Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Steel tycoon Lakshmi Mittal Quits UK Ahead of Proposed Taxes on Super Rich1
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..

మూడు దశాబ్దాలు బ్రిటన్‌లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్‌లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్‌లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.లక్ష్మీ ఎన్ మిట్టల్1950 జూన్ 15న రాజస్థాన్‎లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్‌లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు కారణంగా.. స్విట్జర్లాండ్‌కు మకాం మార్చారు. ఈయన నెట్‌వ‌ర్త్ 22 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: అంబానీ స్కూల్‌లో ఫీజులు అన్ని లక్షలా?

Agricultural Income and Tax Burden Calculation2
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు

గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్‌లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్‌ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్‌కంట్యాక్స్‌ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్‌ లిమిట్‌ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్‌ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్‌ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్‌ ఇంటిగ్రేషన్‌ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్‌ ప్లానింగ్‌ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.

Paytm founder saves over Rs 16000 on restaurant bill viral post3
రెస్టారెంట్‌ బిల్లుపై డిస్కౌంట్.. పేటీఎం బాస్‌పై జోకులు

సాధారణంగా మధ్యతరగతివారికి డిస్కౌంట్లు అంటే మోజు ఎక్కువ. ఎక్కడ ఏది కొనాలన్నా మొదట డిస్కౌంట్‌ ఎంత వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ సంపన్నులు కూడా వీటికి అతీతులు కాదని కొందరు నిరూపిస్తున్నారు.పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా ఓ రెస్టారెంట్‌ బిల్లుపై భారీ తగ్గింపు పొందిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్త వైరల్‌గా మారి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. బిలియనీర్లు కూడా డిస్కౌంట్‌ల కోసం చూస్తారనే అంశంపై నెటిజన్లు చమత్కారాలు చేయడం మొదలుపెట్టారు.ఢిల్లీ విమానాశ్రయంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు విందు జరుపుకొన్న విజయ్ శేఖర్‌ శర్మ.. డిన్నర్ బిల్లు రూ. 40,828 వచ్చినట్లు తెలిపారు. అయితే ఈజీడైనర్‌లోని ఆఫర్లు, కూపన్లు ఉపయోగించి బిల్లును రూ. 24,733కి తగ్గించగలిగారు. మొత్తం రూ. 16,095 ఆదా కావడం ఆయనను ఆశ్చర్యపరచింది.ఈ బిల్లు స్క్రీన్‌షాట్‌ను తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన “ఇది ఊహించని పుట్టినరోజు గిఫ్ట్‌లా అనిపించింది” అంటూ ఈజీడైనర్, దాని వ్యవస్థాపకుడు కపిల్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. 35% రెస్టారెంట్ డిస్కౌంట్‌ రూ. 14,290 తో పాటు రూ. 2,000 అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూపన్‌ కూడా వర్తించడంతో ఈ భారీ తగ్గింపు వచ్చింది.నెటిజన్ల స్పందనలువిజయ్ శేఖర్‌ శర్మ పోస్ట్ వైరల్ కావడంతో, డిస్కౌంట్‌ను ఆయన వాడుకోవడంపై సోషల​్‌ మీడియా యూజర్లు జోకులు పేలుస్తున్నారు. “మాకు కూడా ‘కపిల్ చోప్రా లాంటి స్నేహితులు’ ఉంటే బాగుండేది” అని కొందరు సరదాగా చెప్పారు. “బిలియనీర్లు డిస్కౌంట్ చూసి ఇలా ఎంజాయ్ చేస్తే… మనం మాత్రం రెస్టారెంట్లలో రూ. 20 సర్వీస్ ఛార్జీ కోసం వాగ్వాదం చేస్తాం” అని మరో కామెంట్ వైరల్ అయింది. “పేటీఎం క్యాష్‌బ్యాక్ కర్మ తిరిగి వస్తోంది” అని ఒకరు వ్యాఖ్యానించారు. “మీరు బిలియనీర్ కాదా? బిలియనీర్లు కూడా డిస్కౌంట్లను ఇష్టపడతారా?” అంటూ మరొకరు ప్రశ్నించారు.It is too good to be true that a ₹40k restaurant bill becomes ₹24 k just because you have friend like @KapilChopra72 ‘s awesome and incredible @eazydiner ! 😄Thank you EazyDiner , it is always awesome discounts on food 🤗🙏🏼 pic.twitter.com/XthhbM4NXM— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 22, 2025

Keep EMI Burden Under 36pc of Income to Stay Debt Safe Youth Finance 4
అప్పు ఎంత చేయొచ్చు..? తెలిసినవారు అధిక సంపన్నులు!

"అప్పులేని వాడే అధిక సంపన్నుడు" అన్నాడు కవి వేమన. కానీ ఆధునిక అవసరాలు అనివార్యమైన నేటి రోజుల్లో "అప్పు ఎంత చేయొచ్చో తెలిసినవారు అధిక సంపన్నులు" అంటున్నారు ఆర్థిక నిపుణులు. పేదవారి నుంచి సంపన్నుల వరకూ అప్పు చేయనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారు ఏదో ఒక రూపంలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇక సగటు మధ్యతరగతి జీవితంలో అప్పు నిత్యకృత్యమే.నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అప్పుల తిప్పలు తప్పడం లేదు. అయితే జీవన శైలిలో మార్పుల కారణంగా కొన్ని అప్పులు అనవరంగా వచ్చి మీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి రుణ బాధ్యతలను మరింత దగ్గరగా పర్యవేక్షించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు అప్పు లేకుండా ఉండటం మంచిదే. అయితే, కొన్నిసార్లు ముఖ్యంగా ఇల్లు, వాహనాల కొనుగోలు లేదా ఉన్నత విద్య వంటి వాటి కోసం అప్పు ఆచరణాత్మక అవసరం.తు.చ.తప్పకూడని అప్పు సూత్రంఆర్థికంగా ఆరోగ్యంగా ఉండటానికి, నిపుణులు ఒక క్లిష్టమైన నియమాన్ని నొక్కి చెబుతారు. అదే ఒక నెలలో ఈఎంఐలు (EMI), చేబదుళ్లు వంటివాటి కోసం వెళ్లే మొత్తం ఒక వ్యక్తి స్థూల నెలవారీ ఆదాయంలో 36 శాతానికి మించకూడదు. రుణం-ఆదాయ నిష్పత్తి అని పిలిచే ఈ పరిమితిని తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని కొలవడానికి బ్యాంకులు విస్తృతంగా ఉపయోగిస్తాయి. అప్పు దీన్ని మించితే రుణగ్రహీత బడ్జెట్ ను ఒత్తిడి చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా యువతకు..ఈ అప్పు సూత్రం యువతకు ముఖ్యమైంది. సులభమైన క్రెడిట్ ఆప్షన్లు, ఒక్క స్క్రీన్ ట్యాప్‌తో అందుబాటులో ఉన్న తక్షణ రుణాలతో నిండిన ఆర్థిక దృశ్యంలోకి దేశ యువత ప్రవేశిస్తున్నారు. సామాజిక ఒత్తిళ్లు, ఆన్ లైన్ షాపింగ్, దూకుడు మార్కెటింగ్ తరచుగా ఆదాయానికి మించి ఖర్చు చేయిస్తుంటాయి. ఫలితంగా, చాలా మంది యువ సంపాదనాపరులు జీవితం ప్రారంభంలోనే అధిక వడ్డీ రుణాల ఉచ్చులో పడతారు. వయసు 20, 30ల ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన రుణ అలవాట్లను అలవరచుకోవడం దీర్ఘకాలికంగా సంపద సృష్టిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?అప్పునకు దూరంగా ఉండటానికి మార్గాలుమీ మొదటి ఉద్యోగం ప్రారంభం నుంచే ఈఎంఐ-టు-ఇన్‌కమ్‌ నిష్పత్తిని ట్రాక్ చేయండి. ఆదాయం పెరిగినప్పటికీ, ఈఎంఐలు మీ స్థూల జీతంలో 36% మించకుండా చూసుకోండి.లైఫ్ స్టైల్ అప్ గ్రేడ్ చేయడానికి ముందు అత్యవసర నిధిని నిర్మించుకోండి.యువత తరచుగా ఖర్చు చేయడానికి అనుకూలంగా పొదుపును దాటవేస్తారు. సంక్షోభ సమయంలో ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండటానికి ఈ ఎమెర్జెన్సీ ఫండ్‌ అవసరం.క్రెడిట్ కార్డులు లేదా ఇప్పుడు కొని తర్వాత చెల్లించే యాప్‌ల ద్వారా హఠాత్తు కొనుగోళ్లను నివారించండి. బై-నౌ-పే-లేటర్ సర్వీసులు యువ వినియోగదారులలో ప్రాచుర్యం పొందాయి. కానీ ఊహించని రుణ ఉచ్చులను సృష్టించగలవు.విద్యా రుణాలను తెలివిగా ఎంచుకోండి. సైన్ అప్ చేయడానికి ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఎంపికలు, మారటోరియం కాలాలను పోల్చి చూసుకోండి.బడ్జెట్‌ను రూపొందించుకోవడం అలవాటు చేసుకోండి. కొన్ని యాప్‌లు ఖర్చులను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఒక సాధారణ నెలవారీ బడ్జెట్ అధిక ఖర్చును నిరోధిస్తుంది. పొదుపును ప్రోత్సహిస్తుంది.అధిక వడ్డీ రుణంపై దృష్టి పెట్టండి. వడ్డీని నివారించడానికి మొదట క్రెడిట్ కార్డు బకాయిలను క్లియర్ చేయండిఅదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోండి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైమ్ వర్క్ లేదా డిజిటల్ గిగ్ లు ఆరోగ్యకరమైన రుణ-ఆదాయ నిష్పత్తిని నిర్వహించడంలో సహాయపడతాయి.ప్రతిదానికీ ఫైనాన్స్ చేయడానికి బదులుగా పెద్ద కొనుగోళ్లను ప్లాన్ చేయండి. అది బైక్, ఫోన్ లేదా విహారం అయినా. మొదట పొదుపు చేయడం ఈఎంఐలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

Gold and Silver rates on 24 November 2025 in Telugu states5
గోల్డెన్‌ న్యూస్‌: పసిడి ప్రియులకు ఆనందమే..

దేశంలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పసిడి ధరలు కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

New Labour Code Will Your Take Home Salary Reduce6
ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?

కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్‌ కోడ్‌లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.ఎక్కువ బేసిక్‌ పే.. తక్కువ టేక్‌ హోమ్‌వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్‌ అలవెన్స్‌) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్‌ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్‌ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్‌) పోయి ఎక్కువ జీతం చేతికందేది.రిటైనింగ్ అలవెన్స్ అంటే..రిటైనింగ్ అలవెన్స్ అనేది పని లభ్యం కాని కాలాల్లో ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లకుండా నిలుపుకోవడం కోసం చేసే చెల్లింపు. దీని ద్వారా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు వారు కంపెనీతో ఉండేలా యాజమాన్యాలు చూసుకుంటాయి. అయితే కొత్త లేబర్‌ కోడ్‌లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల క​సం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్‌& అసోసియేట్స్‌కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్‌/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement