ప్రధాన వార్తలు

హైదరాబాద్లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు
మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. 21వ అంతర్జాతీయ యూఎక్స్ఇండియా25 సదస్సు (UXINDIA 2025) ఈ నెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరుగనుంది. ఈ సదస్సులో 1,400 మందికి పైగా ప్రతినిధులు, 80 మందికి పైగా నిపుణులు, 10 మంది ప్రధాన వక్తలు పాల్గొననున్నారు.బెంగళూరులో రెండు ఎడిషన్స్ తర్వాత, యుఎక్స్ఇండియా హైదరాబాద్ను డిజైన్ సంభాషణ, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్, ‘డిజైన్: ఒక జీవన విధానం’ వ్యవస్థాపకత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు, వెంచర్లను రూపొందించడంలో డిజైన్, కృత్రిమ మేధస్సుల శక్తివంతమైన కలయికను ఇది తెలియజేస్తుంది.ఈ కార్యక్రమంలో డిజైన్ ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో కొత్త ఆవిష్కరణలతో కూడిన వ్యాపార ఆలోచనలను యువ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రపంచ నాయకులు మాత్రమే పాల్గొనే ప్రత్యేక వేదికలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా 2030 నాటికి ఒక మిలియన్ మహిళలకు డిజైన్ విద్య అందించాలన్న యూఎంఓ లక్ష్యం దిశగా, మహిళా డిజైనర్ల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.మైక్రోసాఫ్ట్, క్యాండెసెంట్, కాగ్నిజెంట్, ఫ్రెష్వర్క్స్, ఫిలిప్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు డిజైన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు. అలాగే, ఉత్పత్తులు, ఆవిష్కరణలలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం పొందనుంది. “ఈ ఏడాది యూఎక్స్ ఇండియా సదస్సు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు,” అని యూఎంఓ డిజైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాపు కలాధర్ అన్నారు.

'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ను భారత్లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్ఫోన్లు, ఏఐ ల్యాప్టాప్లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.ఫ్లిప్కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది.

తొలి ప్రైవేట్ స్టార్టప్ పార్క్.. గ్రామీణ యువకుడి ప్రయత్నం
భారతదేశంలో స్టార్టప్లు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవరోధాలను తొలగించేందుకు ఒక యువ పారిశ్రామికవేత్త ముందుకొచ్చాడు. గ్రామీణ కేరళకు చెందిన షఫీ షౌఖత్.. బెంగళూరులో రూ.600 కోట్లు విలువ చేసే స్టార్టప్ పార్క్ను స్థాపించి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయగల నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారు.గ్రామం నుంచి గ్లోబల్ దిశగా..స్టార్టప్లకు అవసరమైన మార్గనిర్దేశం, పెట్టుబడులు వంటి వనరులేవీ లేని కేరళలోని ఒక చిన్న గ్రామంలో షఫీ షౌఖత్ పెరిగారు. ఈ అనుభవం కారణంగా, తాను ఏర్పాటుచేసే స్టార్టప్ పార్క్లో ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కార మార్గాలు ఉండేలా, “ప్రాబ్లం-ఫస్ట్ ఫ్రేమ్వర్క్”ను రూపొందించారు.“సాధారణ ప్రోగ్రామ్స్ తో యూనిక్ సమస్యలు పరిష్కరించలేము” అని చెప్పే షౌఖత్ “ఎగ్జిక్యూషన్ ఆధారంగా, మెజరబుల్ ఇంపాక్ట్ వచ్చే విధంగా వ్యవస్థలు రూపొందించాలి” అంటున్నారు.స్టార్టప్ పార్క్ లక్ష్యాలుదేశవ్యాప్తంగా ఉన్న యువ వ్యవస్థాపకులను అనుసంధానించడంవ్యక్తిగత అవసరాలకు తగిన మెంటార్షిప్, పెట్టుబడి అవకాశం కల్పించడంప్రభుత్వాల కోసం పాలసీ ప్రయోగశాలగా పనిచేయడంపెట్టుబడిదారులకు డేటా ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడంలో సహకారంనెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్షౌఖత్ ప్రారంభించిన నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్కు ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఇందులో హై-పొటెన్షియల్ వ్యక్తుల ఎంపిక, వారి ప్రతిభకు తగ్గ స్టార్టప్ అనుభవం, పరిశ్రమ ప్రముఖుల నుంచి స్రాటెజిక్ మార్గదర్శనం, పెట్టుబడిదారులు, పాలిసీ మేకర్లు ఉన్న నెట్వర్క్ను అందుబాటులోకి తేవడం వంటివి ఉన్నాయి.భారత స్టార్టప్ భవిష్యత్తుకు కొత్త నమూనాసాధారణ ఇంక్యుబేటర్ల కన్నా షౌఖత్ రూపొందిస్తున్న ఈ మోడల్ ఒక కొత్త దిశను సూచిస్తుంది. ఇది సిద్ధాంతాల కంటే కార్యాచరణకు, వెయిన్ గణాంకాల కంటే నిజమైన ప్రభావానికి, పోటీ కంటే భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఈ మోడల్ను అధ్యయనం చేస్తుండటం గమనార్హం. భారతదేశం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్టార్టప్ ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందబోతున్న సమయంలో, షఫీ షౌఖత్ తీసుకుంటున్న అడుగులు దేశం భవిష్యత్తు పారిశ్రామికతకు ఒక శక్తివంతమైన బేస్గా నిలవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి.

ప్రపంచంలో కార్మిక కొరత.. భారత్కు మంచి అవకాశం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్ గా ఎదగడానికి భారతదేశానికి సువర్ణ అవకాశం ఉందని గతి (GATI) ఫౌండేషన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక పేర్కొంది.ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి, ప్రపంచ కార్మిక కొరత 200-250 మిలియన్లకు (20 కోట్ల నుంచి 25 కోట్లు) చేరుకుంటుందని అంచనా. అంటే అంత మంది కార్మికుల అవసరం ఏర్పడుతుందని అర్థం. యువ జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తితో భారతదేశం ఈ అంతరాన్ని పూరించడంలో సహాయపడటానికి బలమైన స్థితిలో ఉంది.5 కోట్ల ఉద్యోగ అవకాశాలు యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా కారణంగా తక్కువ మంది యువ కార్మికులను చూస్తున్నాయి. దీంతో ఇది మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వాటిలో కనీసం కోటి ఉద్యోగాలను భారత్ భర్తీ చేయగలదు.భారత్కు పెద్ద అనుకూలతభారతదేశంలో 18-40 సంవత్సరాల వయస్సు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయస్సు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు ఇంటికి పంపుతున్నారు.మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.చేయాల్సిందిదే..ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే కొన్నింటిని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేవిధంగా కార్మికుల నైపుణ్యాలు, శిక్షణను మెరుగుపరచడం.వేగవంతమైన, సురక్షితమైన, మరింత పారదర్శక వలస వ్యవస్థలను నిర్మించడం.ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి రంగాలపై దృష్టి పెట్టడం.విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం నైతిక, డిజిటల్-ఫస్ట్ ఉద్యోగ మార్గాలను సృష్టించడం.

ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’ను ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్ అని సంస్థ ఎండీ మధు లూనావత్ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్ఐ దీనికి బెంచ్మార్క్గా ఉంటుందని పేర్కొన్నారు.ప్రైవేట్ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్ గ్రూప్లో ది వెల్త్ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (ఏఐఎఫ్)ను కూడా నిర్వహిస్తోంది.హెచ్డీఎఫ్సీ ‘డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్’ ఎఫ్వోఎఫ్ .. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.పలు ఫండ్ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్తో పొందవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ తొలి ఫండ్..

ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్లోనూ 80వాట్ల సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్లూ క్వాల్కామ్ స్నాప్గ్రాడన్ 7 జెన్ 3 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు
కార్పొరేట్

హైదరాబాద్లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు

'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్

తొలి ప్రైవేట్ స్టార్టప్ పార్క్.. గ్రామీణ యువకుడి ప్రయత్నం

ప్రపంచంలో కార్మిక కొరత.. భారత్కు మంచి అవకాశం

విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం

సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన

శీతాకాల సమావేశాల్లో బీమా సవరణ బిల్లు

ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపు

ఇండియా హోమ్ లోన్లో వాటా కొనుగోలు

ఫ్లిప్కార్ట్కు నష్టం.. మింత్రాకు లాభం

భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24...

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...

ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భా...

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభా...

'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసు...

స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎని...

ట్రేడ్ వార్తో భారత్కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్కు భారీ ...

ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రె...
ఆటోమొబైల్
టెక్నాలజీ

గేమ్లోని సీక్రెట్ ఫ్రెండ్స్.. చప్పుడుదే విజయం!
గేమ్లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!స్పీడ్ డబుల్!గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే. బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!కూల్ బేబీ కూల్!గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్లోని ఎల్ఈడీలు కంప్యూటర్ లుక్నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్ను మరింత పెంచుతాయి. కనెక్టర్తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.చప్పుడుదే విజయం!గేమ్లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్తో ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990.

ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు.

కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు.

చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
పర్సనల్ ఫైనాన్స్

60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్గేజ్కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైతే.. ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సమీపించింది. ట్యాక్స్ పేయర్స్ 2025 సెప్టెంబర్ 15 లోపల ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఇప్పటికే 2025 జులై 31 నుంచి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ పొడిగిస్తారా?, లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. గడువు తీరిన తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ. 1000 ఉంటుంది.ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం & ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు➤ఐటీఆర్ ఫైల్ ఆలస్యమైతే జరిమానాలు చెల్లించడం మాత్రమే కాకుండా.. 234ఏ, 234బీ, 234సీ సెకన్ల కింద పన్ను బకాయి రకాన్ని బట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకుంటే.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.➤ఐటీఆర్ ఫైలింగ్లో ఆలస్యం కారణంగా.. ప్రాసెసింగ్ ఆలస్యం కావొచ్చు. దీంతోపాటు రీఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.➤ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల.. మీ రిటర్న్స్ను ఇన్కమ్ ట్యాక్ డిపార్ట్మెంట్ మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉంది.➤ఆలస్యంగా అయినా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్సయితే.. ఐటీ శాఖ నేరుగా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడకపోవడానికి కారణాన్ని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్..నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్లు, బడ్జెట్ యాప్లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)డిసిక్రీషనరీ స్పెండింగ్ (షాపింగ్, డైనింగ్)పొదుపు, పెట్టుబడులుప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.ఉదాహరణకు..కిరాణా సామాగ్రి: రూ.8,000ఎంటర్ టైన్మెంట్: రూ.3,000పొదుపు: రూ.5,000డిస్క్రీషనరీ స్పెండింగ్ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.ఎమర్జెన్సీ ఫండ్జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఎంత సరిపోతుంది?కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్ను క్రియేట్ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇది ఎందుకు ముఖ్యం?దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది.అప్పుల నిర్వహణఅప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.ఇదీ చదవండి: తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్

ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.పొడిగింపు కోరడానికి కారణాలుఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.ప్రతిపాదిత పొడిగింపులుఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.విస్తృత మద్దతు కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.