Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 27th February 2026 in Telugu states1
విచిత్రంగా బంగారం ధరలు.. తగ్గాయా.. పెరిగాయా?

దేశంలో పుత్తడి ధరలు (Today Gold Rate) ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రితం రోజున తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగిశాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం విచిత్రంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on 27 February 20262
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు తగ్గి 25,403 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 269 పాయింట్లు నష్టపోయి 81,971 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.81బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70.8 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.54 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.Today Nifty position 27-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

SEBI Chairman Tuhin Kanta Pandey comments on AI3
ఏఐ టెక్నాలజీ మార్కెట్లకు మంచిదే

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో పర్యవేక్షణను పటిష్టపరచడం, రిస్క్‌ నిర్వహణ, పారదర్శకతతోపాటు.. ఇన్వెస్టర్‌ అవగాహనను సైతం పెంపొందించేందుకు వీలుంటుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొటక్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సందర్భంగా దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లనుద్ధేశించి పాండే ప్రసంగించారు.దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మార్కెట్‌ నాణ్యత, పాలనా ప్రమాణాలు, సమాచార వెల్లడి, లిక్విడిటీ, సంస్థల బలిమి ద్వారా తదుపరి వృద్ధి ప్రతిఫలిస్తుందని వివరించారు. సప్లై చైన్‌లో మార్పులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వాతావరణం సంక్షిష్టంగా మారుతున్నదని పాండే పేర్కొన్నారు. వెరసి వృద్ధి అనేది రిటర్నులపైకాకుండా నిలకడ, నమ్మకం(క్రెడిబిలిటీ), వాస్తవిక అంచనాలు తదితరాలకు సంబంధించిన అంశంగా మారుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

NSE CEO Ashish Chauhan comments on futures and options trading stock market4
ట్రేడింగ్‌కు కనీస అర్హత ఉండాలి

డెరివేటివ్స్‌(ఎఫ్‌అండ్‌వో)లో పాలుపంచుకునే ఇన్వెస్టర్లకు కనీస అర్హతా ప్రమాణాలు ఉండాలని స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా బలహీనవర్గాలు లేదా కనీస అవగాహనలేని ప్రజలు స్పెక్యులేషన్‌తో సొమ్మును వృధా చేసుకోకుండా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.నిజానికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లలో 90 శాతంమంది సొమ్ము నష్టపోతున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పదేపదే వెల్లడిస్తున్న నేపథ్యంలో చౌహాన్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అంతంతమాత్రం ఆదాయాలు, అవగాహన ఉండే సామాన్య ప్రజానీకం తమ సొమ్మును, వనరులను, ఎనర్జీని స్పెక్యులేషన్‌పై వృధా చేసేందుకు ఏ వర్ధమాన దేశమూ అనుమతించబోదని చౌహాన్‌ పేర్కొన్నారు.డెరివేటివ్స్‌ లావాదేవీలు చేయాలంటే కనీస అర్హత ప్రమాణాలు ఉండేలా నిబంధనలు రూపొందించవలసి ఉన్నట్లు ఇక్కడ జరిగిన ఒక సదస్సులో అభిప్రాయపడ్డారు. యూఎస్, సింగపూర్‌ తదితర దేశాలలో ఉన్న నియంత్రణలతరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో కనీస అవగాహనలేని సామాన్య ప్రజలు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకోవచ్చని, తద్వారా వారు నష్టపోకుండా నివారించవచ్చని వివరించారు.ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

AI will be India next Y2K moment, no threat to jobs Says Piyush Goyal5
ఏఐతో మరిన్ని అవకాశాలు 

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్‌కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్‌ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్స్‌ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్‌ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.

Sebi introduces life cycle funds6
కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ 

న్యూఢిల్లీ: సొల్యూషన్స్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ నిలిపివేసింది. కొత్తగా లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. పేరుకు తగ్గట్టు పెట్టుబడుల విధానం ఉండేలా చూడడం, పథకాల పేరుతో అత్యధిక రాబడుల హామీలను నిరోధించడం తదితర లక్ష్యాలతో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణ విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పథకాలను ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లైఫ్‌ సైకిల్, ఇతర పథకాలు (ఫండ్‌ ఆఫ్‌ ఫండ్, ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు) పేరుతో మొత్తం ఐదు విభాగాలుగా వర్గీకరించింది. ‘‘ఇన్వెస్టర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు, ఒక విభాగంలో అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల మధ్య పథకాల్లో ఏకరూపత కోసం, పేరుకు తగినట్టుగా పథకాలు ఉండేందుకు, పథకం రాబడులను సూచించే విధంగా పథకాలకు పేర్లు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్టు సెబీ ప్రకటించింది. సొల్యూషన్‌ ఫండ్స్‌ సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ ఫండ్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ఈ పథకాలకు సంబంధించి కొత్త చందాలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ విభాగంలో ఉన్న పథకాలను, ఇదే మాదిరి పెట్టుబడులు, రిస్క్‌ ప్రొఫైల్‌ కలిగిన పథకాల్లో అనుమతి అనంతరం విలీనం చేయాలని పేర్కొంది. విదేశీ సెక్యూరిటీలను ఇకపై ఎంత మాత్రం ప్రత్యేకమైన అసెట్‌ క్లాస్‌గా పరిగణించరు. లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ కొత్తగా ఓపెన్‌ ఎండెడ్‌ లైఫ్‌ సైకిల్‌ ఫండ్స్‌ విభాగాన్ని సెబీ ప్రవేశపెట్టింది. ముందుగా నిర్ణయించిన కాల వ్యవధిపై.. ఈక్విటీ, డెట్, ఇన్విట్, ఈటీసీడీ, బంగారం/వెండి ఈటీఎఫ్‌ల వారీ లక్ష్యం ఆధారిత పథకాలను ఆఫర్‌ చేయొచ్చు. కాల వ్యవధి ముగియడానికి ముందు నుంచి క్రమంగా ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటూ, డెట్‌కు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. → ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తమ నిర్వహణ ఆస్తుల్లో 95 శాతం మేర సంబంధిత సూచీలోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. → అలాగే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) అన్నవి వాటి అంతర్లీన ఫండ్‌లోనే 95 శాతం ఇన్వెస్ట్‌ చేయాలి. → ఐదేళ్లలోపు గడువు ముగిసే ఫండ్స్‌లో డెట్‌ పెట్టుబడులు అన్నవి ఏఏ లేదా అంతకంటే మెరుగైన రేటింగ్‌ సాధనాల్లోనే ఉండాలి. → ఇకపై మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ విభాగాల వారీగా పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ ఎంత స్థాయిలో ఉందన్నది వెల్లడించాలి. అంటే వివిధ పథకాలు ఒకే కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే, అది ఎంత మేరో తెలియజేయాలి. ఇలా ఈక్విటీ–ఈక్విటీ.. డెట్‌–డెట్‌ పథకాల మధ్య పోర్ట్‌ఫోలియో ఓవర్‌ల్యాప్‌ వివరాలను వెల్లడించాలి. → దేశీ, విదేశీ, హైబ్రిడ్, డెట్, ఈక్విటీ, కమోడిటీ, థీమ్యాటిక్‌ విభాగాల్లో పేర్లకు సంబంధించి ప్రామాణిక విధానాన్ని, పరిమితులను తీసుకొచ్చింది. ప్రస్తుత పథకాలకు ఈ నిబంధనలను అమలు చేయడానికి సెబీ ఆరు నెలల సమయం ఇచి్చంది. → యాక్టివ్‌ ఫండ్స్‌ నిబంధనల మేరకు తమ ప్రాధాన్య కేటాయింపులు పోను, మిగిలిన మొత్తం నుంచి 35 శాతాన్ని బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లకు కేటాయించుకోవచ్చు. సులభతరం.. రిటైల్‌ ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతను తొలగించి, సులభతరానికి కొత్త నిబంధనలు వీలు కలి్పస్తాయని చాయిస్‌ వెల్త్‌ సీఈవో నికుంజ్‌ సరాఫ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement