Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why China filed a case at WTO against India?1
డబ్ల్యూటీఓలో భారత్‌పై చైనా ఫిర్యాదు

అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్‌కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.చైనా ప్రధాన ఆరోపణలుబీజింగ్‌లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్‌మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్‌ను కోరింది.భారత్ వాదనచైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్‌వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్‌ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠగత అక్టోబర్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..

Google Pay partnered with Axis Bank to launch first UPI linked credit card2
‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..

భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పే, ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ‘గూగుల్ పే ఫ్లెక్స్’ (Google Pay Flex) క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. రూపే నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ కార్డ్ వినియోగదారులకు నేరుగా యూపీఐ ఎకోసిస్టమ్‌ ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇండియాలో ఇలాంటి కార్డు అందులోబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.యూపీఐ సౌలభ్యం..ప్రస్తుతం భారత్‌లో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయ్యాయి. క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించి చెల్లింపులు చేసే వెసులుబాటును ఈ కొత్త కార్డ్ మరింత సులభతరం చేస్తోంది. ప్రజలు ప్రతిరోజూ చేసే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.ప్రత్యేకతలు ఇవే..ఈ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.ఇందులో ఒక పాయింట్ ఒక రూపాయి నిష్పత్తిలో ఉంటుంది.పాయింట్ల రెడీమ్‌ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా గూగుల్ పే ద్వారా తక్షణమే రీడీమ్ చేసుకోవచ్చు.ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా గూగుల్ పే యాప్‌లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆమోదం పొందిన నిమిషాల్లోనే వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను వినియోగదారులు తమ గూగుల్ పే డాష్‌బోర్డ్ నుంచే నేరుగా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.కార్డును బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం, పిన్ మార్చుకోవడం లేదా ఖర్చు పరిమితులను సెట్ చేసుకోవడం వంటివన్నీ గూగుల్ పే యాప్ నుంచే నిర్వహించవచ్చు.ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ‘మారుతున్న భారతీయుల డిజిటల్ ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించాం. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ నైపుణ్యం, గూగుల్ పే సాంకేతికత కలిసి వినియోగదారులకు భద్రతను, సౌకర్యాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.భద్రతకు పెద్ద పీటభౌతిక కార్డులు పోతాయనే భయం లేకుండా ఈ ‘డిజిటల్-ఫస్ట్’ డిజైన్ భద్రతను పెంచుతుంది. గూగుల్ పే లో ఉండే బహుళ స్థాయుల ఆథెంటికేషన్‌ కారణంగా లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రూపే నెట్‌వర్క్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు వ్యాపారుల వద్ద కూడా ఈ కార్డును స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఎక్కువగా వాడే తరాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ఈ ‘ఫ్లెక్స్’ కార్డ్ క్రెడిట్ కార్డుల వాడకాన్ని మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రారంభంలో ఆశావాహం.. సవాళ్ల సుడిగుండం!

Key Stress Factors in 2025 faces by Aviation sec­tor3
ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!

భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవంసంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.ఎయిరిండియా విషాదం..జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.ఆర్థిక, ఇండిగో సంక్షోభంవిమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒ‍క్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్‌ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తుపై ఆశలుఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ

SEIL Energy India Limited has been recognized as a Great Place To Work4
ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ గుర్తింపు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సరి్టఫికేషన్‌ లభించింది. ఉద్యోగానికి అనువైన సంస్థగా 86 శాతం మంది ఉద్యోగులు ఎస్‌ఈఐఎల్‌ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ గుర్తింపును పొందడం వరుసగా ఇది రెండోసారని వివరించింది. వ్యక్తిగత జీవితం–ఉద్యోగం మధ్య సమతుల్యత, ఉద్యోగుల ఎదుగుదలకు అవకాశాల కల్పన తదితర అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు.

 IHCL sells 25. 52percent stake in Taj GVK to GVK-Bhupal family5
తాజ్‌ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్‌

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌) భాగస్వామ్య సంస్థ తాజ్‌ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్‌ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్‌ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్‌ కుటుంబం తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో 74.99 శాతం వాటా పొందనుంది. కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్‌ 2030)లో భాగంగా అసెట్‌లైట్‌ క్యాపిటల్‌ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్‌సీఎ ల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ చత్వాల్‌ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్‌ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. కాగా.. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్‌సీఎల్‌తో 2025 అక్టోబర్‌లో 256 గదుల తాజ్‌ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ జేఎండీ కృష్ణ భూపాల్‌ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్‌తోపాటు.. తాజ్‌ జీవీకే పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ, తాజ్‌ డెక్కన్, తాజ్‌ క్లబ్‌హౌస్‌ (చెన్నై), తాజ్‌ చండీగఢ్, వివాంతా హైదరాబాద్‌(బేగంపేట) ఉన్నాయి.

Reliance Consumer Products acquires majority stake in Udhaiyams6
రిలయన్స్‌ కన్జూమర్‌ చేతికి ఉదయమ్స్‌ 

చెన్నై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ తాజాగా తమిళనాడు సంస్థ ఉదయమ్స్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. అయితే వాటా కొనుగోలు విలువ వెల్లడికాలేదు. ఒప్పందం ప్రకారం ఉదయమ్స్‌ ఆగ్రో ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెలో గత ప్రమోటర్లు ఎస్‌.సుధాకర్, ఎస్‌.దినకర్‌ మైనారిటీ వాటాతో కొనసాగనున్నారు. ఉదయమ్‌ బ్రాండుతో మూడు దశాబ్దాలుగా తమిళనాడు మార్కెట్లో కంపెనీ పటిష్ట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పంపిణీ నెట్‌వర్క్‌ ద్వారా బియ్యం, మసాలా దినుసులు, ఇడ్లీ నూక, స్నాక్స్‌ తదితర నిత్యావసరాలు విక్రయిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement