ప్రధాన వార్తలు
ఫుడ్ ప్రాసెసింగ్లో భారీగా ఇన్వెస్ట్ చేయండి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్లాండ్కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు.
పసిడి ధర మరింత పెరుగుతుందా?
బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుందా? – శ్రావణి అద్దంకిబంగారం ధరలు అదే పనిగా ర్యాలీ చేస్తుండం తప్పకుండా ఆకర్షిస్తుంది. అవును బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయమైన రాబడిని ఇచ్చాయి. కానీ, ఇంకెంత పెరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఏ అసెట్ క్లాస్కు అయినా ఇదే వర్తిస్తుంది. కనుక దీనికి బదులు మీ పెట్టుబడుల్లో బంగారాన్ని చేర్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనిశ్చితుల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో లేదా ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొంటున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అలాంటి అనిశి్చతులన్నీ సర్దుకుని, ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరు చూపిస్తుంటే అప్పుడు బంగారం పనితీరు పరిమితం అవుతుంది. గత 15 ఏళ్లలో బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. వివిధ రంగాలు, పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇదే కాలంలో ఏటా ఇచ్చిన రాబడి 12 శాతంగా ఉంది.రాబడిలో వ్యత్యాసం స్వల్పమే అయినప్పటికీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా చెప్పుకోతగ్గంత అదనపు నిధి సమకూరుతుంది. ఈక్విటీలు అన్నవి వ్యాపారాల్లో వాటాలను అందిస్తాయి. అవి సంపదకు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వ ఉంచుకునే సాధనమే. కనుక ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు. నేను ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్లపాటు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి? – దీపక్పెట్టుబడిలో తక్కువ రిస్క్ కోరుకునే వారు 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీల్లో లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం, మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి.సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్ విండో
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్ విండో ఆటోమేటిక్ అండ్ జనరలైజ్డ్ యాక్సెస్ ఫర్ ట్రస్ట్డ్ ఫారిన్ ఇన్వెస్టర్స్(స్వాగత్–ఎఫ్ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్లో ఆమోదముద్ర వేసింది.
ఫెడ్పై మార్కెట్ దృష్టి
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్ ఫండ్స్(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్లో వాణిజ్య లోటు 59.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్లో చైనా 90 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్బీఐ ఎఫెక్ట్ దేశీయంగా ఆర్బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్బీఐ 5 బిలియన్ డాలర్ల రుపీ డాలర్ స్వాప్నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు జీఎస్టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మార్కెట్లలో ట్రెండ్ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్ ధరలు.. నవంబర్ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్ దేశీ స్టాక్స్లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించిన ఎఫ్పీఐలు అక్టోబర్లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్ఈ సెన్సెక్స్ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
రెండ్రోజుల కిందటే ఆర్బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి? చాలామంది స్టాక్ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరాలకు అనుగుణంగా..కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్ క్యాపిటల్ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బాండ్ ఫండ్స్.. ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిప్పన్ ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కార్పొరేట్ బాండ్ ఫండ్, కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్, యాక్సిస్ కార్పొరేట్ బాండ్ ఫండ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి. ఇదీ.. బాండ్ పరిభాష.. కూపన్ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ ఈల్డ్: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి క్రెడిట్ రేటింగ్: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం లిక్విడిటీ: బాండ్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు కొన్ని రిస్క్ లుంటాయి .. అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్ రేటింగ్ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడ కొనొచ్చు.. జిరోధా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఏంజెల్ వన్, అప్స్టాక్స్ ెలాంటి బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్ బజార్, గ్రిప్ ఇన్వెస్ట్లాంటి సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫాంల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్ అవుతాయి. ఎంచుకోవడం ఇలా.. తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్ లాంటి రేటింగ్ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్ ఎ, బి ప్లస్ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్ ఏ నుంచి ట్రిపుల్ బి మైనస్ వరకు రేటింగ్ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్ బీ ప్లస్ నుంచి బీ మైనస్ వరకు రేటింగ్ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.ఎవరికి అనువైనవంటే.. → మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే → బ్యాంక్ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే → ఎఫ్డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా → పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికిరేటింగ్ బట్టి రాబడి.. AAA: తక్కువ రిస్కు : 7–8 శాతం AA: మధ్య స్థాయి రిస్కు : 8–9.5 శాతం A: అధిక రిస్కు : 10–12 శాతం
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025
కార్పొరేట్
ఫుడ్ ప్రాసెసింగ్లో భారీగా ఇన్వెస్ట్ చేయండి
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
పైలట్ల నియామక చర్యలు షురూ..
ప్రముఖ బ్యాంక్లో 10,000 ఉద్యోగాల కోత
9 టూ 5 జాబ్ చేస్తూ రూ.65 లక్షల మినీ కూపర్
సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నరాల సమస్య
ఖరీదైన ఆ బ్రాండ్కు బాస్ ఇండియన్ లేడీ..
విమానయానంలో ఇండిగో ఆధిపత్యం
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
17 లక్షల వెండి ఐటమ్లకు హాల్మార్కింగ్
వెండి ఆభరణాల నాణ్యతను ప్రామాణికంగా ధృవీకరించే దిశగ...
హమ్మయ్య.. బంగారం, వెండిపై గుడ్న్యూస్
దేశంలో బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. క...
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
రూపాయి టపా.. భారీగా పడిపోయిన భారత కరెన్సీ
భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టాన...
7 ట్రిలియన్ డాలర్లకు గ్రీన్ ఎకానమీ
అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు)...
మళ్లీ పడిపోయిన రూపాయి
భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాల...
ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గిస్తుందా?
ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గ...
రూపాయి తగ్గితే ఏమౌతుంది?
భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్త...
ఆటోమొబైల్
టెక్నాలజీ
గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.పనిచేస్తుందిలా..వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది.
ఎక్కువ జీతాలిస్తోంది ఇదిగో ఈ జీసీసీలే..
జూనియర్ల నుంచి సీనియర్ల వరకు వివిధ విభాగాలవ్యాప్తంగా అనుభవాన్ని బట్టి అత్యధిక వేతనాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. రిటైల్, కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగ జీసీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ కెరియర్నెట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వివిధ రంగాలకు చెందిన 50,000 మంది ప్రొఫెషనల్స్ జీతభత్యాల డేటా ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో డేటా సైంటిస్టుకు రూ. 22.1 లక్షల నుంచి రూ. 46.9 లక్షల వార్షిక ప్యాకేజీ ఉంటోంది. అదే రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్లో చూస్తే వరుసగా రూ. 19.90–44.50 లక్షలు, రూ. 18.40 – 44.30 లక్షల స్థాయిలో ఉంటోంది.ఇక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జూనియర్ స్థాయిలోని ఫుల్ స్టాక్ డెవలపర్లకు రూ. 20.7 లక్షల స్థాయిలో, సీనియర్లకు రూ. 47.5 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. అటు స్క్రమ్ మాస్టర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్లాంటి ఉద్యోగాలకు ప్రారంభంలో ఒక మోస్తరు వేతనాలు ఉన్నా క్రమంగా, భారీ స్థాయికి చేరుతున్నాయి.
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు.
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..
పర్సనల్ ఫైనాన్స్
ఇది నేర్చుకుంటేనే బయటపడతారు: కియోసాకి
ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.LESSON # 3: How to get richer as global economy crashes.Join a network marketing business.Reasons why a network marketing business will make you richer.AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025
రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ..
నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ఓ వీడియా వైరల్గా మారింది.రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji)మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!
దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గులు, జీవితంలో ఎదురయ్యే దీర్ఘకాలిక లక్ష్యాల (రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం వంటివి) మధ్య సాధారణ ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెంపుచేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన రాబడినేచ్చే పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ హామీతో ఎలాంటి రిస్క్ లేకుండా 7-8% వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. అందులో కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.ఈ పథకాల వడ్డీ రేట్లు 2025లో క్వార్టర్లవారీగా సమీక్షిస్తున్నప్పటికీ, ఆర్బీఐ విధానాల మార్పులకు అనుగుణంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. పీపీఎఫ్, ఎస్ఎస్వై వంటివి దీర్ఘకాలిక భద్రతకు ఉపయోగపడగా, ఎన్పీఎస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్తో ఎక్కువ లాభాలు ఇస్తుంది. గత దశాబ్దంలో ఈ పథకాలు ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాయి.పథకంలక్ష్యంవడ్డీ రేటు (ఏటా)వ్యవధిప్రయోజనాలుపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, రిటైర్మెంట్7.1%15 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, రిస్క్ ఫ్రీ, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకం.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)రిటైర్మెంట్ పెన్షన్10-12% (మార్కెట్-లింక్డ్)60 సంవత్సరాల వయసు వరకుఈక్విటీ/ డెట్ మిక్స్, 80C + అదనపు రూ.50,000 మినహాయింపు. యువతకు ఉపయోగకరం.సుకన్యా సమృద్ధి యోజన (SSY)ఆడపిల్లల విద్య/వివాహం8.2%21 సంవత్సరాలుపూర్తి పన్నుమినహాయింపు, మహిళా సాధికారతకు ప్రోత్సాహం.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)వృద్ధులకు ఆదాయం8.2% (క్వార్టర్లీ)5 సంవత్సరాలు60+ వయసు, 80C మినహాయింపుకిసాన్ వికాస్ పత్రా (KVP)మధ్యస్థ/దీర్ఘకాలిక పెట్టుబడి7.5%9 సంవత్సరాలు 5 నెలలు (డబుల్ అవుతుంది)గ్రామీణ ప్రజలకు ఉపయోగంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)మధ్యస్థ పెట్టుబడి7.7%5 సంవత్సరాలు80C మినహాయింపుఅటల్ పెన్షన్ యోజన (APY)అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిటైర్మెంట్రూ1,000-5,000/నెల పెన్షన్60 సంవత్సరాల వయసు18-40 సంవత్సరాల వారు దరఖాస్తు చేయాలి. గ్యారంటీడ్ పెన్షన్. ప్రస్తుతం వాటిలో పెట్టుబడి పెట్టే మార్గాలుఆధార్, పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్తో కేవైసీ పూర్తి చేస్తే చాలు పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అవుతుంది.పోస్ట్ ఆఫీస్ మార్గం (ఆఫ్లైన్/ఆన్లైన్)ఆఫ్లైన్: సమీప పోస్ట్ ఆఫీస్కు వెళ్లి సంబంధిత ఫామ్ (ఉదా., పీపీఎఫ్కు Form-1, ఎస్ఎస్వైకు Form-4) సమర్పించాలి.ఆన్లైన్: పోస్ట్ ఆఫీస్ ఐపీపీబీ యాప్ లేదా వెబ్సైట్ (indiapost.gov.in) ద్వారా కూడా ఆన్లైన్లో వీటిని ప్రారంభించవచ్చు.బ్యాంకింగ్ మార్గంఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో యాకౌంట్ తెరిచి నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్/ ఎన్ఎస్సీ వంటి వాటిలో పెట్టుబడి చేయవచ్చు.ఇదీ చదవండి: వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్గా..
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ పోర్టల్లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్ను యూనిఫైడ్ పోర్టల్లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్ల తర్వాత స్వయంచాలకంగా డిస్కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.EPFOHO UAN టెక్స్ట్లో మీ UAN నంబర్ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్ను సులభంగా చూడవచ్చు.EPFO వెబ్సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్బుక్పై క్లిక్ చేయాలి.EPFO పోర్టల్లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?


