Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mahindra XEV 9e Cineluxe Edition Launched at Rs 29 35 Lakh in India1
మహీంద్రా 'సినీలక్స్' ఎడిషన్: 500 కి.మీ రేంజ్!

మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం.

Israel Iran War Gold Price Hike in India Know The Full Details Here2
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!

బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది.

Norway Sovereign Wealth Fund Pulls Out of Adani3
అదానీ గ్రీన్‌ ఎనర్జీకి నార్జెస్‌ బ్యాంక్‌ గుడ్‌బై!

తమ పోర్ట్‌ఫోలియో నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌)ను తప్పించనున్నట్లు నార్వేకు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ నార్జెస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇలాంటి ఆరోపణలతోనే 2024 మే నెలలోనూ సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేర్లను వదిలించుకుంది.నార్జెస్‌ బ్యాంక్‌ 2020 జూలైలో తొలిసారి ఏజీఈఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 341 ధరలో వీటిని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం షేరు రూ. 944 వద్ద కదులుతోంది. కాగా.. గతంలోనూ నార్వేజియన్‌ వెల్త్‌ ఫండ్‌ వివిధ కారణాలతో దేశీ బ్లూచిప్స్‌ ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, వేదాంతాలను పోర్ట్‌ఫోలియో నుంచి తప్పించింది.మార్కెట్ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంనుంచి నార్జెస్‌ బ్యాంక్‌ 4.39 కోట్ల డాలర్ల విలువైన ఏజీఈఎల్‌ షేర్లను విక్రయించగా.. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.

Rich Dad Poor Dad Robert Kiyosaki Controversial Tweets on IranWar4
ఇరాన్‌పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్‌

బంగారం, వెండి, స్టాక్‌ మార్కెట్లు, బిట్‌ కాయిన్‌, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్‌ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్‌లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్‌లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ హయాంలో మొదలైన ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్‌లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్‌, గవర్నర్ టిమ్‌ వాల్జ్‌ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్‌ పీటర్‌సన్‌ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026

Jio Financial App Introduces new Marketplace Features5
జియో ఫైనాన్షియల్‌ యాప్‌లో వినూత్న ఫీచర్లు

ముంబై: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (జేఎఫ్‌ఎస్‌) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్‌ను మార్కెట్‌ప్లేస్‌ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్‌ స్కోర్‌ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్‌లో జోడిస్తున్నట్లు జేఎఫ్‌ఎస్‌ ఎండీ హితేష్‌ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్‌ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్‌ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్‌కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్‌ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Gold and Silver rates on 1st March 2026 in Telugu states6
దారుణంగా పెరిగిన బంగారం ధరలు.. వార్‌ ఎఫెక్ట్‌!

దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ దారుణంగా పెరిగాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండివైపు మళ్లడంతో డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

Advertisement
Advertisement
Advertisement