Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lakme Cosmetic Brand Pioneer Simone Tata Dies At 951
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత

ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్‌ బ్రాండ్‌ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్‌ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్‌ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్‌కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025

Shift in Housing Trends Luxury Units Outperform Affordable Homes2
చిన్న ఇళ్లు చవకైపోయాయ్‌..!!

సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూ.. విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. విశాలమైన స్థలం, ఆధునిక వసతులు, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు ఆదరణ వృద్ధి చెందుతోంది.2022 నుంచి 2025 మధ్యకాలంలో లగ్జరీ ఇళ్ల ధరలు 40 శాతం మేర పెరగగా.. చౌక గృహాల రేట్లు 26 శాతం మేర క్షీణించాయి. 2022లో రూ.40 లక్షలోపు ధర ఉండే అఫర్డబుల్‌ ఇళ్ల ధరలు చ.అ.కు రూ.4,229గా ఉండగా.. 2025 నాటికి 26 శాతం వృద్ధి రేటుతో రూ.5,299లకు చేరింది.అదే రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే మిడ్‌ ప్రీమియం గృహాల ధరలు 2022లో చ.అ.కు రూ.6,880గా ఉండగా.. ఇప్పుడది 39 శాతం వృద్ధి రేటుతో రూ.9,537కు పెరిగింది. ఇక, రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ యూనిట్ల ధర 2022లో చ.అ.కు రూ.14,530లుగా పలకగా.. ఇప్పుడది 40 శాతం వృద్ధి రేటుతో రూ.20,300లకు ఎగబాకింది.

Gold rallies Rs 1300 to Rs 132900 per 10 grams3
పసిడి రూ. 1,300 అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది.

 Bank Of Baroda Cut Repo-Linked Interest Rate and Others To Follow Suit4
రేట్ల తగ్గింపు బాటలో బ్యాంకులు

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ రేట్లను తగ్గించడంతో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే పనిలో పడ్డాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) రెపో ఆధారిత రుణ రేటును 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి ఈ రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.అటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌బీఎల్‌ఆర్‌)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ఇటీవలే ఏడాది కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ని (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు) 5 బేసిస్‌ పాయింట్లు కట్‌ చేసి 8.80 శాతానికి తగ్గించింది.

RBI Cuts Repo Rate by 25 bps to 5. 25 Percent5
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్‌

అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్‌ టారిఫ్‌ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్‌నిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్‌ వాణిజ్య టారిఫ్‌లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్‌లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది. ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. ఇప్పటికే యూఎస్‌ టారిఫ్‌లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్‌ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్‌టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్‌ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్‌నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్‌బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి. రూ. లక్ష కోట్లు ఇలా ఓపెన్‌ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్‌ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్‌–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్‌ను చేపట్టనుంది. సీజనల్‌గా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్‌బీఐ తెలియజేసింది. రూపాయిపై కల్పించుకోం..ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్యాలన్స్‌చేస్తూ ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్‌ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది. – సంజయ్‌ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌ఈఎంఐలు తగ్గనున్నాయ్‌ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్‌ఆర్‌) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.కార్పొరేట్లు సైతం ఖుషీరెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్‌ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్‌ఆర్, బేస్‌ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్‌ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్‌ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఆటో రంగ జోరు వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్‌టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది. – శైలేష్‌ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్‌(సియామ్‌) ప్రెసిడెంట్‌ కొత్తవాళ్లకు పుష్‌ గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్‌ఏఆర్‌ఈడీసీవో(నరెడ్కో)లక్ష్యాలివీ ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్‌బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది. అరుదుగా ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు.

Geoffrey Hinton Godfather of AI praised Google recent advances ai6
ఓపెన్‌ఏఐని మించిపోనున్న గూగుల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్‌ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్‌ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్‌ ఓపెన్‌ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్‌బాట్‌లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్‌ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం

Advertisement
Advertisement
Advertisement