Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jio Financial Services reported a 13. 88percent declines1
జియో ఫైనాన్షియల్‌ లాభం డౌన్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 272 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 316 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 1,020 కోట్లకు చేరింది. అంతక్రితం ఇదే కాలంలో కేవలం రూ. 518 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 169 కోట్ల నుంచి రూ. 720 కోట్లకు భారీగా పెరిగాయి. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి ట్రెజరీ ఆదాయంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. పూర్తి ఏడాదికి రూ. 1,561 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 1,613 కోట్లు ఆర్జించింది. కాగా.. వాటాదారులకు షేరుకి రూ. 0.6 డివిడెండ్‌ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 1.1% బలపడి రూ. 244 వద్ద ముగిసింది.

Indian digital ad market likely to double to 22 billion dollers by 20302
డిజిటల్‌ యాడ్స్‌ డబుల్‌

న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ మార్కెట్‌ వచ్చే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి 19–22 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. 2025లో ఇది 11 బిలియన్‌ డాలర్లుగా ఉండగా రాబోయే రోజుల్లో ఏటా 10–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా కూడా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ భారీగా విస్తరిస్తోంది. గతేడాది ప్రకటనలపై చేసిన మొత్తం వ్యయాల్లో 70–75 శాతం వాటాను ఆక్రమించింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలు.. → భౌగోళికంగా చూస్తే గ్లోబల్‌ డిజిటల్‌ యాడ్‌లపై చేసే వ్యయాల్లో 46 శాతం మార్కెట్‌ వాటాతో అమెరికా అగ్రస్థానంలో, 24% వాటాతో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్‌ వాటా ప్రస్తుతం 1 శాతంగా ఉంది. → 2030 నాటికి అంతర్జాతీయంగా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ 1.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరనుంది. → డిజిటల్‌ ప్రకటనల్లో మొబైల్‌ యాడ్స్‌ వాటా అత్యధికంగా 65–70 శాతంగా ఉంటోంది. అమెరికాలో ఇన్‌–యాప్‌ అడ్వర్టైజింగ్‌ వాటా 80–85 శాతంగా ఉంది. → అల్గోరిథమ్‌ ఆధారిత డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ వ్యయాల్లో 70–80 శాతం వాటాతో కొన్ని సంస్థల ఆధిపత్యమే ఉంటోంది. తమకంటూ సొంత వ్యవస్థలు ఉన్న అల్ఫాబెట్, మెటా, అమెజాన్, యాపిల్, బైట్‌డ్యాన్స్‌ తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. → ఇక ఓపెన్‌ వ్యవస్థలోని సంస్థల వాటా మిగతా 20–30 శాతంగా ఉంది. ఇన్‌మొబి, యూనిటీ యాడ్స్, ఓపెన్‌ఎక్స్‌ మొదలైన బ్రాండ్లు వీటిలో ఉన్నాయి. → వేగంగా అందిపుచ్చుకునే వారు, వెనుకబడిన వారి మధ్య అంతరం పెరిగిపోతున్న నేపథ్యంలో... తదుపరి దశ అడ్వర్టైజింగ్‌ అంతా ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారితమైనదిగా ఉండనుంది. భవిష్యత్తులో ఏఐని విస్తృతంగా వినియోగించుకునే సంస్థలు విజేతలుగా నిలుస్తాయి.

Tesla is Preparing to Launch Six Seater Model in India3
ఇండియాకు టెస్లా సిక్స్ సీటర్ కారు!

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. గత సంవత్సరం చైనాలో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఆరు సీట్ల, లాంగ్ వీల్‌బేస్ కాన్ఫిగరేషన్ అయిన మోడల్ YL ఆవిష్కరించింది. దీనిని కంపెనీ భారతదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో మూడు-వరుసల సీటింగ్ లేఅవుట్ ఉంది.ఈ కొత్త మోడల్ చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి ఇతర దేశాలకు చేరుకుంటుంది. కాబట్టి దీని ధర భారతదేశంలో కొంత ఎక్కువగానే ఉంటుంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించకుండానే తమ పోర్ట్‌ఫోలియోను పునరుద్ధరించడానికి టెస్లా చూస్తోంది. అయితే రాబోయే కొత్త కారుకు సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. టెస్లా ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. భారతదేశ అధికారిక వాహన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం, టెస్లా 2025 సంవత్సరమంతటికీ దేశంలో కేవలం 227 కార్లను మాత్రమే రిజిస్టర్ చేసింది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ ఊహించిన దానికంటే తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. టెస్లా ఆగస్టులో చైనాలో మోడల్ YLను ఆవిష్కరించింది. దీని ధర సుమారు 3,39,000 యువాన్ల (49,679 డాలర్లు) నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్-వాహనాల మార్కెట్‌లో ఇది ప్రామాణిక మోడల్ Y కంటే ఉన్నత స్థానంలో నిలిచింది. మోడల్ YL కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఉత్పత్తి కాదని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఈ వాహనం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మార్కెట్‌ల కోసం ఇప్పటికే ధృవీకరించింది.

Gold Silver Prices Fall Amid Market Pressure4
బంగారం, వెండికి అమ్మకాల సెగ!

అమ్మకాల ఒత్తిడికి పసిడి, వెండి నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.5,700 తగ్గి (2.2 శాతం) రూ.2.53 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.1,600 (1 శాతం) నష్టపోయి రూ.1,56,200 స్థాయిలకు దిగొచ్చాయి. కాల్పుల విరమణ పరిణామాలకు సంబంధించి వారాంతంలో వచ్చే తాజా అప్‌డేట్‌లకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ కమోడిటీ సీనియర్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.తాజా సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగినట్టు చెప్పారు. హార్ముజ్‌ జలసంధితి పూర్తిగా తెరుస్తునట్లు ఇరాన్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దూసుకెళ్లాయి. గోల్డ్‌ ఔన్స్‌కు 2 శాతం పెరిగి 4,900 డాలర్ల పైకి చేరింది. సిల్వర్‌ ఔన్స్‌కు 5 శాతానికి పైనే పెరిగి 83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ గరిష్ట స్థాయిల్లో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

Jensen Huang Calls Analogy Lunacy5
AI పోటీలో చైనా.. హువాంగ్ హెచ్చరిక!

చైనాకు ఏఐ చిప్‌లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్‌లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.The Jensen Huang episode.0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?0:57:36 – Should we be selling AI chips to China?1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్‌లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్‌లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం.

India to be Among Renaults Top 3 Global Markets 7 New Models by 20306
టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌

చెన్నై: రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు.అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement