Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US stocks rallied after President Trump announced a Greenland deal framework1
తగ్గిన ట్రంప్‌..మార్కెట్‌ జంప్‌ 

ముంబై: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత ఎట్టకేలకు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం అరశాతం మేర లాభపడింది. గ్రీన్‌ల్యాండ్‌ స్వా«దీనం విషయంలో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా–భారత్‌ ట్రేడ్‌ డీల్‌ ఖరారవుతుందనే అంచనాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి స్వల్ప రికవరీ, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 398 పాయింట్లు లాభపడి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 25,290 వద్ద నిలిచింది. ఉదయమే లాభాలతో మొదలైన సూచీలు... రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా ఇటీవల 3రోజుల మార్కెట్‌ పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఒక దశలో సెన్సెక్స్‌ 874 పాయింట్లు ఎగసి 82,783 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ర్యాలీ చేసి 25,434 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలో ఈయూ దేశాలపై విధించిన టారిఫ్‌లను ఎత్తివేస్తున్నట్లుగా ట్రంప్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఆసియాలో జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్‌ సూచీలు 1% వరకు లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1.50% పెరిగాయి. అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → కన్జూమర్, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ 2.43%, క్యాపిటల్‌ గూడ్స్‌ 2.03%, ఇండ్రస్టియల్స్‌ 1.78%, యుటిలిటి 1.45%, విద్యుత్‌ 1.43%, మెటల్స్‌ 1.34%, ఎఫ్‌ఎంసీజీ 1.22%, కమోడిటిస్‌ 1.15%, ఫార్మా 1.11 శాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌లు వరుసగా 1.28%, 1.13 శాతం పెరిగాయి. → డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 8% క్షీణించి రూ.859 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఏకంగా 10% పతనమై రూ.838 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది.

ZEE Entertainment Net profit falls 5percent YoY to Rs155. 3 crore in Q3 results2
మెప్పించని వినోదం 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌(జీల్‌) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 155 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 164 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం 15 శాతం బలపడి రూ. 2,299 కోట్లకు చేరింది. సబ్‌్రస్కిప్షన్‌సహా ఇతర అమ్మకాలు, సర్వీసులు ఇందుకు దోహదపడ్డాయి. మూవీ హక్కులు కొనుగోలు చేయడం, ఐఎల్‌ టీ20 లీగ్‌ మ్యాచ్‌లలో మార్పులు, కొత్త కంటెంట్‌ను ప్రవేశపెట్టడం తదితరాల నేపథ్యంలో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. వెరసి మొత్తం వ్యయాలు 20 శాతంపైగా పెరిగి రూ. 2,087 కోట్లను దాటాయి. ఈ కాలంలో సబ్‌్రస్కిప్షన్‌ నుంచి 7 శాతం అధికంగా రూ. 1,050 కోట్ల ఆదాయం సాధించగా.. ప్రకటనల నుంచి 9 శాతం తక్కువగా రూ. 852 కోట్లు అందుకుంది. ఇతర అమ్మకాలు, సర్విసుల నుంచి ఆదాయం ఆరు రెట్లు ఎగసి రూ. 378 కోట్లను అధిగమించింది. జీల్‌ షేరు బీఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది.

Walmart to cut 10 percent stake in PhonePe IPO3
ఫోన్‌పేలో తగ్గనున్న వాల్‌మార్ట్‌ వాటా

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తలపెట్టిన భారీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా, కంపెనీలో భాగస్వాములైన కొన్ని సంస్థలు తమ వాటాలను పూర్తిగా విక్రయించి తప్పుకోనుండగా, ప్రధాన వాటాదారు అయిన అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తన వాటాలను 12 శాతం మేర తగ్గించుకోనుంది. దీనికి సరిసమానమైన 4.59 కోట్ల షేర్లను ఐపీవోలో విక్రయించనుంది. ప్రస్తుతం డబ్ల్యూఎం డిజిటల్‌ కామర్స్‌ హోల్డింగ్స్‌ ద్వారా ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి 71.77 శాతం వాటాలు ఉన్నాయి. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం టైగర్‌ గ్లోబల్, మైక్రోసాఫ్ట్‌ 10.39 లక్షల షేర్లను, మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ 36.78 లక్షల షేర్లను విక్రయించి తప్పుకోనున్నాయి. 15 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో 5.08 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఫోన్‌పే దాదాపు 1.5 బిలియన్‌ డాలర్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్య నాటికి లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. 1.7 బిలియన్‌ డాలర్ల టాటా క్యాపిటల్‌ ఇష్యూ తర్వాత ఇది అతి పెద్ద ఐపీవోగా నిలవనుంది. డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవలు అందించే ఫోన్‌పేకి 65.76 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు, యూపీఐ లావాదేవీల్లో 45 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2025 సెప్టెంబర్‌ 30తో ముగిసిన 6 నెలల వ్యవధి లో రూ. 3,919 కోట్ల ఆదాయంపై రూ. 1,444 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా నుంచి విడదీసిన ఫోన్‌పే 2016 నుంచి ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు సమీకరించింది.

IndiGo Q3 Profit Down 77percent, Disruptions Cost Rs 577 Cr4
ఇండిగో లాభాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 78 శాతం పడిపోయి రూ. 549 కోట్లకు పరిమితమైంది. విమాన సర్వీసుల అంతరాయాలకుతోడు కొత్త కార్మిక చట్టాల అమలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,449 కోట్లు ఆర్జించింది. విమాన సర్విసుల్లో అవాంతరాల కారణంగా రూ. 577 కోట్లు, కొత్త కారి్మక చట్టాల అమలుతో రూ. 969 కోట్లు చొప్పున వ్యయాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి దాదాపు రూ. 1,547 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు వెల్లడించింది. సర్విసుల్లో అంతరాయాలపై రూ. 22 కోట్లకుపైగా జరిమానాకు సైతం గురైనట్లు తెలియజేసింది. ఆదాయం అప్‌ తాజా సమీక్షా కాలంలో ఇండిగో బ్రాండ్‌ విమాన సర్విసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 22,993 కోట్ల నుంచి రూ. 24,541 కోట్లకు ఎగసింది. డిసెంబర్‌ 3–5 కాలంలో పలు సర్విసులు నిలిచిపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నట్లు కంపెనీ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలియజేశారు. ఈ కాలంలో 2,507 సర్విసులు రద్దుకాగా.. మరో 1,852 సర్విసులు ఆలస్యమయ్యాయి. ఇలాంటి నిర్వహణ సంబంధ సవాళ్లలోనూ ఇండిగో పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. కాగా.. 2026 ఫిబ్రవరి 10 తదుపరి సర్విసుల రద్దు ఉండబోదని ఇండిగో హామీఇచి్చనట్లు ఒక ప్రకటనలో డీజీసీఏ పేర్కొనడం గమనార్హం. 2025 డిసెంబర్‌ 31 కల్లా కంపెనీ నగదు నిల్వలు రూ. 51,607 కోట్లకు చేరగా.. లీజ్‌ చెల్లింపులతో కలిపి మొత్తం రుణ భారం రూ. 76,858 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం లాభంతో రూ. 4,914 వద్ద ముగిసింది.

Gold, silver futures drop as investors book profits5
సిల్వర్‌ స్పీడుకు బ్రేక్‌ 

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి ధరల పరుగుకు కాస్త బ్రేక్‌ పడింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ. 2,500 తగ్గి రూ. 1,57,200 వద్ద ముగిసింది. అటు తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేసిన వెండి ధర కిలోకి రూ. 14,300 క్షీణించి రూ. 3,20,000కి పరిమితమైంది. రికార్డు బ్రేకింగ్‌ ర్యాలీల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్‌ వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. యూరప్‌ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రెండు మెటల్స్‌ కాస్త నెమ్మదించినట్లు వివరించారు. భౌగోళిక–రాజకీయ రిసు్కలపై ఆందోళన కొంత తగ్గడంతో దేశీ మార్కెట్లలో పాక్షికంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 8.80 డాలర్లు తగ్గి 4,822.65 వద్ద ట్రేడయ్యింది. వెండి మాత్రం 0.27 శాతం పెరిగి 93.36 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ మానిటరీ పాలసీ నిర్ణయాల వెల్లడికి ముందు ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో పసిడి, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఏవీపీ కాయ్‌నాత్‌ చైన్‌వాలా తెలిపారు.

Apple Pay Set for India Launch as iPhone Maker6
యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త..

గూగుల్ పే గురించి వినుంటారు, ఫోన్‌పే ఉపయోగించుంటారు. యాపిల్ పే గురించి ఎప్పుడైనా విన్నారా?, అయితే ఈ వార్త మీ కోసమే. త్వరలోనే భారత్‌లో యాపిల్ పే సేవలు ప్రారంభం కానున్నాయి.యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఎందుకంటే.. భారత్‌లో యాపిల్ పే సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూజర్లు కార్డులను స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసుకునేలా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కంపెనీ ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సంస్థలతో చర్చలను ప్రారంభించింది.భారతదేశంలో కూడా.. యాపిల్ సంస్థ అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆర్‌బీఐ తరఫున అనుమతులు పొందేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సేవలు తొలుత యూపీఐ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. యూపీఐ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అవసరం. కాబట్టి తొలుత కార్డు ఆధారంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.యాపిల్ వ్యాలెట్‌లో కార్డుల వివరాలను భద్రపరుచుకుంటే.. అవసరమైనప్పుడు యాపిల్ పే యాప్‌తో చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారంగా ట్యాప్-టు పే టెక్నాలజీతో పనిచేస్తాయి. భద్రత ప్రమాణాల రీత్యా ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీల ధ్రువీకరణలను తప్పనిసరి చేస్తారు. ఏది ఏమైనా.. యాపిల్ గనక రంగంలోకి దిగితే.. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలకు గట్టిపోటీ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాపిల్ పే సేవలు 89 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement