ప్రధాన వార్తలు

అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్స్మిత్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే. ‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ కొంత తగ్గొచ్చన్నారు.అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి.

సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది.

హైదరాబాద్లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు.

సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో భాగంగా స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడు పాయింట్ల నామమాత్ర లాభంతో 24,336 వద్ద నిలిచింది. వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. భారత్–పాక్ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రికత్త పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగసి 80,661 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,458 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, యుటిలిటీ, టెలీకమ్యూనికేషన్, సర్విసెస్, బ్యాంకులు, ఫైనాన్స్ సర్విసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 84.96 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగి రూ.1,031 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10% ఎగసి రూ.1,085 తాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2%, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఒకశాతం చొప్పున రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి.

బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం ఎగసి రూ. 3,940 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,402 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,764 కోట్ల నుంచి రూ. 15,808 కోట్లకు జంప్ చేసింది.స్టాండెలోన్ ఫలితాలివి. వడ్డీ ఆదాయం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 13,824 కోట్లకు బలపడింది. కాగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 19 శాతం వృద్ధితో రూ. 4,546 కోట్లకు చేరింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు(ఏయూఎం) 26 శాతం ఎగసి రూ. 4,16,661 కోట్లయ్యాయి. 2025 మార్చి31కల్లా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 0.96 శాతం, నికర ఎన్పీఏలు 0.44 శాతంగా నమోదయ్యాయి. అందుబాటులోకి షేరు బజాజ్ ఫైనాన్స్ వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 44 డివిడెండ్ చెల్లించనుంది. రూ. 2 ముఖ విలువగల ప్రతీ షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది. అంతేకాకుండా 4:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 1 షేరుకి 4 షేర్లు ఉచితంగా జారీ చేయనుంది. ఈ ప్రతిపాదనలను తాజాగా బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గతంలో నమోదు చేసిన రూ. 249 కోట్ల పన్ను వ్యయాలను రివర్స్ చేసింది. దీంతో పూర్తి ఏడాదిలో పన్ను ప్రొవిజన్ రూ. 99 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. వెరసి క్యూ4లో రూ. 348 కోట్ల పన్ను తగ్గినట్లు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 9,089 వద్ద ముగిసింది.

ఇండస్ఇండ్.. రాజీనామా!
న్యూఢిల్లీ: అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా మంగళవారం రాజీనామా చేశారు. అంతకన్నా ముందే సోమవారం నాడు డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తప్పుకోగా, ఈ ఉదంతం బైటపడటానికి ముందే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) గోవింద్ జైన్ వైదొలిగారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో దాదాపు రూ. 1,960 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కథ్పాలియా రాజీనామా ఏప్రిల్ 29న పని గంటలు ముగిసిన తర్వాత నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది.తన దృష్టికి వచ్చిన అంశాల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథ్పాలియా వివరించారు. శాశ్వత ప్రాతిపదికన కొత్త సీఈవోను నియమించే వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎగ్జిక్యూటివ్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా ఆర్బీఐని ఇండస్ఇండ్ బ్యాంక్ కోరింది. డెరివేటివ్స్ లావాదేవీల అకౌంటింగ్ విధానాల్లో తేడాల వల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర విలువపై రూ. 1,979 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బైటి ఏజెన్సీ నివేదిక ఇచ్చినట్లు బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. దీని వల్ల 2024–25లో బ్యాంకు నికర లాభాలు భారీగా క్షీణించవచ్చని లేదా నష్టాలను ప్రకటించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. క్యూ4 ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. ఏం జరిగిందంటే.. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్బీఐ ఆడిట్లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి. షేరు క్రాష్..!ఈ క్రమంలోనే ఇండస్ఇండ్ బ్యాంకు షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ. 1,576 నుంచి ఒక దశలో సుమారు యాభై శాతం పైగా పతనమైంది. ప్రస్తుతం రూ. 837 వద్ద ట్రేడవుతోంది. అయితే, తాజా వరుస రాజీనామాల పరిణామాలతో బుధవారం బ్యాంకు షేర్లు గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి.

