Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

latest update on inoperative EPFO accounts1
వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

వినియోగంలో లేని (ఇనాపరేటివ్‌) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్‌ చేయడంపై ఈపీఎఫ్‌వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్‌ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్‌ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్‌ ఖాతాలను ఇనాపరేటివ్‌గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్‌ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఈపీఎఫ్‌ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. ఖాతాదారు చనిపోతే..ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్‌వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది.ఇదీ చదవండి: మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

gold and silver rates on 25 February 2026 in Telugu states2
స్వల్పంగా పెరిగిన బంగార ధర.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

TCS Chandrasekaran reappointment deferred Tata Sons board meeting3
చంద్రశేఖరన్‌ ఎంపిక వాయిదా

దేశీ కార్పొరేట్‌ దిగ్గజ గ్రూప్‌ టాటా సన్స్‌ బోర్డ్‌ తాజాగా నిర్వహించిన సమావేశంలో 62 ఏళ్ల నజరాజన్‌ చంద్రశేఖరన్‌ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. గ్రూప్‌ చైర్మన్‌గా మూడోసారి పదవీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు హోల్డింగ్‌ కంపెనీలో విభేదాలు కారణమని తెలుస్తోంది. 2027 ఫిబ్రవరితో చంద్రశేఖరన్‌ పదవీ కాలం ముగియనుంది. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నోయెల్‌ టాటా గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు వాటిల్లుతున్న నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా టాటా సన్స్‌ లిస్టింగ్‌పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నాయి. వెరసి చంద్రశేఖరన్‌ బాధ్యతల పొడిగింపుపై నిర్ణయం వాయిదాపడినట్లు తెలియజేశాయి.టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. అయితే సమావేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ వెలువడకపోవడం గమనార్హం! కాగా.. గ్రూప్‌లోని ఒక కంపెనీ నష్టాలు నమోదు చేస్తున్నంతమాత్రాన మొత్తం గ్రూప్‌తోపాటు.. కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్‌ పనితీరును తప్పుపట్టడం సరికాదని బోర్డు సభ్యులు పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు ఈ అంశంపై ఓటింగ్‌కు ప్రతిపాదించినప్పటికీ చంద్రశేఖరన్‌ వాయిదాకు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 నుంచి..1987లో టాటా గ్రూప్‌లో చేరిన చంద్రశేఖరన్‌ తదుపరి కాలంలో ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు. విభిన్న బిజినెస్‌లుగల కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ పునర్వ్యవస్థీకరణ, కన్సాలిడేషన్‌ సమయంలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రూప్‌లోని 15 భారీ లిస్టెడ్‌ కంపెనీల ఆదాయం, నికర లాభాలు రెట్టింపయ్యాయి.ఇదీ చదవండి: మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

stock market updates on 25 February 20264
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 152 పాయింట్లు పెరిగి 25,573 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 501 పాయింట్లు పుంజుకొని 82,722 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.82బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.4 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.77 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.05 శాతం పుంజుకుంది.Today Nifty position 25-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

retail debt Rs 162 crores refers outstanding borrowings retail cos5
రిటైల్‌ రుణాలు రూ.162 లక్షల కోట్లు

రిటైల్‌ రుణాలు గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2025 డిసెంబర్‌ త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడంతో, వాటిపై రుణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడం.. అలాగే, పండగల సీజన్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు రుణ వితరణ పెరిగేందుకు దారితీసింది. ఈ వివరాలను క్రెడిట్‌ సమాచార సంస్థ క్రిఫ్‌ హై మార్క్‌ విడుదల చేసింది. రిటైల్‌ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాలు 10.5 శాతం పెరిగి రూ.43 లక్షల కోట్లకు చేరాయి. ఈ విభాగంలో యాక్టివ్‌ రుణాలు నికరంగా 3.3 లక్షలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు సైతం 11.6 శాతం వృద్ధితో రూ.15.9 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఆటో రుణాలు 14.6 శాతం, ద్విచక్ర వాహన రుణాలు 12.3 శాతం, కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ రుణాలు 14.3 శాతం చొప్పున పెరిగాయి. సోల్‌ పొప్రైటర్‌ సంస్థలు (ఒక్కరే యజమానిగా ఉన్న) తీసుకున్న రుణాలు 26.2 శాతం పెరిగాయి. రిటైల్‌ రుణాల వసూలు కూడా మెరుగుపడింది. 30 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేనివి (మొండి బకాయిలు) డిసెంబర్‌ చివరికి 2.8 శాతానికి తగ్గాయి. సరిగ్గా అంతక్రితం ఏడాది డిసెంబర్‌ చివరికి ఇవి 3.2 శాతంగా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గృహ రుణాలు ఎక్కువ వృద్ధిని చూడగా, ఢిల్లీ మార్కెట్లో వృద్ధి తగ్గుమఖం పట్టింది. డిసెంబర్‌ త్రైమాసికంలో నికరంగా జారీ అయిన మొత్తం రుణాల్లో సగం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నాయి.ఇదీ చదవండి: మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Key Highlights from Jefferies Report IT sector6
ఐటీలో పెను మార్పులు

ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ).. సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో పెను మార్పులకు తెరతీస్తున్నట్లు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ తాజా నివేదిక పేర్కొంది. వెరసి ఐటీ రంగం వ్యవస్థాగతంగా తీవ్ర మార్పులకు లోనుకానున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ రంగానికి కీలకమైన బిజినెస్‌ మిక్స్‌ను ఏఐ పునర్‌నిర్వచించనున్నట్లు తెలిపింది. తద్వారా కాలానుగుణ మార్పులు (సైక్లికాలిటీ) పెరగడంతోపాటు.. నిర్వహణా పద్ధతులు, నైపుణ్యాలు పునసమీక్షించుకోవలసి ఉన్నట్లు వివరించింది. ఏఐ సవాళ్లు ముగియలేదని, కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్‌ పెరుగుతున్నప్పటికీ ఏఐ ఆధారిత మార్పులు సంప్రదాయ మేనేజ్‌డ్‌ సర్వీసులకు చెక్‌ పెట్టే అవకాశమున్నదని పేర్కొంది. డౌన్‌గ్రేడ్‌ బాటలో..ఇప్పటికే ఐటీ దిగ్గజ కౌంటర్లు గరిష్టాల నుంచి 20–25 శాతం మధ్య పతనమైనప్పటికీ మరింత క్షీణతకు వీలున్నట్లు నివేదికలో జెఫరీస్‌ అంచనా వేసింది. ఈ బాటలో ఐటీ పరిశ్రమ లీడర్స్‌ టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లను సైతం డౌన్‌గ్రేడ్‌ చేసింది. తద్వారా షేర్ల ధరల టార్గెట్‌ను 33 శాతంమేర కుదించింది. ఇటీవల ఆంత్రోపిక్‌ క్లాడ్‌ తదితరాలు అసిస్టెంట్ల స్థాయి నుంచి క్లిష్టమైన టాస్క్‌లకు సైతం పూర్తి చేయగల టూల్స్‌ను రూపొందిస్తూ ఏఐ సవాళ్లు విసురుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొద్ది వారాలుగా సంప్రదాయ ఐటీ సర్వీసులు సహా.. సాఫ్ట్‌వేర్‌ విభాగ సేవలకు చెక్‌ పడే వీలున్నదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నివేదిక వివరించింది. ఆదాయాల్లో 22–45% వరకూ ఆక్రమిస్తున్న అప్లికేషన్‌ మేనేజ్‌డ్‌ సర్వీసుల నుంచి ఐటీ కంపెనీలు అడ్వయిజరీ, ఇంప్లిమెంటేషన్‌వైపు వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టవలసి ఉంటుందని సూచించింది. కాగా.. ఈ ప్రభావంతో దేశీయంగా ఫిబ్రవరి తొలి 3 వారాల్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 20% పతనంకావడం గమనార్హం!

Advertisement
Advertisement
Advertisement