Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Good news for TCS employees Variable pay climbs to 80pc1
ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌..

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపుఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్‌’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్‌లోనూ బలమైన చెల్లింపులుఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన

Infinix Note Edge 5G Launched in India with Premium Features at Budget Price2
ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌

చైనా మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ 5జీ’ పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించారు.లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్‌టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్‌ అందుబాటులో ఉండనుంది.సిల్క్‌ ఫైబర్‌ ఫినిష్, స్టెల్లర్‌ బ్లూ, లూనార్‌ టైటానియం కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది.ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్‌ 4జీ వీఓఎల్‌ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌–సీ పోర్ట్, ఐఆర్‌ సెన్సార్‌ ఉన్నాయి. ఇన్‌–డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లున్నాయి.

Telangana RERA Issues Warning to Real Estate Firms Serves Notices3
రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రెరా వార్నింగ్‌.. నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఇళ్లు/ఫ్లాట్‌/యూనిట్‌ విక్రయాల కోసం తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లతో పాటు ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ జారీ చేస్తుందని తెలియజేసింది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందిన తర్వాతే విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రమోటర్లు/డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను కోరింది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందకుండానే చట్టవిరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిన పలు సంస్థలకు షోకాజ్‌ నోటీసులను జారీ చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.నోటీసులు అందుకున్న సంస్థల్లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్‌ ప్రాజెక్టు, వర్టెక్స్‌ విరాట్‌ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్‌ తదితర సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందుపరిచినప్పటికీ.. ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్‌ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిమాణం, ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్‌గా రిజిస్టర్‌ చేసినట్టు గుర్తించింది. ప్రకటనలో మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది.ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

IDFC First Bank flags Rs 590 crore fraud in Haryana govt linked accounts4
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్‌..

ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్‌ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్‌తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Vivo Launches V70 Series with ZEISS Triple Camera Setup in India5
వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్‌’ ట్రిపుల్‌ కెమెరాతో..

న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్‌ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్‌’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్‌’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్‌ పార్ట్‌నర్‌షిప్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది.50 మెగా పిక్సెల్‌(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ జీస్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్‌ కార్నర్లతో ప్రీమియం లుక్‌ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుకు, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తాయి.ఈ రెండూ ఆండ్రాయిడ్‌ 16తో కూడిన ఆరిజన్‌ ఓఎస్‌6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 11 గంటల నావిగేషన్‌ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్‌ తగ్గించడానికి ‘బైపాస్‌ ఛార్జింగ్‌’ సౌకర్యం కూడా ఉంది.వివో వీ70 ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌4 ప్రాసెసర్‌ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.49,999కు లభిస్తుందివివో వీ70 ఎలైట్‌ ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌జెన్‌3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్‌ ధర రూ.61,999గా నిర్ణయించింది.ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్‌ బ్యాంక్‌ కార్డులపై 10% వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్‌ బడ్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఆన్‌లైన్‌ స్టోర్లలో లభిస్తున్నాయి.

Battle for an Affordable Home in Hyderabad House Construction Tips6
సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

ఓ సామాన్యుడు నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనే ఆశకు రోజురోజుకూ దూరమవుతున్నాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలు ఆలోచనను వెనక్కి నెడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ అనుమతుల జాప్యం, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్య కార్మికుల కొరత.. వంటి రకరకాల కారణాలతో తక్కువ ఆదాయం కలిగిన వారికి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు గృహాల నిర్మాణం కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం పన్నులు, రుసుములను తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సరసమైన గృహాల నిర్మాణానికి చేయూత అందిస్తే.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందని నిర్మాణ సంఘాలు సూచిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్కెట్‌లో సరసమైన ఇళ్ల లభ్యత మున్ముందు మరింత తగ్గిపోనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో పెరిగిన ఇళ్ల ధరల తీరు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. సొంతిల్లు కొనగలమా లేదా? అని సామాన్య మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అన్ని వర్గాలకు నగర మార్కెట్‌లో గృహాలు అందుబాటులో ఉన్నాయని, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవచ్చని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. బడ్జెట్‌ ప్రధానం అనుకున్నప్పుడు విస్తీర్ణం పరంగా కొంత రాజీపడితే సరసమైన ఇళ్లు దొరుకుతాయని నిర్మాణదారులు సూచిస్తున్నారు.సొంతింటి కోసం సాయం అందుకోలేని దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని నిర్మాణ రంగ సంఘాలు కోరుతున్నాయి. భూమి ధరలు పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తోంది. శ్రీమంతులు విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ సాయం అందక సొంతంగా కట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యను గురించి అప్పట్లో నేషనల్‌ అర్బన్‌ హౌసింగ్‌ హ్యాబిటేట్‌ పాలసీ(ఎన్‌యూహెచ్‌హెచ్‌పీ) తీసుకొచ్చింది. వీరి కోసం కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో 10 నుంచి 15 శాతం భూమిని, 20–20 శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో(ఎఫ్‌ఏఆర్‌)ను రిజర్వ్‌ చేసేవారు.ఆ రకంగా ప్రైవేటు డెవలపర్లు సరసమైన గృహాలను నిర్దేశిత శాతం మేరకు నిర్మించేవారు. ప్రభుత్వం బిల్డర్లకు తక్కువ ధరలో భూమి ఇస్తే అక్కడ నిర్మాణాలు చేపట్టి తక్కువ ధరకు ఇల్లు అందించేవారు. కొత్తపేటలో నిర్మించిన హుడా కాలనీ ఇందుకు నిదర్శనం. హెచ్‌ఎండీఏ లే అవుట్లలోనూ ఎల్‌ఐజీ పేరుతో తక్కువ విస్తీర్ణంలో 60 గజాల్లో దొరికే స్థలాలు ఉండేవి. ఈ నిబంధన తొలగించడంతో 150 నుంచి 160 గజాల కంటే తక్కువ దొరకడం లేదు. దీంతో స్థలాలు కొని ఇల్లు కట్టుకుందామంటే ఖరీదుగా మారాయి.అదనపు వసూళ్లతో మరింత భారం.. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చదరపు అడుగు ధర సగటున రూ.6 వేలకు పైగానే పలుకుతోంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రూ.4 వేలకు చ.అ. విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్నా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, మెరుగైన మౌలిక సదుపాయలు ఉన్నచోట రూ.80 లక్షలు లేనిదే ఇల్లు రావడం లేదు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి రూ.కోటి పెట్టాల్సిందే. ఐటీ కారిడార్‌లో ఏకంగా రూ.కోట్ల పైమాటే.. అదనపు వసూళ్లతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఒక్కోటి కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో కారు పార్కింగ్‌ ఒక్కదానికే ఛార్జ్‌ చేసేచారు. ఇప్పుడు ఇన్‌ఫ్రా, క్లబ్‌హౌస్‌ చార్జీలు, గ్యాస్‌ పైపులైన్‌ కనెన్షన్‌కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి సామాన్య వర్గాలకు భారంగా మారుతున్నాయి. తక్కువ విస్తీర్ణం కారణంగా.. కొన్ని కొత్త నిర్మాణాల్లో వీటి కోసమే రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా జీఎస్టీ, రిజి్రస్టేషన్, స్టాంప్‌ డ్యూటీ తలకు మించిన భారంగా సామాన్య, ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కొందరు బిల్డర్లు సరసమైన ధరల ఇళ్లు నిర్మిస్తున్నారు. 800–1,000 చ.అ. విస్తీర్ణంలో రెండు పడక గదుల ఫ్లాట్లు, 350 చ.అ. విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్‌మెంట్లనూ కడుతున్నారు. ఇవన్నీ సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారుల నుంచి తక్కువ విస్తీర్ణం కారణంగా ఆశించిన మేర స్పందన లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశానికి దూరమని, ఇప్పటికిప్పుడు అక్కడ ఉండలేమని కూడా కొందరు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

Advertisement
Advertisement
Advertisement