ప్రధాన వార్తలు
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!
ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
ప్రముఖ ఫుడ్, గ్రొసరీ డెలివరీ దిగ్గజం 'స్విగ్గీ' (Swiggy)లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఇన్నోవేషన్ హెడ్ నందన్ రెడ్డి తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తన సొంత వెంచర్ను ప్రారంభించే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.వ్యవస్థాపక త్రయంలో మిగిలింది ఒక్కరే..శ్రీహర్ష మజేటీ, రాహుల్ జైమినిలతో కలిసి నందన్ రెడ్డి స్విగ్గీని స్థాపించారు. వీరిలో రాహుల్ జైమిని ఇప్పటికే 2020లో కంపెనీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా వైదొలగడంతో వ్యవస్థాపక బృందంలో శ్రీహర్ష మజేటీ మాత్రమే మిగిలారు. "బెంగళూరులో ఒక చిన్న ప్రాంతంలో మొదలైన స్విగ్గీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించడంలో నందన్ కృషి వెలకట్టలేనిది. ఆయన దార్శనికత మా కంపెనీ డీఎన్ఏలోనే ఉంది" అని కంపెనీ సీఈవో శ్రీహర్ష ఈ సందర్భంగా కొనియాడారు.బోర్డులో కొత్త ముఖాలునందన్ రెడ్డి నిష్క్రమణతో పాటు బోర్డు సభ్యుల్లోనూ స్విగ్గీ పలు మార్పులు చేపట్టింది. గతంలో 'ఇన్స్టామార్ట్' బాధ్యతలు చూసిన ఫణి కిషన్ అడెపల్లి ఇప్పుడు బోర్డు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈయన చీఫ్ గ్రోత్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోత్రా కూడా బోర్డులో చేరనున్నారు. మరోవైపు రెనాన్ డి కాస్ట్రో అల్వెస్ పింటో ప్రోసస్ వెంచర్స్ ప్రతినిధిగా బోర్డులోకి రానున్నారు.పెట్టుబడిదారుల హక్కుల్లో మార్పులుకంపెనీ తన 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్'ను సవరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కీలక విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉన్న యాక్సెల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థల హక్కులను కంపెనీ తొలగించింది. గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటీకి బోర్డు సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని కల్పించారు. దీనివల్ల కంపెనీ నిర్ణయాధికారాల్లో మేనేజ్మెంట్కు పట్టు పెరగనుంది.ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ మార్పులన్నీ వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఐపీఓ (IPO) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో స్విగ్గీలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ అనే ట్యాగ్లైన్తో తమ నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత మొబిలిటీ, పరిష్కారాలను అందించే ఆవిష్కరణల ఆధారిత సంస్థగా కంపెనీ పరిణామక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.పర్యావరణహిత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తువైపు ప్రపంచాన్ని నడిపించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందని సంస్థ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. నిర్మాణాత్మక సమగ్రత, లక్ష్యంతో కూడుకున్న దిశను సూచించేలా త్రిభుజాకారంలో ఒలెక్ట్రా ప్రిజం, దాని చుట్టూ ఒలెక్ట్రా యూనివర్స్ని సూచించే వృత్తంతో లోగో ఉంటుంది. వాటాదారులు, నగరాలు, కంపెనీ అందించే సేవల విస్తృత వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తుంది.
భారత్ వృద్ధి అంచనాలు అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం.
భారత్కు విశ్వసనీయ సరఫరాదారుగా ఉంటాం
న్యూఢిల్లీ: భారత్కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్ షెరీదా ఆల్కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఖతార్ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్ అవసరాల్లో 45 శాతం ఎల్ఎన్జీ, 20 శాతం ఎల్పీజీని ఖతార్ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్ పర్యటనకు వెళ్లడం గమనార్హం.
ఈక్విటీ ఫండ్స్.. తగ్గేదేలే!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు అత్యధిక ఆదరణ లభించింది. మరోవైపు డెట్ ఫండ్స్ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మార్చిలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది. విభాగాల వారీగా.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.6,263 కోట్లు, మిడ్క్యాప్ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,307 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. → మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.437 కోట్లను కోల్పోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం. → హైబ్రిడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల నమ్మకం.. ‘మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. సిప్ సరికొత్త రికార్డు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్టైమ్ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
కార్పొరేట్
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
ఈక్విటీ ఫండ్స్.. తగ్గేదేలే!
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
స్పెయిన్లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
భారత్ పెట్రోలియం సీఎండీగా సంజీవ్ ఖన్నా
WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్
‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ...
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్ట...
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు భారీగా...
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్...
దేశాలకు టారిఫ్ల షాక్.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు ...
టెక్స్టైల్స్ పీఎల్ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం...
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట...
అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?
అగ్రరాజ్యం అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాల నెట్వర...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ స్కిల్స్పై స్కాలర్షిప్ టెస్ట్
తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్లో, 20 నిమిషాల ఆన్లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలగింపుల్లో టాప్ అమెజాన్.. 30 వేలకు పైనే..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు (2026) ప్రముఖ దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ లేఆఫ్స్ జాబితాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది.అమెజాన్, ఇంటెల్ సంస్థల్లోనే అధికంవివిధ నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2025 నుంచి ఇప్పటివరకు అమెజాన్ ఏకంగా 30,184 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీని తర్వాత చిప్ మేకర్ ఇంటెల్ (Intel) 27,058 మందిని, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) 15,347 మందిని తొలగించి టాప్-3లో నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.కంపెనీల వారీగా తొలగింపుల వివరాలు కంపెనీ పేరుతొలగించిన ఉద్యోగుల సంఖ్య1అమెజాన్30,1842ఇంటెల్27,0583మైక్రోసాఫ్ట్15,3474హెచ్పీ8,0005మెటా5,8006సేల్స్ఫోర్స్5,3857బ్లాక్ (Block)4,9318నార్త్ వోల్ట్2,8009హ్యూలెట్ ప్యాకర్డ్2,55210ఆటోడెస్క్2,350ఎందుకీ కోతలు?గత రెండేళ్లుగా టెక్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. AI ప్రభావం: పనులను ఆటోమేట్ చేయడం వల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది.ఆర్ధిక మందగమనం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులను తగ్గించుకోవాలనే ఒత్తిడి కంపెనీలపై ఉంది.రీస్ట్రక్చరింగ్: లాభదాయకత లేని ప్రాజెక్టులను మూసివేసి, ప్రాధాన్యత ఉన్న రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.ఈ పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెజాన్లో మళ్లీ లేఆఫ్స్.. ఖండించిన కంపెనీగడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్ వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని అమెజాన్ ఖండించింది. ఇవన్నీ అవాస్తమని, తమకు అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.🚨 Disclosed layoffs in 2025 and 2026 so far.1. Amazon - 30,1842. Intel - 27,0583. Microsoft - 15,3474. HP - 8,0005. Meta - 5,8006. Salesforce - 5,3857. Block - 4,9318. Northvolt - 2,8009. Hewlett Packard - 2,55210. Autodesk - 2,35011. Workday - 2,15012. Synopsys -…— Indian Tech & Infra (@IndianTechGuide) April 4, 2026
కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం మరింత చౌక ప్లాన్లు
కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త ముసాయిదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం వాయిస్, ఎస్ఎంఎస్, డేటాతో కలిపి ఇస్తున్న స్పెషల్ టారిఫ్ ఓచర్లకు సరిసమాన కాల వ్యవధితో వాయిస్, ఎస్ఎంఎస్లకు సంబంధించి కూడా స్పెషల్ టారిఫ్ ఓచర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనితో పారదర్శకత పెరుగుతుందని, బలవంతంగా అవసరం లేని బండిల్డ్ సర్వీసులను తీసుకోవాల్సిన పరిస్థితి తప్పుతుందని పేర్కొంది.టెలికం వినియోగదారుల హక్కుల పరిరక్షణ (పదమూడో సవరణ) నిబంధన 2026కి సంబంధించిన ఈ ప్రతిపాదనపై సంబంధిత వర్గాలు ఏప్రిల్ 28 నాటికి ట్రాయ్కి అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూడా వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం టెల్కోలు ప్రత్యేక ప్లాన్లను అందిస్తున్నప్పటికీ అవి సుదీర్ఘ వేలిడిటీతోనే ఇస్తున్నాయి. పైగా డేటా కూడా ఉండే బండిల్డ్ ప్లాన్ల కన్నా అధిక రేటును నిర్ణయించడమే కాకుండా, డేటాను తొలగించడం ద్వారా వినియోగదారులకు దక్కాల్సిన ప్రయోజనాలు ఆ స్థాయిలో అందించడం లేదు.ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
AI ఏమి చేయలేదు.. ఈ ఉద్యోగాలు సేఫ్!
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.
పర్సనల్ ఫైనాన్స్
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.
స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఇలా..
చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➤ పీపీఎఫ్: 7.1 శాతం➤ సేవింగ్స్ డిపాజిట్ రేటు: 4 శాతం➤ కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➤ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4 శాతం➤ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం➤ ఏడాది టైమ్ డిపాజిట్: 6.9 శాతం➤ రెండేళ్ల టైమ్ డిపాజిట్: 7 శాతం➤ మూడేళ్ల టైమ్ డిపాజిట్: 7.1 శాతం➤ ఐదేళ్ల టైమ్ డిపాజిట్: 7.5 శాతం➤ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ): 6.70 శాతం
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్..
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.అలాగే 26ఏఎస్/ఏఐఎస్కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్ఆర్ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్కం ట్యాక్స్తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం.


