ప్రధాన వార్తలు
హీరో స్ప్లెండర్ కొత్త ధరలు
మూడు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ఇతర కంపెనీల బాటలోనే హీరోమోటోకార్ప్ అడుగులు వేస్తూ.. ధరలను కేవలం రూ. 250 మాత్రమే పెంచింది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇతరత్రా కారణాల వల్ల ధరను పెంచడం జరిగిందని సంస్థ పేర్కొంది.హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కమ్యూటర్ మోటార్సైకిల్గా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులోని 100 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.09 bhp & 8.05 Nm టార్క్ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్బాక్స్తో లభిస్తుంది.కంపెనీ ఈ బైక్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ముందు భాగంలో అదే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా సియెర్రా కారు కొన్న మంత్రిధరల పెరుగుదల తరువాత హీరో స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 73,902 నుంచి రూ. 74,152 వద్దకు చేరింది. ఐ3ఎస్ వేరియంట్ రూ. 75,055 నుంచి రూ. 75,305 వద్దకు, ఎక్స్టెక్ ధర రూ. 77,428 నుంచి రూ. 77,678 వద్దకు, ఎక్స్టెక్ 2.0 (డ్రమ్) వేరియంట్ ధర రూ. 79,964 నుంచి రూ. 80,214 వద్దకు, ఎక్స్టెక్ 2.0 (డిస్క్) వేరియంట్ ధర రూ. 80,471 నుంచి రూ. 80,721 వద్దకు చేరింది.
టాటా సియెర్రా కారు కొన్న మంత్రి
టాటా సియెర్రా ఎస్యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్షిప్లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్ 116 బీహెచ్పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. View this post on Instagram A post shared by Sree Gokulam Motors & Services (@gokulammotors)
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి ఇంకో రేటు ఉంది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఎంతలా దూసుకెల్తూ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.ఈ రోజు (జనవరి 19) ఉదయం 1,33,550 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. సాయంత్రానికి రూ. 1,34,050 వద్దకు (రూ. 500 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,690 రూపాయల నుంచి రూ. 1,46,240 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా ధరలు తారుమారయ్యాయి. ఉదయం 1,33,700 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు.. ఇప్పటికి రూ. 1,34,200 వద్ద (రూ. 500పెరిగింది) నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,840 రూపాయల నుంచి రూ. 1,46,390 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల రేటు 1,34,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 146730 వద్ద ఉంది. వెండి రేటు ఏకంగా రూ.3 లక్షలు (1000 గ్రాములు) దాటేసింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు!
చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వడ్డీ వస్తుందా?స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లపై వడ్డీ లభిస్తుంది.నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.స్విస్ బ్యాంక్లో ఖాతా సులభమేనా?స్విస్ బ్యాంక్లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.కీలకమైన మార్పులు!ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
బినామీ ఆస్తులకు చెక్
బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి. (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.బినామీ వ్యవహారం ఏమిటంటే..➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్ ఓనర్స్... డాక్యుమెంట్ ప్రకారం ఉండి.. సోర్స్ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద, నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద నిలిచాయి.భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఏఎండీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్ప్రింట్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డిలిజెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
కార్పొరేట్
వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు!
ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు
రూ. 35వేల కోట్ల పెట్టుబడి: 10 లక్షల వెహికల్స్!
బ్యాంకులకు వరుస సెలవులు!
10 ని.డెలివరీ నిలిపివేత.. పర్యవేక్షణ కఠినతరం
సైలెంట్గా సర్దుకుంటున్న టెక్ బిలియనీర్లు!
అంబానీ నెల కరెంట్ బిల్లు.. లగ్జరీ కారే కొనేయొచ్చు!
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
టెక్ మహీంద్రా లాభం అప్
అవునా.. నిజమా!.. ఇది సాధ్యమా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్...
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మా...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్ట...
బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలప...
తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత ...
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల...
రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!
భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో పీట్ లౌ (Pete Lau)పై తైవాన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. చైనా టెక్ ఎగ్జిక్యూటివ్లపై తైవాన్ తీసుకున్న అత్యంత అరుదైన, కఠినమైన చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. ప్రధానంగా అక్రమ నియామకాలు, సాంకేతిక సమాచార లీకేజీపై తైవాన్ ప్రభుత్వం చేపట్టిన అణిచివేత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.వివాదానికి ప్రధాన కారణం ఏంటి?తైవాన్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండానే కొన్నేళ్లుగా తైవాన్కు చెందిన ఇంజినీర్లను అక్రమంగా నియమించుకుంది. ఈక్రమంలో తైవాన్, చైనా మధ్య వ్యాపార, ఉపాధి సంబంధాలను నియంత్రించే కఠినమైన చట్టాలను వన్ ప్లస్ ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 70 మందికి పైగా తైవాన్ ఇంజినీర్లను వన్ ప్లస్ చట్టవిరుద్ధంగా చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంజినీర్లు వన్ ప్లస్ పరికరాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, పరిశోధన విభాగాల్లో పనిచేశారని గుర్తించారు.జాతీయ భద్రత, సాంకేతిక పరిరక్షణఈ కేసు కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదని, ఇది తైవాన్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో తైవాన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. చైనా సంస్థలు ఇలాంటి నియామకాల ద్వారా తమ దేశ మేధో సంపత్తిని, క్లిష్టమైన సాంకేతికతను తస్కరించే ప్రమాదం ఉందని తైవాన్ ఆందోళన చెందుతోంది.కంపెనీ స్పందనఈ పరిణామాలపై వన్ ప్లస్ స్పందిస్తూ.. తమ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సాగుతాయని, ఈ చట్టపరమైన అంశం కంపెనీ రోజువారీ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి చైనా-తైవాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా పీట్ లౌ అప్పగింత సాధ్యంకానప్పటికీ ఈ వారెంట్ కారణంగా టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షించినట్లయింది.పీట్ లౌ ప్రస్థానం..చైనాలో జన్మించిన పీట్ లౌ 2013లో వన్ ప్లస్ స్థాపించడానికి ముందు ఒప్పో (Oppo)లో సీనియర్ ఎగ్జిక్యూటవ్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తాను వన్ ప్లస్ సీఈవోగా ఉండటంతో పాటు, ఒప్పోలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీఓ)గా కూడా పని చేస్తున్నారు. తన నాయకత్వంలోనే వన్ ప్లస్ పెద్ద బ్రాండ్గా ఎదిగి ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మెరుగైన స్థానాన్ని సంపాదించుకున్నారు.ఇదీ చదవండి: నిధులు మూరెడు.. పనులు జానెడు!
మోటరోలా సిగ్నేచర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్సెట్ మోటరోలా సిగ్నేచర్ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్ను కంపెనీ ఆవిష్కరించింది.ఫ్లిప్కార్ట్లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ అత్యాధునిక స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో పనిచేస్తుంది.ప్రధాన ఫీచర్లుడిస్ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.పవర్ కోసం ఇందులో 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.ధర ఇదేనా?ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.
సబ్మెరిన్ కేబుల్స్కు కొత్త విధానం అవసరం
ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్మెరిన్ కేబుల్ నెట్వర్క్ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్కు చేరుకుంది. అయితే, ఈ నెట్వర్క్లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.భారత డిజిటల్ మౌలిక వసతులుభారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్వర్క్లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్ఎస్)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్ను ల్యాండ్ చేసుకోవచ్చు.సింగపూర్కు ప్రత్యామ్నాయంగా భారత్?ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్ఎస్లతో సింగపూర్ తిరుగులేని హబ్గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..
రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన
బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. SDE-1 (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్, సైనింగ్ ఇన్సెంటివ్లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఈ జాబ్ లిస్టింగ్ను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.At one side layoffs are happening and other side companies are offering such high salaries for 1 year experienceAnd the fun part is that same company would be paying lesser to 5-8yrs experience employee already working with them.Salary structure is completely broken in tech. pic.twitter.com/5k5Rivwb3H— EngiNerd. (@mainbhiengineer) January 14, 2026
పర్సనల్ ఫైనాన్స్
ఎస్బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్బీఐ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం?ఇది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్బ్యాక్ ద్వారా వాలెట్లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
మీ డబ్బు - మీ నిర్ణయం..
సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.రియల్టీ..ఇల్లు కొనటానికి డౌన్పేమెంట్ ఎంతవరకూ ఉండాలి? సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్పేమెంట్గా చెల్లించాలి. రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్పేమెంట్ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ ఖర్చులు, లీగల్ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి. బ్యాంకింగ్..స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్ ఖాతా లేక లిక్విడ్ ఫండ్సా? లిక్విడ్ ఫండ్స్లో సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్ ఫండ్స్లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్ ఫండ్స్లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్ రేటు చెల్లించేవారికి సేవింగ్స్ ఖాతాకన్నా లిక్విడ్ ఫండ్సే బెటర్. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. బంగారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరా? దేశంలో అన్ని నోటిఫైడ్ జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్) హాల్మార్కింగ్ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్మార్కింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, సదరు జ్యుయలర్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్–నోటిఫైడ్ జిల్లాలకు మాత్రం ఈ హాల్మార్కింగ్ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్మార్కింగ్ చేస్తాయి. హాల్మార్కింగ్ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్...రిటైరైన వారికి స్టాక్ మార్కెట్లు సురక్షితమేనా? సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్క్యాప్ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్డీలు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్...సిప్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? సిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్ టైమింగ్ను చూసుకుని, బాగా రిస్్కను తట్టుకోగలిగే వారికే! సిప్ వల్ల మార్కెట్ టైమింగ్ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్ కూడా యావరేజ్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి. ఇన్సూరెన్స్ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇన్సూరెన్స్లో కవరవుతాయా?మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్ పీరియడ్ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్ లేదా సి–సక్షన్ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్ నాటల్ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్ పాలసీల్లో మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?


