Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TRAI Slaps Rs 150 Crore Fine on Telcos for Spam Call Failures1
రూ.150 కోట్లు జరిమానా కట్టండి: ట్రాయ్‌ పెనాల్టీ

అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్‌ గతేడాది 21 లక్షల స్పామ్‌ కనెక్షన్లను డిస్కనెక్ట్‌ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్‌లిస్టులో పెట్టింది.4–6 క్లిక్‌లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్‌ డీఎన్‌డీ యాప్‌ అందుబాటులో ఉంది. కాల్స్‌ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్‌ చేసేందుకు 1600 సిరీస్‌తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి ప్రమోషనల్‌ కాల్స్‌ చేయకూడదు. రిజిస్టర్డ్‌ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్‌ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి స్పామ్‌ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి.

Gold and Silver rates on January 6th 2026 in Telugu states2
స్పీడు తగ్గని సిల్వర్‌.. బంగారం మాత్రం..

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు ఆపలేదు. వరుసగా రెండో రోజూ దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తక్కువగా అయినా గణనీయంగానే పెరిగాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Vreels Privacy First Social Media Platform for Creators And Users3
Vreels - సోషల్ మీడియాకు మరో ప్రత్యామ్నాయం కాదు - మరో దృక్పథం

డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న ఈ రోజుల్లో, యూజర్ డేటా గోప్యతా సమస్యలు, స్పష్టతలేని అల్గోరిథమ్స్, మరియు కొద్ది మంది మాత్రమే లాభపడే ఆదాయ వ్యవస్థలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, Vreels (www.vreels.com) ఒక కొత్త దృష్టికోణాన్ని తీసుకొని వచ్చింది. ఇది యూజర్ గోప్యత, పారదర్శకత, సమాన అవకాశాలు, మరియు కమ్యూనిటీ ఇంటరాక్షన్‌పై ఆధారపడి రూపుదిద్దబడిన వేదిక.యూజర్‌కు అనుగుణంగా రూపొందిన వేదికVreels ప్రత్యేకత ఏమిటంటే - ఇది యూజర్ల కోసం మాత్రమే కాకుండా, యూజర్లతో కలిసి నిర్మించబడుతున్న వేదిక. మీటప్లు, ఓపెన్ ఫోరమ్ల ద్వారా కంటెంట్ క్రియేటర్లను, యూజర్లను నేరుగా కలుసుకుంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.ప్రతిభకు సమాన ప్రాధాన్యత, వ్యక్తీకరణ స్వేచ్ఛ, నైతిక ఆదాయ విధానం, మరియు యూజర్ నియంత్రణ వంటి అంశాలే ఈ వేదిక అభివృద్ధికి దిశానిర్దేశకాలు. అల్గోరిథమ్ ప్రయోజనాలకన్నా, కమ్యూనిటీ అవసరాలే ఇక్కడ ప్రధానంగా పరిగణించబడతాయి.విద్యార్థులు మరియు కొత్త ప్రతిభలకు ప్రోత్సాహంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న అపారమైన సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు Vreels ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్యాంపస్ స్థాయిలో నిర్వహిస్తున్న కంటెంట్ కార్యక్రమాలు విద్యార్థులను సురక్షిత వాతావరణంలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తున్నాయి.విద్యాసంస్థను వెరిఫై చేసిన యూజర్లు ఇతర కళాశాలల విద్యార్థులతో కనెక్ట్ అవుతూ, దీర్ఘకాలిక సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్క్లను నిర్మించుకోగలరు. గోప్యతా రక్షణలు, కంటెంట్ నియంత్రణలు యువతలోని సందేహాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ప్రారంభ దశలోనే ఆదాయ అవకాశాలుసోషల్ మీడియా రంగంలో అరుదైన అడుగు వేస్తూ, Vreels ఒక స్పష్టమైన మైల్‌స్టోన్ ఆధారిత ఆదాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం:• ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 చెల్లింపు • గరిష్ట ఆదాయ పరిమితి లేదు (ప్రోగ్రామ్ అమలులో ఉన్నంత వరకు)పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారకముందే, యూజర్ల శ్రమకు విలువ ఇస్తూ, ప్రారంభ దశ నుంచే ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం ఈ విధాన ప్రత్యేకత.సోషల్ కామర్స్ దిశగా అడుగు - Vreels Shop2026 తొలి త్రైమాసికంలో Vreels Shop ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారాలు, కొత్త బ్రాండ్లు యూజర్లతో నేరుగా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతం వెండర్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.ఇది క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్లకు కొత్త ఆదాయ మార్గాలను తెరవనుంది.వ్యక్తిగత అనుభూతికి ప్రాధాన్యం ఇచ్చే ఫీచర్లుVreelsలోని ప్రత్యేకమైన ఫీచర్ Memory Capsule — మీరు ఎంచుకున్న ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలను, నిర్ణయించిన సమయానికి, ఎంపిక చేసిన వ్యక్తికే షేర్ చేసే అవకాశం ఇస్తుంది. ఇది పబ్లిక్ షేరింగ్కు భిన్నంగా, వ్యక్తిగత భావోద్వేగాలకు విలువ ఇస్తుంది.PixPouch ఫీచర్ ద్వారా యూజర్లు తమ విజువల్ జ్ఞాపకాలను సక్రమంగా భద్రపరచుకుని, కావాలనుకున్నప్పుడే ఎంపిక చేసిన వారికి షేర్ చేయవచ్చు.ఒకే యాప్‌లో సంపూర్ణ అనుభవం• Vreels ఒకే వేదికలో: షార్ట్ వీడియోలు (Reels) • రియల్టైమ్ చాట్ • వాయిస్ & వీడియో కాల్స్అన్నీ అందిస్తూ, యూజర్లు యాప్ల మధ్య మారాల్సిన అవసరాన్ని తొలగిస్తోంది.గోప్యతే పునాదిప్రకటనల ఆదాయంపై ఆధారపడే వేదికలతో పోలిస్తే, Vreels గోప్యత మరియు డేటా భద్రతను తన మౌలిక నిర్మాణంలోనే సుస్థిరంగా ఏర్పాటు చేసింది. యూజర్ల కంటెంట్, పరస్పర చర్యలపై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.ప్రపంచ దృష్టికోణంఅమెరికా ఆవిష్కరణా దృక్పథ్వం మరియు భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభ కలయికతో రూపొందిన Vreels, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ పేటెంట్లు దాఖలయ్యాయి. ప్రాంతీయ భాషల మద్దతు కూడా నిరంతరం విస్తరిస్తోంది.Vreels — మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా — మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒక్కే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels - భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్‌సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌లలో ఈరోజే Vreels డౌన్‌లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్‌లోడ్‌ కోసం క్రింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.

stock market updates on January 6th 20264
Stock Market Updates: నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 26,211 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 263 పాయింట్లు నష్టపోయి 85,176 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.5బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.6% పైగా పెరిగిందినాస్‌డాక్‌ 0.9 శాతం పెరిగిందిToday Nifty position 06-01-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

SEBI Okays IPO Plans of 8 Companies5
8 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే.. సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ కేలండర్‌ ఏడాది(2026)లోనూ దూకుడు చూపనున్నాయి. ఇప్పటికే పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిస్టింగ్‌ బాట పట్టగా.. హిందుస్తాన్‌ ల్యాబొరేటరీస్‌ ఐపీవోకు దరఖాస్తు చేసింది. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు చూద్దాం..కొత్త ఏడాదిలో విభిన్న రంగాలకు చెందిన 8 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందాయి. జాబితాలో ఆర్‌కేసీపీఎల్‌ లిమిటెడ్, చార్టర్డ్‌ స్పీడ్, గ్లాస్‌ వాల్‌ సిస్టమ్స్‌(ఇండియా), జెరాయ్‌ ఫిట్‌నెస్, శ్రీరామ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ, టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(ఇండియా), ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూలై– సెపె్టంబర్‌ మధ్య కాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలన్నీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. ప్రధానంగా ఫెర్టిలిటీ సర్వీసులందించే ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసి అనుమతి పొందాయి.ఆర్‌కేసీపీఎల్‌ నిర్మాణం, మౌలిక సదుపాయాల కంపెనీ ఆర్‌కేసీపీఎల్‌ లిమిటెడ్‌ ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 550 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కార్యకలాపాలు, బ్యాలెన్స్‌షీట్‌ పటిష్టతకు వినియోగించనుంది. రూ. 200 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 130 కోట్లు నిర్మాణ సంబంధ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 188 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.చార్టర్డ్‌ స్పీడ్‌ ప్రయాణికుల చేరవేత కంపెనీ చార్టర్డ్‌ స్పీడ్‌ లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీ ని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 855 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుండగా, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్‌ బస్సులపై ఇన్వెస్ట్‌ చేయనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. గ్లాస్‌ వాల్‌ ఫ్యాసేడ్‌ సిస్టమ్స్‌ తయారీ, ఇన్‌స్టలేషన్‌ కంపెనీ గ్లాస్‌ వాల్‌ సిస్టమ్స్‌(ఇండియా) లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.02 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. శ్రీరామ్‌ ఫుడ్‌ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యం ఎగుమతి చేసే శ్రీరామ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ ఐపీవోలో భాగంగా 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 52 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2014లో ఏర్పాటైన కంపెనీ బీ2బీ పద్ధతిలో బియ్యం ఎగుమతులను చేపడుతోంది.జెరాయ్‌ ఫిట్‌నెస్‌ ఫిట్‌నెస్‌ పరికరాల తయారీ కంపెనీ జెరాయ్‌ ఫిట్‌నెస్‌ ప్రమోటర్లు ఐపీవోలో భాగంగా 43.92 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లకు చేరనున్నాయి. కంపెనీ కస్టమర్లలో కమర్షియల్‌ జిమ్స్, హోటళ్లు, కార్పొరేషన్లు, దేశ, విదేశాలలోని రియల్టీ ప్రాజెక్టులున్నాయి. జిమ్‌ పరికరాలను జపాన్, యూఏఈ, ఆ్రస్టేలియా, స్వీడన్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. టెంప్‌సెన్స్‌ థర్మల్‌ ఇంజినీరింగ్, కేబుళ్ల తయారీ కంపెనీ టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 118 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.79 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ ఫెర్టిలిటీ సేవల కంపెనీలు ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసి అనుమతి పొందాయి. ఇందిరా ఐవీఎఫ్‌ మెయిన్‌ బోర్డులో లిస్ట్‌కానున్నట్లు 2025 జూలైలో ప్రకటించింది. గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ వివరాలను రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే ముందు వివరాలు వెల్లడించే సంగతి తెలిసిందే.గత రెండేళ్ల రికార్డులిలా 2025 కేలండర్‌ ఏడాదిలో ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 102 కంపెనీలు లిస్టయ్యాయి. తద్వారా రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. దీంతో 2024లో 90 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా సమీకరించిన రూ. 1.6 లక్షల కోట్ల రికార్డ్‌ వెనుకబడింది. అంతకుముందు 2023లో 57 కంపెనీలు మాత్రమే పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి.

LIC Introduces Revival Scheme for Lapsed Life Insurance Policies6
ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణ

రద్దయిన జీవిత బీమా పాలసీలను (ల్యాప్స్‌డ్‌ పాలసీలు) పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ ప్రకటించింది. మార్చి 2 వరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అన్ని నాన్‌ లింక్డ్‌ పాలసీలకు, ఆలస్యపు రుసుము (నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రీమియంపై)లో ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది.ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందొచ్చని వెల్లడించింది. సూక్ష్మ జీవిత బీమా పాలసీలపై ఆలస్యపు రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. పాలసీ కాల వ్యవధి (టర్మ్‌) ముగిసిపోకుండా, కేవలం ప్రీమియం చెల్లింపుల్లేక రద్దయిన పాలసీలకే పునరుద్ధరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.వైద్య/ఆరోగ్య అవసరాల్లో ఎలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది. సకాలంలో ప్రీమియంలు చెల్లించలేకపోయిన వారికి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రయోజనం కల్పిస్తుందని వివరించింది. పాలసీలను పునరుద్దరించుకుని, బీమా కవరేజీని తిరిగి పొందాలంటూ పాలసీదారులకు సూచించింది.ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో కొన్న బంగారంపై లోన్‌ ఇస్తారా?

Advertisement
Advertisement
Advertisement