2025 కేర్ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో మహారాష్ట్ర
2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రెట్ల వృద్ధి: టాటా ఏఐజీ
హైదరాబాద్: గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్ఫోలియోలో మూడు రెట్లు వృద్ధి సాధించినట్లు భారత్లో అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 'టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 51 జిల్లాల్లో కంపెనీ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసింది. టాటా ఏఐజీ నెట్వర్క్, 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్ పేరిట, మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 16 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ పెను సవాలును అధిగమించేందుకు, కస్టమర్లకు కీలక పరిష్కారాన్ని అందించేందుకు ఈ సాధనం తోడ్పడగలదు.నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అనువైనదిగా, అందుబాటు ప్రీమియంలతో ఉండేలా మెడికేర్ సెలెక్ట్ రూపొందించబడింది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోతగిన విధంగా ఇది ఉంటుంది. జీవితకాల యంగ్ ఫ్యామిలీ డిస్కౌంట్, 7.5% శాలరీ డిస్కౌంట్లాంటి ఉపయుక్తమైన ఫీచర్ల కారణంగా అన్ని రకాల ఆదాయవర్గాల వారు, జీవితంలో వివిధ దశల్లో ఉన్న వారికి ఇది అనువైనదిగా ఉంటుంది.గడిచిన మూడేళ్లుగా.. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే ఉదంతాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయి. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) చికిత్స వ్యయాలు 40% పెరిగాయి. సగటు ఖర్చులు కూడా రూ. 1.6 లక్షలకు చేరాయి. 2025లో టాటా ఏఐజీ ఒక కార్డియోవాస్కులర్ కండీషన్ (CAD with STEMI) కేసుకి సంబంధించి హైదరాబాద్లో అత్యధికంగా రూ. 1 కోటి హెల్త్ క్లెయిమ్ చెల్లించింది. తీవ్రమైన కిడ్నీ డిసీజ్ (సీకేడీ) చికిత్స ఖర్చులు 38% పెరిగాయి. ఇవన్నీ కూడా అత్యవసరంగా అందుబాటు ప్రీమియంలతో హెల్త్కేర్ లభ్యత ఆవశ్యకతను సూచిస్తున్నాయి.

ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అక్షయ తృతీయను పురస్కరించుకుని 72 గంటల ఎలక్ట్రిక్ రష్ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అదే రోజు స్కూటర్ డెలివరీలు కూడా ఉంటాయి.ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. జెన్ 2, జెన్ 3 మోడళ్లతో సహా S1 పోర్ట్ఫోలియో అంతటా రూ.40,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపులు తరువాత Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుంచి.. Gen 3 లైన్అప్ ధర రూ. 73,999 నుంచి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.ఓలా #హైపర్డ్రైవ్ సర్వీస్ కింద.. అదే రోజు డెలివరీ, రిజిస్ట్రేషన్ వంటివి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్లను ఆన్లైన్లో లేదా డీలర్షిప్లో కొనుగోలు చేసుకోవచ్చు.అక్షయ తృతీయ ఆఫర్స్ ఇస్తున్న ఇతర కంపెనీలుఅక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్ వంటివి కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే విషయం తెలుసుకోవడానికి మీ సమీపంలోని బ్రాండ్ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.▸1925: రూ. 18.75▸1935: రూ. 30.81▸1945: రూ. 62.00▸1955: రూ. 79.00▸1965: రూ. 72.00▸1975: రూ. 540.00▸1985: రూ. 2130.00▸1995: రూ. 4680.00▸2005: రూ. 7000.00▸2015: రూ. 26845.00▸2016: రూ. 29560.00▸2017: రూ. 29920.00▸2018: రూ. 31730.00▸2019: రూ. 36080.00▸2020: రూ. 48480.00▸2021: రూ. 50000.00▸2022: రూ. 53000.00▸2023: రూ. 60000.00▸2024: రూ. 80000.00▸2025: రూ. 97970.001925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
బిజినెస్ పోల్
కార్పొరేట్

బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా

హైదరాబాద్లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు

సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు

తెలుగు రాష్ట్రాల్లో మూడు రెట్ల వృద్ధి: టాటా ఏఐజీ

1925లో బంగారం రేటు ఇంత తక్కువా?

తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో

భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?

ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..

ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..

వ్యాపార ‘పద్మా’లు..

గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరల...

బంగారం భారీగా పడిపోతుంది!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తార...

బంగారం తగ్గింది కానీ...
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices...

లాభాలకు చెక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్ట...

ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇం...

భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక స...

ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్...

ఫెమా పెనాల్టీ ఫ్రేమ్వర్క్ను సడలించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విదేశీ మారకద్...
ఆటోమొబైల్
మనీ మంత్ర

స్థిరంగా కదలాడుతున్న సూచీలు

ఇదిగో ఇన్వెస్ట్మెంట్కూ ఇదే సూత్రం..

భారత్-పాక్ ఉద్రిక్తతలున్నా బుల్ జోరు

ఈ టాటా ఫండ్తో దీర్ఘకాలంలో మంచి రాబడి

కొనసాగుతున్న బుల్ జోరు

వరుస లాభాలకు బ్రేక్..

ర్యాలీకి బ్రేక్.. పడిన స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

టారిఫ్లకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీ స్టాక్ ఇండెక్సులకు బూస్ట్
టెక్నాలజీ

ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక
ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్వర్క్ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్వర్డ్లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది.

స్నానానికి సిగ్నల్ సిస్టమ్.. కొలతల కొళాయి: సరికొత్త గ్యాడ్జెట్స్
అసలే వేసవి కాలం, నీటి కష్టాలు చాలానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో..వాటర్ పెబుల్కచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసిన వారమవుతాం. అయితే, అంత కచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. అందుకే, రూపొందించారు ఈ ‘వాటర్ పెబుల్’. చూడ్డానికి చిన్న గుండ్రటి బిళ్లలా కనిపిస్తుంది. కాని, ఈ పెబుల్ మిమ్మల్ని కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా ట్రైన్ చేయగలదు.సమయం మించిపోయే కొద్దే ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపు రంగు లైట్ చూపిస్తే, స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే, సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 డాలర్లు (రూ. 1,119) మాత్రమే!కొలతల కొళాయి మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని, కొలిచి ఇస్తే బాగుంటుంది కదూ! అచ్చం ఇలాగే ఈ ‘మెజర్ఫిల్ టచ్ కిచెన్ టాప్’ పనిచేస్తుంది. చాలా రకాల వంటకాలు కచ్చితమైన నీటి కొలతతోనే వండాలి. వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వంద మిల్లీ లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందించగలదు. అవసరమైన మేర కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇక ఇందులోని టచ్ ఫంక్షనాలిటీ సాయంతో సులభంగా ఆన్, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ ఆఫ్ చేయటం మర్చిపోతే, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ట్యాప్ ఆఫ్ అయిపోతుంది. ధర రూ. 359 డాలర్లు (రూ. 30,741).ఇదీ చదవండి: కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..తడిపొడి విడివిడి..వేసవి వచ్చిదంటే చాలామంది వాటర్ రైడ్స్, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల జలక్రీడలతో కాలక్షేపం చేయడానికి Ðð ళ్తుంటారు. అయితే, చెమట, తడి దుస్తుల కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్ అండ్ డ్రై సపరేషన్ బ్యాగ్తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేర్వేరుగా ఉంచితే, దుర్వాసన రాకుండా ఇది అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ లైనింగ్, వాటర్ ప్రూఫ్ జిప్పర్తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్లా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది.

ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్కు కీలకంగా మారవచ్చు.

హెచ్పీ నుంచి 9 కొత్త ఏఐ ల్యాప్టాప్లు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్పీ తాజాగా తొమ్మిది ల్యాప్టాప్ మోడల్స్ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.మరోవైపు, భారత్లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్లో విక్రయించే ప్రతి మూడు హెచ్పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.2025లో భారత్లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్టాప్ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్తో జట్టు కట్టింది.
పర్సనల్ ఫైనాన్స్

ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది... ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్’ (ఈపీఎఫ్) వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంత? వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్తో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. వివాహం ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. వైద్యం సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లుప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణ ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం మూడేళ్ల సర్విస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. విద్య తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.ఉపసంహరణ ఎలా..? ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను ఈపీఎఫ్వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్లైన్ క్లెయిమ్స్’ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్’ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్లైన్ సర్విసెస్’ సెక్షన్లో ‘క్లెయిమ్ ఫారమ్’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్ అడ్వాన్స్ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్పై సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్డ్రాయల్ ఫారమ్ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్గా అనుమతి లభిస్తుంది. ఆఫ్లైన్లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్ బ్యాలన్స్పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. → క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. → అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. → ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండితే..54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.పన్ను భారం? ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్పై మినహాయించిన టీడీఎస్ను రిఫండ్ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్

అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి.

రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
ఆరుపదుల వయసులో రిటైర్ అవ్వాలంటే భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎంత కార్పస్ కావాలో తెలుసా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, ఖర్చులు పెరగడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రిటైర్మెంట్ ప్లాన్కు సరిపడా డబ్బుకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులో ఉండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.‘ఈ రోజు ఇండియాలో రిటైర్ కావడానికి ఎంత డబ్బు అవసరమో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో చాలా రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోలు ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఉంటున్నాయి. కొందరు దీన్ని తొందరగా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్ల్లోకి మళ్లిస్తున్నారు. ఈక్విటీ నుంచి 12–14 శాతం, డెట్ నుంచి 5–7 శాతం కలిపి ఏడాదికి 10% మిశ్రమ రాబడిని అంచనా వేస్తున్నారు. క్రమంగా పన్నులు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడి ఆదాయంపై 20 శాతం పన్ను విధించడం, ద్రవ్యోల్బణం ఏటా మరో 6 శాతం ఉంటుండడంతో వాస్తవ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రిటైర్మెంట్ ఫండ్పై కేవలం 2% నికర రియల్ రిటర్న్ మాత్రమే వస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‘భారత్లో పదవీ విరమణ పొందిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ప్రస్తుతానికి నెలకు కనీసం రూ.1.5 లక్షలు అవసరమవుతాయి. ఏటా మీకు రూ.20 లక్షలు అవసరం. 2% రియల్ రిటర్న్స్ అంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ కనీసం రూ.10 కోట్లు ఉండాలి. మీరు లగ్జరీగా జీవించాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. హాయిగా బతకాలనుకుంటే ఇంకా ఎక్కువ లక్ష్యం పెట్టుకోవాలి. మీ రిటైర్మెంట్ ఫండ్ వార్షిక ఖర్చుకు 50 రెట్లు ఉండాలి. అంటే మీ కుటుంబం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేయాలంటే రూ.5 కోట్లు కావాలి. ఏడాదికి రూ.20 లక్షలు అంటే రూ.10 కోట్లు అవసరం’ అని తెలిపారు.

బాలికల ప్రత్యేక స్కీమ్.. వడ్డీ రేటు మారిందా?
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు.
రియల్టీ
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 111000.00 | 0.00 | 0.00 |
Gold 22K 10gm | 89800.00 | 400.00 | 0.50 |
Gold 24k 10 gm | 97970.00 | 440.00 | 0.50 |
Egg & Chicken Price
Title | Price | Quantity |
---|---|---|
Chicken (1 Kg skin less) | 243.00 | 1.00 |
Eggs | 60.00 | 12.00 |