Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Experts Views and Advice to this week1
ఫలితాలు, ఫెడ్‌పైనే ఫోకస్‌ 

అటు హార్మూజ్‌పై వివాదాలు, ఇటు ముడిచమురు ధరలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలు, దేశీ కార్పొరేట్‌ క్యూ4 ఫలితాలకు ఇన్వెస్టర్లు అత్యధిక ప్రాధాన్యత వచ్చే వీలుంది. వెరసి ఈ వారం సైతం తీవ్ర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. మరోపక్క ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్‌ మరింత వేడెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచే ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) పాలసీ సమీక్ష నిర్ణయాలు కీలకంగా నిలవనున్నాయి. వెరసి పలు అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మే 1) స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఐఐపీ.. గత వారాంతాన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్, యాక్సిస్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ జింక్‌ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో అల్ట్రాటెక్‌ సిమెంట్, కోల్‌ ఇండియా, వరుణ్‌ బెవరేజెస్, ఏయూ స్మాల్‌బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్, అదానీ టోటల్, మారుతీ సుజుకీ, ఎటర్నల్, గార్డెన్‌రీచ్, బజాజ్‌ ఫైనాన్స్, అదానీ పవర్, ఇండియన్‌ బ్యాంక్, వారీ ఎనర్జీస్, ఫెడరల్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, చోళమండలం తదితరాల పనితీరు వెల్లడికానుంది. మార్చి నెలకు రేపు(28న) పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం వృద్ధిని సాధించింది. ఇతర అంశాలు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల ఎగువకు చేరాయి. డాలరుతో మారకంలో రూపాయి 93.5కు బలహీనపడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో భారీఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు స్టాక్‌ నిపుణులు తెలియజేశారు. చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరగనుంది. దీంతో ఆర్‌బీఐ కఠిన విధానాలకు తెరతీయవలసి ఉంటుందని ఆరి్ధకవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా వివాదాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వెరసి ఈ వారం స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే ప్రధానంగా ఐటీ రంగం 10 శాతం పతనంకావడంతో గత వారం మార్కెట్లు క్షీణించాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 23,650–23,500 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇక్కడ బలపడితే.. 24,700వరకూ పురోగమించే అవకాశముంది. ఇక సెన్సెక్స్‌ 76,000–75,600 పాయింట్ల వద్ద సపోర్ట్‌ తీసుకోవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 77,300ను అధిగమించే వీలుంది. ఆపై 78,000 పాయింట్లను దాటవచ్చు. దిగువస్థాయిల్లో 75,000 వద్ద రికవరీకి వీలుంది. చమురు షాక్‌ గత వారం ముడిచమురు ధరలు 8–10 శాతం ఎగశాయి. దీనికితోడు ఐటీ దిగ్గజాలు నిరుత్సాహపరచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగాయి. వెరసి గత వారం(20–24) నికరంగా సెన్సెక్స్‌ 1,829 పాయింట్లు(2.3 శాతం) పతనమైంది. 76,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 456 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 23,898 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ స్వల్పంగా 0.6–0.2 శాతం మధ్య నీరసించాయి. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

RBI proposes measures to strengthen Prepaid Payment Instruments2
పీపీఐల్లో ప్రతి నెలా రూ.10,000 జమ 

ముంబై: ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ)ను మరింత బలోపేతం చేసేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, నగదు తిరిగి చెల్లింపుల (రిఫండ్‌) ప్రక్రియల్లో స్పష్టత తెస్తూ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ముందుగానే నగదును జమ చేసి, ఆ తర్వాత వివిధ అవసరాలకు చెల్లింపులు చేసే సాధనాలను పీపీఐలుగా చెబుతారు. → డెబిట్‌ కార్డులకు అనుమతి ఉన్న బ్యాంక్‌లు పీపీఐలను జారీ చేయొచ్చు. దీనికంటే ముందే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ (డీపీఎస్‌ఎస్‌)కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. → ఆర్‌బీఐ నుంచి అనుమతితో నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలు సైతం పీపీఐలు జారీ చేయొచ్చు. → పీపీఐలలో ఏ సమయంలో అయినా గరిష్టంగా రూ. 2 లక్షల వరకే బ్యాలన్స్‌ ఉండాలి. → ఒక నెలలో గరిష్టంగా రూ.10,000 లోడ్‌ చేసుకోవచ్చు. → బహుమతి కార్డుల విలువ రూ. 10,000, ప్రయాణ కార్డుల విలువ రూ. 3,000 మించి ఉండకూడదు. → ప్రవాస భారతీయులు భారత్‌లో పర్యటించే సమయంలో వారి పాస్‌పోర్ట్, వీసా ధ్రువీకరణ తర్వాత పీపీఐ వాలెట్లు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. → కేవైసీ పూర్తి చేసిన వారికి కార్డు నెట్‌వర్క్‌ లేదా యూపీఐ నెట్‌వర్క్‌ ద్వారా పీపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కలి్పంచాలి. → ఫెయిల్‌ అయిన లేదా రద్దయిన లావాదేవీలకు సంబంధించిన నగదును వెంటనే సంబంధిత పీపీఐ ఖాతాలో జమ చేయాలి. → ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను 2026 మే 22 లోపు తెలియజేయాలని ఆర్‌బీఐ కోరింది.

sakshi special story about systematic investment plan3
కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు

ఒక్క ట్వీట్‌తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్‌ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్‌ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్‌’ స్టోరీ...మ్యూచ్‌వల్‌ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్‌కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే. మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం మార్కెట్‌ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లను (సిప్‌) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్‌ బలంగా మారుతుంది. → అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. → దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది. → మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది. → ఈ రుపీ కాస్ట్‌ యావరేజింగ్‌ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్‌లా పనిచేస్తుంది.అసలైన మంత్రం... అసెట్‌ అలొకేషన్‌ డైవర్సిఫైడ్‌ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్‌ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్‌గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్‌ అనేది ఆప్షనల్‌ కాదు. తప్పనిసరి. లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్‌లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... → లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్‌ చేస్తాయి. → తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళతాయి. → మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్‌పై ఫోకస్‌ పెంచుతాయి. → ఇలా ఆటోమేటిక్‌ రీబ్యాలెన్సింగ్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు. → అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌లో ఫండ్‌ మేనేజర్‌ అలొకేషన్‌ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్‌ ఉన్నా... ఫండ్‌ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు. సిప్‌ నిలిపేయటమే అసలు తప్పుఅన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... → ఇన్వెస్టర్లు సిప్‌ను నిలిపేస్తారు. → ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు. కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.మార్కెట్‌ టైమింగ్‌ ముఖ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ పోవటం... మన అసెట్‌ అలొకేషన్‌కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్‌ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... → సిప్‌లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి. → పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్‌ అలొకేషన్‌ను సమీక్షించుకోండి. → భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి. → లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించండి. షార్ట్‌టర్మ్‌ ట్రెండ్‌ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి. → మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్‌ రీబ్యాలెన్సింగ్‌ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు.

How Many Loans Can One Person Take Know The RBI Clarifies the Rules4
ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?

ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది.

Weekly Gold Price Update Significant Decline Seen Across India5
బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..

భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.వెండి ధరలు ఇలా..బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

Suzuki Marks 20 Years in India and Crosses 10 Million Production Milestone6
భారత్‌లో 20 ఏళ్లు.. ఉత్పత్తిలో కోటి!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్‌పాయింట్‌లతో కూడిన విస్తృత నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్‌సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్‌సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్‌ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.

Advertisement
Advertisement
Advertisement