Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Brad Smith Microsoft President vocal AI developed and deployed responsibly1
ఏఐతో ముప్పేమీ లేదు

కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్‌ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ స్మిత్‌ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్‌గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్‌ లక్ష్యమని ఆయన చెప్పారు.పదే పదే పునరావృతమయ్యే కోడింగ్‌ పనులను మాత్రమే ఏఐ టేకోవర్‌ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్‌ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్‌ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్‌ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్‌ వివరించారు.ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్‌ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత

RBI bulletin highlights a strong outlook for private sector investment2
ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత

జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. 2026–27 బడ్జెట్‌లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది.రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్‌ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్‌బీఐ బులెటిన్‌ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 4 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే

latest SEBI IPO approvals check list3
4 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే

రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా 4 కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇకపైనా ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..తాజాగా నాలుగు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. వెరసి గతేడాది(2025) బాటలో కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగనుంది. జాబితాలో ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్, అంజలీ ల్యాబ్‌టెక్, ఏపీపీఎల్‌ కంటెయినర్స్, ఆలై్పన్‌ టెక్స్‌వరల్డ్‌ చోటు చేసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌లో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. ఐపీవో ద్వారా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. మెడికల్‌ టెక్నాలజీపీఈ దిగ్గజం ఎవర్‌స్టోన్‌ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న మెడికల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ ఇంటెగ్రిస్‌ మెడ్‌టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 925 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 2.16 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా కంపెనీ సుమారు రూ. 3,500–4,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా కార్డియాక్‌ స్టెంట్ల తయారీ, పంపిణీ నిర్వహిస్తోంది. కార్డియోవాసు్కలర్‌ పరికరాలతోపాటు.. క్లినికల్‌ డయాగ్నోస్టిక్స్, సైంటిఫిక్‌ ల్యా»ొరేటరీ సొల్యూషన్స్‌ అందిస్తోంది. లిస్టింగ్‌లో కంపెనీ రూ. 11,000–13,000 కోట్ల విలువను ఆశిస్తోంది. కంటెయినర్‌ బిజినెస్‌పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనున్న కంటెయినర్ల తయారీ కంపెనీ ఏపీపీఎల్‌ కంటెయినర్స్‌ కొత్తగా 12.5 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు సైతం 25.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంటెయినర్ల తయారీలో ఉన్న కంపెనీ 2025–26లో వీటి లీజింగ్‌ సర్వీసుల్లోకి సైతం ప్రవేశించింది. తద్వారా వివిధ క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన సరీ్వసులు సమకూర్చుతోంది.వీవింగ్, స్పిన్నింగ్‌టెక్స్‌టైల్స్‌ తయారీలో సమీకృత కార్యకలాపాలుగల గుజరాత్‌ కంపెనీ అల్పైన్‌ టెక్స్‌వరల్డ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా నేత(వీవింగ్‌), స్పిన్నింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్‌లో కొత్త వీవింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. తద్వారా గ్రే ఫ్యాబ్రిక్‌ తయారీకి వీలుగా ఉత్పత్తిని విస్తరించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.కృత్రిమ వజ్రాల తయారీస్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ల్యాబొరేటరీ వజ్రాల తయారీ కంపెనీ అంజలీ ల్యాబ్‌టెక్‌ 2025 అక్టోబర్‌లో సెబీకి గోప్యతా మార్గంలో దరఖాస్తు చేసింది. తాజాగా అనుమతి పొందింది. కంపెనీ ప్రధానంగా ల్యాబ్‌ డైమండ్లుసహా.. ల్యాబ్‌ డైమండ్‌ ఆభరణాలు, మైక్రోవేవ్‌ ప్లాస్మా సీవీడీ సిస్టమ్‌ తదితరాలను రూపొందిస్తోంది.ఓమ్నిటెక్‌ ఇంజినీరింగ్‌ @ రూ.216–227హైప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాల తయారీ కంపెనీ ఓమ్నిటెక్‌ ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 216–227 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 418 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్‌ ఉదయ్‌కుమార్‌ అరుణ్‌కుమార్‌ పరేఖ్‌ రూ. 165 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 583 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 24న షేర్లను ఆఫర్‌ చేయనుంది. మార్చి 5న లిస్ట్‌కానున్న కంపెనీ విలువ రూ. 2,800 కోట్లుగా నమోదయ్యే అవకాశముంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఎనర్జీ, ఆటోమేషన్, ఇండస్ట్రియల్‌ ఎక్విప్‌మెంట్‌ సిస్టమ్స్‌ తదితర రంగాల కస్టమర్లకు హైప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాలను రూపొందిస్తోంది. ఈ విభాగంలో ఆజాద్‌ ఇంజినీరింగ్, యూనిమెక్‌ ఏరోస్పేస్, డైనమాటిక్‌ టెక్నాలజీస్, ఎంటార్‌ టెక్నాలజీస్‌ తదితరాలతో పోటీ పడవలసి ఉంటుంది.

Sensex, Nifty Open Higher After Trump Tariffs Scrapped By US Supreme Court4
మార్కెట్‌కు ‘యూఎస్‌ సుప్రీం’ జోష్‌

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్‌లు) చెల్లవంటూ యూఎస్‌ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్‌ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ 1.4%, సరీ్వసెస్‌ 0.97%, హెల్త్‌కేర్‌ 0.89%, విద్యుత్‌ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ 0.65%, ఎఫ్‌ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41% లాభపడగా, మిడ్‌క్యాప్‌ సూచీ 1.56% నష్టపోయింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు డీలాహరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్‌ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది.

Medicover Hospitals signs agreement with Evergreen Healthcare5
మెడికవర్‌ ఎయిర్‌ అంబులెన్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా, అంతర్జాతీయంగా పేషంట్ల బదిలీ కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ సరీ్వసులను అందుబాటులోకి తెచ్చేలా ఎవర్‌గ్రీన్‌ హెల్త్‌కేర్‌తో మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో కొత్త ఆసుపత్రిని ఇంకా అధికారికంగా ప్రారంభించేలోపే ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల, తొలి రోజు నుంచే ఎమర్జెన్సీ సమయాల్లో మరింత మెరుగ్గా స్పందించేందుకు వీలవుతుందని సంస్థ తెలిపింది. ప్రతి క్షణం విలువైనదిగా ఉండే క్రిటికల్‌ కేసుల్లో ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని హెడ్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ నయన్‌ శ్రీరాముల తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటులాంటి క్రిటికల్‌ సందర్భాల్లో పేషంట్లను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరగడమనేది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.

Telangana orders 1,085 Olectra e-buses says TGSRTC6
ఒలెక్ట్రాకు 1,085 బస్సుల భారీ ఆర్డరు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పీఎం ఈ–డ్రైవ్‌ కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డరు వచి్చనట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి తమ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ద్వారఫ్లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ లభించినట్లు వివరించింది. ఎలక్ట్రిక్‌ బస్సులను హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం వినియోగించనున్నట్లు సంస్థ ఎండీ మహేష్‌బాబు తెలిపారు. ఇక్కడి రహదారులకు అనుగుణంగా ఏసీ, నాన్‌ ఏసీ వేరియంట్లలో 12 మీటర్ల లో–ఫ్లోర్‌ కాని్ఫగరేషన్స్‌తో ఈ బస్సులను అందించనున్నట్లు వివరించారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కి.మీ. మైలేజీనిచ్చే విధంగా ఇవి ఉంటాయని, సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్‌ చేసేందుకు వీలుంటుందని మహేష్‌బాబు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి చెందిన 3,600 ఎలక్ట్రిక్‌ బస్సులు దేశవ్యాప్తంగా రహదారులపై తిరుగుతుండగా, 10,000 పైగా వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement