Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chinese spy robot patrolling near India China border see video1
భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. సైనిక వ్యూహాలకు టెక్నాలజీ ఆయుధంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, రోబోల దండుతో ‘మెటల్ వర్సెస్ ఫ్లెష్’ (యంత్రాలు vs మనుషులు) జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చైనా-భారత్ సరిహద్దు వంటి ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ నిఘా గురించిన ఆందోళనలను పెంచుతూ ఈ వీడియో సంచలనం సృష్టించింది. చాలా దేశాలు ఇప్పటికే తమ సైనిక వ్యూహాల్లో కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్‌లు, ఆటోనమస్ వెహికల్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన భవిష్యత్ పోరుకు ఒక సంకేతంగా నిలుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వైరల్ క్లిప్‌లో ఏముంది?ఎత్తైన ప్రాంతంలో షూట్‌ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో చైనా-భారత్‌ సరిహద్దు జోన్‌లో ఒంటరిగా నిలబడి ఉన్న హ్యూమనాయిడ్ రోబో లాంటి ఆకారాన్ని చూడవచ్చు. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదో ఫంక్షనల్ రోబోట్ అని, భారత దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.India🇮🇳 just filmed this: Chinese🇨🇳 humanoid killer robots now patrolling the border. The age of flesh-vs-metal war begins.Who still wants to send sons to the frontline in 2030? https://t.co/zM3Gy7mYJ9 pic.twitter.com/UAB5L4N6gp— PLA_Overwhelm (@junshiguancha) December 2, 2025సోషల్ మీడియా స్పందనఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్‌లు, వేల సంఖ్యలో రీపోస్ట్‌ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ ‘టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దుకు వచ్చేసింది’ అని, మరికొందరు ‘మోదీగారు చిట్టి 2.0 పంపండి’ అని కామెంట్లు చేశారు.చైనా వ్యూహంలో రోబోటిక్ విప్లవంఈ క్లిప్ ఇంతగా వైరల్‌ అయ్యేందుకు ప్రధాన కారణం అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా సాధనాల వాడకం, హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో చైనా వేగవంతంగా పురోగతి చెందుంతుండడంతో రోబో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశ సరిహద్దుల్లో మానవ గస్తీని తగ్గించి అక్కడ పర్యవేక్షణను పెంచడానికి చైనా ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. చైనా ఇప్పటికే టిబెట్‌లో రోబో డాగ్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా, తైవాన్ సరిహద్దు సమీపంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించాలని యోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇది భారత్-చైనా సరిహద్దులో కూడా ఇలాంటివి వచ్చే అవకాశంపై ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..

Rupee Depreciation Causes and Consequence2
రూపాయి తగ్గితే ఏమౌతుంది?

భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయి రూ.90 మార్క్‌ను దాటి 90.02 వద్ద ముగిసింది. బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేయడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం వంటివి రూపాయి పతనానికి కారణాలుగా నిలుస్తున్నప్పటికీ రూపాయి విలువ తగ్గడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఈ కథనంలో చూద్దాం..దిగుమతులు ఖరీదవుతాయి క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.ద్రవ్యోల్బణం పెరిగే అవకాశందిగుమతులు ఖరీదవడం వల్ల, ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి. దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి.ప్రయాణ ఖర్చులు పెరుగుతాయివిదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది.ఇంధనం ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిభారత్ మొత్తం క్రూడ్ ఆయిల్‌లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ ధర పెరగడంతో రవాణా, తయారీ, వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి.విదేశీ రుణాల వ్యయం పెరుగుతుందిసంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగి, ఆర్థిక భారంగా మారుతాయి.విదేశీ పెట్టుబడులపై ప్రభావంరూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు గురవుతాయి.పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావంఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే, గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గవచ్చు.ఎగుమతిదారులకు కొంత లాభంరూపాయి బలహీనపడితే, భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి.టెక్స్‌టైల్, ఐటీ సేవలు, ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం.

Over half of NSE companies employ under 10pc women3
లిస్టెడ్‌ కంపెనీల్లో అంతా మిస్టర్‌లేనా!

కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్‌ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్‌బోర్డ్‌ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్‌ఎస్‌ఆర్‌), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్‌ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్‌ తెలిపారు. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్‌ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు. మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్‌టైల్స్‌ (30.4 శాతం), డైవర్సిఫైడ్‌ (28.5 శాతం), మెటల్స్‌ .. మైనింగ్‌ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్‌లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ (7 శాతం) ఉన్నాయి. లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్‌హెచ్‌) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్‌ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది. ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్‌ప్లేస్‌ డిజైన్‌ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్‌ కోడ్‌ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్‌ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

Indian rupee hits record low4
రూపాయి టపా.. భారీగా పడిపోయిన భారత కరెన్సీ

భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేనంతగా రూ.90 స్థాయిని దాటింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్ లో 6 పైసలు పడిపోయి 90.02 వద్ద ముగిసింది.బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేస్తూనే ఉండటంతోపాటు కరెన్సీలో మరింత బలహీనపడేలోపు బయటపడేందుకు కంపెనీల హడావిడి మధ్య విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం రూపాయి ఈ స్థాయిలో పతనం కావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

Govt to divest 6pc stake in Bank of Maharashtra5
ప్రభుత్వ బ్యాంకులో వాటా విక్రయం

పీఎస్‌యూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)లో ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించనుంది. మంగళవారం(2న) ప్రారంభమైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)కు భారీ డిమాండ్‌ కనిపించిన నేపథ్యంలో గ్రీన్‌ షూ ఆప్షన్‌కింద ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు ఫ్లోర్‌ ధర షేరుకి రూ. 54కాగా.. సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైన ఆఫర్‌ డిసెంబర్‌ 3న రిటైలర్లకు అందుబాటులోకి రానుంది.ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రభుత్వం బ్యాంక్‌లో తొలుత 5 % వాటాకు సమానమైన 38,454,77,748 షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే ఆఫర్‌ తొలి రోజునే 400 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. దీంతో మరో 7,69,15,549 షేర్లను(1 శాతం వాటా) సైతం అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా దీపమ్‌ కార్యదర్శి అరునిష్‌ చావ్లా వెల్లడించారు. వెరసి ప్రభుత్వం 6 శాతం వాటాకు సమానమైన 46.14 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. రూ. 2,492 కోట్లు ఫ్లోర్‌ ధర ప్రకారం బీవోఎంలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,492 కోట్లు అందనుంది. సోమవారం ముగింపు ధర రూ. 57.66తో పోలిస్తే 6.3% డిస్కౌంట్‌లో ఫ్లోర్‌ ధరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 79.6% వాటా ఉంది. తాజా వాటా విక్రయం ద్వారా బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 75% దిగువకు దిగిరావడంతోపాటు.. పబ్లిక్‌కు కనీసం 25% వాటా నిబంధన అమలుకు వీలు చిక్కనుంది. కాగా.. మరో 4 పీఎస్‌యూ బ్యాంకులలో సైతం ప్రభుత్వం గడువులోగా మైనారిటీ వాటాను పబ్లిక్‌కు ఆఫర్‌ చేయవలసి ఉంది. ఈ జాబితాలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌( ప్రభుత్వ వాటా 94.6 శాతం), పంజాబ్‌– సింద్‌ బ్యాంక్‌(93.9 శాతం), యుకో బ్యాంక్‌(91 శాతం), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(89.3 శాతం) చేరాయి.

Gold and Silver rates on 3rd December 2025 in Telugu states6
సిల్వర్‌ షాక్‌.. బంగారం ధరలు ఒక్క రోజులోనే రివర్స్‌..

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. క్రితం రోజున కాస్త ఉపశమనం ఇచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలలో మార్పలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు అమాంతం దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
Advertisement