Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Reliance Retail Acquires Priyanka Chopra Anomaly1
రిలయన్స్ చేతికి ప్రియాంక చోప్రా అనామలి

రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) సంస్థ.. ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనామలి'ని, దాని ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.అనామలి కొనుగోలు.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్‌లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది.అనామలి బ్రాండ్‌ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది.ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్‌వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలీ కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. అనామలి తమ బ్యూటీ పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టి.. జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా ప్రియాంక చోప్రా బ్రాండ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించారు.Reliance Retail Acquires Priyanka Chopra Jonas’s Anomaly, Accelerating Expansion of Its Beauty Portfolio~ Acquires ‘Anomaly’ trademarks and digital assets to drive India and global growth ~~ To accelerate Omnichannel scale-up across retail network and Tira ~Reliance Retail… pic.twitter.com/UjIAQCHWzQ— Reliance Industries Limited (@RIL_Updates) April 30, 2026

Adani Power Q4 Results Net Profit Surges Check Details2
అదానీ పవర్‌ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం అదానీ పవర్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి.అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్‌(1,600 మెగావాట్లు), రాయ్‌పూర్‌(1,600 మెగావాట్లు), రాయ్‌గఢ్‌(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86–47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్‌ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031–32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఎల్‌వోఏను అందుకుంది.

Infosys CEO Salil Parekh on AI impacting Job Market3
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్‌పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

Cognizant launches Project Leap for AI ­led future sig­nals lay­offs4
కాగ్నిజెంట్ కొత్త ప్రాజెక్ట్‌.. టెకీల గుండెల్లో గుబులు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ లీప్’ (Project Leap) ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుండటంతో, భారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.రూ. 2000 కోట్లకు పైగా ఖర్చు..ప్రాజెక్ట్ లీప్‌ను ఒక పరివర్తన కార్యక్రమంగా కాగ్నిజెంట్ అభివర్ణిస్తోంది. దీనికోసం 2026 నాటికి 230 నుంచి 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 - రూ.2,600 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సింహభాగం అంటే 200 నుంచి 270 మిలియన్ డాలర్లు కేవలం ఉద్యోగుల విడదీత (Severance pay), సిబ్బందికి సంబంధించిన ఇతర ఖర్చులకే కేటాయించడం గమనార్హం.ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే.. తొలగింపుల ప్రభావం కొన్ని వేల మందిపై ఉండబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేదు.‘పిరమిడ్’ రివర్స్‌.. జూనియర్లకే ప్రాధాన్యం!కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఈ మార్పులపై స్పందిస్తూ.. సంస్థను ‘విస్తృత, చిన్న’ (Broad and Small) పిరమిడ్ ఆకృతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే నిర్వహణ విభాగంలో (Management layers) ఉన్న సీనియర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం.. ఎక్కువ మంది ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా సంస్థ అట్టడుగు భాగాన్ని బలోపేతం చేయడం.. క్లిష్టమైన ఏఐ నైపుణ్యాలను యువ శ్రామిక శక్తి ద్వారా వేగంగా నిర్మించడం చేస్తారు.భారీ పొదుపు.. ఏఐపై పెట్టుబడిఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 నాటికి 200 నుంచి 300 మిలియన్ డాలర్ల వ్యయాన్ని ఆదా చేయాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి ఏఐ సామర్థ్యాల పెంపుదల, ఉద్యోగుల రీస్కిల్లింగ్, మార్జిన్లను పెంచడం కోసం వినియోగించనున్నారు.కాగ్నిజెంట్‌కు ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్తేమీ కాదు. 2023లో సుమారు 300 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో అమలు చేసిన 'నెక్స్ట్ జెన్' ప్రోగ్రామ్ 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. అంతకు ముందు 2020లో 'ఫిట్ ఫర్ గ్రోత్' దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపింది.ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300. ఒకవైపు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయని చెప్తూనే, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తుండటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Dhan Launches Gold Vault Buy Physical Gold Silver at Live MCX Prices5
లైవ్‌ ధరలకు బంగారం.. ‘ధన్‌ గోల్డ్‌ వాల్ట్‌’ లాంచ్‌

పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్‌ వాల్ట్‌ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ధన్‌ వెల్లడించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో ట్రేడ్‌ చేయడంతో పాటు అవే లైవ్‌ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్‌సీసీఎల్‌ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్‌ గ్రేడ్‌ వాల్ట్‌లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్‌ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్‌ జాదవ్‌ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్‌ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత.

Jio 5G Dominates Telangana Tops TRAI Drive Tests in Warangal6
జియో దూకుడు.. ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం!

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో.. వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా స్పీడ్, వాయిస్ క్వాలిటీ, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదు కాగా.. కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఫలితాలు తెలంగాణ టెలికాం వినియోగదారుల అనుభవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ పనితీరును అంచనా వేయడంలో డ్రైవ్ టెస్ట్‌లు అత్యంత విశ్వసనీయ పద్ధతి.ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జియో నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ 161.18 Mbps, వోడాఫోన్ ఐడియా 27.83 Mbps, బీఎస్ఎన్ఎల్ 8.32 Mbps వద్ద నిలిచాయి. అంటే ఒక వినియోగదారుడు వీడియో స్ట్రీమింగ్ లేదా గేమింగ్ చేస్తే జియో వినియోగదారుడు మిగతా నెట్‌వర్క్‌లతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా సేవలు పొందుతున్నాడని అర్థం.నగరంలోని హాట్‌స్పాట్ ప్రాంతాల్లో వేగం మరింత పెరిగింది. హనుమకొండ బస్ స్టాండ్ వద్ద 471.60 Mbps పీక్ స్పీడ్ నమోదు కాగా రెడ్డి కాలనీలో 456.67 Mbps నమోదైంది. ఈ సంఖ్యలు కేవలం టెక్నికల్ డేటా కాదు, రోజువారీ డిజిటల్ జీవితంలో వేగవంతమైన మార్పుకు సూచికగా నిలుస్తున్నాయి.ట్రాయ్ అధికారిక నివేదిక ప్రకారం.. వాయిస్ కాల్ నాణ్యతలో కూడా జియో ముందంజలో ఉంది. మీన్ ఓపీనియన్ స్కోర్ 4.46గా నమోదైందని మార్చి 2026 పరీక్షలో వెల్లడైంది. ఎయిర్‌టెల్ 3.98, వోడాఫోన్ ఐడియా 3.76, బీఎస్ఎన్ఎల్ 2.97 వద్ద నిలిచాయి. అంటే పది కాల్‌లలో ఎక్కువ భాగం జియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.ట్రాయ్ డేటా ప్రకారం జియో లేటెన్సీ 21.94 msగా ఉండగా ఇతర నెట్‌వర్క్‌లు 38 ms పైగా నమోదయ్యాయి. లేటెన్సీ తగ్గడం వల్ల గేమింగ్, వీడియో కాలింగ్ అనుభవం మెరుగుపడుతుంది. 20 మిల్లీసెకన్లకు దగ్గరగా ఉండే లేటెన్సీ వినియోగదారుడికి రియల్ టైమ్ అనుభూతి ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం వేగం మాత్రమే కాకుండా స్థిరత్వం కూడా పెరిగిందని సూచిస్తున్నాయి. కాల్ డ్రాప్ రేటు 0%గా నమోదు కావడం నెట్‌వర్క్ విశ్వసనీయతకు నిదర్శనం.తెలంగాణలో 5జీ విస్తరణ గత రెండు సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. 2024లో ప్రారంభమైన సేవలు 2026 నాటికి ప్రధాన నగరాల్లో స్థిరపడ్డాయి. వరంగల్ వంటి టియర్-2 నగరాల్లో కూడా హైస్పీడ్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడం డిజిటల్ విస్తరణకు కీలక సూచనగా మారింది. ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థలు ఈ పరీక్షలను కొనసాగించడం వల్ల నెట్‌వర్క్ నాణ్యతపై కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. వినియోగదారుల కోసం ఇది ప్రయోజనకరం. భవిష్యత్తులో 5జీ ఆధారిత సేవలు పెరగడంతో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5జీ విస్తరణపై దృష్టి పెట్టింది. టెలికాం కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో నమోదైన ఈ ఫలితాలు ఒక నగరానికి మాత్రమే పరిమితం కావు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల దిశను సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరీక్షలు జరిగితే పోటీ మరింత స్పష్టమవుతుంది.

Advertisement
Advertisement
Advertisement