Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Icra Says Small Finance Banks To See Growth And Profit Pressure In FY261
చిన్న బ్యాంకులు... పెద్ద అడుగులు

న్యూఢిల్లీ: పేరుకు చిన్నవే అయినా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గత అయిదేళ్లలో నియామకాలు, డిపాజిట్లు, రుణాల కార్యకలాపాల్లో ముందుకెళ్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ డేటా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎఫ్‌బీల్లో 95,249గా ఉన్న సిబ్బంది సంఖ్య వార్షికంగా 13.3 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షలకు పెరిగింది. ఇదే వ్యవధిలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.3 శాతం వార్షిక వృద్ధితో 18.1 లక్షలకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఎస్‌ఎఫ్‌బీల్లో నియామకాల జోరు కొనసాగింది.11 ఎస్‌ఎఫ్‌బీలకు గాను ఎనిమిది లిస్టెడ్‌ బ్యాంకులు ప్రథమార్ధంలో దాదాపు 9,000 మందిని తీసుకున్నాయి. 2020–25 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) సిబ్బంది సంఖ్య 0.8 శాతం తగ్గగా, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో 8.6 శాతం పెరిగింది. మరోవైపు, 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎస్‌ఎఫ్‌బీల రుణాలు రూ. 94,441 కోట్ల నుంచి 24.2 శాతం పెరిగి రూ. 2,78,564 కోట్లకు ఎగిశాయి. అటు బ్యాంక్‌ డిపాజిట్లు కూడా రూ. 62,667 కోట్ల నుంచి 33.5 శాతం పెరిగి రూ. 2,65,586 కోట్లకు చేరాయి. చిన్న సంస్థలకు పీఎస్‌బీ రుణాల దన్ను మరోవైపు, పీఎస్‌బీల దన్నుతో 2025 జనవరి నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) గణనీయంగా కొత్త రుణాలు లభించినట్లు క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ఎంఎస్‌ఎంఈలకు అదనంగా ఇచ్చిన రుణాలు గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 17.7 శాతంతో పోలిస్తే 32.5 శాతానికి పెరిగినట్లు వివరించింది. మొత్తం రుణాల్లో ఎంఎస్‌ఎంఈల వాటా 1.72 శాతం మేర పెరిగింది. సురక్షితమైన సెక్యూర్డ్‌ క్రెడిట్‌ వైపు మొగ్గు చూపుతూ పీఎస్‌బీలు గణనీయంగా రుణాలివ్వడం ఇందుకు తోడ్పడింది. అలాగే ఎంఎస్‌ఎంఈల నిర్వచనంలో మార్పులు కూడా అధిక రుణ వితరణకు కారణంగా నిల్చినట్లు నివేదిక పేర్కొంది. అన్‌సెక్యూర్డ్‌ వ్యాపార రుణాల్లో అసెట్‌ నాణ్యత కాస్త క్షీణించినప్పటికీ మొత్తం ఎంఎస్‌ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నట్లు వివరించింది. యూనివర్సల్‌ లైసెన్సుపై దృష్టి..ఎస్‌ఎఫ్‌బీలు భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తూ, యూనివర్సల్‌ లైసెన్సుపై దృష్టి పెట్టాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సు రావడానికి ముందుగానే సర్వసన్నద్ధంగా ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలోను శాఖలను చురుగ్గా విస్తరిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇలాంటి మార్కెట్లలో టెక్నాలజీ వినియోగం పరిమితంగా ఉంటుంది కాబట్టి సిబ్బంది సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా హైరింగ్‌ని కూడా పెంచుకుంటున్నాయి. ఇటీవలే ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కి యూనివర్సల్‌ బ్యాంక్‌గా లైసెన్సు వచి్చంది. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ గతేడాది లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకూ లైసెన్సుపై ఆసక్తిగా ఉంది.

Mahindra XUV 3XO EV Launched At Rs 13. 89 Lakh2
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో

జైసల్మేర్‌: ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీని (ఎలక్ట్రికల్‌) ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐసీఈ వెర్షన్‌ని 2024 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ 285 కి.మీ. రేంజినిస్తుంది. మరోవైపు, సెవెన్‌ సీటర్‌ ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వోని కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉంటుంది.ఇది ఎక్స్‌యూవీ 700కి కొత్త వెర్షన్‌. ఎక్స్‌యూవీ 700 అమ్మకాలు ప్రతి నెలా సుమారు 7,000 యూనిట్లుగా ఉండగా, 7ఎక్స్‌వో రాకతో విక్రయాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజూరికర్‌ తెలిపారు. కొత్త ఉత్పత్తులు, వేరియంట్లతో ఈ ఏడాది అమ్మకాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది బొలెరో, బొలెరో నియో కొత్త వెర్షన్లను ప్రవేశపెట్టగా, ఈసారి ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో, ఎలక్ట్రిక్‌ ఎక్స్‌ఈవీ 9ఎస్‌ దన్నుతో విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రభావం కార్లతో పాటు చిన్న కమర్షియల్‌ వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపినట్లు రాజేశ్‌ తెలిపారు. పరిశీలనలో రేట్ల పెంపు కమోడిటీల రేట్లు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం తదితర పరిణామాల నేపథ్యంలో వాహనాల రేట్ల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాజేశ్‌ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే కొద్ది వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే హుందాయ్, బీవైడీ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్స్‌ మొదలైనవి జనవరి నుంచి రేట్ల పెంపు ప్రకటించాయి. అటు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తదితర దిగ్గజాలు కూడా రేట్ల పెంపును పరిశీలిస్తున్నాయి.

Demand for Lithium is Growing Like Gold and Silver3
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

Aadhaar PVC Card Charges Increase Know The Latest Price4
పెరిగిన ఆధార్ కార్డు ఛార్జీలు

ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్‌లెస్ ఆధార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.ధర పెరుగుదలకు కారణంపీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌ ఉపయోగించాలి.➤యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.You can easily check the delivery status online.To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026

PIB Fact Check Is Centre Depositing Rs 46715 In Every Bank Account5
అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్‌పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026

Rs 1 75 Crore Gains Due to Broker Tech Glitch6
20 నిమిషాల్లో కోటీశ్వరుడైన ట్రేడర్!

బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్‌గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement
Advertisement