Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Devendra Singh Chaplot Joined Elon Musk SpaceX xAI1
మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్‌ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్‌.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్‌బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్‌బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్‌షాప్‌లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

Man Reveals How His Uncle's Rs 60,000 Investment Earns Rs 14.5 Lakh A Month2
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!

సాధారణంగా పెద్దలు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి లెక్కేలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ.. చాలామంది భూములను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.స్వాప్నిల్ కొమ్మావర్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఒక విషయం వెల్లడించారు. 1990లో నా మామ ఏకంగా 15000 రూపాయల చొప్పున, నాలుగు ఎకరాలను రూ. 60వేలుతో కొన్నారు. క్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అది ఒక జిల్లా స్థాయికి చేరింది. రిటైల్ దిగ్గజం డీమార్ట్ రెండు ఎకరాలు భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. భూమిపై పెట్టే పెట్టుబడి ఎంత లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారుభూమిని అమ్మగా వచ్చిన డబ్బును నా మామ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టారు. ఇప్పుడు ప్రతి నెలలో రూ. 14.5 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. ఇంకా, ఆయన దగ్గర రెండు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూ. 60,000 నుంచి రూ. 25 కోట్లకు ఎంత అద్భుతమైన ప్రయాణం! అని ఒకరు కామెంట్ చేయగా, అన్ని భూములకు ఒకే విలువ ఉంటుందని దీని అర్థం కాదు; ఇది ప్రాంతం మరియు అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.A true story from my hometown!In 1990, my uncle bought 4 acres of land for 15,000 per acre.Total investment: 60,000.The town developed over the years. and now even a district.Now, DMart bought 2 acres of that land from him for 25 crores.He has now put the 25 crores in a…— Swapnil Kommawar (@KommawarSwapnil) March 12, 2026

Maruti Suzuki Dzire 3 Million Sales Milestone3
ఈ కారును జనం ఎగబడి కొనేస్తున్నారు!

భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో ఒకటి మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 30 లక్షల సేల్స్ సాధించింది. అదే మారుతి సుజుకి డిజైర్.2008లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి.. అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు.

Luxury Meets Smart Living The Rise of Apartments4
నగరంలో విల్లా లైఫ్‌: ఇప్పుడంతా ‘అప్‌’ర్ట్‌మెంట్‌ ట్రెండ్!

దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న అపార్ట్‌మెంట్ల నుంచి ఆకాశహర్మ్యాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోంది.సాధారణంగా అపార్ట్‌మెంట్లకు అప్‌డేట్‌ వెర్షన్‌గా అపార్ట్‌మెంట్ల పోకడను బిల్డర్లు ప్రమోట్‌ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని యువ ఐటీ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మిస్తున్నారు. ‘యూ’ అంటే అప్‌గ్రేటెడ్‌ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్‌నకు శ్రీకారం చుట్టారు. సాధారణ ఫ్లాట్లలో ఉండే రొటీన్‌ సౌకర్యాల కంటే కాస్త భిన్నంగా హోటల్‌ తరహాలో లగ్జరీ, స్మార్ట్‌ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్‌ ‘అప్‌’ర్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల ప్రధాన లక్ష్యం.‘అప్‌’ర్ట్‌మెంట్‌ అంటే?విల్లాలో నివాస అనుభూతిని అపార్ట్‌మెంట్లలో కల్పించడమే ఈ ‘అప్‌’ర్ట్‌మెంట్ల ప్రత్యేకత. గ్రీనరీతో పాటు వెల్‌నెస్‌ ఆధారిత వసతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నేటి ఆహారపు, జీవనశైలి నేపథ్యంలో నివాసితులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం వీటి ఉద్దేశం. ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలు..ఈ తరహా ప్రాజెక్ట్‌లలో ప్లగ్‌ అండే ప్లే తరహాలో సదుపాయాలుంటాయి.కేవలం దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తే చాలు.. ఫ్లాట్‌లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్‌ కిచెన్, అత్యాధునిక ఎల్రక్టానిక్‌ గాడ్జెట్ల్‌తో ఈ గృహాలు మీకు స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండీషనర్, వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే లైటింగ్‌ సిస్టమ్, ఫ్యాన్లు వంటి స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీని అమరుస్తారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్‌ వర్క్‌ ప్లేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీస్‌లను కూడా బిల్డర్లు ఈ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తారు.అధిక కార్పెట్‌ ఏరియా..ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్‌ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా స్టార్టప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, మోడ్రన్‌ యువ బిల్డర్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో లే–అవుట్, ఫ్లాట్ల డిజైనింగ్‌ ప్రతి అంశంలోనూ లోతైన అధ్యయనం ఉంటుంది. ఇంటి లోపల కార్పెట్‌ ఏరియా సామర్థ్యం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. సంప్రదాయ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఈ తరహా యూనిట్లలో కార్పెట్‌ ఏరియా 4 శాతం అధికంగా ఉంటుంది.ధర ఎక్కువే అయినా..లేఅవుట్‌ విస్తీర్ణంలో పెద్దగానే ఉన్నప్పటికీ అపార్ట్‌మెంట్లను పరిమిత సంఖ్యలో నిర్మిస్తారు. నివాసితులకు ప్రైవసీతో పాటు అధిక వసతులను అనుభవించేందుకు వీలు కల్పిస్తారు. అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లు ఒకదానికొకటి దూరంగా ఉండటంతో ఫ్లాట్లకు విస్తారమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తుంది. అలాగే కిటికీలో నుంచి చూస్తే కనుచూపు మేర పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో నివాసితులకు మానసిక, శారీరక సంతృప్తి చేకూరుతుంది.సాధారణ అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యలతో పోలిస్తే ఈ తరహా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఉండి ఆధునిక సదుపాయాలు అనుభవించాలని కోరుకునే వారికి ఈ ఫ్లాట్లు అమితంగా నచ్చుతాయి. ఇందులో నిర్వహణ బాధ్యతలను చాలా వరకు బిల్డర్లే చూసుకుంటారు.

Mahindra gifts Formula E themed SUV to actor Ajith Kumar5
అజిత్‌కు ఖరీదైన కానుక.. ఫార్ములా ఈ కారు గిఫ్ట్‌!

ఇరాన్‌తో.. అమెరికా-ఇజ్రాయెల్ వివాదం కారణంగా దుబాయ్‌లో కొంతకాలం చిక్కుకుపోయిన ప్రముఖ నటుడు & రేసర్ 'అజిత్ కుమార్' ఈ వారం ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత.. కొత్త ''మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ'' కారును సొంతం చేసుకున్నారు. దీనిని మహీంద్రా అండ్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో BE 6 ఫార్ములా E కారుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ధరలు రూ. 23.69 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అజిత్ కుమార్ టాంగో రెడ్ వేరియంట్‌ BE 6 ఫార్ములా E కొనుగోలు చేశారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ అని తెలుస్తోంది.మహీంద్రా ఫార్ములా కారుతో ఉన్న అజిత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ''సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ వెల్లడిస్తూ.. త్వరలో ఒక రోజు నేను ఆయనకు వ్యక్తిగతంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాను'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.Can’t help quoting the old ad: ‘Made for each other’Superstar Ajith Kumar & the Mahindra BE 6 Formula E edition.I look forward to congratulating and thanking him in person one day soon… https://t.co/wmkjABNhQu— anand mahindra (@anandmahindra) March 14, 2026

Meta to Layoff 20 Percent of Workforce Amid AI Push6
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇప్పుడు తాజాగా.. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థలోని 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.గత సంవత్సరం నుంచి కంపెనీ సీఈఓ జుకర్‌బర్గ్ ఏఐలో పెట్టుబడులను విపరీతంగా పెంచుతున్నారు. మెటా ఉత్పాదకను పెంచడంలో భాగంగా.. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇది సంస్థలోని 16,000 ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే లేఆఫ్స్ ఎప్పుడు ఉంటాయనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా కంపెనీలో డిసెంబర్ 31 నాటికి దాదాపు 79,000 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సంస్థ ఏఐ స్టార్టప్‌లను కొనుగోలు చేయడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసింది. చైనీస్ ఏఐ స్టార్టప్, మనుస్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ కనీసం 2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. మానవులు పోస్ట్ చేయడానికి అనుమతించని ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన మోల్ట్‌బుక్‌ను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కూడా ఇటీవల ప్రకటించింది.ఏఐ కారణంగా లేదా ఏఐను ఉపయోగించుకోవడంలో భాగంగా.. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా మాత్రమే కాకుండా.. అమెజాన్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, SaaS దిగ్గజం అట్లాసియన్ కూడా ఉన్నాయి. జనవరిలో అమెజాన్ తన శ్రామిక శక్తిలో 1 శాతం లేదా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాసియన్ కూడా AIపై ఎక్కువ ఖర్చు చేయడానికి 1,600 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement