Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Silver prices drop over Rs 5000 and gold slips drop Rs 21001
వెండి రూ. 5,000 డౌన్‌

న్యూఢిల్లీ: పసిడి, వెండిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మంగళవారం ఢిల్లీ మార్కెట్లో వెండి మరో రూ.5,000 నష్టపోయి (2 శాతం) రూ.2,45,000 స్థాయికి దిగొచ్చింది. అటు బంగారం సైతం 10 గ్రాములకు రూ.2,200 నష్టంతో (1.4 శాతం) రూ.1,57,000కు పరిమితమైంది. అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 1.65 డాలర్లు (2.15 శాతం) తగ్గి 74.96 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్‌కు ఒక శాతం నష్టపోయి 4,938.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.‘‘స్పాట్‌ బంగారం ధరలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా–ఇరాన్‌ చర్చలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు’’అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ హెడ్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు. చైనా కొత్త సంవత్సరం సెలవులు కావడంతో కొనుగోళ్ల ఆసక్తి తగ్గినట్టు.. పసిడికి 5,000 డాలర్ల పైన అమ్మకాల ఒత్తిడి ఎదురైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. మెటల్స్‌లో లిక్విడిటీ తగ్గిందని.. స్పెక్యులేషన్‌ పెరగనంత వరకు ధరలు ఒక పరిమిత శ్రేణిలోనే కొనసాగొచ్చన్నారు.

Stock Market: Sensex and Nifty rise for second day on gains in bank and IT stocks2
ఆదుకున్న బ్యాంకులు

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 174 పాయింట్లు పెరిగి 83,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 25,725 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 611 పాయింట్ల పరిధిలో 82,987 – 83,598 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 25,570 వద్ద కనిష్టాన్ని, 25,764 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.470.11 లక్షల కోట్లకు చేరింది. లూనార్‌ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్‌ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్‌ ఇండెక్సు 0.50% నష్టపోయింది. ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్‌ఈ రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.36% పెరిగింది. ఐటీ 1.15%, ఇండ్రస్టియల్స్‌ 1.13%, సర్వీసెస్‌ 0.98% ఐటీ 0.94%, ఎఫ్‌ఎంసీజీ 0.87%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 0.85%, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.76% పెరిగాయి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.49%, 0.26% లాభపడ్డాయి. మరోవైపు మెటల్, కమోడిటీస్, ఇంధన, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ⇒ హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.50 శాతం, విప్రో 1.21శాతం, ఎల్‌అండ్‌టీఎం 1 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, టెక్‌ మహీంద్రా, పెర్సిస్టెంట్‌ షేర్లు 0.50 శాతం పెరిగాయి. ⇒ భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌... ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో మరిన్ని రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోళ్ల ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా డిఫెన్స్‌ షేర్లకు డిమాండ్‌ లభించింది. కొచి్చన్‌ షిప్‌యార్డ్‌ 4%, భారత్‌ ఎల్రక్టానిక్స్‌ 2%, యూనిమెక్‌ ఏరోస్పేస్‌ 4%, భారత్‌ ఫోర్జ్‌ 1.38%, పరాస్‌ డిఫెన్స్, జెన్‌ టెక్నాలజీస్‌ 1%, హెచ్‌ఏఎల్‌ 0.50% లాభపడ్డాయి.

Maruti Suzuki launches e Vitara at Rs 10. 99 lakh3
ఒక్క చార్జ్‌ 543 కి.మీ. రేంజ్‌

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సెగ్మెంట్లోకి లాంఛనంగా ప్రవేశించింది. తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనం ఈ–విటారాను ఆవిష్కరించింది. బ్యాటరీ యాజ్‌ ఎ సరీ్వస్‌ (బీఏఏఎస్‌) ఓనర్‌షిప్‌ ప్లాన్‌ కింద దీని ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యూసేజీ చార్జీ కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున ఉంటుంది. 61కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో లభించే ఈ–విటారా 543 కి.మీ. వరకు రేంజినిస్తుంది. తొలినాళ్లలో తీసుకున్నవారికి మారుతీ సుజుకీ డీలర్‌ లొకేషన్లలో ఏడాది పాటు చార్జింగ్‌ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.అలాగే 3 ఏళ్ల ఓనర్‌షిప్‌ ప్లాన్‌తో 60 శాతం విలువ వరకు అష్యూర్డ్‌ బైబ్యాక్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఈ–విటారా యజమానులు కాంప్లిమెంటరీగా 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్‌ బాక్స్‌ చార్జర్‌తో పాటు ఇన్‌స్టాలేషన్‌ ఉచితంగా పొందవచ్చు. మార్చి 31 వరకు ఈ ప్రారంభ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. రూ. 21,000తో కస్టమర్లు దీన్ని బుక్‌ చేసుకోవచ్చని వివరించింది. పటిష్టమైన వ్యవస్థ..: దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగా ఈవీల వినియోగంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించే వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. పబ్లిక్‌ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, ఆఫ్టర్‌ సేల్స్‌..సరీ్వస్‌ నెట్‌వర్క్‌ మొదలైన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లు బెనర్జీ పేర్కొన్నారు.

Torrent Power to acquire Nabha Power from L and T for Rs 6889 crore4
నభా పవర్‌ కొత్త ఓనర్‌.. టొరెంట్‌పవర్‌

ముంబై: ప్రైవేట్‌ రంగ కంపెనీ టొరెంట్‌ పవర్‌ తాజాగా డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ నుంచి నభా పవర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఎల్‌ అండ్‌ టీ సొంత అనుబంధ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పవర్‌ డెవలప్‌మెంట్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా నభా పవర్‌లో 100 శాతం వాటాసహా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీలను రూ. 6,889 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సొంతం చేసుకోనుంది. పూర్తిగా కాంట్రాక్టు కలిగిన థర్మల్‌ పవర్‌ ప్లాంటును నభా కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 4,866 కోట్ల ఆదాయం, రూ. 1,153 కోట్ల నిర్వహణ లాభం సాధించింది.జపనీస్‌ సాంకేతికతతో ఏర్పాటు చేసిన సూపర్‌ క్రిటికల్‌ బొగ్గు ఆధారిత(థర్మల్‌) విద్యుత్‌ ప్లాంటును నిర్వహిస్తోంది. పంజాబ్‌లోని రాజ్‌పురాలో 700 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లతో కలిపి ఈ ప్లాంటు 1,400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2014లో కార్యకలాపాలు ప్రారంభమైన ప్లాంటు 25 ఏళ్ల కాలానికి ప్రభుత్వంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) కుదుర్చుకుంది. బొగ్గు సరఫరాలకు ఎస్‌ఈసీఎల్, ఎన్‌సీఎల్‌తో ఇంధన సరఫరా ఒప్పందాలను(ఎఫ్‌ఎస్‌ఏలు) కలిగి ఉంది. ఈ కొనుగోలు తదుపరి టొరెంట్‌ పవర్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 5 గిగావాట్ల నుంచి 6.4 గిగావాట్లకు బలపడనుంది. అంతేకాకుండా అత్యధిక వృద్ధికి వీలున్న ఉత్తరాది మార్కెట్లలో ప్రవేశించేందుకు వీలు చిక్కనుంది.

Anthropic and Infosys to Build Custom AI Agents for Firms5
కోడ్‌ నుంచి క్లౌడ్‌ వరకు.. ఆంత్రోపిక్‌తో ఇన్ఫోసిస్‌ జట్టు

న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ తదితర రంగ సంస్థల కోసం ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు, వినియోగంలోకి తెచ్చేందుకు అమెరికన్‌ ఏఐ సంచలనం ఆంత్రోపిక్‌తో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్లాడ్‌ కోడ్‌ సహా ఆంత్రోపిక్‌ క్లాడ్‌ మోడల్స్‌ని ఇన్ఫోసిస్‌కి చెందిన టొపాజ్‌ ఏఐ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే టెలికం రంగ అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను తయారు చేసేందుకు ప్రత్యేక ఆంత్రోపిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు, తదుపరి ఇతర నియంత్రిత రంగాల్లోకి కూడా విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది.క్లెయిమ్స్‌ ప్రాసెసింగ్, కాంప్లయెన్స్‌ సమీక్షలు, కోడ్‌ జనరేషన్, టెస్టింగ్‌లాంటి బహుళ దశలు ఉండే పనులను స్వతంత్రంగా హ్యాండిల్‌ చేయగలిగే ఏజెంటిక్‌ ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఈవో సలిల్‌ పరేఖ్‌ చెప్పారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న ఇన్ఫీ డెవలపర్లు ఇప్పటికే తమ క్లాడ్‌ కోడ్‌ని ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్‌ సీఈవో డేరియో తెలిపారు. భారత్‌లో ఆంత్రోపిక్‌ కార్యాలయం ఆంత్రోపిక్‌ దేశీయంగా బెంగళూరులో తమ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఆసియాలో టోక్యో తర్వాత కంపెనీకి ఇది రెండో ఆఫీసు. తమ క్లాడ్‌.ఏఐ సొల్యూషన్‌కి భారత్‌ రెండో అతి పెద్ద మార్కెట్‌ అని కంపెనీ ఇండియా ఎండీ ఇరినా ఘోష్‌ తెలిపారు. 2025 అక్టోబర్‌లో విస్తరణను ప్రకటించినప్పటి నుంచి భారత్‌లో తమ ఆదాయ వృద్ధి వేగం రెట్టింపయ్యిందని వివరించారు. వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానికంగా రిక్రూట్‌ చేసుకోనున్నట్లు వివరించారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు మంగళవారం దాదాపు రెండు శాతం లాభపడింది. బీఎస్‌ఈలో 1.83 శాతం లాభపడి రూ. 1,391.20 వద్ద క్లోజయ్యింది. ఓపెన్‌ఏఐతో ఎటర్నల్‌ చెట్టాపట్టాల్‌వివిధ విభాగాలవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచుకునే దిశగా ఓపెన్‌ఏఐతో భాగ స్వామ్య పరిధిని మరింతగా విస్తరించినట్లు ఎటర్నల్‌ వెల్లడించింది. దీని ప్రకారం జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్‌తో పాటు తమ భాగస్వామ్య ప్లాట్‌ఫాంలు, అంతర్గత వ్యవస్థల్లో ఏఐ వాడకాన్ని పెంచనుంది. కస్టమర్లు, భాగస్వాములు తమ ప్లాట్‌ఫాంలను మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు వీలు కలి్పంచే కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు ఓపెన్‌ఏఐకి చెందిన ఎంటర్‌ప్రైజ్‌ ఏపీఐ ప్లాట్‌ఫాంతో కలిసి ఎటర్నల్‌ పని చేయనుంది. అంతర్గతంగా తమ ఆటోమేషన్‌ ప్లాట్‌ఫాం స్టిచ్‌తో జీపీటీ–5.3–కోడెక్స్‌లాంటి లేటెస్ట్‌ కోడింగ్‌ మోడల్స్‌ని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టనుంది.

Elon Musk Tweet After 849 Billion Dollars Net Worth6
నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.Already have thousands of times over. My “net worth” is almost entirely due to my ownership stakes in Tesla and SpaceX. I have <0.1% that is cash. Tesla and SpaceX employees all receive stock/options and Tesla is >80% owned by retail investors and index/pension funds, so value…— Elon Musk (@elonmusk) February 15, 2026

Advertisement
Advertisement
Advertisement