Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Anthropics New Claude Security Feature Triggers Cybersecurity Stocks Crash1
ఆంథ్రోపిక్‌ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!

అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్‌ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్‌ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్‌ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్‌లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్‌​ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్‌స్ట్రయిక్‌ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్‌ 9% పైగా క్షీణించింది. క్లౌడ్‌ఫ్లేర్‌ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్‌స్కేలర్‌ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్‌ల్యాబ్‌, జేఫ్రాడ్‌ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్‌ ఎక్స్‌ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్‌ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్‌ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్‌ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వర్క్‌ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది.

Delhi Govt To Impound And Scrap Overaged Vehicles2
అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే తుక్కుకే!

లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో నడిపే లేదా పార్క్ చేసిన పాత పెట్రోల్ & డీజిల్ వాహనాలను నోటీసు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.బీఎస్ III అంతకంటే పాత వాహనాలు, అంటే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన డీజిల్ వాహనాలు & 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పెట్రోల్ వాహనాలను లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలుగా పరిగణిస్తారు. ఇలాంటి వాహనాలను పబ్లిక్ రోడ్డుపై డ్రైవ్ చేయకూడదు.కాలం చెల్లిన వాహనాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందటం ద్వారా.. ఢిల్లీ వెలుపలికి తీసుకెళ్లవచ్చు. రూల్స్ అతిక్రమించి.. బహిరంగ ప్రదేశాల్లో పాత వాహనాలను నడిపినట్లయితే.. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని స్క్రాపేజ్ చేయడానికి తరలించడం జరుగుతుంది. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయంపాత వాహనాలు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు కూడా కార్లలో ఇంజిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ 4, బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు బీఎస్ 6 వాహనాలే అందుబాటులో ఉన్నాయి.

Reliance Jio Rs 365 Plan With Data3
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్: 25 జేబీ డేటా..

ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్ఎ‌స్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్‌ను పొందవచ్చు.జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

Homebuyers Closing Rs 2 3 Crore Deals in Record 15 Days Real Estate4
రూ.2–3 కోట్ల ప్రాపర్టీ.. 15 రోజుల్లోనే..

ఇల్లు కొనుగోలు చేయాలంటే సవాలక్ష ఎంక్వైరీలు.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా చాలా మందికి ప్రత్యక్షంగా ఇల్లు చూపించి, ధర గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడం సహజం. కానీ, విలాసవంతమైన ఇంటిని కొందరు కస్టమర్లు చిటికేసినంత సులువుగా కొనుగోలు చేస్తున్నారు. రూ.2–3 కోట్ల ధర ఉన్న ఇళ్లు కొనేందుకు కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్, ఏఐ విశ్లేషణ వేదిక అస్త్ర రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 28 రోజుల సమయం తీసుకునే వారని తెలిపింది. – సాక్షి, సిటీబ్యూరో ప్రాపర్టీ కొనేందుకు అన్వేషించే వారు వాస్తవ కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయం.. మొత్తం మార్కెట్‌ డిమాండ్, సెంటిమెంట్‌ను అంచనా వేసేందుకు కీలకమైన కొలమానం. బడ్జెట్‌ను అనుసరించి కస్టమర్లు నిర్ణయం తీసుకునే ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. ‘లీడ్‌ టు బై కన్వర్షన్‌’ డేస్‌లో తగ్గుదలకు ప్రధాన కారణం మెట్రో నగరాలలో పెద్ద టికెట్‌ సైజు ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటమే. 2025లో అమ్ముడైన అన్ని బడ్జెట్‌ గృహాల్లో రూ.2–3 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు లీడ్‌ టు బై కన్వర్షన్‌ సమయం అత్యల్పంగా ఉంది. 2024లో ఈ ఇళ్ల కొనుగోలు నిర్ణయానికి 28 రోజులు పట్టగా.. గతేడాది కేవలం 15 రోజుల్లోనే ముగించేశారు.యువ కస్టమర్లకు నచ్చితే చాలు.. నేటి యువతరం ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్తున్నారు. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. మన దేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. అలాగే కొన్ని ఏళ్లుగా మార్కెట్‌లో బ్రాండెడ్‌ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ.1–2 కోట్ల ధర ఉన్న ప్రాపరీ్టలను కొనేందుకు 30 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న యూనిట్లకు 29 రోజులు పడుతుంది.విక్రయానికి ఎన్ని రోజులంటే.. రూ.1–2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించేందుకు బ్రోకరేజ్‌ సంస్థలకు 2024లో 47 రోజులు పట్టింది. ఇవి 56 శాతం వేగంగా అమ్ముడయ్యాయి. ఇక, రూ.3 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే యూనిట్ల అమ్మకానికి 2024లో 17 రోజులు పట్టగా.. గత ఏడాదికి 27 రోజులకు పెరిగింది. అలాగే రూ.50 లక్షలలోపు ధర ఉన్న సరసమైన గృహాలకు గత ఏడాది 19 రోజులు పట్టగా.. అంతకుముందు ఏడాది ఏకంగా 28 రోజులు వేచి చూడాల్సి వచ్చింది.ఇది చదివారా? సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

Hyderabad Leads Surge in Apartment Sizes5
బిగ్‌ హౌస్.. ఇప్పుడిదే ట్రెండ్!

కరోనాతో ఇంటి అవసరం పెరిగింది. అప్పటి వరకు చిన్న ఇల్లు అయినా పర్లేదు అనుకునే కొనుగోలుదారులు ఆ తర్వాత నుంచి విశాలమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో క్రమంగా అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2019 నుంచి 2025 మధ్య కాలంలో యూనిట్ల సగటు సైజులు 45 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే యూనిట్ల సైజులు అత్యధికంగా ఉన్నాయని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.నగరంలో ఇళ్ల పరిమాణం రెండేళ్ల కాలంలో 13 శాతం మేర పెరిగాయి. 2023లో ఇక్కడ యూనిట్ల సగటు విస్తీర్ణం 2,299 చ.అ.లుగా ఉండగా.. 2025 నాటికి 2,600 చ.అ.లకు పెరిగింది. ఆసక్తికరంగా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో 2024లో కంటే గతేడాది అపార్ట్‌మెంట్ల పరిమాణం అత్యధికంగా 24 శాతం మేర పెరిగాయి. ఆ ఏడాది నగరంలో సగటు విస్తీర్ణాలు 2,103గా ఉన్నాయి. 2025లో మన తర్వాత ఎన్‌సీఆర్‌(ఢిల్లీ)లో ఫ్లాట్ల సైజు 2025లో 2,466 చ.అ.గా ఉంది. ఇక్కడ 2023లో 1,890 చ.అ.లుగా ఉన్నాయి. 2023లో ముంబైలో 810 చ.అ.లుగా ఉన్న యూనిట్ల సైజు.. గత ఏడాది నాటికి 904 చ.అ.లకు పెరిగాయి.స్టడీ రూమ్‌లు కూడా..గతంలో పిల్లల కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్‌ అనేది ఉన్నత స్థాయి గృహాలలోనే కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ గదులు కూడా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చేశాయి. స్టడీ రూమ్‌లు, వెయిటింగ్‌ హాల్‌ వంటివన్నీ ప్రధాన ఇంటి విస్తీర్ణంలోనే మిళితమైపోయాయి. దీంతో ఇళ్ల విస్తీర్ణాలే కాదు ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ల సగటు సైజులు 2023లో 1,420 చ.అ.లుగా ఉండగా.. 2025 నాటికి 1,676 చ.అ.లకు పెరిగాయి. 2024లో 1,540 చ.అ.లతో పోలిస్తే జస్ట్‌ ఒక సంవత్సర కాలంలోనే యూనిట్ల విస్తీర్ణాలు ఏకంగా 8 శాతం వృద్ధి చెందాయి.

Mercedes Benz Recalls CLE AMG CLE And AMG C Class Know The Details6
మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్!

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన సీఎల్ఈ, ఏఎంజీ సీఎల్ఈ, ఏఎంజీ సీ-క్లాస్ మొదళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడం కోసం కస్టమర్లు డబ్బు చెల్లించాలా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫీచర్‌ పనిచేయకుండా పోతుంది. దీనివల్ల అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఈ రీకాల్ ప్రభావం.. 2024-25 మధ్య తయారైన సీఎల్ఈ మోడల్స్, 2025లో తయారైన ఏఎంజీ సీఎల్ఈ మోడల్స్, 2024 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తయారైన సీ క్లాస్ మోడల్స్ మీద పడుతుంది.రీకాల్ సమాచారాన్ని కంపెనీ కస్టమర్లకు మెయిల్స్, మెసేజస్ రూపంలో తెలియజేస్తుంది. ప్రభావితమైన మోడల్స్ అన్నింటికీ ఉచితంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు దీనికోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

Advertisement
Advertisement
Advertisement