Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 5th December 2025 in Telugu states1
వావ్‌!! వెండి భారీగా.. బంగారం విచిత్రంగా..

దేశంలో వెండి ధరలు మరింత భారీగా క్షీణించాయి. బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున దిగొచ్చిన పసిడి ధరలు నేడు కాస్త ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మరోసారి క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Yes Bank launches Score Kya Hua to boost credit literacy2
ఉచితంగా క్రెడిట్‌ స్కోరు.. యస్‌ బ్యాంక్‌ మైక్రోసైట్‌

ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తాజాగా ’స్కోర్‌క్యాహువా.బ్యాంక్‌.ఇన్‌’ పేరిట మైక్రోసైట్‌ని ప్రవేశపెట్టింది. క్రెడిట్‌ స్కోర్‌ను ఉచితంగా చెక్‌ చేసుకునేందుకు, రుణాల సంబంధ అంశాలు, క్రెడిట్‌ ప్రొఫైల్‌ ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.క్రెడిట్‌ స్కోర్‌పై అవగాహన పెంచేందుకు, రుణాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల వచ్చే ప్రయోజనాలను తెలియజేసేందుకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దీన్ని రూపొందించినట్లు యస్‌ బ్యాంక్‌ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.ఇందులో ఆర్థిక అంశాల సంబంధిత బ్లాగ్‌లు, వీడియోలు క్రెడిట్‌ స్కోరుపై అపోహలు తొలగించే సమాచారం మొదలైనవి ఉంటాయి. ఈ సందర్భంగా నాలుగు టీవీ ప్రకటనలను కూడా బ్యాంకు ఆవిష్కరించింది.

Enforcement Directorate attached Reliance Anil Ambani Group properties worth Rs 1120 Crore3
రూ .1,120 కోట్ల ఆస్తులు జప్తు.. అనిల్‌ అంబానీకి ఈడీ షాక్‌

పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాక్‌ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్ మోసం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రూ .1,120 కోట్ల విలువైన 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది.ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందినవి 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందినవి 2 ప్రాపర్టీలు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. అలాగేరిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.వీటితో పాటు గమేషా ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌తోపాటు రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రకటిత పెట్టుబడులను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సీజ్‌ చేసింది. The Enforcement Directorate has attached over 18 properties, Fixed Deposits, Bank Balance, and Shareholding in Unquoted Investments of the Reliance Anil Ambani Group worth ₹1,120 Crore in the Reliance Home Finance Limited/Reliance Commercial Finance Limited/Yes Bank Fraud Case.… pic.twitter.com/556XsF7VvB— ANI (@ANI) December 5, 2025

RBI Policy Meeting 2025: RBI Governor Sanjay Malhotra announce bi monthly monetary policy4
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. కీలకమైన రెపో రేటును పావు శాతం తగ్గించింది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేశారు. విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే కీలక వడ్డీ రేటును తగ్గంచింది. ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో 5.5 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది.రెపో రేటు కోత నిర్ణయాన్ని పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం మూడు రోజుల సమీక్ష ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈ రోజు ఆర్బీఐ గరవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు.లిక్విడిటీని పెంచడానికి రూ .1 లక్ష కోట్ల ఓఎంఓ, 3 సంవత్సరాల డాలర్-రూపాయి కొనుగోలు-అమ్మకం మార్పిడిని ప్రకటించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత మన్నికైన లిక్విడిటీని అందించడానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉంది' అని ఆర్బీఐ గరవర్నర్‌ తెలిపారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్ల వద్ద ఆరోగ్యకరంగానే ఉన్నాయని వివరించారు.ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావించారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది మరికొందరు విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే.రెపో రేటు తగ్గింపుపై నిపుణుల స్పందనడిపాజిటర్లలో ఆందోళనస్థిర-ఆదాయ సాధనాలపై రాబడి తగ్గే అవకాశం ఉండడంతో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు డిపాజిటర్లలో ఆందోళన కలిగించవచ్చు. ఈ నిర్ణయం రాబోయే నెలల్లో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించడానికి ప్రేరేపిస్తుంది. ఏదేమైనా, ఈ వాతావరణం సంపన్న పెట్టుబడిదారులను రియల్ ఎస్టేట్-ఫోకస్డ్ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (AIF) ల వంటి అధిక-దిగుబడినిచ్చే మార్గాల వైపు నెట్టివేస్తుంది.- అంకుర్ జలాన్, గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈఓరియల్ ఎస్టేట్‌కు ఊపురేట్ల తగ్గింపు కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ పెరుగుదలకు బలమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రుణ ఖర్చుల తగ్గింపు గృహ రుణాలను మరింత అందుబాటుగా మారుస్తుంది. కొత్తవారితోపాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఈఎంఐలు తగ్గుతాయి. డెవలపర్లు, మెరుగైన లిక్విడిటీ, వేగవంతమైన ప్రాజెక్ట్ అమలు, అధిక-డిమాండ్ మార్కెట్లలో కొత్త లాంచింగ్‌ల నుండి ప్రయోజనం పొందుతారు.- లలిత్ పరిహార్, ఐజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గృహ కొనుగోలుదారులకు మేలుఇప్పటికే హౌసింగ్ మార్కెట్ మందగమనంలో ఉన్న నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు సరిగ్గా బదిలీ అయితే పెరుగుతున్న ఆస్తి ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో గృహ కొనుగోలుదారులకు సహాయపడుతుంది. మరింత మంది గృహ కొనుగోళ్లకు ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుంది. డెవలపర్లు కూడా తక్కువ రుణ భారం నుండి ప్రయోజనం పొందుతారు. ఇది ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.- విజయ్ హర్ష్ ఝా, వీఎస్ రియల్టర్స్ ఫౌండర్‌ & సీఈఓస్వాగతించదగినదిఆర్బీఐ నిరంతర రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. తక్కువ గృహ రుణ రేట్లు, పెరుగుతున్న ధరల నుండి కొనుగోలుదారులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తాయి. డెవలపర్లు కూడా ఈ అభివృద్ధి చెందుతున్న డిమాండ్ ల్యాండ్ స్కేప్ కు ప్రయోజనం పొందుతారు.- సమీర్ జసుజా, ఫౌండర్‌ & సీఈఓ, ప్రాప్ఈక్విటీ

Stock market updates on December 5th 20255
Stock Market Updates: ఫ్లాట్‌గా మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు భారత ఈక్విటీ మార్కెట్లు స్పల్ప నష్టాల్లో చలిస్తున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం ఈరోజు రెపో రేట్ ప్రకటనతో ముగియనుంది.ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 79 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 85,187 వద్ద, నిఫ్టీ 50 సూచీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం తగ్గి 26,021 వద్ద ఉంది.ఈ రోజు సెన్సెక్స్‌లో రిలయన్స్, ట్రెంట్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ పీవీ, సన్ ఫార్మా, టైటాన్ టాప్ లూజర్స్ గా ఉండగా, ఎటర్నల్, బీఈఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 0.3 శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 0.28 శాతం పెరిగింది.Today Nifty position 05-12-2025(time: 10:03 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Passenger rights over Flight delays & cancellation6
ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!

దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్‌ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్‌ ఛార్టర్‌ ఆఫ్‌ రైట్స్‌ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.విమానయాన సంస్థల బాధ్యతలుసమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్‌ అయితే ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి. ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్‌ ధర రిఫండ్ చేయాలి. భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్‌ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్‌మెంట్‌ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్‌ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.ప్రయాణికుల హక్కులు ఇవే..విమానం క్యాన్సిల్‌ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓవర్‌బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్‌ పూర్తి రిఫండ్‌తోపాటు పరిహారం పొందవచ్చు.లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్‌ బుక్‌ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు. విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్‌మెంట్‌ సౌకర్యం కల్పించాల్సిందే.24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్‌ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.విమానాల క్యాన్సిలేషన్‌ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి. అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement