ప్రధాన వార్తలు
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్వాల్ట్ పేరుతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీపీజీ బిలియన్ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది. టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్ ప్లాట్ఫామ్కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 6.5 బిలియన్ డాలర్లు దేశీయంగా 1 గిగావాట్ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దీంతో హైపర్స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్ 94 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! టీసీఎస్ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది.
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్లో ఫ్లాట్గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్ ఉత్పత్తి 6.7%, సిమెంట్ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్ కార్యకలాపాలపై, విద్యుత్ డిమాండ్పై అక్టోబర్లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్ పనితీరు నేపథ్యంలో అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.
నిరాశపరిచిన ఫుజియామా పవర్ సిస్టమ్స్
ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా పవర్ సిస్టమ్స్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.228)తో పోలిస్తే బీఎస్ఈలో 4% డిస్కౌంటుతో రూ.218 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% క్షీణించి రూ.205 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 9% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.6,384 కోట్లుగా ఉంది.
గ్లోబల్ టాప్ 100లో... మరిన్ని భారతీయ బ్యాంకులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి. వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (73వ ర్యాంకు) మాత్రమే టాప్ 100 బ్యాంకుల్లో ఉన్నాయి. దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్ హంటర్ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు. మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) మ్యూల్హంటర్డాట్ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. మనం చేయాల్సింది చేయాలి.. అంతే.. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్ టెక్ దిగ్గజం, దివంగత స్టీవ్ జాబ్స్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు. అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం.. ఇటీవలి కాలంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్బీఐ టార్గెట్ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్ పెరిగితే డాలర్లకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్ అకౌంట్పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!
కర్ణాటకలో ఐటీ వృద్ధిని కేవలం బెంగళూరుకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS) 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది.ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..‘బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
రీకాల్ ప్రకటించిన కేటీమ్
కేటీఎం కంపెనీ తన 2024 లైనప్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ప్రకటించింది. ఇందులో 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ వంటివి ఉన్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ సీల్స్ చిన్న పగుళ్లు ఏర్పడవచ్చు. దీనివల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ రీకాల్ జారీ చేసింది.2024 మోడళ్లను కొనుగోలు చేసిన కేటీఎం బైక్ వినియోగదారులు.. ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం వారు కంపెనీ అధీకృత సేవా కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. దీనికోసం బైకర్స్ ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్ దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ కంపెనీ కేటీఎమ్లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. 80 కోట్ల యూరోల(రూ. 7,765 కోట్లు) విలువైన ఒప్పందానికి యూరోపియన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలియజేసింది.
కార్పొరేట్
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
గ్లోబల్ టాప్ 100లో... మరిన్ని భారతీయ బ్యాంకులు
ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!
2030 నాటికి 10వేల మంది రైతులకు సపోర్ట్
ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
రూ.120 కోట్లతో ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కేంద్రం విస్తరణ
రైల్వేకు ఐఆర్సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే..
అంబానీని వదలని ఈడీ
వారానికి 72 గంటల పని.. వారికి మాత్రమే!
ఆ రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఓకే..
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్ సూచీలు
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ పోకడల మధ్య భారత బెంచ్ మా...
ఇన్ఫోసిస్ బైబ్యాక్: షేరుకి రూ. 1800
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ సొంత ఈక్...
ఫిజిక్స్వాలా.. లిస్టింగ్ అదిరేలా!
ముంబై: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా కంపెనీ ...
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకే...
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్...
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్నెఫ్ట్, ...
5.2% వద్దే నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.2 శాతం వద...
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చాట్జీపీటీ డౌన్ అయితే పరిస్థితేంటి?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్ఫామ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్జీపీటీ(క్లాడ్ఫ్లెయిర్ ఇన్ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్తో రూపొందించారు. గూగుల్ సెర్చ్కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్డేటెడ్, రియల్టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి గూగుల్ ఎకోసిస్టమ్తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్జీపీటీలాగే అదే జనరేటివ్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ఏఐతో టాప్: గూగుల్ ప్లేలో బెస్ట్ యాప్లు ఇవే..
టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక అన్నీ సులభమైపోయాయి. ప్రతి అంశానికీ, పనికీ పదుల సంఖ్యలో మొబైల్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇలా వేలకొద్దీ యాప్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అయిన గూగుల్ ప్లే 2025 ఏడాదికిగానూ ఉత్తమ యాప్లను ప్రకటించింది.గూగుల్ ప్లే యాప్ స్టోర్లో 2025లో అందుబాటులో ఉన్న యాప్లలో గేమ్స్, పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎషన్షియల్.. ఇలా ఒక్కో అంశానికీ కొన్ని ఉత్తమ యాప్లను పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. వీటిలో ఏఐ అనుసంధానిత యాప్లదే పైచేయి. ఉదాహరణకు ఓవరాల్ బెస్ట్ యాప్గా జొమాటోకు చెందిన సోషల్ యుటిలిటీ యాప్ ‘డిస్ట్రిక్ట్’ నిలిచింది. ఇది ఏఐని వినియోగించి వినియోగదారుల అభిరుచులను విశ్లేషించి డైనింగ్తో పాటు ఈవెంట్లు, సినిమా టికెట్ల బుకింగ్ వంటి సోషల్ యుటిలిటీ సేవలు రియల్ టైమ్ సమాచారంతో అందిస్తోంది.ఇక పర్సనల్ గ్రోత్ విభాగంలో ‘ఇన్వీడియో ఏఐ’ అత్యుత్తమ యాప్గా నిలిచింది. దీంతో టెక్ట్స్ రూపంలో ప్రాంప్ట్ ఇచ్చి నేరుగా మంచి మంచి వీడియోలు రూపొందించవచ్చు.బెస్ట్ హిడెన్ జెమ్గా టూన్సూత్ర అనే యాప్ను గూగుల్ ప్లే పేర్కొంది. ఇది ఏఐ-ఆధారిత సినిమాటిక్ మోడ్ ను ఉపయోగించి భారతీయ ప్రసిద్ధ కథలను డిజిటల్ ఎక్స్పీరియన్స్తో ఆసక్తికరంగా మారుస్తుంది.ఫోటో ఎడిటింగ్, నోట్స్ రూపొందించడం వంటి వాటిలో సాయమందించే గుడ్ నోట్స్, లుమినార్ యాప్లు ఉత్పాదకత విభాగంలో ఉత్తమంగా నిలిచాయి. ఇవి ఏఐ ఫీచర్లతో ఫొటో ఎడిటింగ్, నోట్స్ టేకింగ్ను సులభతరం చేస్తున్నాయి.వ్యక్తగత ఆరోగ్య సంరక్షణ, జీవనశైలికి సంబంధించిన అంశాల్లోనూ కొన్ని యాప్లు ఏఐ వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. అలాంటివాటిలో ఉత్తమమైనవే డైలీప్లానర్, స్లీపిసోల్బయో యాప్లు.ఇక గేమింగ్ విషయానికి వస్తే లెక్కలేనన్నీ ఆండ్రాయిడ్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏఐ ఫీచర్లతో లోకల్ ఫ్లేవర్ జోడించిన యాప్లకు మంచి ఆదరణ ఉంటోంది. అలాంటి యాప్లే కుకీరన్ ఇండియా, కమలా, రియల్ క్రికెట్ స్వప్ వంటివి.గూగుల్ కొత్తగా టాప్ ట్రెండింగ్ కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్స్టామార్ట్, సీఖో, అడోబ్ ఫైర్ ఫ్లై వంటి యాప్లు బెస్ట్గా నిలిచాయి.ఆవిష్కరణ, నాణ్యత, యూజర్ ఇంపాక్ట్, సాంస్కృతిక ఔచిత్యం, ఏఐ-ఆధారిత ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ బెస్ట్ యాప్లను గూగుల్ ప్లే ఎంపిక చేసింది. రోజువారీ ఉపయోగం, స్థానికతను జోడించడం, వివిధ రకాల ఫోన్లు, డివైజ్లలో వినియోగించగల వెసులుబాటు ఉన్న యాప్లను హైలైట్ చేసింది. వాస్తవానికి, 69 శాతం మంది భారతీయ యూజర్లు ఏఐతో తమ మొదటి ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ యాప్ల ద్వారానే పొందుతున్నారని గూగుల్ తన బ్లాగ్లో పేర్కొంది.
ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్పో (INEX India)లో ప్రకటించారు.సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్ పరిష్కరిస్తుంది.వాటర్ హైసింత్ హార్వెస్టర్ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది.
X సేవల్లో అంతరాయం.. కారణం ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.క్లౌడ్ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్ఫ్లేర్ నెట్వర్క్లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు.డౌన్డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని.. క్లౌడ్ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
పర్సనల్ ఫైనాన్స్
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్ను డాక్యుమెంట్గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.
మెరుగైన రాబడి కోసం.. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్క్యాప్ ఫండ్స్తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు రిస్క్ను తగ్గిస్తాయి. మిడ్క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
తక్కువ పెట్టుబడి.. మెరుగైన రాబడులు: ఎంపిక విషయంలో..
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్ను అధిగమించొచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు.


