Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Rate Hike Second Time in A Day Know The Latest Price1
పడిలేచిన పసిడి.. ఒక్కసారిగా పెరిగిన రేటు!

శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే మరింత పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,27,150 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మరో 550 రూపాయలు పెరిగింది. దీంతో రేటు రూ. 1,27,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 600 పెరగడంతో రూ. 1,39,310 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,000 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,640 వద్ద ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. సాయంత్రానికే పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,27,850 వద్ద (1200 రూపాయలు పెరిగింది) .. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,460 వద్ద (1310 రూపాయలు పెరిగింది)కు చేరింది.

Bihar Man Builds 5 Seater Electric Jeep In 18 Days2
రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!

కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్‌కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.

BSNL Enhances Prepaid Plans With Extra Daily Data3
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026

Which is The Best Personal Loan Or Top Up Loan4
పర్సనల్ లోన్ vs టాప్-అప్ లోన్: ఏది బెస్ట్?

ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.పర్సనల్ లోన్పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్‌కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.టాప్ అప్ లోన్టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్‌పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్‌కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్‌తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి.

Is Mobile Recharge to Get Costlier Know The Details5
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.

Suzuki e Access Electric Scooter Launched At Rs 1 88 Lakh6
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనుంది.బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్‌ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement