Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Affordable Semaglutide Hits Market as Pharma Giants Launch Generics1
చౌకగా సెమాగ్లూటైడ్.. దిగ్గజ కంపెనీల లాంచ్!

భారతదేశంలో డయాబెటిస్ (షుగర్) చికిత్సలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ.. ప్రముఖ ఔషధ సంస్థలు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 'సెమాగ్లూటైడ్' (Semaglutide) ఆధారిత కొత్త మందులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సెమాగ్లూటైడ్ ఔషధానికి భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన వెంటనే ఈ కంపెనీలు తక్కువ ధరలతో జనరిక్ వేరియంట్లను విడుదల చేశాయి.టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) చికిత్సలో కీలకంగా భావించే GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) థెరపీని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కంపెనీలు ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న డయాబెటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త లాంచ్‌లు దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన, అందుబాటు వైద్య సేవలను అందించనున్నాయి.మనదేశంలో డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. GLP-1 ఆధారిత చికిత్సలు ఈ పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (DCGI) ప్రకారం.. దేశంలో సుమారు 8.9 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు, ఇది మొత్తం వయోజన జనాభాలో 10.5 శాతంగా ఉంది. ఊబకాయం దాదాపు అన్ని వయసుల వారిలో వేగంగా పెరుగుతోంది. పెద్దల్లో మహిళల్లో ఊబకాయం శాతం 12.6% నుంచి 24.0%కి, పురుషుల్లో 9.3% నుంచి 22.9%కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.సెమాగ్లుటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మందులు బరువు తగ్గడంతో కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు కడుపు నిండినట్లు సంకేతాలు పంపి, జీర్ణక్రియను నెమ్మదింపజేసే ఒక సహజ హార్మోన్‌ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా తక్కువ తింటారు.. క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది.ఇవి తక్కువ తినడానికి మరియు మరింత సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆవిష్కర్త అయిన నోవో నార్డిస్క్, 20 మార్చి 2026న పేటెంట్ ప్రత్యేకతను కోల్పోకముందే, ప్రారంభ మార్కెట్ వాటాను చేజిక్కించుకునే ప్రయత్నంలో, గత సంవత్సరం భారతదేశంలో తన సెమాగ్లుటైడ్ బ్రాండ్‌లైన వెగోవి మరియు ఓజెంపిక్‌లను విడుదల చేసింది.

Techie Rejects Rs 47 Lakh Job Offer After Acing Interview2
రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!

పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ ఆఫర్‌ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.Career Update:I recently got a fantastic job offer of Rs. 47 LPA in Pune for a senior role.The package was good and the company was great, but the position demanded skills I don’t fully possess yet.I politely rejected the offer, explaining that I am not ready to deliver at…— Vanesh Mali (@vaneshmali) March 20, 2026

Gold Prices Drop Sharply This Week Know The Latest Rates3
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..

బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది.

Apple AirPods Max 2 Launched4
యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌2 లాంచ్: ధర ఎంతంటే?

డిసెంబర్ 2020లో యాపిల్ కంపెనీ ఒరిజినల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల ధర భారతదేశంలో రూ. 67,900గా ఉంది. ఈ కొత్త హెడ్‌ఫోన్‌లు యాపిల్‌ హెచ్‌2 చిప్‌తో పనిచేస్తాయి. ‘మునపటి తరంతో పోల్చితే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావంతమైన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఏఎన్‌సి)ను అందిస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది. విమానం, రైలు శబ్దాల వంటి బాహ్య శబ్దాలను ఈ అప్‌గ్రేడ్‌ సమర్థవంతంగా నిరోధిస్తుంది.ఈ హెడ్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్లు మార్చి 25న ప్రారంభమవుతాయి, కాగా డెలివరీలు ఏప్రిల్ ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ హెడ్‌ఫోన్‌లో అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిని అప్డేట్ చేసింది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.Headphones that are so much more than just headphones!The new AirPods Max 2 have even better audio, even better ANC, and even better features like Adaptive Audio and Live Translation. pic.twitter.com/tXnOxPCLor— Greg Joswiak (@gregjoz) March 16, 2026యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత, ప్రీమియం వినియోగదారుల మధ్య iPhone, MacBook, iPad వంటి పరికరాలు ప్రతిష్టాత్మక గుర్తుగా మారాయి. మెరుగైన కెమెరా నాణ్యత, సేఫ్టీ ఫీచర్స్, ఎకోసిస్టమ్ సమగ్రత వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా.. EMI ఆఫర్లు, ఆన్‌లైన్ విక్రయాలు.. భారతదేశంలో స్థానిక తయారీ పెరగడం వంటి అంశాలు కూడా యాపిల్ ఉత్పత్తుల చేరువను పెంచాయి.

Iran says it has no oil surplus to offer global markets5
ఆయిల్‌పై అమెరికా అంచనా.. ఇరాన్‌ క్లారిటీ

అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణమార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

SBI gets Rs 6337 crore tax demand notice6
ఎస్‌బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్‌ నోటీసు..

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్‌బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్‌బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్‌బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్‌బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది.

Advertisement
Advertisement
Advertisement