Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

RBI says 98. 44 Percent of withdrawn Rs 2000 banknotes returned1
రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్‌బీఐ

ముంబై: మార్కెట్‌ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది.అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.

India has 25 days of crude oil in reserve and 25 days of petrol2
చమురు సమస్యకు చాన్స్‌ లేదు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్‌కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్‌కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్‌ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్‌ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్‌ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్‌లు ఉన్నాయి. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్‌ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఇరాన్‌ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్‌కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ క్రూడాయిల్‌ దిగుమతుల కోసం 137 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ దిగుమతుల కోసం 100.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో, రిఫైనింగ్‌లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది.

Escorts Tractor Price in India starts from Rs 5. 75 Lakh3
ఎస్కార్ట్స్‌ కుబోటా ప్రత్యేక ట్రాక్టర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో వరి సాగుకు సంబంధించి శౌర్య పేరిట ప్రత్యేక ట్రాక్టర్ల సిరీస్‌ని ఎస్కార్ట్స్‌ కుబోటా (ఈకేఎల్‌) ఆవిష్కరించింది. ఇందులో 39 హెచ్‌పీ నుంచి 52 హెచ్‌పీ వరకు అయిదు వేరియంట్స్‌ ఉంటాయి. ధర రూ. 5.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుబోటా, ఫార్మ్‌ట్రాక్, పవర్‌ట్రాక్‌ బ్రాండ్స్‌ కింద వివిధ వర్గాల రైతుల కోసం ట్రాక్టర్లు విక్రయిస్తున్నామని, వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 8–10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సంస్థ సీఎండీ నిఖిల్‌ నందా తెలిపారు.ప్రస్తుతం ఆరు ప్లాంట్లు ఉండగా గ్రేటర్‌ నోయిడాలో 154 ఎకరాల స్థలంలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో విడతలవారీగా రూ. 2,300 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో విక్రయాలు 16 శాతం వృద్ధి చెందాయని, సంవత్సరం ముగిసే నాటికి 1,30,000 యూనిట్ల వరకు విక్రయాలు సాధించే అవకాశం ఉందని నందా వివరించారు.

Energy prices surge as war rattles supply4
హార్మూజ్‌ హీట్‌.. ఎగుమతులకు షాక్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితులతో భారత వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్నాయి. దేశ వాణిజ్యం (ఎగుమతులు–దిగుమతులు)పై ఏ మేర కు ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎగుమతిదారులు, లాజిస్టిక్స్‌ భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ (రాడ్‌టెప్‌) పథకం కింద.. ఎగుమతిదారుల రవాణా వ్యయాలపై ఇప్పటి వరకు అధిక శాతం రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉండేది.దీన్ని ఇటీవలే సగానికి తగ్గించడం గమనార్హం. అలా చేయకుండా ఇంతకుముందు మాదిరే అధిక రేట్లను అమలు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్‌ చేశారు. యుద్ధం పేరుతో సరుకు రవాణాపై ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెంచకుండా ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (ఈసీజీసీ)ను ఆదేశించాలని, మరిన్ని ఉత్పత్తులను బీమా కవరేజీలో చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలపై ప్రభావం తగ్గించే చర్యలు అవసరమని సూచించారు.సరుకు రవాణాపై స్పష్టత ఉండాలని, అనవసర జాప్యాన్ని నివారించాలని, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ సాఫీగా, సజావుగా ఉండాలని ఎగుమతిదారులు కోరారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం, ప్రతిగా ఇరాన్‌ పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. అంతేకాదు హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 15 శాతం, గ్యాస్‌ సరఫరాలో 20 శాతం రవాణాకు ఈ మార్గమే ఆధారం. ముడి చమురు ఇప్పటికే బ్యారెల్‌ 85 డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. పోటీతత్వానికి గండి హార్మూజ్‌ జలసంధిని మూసివేయడం వల్ల చమురు వాణిజ్యంపై ప్రభావం పడి ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎగుమతిదారు లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు వ్యయాలు పెరిగిపోతాయని.. దీంతో భారత వస్తువుల పోటీతత్వం తగ్గిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమాన రాకపోకల అంతరాయం వల్ల ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు రద్దు చేయాలని అప్పారెల్‌ ఎక్స్‌పోర్టర్స్‌ కౌన్సిల్‌ ఏఈపీసీ కోరింది.ఎగుమతులపై ప్రభావం.. దేశ ఎగుమతుల్లో సుమారు 15 శాతం విమానాల ద్వారానే జరుగుతుంటాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆభరణాల రవాణా భారంగా మారనుంది.ఎంఎస్‌ఎంఈలకు భరోసా..పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వాణిజ్య శాఖ పేర్కొంది. భారత ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా కొనసాగించేందుకు (సరఫరా వ్యవస్థ).. ఎగమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చంది. కస్టమ్స్‌ అనుమతులు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఉత్పత్తికి అవసరమైన కీలక దిగుమతులపై ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని స్పష్టం చేసింది. త్వరగా పాడయ్యే వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఎగుమతులు సాఫీగా సాగేందుకు ఉన్న మార్గాలపైనా చర్చించినట్టు తెలిపింది. క్రూడ్‌ కల్లోలం.. గ్లోబల్‌ మార్కెట్లు కుదేల్‌డోజోన్స్‌ 1,200 పాయింట్లు డౌన్‌చమురు ధరలు భగభగఅమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్‌ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్‌డాక్‌ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్‌అండ్‌పీ 500లోని 95 శాతం స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 5.4 శాతం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 5.8 శాతం పతనమయ్యాయి.అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆయిల్‌ అప్‌.. గోల్డ్‌ డౌన్‌..: అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

BSNL Rs 485 Plan Details5
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026

Tata Sierra Crosses 10000 Deliveries6
టాటా కారుకు ఫుల్ డిమాండ్.. 10వేల డెలివరీలు!

టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement