినట్లయితే అది చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన ఒక అవకాశంగా భావించాలి. పన్ను చెల్లింపుదారు తక్షణమే తన ఐటీఆర్‌ను సమీక్షించి విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, మూలధన లాభాలు లేదా ఇతర విదేశీ ఆదాయాల వివరాలను తప్పనిసరిగా చేర్చి సవరించిన ఐటీఆర్‌ను దాఖలు చేయాలి. సవరించిన రిటర్న్ ద్వారా అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే ఆలస్య రుసుముతో సహా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. ఈ చర్య చట్టపరమైన చర్యలను (పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ వంటివి) నివారించడానికి ఉపకరిస్తుంది.చట్టపరమైన చిక్కుల నివారణసమయానికి స్పందించడం అనేది జరిమానాలు, ప్రాసిక్యూషన్ వంటి తీవ్ర పరిణామాలను నివారించడానికి దోహదం చేస్తుంది. నోటీసులో పేర్కొన్న గడువులోగా స్పందించడం అత్యంత ముఖ్యం. గడువు దాటితే డిపార్ట్‌మెంట్ ఏకపక్షంగా మదింపును పూర్తి చేసే అవకాశం ఉంది. నోటీసులు క్లిష్టంగా లేదా పెద్ద మొత్తాలకు సంబంధించినవైతే పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్‌ల (సీఏ) సహాయం తీసుకోవడం ఉత్తమం. వారు నోటీసును విశ్లేషించి చట్ట ప్రకారం సరైన స్పందనను సిద్ధం చేయడంలో సహాయపడతారు. ఐటీ డిపార్ట్‌మెంట్ విచారణలో పూర్తి సహకారం అందించాలి. అడిగిన అన్ని పత్రాలను, వివరాలను ఆలస్యం చేయకుండా సమర్పించాలి.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Gold and Silver rates on 28 November 2025 in Telugu states4
ఒక్కసారిగా మారిపోయిన బంగారం ధరలు..

దేశంలో వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పసిడి ధరలు తారుమారై పెరుగుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ChatGPT, Kingfisher, Drinking Water Bisleri signed new sponsors for WPL 45
మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లు

భారత్‌ ఇటీవల ఐసీసీ ఉమెన్‌ ప్రపంచ కప్‌ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్‌ చేస్తుంది.ఐసీసీ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్‌లో 73 స్లాట్‌ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్‌కు రూ.3 కోట్లుశిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్‌ రూ.2.4 కోట్లుసోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లుమెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లుశ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుచినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లుస్పాన్సర్‌షిప్‌లు..కొత్తగా చేరిన చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Stock Market November 28 Sensex Nifty open lower6
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టపోయి 85,683 వద్ద ఉండగా, నిఫ్టీ 25 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 26,190 వద్ద ఉంది.బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో తాజా ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. మొదటిసారిగా సెన్సెక్స్‌ 86,000, నిఫ్టీ 26,300 స్థాయిలను అధిగమించాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement