ప్రధాన వార్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.
భారత చమురు మార్కెట్పై ‘యుద్ధ’ సెగ
పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత్పై ముఖ్యంగా చమురు మార్కెట్, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.పెరగనున్న దిగుమతి భారంభారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 90 డాలర్ల మార్కును దాటే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇది 77 డాలర్ల వద్ద ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో క్రూడ్ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. పరిమితంగా రష్యా నుంచి అందుతున్న రాయితీ చమురు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.రూపాయి పతనం - ఆర్థిక సవాళ్లుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి చేరుకోవచ్చు. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది.భారత్ - ఇరాన్ వాణిజ్య సంబంధాలుఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో ఏర్పడే అంతర్గత రాజకీయ మార్పులు భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇరాన్ కొత్త నాయకత్వం భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపైనే ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుంది. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవడానికి భారత్కు ఈ పోర్ట్ అత్యంత కీలకం కావడంతో అక్కడి రాజకీయ మార్పులు మన వ్యూహాత్మక ప్రయోజనాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.వ్యవసాయ ఎగుమతులురెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యవసాయ ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇరాన్కు పెద్ద మొత్తంలో ఎగుమతి అయ్యే బాస్మతీ బియ్యం, టీ, చక్కెర వంటి ఉత్పత్తులకు సంబంధించి చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు. యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత పెరిగితే భారతీయ ఎగుమతిదారులు తమ బకాయిలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.అప్రమత్తతే మార్గంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీలో భాగమైన భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడం, దౌత్యపరంగా అడుగులు వేయడం కీలకం.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి. వరుసగా మూడో రోజులు దారుణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.8బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా భారీ మార్పులు చేస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.1,000 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై అమ్మకందారుల నుంచి వసూలు చేసే రిఫరల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఏమిటీ రిఫరల్ ఫీజు?అమెజాన్ ప్లాట్ఫారమ్లో వస్తువులను విక్రయించినందుకు గానూ ప్రతి అమ్మకంపై సెల్లర్ నుంచి కంపెనీ కొంత శాతం కమీషన్ను వసూలు చేస్తుంది. దీనినే రిఫరల్ ఫీజు అంటారు. సాధారణంగా ఇది ఉత్పత్తి కేటగిరీని బట్టి 2% నుంచి 16.5% వరకు ఉంటుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1,800 కేటగిరీల్లో రూ.300 నుంచి రూ.1,000 మధ్య ధర ఉన్న ఉత్పత్తులకు ఈ కమీషన్ భారం ఉండదు.కీలక మార్పులు ఇవే..గతంలో (ఏప్రిల్ 2025) కేవలం రూ.300 లోపు వస్తువులకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రూ.1,000 వరకు విస్తరించారు. దీనివల్ల లబ్ధి పొందే ఉత్పత్తుల సంఖ్య 1.2 కోట్ల నుంచి ఏకంగా 12.5 కోట్లకు పెరగనుంది. దాంతోపాటు రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల విక్రేతలకు షిప్పింగ్ ఫీజులో 20% రాయితీ ప్రకటించింది. అమ్మకందారులు తమ వద్దే స్టాక్ ఉంచుకుని కేవలం డెలివరీ బాధ్యతను అమెజాన్కు అప్పగించే ‘ఈజీ షిప్’ పద్ధతిలో కూడా ఈ 20% ఫీజు తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.‘ఈ నిర్ణయం వల్ల విక్రేతలకు అమ్మకం ఖర్చులో దాదాపు 70% వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు అమెజాన్ ప్లాట్ఫారమ్ మరింత లాభదాయకంగా మారుతుంది’ అని అమిత్ నందా, డైరెక్టర్, అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్ట్నర్ సర్వీసెస్ అన్నారు.తీవ్రమవుతున్న ఈ-కామర్స్ పోటీ..మీషో 2022లోనే జీరో కమీషన్ మోడల్ను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను భారీగా ఆకర్షించింది. ఫ్లిప్ కార్ట్ గతేడాది నవంబర్లో రూ.1,000 లోపు ఉత్పత్తులపై కమీషన్ రద్దు చేయడమే కాకుండా, తన ‘షాప్సీ’ ప్లాట్ఫారమ్లో పూర్తిగా జీరో కమీషన్ అమలు చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేతలను తమ ప్లాట్ఫారమ్లోకి తీసుకురావడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం. అమ్మకందారులపై భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే వస్తువులు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
కార్పొరేట్
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ట్రావెల్కి హోలీ జోష్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
ఐపీఓ రివర్స్ గేర్!
ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం
స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడింగ్ బంద్
భారత స్టాక్ మార్కెట్లకు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) మార్చ...
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడి చేయడం ...
యుద్ధం మొదలైంది.. ఇక బంగారం పెరిగిపోతుందా?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమ...
ఒక్కసారిగా ఇంత రేటా.. భారీగా ఎగిసిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి....
కొత్త జీడీపీ సిరీస్లో జీఎస్టీ, ఈ-వాహన్ డేటా
2022-23 బేస్ ఇయర్గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశ...
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?
అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత...
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జ...
ఆర్బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరు...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఫోన్ ఛార్జర్కి ఇంత కథ ఉందా!
కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ముఖ్యంగా ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?ప్రారంభ కాలంలో ఫోన్ ఛార్జ్ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్సంగ్ ఫోన్ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్కు వాడే ఛార్జర్ మరొక ఫోన్కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.ఆ తర్వాత యూఎస్బి (యూనివర్సల్ సీరియల్ బస్) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్కు వైర్లెస్గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్లెస్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్లో 100 శాతం ఛార్జింగ్ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు.
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026
ఐక్యూ15ఆర్ స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్తగా 15ఆర్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మొదలైన వాటిల్లో సేల్ మొదలవుతుంది.ఇందులో 6.59 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 జెన్ 5, 7600 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ2, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్లో ఉద్యోగాలు
జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్ టైమ్లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్నెస్కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026
పర్సనల్ ఫైనాన్స్
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
బ్యాంకులకు వరుస సెలవులు.. ఇదే చివరి నెల!
మార్చి నెలలో అడుగు పెడుతున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి నెల. పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు చాలానే ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు కస్టమర్లు ఈ మార్చి నెలలో తమ బ్యాంకు బ్రాంచ్ల సందర్శనలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పండుగలు, రాష్ట్రాల వారీగా ఉన్న ప్రత్యేక సెలవులు, అలాగే సాధారణ ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల కారణంగా అనేక రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ముందస్తుగా షెడ్యూల్ను చూసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణలు, చెక్ క్లియరెన్సులు వంటి ఇతర బ్రాంచ్ సేవలలో ఆలస్యాలను నివారించవచ్చు.మార్చిలో బ్యాంకు సెలవులు» మార్చి 1 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ సెలవు.» మార్చి 2: హోలికా దహన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 3: హోలి, డోల్జాతర తదితర పండుగల సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు. మార్చి 4: యోసాంగ్ (రెండవ రోజు)తో పాటు హోలీ వేడుకల నేపథ్యంలో త్రిపుర, గుజరాత్, మిజోరం, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 8 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 13: చాప్కార్ కత్ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేత.» మార్చి 14 (రెండో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 15 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 17: షాబ్ ఈ ఖదర్ సందర్భంగా జమ్మూ & కాశ్మీర్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 19: ఉగాది, గుడి పడ్వా, సాజిబు నోంగ్మా పంబా వేడుకల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ & కాశ్మీర్, గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.మార్చి 20: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 21: రంజాన్-ఈద్, సర్హుల్ తదితర పండుగల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 22 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 26: శ్రీ రామ నవమి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.» మార్చి 28 (నాలుగో శనివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 29 (ఆదివారం): దేశవ్యాప్త సెలవు.» మార్చి 31: మహవీర్ జయంతి సందర్భంగా ఆర్బీఐ సెలవుగా గుర్తించినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరాంత లావాదేవీల దృష్ట్యా ప్రభుత్వ వ్యాపారం నిర్వహించే ఏజెన్సీ బ్యాంకులు ఆ రోజున తెరిచి ఉంటాయి.యథావిధిగా డిజిటల్ సేవలుబ్యాంకు బ్రాంచీలకు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు కొనసాగుతాయి. నిధుల బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి డిజిటల్ లావాదేవీలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయి.
ఐటీ కొత్త రూల్: ఇంటి ఓనర్తో సంబంధం చెప్పాలి
ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది. వేతన జీవులు హెచ్ఆర్ఏ క్లెయిమ్ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఇకపై ఫారమ్ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్ ట్యాక్స్ విత్హోల్డింగ్ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
కొంచెం రిస్క్ ఉన్నా.. లాభం రావాలంటే?
ఈక్విటీలలో థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్ అన్నవి కొంచెం రిస్క్ ఉన్నా సరే, రాబడులు కూడా బలంగా ఉండాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ మాత్రం భిన్నమైన, మెరుగైన పనితీరుతో ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వైవిధ్యం కోసం కేటాయించుకోవాలని భావించేట్టు అయితే.. ఈ ఫండ్ను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం 2021 జనవరిలో ప్రారంభమై.. ఐదేళ్ల ట్రాక్ రికార్డును పూర్తి చేసింది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే అది రూ.2.51లక్షలుగా మారి ఉండేది. ఐదేళ్లలోనూ ఏటా 20.56 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడి 15.47 శాతమే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో పెట్టుబడులపై 18 శాతం రాబడిని అందించింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడి 22.82 శాతంగా ఉంది. ఇక ఇదే విభాగంలో ఇతర పథకాలతో పోలి్చతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ ట్రాక్ రికార్డు పటిష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6.10 లక్షలు ఐదేళ్లలో రూ.9.74 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 18.47 కాంపౌండెడ్ రాబడి (సీఏజీఆర్)కి సమానం.పెట్టుబడుల విధానం..బిజినెస్ సైకిల్స్ అంటే.. కొన్ని వ్యాపారాలకు ఒక్కో సమయంలో డిమాండ్ బలంగా ఉంటుంది. ప్రస్తుతం మెటల్స్లో బంగారం, వెండి, అల్యూమినియం, రాగి ధరలు గణనీయంగా పెరగడం, ఈ రంగాల్లోని కంపెనీలు బలంగా లాభాలు ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైకిల్స్ను ఈ ఫండ్ ముందే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులకు (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వృద్ధి గమనం, ద్రవ్య పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు) అనుగుణంగా ప్రయోజనం పొందే రంగాలను, థీమ్యాటిక్ అవకాశాలను ముందే గుర్తించి, ఆయా రంగాల్లోని బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. పరిస్థితులకు అనుగుణంగా విదేశీ స్టాక్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,808 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97.88 శాతం మేర ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.75 శాతం, నగదు రూపంలో 1.37 శాతం కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను గమనించగా.. లార్జ్క్యాప్స్ కంపెనీల్లో 73.54 శాతం, మిడ్క్యాప్ కంపెనీల్లో 9.6 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 5.51 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో మొత్తం 84 స్టాక్స్ ఉన్నాయి. రంగాల వారీ కేటాయింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా 32.28 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్ కంపెనీల్లో 17.52 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీల్లో 12.90 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది.


