Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Union Bank of India Q3 FY2026 Results1
యూబీఐలో ఎన్‌పీఏలు తగ్గుముఖం

ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి.డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

latest Consumer Price Index data updates2
టోకు ధరల సూచీ అంటే? దీని ప్రాధాన్యం తెలుసా?

ఆహార, ఆహారేతర పదార్థాల రేట్ల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. డిసెంబర్‌లో 0.83 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. క్రితం రెండు నెలల్లో నెగటివ్‌గా ఉన్న ధరల పెరుగుదల తాజాగా పాజిటివ్‌లోకి వచి్చంది.టోకు ధరల సూచీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని (Inflation) కొలిచే అత్యంత కీలకమైన సాధనం. వినియోగదారుల వద్దకు చేరకముందే, అంటే టోకు మార్కెట్ లేదా తయారీదారుల స్థాయిలో వస్తువుల ధరల్లో వచ్చే మార్పులను ఇది ప్రతిబింబిస్తుంది.టోకు ధరల సూచీ ప్రాముఖ్యతఈ సూచీ ద్రవ్యోల్బణాన్ని ముందే పసిగట్టే ఒక సాధనం. తయారీదారులు లేదా టోకు వ్యాపారుల వద్ద వస్తువుల ధరలు పెరిగితే, కొద్ది రోజుల్లోనే ఆ ప్రభావం రిటైల్ (వినియోగదారుల) ధరల మీద పడుతుంది. దీనివల్ల ప్రభుత్వం, ప్రజలు భవిష్యత్తులో పెరగబోయే ధరలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.ప్రభుత్వ విధానాల రూపకల్పనదేశ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రభుత్వం తన ఆర్థిక (Fiscal), ద్రవ్య (Monetary) విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను సవరించడానికి డబ్ల్యూపీఐ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఏయే రంగాలలో ధరలు పెరుగుతున్నాయో గమనించి ఆయా ఉత్పత్తులపై సబ్సిడీలు ఇవ్వాలా లేదా దిగుమతి సుంకాలను తగ్గించాలా అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది.వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలువ్యాపారవేత్తలు తమ ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేయడానికి ఈ డేటాను ఉపయోగిస్తారు. ముడి పదార్థాల ధరలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం ద్వారా కంపెనీలు తమ వస్తువుల ధరలను నిర్ణయించుకుంటాయి. అలాగే, పెట్టుబడిదారులు మార్కెట్ ధోరణిని అర్థం చేసుకుని సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక గైడ్‌లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Building resilient subsea cables requires mix of redundant routes3
సబ్‌మెరిన్ కేబుల్స్‌కు కొత్త విధానం అవసరం

ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్‌మెరిన్ కేబుల్ నెట్‌వర్క్‌ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్‌కు చేరుకుంది. అయితే, ఈ నెట్‌వర్క్‌లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.భారత డిజిటల్ మౌలిక వసతులుభారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్‌మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్‌ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్‌గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్‌వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్‌వర్క్‌లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్‌ను ల్యాండ్ చేసుకోవచ్చు.సింగపూర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్?ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్‌ఎస్‌లతో సింగపూర్ తిరుగులేని హబ్‌గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్‌ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్‌సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

TG govt owes over 3900 cr unpaid dues to alcoholic beverage suppliers4
రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కంపెనీలకు మధ్య బకాయిల వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.3,900 కోట్లకు పైగా ఉన్న దీర్ఘకాలిక బకాయిలను చెల్లించాలని ప్రముఖ ఆల్కహాలిక్ బేవరేజ్ (అల్కోబెవ్) పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.ఏడాది కాలంగా నిధులు పెండింగ్‌తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ద్వారా మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.3,900 కోట్లు దాటిందని, ఇందులో రూ.900 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని సంఘాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం సరఫరా జరిగిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆ నిబంధన అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.రికార్డు స్థాయిలో ఆదాయంగడచిన పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది.2014 ఆదాయం: సుమారు రూ.9,000 కోట్లు.2023-24 ఆదాయం: దాదాపు రూ.38,000 కోట్లు (నాలుగు రెట్లు పెరుగుదల).అక్టోబర్ 2025: కేవలం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ.3,000 కోట్లు వసూలు చేసింది.డిసెంబర్ 2025: మద్యం విక్రయాల టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందనే అంచనాలున్నాయి.రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో మూడో వంతు వాటా ఈ రంగం నుంచే వస్తోంది. నెలకు సగటున రూ.2,300 నుంచి రూ.2,600 కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని సంఘాలు హెచ్చరించాయి.తగ్గుతున్న పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు గణాంకాలతో సహా వివరించాయి. టీజీ ఐపాస్‌ కింద వచ్చిన అనుమతుల రూపేణా గత ఏడాది వచ్చిన పెట్టుబడులు రూ.28,100 కోట్లు ఉండగా, 2024-25లో అవి రూ.13,730 కోట్లకు (సుమారు 50% పైగా తగ్గుదల) పడిపోయాయి. త్వరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) దావోస్ సదస్సులో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాత ఒప్పందాలను గౌరవించి బకాయిలు చెల్లిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరుగుతుందని సంఘాలు సూచించాయి.‘బకాయిల చెల్లింపులో ఆలస్యం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన 70,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

PMIS faltered with over allocated funds going unused5
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌.. నిధుల వినియోగంలో వైఫల్యం

దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో వెనుకబడుతోంది. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం నామమాత్రంగా ఉంటోంది. ఇందుకు అభ్యర్థుల నుంచి స్పందన తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.నిధుల వినియోగంలో భారీ వ్యత్యాసంకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.11,500 కోట్లు కేటాయించారు. అయితే, నవంబర్ 2025 వరకు చేసిన ఖర్చు కేవలం సుమారు రూ.500 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 4 శాతం మాత్రమే. ఇంకా మిగిలి ఉన్న నిధులు దాదాపు రూ.10,800 కోట్లు.గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. అప్పట్లో నిధుల వినియోగం లేకపోవడంతో బడ్జెట్‌ను రూ.2,667 కోట్ల నుంచి రూ.1,078 కోట్లకు తగ్గించగా అందులోనూ కేవలం రూ.680 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పథకం పట్ల యువతలో ఆసక్తి ఉన్నప్పటికీ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను స్వీకరించడంలో వారు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం తొలి దశ లేదా పైలట్ ప్రాజెక్ట్ పరిశీలిస్తే, మొత్తం 1.27 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు అభ్యర్థుల కోసం 82,000కు పైగా ఆఫర్లను జారీ చేశాయి. అయితే, వీటిలో కేవలం 28,000 మంది అభ్యర్థులు మాత్రమే ఆఫర్లను అంగీకరించారు. దీనివల్ల తొలి దశలో అంగీకార శాతం కేవలం 34 శాతానికే పరిమితమైంది.ఈ పథకం రెండో దశలో అభ్యర్థుల ఆసక్తి మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ దశలో 1.18 లక్షల అవకాశాలు లభ్యం కాగా, కంపెనీలు 83,000కు పైగా ఆఫర్లను ఇచ్చాయి. కానీ, అభ్యర్థుల నుంచి అంగీకారం లభించినవి 24,600 కంటే తక్కువగానే ఉన్నాయి. దీని ఫలితంగా రెండో దశలో అంగీకార రేటు 30 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే, నవంబర్ 30, 2025 నాటికి ఈ పథకం కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారి సంఖ్య కేవలం 2,066 మాత్రమే ఉండటం పథకం నత్తనడకను సూచిస్తోంది.కారణం ఏంటి?ఈ పథకం కింద ఇంటర్న్‌లకు నెలకు రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.6,000 గ్రాంట్, బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం చాలా స్వల్పమని, అందుకే యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చకపోతే బడ్జెట్‌లో కేటాయించిన భారీ నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Experts emphasize that 10-minute delivery branding quick commerce6
10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్‌పై ప్రభావమెంత?

ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ (Swiggy) వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ తమ బ్రాండింగ్ నుంచి ‘10 నిమిషాల డెలివరీ’ అనే విధానాన్ని తొలగించాయి. అయితే, ఈ మార్పు కేవలం బ్రాండింగ్‌కు మాత్రమే పరిమితమని, వారి వ్యాపార విధానంలో ఎలాంటి మార్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇటీవలి మార్పులు ఇవేబ్లింకిట్ తన యాప్‌లో ‘10-నిమిషాల’ టైమ్‌లైన్‌ను తొలగించి ‘30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే’ అనే కొత్త ట్యాగ్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే, వినియోగదారులకు తమ దగ్గరలోని డార్క్ స్టోర్(ఆన్‌లైన్ ఆర్డర్లను ప్యాక్ చేసి డెలివరీ చేసే కేంద్రాలు) దూరాన్ని చూపుతూ, తక్కువ దూరం వల్ల వేగంగా డెలివరీ సాధ్యమవుతుందని వివరిస్తోంది.జెప్టో తమ సైట్, యాప్‌లో ‘నిమిషాల్లో అన్నీ’ అని ట్యాగ్‌లైన్‌లో మార్పులు చేసింది.స్విగ్గీ కూడా తన క్విక్ కామర్స్ విభాగం నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్‌ను తొలగించింది.ప్రభుత్వ జోక్యం..ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డెలివరీ భాగస్వాముల భద్రత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ బ్రాండింగ్ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డెలివరీ రైడర్లు నిర్ణీత సమయానికి చేరుకోవాలనే ఒత్తిడికి గురికాకుండా చూడటమే ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంబిజినెస్ మోడల్‌లో మార్పు లేదు: నిపుణులుబ్రాండింగ్‌లో మార్పులు వచ్చినప్పటికీ, వినియోగదారులకు అందే సర్వీసుల్లో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి వివరాల ప్రకారం.. క్విక్ కామర్స్ సంస్థల డార్క్ స్టోర్లు ఇప్పటికే గిరాకీ ఉన్న ప్రాంతాలకు 10-15 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి డెలివరీ వేగంపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. డెలివరీ సమయం అనేది స్టోర్ దూరం, ట్రాఫిక్, వాతావరణం, రైడర్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ‘10 నిమిషాల్లో డెలివరీ’ అనేది ఒక మార్కెటింగ్ నినాదం మాత్రమే తప్ప, అది హామీ కాదు. ఈ విధానాన్ని తొలగించడం ద్వారా కంపెనీల బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Advertisement
Advertisement
Advertisement