Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BMW X6 M60i xDrive Launched in India at Rs 1 78 Crore1
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?

బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజన్, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 530 bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇది 4.3 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250కిమీ/గం. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కొంత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఎం షాడోలైన్ డీటైలింగ్‌తో కూడిన సన్నని అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వర్టికల్ డబుల్ స్లాట్‌లు వంటివి మాత్రమే కాకుండా.. ప్రకాశవంతమైన M లోగోతో కూడిన బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎమ్ ఎక్స్‌టీరియర్ మిర్రర్స్, ఎమ్ స్పెషల్ సైడ్ స్కర్ట్‌లను కలిగి ఉంది. వెనుక వైపు.. సన్నని ఎల్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ SUV రన్ ఫ్లాట్ టైర్లతో కూడిన 21 అంగుళాల ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.లోపలి భాగంలో.. ఒకే గ్లాస్ ప్యానెల్ కింద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సరికొత్త బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5తో పనిచేస్తుంది, ఇది బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా టచ్, వాయిస్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది.సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, క్రాష్ సెన్సార్లు, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి.

Have Gold Silver Prices Dropped Since PM Modi Austerity Appeal2
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్‌లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్‌పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది.

Renault Kwid Facelift To Launch In India On July 33
క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌.. లాంచ్ డేట్ ఫిక్స్!

రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన అప్‌డేటెడ్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్‌గా కొనసాగుతూ, దాని లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్‌లు ఫేస్‌లిఫ్ట్ క్విడ్ పూర్తిస్థాయి రీడిజైన్‌కు బదులుగా సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందుతుందని సూచిస్తున్నాయి. వెహికల్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, టెయిల్ ల్యాంప్‌ల చుట్టూ క్యామోఫ్లాజ్‌తో కనిపించాయి. కాబట్టి ఇది కీలకమైన విజువల్ ఎలిమెంట్స్‌లో అప్‌డేట్‌లను సూచిస్తుంది.అప్డేటెడ్ మోడల్‌లో కొత్త గ్రిల్, బంపర్‌లు, కొత్త లైటింగ్ అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ డిజైన్ డాసియా స్ప్రింగ్ ఈవీ నుంచి ప్రేరణ పొందవచ్చని, తద్వారా క్విడ్‌ను.. రెనాల్ట్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.లోపలి భాగంలో.. మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని చిన్న అప్‌డేట్‌లను పొందుతుందని సమాచారం. అధికారిక ఫీచర్ల జాబితా ఏదీ వెల్లడించనప్పటికీ, అప్‌డేటెడ్ మోడల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.ఇంజిన్ పరంగా.. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 65 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు, కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5 స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి ప్రత్యర్థులతో పోటీని కొనసాగించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!

Elon Musk Birthday A Journey from Startup to the World Richest Man4
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్‌లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్‌కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్‌లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్‌ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్‌ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్‌కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్‌ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు.

E100 Fuel Is It the Future Alternative to Petrol5
E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!

ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ100 (E100) ఇంధనానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో మన దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.E100 ఇంధనంఈ100 అనేది దాదాపు 100 శాతం ఎథనాల్‌తో తయారైన ఇంధనం. ఇందులో సాధారణ పెట్రోల్ ఉండదు. ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. దీనిని చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధనంతో వాహనం పనిచేయాలంటే.. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఉండాలి.ఈ100 ఇంధనం వల్ల లాభాలు➤విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.➤దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది.➤రైతులకు చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.➤గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.➤దేశానికి ఇంధన భద్రత మెరుగుపడుతుంది.#WATCH | Nagpur, Maharashtra: Union Minister Nitin Gadkari says, “Last night at 8 PM, I signed the file, finalising the regulations to legally authorise the use of 100% ethanol. I am delighted to share that I, along with Hardeep Singh Puri, had the opportunity to launch the 100%… pic.twitter.com/BDIyTZGZF4— ANI (@ANI) June 13, 2026ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం వల్ల ఇప్పటికే రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ చమురు దిగుమతి వ్యయం ఆదా కాగా, రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.E100 ఇంధనం పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేయగలదా?భవిష్యత్తులో E100 పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అది వెంటనే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కోట్లాది కార్లు, బైకులు, స్కూటర్లు ఈ100 ఇంధనాన్ని ఉపయోగించుకునే విధంగా తయారవ్వలేదు. కొన్ని ఈ20 ఇంధనం మాత్రమే ఉపయోగించుకోగలవు. కాబట్టి కొంతకాలం పాటు పెట్రోల్, E100 రెండూ కలిసి ఉపయోగంలో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ E100 వినియోగం కూడా పెరుగుతుంది.E100 ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల వాహనాల్లో ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం. కొత్త ఇంజెక్టర్లు, బలమైన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ పైపులు, ఇథనాల్‌ను తట్టుకునే భాగాలు అవసరం.ఇప్పటికే మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ నమూనాను అభివృద్ధి చేసింది. అలాగే టయోటా, ఎంజీ, హ్యుందాయ్, సుజుకి సంస్థలు కూడా ఇలాంటి వాహనాలను తయారు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.E100 ఇంధనం వల్ల వచ్చే సమస్యలు➤ఇథనాల్‌ శక్తి.. పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ. కాబట్టి అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.➤ప్రస్తుతం ఉన్న సాధారణ వాహనాల్లో ఈ100 ఉపయోగించలేము. ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే అవసరం.➤దేశవ్యాప్తంగా ఈ100 అందించాలంటే పెట్రోల్ బంకుల్లో కొత్త నిల్వ ట్యాంకులు, పంపులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు➤దేశమంతటా ఈ100 అందించే ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.➤ఎక్కువ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలి.➤ఇథనాల్ ఉత్పత్తిని స్థిరంగా పెంచుతూ వ్యవసాయ అవసరాలకు కూడా నష్టం కలగకుండా చూడాలి.➤ప్రజల్లో ఈ100 ఇంధనం గురించి అవగాహన పెంచాలి.భారతదేశం తన అవసరాలకు కావలసిన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇథనాల్ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తోంది.

Financial Changes From July 1, 2026 Aadhaar Credit Cards Passport Fees ITR Deadlines6
ఆధార్‌, క్రెడిట్‌ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు

వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్‌కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్‌లకే వర్తిస్తుంది.ఎస్‌బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్‌డీఎఫ్‌సీ లాంజ్ యాక్సెస్‌హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్‌పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్‌కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్‌తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి.

Advertisement
Advertisement
Advertisement