Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

West Asia Conflict Flights Why Indian Tourists Must Rethink Travel Insurance1
ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. మార్చి నెలలో ఏకంగా 5,500కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్‌ నెల అంటే భారతీయులకు సెలవుల కాలం. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో చాలామంది విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2025లోనే సుమారు 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ప్రయాణం చేసేవారు కేవలం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోతుందని భావిస్తే పొరపాటే. యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్‌ కంపెనీల నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.సాధారణ సమయాల్లో ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇలా..సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఐదు అంశాలను కవర్ చేస్తుంది.సామాను కోల్పోవడం: 300 డాలర్ల నుంచి 1,000 డాలర్ల వరకు కవరేజీ.పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం: 200 నుంచి 300 డాలర్ల వరకు.వైద్య ఖర్చులు: 2,50,000 నుంచి 5,00,000 డాలర్లు వరకు (కనీసం 24 గంటల హాస్పిటలైజేషన్ అవసరం).ప్రమాదాలు: 20,000 నుంచి 30,000 డాలర్ల వరకు.ట్రిప్ క్యాన్సిలేషన్: అనారోగ్యం, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల విమానం రద్దయితే సుమారు 1,000 డాలర్ల వరకు కవరేజీ ఉంటుంది.యుద్ధం వస్తే.. మీ పాలసీ పనిచేయదు!ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఒకవేళ మీ విమానం రద్దు కావడానికి లేదా మీకు గాయాలు కావడానికి యుద్ధం ప్రత్యక్ష కారణమైతే (ఉదాహరణకు: ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు, రన్‌వేల మూసివేత, బాంబు దాడులు) ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా చెల్లించవు. మెజారిటీ ఇన్సూరెన్స్ పాలసీల్లో ‘వార్ ఎక్స్‌క్లూజన్’ క్లాజ్ ఉంటుంది.వైద్య సాయం: యుద్ధం వల్ల కలిగే గాయాలకు (పేలుళ్ల వల్ల వచ్చే శిథిలాలు తగలడం వంటివి) ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాల సాయం లేదా సొంత ఖర్చులపైనే ఆధారపడాలి.హోటల్ ఖర్చులు: విమానాలు రద్దయి యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోతే హోటల్ ఖర్చులను ప్రయాణికులే భరించాలి లేదా ఎయిర్‌లైన్స్ ఇచ్చే వెసులుబాటును వాడుకోవాలి.సురక్షితంగా ప్రయాణించడం ఎలా?ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. ప్రస్తుతం క్షేమంగా ఉన్న మార్గాలు.. జపాన్, చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ తీరానికి వెళ్లేవారు హాంకాంగ్ మీదుగా వెళ్లడం సురక్షితం. అలాగే యూరప్‌ వెళ్లే కొన్ని విమానాలు పశ్చిమాసియాను తప్పించుకుంటూ మ్యూనిచ్ వంటి నగరాల మీదుగా నడుస్తున్నాయి.ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండొచ్చు?టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, డిజిట్ వంటి కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. షెంజెన్ దేశాలకు వెళ్లే నలుగురు సభ్యులున్న కుటుంబానికి (ఇద్దరు పిల్లలతో కలిపి) రూ.6,500 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయి. అమెరికా ట్రిప్ కోసం రూ.10,000 నుంచి రూ.24,000 వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, విదేశీ ప్రయాణానికి వెళ్లేముందు మీ పాలసీలోని నిబంధనలు, మినహాయింపులు, షరతులు క్షుణ్ణంగా చదవాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ ఇచ్చే రీఫండ్, రీషెడ్యూల్ ఆప్షన్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Stock market updates on 06 April 20262
ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 22,707 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 89 పాయింట్లు దిగజారి 73,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.15బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 109.84 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.11 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.18 శాతం పుంజుకుంది.Today Nifty position 06-04-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Moody's Slashes India's Growth Forecast to 6pc Amid West Asia Crisis3
భారత్‌ వృద్ధికి ‘రిస్క్‌’.. అంచనాలకు మూడీస్‌ కోత

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారత్‌ వృద్ధి అంచనాలకు మూడీస్‌ కోత విధించింది. గతంలో 6.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న అంచనాలను 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియా యద్ధ సంక్షోభంతోపాటు.. ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్‌తో వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ రవాణాకు ఆటంకాలు మరింత కాలం పాటు గృహాలకు సరఫరా కొరతకు దారితీస్తుందని.. అధిక ఇంధన రవాణా ఖర్చులు ఆహార ద్రవ్యోల్బణానికి కారణమవుతాయని హెచ్చరించింది. భారత్‌ చమురు, గ్యాస్‌ సరఫరాకు హర్మూజ్‌ జలసంధి కీలకంగా ఉండడం తెలిసిందే. 2026–27లో ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2025–26లో ఉన్న సగటు 2.4 శాతంతో పోల్చితే రెట్టింపు అవుతుందని మూడిస్‌ పేర్కొంది.వృద్ధికి అవరోధాలు, ద్రవ్యోల్బణం రిస్క్‌ల నేపథ్యంలో పాలసీ రేట్లు స్థిరంగా లేదంటే క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఎంత కాలం పాటు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది? ఇంధనం, ఆహారంపై దాని ప్రభావంపైనే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. పెరిగిపోయిన చమురు, ఎరువుల ధరలు లకి‡్ష్యత సబ్సిడీలు మరింత పెరిగేలా చేస్తాయని.. దీంతోపాటు ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించడం తెలిసిందే. స్థిరంగానే ఎగుమతులువస్తు, సేవల ఎగుమతులు స్థిరంగానే ఉంటాయని మూడిస్‌ అంచనా వేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు, ఎరువుల సరఫరాకు మార్గాలు గుర్తిస్తున్నందున దిగుమతుల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సహకార, అభివృద్ది సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్‌ జీడీపీ 2026–27లో 6.1 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేయగా, ఈవై ఒక శాతం వరకు వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. దేశీ రేటింగ్‌ సంస్థ ఇక్రా 2026–27లో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Why Your Company Health Insurance Isn't Enough?4
గ్రూప్‌ బీమా.. ఇస్తుందా ధీమా?

వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్‌ చేసే గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్‌ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్‌ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్‌ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్‌ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్‌సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్‌ చేసేది గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌. కనుక స్టాండెలోన్‌ హెల్త్‌ప్లాన్‌తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్‌ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్‌ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్‌ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్‌ల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్‌ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్‌ల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్‌ ఇన్సూరెన్స్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్‌్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్‌ ప్లాన్‌కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్‌ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్‌ ఇన్సూర్డ్‌ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్‌. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్‌ తీసుకోవాలి. 🔸 టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ ప్లాన్‌తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్‌ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్‌ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్‌ టాపప్‌ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్‌ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలకు సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్‌ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్‌ ఇన్సూర్డ్‌తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి.

RBI Likely to Hold Interest Rates Steady MPC Meeting Begins Today5
ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్‌ నేటి నుంచే..

ముంబై: ఆర్‌బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, యథాతథంగా కొనసాగించొచ్చని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ మూడు రోజుల సమీక్ష 6న ప్రారంభం కానుంది. 8వ తేదీన (బుధవారం) కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ కుమార్‌ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.గత సమీక్షలో రెపో రేటు 5.25 శాతంలో ఎలాంటి మార్పు చేయని విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, కమోడిటీల ధరలు గరిష్టాల్లో ట్రేడ్‌ అవుతుండడం, రూపాయి మారకం విలువలో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో ఆర్‌బీఐ రేట్ల సవరణకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.‘‘చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల అనిశ్చితుల నేపథ్యంలో ఆర్‌బీఐ ఏప్రిల్‌ పాలసీ సమీక్షలో రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేయొచ్చు. ద్రవ్యోల్బణం డేటాను లోతుగా పరిశీలించిన తర్వాతే రేట్లపై తదుపరి నిర్ణయానికి రావొచ్చు’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ సైతం అంచనా వేశారు.చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరడం, రూపాయి డాలర్‌తో 93కు పడిపోవడం, సూపర్‌ ఎల్‌నినో అంచనాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లను పెంచొచ్చన్నారు. స్వల్పకాల పరిణామాల ఆధారంగా రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయానికి రాలేదని.. ద్రవ్యోల్బణం తీరుపై స్పష్టత వచ్చాకే రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త శక్తి గుప్తా అభిప్రాయపడ్డారు.

Markets eye RBI signals for direction6
మార్కెట్‌ చూపు ఆర్‌బీఐ వైపు! 

నేడు(6న) కేంద్ర బ్యాంకు పరపతి సమీక్షా సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణికి కట్టుబడే వీలుంది. ఓవైపు ద్రవ్యోల్బణం బలపడుతుంటే.. మరోపక్క తయారీ రంగం డీలా పడుతోంది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్‌లో ట్రెండ్‌కు పాలసీ నిర్ణయాలు చుక్కానిగా నిలిచే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా ముడిచమురు ధరలు మండుతుండటం దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారి చూపుతోంది. ఇప్పటికే దేశీ చమురు అవసరాల కోసం 75 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధాపడుతుండటంతో వాణిజ్య లోటు పెరగనుంది. ఈ ఆందోళనలు డాలరుతో మారకంలో రూపాయిని సైతం దెబ్బతీస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ పటిష్ట చర్యలకు ఉపక్రమించడంతో వారాంతన రూపాయి ఒక్కసారిగా 2 శాతం పుంజుకుని 95 నుంచి 93కు చేరింది. కాగా.. లండన్, యూఎస్‌ మార్కెట్లలో చమురు పీపా ధర గత శుక్రవారం 110 డాలర్లకు చేరడం దేశీయంగా ధరలను ఎగదోయనుంది. తయారీ పీంఎఐ నాలుగేళ్ల కనిష్టానికి చేరగా.. టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణం బలపడుతోంది. దీంతో పాలసీ సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ బుధవారం(8న) కఠిన విధానాలవైపు మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆటుపోట్లకు చాన్స్‌ ఇప్పటికే యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన విధాన సంకేతాలు ఇవ్వగా.. దేశీయంగా ఆర్‌బీఐ అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27)లో ధరలు, వృద్ధిని బ్యాలన్స్‌ చేసేందుకు కేంద్ర బ్యాంకులు అవలంబించనున్న విధానాలపట్ల ఆర్థికవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ తెలియజేశారు. ఫెడ్‌ వడ్డీ పెంపువైపు చూపు సారిస్తే డాలరు బలపడటానికితోడు.. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నాయిర్‌ ప్రస్తావించారు. మరోపక్క పశ్చిమాసియా యుద్ధం ముదురుతుండటంతో మరోసారి దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా.. గత వారం 22,200 పాయింట్ల వద్ద మద్దతు తీసుకున్న నిఫ్టీ బలం పుంజుకుంది. ఈ వారం 23,000 స్థాయిని అధిగమిస్తే 23,400–23,500కు చేరవచ్చు. ఇలాకాకుండా 22,000కు బలహీనపడితే మరింత దిగువకు అంటే 21,800–21,700ను తాకే వీలుంది. సెన్సెక్స్‌ బలహీనపడితే 72,800 వద్ద మద్దతు లభించవచ్చు. ఇలాకాకుంటే తదుపరి 72,000 వరకూ నీరసించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 75,000వరకూ పురోగమించే అవకాశముంది.ఎఫ్‌పీఐల భారీ షాక్‌... గత ఐదు వారాలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ స్టాక్‌ మార్కెట్లకు భారీ అమ్మకాలతో షాకిస్తున్నారు. ఈ నెల తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 19,837 కోట్ల(2.1 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మార్చిలోనూ రూ. 1.17 లక్షల కోట్ల(12.7 బిలియన్‌ డాలర్లు) విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇవి అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకాగా.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎఫ్‌పీఐలు మార్చిలో అమ్మకాల యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం! 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 1.5 లక్షల కోట్ల విలువైన దేశీ స్టాక్స్‌ విక్రయించారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement