ప్రధాన వార్తలు
శబరిమలలో నెట్వర్క్ను పెంచిన వొడాఫోన్ ఐడియా
భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్ మొదలైన వాటిల్లో రిజిస్టర్ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది.
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను సంపాదించుకున్న సత్య సాయిబాబా (Sri Sathya Sai Baba) ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాలలోనూ సత్య సాయిబాబా భక్తులు ఉన్నారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన ఎందరో ప్రముఖలు, పారిశ్రామికవేత్తలూ ఆయన సేవలో తరించారు. సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా వారిలో కొందరి గురించి..ర్యుకో హిరా: జపాన్కు చెందిన హెచ్ఎంఐ హోటల్ గ్రూప్ వ్యవస్థాపకులు. ప్రముఖ అంతర్జాతీయ సాయి భక్తులలో ఒకరు. ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ దాత ఈయనే. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ధర్మకర్తగా కూడా ఉన్నారు.రతన్ టాటా: టాటా సన్స్ దివంగత చైర్మన్. సాయిబాబా కార్యక్రమాలకు హాజరై ఆయన పట్ల గౌరవప్రదమైన ఆధ్యాత్మిక అభిమానాన్ని కొనసాగించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమ రూపకల్పనకు సహాయ సహకారాలందించారు.ఇందులాల్ షా: చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఈయన వ్యాపార వర్గాలలో ప్రముఖుడిగా పేరు గాంచారు. సాయి సంస్థల ప్రపంచ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఏవీఎస్ రాజు: పారిశ్రామికవేత్త, ఎన్సీపీ (నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ) వ్యవస్థాపకుడు. సాయిబాబాకు అత్యంత భక్తుడు. సాయిబాబాపై అనేక పుస్తకాలు రాశారు.మనోహర్ శెట్టి: ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపారవేత్త. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో అనేక సేవ, నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.వేణు శ్రీనివాసన్: టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్. బాబా దీర్ఘకాల భక్తుడు. సాయిబాబాతో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలుసార్లు పంచుకున్నారు. అనేక సాయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.లియో ముత్తు: లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (తమిళనాడు) వ్యవస్థాపకుడు. సాయి బోధనల ప్రభావానికి గురై ఆయనకు భక్తుడిగా మారారు.క్రిస్ గోపాలకృష్ణన్: యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన సత్యసాయి ఆరాధకుడిగా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఏఐతో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేగవంతం
సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్ఏఐ ప్లాట్ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.సాఫ్ట్వేర్లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి ‘‘రీఇమేజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్ నివేదికను విడుదల చేసింది.ఆధునిక సాఫ్ట్వేర్ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ ఫ్రేమ్వర్క్ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్ కేస్ స్టడీస్ని ఇందులో పొందుపర్చింది.
ఇవి బిగించుకునే ఇళ్లు..
కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యకరమైన జీవితంపై శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎంపికలో రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, పచ్చని ప్రకృతిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. ఫలితంగా ఫామ్ ప్లాట్లకు, ఫామ్హౌస్లకు డిమాండ్ పెరిగింది. కనీసం ఇంటి చుట్లూ కనీస నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. మరి, ఫామ్ ప్లాట్లలో భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. దీంతో కంటైనర్ హోమ్స్కు గిరాకీ పెరిగింది. ఫ్యాక్టరీలో తయారు చేయడం, లారీలో తీసికొచ్చి బిగించేయడం వీటి ప్రత్యేకత. శామీర్పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాలలోని ఫామ్హౌస్, రిసార్ట్లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్మాత్రిక ప్రాంతాలలో ఈ తరహావే ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. 111 జీవోలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవటంతో పలువురు ఈ కంటైనర్ హోమ్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఆయా హోమ్స్లో సరదాగా గడుపుతున్నారు. ఎలా తయారు చేస్తారంటే.. కంటైనర్ హోమ్స్ను గ్యాల్వనైజింగ్ స్టీల్స్(జీఏ) షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్(పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు.ఇంటి బీమ్లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూతతో ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్(పీపీవీసీ)లతో రూపొందిస్తారు. తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్యులేషన్తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీంతో అగ్ని, వేడి ఇంటిలోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల ఉష్ణోగత కంటైనర్ హోమ్లో తక్కువగా ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయంటే?విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. ప్రారంభ ధర చదరపు అడుగు (చ.అ)కు రూ.1,300. ఉదాహరణకు 600 చ.అ. మాడ్యులర్ హోమ్కు రూ.7.80 లక్షలు. క్రేన్, రవాణా చార్జీలు కూడా కలిపితే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మాడ్యులర్ హోమ్లో హాల్లోనే ఓపెన్ కిచెన్, బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దీని నిర్మాణానికి 4–5 మంది కలిసి 45 రోజుల్లో పూర్తి చేస్తారు.కంటైనర్ హోమ్స్లో మన అభిరుచుల మేరకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులను ఏర్పాటు చేసుకోవచ్చు. స్ట్రక్చరల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు.మన్నిక ఎన్నేళ్లంటే? ఈ కంటైనర్ హోమ్స్ స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో సాధారణ అపార్ట్మెంట్కు ఎలాగైతే నిర్వహణ చేసుకుంటామో ఈ కంటైనర్ హోమ్స్కు కూడా ఐదారేళ్లకొకసారి రంగులు, పాలిష్ చేసుకోవాలి. 1,000 చ.అ. బిల్డింగ్కు వార్షిక నిర్వహణ కోసం రూ.50 వేలు ఖర్చవుతుంది. ఈ కంటైనర్ హోమ్స్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. మెటల్తోనే వీటిని తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం జరగదు.ఇదీ చదవండి: ఓపెన్ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!
కొత్త ఫోనొచ్చింది.. స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి నయా కంపెనీ
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ ఇండ్కాల్ మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్ వన్’ పేరుతో తొలి స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్అండ్డీ), థర్డ్పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు. ఈ స్మార్ట్ఫోన్లో కెమెరా మాడ్యుల్, హార్డ్వేర్లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జర్ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్లో లభ్యం కాని చిప్సెట్ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.ఆకట్టుకునే ఫీచర్లు: వూబుల్ వన్ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, ఫోన్కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది.
లేబర్ కోడ్తో వర్కర్లకు ప్రయోజనం
న్యూఢిల్లీ: కొత్తగా నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్స్ను స్విగ్గీ, జొమాటో మొదలైన అగ్రిగేటర్లు స్వాగతించాయి. ఈ సంస్కరణలతో లక్షల కొద్దీ వర్కర్లకు మేలు జరుగుతుందని స్విగ్గీ పేర్కొంది. తమ వ్యాపార వ్యయాలపై, దీర్ఘకాలికంగా ఆర్థిక పనితీరుపై ఇందుకు సంబంధించిన భారమేమీ ఉండదని వివరించింది. కంపెనీలపై నిబంధనల భారం తగ్గిస్తూ, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పనిచేసే వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవి ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. మరోవైపు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత మరింత అందుబాటులోకి వస్తుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ పేర్కొంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేస్తూ, గిగ్ వర్కర్ల నిబంధనల్లో ఏకరూపత తెచ్చే దిశగా ఇది సరైన అడుగని తెలిపింది. దీనివల్ల తమ జొమాటో, బ్లింకిట్ వ్యాపార విభాగాలపై ఆర్థిక భారమేమీ ఉండదని వివరించింది. గిగ్ వర్కర్లకు ఇప్పటికే తాము సమగ్ర బీమాతో పాటు ఇతరత్రా ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఎటర్నల్ వివరించింది.
కార్పొరేట్
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
ఐ–బ్యాంకులకు ఐపీవోల పండగ
'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్లో..
అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా?
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
డార్క్ ప్యాటర్న్స్పై 26 సంస్థల సెల్ఫ్ డిక్లరేషన్
వందలాది ఇంజినీర్ల తొలగింపు: 2026లో మరోమారు!
కలిసొచ్చిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
సాఫ్ట్వేర్ స్టార్టప్లో వాటా కొన్న మారుతీ
రష్యా చమురుకు రిలయన్స్ గుడ్బై
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
నిరాశపరిచిన ఫుజియామా పవర్ సిస్టమ్స్
ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా ప...
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతున్నాయి. ఈ ...
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయ...
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమ...
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటాని...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఆధార్ డేటాపై హాట్మెయిల్ కోఫౌండర్ సంచలన ఆరోపణలు
భారత పౌరుల ఆధార్ డేటా భద్రతపై హాట్ మెయిల్ కోఫౌండర్ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.‘మొత్తం ఆధార్ డేటాబేస్ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్లో పేర్కొన్నారు.భారత ఆధార్ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.సబీర్ భాటియా ఆధార్ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్ డిజైన్, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్ నిర్మాణానికి 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ ఆథెంటికేషన్ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు. There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…— Sabeer Bhatia (@sabeer) November 19, 2025
100 కోట్లకు 5జీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: భారత్లో 2031 నాటికి 5జీ సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 100 కోట్లకు చేరవచ్చని ఎరిక్సన్ మొబిలిటీ ఒక నివేదికలో అంచనా వేసింది. స్మార్ట్ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా నెలకు 36 జీబీగా ఉన్న డేటా వినియోగం 2031 నాటికి 65 జీబీకి చేరనుందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో 2025 ఆఖరు నాటికి 5జీ సబ్స్క్రిప్షన్లు 39.4 కోట్లకు చేరవచ్చని వివరించింది. మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో వీటి వాటా 32 శాతంగా ఉంటుందని పేర్కొంది. అటు అంతర్జాతీయంగా కూడా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరతాయని, మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో వీటి వాటా మూడింట రెండొంతులుగా ఉంటుందని నివేదిక వివరించింది. భారత్లో డిజిటలీకరణను వేగవంతం చేసే దిశగా 5జీ ఇప్పటికే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తోందని పేర్కొంది. అందుబాటు ధరలో 5జీ ఎఫ్డబ్ల్యూఏ సీపీఈ (ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ కస్టమర్ ప్రిమిసెస్ ఎక్విప్మెంట్) లభ్యత, ఎఫ్డబ్ల్యూఏ యూజర్లు అత్యధికంగా డేటాను వినియోగిస్తుండటంలాంటి అంశాలు భారత్లో డేటా ట్రాఫిక్ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు... → 2031 నాటికి అంతర్జాతీయంగా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరనున్నాయి. ఇందులో 410 కోట్ల కనెక్షన్లు, ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా కేవలం 5జీ నెట్వర్క్పైనే పని చేస్తాయి. → 2024 మూడో త్రైమాసికం నుంచి 2025 మూడో త్రైమాసికం మధ్య కాలంలో మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. 2031 వరకు ఇది వార్షిక ప్రాతిపదికన సగటున 16 శాతం మేర వృద్ధి చెందుతుంది. → 2024 ఆఖరు నాటికి గణాంకాలతో పోలిస్తే మొత్తం మొబైల్ డేటా వినియోగంలో 5జీ నెట్వర్క్ వాటా 34 శాతం నుంచి పెరిగి 43 శాతానికి చేరుతుంది. 2031 నాటికి ఇది 83 శాతానికి చేరుతుంది. → ఎఫ్డబ్ల్యూఏ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకునే వరి సంఖ్య 2031 ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకి చేరుతుంది. → అంతర్జాతీయంగా 6జీ సబ్ర్స్కిప్షన్లు 2031 ఆఖరు నాటికి 18 కోట్లకు చేరతాయి. ఒకవేళ 6జీ ఆవిష్కరణలను మరింత ముందుగా తీసుకొస్తే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.
‘1600’ కాలింగ్ సిరీస్ను తప్పనిసరి చేసిన ట్రాయ్
ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు(NBFCs), మ్యూచువల్ ఫండ్లతో సహా వివిధ వర్గాల ఆర్థిక సంస్థలు తమ సేవలు, లావాదేవీల కోసం ప్రత్యేకంగా ‘1600’ కాలింగ్ సిరీస్ను ఉపయోగించడానికి గడువు ప్రకటించింది. నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్ను ప్రజలు సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ తెలిపింది. తద్వారా మోసాల కేసులను గణనీయంగా తగ్గించడానికి తోడ్పడుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.సంస్థల వారీగా గడువులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రణలో ఉన్న సంస్థలు ‘1600’ నంబరింగ్ సిరీస్ను తప్పనిసరిగా పాటించాలని, అందుకు గడువు తేదీలను ట్రాయ్ స్పష్టం చేసింది.సంస్థలుగడువు తేదీవాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు)జనవరి 1, 2026పెద్ద ఎన్బీఎఫ్సీలు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుఫిబ్రవరి 1, 2026మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీలుఫిబ్రవరి 15, 2026సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లుఫిబ్రవరి 15, 2026మిగిలిన ఎన్బీఎఫ్సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుమార్చి 1, 2026క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (QSBలు)మార్చి 15, 2026 గమనిక: బీమా రంగానికి సంబంధించి IRDAIతో గడువుపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఈ తేదీని ప్రకటిస్తామని ట్రాయ్ తెలిపింది.టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా 1600 సిరీస్ను కేటాయించింది. ఇది సాధారణ వాణిజ్య కమ్యూనికేషన్ల నుంచి అధికారిక సర్వీసులను వేరు చేయడానికి సహాయపడుతుంది. జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత దశలవారీగా అమలు షెడ్యూల్ను జారీ చేసినట్లు ట్రాయ్ తెలిపింది. ఇప్పటికే 485 సంస్థలు 1600 సిరీస్ను స్వీకరించాయని పేర్కొంది. ఇతర సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు వారి రిజిస్ట్రేషన్ వివరాలను ధ్రువీకరించిన తర్వాత స్వచ్ఛందంగా 1600 సిరీస్కు మారవచ్చని ట్రాయ్ తెలిపింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
పుతిన్ ముందు చిందేసిన రోబో
టెక్నాలజీ పెరుగుతోంది.. ఈ తరుణంలో ప్రపంచంలోని చాలాదేశాలు హ్యుమానాయిడ్ రోబోలను తయారు చేసేపనిలో నిమగమయ్యాయి. ఇందులో రష్యా కూడా ఉంది. ఇటీవల స్బెర్బ్యాంక్ బుధవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక రోబో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్యాలోని స్బెర్బ్యాంక్ తన సాంకేతిక పురోగతిని ప్రదర్శించడానికి రూపొందించిన ప్రదర్శనలో.. బుధవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదురుగా ఒక రోబో డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో.. క్రెమ్లిన్ చీఫ్, హ్యూమనాయిడ్ రోబోట్ ఎదురుగా నిలబడి రోబో గురించి వివరించారు.రోబో తనను తాను పరిచయం చేసుకుంటూ.. ''నా పేరు గ్రీన్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన మొదటి రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. నేను కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు. టెక్నాలజీ యొక్క భౌతిక స్వరూపిని. నేను డ్యాన్స్ కూడా చేయగలను, అని వ్లాదిమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది''. దాని డ్యాన్స్ చూసి ఆయన ఎంతో ముగ్దుడయ్యాడు.Vladimir Putin visits AI exhibition and is treated to a dance by a Sberbank robot 'Dear Vladimir Vladimirovich thank you for your attention!'Putin is certainly stunned pic.twitter.com/FOCZFhg6w8— RT (@RT_com) November 19, 2025వేదికపై పడిపోయిన రోబోనవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా 'ఐడల్' (Aidol) అనే రోబోను ఆవిష్కరించారు. ఇది ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చి.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025
పర్సనల్ ఫైనాన్స్
నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా
సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.11-12-20 ఫార్ములాఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్తో రూ. కోటి పొందవచ్చు.20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.కో-పేమెంట్ నిబంధనచాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.వెయిటింగ్ పీరియడ్స్బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.రూమ్ రెంట్ క్యాపింగ్చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.క్లెయిమ్ తిరస్కరణదరఖాస్తు ఫామ్లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.సబ్ లిమిట్స్కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.కవర్ కాని అంశాలుసౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.పాలసీదారులు ఏం చేయాలి?బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి.నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025


