Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 17 April 2026 in Telugu states1
బిగ్‌ రిలీఫ్‌.. చల్లబడిన బంగారం ధరల వేడి!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 17 April 20262
ఊగిసలాడుతున్న మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,211 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 101 పాయింట్లు ఎగబాకి 78,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.25బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 98.15 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.26 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.36 శాతం పుంజుకుంది.Today Nifty position 17-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Banking Frauds: Cyber Criminals Use New Tricks To Steal Your Money3
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు

మీ ఈమెయిల్ బాక్స్‌లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్‌ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్‌ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్‌సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లాగే కనిపించే నకిలీ సైట్‌లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్‌సైట్ అడ్రస్‌లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్‌లు, ఎక్స్‌టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు మీ ఫోన్‌లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్‌) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్‌ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్‌ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్‌ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్‌ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Chhattisgarh Vedanta Plant Blast FIR Against Chairman Anil Agarwal 20 Deaths4
వేదాంత ఛైర్మన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత గ్రూప్ విద్యుత్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సింగితరై గ్రామంలోని ప్లాంట్‌లో బాయిలర్ నుంచి టర్బైన్‌కు అధిక పీడనంతో ఆవిరిని తీసుకెళ్లే స్టీల్ ట్యూబ్ ఒక్కసారిగా పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.చట్టపరమైన చర్యలుశక్తి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రఫుల్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, దబ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద కొన్ని సెక్షన్లను నమోదు చేశారు.సెక్షన్ 106: నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం.సెక్షన్ 289: యంత్రాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడం.సెక్షన్ 3(5): కామన్‌ ఇంటెన్షన్‌‘ఎఫ్ఐఆర్‌లో ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సహా 8 నుంచి 10 మంది వ్యక్తుల పేర్లను చేర్చాము. దర్యాప్తులో మరింత మంది బాధ్యుల పేర్లు వెలుగులోకి వస్తే వారిని కూడా నిందితులుగా చేరుస్తాం’ అని ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ వెల్లడించారు.దర్యాప్తు ముమ్మరంఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలుడు కారణాలను అన్వేషించడానికి నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతుల పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విశ్లేషణ, పారిశ్రామిక భద్రతా విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నివేదికలు అందిన తర్వాత అవసరమైతే మరిన్ని కఠిన సెక్షన్లను జోడించే అవకాశం ఉంది.ఈ ప్రమాదంపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదుతో సరిపెట్టకుండా ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరింది.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Wipro Launches Rs 15000 Cr Share Buyback at Premium Amid Flat Q4 Profit5
విప్రో బంపర్‌ బైబ్యాక్‌!

ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో రూ. 15,000 కోట్లు వెచ్చించనుంది. మరోపక్క క్యూ4లో నికర లాభం 2 శాతం నీరసించి రూ.3,502 కోట్లకు చేరింది. సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో భారీస్థాయిలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకీ రూ. 250 ధరలో 5 శాతానికిపైగా వాటా(దాదాపు 60 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనుంది. ఇందుకు ఏకంగా రూ. 15,000 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్‌ ధర రూ. 210తో పోలిస్తే 18 శాతం ప్రీమియంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. చెల్లించిన మూలధనంలో 5.7 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో సీఎఫ్‌వో అపర్ణ అయ్యర్‌ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో బైబ్యాక్‌ పూర్తికాగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేశారు. బైబ్యాక్‌లో ప్రమోటర్, సంబంధిత గ్రూప్‌ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2026–27) తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల బిజినెస్‌ నామమాత్ర క్షీణత(2 శాతం) లేదా యథాతథంగా 259.7–265.1 కోట్ల డాలర్లమధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా(గైడెన్స్‌) వేసింది. లాభం ఫ్లాట్‌గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో విప్రో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 2 శాతం నీరసించి రూ. 3,502 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2025–26) ఇదే కాలంలో రూ. 3,570 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 24,236 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,504 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా క్యూ4లో విప్రో నికర లాభం 12 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున బలపడ్డాయి.ఇతర విశేషాలుక్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 2 శాతం వార్షిక వృద్ధితో 265.1 కోట్ల డాలర్లకు చేరింది.3 శాతం వృద్ధితో 345.5 కోట్ల డాలర్ల విలువైన బుకింగ్స్‌(డీల్స్‌) నమోదయ్యాయి.మార్చితో ముగిసిన 2025–26లో ఫ్లాట్‌గా రూ. 13,197 కోట్ల నికర లాభం ఆర్జించింది.మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 92,624 కోట్లను తాకింది.కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 నుంచి 2,42,156కు బలపడింది.మొత్తం 7,500 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. క్యూ4లో 3,000 మందికి చోటిచ్చింది.లాభాలకు సవాళ్లు...లాభాలపై రాజకీయ, భౌగోళిక, పాలసీ సంబంధ సవాళ్లు ప్రభావం చూపాయి. అయితే ఐటీ వ్యయాలు నిలకడగా నమోదవుతున్నాయి. సాధారణ రీతిలోనే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌–జూన్‌) ఫలితాలు బలహీనంగా వెలువడనున్నాయి. ఇందుకు యూఎస్‌ డీల్స్‌ ఆలస్యం, క్లయింట్‌ సమస్యలు ప్రభావం చూపనున్నాయి. – విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియాఐటీ దిగ్గజాల బైబ్యాక్‌ తీరిలావిప్రో తాజా బైబ్యాక్‌కు టెండర్‌ మార్గంలో తెరతీయనుంది. ఇంతక్రితం 2023లోనూ రూ. 12,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేపట్టింది. ఇక ఇన్ఫోసిస్‌ గతేడాది బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించింది. వెరసి అతి భారీ బైబ్యాక్‌ చేపట్టిన దేశీ కంపెనీగా రికార్డ్‌ నెలకొల్పింది. 2023 డిసెంబర్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ. 17,000 కోట్లతో బైబ్యాక్‌ను పూర్తి చేసింది. మరో ఐటీ కంపెనీ సైయెంట్‌ సైతం బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలనకు ఈ నెల 23న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం!ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Government Explores Ways to Keep 51percent Stake in PFC After REC Merger6
పీఎఫ్‌సీలో మెజారిటీ వాటాకు సై 

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజాలు పీఎఫ్‌సీతోపాటు.. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. అయితే అతిపెద్ద పీఎస్‌యూ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్‌గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్‌సీ ప్రిఫరెన్స్‌ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వ వాటా ఇలా కంపెనీల చట్టం ప్రకారం పీఎస్‌యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్‌ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్‌) వద్ద ఉంది. 2025 డిసెంబర్‌31కల్లా పీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ లోన్‌ అసెట్‌ బుక్‌ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్‌ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్‌ బుక్‌ను కలిగి ఉంది. విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌ సౌకర్యాలు కల్పించే పీఎఫ్‌సీ 20 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ ఫైనాన్సింగ్‌ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement