ప్రధాన వార్తలు
ఐటీ కంపెనీలూ...పారాహుషార్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది. అనిశ్చితితో సైబర్ దాడుల ముప్పులు సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్లతో జరిగే సోషల్ ఇంజినీరింగ్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది.
వెండి కిందికి.. బంగారం పైకి..
న్యూఢిల్లీ: వెండి వరుసగా మూడో రోజు అమ్మకాలతో నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.3,400 తగ్గి (1.3 శాతం) రూ.2,68,300 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,64,300 స్థాయికి చేరింది.‘‘ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరోసారి తీవ్రతరమయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఈ పరిస్థితులు యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతునిస్తున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్కు 65 డాలర్లు నష్టపోయి 5,105 డాలర్ల స్థాయిలో, వెండి ఔన్స్కు అర డాలర్ తగ్గి 83.92 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్వ్యాప్తంగా అమ్మకాలతో మార్జిన్కాల్స్ ఎదురై, పొజిషన్లను బలవంతంగా విక్రయించుకోవాల్సి రావడం సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు.
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్కు సరఫరా చేస్తున్న గ్యాస్ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు."మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.Putin says Russia should take advantage of the sky-high oil prices after US-Israeli attacks on Iran.Russia should redirect supplies to Europe elsewhere, he adds. “If we shift our focus right now to the markets that need more supplies, we might get a foothold there.” pic.twitter.com/FZAHksP2p6— max seddon (@maxseddon) March 9, 2026
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి. మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి.
మార్కెట్ పై క్రూసేడ్!
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనడంతో దేశీయంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలపై దాడులతో చమురు ధరలు తొలుత పీపాకు 30 శాతంపైగా ఎగశాయి. దీంతో ప్రారంభంలో 2,494 పాయింట్లకుపైగా పడిపోయిన సెన్సెక్స్ చివరికి 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద ముగిసింది. మొదట్లో 753 పాయింట్లు పతనమైన నిఫ్టీ సైతం.. చివరికి 422 పాయింట్ల క్షీణతతో 24,028 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,425 దిగువకు చేరగా.. నిఫ్టీ 23,698 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఒక్క రోజులో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 8 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. ధరల మంట... లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ధర ఉదయం 120 డాలర్లను తాకింది. న్యూయార్క్లో లైట్ స్వీట్ క్రూడ్ సైతం 119.5 డాలర్లకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు తలెత్తాయి. వెరసి దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు పరుగుతీశారు. అయితే మిడ్సెషన్కల్లా చమురు ధరలు కాస్త ఉపశమించాయి. మరోపక్క యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలు సైతం సగానికి తగ్గాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో కొంతమేర రికవరీ కనిపించింది. గత వారం నైమెక్స్ క్రూడ్ 36 శాతం, బ్రెంట్ 28 శాతం జంప్ చేయడం తెలిసిందే. అమ్మకాల షాక్: ఎన్ఎస్ఈలో ఐటీ నష్టపోకుండా నిలదొక్కుకోగా.. ఆటో, పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్అండ్ గ్యాస్, కెమికల్స్ 4–2% మధ్య పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీఎంపీపీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ, కొటక్ బ్యాంక్ 5.3–3.5% మధ్య పతనమయ్యాయి. అయితే విప్రో, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ 1.6–0.6 మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతంపైగా నీరసించాయి. చమురు మంటతో టైర్లు, ఆటోమొబైల్, పెయింట్లు, ఎయిర్లైన్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ధరలకు రెక్కలురానుండటంతో ఆర్బీఐ కఠినతర విధానాలవైపు మొగ్గు చూపవలసి వస్తుందని తెలియజేశారు. దీంతో బ్యాంకింగ్ కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడటం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. చమురు సెగతో చమురు దెబ్బకు ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ 6–4.3% మధ్య పడిపోయాయి. షాలిమార్, ఇండిగో, ఏషియన్, నెరోలాక్, బెర్జర్ పెయింట్స్ 4–2% మధ్య, జేకే, సియట్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్ 6–2% మధ్య క్షీణించాయి. ఏటీఎఫ్ వ్యయాలపై భయాలతో ఇంటర్గ్లోబ్ 4 శాతం పడింది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుయుద్ధ భయాలతో ఇటీవల దేశీ స్టాక్స్లో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 9,014 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
కార్పొరేట్
30వేల ఉద్యోగుల తొలగింపు?: స్పందించిన కంపెనీ
మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!
నీతా అంబానీ హీరోస్ ఉద్యమం.. ఎందుకంటే?
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
కాంపోజిషన్ ఫీజు ఉండదు.. ఎగుమతిదారులకు కేంద్రం ఊరట
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..
భారత్కు ఫిన్లాండ్ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్
మహిళా సాధికారతకు ఎస్బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల...
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
పసిడి ప్రియులకు గడిచిన వారమంతా ఆనందమే కలిగింది. దే...
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం ...
పసిడి ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా రేట్లు రివర్స్!
దేశంలో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఐదు రోజ...
2026లో ధనవంతుల జాబితా: టాప్ 10లో వీరే..
భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హు...
పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్.. డీజిల్!
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపి...
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత...
‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’
రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్.. ఫీచర్లు ఇవే..
వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తరహాలోనే వాట్సాప్ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇకపై వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.వాట్సాప్ ప్లస్లో స్పెషల్ ఫీచర్లుప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెయిడ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు.ఫీచర్వివరణచాట్ పిన్సాధారణంగా 3 చాట్లు మాత్రమే పిన్ చేయగలం, కానీ ఇందులో 20 చాట్ల వరకు పిన్ చేయవచ్చు.కస్టమైజేషన్యాప్ ఐకాన్ రంగులు, ట్యాబ్లు, బటన్లు మార్చుకునే సౌలభ్యం.థీమ్స్, స్టిక్కర్స్ఎక్స్క్లూజివ్ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్ ప్యాక్స్.రింగ్టోన్స్కాంటాక్ట్స్ కోసం కస్టమ్ రింగ్టోన్స్ సెట్ చేసుకునే ఆప్షన్.రియాక్షన్స్మెసేజ్ రియాక్షన్ల రంగులను మార్చుకునే వెసులుబాటు. వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎలాంటి సర్వీసులు ఉచింతంగా అందుబాటులో ఉంటాయో కింద చూద్దాం.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్సైకిల్ మెకానిక్లు, లైఫ్గార్డ్లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇంటర్నెట్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం & పనితీరును మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్టార్టప్ రంగంలో పెట్టుబడులు తగ్గడం.. లాభదాయకతపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటూ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్లిప్కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ఫ్లిప్కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.
పర్సనల్ ఫైనాన్స్
PF ఖాతాలో రూ.లక్ష ఉంటే.. ఎంత వడ్డీ వస్తుందంటే?
2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భారీ సబ్సిడీ స్కీమ్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షలు!
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆదాయ వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLM) కింద గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50 లక్షల వరకు మూలధన సబ్సిడీ పొందే అవకాశం ఉంది.సగం సబ్సిడీకేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు వ్యయంపై 50 శాతం వరకు మూలధన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు.అర్హులెవరు?ఈ పథకానికి వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూపులు (JLG), సహకార సంఘాలు, సెక్షన్-8 కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ని గాడిదలు ఉండాలంటే..గాడిదల పెంపక యూనిట్కు అర్హత పొందాలంటే కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలతో ప్రాజెక్టు ఉండాలి. స్థానిక జాతులను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని దేశీయ గాడిద జాతులకు మాత్రమే ప్రభుత్వం వర్తింపజేస్తోంది.సబ్సిడీ విడుదల ఇలా..ఈ సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు. ప్రాజెక్టుకు బ్యాంకు రుణం ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతను విడుదల చేస్తారు. అనంతరం గాడిదల పెంపక కేంద్రం పూర్తయి, అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రెండో విడత సబ్సిడీని అందిస్తారు.దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2019లో జరిగిన 20వ పశు జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. 2012తో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు.ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలకు యాంత్రీకరణ పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, స్థానిక జాతులను సంరక్షించేందుకు గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
శుభ్ ఫ్లెక్సి పెన్షన్.. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులుప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.రిటైర్మెంట్ ప్లానింగ్కు స్మార్ట్ మార్గంఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయంమీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశంవేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.“భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినదిప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చుఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.సరళతర ప్రీమియం ఆప్షన్లుఏకమొత్తంగా చెల్లించవచ్చు2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చుకుటుంబానికి రక్షణఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.ఎవరికి అనుకూలం?శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుందిముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారుస్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్కు సమీపిస్తున్న వారుస్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలుయాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులునిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు
EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్ పద్ధతిలో అందుతాయి.ఇకపై మాన్యువల్ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్ రీఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మానవ జోక్యం లేకుండా... క్లెయిమ్ ప్రాసెస్ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్ ఆధారంగానే క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్/ ఈ –మెయిల్ అప్డేట్ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్ ఖాతాల నిర్వహణకు చెక్ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఈపీఎఫ్ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని పైలట్ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.క్లెయిమ్స్ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్ పోర్టల్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.


