Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nitin Gadkari Says About India 3rd Economy Country1
మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్‌ ఎదగాలంటే..

భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్‌ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్‌ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్‌ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

How To Get Discounts On Train Tickets Know The Details Here2
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.రైల్‌వన్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎలా➤గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.➤యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.➤యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.➤కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే.. రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.➤సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.➤మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.➤ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.మూడు శాతం డిస్కౌంట్ కోసం..👉🏻ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.👉🏻అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 👉🏻డిజిటల్ మోడ్‌ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్‌లో చూపించవచ్చు.రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Sensex Poised for 11pc Upside to 93918 by 2026 End3
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్‌

బీఎస్‌ఈ ఎక్స్ఛేంజ్‌లోని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2026 డిసెంబర్‌ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ క్లయింట్‌ అసోసియేట్స్‌ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్‌ ఆదాయాల అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్‌ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్‌ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు.రిస్క్‌ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్‌ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్‌ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్‌ అసోసియేట్స్‌ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్‌ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్‌ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌ వృద్ధి అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్‌టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు.

Hyderabad office leasing hits all time high in 20254
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్‌ మార్కెట్ అదుర్స్‌

హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఆఫీస్‌ మార్కెట్ 2025లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. నగరంలో వార్షిక కార్యాలయ లీజింగ్ 11.4 మిలియన్ చదరపు అడుగులకు చేరి, చరిత్రలో రెండవ అత్యధిక స్థాయిని సాధించింది. అదే సమయంలో 2025 ద్వితీయార్ధంలో లగ్జరీ గృహాల అమ్మకాలు మొత్తం విక్రయాలలో 71 శాతంగా నమోదయ్యాయి.ఈ వృద్ధికి ప్రధాన కారణం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ. హైదరాబాద్‌లో కొత్త జీసీసీలు 40 శాతం పెరిగి, భారత్‌లో రెండవ అత్యంత డిమాండ్ ఉన్న నగరంగా నిలిపాయి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు ముందంజలో ఉన్నప్పటికీ, జీసీసీల ద్వారా కార్యాలయ స్థల వృద్ధిలో హైదరాబాద్ బెంగళూరును (33%) అధిగమించింది. ప్రస్తుతం నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో జీసీసీల వాటా సుమారు 50 శాతం.గోల్డ్‌మన్ సాచ్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, సర్వీస్‌నౌ వంటి గ్లోబల్ సంస్థలు భారీ లావాదేవీలతో హైదరాబాద్‌ను హై-వాల్యూ కార్యకలాపాల కోసం కీలక కేంద్రంగా నిలిపాయి. ఈ డిమాండ్ వల్ల హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో కార్యాలయ అద్దెలు నెలకు 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.77కు చేరాయి.నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, రూ.కోటి పైబడిన ఇళ్లు ఇప్పుడు మార్కెట్‌ను నడుపుతున్నాయి. ఇవి మొత్తం లావాదేవీ విలువలో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2025లో రెసిడెన్షియల్ అమ్మకాలు 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరగా, బెంగళూరులో వృద్ధి స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో సగటు ఆస్తి ధరలు 13 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,721కు చేరాయి. కొత్త సరఫరా పరిమితంగా ఉండటంతో అమ్ముడుపోని ఇన్వెంటరీ 2 శాతం తగ్గింది.రూ.2–5 కోట్ల సెగ్మెంట్‌లో అమ్మకాలు 22 శాతానికి పెరిగాయి. రూ.10–20 కోట్ల అల్ట్రా-లగ్జరీ గృహాలు కేవలం 1.1 త్రైమాసికాల్లోనే అమ్ముడవుతున్నాయి. దీనికి విరుద్ధంగా, రూ.50 లక్షల లోపు గృహాల వాటా 4 శాతానికి పడిపోయింది.కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలు లగ్జరీ హౌసింగ్‌కు కేంద్రాలుగా మారాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బెంగళూరుతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, టీఎస్‌ ఐపాస్‌ వంటి ప్రభుత్వ చర్యలు హైదరాబాద్‌ను హై-గ్రోత్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిపాయి.

Why India Needs a Strategic Shift in Silver Trade5
‘వెండి పని’ పడదాం.. ‘సిల్వర్‌ సెక్యూరిటీ’ అవసరం

విలువైన లోహంగానే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా కీలకంగా ఉంటున్న వెండి ప్రాసెసింగ్‌ సామర్థ్యాలను పెంచుకోవడంపై భారత్‌ మరింతగా దృష్టి పెట్టాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది. విదేశాల నుంచి దీర్ఘకాలికంగా సరఫరా, దేశీయంగా రిఫైనింగ్‌..రీసైక్లింగ్‌ సామర్థ్యాలను పెంచుకోవడంపై ఫోకస్‌ చేయాలని పేర్కొంది.కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా మరిన్ని ప్రాంతాల నుంచి వెండిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఫినిష్డ్‌ సిల్వర్‌ దిగుమతులను తగ్గించుకోవాలని తెలిపింది. ఖనిజం నుంచి వెండిని ప్రాసెస్‌ చేసే ప్రక్రియపై భారత్‌ పట్టు సాధించాలని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.అంతర్జాతీయంగా వెండి ఖనిజ మార్కెట్‌ 6.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, చైనా అత్యధికంగా ఏటా సుమారు 5.6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్నారు. దేశీయంగా దాన్ని శుద్ధి చేశాక, ఎల్రక్టానిక్స్, మెడికల్‌ డివైజ్‌లు, సోలార్‌ ప్యానెళ్లలో ఉపయోగించేందుకు వీలుగా, అధిక విలువ చేసే వెండి రూపంలో దాన్ని ఎగుమతి చేస్తోందని శ్రీవాస్తవ చెప్పారు.భారత్‌ దానికి విరుద్ధంగా 2024లో 6.4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రిఫైన్డ్‌ వెండిని దిగుమతి చేసుకుందని, గ్లోబల్‌ ట్రేడ్‌లో ఇది 21.4 శాతమని వివరించారు. ఆ విధంగా ప్రాసెసర్‌గా కంటే ఫినిష్డ్‌ సిల్వర్‌కి అతి పెద్ద వినియోగదారుగా భారత్‌ నిల్చిందన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మరింత విలువ జోడించేందుకు ఖనిజ దశ నుంచి వెండిని ప్రాసెస్‌ చేసే ప్రక్రియపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీవాస్తవ వివరించారు. 9 బిలియన్‌ డాలర్లకు దిగుమతులు.. 2025 ఆర్థిక సంవత్సరంలో 4.83 బిలియన్‌ డాలర్ల వెండి ఉత్పత్తులు దిగుమతి చేసుకున్న భారత్‌ 478.4 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసిందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక 2025 జనవరి–నవంబర్‌ మధ్య కాలంలో 8.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే వెండిని దిగుమతి చేసుకోగా, పూర్తి సంవత్సరానికి ఇది 9.2 బిలియన్‌ డాలర్లకు చేరనుందని తెలిపారు.2024తో పోలిస్తే ఇది 44 శాతం అధికమని వివరించారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇంధన భద్రత తరహాలోనే వెండి భద్రతను సాధించడం కూడా కీలకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్‌లో 55–60 శాతం వాటా ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, డిఫెన్స్‌ పరికరాలు మొదలైన పారిశ్రామిక విభాగాల నుంచి ఉంటోంది.గత రెండు దశాబ్దాలుగా వెండి ఖనిజం, కాన్సెంట్రేట్‌ల వాణిజ్యం 2000లో 0.1 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2024లో 6.27 బిలియన్‌ డాలర్లకు చేరింది. శుద్ధి చేసిన వెండి వ్యాపారం (కడ్డీలు, తీగలు మొదలైనవి) 2000లో 4.06 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2024లో 31.42 బిలియన్‌ డాలర్లకు చేరింది.

New Safety Center in Axis Bank App Enables Protection Against Online Scams6
యాక్సిస్‌ బ్యాంక్‌ యాప్‌లో ‘సేఫ్టీ సెంటర్‌’

డిజిటల్‌ మోసాల బారిన పడకుండా కస్టమర్లు తమ ఖాతాలను స్వయంగా నియంత్రించుకునే వీలు కల్పిస్తూ యాక్సిస్‌ బ్యాంక్‌ తమ మొబైల్‌ యాప్‌ ‘ఓపెన్‌’లో ‘సేఫ్టీ సెంటర్‌’ ఫీచరును ప్రవేశపెట్టింది. సందేహాస్పద సందర్భాల్లో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌కి యాక్సెస్‌ని డిసేబుల్‌ చేసేందుకు, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్లను బ్లాక్‌ చేసేందుకు, యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు, పరిమితులను సెట్‌ చేసేందుకు, కొత్త పేయీలను జోడించకుండా నివారించేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.దీనితో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ లేదా బ్రాంచీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖాతాను స్వయంగా నియంత్రించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. అలాగే, బ్యాంకు మెసేజీల ప్రామాణికతను ధృవీకరించేలా ఎస్‌ఎంఎస్‌ షీల్డ్‌ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, కళలు, సాహిత్యానికి సంబంధించిన ష్ల్పాష్‌ 2025 పోటీలను నిర్వహించినట్లు వివరించింది.ఇందులో దేశవ్యాప్తంగా 995 పాఠశాలల నుంచి 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు బ్యాంకు పేర్కొంది. దక్షిణాదిలో హైదరాబాద్, వైజాగ్‌ సహా 308 స్కూళ్ల నుంచి 1.01 లక్షల మంది పాల్గొన్నట్లు వివరించింది. ఇందులో ఆరుగురు విజేతలకు రూ. 1 లక్ష చొప్పున, ఆరుగురు రన్నర్స్‌ అప్‌లకు తలో రూ. 50,000 చొప్పున బహుమతి ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement