Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US Trade no country has signaled exit tariff agreements1
పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూఎస్‌ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఏ దేశమూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలగాలనుకోవడం లేదని చెప్పారు.నిర్మాణాత్మక చర్చలు - స్థిరమైన బంధాలుఓ కార్యక్రమంలో గ్రీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములతో అమెరికా జరుపుతున్న చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని వెల్లడించారు. అమెరికా వాణిజ్య విధానాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించినప్పటికీ దాని ప్రభావం వల్ల భాగస్వామ్య దేశాలు తమ ఒప్పందాల నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటివరకు ఏ దేశం కూడా మా వద్దకు వచ్చి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని చెప్పలేదు’ అని గ్రీర్ పేర్కొన్నారు.ఈయూ, ఇతర దేశాలతో సమన్వయంప్రస్తుత వాణిజ్య ఒప్పందాలకు అమెరికా కట్టుబడి ఉందనే అంశాన్ని బలోపేతం చేయడానికి గ్రీర్ ఇప్పటికే ఈయూలోని తన సహచరులతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇతర కీలక దేశాల అధికారులతో కూడా ఇలాంటి చర్చలు జరపడానికి షెడ్యూల్ ఖరారైంది. అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ షెడ్యుల్‌ను రూపొందించినట్లు అమెరికా చెప్పింది.విశ్లేషకుల అభిప్రాయంఅమెరికాలోని అంతర్గత చట్టపరమైన మార్పులు లేదా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభావితం చేయవనే నమ్మకం వాణిజ్య భాగస్వాముల్లో ఉందని గ్రీర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యూఎస్‌ అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించడమే కాకుండా మిత్రదేశాల మధ్య విశ్వాసాన్ని పటిష్టం చేస్తుంది. వాణిజ్య విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అమెరికా తన గ్లోబల్ ట్రేడ్ లీడర్‌షిప్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్‌ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!

Mastercard unveiled Agentic Commerce framework2
ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్‌ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!

కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి మన తరఫున పనులు పూర్తి చేసే ఏజెంటిక్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా మాస్టర్ కార్డ్ తన వినూత్న ఏజెంటిక్ కామర్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించింది. కేవలం వస్తువులను సిఫార్సు చేయడమే కాకుండా వినియోగదారుడి అవసరాలను గుర్తించి బేరసారాలు ఆడి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ ఏఐ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితేంద్ర రాజ్‌పుత్‌ కొన్ని అంశాలు వెల్లడించారు.స్థానిక భాషల్లో ఆర్థిక లావాదేవీలుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్ కార్డ్ తన ఏజెంటిక్ వ్యవస్థను రూపొందించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సైతం ఏఐ ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో వినియోగదారుడు మొదటగా తనకిష్టమైన భాషను ఎంచుకోవచ్చు. వాయిస్ సపోర్ట్‌తో కూడిన ఈ టెక్నాలజీ వివిధ భారతీయ భాషల్లో సంభాషించగలదు.భారతీయ నిబంధనలకు అనుగుణంగా డేటా స్థానికీకరణ (Data Localization), గోప్యత, భారతీయ ఆర్థిక చట్టాలకు లోబడి ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ‘మేము భారతదేశంలో దశాబ్దాలుగా సర్వీసులు అందిస్తున్నాం. ఇక్కడి డేటా నిబంధనల ఆధారంగానే మా ఏజెంటిక్ కామర్స్ ఏర్పాటు చేశాం’ అని రాజ్‌పుత్‌ స్పష్టం చేశారు.సాధారణ ఈ-కామర్స్ Vs ఏజెంటిక్ కామర్స్సాధారణ ఈ-కామర్స్‌లో మీరు ఒక వెబ్‌సైట్‌కి వెళ్లి వస్తువులను వెతికి, ధరలను పోల్చి, మీరే ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఏఐ కేవలం ‘మీకు ఫలానా వస్తువులు నచ్చవచ్చు’ అని సిఫార్సులు మాత్రమే చేస్తుంది.ఏజెంటిక్ కామర్స్‌లో ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. మీరు దానికి ఒక పని చెబితే (ఉదాహరణకు: వచ్చే వారం మా నాన్నగారి పుట్టినరోజు కోసం రూ.5000 బడ్జెట్‌లో ఒక మంచి వాచ్ కొనాలి), అది స్వయంగా ఇంటర్నెట్‌లో వెతుకుతుంది. రివ్యూలు చదువుతుంది. ఉత్తమమైన ధర ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. చివరగా మీ అనుమతితో లావాదేవీని పూర్తి చేస్తుంది.మోసాలకు తావులేని ఆటోమేషన్ఏఐ ఏజెంట్లు స్వయంగా ఖర్చు చేస్తాయంటే భద్రతపై ఆందోళన కలగడం సహజం. దీన్ని అరికట్టడానికి మాస్టర్ కార్డ్ టోకెనైజేషన్, పాస్ కీ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏజెంట్ లావాదేవీ చేయాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేసింది. ఇది వినియోగదారుడి గత చరిత్రను విశ్లేషించి అసాధారణ మార్పులను వెంటనే గుర్తిస్తుంది. గ్రాఫ్ ఆధారిత సాంకేతికత ద్వారా సింథటిక్ ఐడెంటిటీలు, అంతర్జాతీయ మోసగాళ్ల నెట్‌వర్క్‌లను పసిగట్టడం మాస్టర్ కార్డ్ ప్రత్యేకతని కంపెనీ తెలిపింది.ఉద్యోగాల కోత కాదు..ఏజెంటిక్ ఏఐ రాకతో ఫిన్‌టెక్ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు రాజ్‌పుత్‌ స్పందిస్తూ ‘కచ్చితంగా ఉద్యోగాల స్వరూపంలో మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగాల కోత కంటే వివిధ జాబ్‌ రోల్స్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని విశ్లేషించారు. మెకానికల్ పనులను ఏఐ చూసుకుంటే మానవులు మరింత సృజనాత్మక, వ్యూహాత్మక పనుల వైపు మళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్‌కు రెడీనా?

Gold and Silver rates on 23rd February 2026 in Telugu states3
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్‌లు

దేశంలో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలతో కొనుగోలుదారులకు షాకులిస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) ఐదో రోజు కొత్త మార్క్‌లను తాకాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Black Money Big Risks, Why Cash Deals Hurt You?4
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!

నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్‌ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్‌’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంలు ‘స్కాన్‌అండ్‌పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్‌ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్‌ ఎస్టేట్‌లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్‌ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్‌) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్‌మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్‌ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్‌.. ఇన్‌కమ్‌టాక్స్‌.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్‌కమ్‌ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్‌ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్‌ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.

Toyota Recalls Over 900 Land Cruisers In India5
900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్‌..

టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ టొయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.ట్రాన్స్‌మిషన్ సాఫ్ట్‌వేర్ లోపమే కారణంకంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్‌మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్‌మిషన్ ఓవర్-రివింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్‌మిషన్‌కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్‌మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్‌మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.లెక్సస్ ఎల్‌ఎక్స్‌లోనూ ఇదే యూనిట్గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.రీకాల్‌లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్‌ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.భారత్‌లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్‌పీ పవర్‌, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

stock market updates on 23 February 20266
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 25,746 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 582 పాయింట్లు పుంజుకొని 83,381 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.47బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.1 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.69 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 23-02-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement