Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PM Modi Credits Ethanol Blending for Shielding India Amid Middle East Crisis1
‘ఇథనాల్‌’ ఇంధనమే ఆదుకుంటోంది..

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.చమురు దిగుమతులకు అడ్డుకట్ట..ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.వేగంగా ఇథనాల్ బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌ ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్‌ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది.

Gold and Silver rates on 29th March 2026 in Telugu States2
నిన్న భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా..

దేశంలో పసిడి ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రెండు రోజులు పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి ఊరటని చెప్పవచ్చు.అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Centre Accelerates Green Port Initiative to Modernize Maritime Infrastructure3
గ్రీన్‌ పోర్ట్‌ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్‌ పోర్ట్‌లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్‌వేస్‌ శాఖ తెలిపింది. ’మారిటైమ్‌ ఇండియా విజన్‌ –2030’, ’హరిత సాగర్‌’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.గ్రీన్‌ టగ్‌ ట్రాన్సిషన్‌ ప్రోగ్రాం ద్వారా డీజిల్‌ టగ్‌ల స్థానంలో ఎలక్ట్రిక్‌ / హైబ్రిడ్‌ టగ్‌ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్‌ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్‌ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్‌ సరఫరా చేసే ‘‘వన్‌షోర్‌ పవర్‌ సప్‌లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.అలాగే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లుగా ‘దీన్‌దయాల్‌ పోర్ట్‌ అథారిటీ, పారాదీప్‌ పోర్ట్‌ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్‌ షిప్పింగ్‌) అభివృద్ధి, గ్రీన్‌ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్‌ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్‌ బెల్ట్‌ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.

construction-costs-india-2026-telugu-states-analysis-​house-construction-tips4
ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!

సొంతిల్లు అనేది ప్రతిఒక్కరికీ జీవిత కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆ కలను సాకారం చేసుకోవడంలో సవాలుగా మారుతున్నాయి. 2026 తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిర్మాణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో..దేశంలో నిర్మాణ ఖర్చులు ఎక్కడ తక్కువ?భారతదేశంలో నిర్మాణ ఖర్చులు భౌగోళిక ప్రాంతం, రవాణా సౌకర్యాలు, కూలీల లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అత్యంత సరసమైన ధరల్లో నిర్మాణాలు జరుగుతున్న నగరాలు ఇవే..అహ్మదాబాద్ (గుజరాత్): దేశంలోనే అత్యంత చౌకగా ఇల్లు నిర్మించుకోగలిగే నగరం ఇది. ఇక్కడ చదరపు అడుగుకి సగటున రూ.1,200 – రూ.1,600 ఖర్చు అవుతోంది.జైపూర్ (రాజస్థాన్): ఇక్కడ చదరపు అడుగుకి రూ.1,500 – రూ.2,200 మధ్య ధరలు ఉన్నాయి.విజయవాడ (ఆంధ్రప్రదేశ్): పెరుగుతున్న నగరమైనప్పటికీ, మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా (చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,200) నమోదవుతున్నాయి.కోల్‌కతా: మెట్రో నగరాల్లో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోగలిగే చోటుగా కోల్‌కతా నిలుస్తోంది (సుమారు రూ.1,500 – రూ.2,500).మరోవైపు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఖర్చు చదరపు అడుగుకి రూ.2,500 నుంచి రూ.5,000 పైమాటే.తెలుగు రాష్ట్రాల పరిస్థితితెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో నిర్మాణ ఖర్చులు 10-15% పెరిగాయి. ముఖ్యంగా కూలీల కొరత, రవాణా ఛార్జీలు పెరగడం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణానికి బేసిక్ క్వాలిటీలో ఒక చదరపు అడుగుకు రూ.1,700 – రూ.2,000, స్టాండర్డ్ క్వాలిటీ అయితే రూ.2,100 – రూ.2,500 ఖర్చవుతోంది. అదే ప్రీమియం/లగ్జరీ అయితే ఒక ఎస్‌ఎఫ్‌టీకి రూ.2,600 – రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.హైదరాబాద్ శివార్లలో (ఉదా: షాద్‌నగర్, ఆదిబట్ల) నిర్మాణ ఖర్చులు కొంత తక్కువగా ఉండగా, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూలీల రేట్లు అధికంగా ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో సగటున చదరపు అడుగుకి రూ.1,400 – రూ.2,300 ఖర్చు అవుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో స్టీల్, సిమెంట్ రవాణా సౌకర్యం వల్ల మెటీరియల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.సగటు నిర్మాణ సామగ్రి ధరలు 2026 అంచనా ధరల ప్రకారం.. నిర్మాణ వ్యయంలో దాదాపు 60-70% ఖర్చు మెటీరియల్‌కే అవుతుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లు ఇలా ఉన్నాయి..సామగ్రిసగటు ధరసిమెంట్ (50kg బ్యాగ్)₹350 – ₹450స్టీల్ (TMT Bars - టన్ను)₹60,000 – ₹75,000ఇసుక (రివర్ సాండ్ - టన్ను)₹1,200 – ₹2,500 (లభ్యతను బట్టి)ఎం-సాండ్ (M-Sand - టన్ను)₹900 – ₹1,500ఇటుకలు (ఒక్కోటి)₹7 – ₹12సిమెంట్ ఇటుకలు/బ్లాక్స్₹30 – ₹502026 బడ్జెట్‌లో సిమెంట్ పై జీఎస్టీని (GST) 28% నుంచి 18 శాతానికి, స్టీల్ పై 18% నుంచి 12శాతానికి తగ్గించడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది.ఖర్చును ఎలా తగ్గించుకోవాలి?స్థానిక మెటీరియల్: రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి స్థానికంగా లభించే ఇటుకలు, కంకర వాడటం ఉత్తమం.ప్లానింగ్:నిర్మాణ సమయంలో ప్లాన్ మార్పులు చేయకుండా ముందుగానే పక్కాగా సిద్ధమవ్వాలి.టెక్నాలజీ: ప్రస్తుత కాలంలో ఏఏసీ బ్లాక్స్ వాడకం వల్ల ప్లాస్టరింగ్ ఖర్చు, సిమెంట్ వినియోగం తగ్గుతుంది.ఇదీ చదవండి: సిటీ రియల్‌ ఎస్టేట్‌కు గేమ్‌ ఛేంజర్‌!

Vivo Expands 5G Lineup in India with Launch of Y21 and Y115
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు

న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్‌ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుంది.రెండు డివైజ్‌లలో 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్‌ ఓఎస్‌6 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్‌ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్‌ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్‌ ప్లాట్‌ఫాంలు, పార్ట్‌నర్‌ రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి లభిస్తాయి.

LGE India Partners with Hinduja and Sunsure for Solar Power Transition6
పునరుత్పాదక విద్యుత్‌పై ఎల్‌జీఈ ఇండియా ఫోకస్‌

న్యూఢిల్లీ: కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్‌ పీక్‌ (ఎండబ్ల్యూపీ) సోలార్‌ పవర్‌ కోసం హిందుజా రెన్యువబుల్స్‌ ఎనర్జీతో, అలాగే గ్రేటర్‌ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్‌ష్యూర్‌ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్‌ జనరేట్‌ అవుతుందని సంస్థ వివరించింది.

Advertisement
Advertisement
Advertisement