Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AI No Threat’ Carpenter Rs 900 Charge Goes Viral1
AI ఏమి చేయలేదు.. ఈ ఉద్యోగాలు సేఫ్!

కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్‌లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్‌లు, కార్పెంటర్‌లు, ప్లంబర్‌లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.

Wind Power Surges in India2
మంత్రిత్వ శాఖ ప్రకటన.. రికార్డు స్థాయిలో విండ్‌ ఎనర్జీ!

దేశంలో పవనవిద్యుత్‌ (విండ్‌ ఎనర్జీ) ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదని పేర్కొంది. 2016–17లో ఏర్పాటైన 5.5 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు రికార్డును అధిగమించినట్టు అయింది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.ప్రభుత్వ విధానాల్లో పెరిగిన స్పష్టత, పోటీ మార్గంలో టారిఫ్‌ల నిర్ణయం, సరఫరా నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉండడం వంటివి కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరడానికి దారితీసినట్టు పునరుత్పాదక ఇంధన శాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన విండ్‌ ఎనర్జీలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఉండడం గమనార్హం.

BSNL Relaunches Rs 1 Freedom Plan 2GB Daily Data3
ఫ్రీడమ్ ప్లాన్.. రూ.1కే రోజుకి 2జీబీ డేటా!

ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరోసారి ఫ్రీడమ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే.. కేవలం రూ.1 ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. తీసుకొచ్చిన ఒక రూపాయి ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా ఉచిత సిమ్ కార్డు పొందవచ్చు. ఆ తరువాత యూజర్లకు నెల రోజులు (30 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో 30 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను మరోసారి తీసుకురావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల డిమాండ్ అని తెలుస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు (ఏప్రిల్ 30) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Freedom is back and it’s bigger than ever!Get your FREE SIM at just ₹1 and enjoy unlimited calls, daily data and SMS benefits without breaking the bank.#BSNL #FreedomOffer #1RupeeOffer #BudgetFriendly #UnlimitedCalls #DailyData #TelecomDeals #IndiaOffers @CMDBSNL… pic.twitter.com/cjt1PB61lX— BSNL India (@BSNLCorporate) April 6, 2026

Hyderabad Logs Record Office Transactions in Q1 2026 Residential Sales Steady4
'హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు'

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 త్రైమాసిక రియల్ ఎస్టేట్ నివేదిక విడుదల చేసింది. ఇందులో నగరంలో ఆఫీస్, రెసిడెన్షియల్ మార్కెట్లకు డిమాండ్ అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది.ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 5.86 మిలియన్ చదరపు అడుగులకు చేరుకొని, ఒకే త్రైమాసికంలో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. గత సంవత్సరం పోలిస్తే.. ఇది 48% వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండవ అతిపెద్ద ఆఫీస్ మార్కెట్‌గా నిలిచింది.ఈ వృద్ధికి ప్రధాన కారణంగా.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) అని తెలుస్తోంది. మొత్తం లీజింగ్‌లో 43 శాతం వాటాను వీటిదే కావడం గమనార్హం. జీసీసీలు 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే థర్డ్-పార్టీ సర్వీసెస్ రంగం కూడా 1.7 మిలియన్ చదరపు అడుగులతో 29 శాతం వాటా సాధించింది. మరో ముఖ్యమైన అంశం ఫ్లెక్స్ వర్క్‌స్పేస్‌లు. ఇవి 457 శాతం వృద్ధితో 1.42 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు, ముఖ్యంగా GCCలు ఈ ఫ్లెక్స్ స్పేస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.నివాస రంగం విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో గృహ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2026 Q1లో 9,541 గృహాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలీసైతే 1 శాతం వృద్ధిని చూపిస్తుంది. గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ.8,211గా ఉండి 9 శాతం పెరిగింది. ప్రజలు చాలామంది విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక ద్వారా తెలిసింది.

KTM 390 Duke Price Hiked By Rs 400005
రూ.40 వేలు పెరిగిన 390 డ్యూక్ ధర!

భారతదేశంలో దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్న తరుణంలో.. కేటీఎమ్ ఇండియా కూడా తన 390 డ్యూక్ ధరను రూ. 40,000 పెంచింది. దీంతో ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 3.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.2025 సెప్టెంబర్ చివరిలో.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 కింద ప్రవేశపెట్టిన సవరించిన జీఎస్టీ విధానం నేపథ్యంలో ఈ పెరుగుదల జరిగింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై ఇప్పుడు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. కాబట్టి ఇప్పుడు కంపెనీ బైక్ ధరను పెంచింది.ఇదీ చదవండి: మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!ప్రకటన వెల్లడించిన సమయంలో.. భారతదేశంలో బజాజ్ ఆటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేటీఎం ఇండియా, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ రెండూ.. తమ తమ 390 మరియు 400cc మోడళ్ల ధరలు యథాతథంగా ఉంటాయని, అదనపు ఖర్చులను కంపెనీయే భరిస్తుందని పేర్కొన్నాయి.

Vinay Muralidhar Tonse Takes Charge as CEO of Yes Bank6
యస్‌ బ్యాంక్‌కు కొత్త సీఈవో

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ మురళీధర్‌ టోన్సే బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లపాటు వినయ్‌ బ్యాంకు నిర్వహణను చేపట్టనున్నట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. ఈ నెల 6తో అదనపు పదవీ కాలం ముగియనున్న ప్రశాంత్‌ కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేసింది. వేతనం తదితరాలకు ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది.వినయ్‌ గతంలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకు ఎండీగా విధులు నిర్వహించారు. యస్‌ బ్యాంక్‌లో గతేడాది జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ 24 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలుస్తోంది.బ్యాంకింగ్‌ రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా అనుభవమున్న వినయ్‌ ట్రెజరీ, రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్యకలాపాలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలలో పనిచేశారు. బెంగళూరుకు చెందిన సెయింట్‌ జోసెఫ్‌ కామర్స్‌ కాలేజ్‌లో కామర్స్‌ డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా 1988లో కెరీర్‌ ప్రారంభించారు.Mr. Vinay M. Tonse assumes office as MD & CEO today. YES BANK enters its next phase of growth with a strengthened foundation and a clear strategic direction. Sustained growth, driven by consistency and purpose, remains central to the journey ahead.We extend our best wishes as… pic.twitter.com/mKLrXN8AMl— YES BANK (@YESBANK) April 6, 2026

Advertisement
Advertisement
Advertisement