Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CEA V Anantha Nageswaran predicts India FY26 growth to exceed 6. 8percent1
వృద్ధి 6.8 శాతానికి చేరుకోవచ్చు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల కోత, ఆదాయపన్ను మినహాయింపులతో పెరిగే వినియోగం వృద్ధికి ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం 6.8 శాతం వృద్ధి రేటు విషయంలో సౌకర్యంగా ఉన్నాను. వాస్తవానికి 2025–26 సంవత్సరానికి సంబంధించి నా అంచనా 6.3–6.8 శాతం (ఆర్థిక సర్వే ప్రకారం). కనీసం 6–7 శాతం శ్రేణిలో కనిష్ట స్థాయికి వెళతామేమోనన్న ఆందోళన ఆగస్ట్‌లో వ్యక్తమైంది. ఇప్పుడు ఇది 6.5 శాతం, అంతకుమించి 6.8 శాతానికి కూడా చేరుకోవచ్చని సౌకర్యంగా చెబుతున్నాను. 7 శాతం వృద్ధి రేటు అంచనాలను వ్యక్తీకరించాలంటే, రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు వచ్చే వరకు ఆగాల్సిందే’’అని నాగేశ్వరన్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. 2025–26 జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. దీనికంటే ముందు 2024 జనవరి–మార్చి త్రైమాసికంలో 8.4 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, 5.2 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. అమెరికాతో ఒప్పందం సానుకూలం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే దేశ వృద్ధి రేటు మరింత వేగాన్ని అందుకుంటుందని నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ ఒప్పందం సాకారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం విషయంలో పరిష్కారం పట్ల ఇప్పటికీ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. నవంబర్‌ నాటికి తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడం గమనార్హం.

India needs more financial reforms to hit 30 trilion dollers goal, says World Bank2
మరిన్ని సంస్కరణలు అవసరం

న్యూఢిల్లీ: భారత్‌ 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సంస్కరణలకు మరింత ప్రేరణనివ్వాలని, ప్రైవేటు మూలధన నిధుల సమీకరణకు ఊతమివ్వాలని ప్రపంచ బ్యాంక్‌ సూచించింది. ప్రపంచ స్థాయి డిజిటల్‌ ప్రజా సదుపాయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసినట్టు తాజా నివేదిక (ఆర్థిక రంగ మదింపు/ఎఫ్‌ఎస్‌ఏ) లో పేర్కొంది. ఇకపై మహిళలు తమ బ్యాంక్‌ ఖాతాలను మరింతగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యక్తులు, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధితో కలసి ప్రపంచ బ్యాంక్‌ దేశాల ఆర్థిక రంగాన్ని లోతుగా, సమగ్రంగా విశ్లేíÙంచి ఎఫ్‌ఎస్‌ఏ నివేదికను విడుదల చేస్తుంటుంది. ఈ నివేదికను ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా, వైవిధ్యంగా, సమ్మిళితంగా మారినట్టు ప్రపంచ బ్యాంక్‌ ఎఫ్‌ఎస్‌ఏ నివేదిక తెలిపింది. ఆర్థిక రంగ సంస్కరణల ఫలితంగా భారత్‌ కరోనా సహా పలు సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగలిగినట్టు పేర్కొంది. 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా మరిన్ని ఆర్థిక రంగ సంస్కరణలతో ప్రైవేటు మూలధన పెట్టుబడులకు ఊతమివ్వాలని సూచించింది. మెరుగైన నియంత్రణలు.. సహకార బ్యాంకులకు సైతం నియంత్రణలను విస్తరించడం వాటి సమర్థతను పెంచుతుందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలకు వాటి స్థాయిల ఆధారంగా నియంత్రణలను అమలు చేయడాన్ని సైతం ఆహ్వానించింది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి మరింత మెరుగైన పర్యవేక్షణకు వీలుగా క్రెడిట్‌ రిస్క్‌ నిర్వహణ కార్యాచరణను బలోపేతం చేయాలని సూచించింది. 2017లో చివరి ఎఫ్‌ఎస్‌ఏ నివేదిక నుంచి చూస్తే భారత జీడీపీలో క్యాపిటల్‌ మార్కెట్ల పరిమాణం 144 శాతం నుంచి 175 శాతానికి విస్తరించినట్టు తెలిపింది.

Three Indian banks to be among global top-10 lenders by 20303
ప్రపంచ టాప్‌ 10లో 3 భారతీయ బ్యాంకులు!

ముంబై: మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా 2030 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 బ్యాంకుల్లో మూడు భారతీయ బ్యాంకులు ఉంటాయని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి చెప్పారు. ప్రభుత్వ రంగ దిగ్గజమైన తమ బ్యాంకుతో పాటు మరో రెండు ప్రైవేట్‌ బ్యాంకులు వీటిలో ఉంటాయని వివరించారు. ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ 100 బిలియన్‌ డాలర్ల స్థాయిని తాకిందని, అలాగే ప్రైవేట్‌ రంగంలోనూ మరో రెండు బ్యాంకుల వేల్యుయేషన్‌ భారీ స్థాయిలో ఉందని చెప్పారు. నిర్దిష్టంగా పేర్లు ప్రస్తావించనప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ని ఉద్దేశించి శెట్టి ఈ విషయం చెప్పారని భావిస్తున్నారు. కన్సాలిడేషన్‌ ద్వారా భారీ బ్యాంకులను సృష్టించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాపార పరిమాణంపరంగా ఎస్‌బీఐ ప్రస్తుతం అంతర్జాతీయంగా 43వ స్థానంలో ఉంది. ఎస్‌బీఐలో చేరేందుకు ఇంజినీర్‌ గ్రాడ్యుయేట్లు బాగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సిబ్బందికి టెక్నాలజీ శిక్షణకు వెచి్చంచే సమయం గణనీయంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. అందుకే నిబంధనలు సరళతరం: ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అప్రమత్తంగా ముందుకెళ్తూనే, కొంత సాహసోపేతంగా వ్యవహరించాల్సిన అవసరం నెలకొన్నందునే బ్యాంకింగ్‌ నిబంధనలను సరళతరం చేసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించడం ఆర్‌బీఐ ఉద్దేశం కాదన్నారు. పనితీరు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకోవడం వల్లే బ్యాంకులకు మరింతగా బాధ్యతలను అప్పగిస్తున్నట్లు మల్హోత్రా చెప్పారు. తప్పుగా వ్యవహరిస్తే కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ దగ్గర అనేక సాధనాలు ఉన్నాయన్నారు. స్వల్పకాలిక వృద్ధి వెనుక పరుగులు తీస్తూ ఆరి్థక స్థిరత్వం విషయంలో రాజీ పడితే, దీర్ఘకాలిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రెగ్యులేటర్‌ పాత్రనేది తోటమాలిలాగా ఉంటుందని ఆయన అభివరి్ణంచారు. మొక్కల (బ్యాంకింగ్‌ వ్యవస్థ) పెరుగుదలను పర్యవేక్షిస్తూనే, అనవసరమైన వాటిని కత్తిరిస్తూ, ఉద్యానవనం ఒక పద్ధతిగా, అందంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సెంట్రల్‌ బ్యాంకుపై ఉంటుందని మల్హోత్రా పేర్కొన్నారు. డిజిటల్‌ మోసాలు పెరిగాయ్‌ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి. రవిశంకర్‌ ఈ ఏడాది జూలై వరకు కొంత నెమ్మదించిన డిజిటల్‌ మోసాలు, ఆ తర్వాత నుంచి గణనీయంగా పెరుగుతున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి. రవిశంకర్‌ తెలిపారు. బహుశా సీజనల్‌ లేదా ఇతరత్రా అంశాలేవైనా ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా మోసాల పెరుగుదల వెనుక కారణాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందన్నారు. ఫ్రాడ్‌ ద్వారా వచ్చే డబ్బును మళ్లించేందుకు ఉపయోగిస్తున్న అకౌంట్లను గుర్తించేందుకు మ్యూల్‌ హంటర్‌లాంటి డిజిటల్‌ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తోందని రవిశంకర్‌ వివరించారు. మరోవైపు, చెల్లింపుల వ్యవస్థ విషయానికొస్తే కొన్ని పరిమితులరీత్యా యూపీఐ సామర్థ్యాలను బ్యాంకులు అంచనా వేయలేకపోయాయని, కానీ ఫిన్‌టెక్‌ సంస్థలు మాత్రం అవకాశాలను అందిపుచ్చుకున్నాయని చెప్పారు.

Useful Apps For Photography4
యస్‌...ఈ యాప్‌లు మీకు ఉపయోగపడతాయ్!

స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత పెరగడం, సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో శక్తిమంతమైన, ప్రొఫెషనల్‌ గ్రేడ్‌ ఎడిటింగ్‌ సామర్థ్యం ఉన్న ఫ్రీ ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. సెల్ఫీని పాలిష్‌ చేయడం నుంచి బ్రాండెడ్‌ పోస్ట్‌ను రూపొందించడం వరకు ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లో రెండింటిలోనూ అందుబాటులో ఉన్న రెండు యాప్‌ల గురించి..స్నాప్‌స్పీడ్‌: గూగుల్‌ డెవలప్‌ చేసిన స్నాప్‌స్పీడ్‌ నిపుణులు, ప్రారంభకులు ఇద్దరికీ అనువైన ఎడిటింగ్‌ సాధనాలు అందిస్తుంది. జెపీఈజీ, రా ఫార్మట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. నాన్‌–డిస్ట్రక్టివ్‌ ఎడిటింగ్‌ను అందిస్తుంది. నాణ్యత కోల్పోకుండా ఫొటోలను చక్కగా ట్యూన్‌ చేసేలా ఉపయోగపడుతుంది.పిక్స్‌ఆర్ట్‌: ఫొటో ఎడిటర్‌ పిక్స్‌ఆర్ట్‌ కొల్లెజ్‌ మేకర్, డ్రాయింగ్‌ టూల్‌లను మిళితం చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ తొలగించడం, రీప్లేస్‌మెంట్‌ చేయడానికి సంబంధించి దీని ఏఐ–పవర్డ్‌ టూల్స్‌ ఉపయోగపడతాయి. ఆర్టిస్టిక్‌ ఎఫెక్ట్స్‌ (ఉదా: పాపులర్‌ కార్టూన్‌ లుక్‌), కొల్లెజ్‌ లేఔట్‌. వివిధ రకాల ఫాంట్‌లతో టెక్ట్స్‌ ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఫన్, బోల్డ్, షేరబుల్‌ ఎడిట్స్‌ను కోరుకునే వారికి ఈ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది.

Do You Know About Vibe Coding And Check The Details Here5
ఏమిటి ఈ వైబ్‌కోడింగ్‌.. ఉపయోగాలేమిటి?

ఇటీవలి కాలంలో ‘వైబ్‌కోడింగ్‌’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్‌ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ఓపెన్‌ ఏఐ కోఫౌండర్‌ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్‌కోడింగ్‌’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్‌ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్‌కోడింగ్‌’ చేస్తున్నారు.ఇంతకీ ఏమిటి ఈ వైబ్‌కోడింగ్‌? సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడానికి చాట్‌బాట్‌ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్‌కోడింగ్‌. ఇందులో డెవలపర్‌ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌(ఎల్‌ఎల్‌ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్‌ను జనరేట్‌ చేస్తుంది. అయితే డెవలపర్‌ కోడ్‌ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్‌ఎల్‌ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్‌ ప్రోగ్రామర్స్ కూడా వైబ్‌కోడింగ్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ జర్నలిస్ట్‌ కెవిన్‌ రూస్‌ ‘వైబ్‌కోడింగ్‌’ మెథడ్‌ను ఉపయోగించి ఎన్నో స్మాల్‌ స్కేల్‌ అప్లికేషన్‌లను రూపొందించాడు.‘మెనుజెన్‌’లాంటి ప్రోటోటైప్‌లను నిర్మించడానికి ‘వైబ్‌కోడింగ్‌’ మెథడ్‌ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్‌ కనిపించినప్పుడు ఆ ఎర్రర్‌ మెసేజెస్‌ను కామెంట్‌ లేకుండానే సిస్టమ్‌లో కాపీ, పేస్ట్‌ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్‌ మార్కెటింగ్, వైబ్‌ డిజైనింగ్, వైబ్‌ అనలిటిక్స్, వైబ్‌ వర్కింగ్‌...ఇలా రకరకాలుగా ‘వైబ్‌కోడింగ్‌’ పాపులర్‌ అయింది.‘వైబ్‌కోడింగ్‌’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్‌ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్‌లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్‌లు కానివారిని కూడా ఫంక్షనల్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ‘వైబ్‌కోడింగ్‌’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్‌ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.‘లవబుల్‌’ అనేది స్వీడీష్‌ వైబ్‌ కోడింగ్‌ యాప్‌. ఈ యాప్‌ కోసం రూపొందించిన కోడ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్‌ వెబ్‌అప్లికేషన్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఫేక్‌ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్‌ను ఉపయోగించుకున్నారు. వైబ్‌కోడింగ్‌ గురించి ‘ఐ జస్ట్‌ సీ థింగ్స్, సే థింగ్స్, రన్‌ థింగ్స్, అండ్‌ కాపీ థింగ్స్‌’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్‌ కూడా ఈ మెథడ్‌లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్‌ రిపేర్‌కు సంబంధించి టూల్స్‌ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి.

Gold or Real Estate in 2025 Know The What Should Investors Choose6
బంగారం vs రియల్ ఎస్టేట్: ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ బెస్ట్?

డబ్బు ఉంటే.. పెట్టుబడి పెట్టడానికి లెక్కలేనన్ని మార్గాలు కనిపిస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వద్దనుకునేవారిలో చాలామంది.. బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకీ ఇన్వెస్ట్ చేయడానికి బంగారం ఉత్తమమైనదా?, లేక రియల్ ఎస్టేట్ మంచి మార్గమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బంగారంబంగారంపై పెట్టుబడి సురక్షితమైన మార్గాల్లో ఒకటిగా భావిస్తారు. దీనికి కారణం.. చిన్న మొత్తంలో గోల్డ్ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు.సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ద్వారా.. భారత ప్రభుత్వం తరఫున జారీ చేస్తారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో లేదు. కానీ ఇందులో పెట్టే పెట్టుబడి భారీ లాభాలను అందిస్తుంది. ఇవి కాకుండా గోల్డ్ ETFలను కొనుగోలు చేయవచ్చు.బంగారంపై మీరు పెట్టే పెట్టుబడు.. ధరల కదలికపై ఆధారపడి ఉంటుంది. అంటే గోల్డ్ రేటు పెరిగితే లాభాలను పొందుతారు. గోల్డ్ రేటు తగ్గితే.. గోల్డ్ విక్రయించేటప్పుడు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పసిడిపై పెట్టే పెట్టుబడి నష్టాలను కలిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ కారణంగానే కొందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. భూములు, ఇళ్లు మొదలైనవాటిపై పెట్టే పెట్టుబడి కొన్ని రోజులకు రెట్టింపు లాభాన్ని తీసుకొస్తుంది. అయితే లాభం కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.భూములపై పెట్టుబడిపెట్టే సమయంలో.. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే.. బంగారం అమ్మినట్లు, భూమిని వెంటనే అమ్ముకోలేరు. అమ్ముకోవడానికి కూడా కొంత సమయం వేచి చూడాలి. అప్పుడే మీరు మంచి లాభాలను పొందవచ్చు. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, జీఎస్టీ, బ్రోకరేజ్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి.ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ బెస్ట్?నిజానికి బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టె పెట్టుబడి మంచిదే. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం ఆభరణాల రూపంలో కొనాలా.., బిస్కెట్లు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయాలా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా.. ఎక్కడ కొనుగోలు చేయాలి, వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? అనే విషయాలతోపాటు.. మీ బడ్జెట్ ఎంత? అనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఏ రంగంలో అయినా నష్టాలను చవిచూడక తప్పదు. అవసరమైన కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..

Advertisement
Advertisement
Advertisement