ప్రధాన వార్తలు
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.A Year of Connectivity, SortedChoose BSNL ₹2799 Annual Plan, get- 3GB data/day, Unlimited calls, 100 SMS/day for 365 days validity. Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNL #BSNLAnnualPlan #BSNL2799 #StayConnected pic.twitter.com/80JMv67IaH— BSNL India (@BSNLCorporate) February 12, 2026రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్!
జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్హెచ్ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్హెచ్ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్తో సహా వివరాలతో అప్లోడ్ చేయాలి.సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్కు రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.Report & Get Rewarded!To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్ల నెట్వర్క్ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది.
బ్యాంక్లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహించనుంది.2016 నుంచి ఆర్బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్ ప్రాధాన్యాన్ని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
కార్పొరేట్
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో ఎన్టీటీ డేటా జట్టు
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
బ్యాంక్లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
పోలియో నిర్మూలనకు బీఈ వ్యాక్సిన్
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
పీఎల్ఐ పథకానికి 55 కంపెనీలు సై..
సెబీ చైర్మన్ కీలక ప్రకటన.. ఎస్ఎంఈల్లో..
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) అభివ...
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసా...
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
పసిడి ప్రియులకు బంగారం లాంటి న్యూస్. దేశంలో బంగార...
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్ల...
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక ...
EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!
ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ...
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!
కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్లోని లోపాలను మాన్యువల్గా టెస్టింగ్లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్లతో సంభాషిస్తూ అవుట్పుట్ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్టీఎం లిమిటెడ్ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్.. లార్సెన్ & టుబ్రో గ్రూప్కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్అండ్టీఐ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట
పర్సనల్ ఫైనాన్స్
రాధికాగుప్తాను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఇవే..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, అనిశ్చితి నేపథ్యంలో ఏ ఫండ్ను ఎంచుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే గందరగోళం పెట్టుబడిదారుల్లో పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా పెట్టుబడిదారులకు దిశానిర్దేశం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవలి కాలంలో ‘నా దగ్గర రూ.30,000 ఉన్నాయి. వెండి కొనాలా? ఏ ఫండ్ తీసుకోవాలి?’ వంటి ప్రశ్నలు తనను ఎక్కువగా అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. తక్షణ పరిష్కారాల కోసం వెతకడం కంటే సరైన పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.ప్రాథమిక అవగాహన ముఖ్యంచాలామంది ఫైనాన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే నేరుగా ఫండ్స్ కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. దీన్ని ఆమె ‘శ్వాస తీసుకోవడం నేర్చుకోకముందే డైవింగ్ చేయడం’తో పోల్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక అంశాలపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలని, దీనికోసం తన పుస్తకం ‘మ్యాంగో మిలియనీర్’ ఎంతో దోహదపడుతుందని సూచించారు.ఆర్థిక స్థితిగతులపై స్పష్టతపెట్టుబడి పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక వాస్తవాలను డాక్యుమెంట్ చేసుకోవాలి.మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు ఎంత?ప్రస్తుత పెట్టుబడులు, అప్పులు ఏమిటి?మీ ఆర్థిక లక్ష్యాలు, వాటి కాలపరిమితి ఎంత?స్వల్పకాలికంగా నష్టాలు వస్తే భరించే శక్తి ఉందా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటేనే బలమైన పునాది ఏర్పడుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు.నిపుణుల సలహా తీసుకోవడంమ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు లేదా క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాలని ఆమె కోరారు. పైన పేర్కొన్న ఆర్థిక స్పష్టతతో నిపుణులను కలిసినప్పుడు వారు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్రణాళికను రూపొందించగలరు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకటి కంటే ఎక్కువ మంది నిపుణులతో మాట్లాడటంలో తప్పు లేదని ఆమె అన్నారు."I have 30,000 to invest, should I buy silver? What fund do I buy?"I am seeing a lot more friends, family, and folks in general reach out for advice on their portfolio in the last few months. It is probably because volatility is so high across asset classes, returns over the…— Radhika Gupta (@iRadhikaGupta) February 9, 2026తొందరపాటు నిర్ణయాలు వద్దుపెట్టుబడి ప్రయాణం ప్రారంభంలోనే డైరెక్ట్ స్టాక్స్, వెండి, లేదా సంక్లిష్టమైన పీఎంఎస్(ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్) ఉత్పత్తుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. మార్కెట్పై అవగాహన పెరిగే వరకు వీటి కోసం వేచి చూడటం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.తప్పుల నుంచి నేర్చుకోండి‘ఇప్పుడే మొదలుపెట్టే వారు వెంటనే పని ప్రారంభించండి. తప్పులు చేసిన వారు కాసేపు విశ్రాంతి తీసుకోండి’ అని ఆమె సరళంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఎంతోమంది మేధావులు తప్పులు చేశారని గుర్తు చేస్తూ పెట్టుబడి ప్రయాణంలో తప్పులు సహజమని పేర్కొన్నారు. మార్కెట్ దిద్దుబాట్లు అనేవి బోర్డు పరీక్షల వంటివని, అవి మనకు క్రమశిక్షణ, సహనం నేర్పుతాయని ఆమె విశ్లేషించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీములు
ముంబై: కోటక్ మహింద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కోటక్ సర్వీసెస్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.360 వన్ ఎంఎఫ్ నుంచి సిఫ్ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్ మ్యుచువల్ ఫండ్ తాజాగా డైనాసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా 25 శాతం వరకు షార్ట్ ఎక్స్పోజర్ తీసుకునేందుకు, డెట్ అలాగే ఇని్వట్స్లో 20 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యుచువల్ ఫండ్స్ పరమైన ట్యాక్సేషన్ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్ ఉంటుందని 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. డీఎస్పీ మల్టీ అసెట్ ఆమ్ని ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ సంస్థ మల్టీ అసెట్ ఆమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ డీఎస్పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్ ఆధారిత స్కీములు, గోల్డ్..సిల్వర్ ఈటీఎఫ్ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్–సిల్వర్ ఈటీఎఫ్లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్ హెడ్ సాహిల్ కపూర్ తెలిపారు.
పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు
పిల్లల భవిష్యత్ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్కిడ్ 360 ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్కం బెనిఫిట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్ పొందే వీలుంది. బజాజ్ జనరల్ ఫీటల్ ఫ్లరిష్ ఆరోగ్య బీమా గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్ ఫ్లరిష్’ పేరిట బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఇన్సూరెన్స్ రైడర్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అధునాతన ఇన్–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్ కేర్ ప్లాన్’, ‘హెల్త్ గార్డ్’ పథకాలతో కలిపి ఈ రైడర్ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది.
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026


