ప్రధాన వార్తలు
కారులో అవసరం లేని 5 ఫీచర్స్.. ధర కూడా తగ్గుతుంది!
కార్ల ధరలు ప్రధానంగా మీరు ఎంచుకునే ఫీచర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే.. బేస్ వేరియంట్ ధర ఒకలా ఉంటే, టాప్ వేరియంట్ ధర ఇంకోలా ఉంటుంది. చూడటానికి కారు ఒకేలా కనిపించినా.. బేస్ వేరియంట్ - టాప్ వేరియంట్ ఫీచర్స్ వేరేలా ఉంటాయి. అంటే బేస్ వేరియంట్ లిమిటెడ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ లేదా అదనపు ఫీచర్స్ పొందుతుంది.ప్రస్తుతం కారు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లనే కొంటున్నారు. ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు సరే.. ఉన్న ఫీచర్స్ ఉపయోగిస్తున్నారా.. అంటే?, లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా. కాబట్టి ఈ కథనంలో ఫాఫాపు అవసరం లేని 5 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.బిల్ట్ నావిగేషన్ సిస్టమ్లుచాలా మంది డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే వీటికంటే ఫోన్ నావిగేషన్ మరింత ఖచ్చితమైనది. అప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతుంది.పవర్డ్ టెయిల్గేట్బటన్తో బూట్ను ఓపెన్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ చిన్న కార్లలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చేతితో ఓపెన్ చేయడం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది పెద్ద కార్లకు అనుకూలంగా ఉంటుంది.పనోరమిక్ సన్రూఫ్ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ పనోరమిక్ సన్రూఫ్ ఫీచర్ ఉంది. కానీ చాలామంది ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించరు. ఎక్కువ గాలి లేదా ఎండ వస్తుందని దాదాపు క్లోజ్ చేసి ఉంచుతారు.గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మీ చేతిని ఊపి మ్యూజిక్ మార్చడం లాంటి ఫీచర్. మొదట చూడటానికి ఇది చాలా కూల్గా అనిపించవచ్చు, కానీ ఎక్కువసార్లు ఇవి సరిగ్గా పని చేయవు. కాబట్టి టచ్ కంట్రోల్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది వేగంగా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది.టచ్-ఓన్లీ క్లైమేట్ కంట్రోల్స్డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ద్వారా ACని అడ్జస్ట్ చేయడం చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఫిజికల్ నాబ్లు సులభంగా ఉంటాయి. ప్రత్యేకించి దీనిపై శ్రద్ద చూపాల్సిన అవసరం లేదు.ఒక కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అవసరమైన ఫీచర్స్ ఏవి కావాలి?, వాటిని ఎంతవరకు ఉపయోగిస్తాము అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. లేకుంటే మీకు అవసరం లేని ఫీచర్లకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం.
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.సింగపూర్లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు.
వారం రోజుల్లో పసిడి జంప్.. ఎంతలా పెరిగిందంటే?
బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?
ఇంటి బయట ఫర్నీచర్.. ఇదే కొత్త ట్రెండ్!
ఎండ, వాన, చలి నుంచి రక్షణ కల్పించే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ఉన్నంతలో ప్రతి ఒక్కరూ తమ పొదరింటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఈక్రమంలోనే ఇంటి లోపల కాదు ఇంటి బయటి ప్రదేశాల్లోనూ ఇంటీరియర్ డిజైనింగ్కు ప్రాధాన్యత పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోమెట్రో నగరాలలో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే నగరాలలో భూముల ధరలు రూ.కోట్లలో ఉంటాయి.. గ్రీనరీకి స్థల కేటాయింపులు తక్కువే. దీన్ని లక్ష్యంగా చేసుకునే నిర్మాణ సంస్థలు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రీనరీ హోమ్స్ను నిర్మిస్తున్నాయి. విశ్రాంతి, ప్రశాంతత, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గార్డెన్ ఫర్నీచర్కు మార్కెట్లో ఆదరణ పెరిగింది. ఉన్నంతలో ఉన్నతంగా.. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినూత్న డిజైన్లతో భారత ఔట్ డోర్ ఫర్నీచర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిమిత స్థలంలో అందంగా, ఆకర్షణీయంగా ఒద్దికైపోవడమే ఈ గార్డెన్ ఫర్నీచర్ ప్రత్యేకత. వినియోగంలో సౌకర్యం, సౌలభ్యంతో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, ఎక్కువ కాలం మన్నికగా నిలుస్తుండటంతో కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. రీసైకిల్ చేసిన కలప, వెదురు, తాటి చెట్ల నుంచి తయారయ్యే రట్టన్, గ్లాస్, ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్, లోహ మిశ్రమం వంటి పర్యావరణ అనుకూలమైన, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు.నచ్చిన రంగు, ఆకృతి.. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా నచ్చిన రంగు, ఆకృతి, డిజైన్లలో ఈ గార్డెన్ ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. ఫోల్డబుల్ కుర్చీలు, సోఫాలు, డైనింగ్, కాఫీ టేబుల్స్, కాంపాక్ట్ యూనిట్లు, బార్ లాంజ్లు వంటివి ఉంటాయి. చూపరులకు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. గుండ్రంగా, చతురస్రాకారం, వంపు తిరిగిన, నక్షత్రం, గొడుగు, కోడి గుడ్డు ఆకారంలో ఇలా మనకు నచి్చన ఆకృతిలో ఎంపిక చేసుకోవచ్చు. వీటి కోణాలు పదునుగా ఉండవు.. దీంతో భద్రత ఉంటుంది.
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది.
అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే తుక్కుకే!
లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో నడిపే లేదా పార్క్ చేసిన పాత పెట్రోల్ & డీజిల్ వాహనాలను నోటీసు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.బీఎస్ III అంతకంటే పాత వాహనాలు, అంటే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన డీజిల్ వాహనాలు & 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పెట్రోల్ వాహనాలను లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలుగా పరిగణిస్తారు. ఇలాంటి వాహనాలను పబ్లిక్ రోడ్డుపై డ్రైవ్ చేయకూడదు.కాలం చెల్లిన వాహనాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందటం ద్వారా.. ఢిల్లీ వెలుపలికి తీసుకెళ్లవచ్చు. రూల్స్ అతిక్రమించి.. బహిరంగ ప్రదేశాల్లో పాత వాహనాలను నడిపినట్లయితే.. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని స్క్రాపేజ్ చేయడానికి తరలించడం జరుగుతుంది. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయంపాత వాహనాలు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు కూడా కార్లలో ఇంజిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ 4, బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు బీఎస్ 6 వాహనాలే అందుబాటులో ఉన్నాయి.
కార్పొరేట్
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
పాకెట్ ఎఫ్ఎం లక్ష్యం ఇదే!
జియోహాట్స్టార్లో వాయిస్ స్ట్రీమింగ్
25,480 మార్కు వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ము...
డబుల్ షాక్.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చా...
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ...
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించ...
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులక...
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల...
రూపే కార్డు వినియోగం పెంచాలి
చెల్లింపులకు యూపీఐ ప్రధాన సాధనంగా మారిందని.. నగదు ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్నగర్లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026
పర్సనల్ ఫైనాన్స్
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!


