Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India first CBDC PDS pilot e-Rupee ration distribution Annapurti Grain ATM1
ఈ-రూపీ ఆధారిత రేషన్‌ పంపిణీ ప్రారంభం

భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించారు. దీనితో పాటు 24x7 సేవలందించే ‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంను కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎలా పనిచేస్తుంది?ప్రస్తుతానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు..లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో ఆర్‌బీఐ (ఆర్‌బీఐ) ద్వారా ‘ఈ-రూపీ’ క్రెడిట్ అవుతుంది. ఇందులో సరకు రకం, పరిమాణం, రాయితీ ధర ముందే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం అధీకృత రేషన్ షాపుల్లో తమకు కేటాయించిన సరుకుల కోసం మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వీటిని ఖర్చు చేయడం సాధ్యపడదు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు క్యూఆర్‌ కోడ్ ద్వారా, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు.సాధారణంగా పాత పద్ధతిలో డీలర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఈ-రూపీ విధానంలో లబ్ధిదారుడు వౌచర్‌ను రిడీమ్ చేయగానే ఆ టోకెన్ విలువకు సమానమైన నగదు డీలర్ బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది. ప్రతి కిలో ధాన్యం ఎవరికి అందింది, ఏ సమయంలో అందింది అనే సమాచారం రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. తూకంలో మోసాలకు తావుండదు.‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంసామాన్యులకు రేషన్ సేకరణను మరింత సులభతరం చేస్తూ ‘అన్నపూర్తి’ పేరుతో ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషీన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎంలు రోజులో 24 గంటలు పనిచేస్తాయి. కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలవు. మార్చి 2026 నాటికి ఈ యంత్రాల ద్వారా గోధుమలు, బియ్యంతో పాటు (25 కిలోల వరకు), ఒక కిలో ప్యాకెట్లలో కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును లబ్ధిదారులు పొందవచ్చు. ఈ ఏటీఎం యంత్రాలను పూర్తిగా గుజరాత్‌లోనే తయారు చేయడం విశేషం.ఈ ఏటీఎంలను ఉపయోగించడానికి ‘స్మార్ట్ రేషన్ కార్డ్’ లేదా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక డిజిటల్ కార్డ్ అవసరం ఉంటుంది. లబ్ధిదారుడు తన రేషన్ కార్డును ఏటీఎం మిషీన్ వద్ద ఉన్న రీడర్ ద్వారా స్కాన్ చేయాలి. కార్డుతో పాటు భద్రత కోసం వేలిముద్ర లేదా కంటిపాప(ఐరిస్‌) స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డు వేరే వారు దొంగిలించినా ధాన్యం తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కార్డు లేకపోయినా ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా లావాదేవీ పూర్తి చేయవచ్చు.ఏటీఎం పనిచేసే విధానంపైన చెప్పినట్లుగా కార్డ్ లేదా బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుడిని మిషీన్ గుర్తిస్తుంది. ఆ నెలలో వారికి ఎంత కోటా మిగిలి ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు కావాల్సిన వస్తువును (ఉదాహరణకు: బియ్యం లేదా గోధుమలు) పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఈ మిషీన్లలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ధాన్యాన్ని గ్రాములతో సహా అత్యంత కచ్చితంగా తూకం వేస్తాయి. మాన్యువల్ తూకంలో జరిగే మోసాలకు ఇక్కడ తావుండదు. మీరు ఎంచుకున్న వస్తువు కింద ఉన్న అవుట్‌లెట్ ద్వారా బయటకు వస్తుంది. పప్పులు, ఉప్పు వంటివి అయితే సీల్డ్ ప్యాకెట్ల రూపంలో వస్తాయి.దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ గుజరాత్‌లో విజయవంతమైన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టును చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ సీబీడీసీ ఆధారిత రేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాజిక సంక్షేమ పథకాల్లో ‘ప్రోగ్రామబుల్ డిజిటల్ కరెన్సీ’ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారత్ నిలవనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Bengaluru woman quoted Rs 80K month rent for a flat because gets sunlight2
బెంగళూరులో అద్దె ‘మంట’

సహజ వనరులైన గాలి, వెలుతురును కూడా వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్న నగర అద్దె పోకడలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే, దొరికిన ఇంటికి అద్దె కట్టడమే పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో నివాస గృహాల అద్దెలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ ఉద్యోగుల రాకతో ఇప్పటికే డిమాండ్ పెరిగిపోగా తాజాగా ఒక ఇంటి యజమాని పెట్టిన వింత నిబంధన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గదుల్లో మెరుగ్గా సూర్యరశ్మి (సన్‌లైట్‌) వస్తుందనే కారణంతో ఒక ఫ్లాట్‌కు రూ.80,000 అద్దె అడగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.అసలేం జరిగింది?నగరంలో నివాసం కోసం ఇల్లు వెతుకుతున్న అను అనే మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బెంగళూరు అద్దెలు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని, కానీ ఈసారి ఎదురైన అనుభవం షాకింగ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు.‘ఒక గదిలోకి సహజమైన సూర్యరశ్మి వస్తుందనే కారణంతో దానికి రూ.80,000 అద్దె అడిగారు. కనీస సౌకర్యంగా ఉండాల్సిన సూర్యకాంతి ఇప్పుడు ప్రీమియం ఫీచర్‌గా మారిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.Bangalore Rent would never stop surprising me. What do you mean “ma’am is room me sunlight bhi aati hai to iska rent ₹80,000 hai” 😭— Anu (@Escapeplace__) February 13, 2026సోషల్ మీడియా స్పందనఅను చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు బెంగళూరు అద్దె మార్కెట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నెలకు రూ.80 వేల అద్దె కట్టడం కంటే ఆ డబ్బుతో హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం’ అని ఒక వినియోగదారుడు సలహా ఇచ్చారు. ‘బెంగళూరు అద్దెలు చూస్తుంటే ముంబై రియల్ ఎస్టేట్ ధరలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వస్తుందని మరో రూ.20 వేలు అదనంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకింత ధర?గత రెండేళ్లుగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో అద్దెలు 30% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికిగల కొన్ని కారణాలు.. ఆఫీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో టెక్కీల తాకిడి పెరిగింది. విదేశీ కంపెనీల ప్రతినిధులు, హై-నెట్ వర్త్ వ్యక్తులు అధిక ధరలకు వెనకాడకపోవడంతో యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Income Tax Draft 2026 A Welcome Boost for Salaried Individuals3
Income Tax: పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’

కొత్త ఇన్‌కం టాక్స్‌ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్‌మెంట్‌ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్‌ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్‌ సామర్థ్యం 1.6 లీటర్‌ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్‌ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్‌ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్‌ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్‌ చేయడం మానేశారు. డిపార్ట్‌మెంట్‌ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్‌తో తిప్పలు తప్పుతాయ్‌..! చేతిలో సెల్‌ఫోన్, బ్యాగులో ఆధార్‌కార్డు, పాన్‌ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్‌ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్‌ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్‌ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్‌ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్‌ డెవలప్‌మెంట్‌ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్‌ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్‌ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్‌ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్‌ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్‌మెంట్‌ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్‌ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్‌తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్‌ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్‌ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్‌ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్‌ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్‌ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్‌ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్‌కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!

Praper Media shared LinkedIn how startup lost over 2 lakh hiring candidate4
నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే అబద్ధాలతో రెజ్యూమెలను సృష్టించి కంపెనీలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇటువంటి ఫేక్ అభ్యర్థిని నమ్మి ఉద్యోగం ఇవ్వడం వల్ల తమ కంపెనీ రూ.2 లక్షలకు పైగా నష్టపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్ మీడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ గుప్తా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన వివరాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అసలేం జరిగింది?కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య తనిఖీ) అనవసరమని భావించినట్లు గుప్తా పేర్కొన్నారు. కేవలం అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రదర్శన, గట్ ఫీలింగ్ ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఈ క్రమంలోనే చిరాగ్ అనే అభ్యర్థి కంపెనీలోకి ప్రవేశించాడు. పాత కంపెనీలో 3 ఏళ్ల అనుభవం, నెలకు రూ.40,000 వేతనం ఉండడంతో ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈ స్టార్టప్ కంపెనీ రూ.45,000 జీతం ఆఫర్ చేసింది.నియామకం జరిగిన రెండు నెలల తర్వాత చిరాగ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక సాధారణ రియాక్షన్ వీడియో ఎడిటింగ్ టాస్క్ (సాధారణంగా జూనియర్ ఎడిటర్లు రోజుకు మూడు చేస్తారు) పూర్తి చేయడానికి చిరాగ్‌కు రెండు రోజులు పట్టింది. పైగా అతను ఇచ్చిన అవుట్‌పుట్ ఏమాత్రం పనికివచ్చేది కాదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం తన పాత కంపెనీని సంప్రదించింది.వెలుగు చూసిన నిజాలువెరిఫికేషన్ ప్రక్రియలో చిరాగ్ ఆడిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో అతను నెలకు పొందింది రూ.25 వేలు మాత్రమే, కానీ రూ.40 వేలు అని అబద్ధం చెప్పి 80 శాతం పెంపు పొందాడు. తాను పాత కంపెనీలో రాజీనామా చేయలేదు. పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతన్ని తొలగించింది. కొత్త కంపెనీలో రిఫరెన్స్ కోసం అతను ఇచ్చిన మేనేజర్ నంబర్ తన స్నేహితుడిది. ఆ స్నేహితుడు మేనేజర్‌లా నటించి చిరాగ్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.ఈ ఒక్క తప్పుడు నియామకం వల్ల కంపెనీకి కలిగిన నష్టాన్ని గుప్తా వివరించారు. వేతన రూపంలో మూడు నెలలకు గానూ రూ.1.35 లక్షలు, శిక్షణ ఖర్చుల కింద రూ.40,000, రీప్లేస్‌మెంట్ నియామకం కింద రూ.25,000 నష్టపోయామని చెప్పారు. దీనికంటే ముఖ్యంగా క్లయింట్ ప్రాజెక్టుల జాప్యం, టీమ్ మనోధైర్యం దెబ్బతినడం, నాలుగు నెలల విలువైన సమయం వృథా అయినట్లు తెలిపారు.స్టార్టప్‌లకు సూచనలుఈ చేదు అనుభవం తర్వాత ప్రాపర్ మీడియా ప్రతి నియామకానికి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల మునుపటి కంపెనీ హెచ్‌ఆర్‌కు అధికారిక మెయిల్ చేయడం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ క్రాస్ చెక్ చేయడం, అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవడం వంటివి తప్పనిసరి చేశారు. తప్పు జరిగిన తర్వాత బాధపడేకంటే, అభ్యర్థిని కంపెనీలోకి తీసుకునే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆయన సూచించారు.ఇదీ చదవండి: ఉఫ్‌.. బిగ్‌ రిలీఫ్‌!

Gold and Silver rates on 16th February 2026 in Telugu states5
బంగారం రివర్స్‌! కొనేవారికి గుడ్‌న్యూస్‌

దేశంలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు కొనుగోలు చేసేవారికి ఊరట కల్పించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అటు వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 16 February 20266
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు క్రితం సెషన్‌తో పోలిస్తే సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 25,489 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 45 పుంజుకొని 82,646 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement