ప్రధాన వార్తలు
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. ➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ➤నేటి యువకులు జెండర్ రోల్స్కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.➤కెరీర్లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. ➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు.
ఒక ఛార్జ్తో 902 కిమీ రేంజ్!.. షియోమి కారు
షియోమి చైనాలో అప్డేటెడ్ SU7 సెడాన్ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ డిజైన్తో క్యాబిన్ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్పిట్ సిస్టమ్కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్కు సపోర్ట్ చేస్తుంది.
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.
సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.🚨 China is testing self-driving electric scooters with features like auto-balance. 🙏 pic.twitter.com/tL6Bz82cYi— Indian Tech & Infra (@IndianTechGuide) March 20, 2026
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
పబ్లిక్ లిస్టింగ్కు ముందు, ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులను వణిస్తున్న సీఈవో వ్యాఖ్యలు
సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్వేర్ ఉత్పత్తుల టెస్టింగ్, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అప్డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్ను రన్ చేస్తుంది.మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.క్షణాల్లో పరిష్కారం: డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్గ్రౌండ్లోనే పరిష్కరించేలా ఈ టూల్ను రూపొందించారు.
కార్పొరేట్
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
మహిళల కోసం ఎస్బీఐ సెక్యూరిటీస్ కొత్త ఫీచర్
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉద...
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచ...
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయ...
బిగ్రిలీఫ్.. పండగపూట బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
లేబర్ ఫోర్స్ సర్వే: నిరుద్యోగం రేటు ఇలా..
దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవర...
ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ...
ముదురుతోన్న సంక్షోభం.. కీలక రంగాలకు ముప్పు
పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక ...
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు.
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు.
అంతర్జాతీయ చెల్లింపుల్లో ఫిన్టెక్ స్టార్టప్ల దూకుడు
భారతీయ సాఫ్ట్వేర్ సర్వీసులు, ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ తరుణంలో నగదు లావాదేవీలు సులభతరం చేసే ప్రక్రియ వేగవంతం అవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థల స్థానంలో స్వదేశీ ఫిన్టెక్ స్టార్టప్లు అత్యంత సులభమైన, పారదర్శకమైన సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెస్తున్నాయి.పాత పద్ధతులకు స్వస్తి..గతంలో అంతర్జాతీయ చెల్లింపులంటే స్విఫ్ట్ వంటి సాంకేతికతపై ఆధారపడాల్సి వచ్చేది. నగదు చేరడానికి అనేక మధ్యవర్తిత్వ బ్యాంకుల గుండా ప్రయాణించాల్సి రావడం వల్ల రోజుల కొద్దీ సమయం పట్టడమే కాకుండా, భారీగా చార్జీలు వసూలయ్యేవి. ఇది పెద్ద కంపెనీలకు భారంగా అనిపించకపోయినా చిన్న ఎగుమతిదారులు, ఫ్రీలాన్సర్లు, ఎస్ఎంఈలకు పెద్ద సవాలుగా ఉండేది.ప్రస్తుతం ఫిన్టెక్ సంస్థలు సాఫ్ట్వేర్ ఆధారిత మౌలిక సదుపాయాలను రూపొందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడుస్తున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, నియంత్రణ సంస్థల నిబంధనల అమలు ఆటోమేషన్ ద్వారా సులభతరం అవుతున్నాయి.గ్లోబల్ మార్కెట్లో భారతీయ ముద్ర‘అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే పరిమితం కాలేదు. ఈ విభాగంలో స్టార్టప్ కంపెనీలు సులభంగా సర్వీసులు అందిస్తున్నాయి’ అని రేజర్పే సీఓఓ రాహుల్ కొఠారి విశ్లేషించారు. సాస్ సంస్థల నుంచి ఇ-కామర్స్ బ్రాండ్ల వరకు అన్నీ అంతర్జాతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పారు. రేజర్పే ప్రస్తుతం 130కి పైగా కరెన్సీల్లో చెల్లింపులను అనుమతిస్తోందన్నారు.ఎయిర్బీఎన్బీ, షాపిఫై వంటి గ్లోబల్ బ్రాండ్లతో పాటు ఆకాశా ఎయిర్, హౌస్ ఆఫ్ మసాబా వంటి భారతీయ బ్రాండ్లు కూడా వీటి సేవలను వినియోగిస్తున్నాయి. క్రాస్-బోర్డర్(విదేశాలు) విభాగంలో లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్య రెట్టింపు అవుతోంది.నమ్మకమే పెట్టుబడి..విదేశీ కస్టమర్లు తమకు అలవాటైన యాపిల్ పే లేదా అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం వల్ల వ్యాపారాలు మెరుగుపడుతున్నాయని క్యాష్ఫ్రీ సీఈఓ ఆకాష్ సిన్హా తెలిపారు. ‘భారతదేశంలో అంతర్జాతీయ కార్డు లావాదేవీలు విఫలమయ్యే రేటు 35-40% వరకు ఉంటుంది. కానీ యూపీఐ, రూపే వంటి స్థానిక పద్ధతులను అనుసంధానించడం ద్వారా సక్సెస్ రేటును పెంచగలిగాం’ అని చెప్పారు.ఎగుమతిదారులకు భరోసాఫ్రీలాన్సర్లు, చిన్న ఎగుమతిదారుల కోసం స్కైడో సంస్థ ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఎగుమతి చేసిన తర్వాత బ్యాంకుల నుంచి పొందాల్సిన ఫిరా(ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ అడ్వైజ్) వంటి పత్రాల సేకరణను ఈ సంస్థ సులభతరం చేస్తోంది. ప్రస్తుతం స్కైడో ఏడాదికి సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది. వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, గృహాలంకరణ వస్తువుల ఎగుమతిదారులు ఈ ప్లాట్ఫామ్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఆర్బీఐ వెన్నుదన్నుభారత రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పేమెంట్ అగ్రిగేటర్–క్రాస్ బోర్డర్ నిబంధనలు ఈ రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ఈ ఫ్రేమ్వర్క్ వల్ల ఫిన్టెక్ సంస్థలకు స్పష్టమైన గుర్తింపు లభించడమే కాకుండా బ్యాంకులపై పూర్తిస్థాయి ఆధారపడటం తగ్గింది. భవిష్యత్తులో ఈ సంస్థలు కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా గ్లోబల్ బిజినెస్లకు అవసరమైన పూర్తిస్థాయి ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’
ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్, క్యాప్కట్ వంటి యాప్లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.వివాదానికి కారణం ఇదే..సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్ క్లిప్లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.హాలీవుడ్ దిగ్గజాల ధ్వజంప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్డ్యాన్స్కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ఫామ్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
పర్సనల్ ఫైనాన్స్
స్పెషల్ అలవెన్సులు.. పన్ను భారాలు
జీతంలో కొంత భాగాన్ని స్పెషల్ అలవెన్స్ రూపంలో ఇస్తారు. ఉద్యోగస్తులు వాళ్ల సీటీసీ అంటే ’కాస్ట్ టు ది కంపెనీ’లో ’టేక్ హోమ్ పే’ ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. బేసిక్ పే కాకుండా అదనంగా ఇచ్చే జీతాన్ని స్పెషల్ అలవెన్స్ అంటారు. ఇవి కాకుండా ఇంటద్దె అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన వాటిని కేవలం ఆయా పేర్లలో పేర్కొన్న వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి.ఇవి కాకుండా ఎన్నో స్పెషల్ అలవెన్సులు ఉన్నాయి. స్వభావరీత్యా నిర్దేశించినవి తప్ప అన్ని అలవెన్సులు పన్నుకి గురవుతాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీల నిమిత్తం వీటిని తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కొన్ని పనితీరును బట్టి ఉంటాయి. కొన్ని పని పరిస్థితులను బట్టి ఉంటాయి. 1961వ చట్టంలో ఉన్న అన్ని అలవెన్సులను 2025 చట్టంలో పొందుపరిచారు. చాలా సులభంగా అర్థం అయ్యేలాగా, ఒక పట్టిక రూపంలో పొందుపరిచారు. ఇవి మూడు రకాలు..మినహాయింపు లేని అలవెన్సులు డీఏ, సీసీఏ, పెర్ఫార్మెన్స్ అలవెన్స్, అటెండెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ మొదలైన వాటిమీద ఎటువంటి మినహాయింపు లేదు. ఇవన్నీ జీతంలో భాగమే. పన్నుకి గురవుతాయి. కొన్ని అలవెన్సులకి షరతులకు లోబడి మినహాయింపులు ఉంటాయి. అవేంటంటే హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, స్టాండర్డ్ డిడక్షన్అలవెన్స్ ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపు. ఈ తరహా అలవెన్సులను మీరు ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపునిస్తారు. ఖర్చు పెట్టని మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఉదాహరణకు కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్.. వీటి అన్నింటికి ఖర్చులు పెట్టాలి. ఓచర్లు ఇవ్వాలి.పాత పద్ధతి – కొత్త పద్ధతి.. కొత్త పన్ను విధానంలో బేసిక్ లిమిట్ అధికం. ఎక్కువ శ్లాబ్లు, తక్కువ పన్ను రేట్లు, అందువల్ల అలవెన్స్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ కింది అలవెన్సులను మినహాయించరు.ఇంటద్దె అలవెన్సు, లీవ్ ట్రావెల్ అలవెన్సు, పిల్లల విద్య అలవెన్సు, పిల్లల హాస్టల్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు (దివ్యాంగులకు కాదు), హెల్పర్, యూనిఫాం అలవెన్సు, ఇంటర్నెట్ అలవెన్సు, ఎంటర్టైన్మెంట్ అలవెన్సు. ఇవన్నీ కాకుండా ఇప్పటి 80సి కింద ఇస్తున్న.. పీఎఫ్, ఎన్నెస్సీలు, జీవిత బీమా, పిల్లల చదువు ఫీజులు.. మొదలైన వాటికి కూడా ఇవ్వరు. ఎన్పీఎస్ చెల్లింపులు, అగ్నివీర్ కార్పస్ ఫండ్ చెల్లింపులు.. ఈ రెండు మినహాయింపులు ఇస్తారు. కొత్త విధానంలో మినహాయింపులు వచ్చేవి కొన్ని..స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000. కన్వేయన్స్ అలవెన్స్ / డైలీ / ట్రాన్స్పోర్ట్ అలవెన్సు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ అలవెన్సు. వృత్తి పన్ను. ఫ్యామిలీ పెన్షను .. రూ. 25,000 వరకు. స్థలాభావం వల్ల అన్ని షరతులు ఇక్కడ పొందుపరచలేదు. చట్టంలోనూ, రూల్స్లోను వివరంగా దొరుకుతాయి.. లేదా ఉంది కదా.. గూగుల్ తల్లి.. సంప్రదించండి. 1961 చట్టంతో పోల్చి కొత్త చట్టాన్ని విశదీకరిస్తే వచ్చిన మార్పులు.ఎంటర్టైన్మెంట్ అలవెన్సుకి మినహాయింపు లేదుప్రత్యేక సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్సులకు మినహాయింపులు కొనసాగుతాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు ఉంది.ఫెనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని ఉండవు. ఇకనుంచి ఒకే పదం ’ట్యాక్స్ సంవత్సరం’.రాబోయే ప్రక్రియలన్నీ డిజిటల్ ప్రపంచంలోనే ఉంటాయి. అరకొర సిబ్బందికి ఏఐ బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. అంతా డిజిటల్ రికార్డులు, డిజిటల్ పరిష్కారాలు, టెక్నాలజీమయం. కాబట్టి, మనకు డిజిటల్ అక్షరాస్యత కావాలి. డిజిటల్ సామర్థ్యాలు.. నైపుణ్యాలు సంపాదించాలి. సర్వసన్నద్ధంగా ముందుకెళ్లాలి.
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.


