ప్రధాన వార్తలు
‘పెట్రోల్ ధరలు పెరగొచ్చు’
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రతిష్టంభన కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 104 డాలర్లకు చేరుకుంది.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ (KIE) తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే (ఏప్రిల్ 29 తర్వాత) ఇంధన ధరల పెంపు తప్పకపోవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం మార్కెట్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20%, భారత దిగుమతుల్లో 40% వాటా ఉన్న హోర్ముజ్ మార్గం మూతపడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం చమురు సంస్థలు నెలకు సుమారు రూ. 27,000 కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాయని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలను ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదు. అయితే, రిఫైనర్ల నష్టాలను తగ్గించాలంటే ధరల పెంపు అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, అది ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సరిపోవడం లేదని తెలుస్తోంది.ఒకవేళ పశ్చిమాసియాలో కాల్పుల విరమణ జరగని పక్షంలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ హెచ్చరించింది. భారత ముడి చమురు బాస్కెట్ ధర 120 డాలర్లకు చేరితే, సామాన్యులపై ఈ భారం మరింత తీవ్రంగా ఉంటుంది.
నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని, కళా వారసత్వాన్ని చాటిచెప్పడంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా న్యూయార్క్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100’ శిఖరాగ్ర సదస్సులో ఆమె ధరించిన చేనేత వస్త్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఆ ‘జమ్దానీ’ చీర వెనుక రెండేళ్ల కష్టం దాగి ఉండటం విశేషం.పశ్చిమ బెంగాల్లోని ఫులియాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బీరేన్ కుమార్ బసక్ ఈ చీరను రూపొందించారు. దీని తయారీకి దాదాపు 24 నెలల సమయం పట్టింది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన, క్లిష్టమైన ‘జమ్దానీ’ నేత పద్ధతిలో దీన్ని తయారు చేశారు. మీనకారీ జమ్దానీ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ వస్త్రంపై విభిన్న రకాల డిజైన్లు చేశారు.కళాత్మకత - సంస్కృతీ చిహ్నాలుఈ చీర పల్లూ (కొంగు) ఒక దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. ఇందులో భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్సవ దృశ్యాలు, మానవ ఆకృతులు, జంతువులు, ప్రకృతి సౌందర్యాన్ని చాటే పచ్చని ఆకులు అల్లారు. చీర అంచు వెంబడి ఉన్న చేపల ముద్రలు భారతీయ సంప్రదాయం ప్రకారం శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ చీర రాజసానికి, హుందాతనానికి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)నీతా అంబానీ సందేశంఏప్రిల్ 22న జరిగిన ఈ సదస్సులో టైమ్ మ్యాగజైన్ సీఈఓ జెస్సికా సిబ్లీ నీతా అంబానీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ భారతీయ విలువల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రపంచానికి హార్డ్ పవర్ కంటే, సున్నితమైన శక్తి(సాఫ్ట్ పవర్) ఎంతో అవసరం. భారతదేశం ఆ మృదువైన శక్తికి నిలువెత్తు ప్రతిరూపం’ అని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
పసిడి, వెండి.. డబుల్ ధమాకా!
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. క్రితం రోజున కాస్త తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు రెట్టింపు స్థాయిలో క్షీణించాయి. గత ఐదు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. మరోవైపు ఈరోజు వెండి ధరలు (Today Silver Rate) కూడా పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భీకరమైనదని, దీన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆయిల్ షాక్గా ఆమె అభివర్ణించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఎదురయ్యే సవాళ్లను విశ్లేషించారు.వృద్ధి రేటుపై నీలినీడలుసంక్షోభం కొనసాగే కాలాన్ని బట్టి ప్రపంచ వృద్ధి రేటు దెబ్బతింటుందని గోపీనాథ్ స్పష్టం చేశారు. ఆమె విశ్లేషణ ప్రకారం.. రాబోయే వారం రోజుల్లో సమస్య సర్దుమణిగితే ప్రపంచ వృద్ధిపై ప్రభావం తక్కువగా (సుమారు 0.3% శాతం పాయింట్లు) ఉంటుంది. ఒకవేళ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును చేరితే ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత అంచనా 3.4% నుంచి 2.5%కి పడిపోయే ప్రమాదం ఉంది.భారత్పై ద్వంద్వ ప్రభావంఇరాన్ వివాదం భారత్కు ప్రతికూల అంశమే అయినప్పటికీ దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఊరటనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఒకవైపు ఇరాన్ వివాదం నెగిటివ్ ప్రభావం చూపుతుంటే మరోవైపు దిగుమతి సుంకాలు 50% నుంచి 10%కి తగ్గడం సానుకూల పరిణామం. ఈ రెండూ ఒకదానికొకటి భర్తీ చేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% వరకు ఉండవచ్చు’ అని ఆమె అంచనా వేశారు.ఎరువులు, ఎల్పీజీ ముప్పుకేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరా లేకపోవడం అనేది అసలైన సమస్య అని గోపీనాథ్ హెచ్చరించారు. ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోతే భారత్కు ఎరువులు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది. ఇది దేశీయ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పటికీ రవాణా మార్గాలు మూసుకుపోతే సాగుపై ఎరువుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతుంది.సబ్సిడీలపై కీలక వ్యాఖ్యలుపెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం నిరవధికంగా భరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చమురు ధరలపై సబ్సిడీలు ఇస్తూ పోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. ఏదో ఒక దశలో పెరిగిన ధరలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదు’ అని ఆమె చెప్పారు. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ భారత దేశీయ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఆర్థిక వ్యవస్థలు కుదుటపడతాయని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు తగ్గి 24,241 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 546 పాయింట్లు నష్టపోయి 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.69బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 103.44 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.05 శాతం పెరిగింది.నాస్డాక్ 1.64 శాతం పుంజుకుంది.Today Nifty position 23-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
టెక్నాలజీలో వేగంగా మార్పులొస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆఫీసుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల తీరు విభిన్నంగా ఉంది. గతంలో బాస్ ఏదైనా చెబితే చాలా వరకు ఎదురు చెప్పకుండా దాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు యువత ముఖ్యంగా జెన్ జీ తీరు మారింది. ఇది పని పట్ల వారికున్న కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వారిలోని మార్పును నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.హోదాను చూసి కాదు..ఒకప్పుడు ఆఫీసులో ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటే వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కార్యాలయాల్లో ఇంటర్నల్ మీటింగ్స్ జరిగినప్పుడు ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని యువ ఉద్యోగులు అడుగుతున్నారు. కేవలం మేనేజర్ అని గౌరవం ఇవ్వడం కాకుండా తనకు విషయం తెలిసి స్పష్టంగా సమస్యను, పరిష్కారాన్ని వివరిస్తేనే నిజమైన గౌరవం దక్కుతోంది. అంటే, అధికారం అనేది ఇప్పుడు కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టి వస్తోంది.పనిలో క్లారిటీ ఉండాల్సిందే!‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?’ అని జెన్జీ యువత ఆలోచిస్తున్నారు. పని గురించి సరిగ్గా వివరించకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇది తిరుగుబాటు కాదు, అర్థం లేని పని చేయలేక వస్తున్న విసుగు అని గమనించాలి. మనం చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని తెలిస్తేనే నేటి ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.అప్పటికప్పుడు ప్రోత్సాహం కావాలి!పాత కాలంలో ఏ ఏడాదికో ఒకసారి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పటి డిజిటల్ కాలంలో అంత ఓపిక ఎవరికీ లేదు. ‘నేను చేస్తున్న పని బాగుందా? లేదా?’ అని ఉద్యోగులు అప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాస్ ఏమీ చెప్పకుండా గమ్మున ఉంటే.. అది తమకు ఇష్టం లేదనో లేదా తనను పట్టించుకోవడం లేదనో ఉద్యోగి ఫీలవుతున్నారు. చిన్న మెచ్చుకోలు అయినా సరే అది పనిని రెట్టింపు వేగంతో చేయిస్తుంది.జీతం కోసం మాత్రమే కాదు!నేటి తరం పనిని కేవలం నెల నెలా వచ్చే జీతం కోసం చేయడం లేదు. వారు చేసే పనిలో ఒక తృప్తిని వెతుక్కుంటున్నారు. ‘నేను చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను ఎదగడానికి ఇది పనికొస్తుందా?’ అనేదే వారి మెయిన్ పాయింట్. అందుకే ఇప్పుడు ఆఫీసుల్లో కంట్రోల్ చేయడం కంటే ఉద్యోగులతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. బాస్లు ఆదేశాలు ఇచ్చే వారిగా కాకుండా దారి చూపే వారిగా మారినప్పుడే ఏ కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
కార్పొరేట్
నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
భారత్లో 500 హోటల్స్ లక్ష్యం
డీ2సీ బ్రాండ్లకు చిన్న నగరాల్లో ఆదరణ
టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు
‘ఇండిగో స్ట్రెచ్’కు అంతర్జాతీయ అవార్డు
రిలయన్స్ కమ్యూనికేషన్స్పై సీబీఐ పంజా
సామ్ ఆల్ట్మాన్ ఇంటిపై దాడి
హైదరాబాద్లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
హెచ్డీఎఫ్సీ లైఫ్ సీఈవోగా ఇంకొన్నేళ్లు ఈమే..
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ...
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట...
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో క...
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్ అండ్ వాచ్’
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,...
నిదానించిన మౌలిక రంగం
న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల పనితీరు మార్చి నెలలో ...
ఎన్బీఎఫ్సీ శాఖల విస్తరణపై ఆర్బీఐ కొత్త రూల్స్
దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)...
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
దశాబ్దాలుగా చైనా ఆర్థిక శక్తిగా ఎదగడంలో కీలకంగా ని...
ఆటోమొబైల్
టెక్నాలజీ
కొత్త ఫోన్: ఒప్పో ఎఫ్33 సిరీస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి.
స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డౌన్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) మందగించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, క్యూ1లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు (కంపెనీ నుంచి డీలర్లకు రవాణా) గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత 6 ఏళ్లలో బలహీనమైన పనితీరు ఇది. పెరిగిన తయారీ ఖర్చులు, ముఖ్యంగా మెమొరీ చిప్ల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం (ముఖ్యంగా రూ.15,000 లోపు ఫోన్లకు).. మొత్తం మార్కెట్ పనితీరును ప్రభావితం చేసినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు డబుల్ డిజిట్ స్థాయిలో తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ‘‘2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్ఫోన్ మార్కెట్ సుమారు 10 శాతం తగ్గొచ్చని అంచనా. ‘‘విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మెమొరీ ధరలు గత 9 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఫోన్లను వెంటనే మార్చకుండా, ఉన్న వాటినే ఎక్కువ కాలం వినియోగిస్తున్నారు’’అని పాఠక్ వివరించారు. పశ్చిమాసియలో సంక్షోభంతో జీవన వ్యయాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు స్మార్ట్ఫోన్ల వంటి వాటి కంటే ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ మార్కెట్ నెమ్మదిగా కోలుకోవచ్చని అభిప్రాయపడింది. వివో నంబర్ 1 → దేశీ మార్కెట్లో 21 శాతం వాటాతో వివో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో పోర్ట్ఫోలియో విస్తరణ ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంది. → శామ్సంగ్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎ–సిరీస్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. → ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధిని (2025 క్యూ1తో పోల్చితే) సాధించింది. → షావోమీ నాలుగో స్థానంలో ఉంది. రూ.10,000–20,000 ధరల శ్రేణిలో రడబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. → ఆన్లైన్ మార్కెట్లో రూ.10,000–20,000 ధరల విభాగంలో రియల్మీ బలమైన బ్రాండ్గా నిలిచింది. → నథింగ్ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. → ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో (రూ.45,000కు పైన) గూగుల్ 39 శాతం వృద్ధిని సాధించింది. → అందుబాటు ధరల ఫోన్ల విభాగంలో (రూ.30,000–45,000) ప్రముఖ బ్రాండ్గా వన్ప్లస్ ముందంజలో ఉంది. నార్డ్ సిరీస్కు మంచి స్పందన లభిస్తోంది.
మెటాలో భారీ లేఆఫ్లు.. 16,000 మందిపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్లు సిద్ధం చేస్తున్నారు.నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్
కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్
కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ 2025 సంవత్సరానికి గాను మొత్తం 10.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు 29 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ వేతనంలో 1.3 మిలియన్ డాలర్లు బేసిక్ పే, 4.3 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం, 4.9 మిలియన్ డాలర్ల ఆర్ఎస్యూ (ఈక్విటీ పరిహారం) చెల్లింపులు ఉన్నాయి.అయితే, ఆయన టార్గెట్ టోటల్ డైరెక్ట్ కాంపెన్సేషన్ 19 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఎందుకంటే పనితీరు ఆధారిత పీఎస్యూ (PSU) గ్రాంట్లు భవిష్యత్తులో లభించనున్నాయి. కాగా, ఇదే ఏడాది భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా హెచ్సీఎల్ టెక్ సీఈఓసి.విజయకుమార్ (10.8 మిలియన్ డాలర్లు) నిలవగా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 80.6 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా రూ. 53.6 కోట్లు ఆర్జించారు.కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, కాగ్నిజెంట్ 2025లో అంచనాలను మించి రాణించింది. కృత్రిమ మేధ (AI), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భారీ ఒప్పందాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 21.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా కంపెనీ అంచనా వేసిన 15.3-15.7 శాతం కంటే మెరుగ్గా 15.8 శాతంగా నమోదైంది. గతంలో ఎదుగుదల విషయంలో వెనుకబడిన తమ సంస్థ, ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీల మధ్య అగ్రస్థానానికి చేరుకుందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ కూడా తన లక్ష్యం కంటే అధికంగా 6.6 మిలియన్ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు.ఇక కంపెనీలోని వేతన వ్యత్యాసాల విషయానికి వస్తే, సీఈఓ వేతనానికి, సాధారణ ఉద్యోగి వేతనానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగి సగటు వేతనం 45,138 డాలర్లుగా ఉండగా, సీఈఓ వేతన నిష్పత్తి 477:1గా నమోదైంది. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 1,40,739 డాలర్లుగా ఉండటంతో అక్కడ నిష్పత్తి 153:1గా ఉంది. అయితే, జీవన వ్యయ సర్దుబాటు చేయకుండా లెక్కిస్తే, భారతీయ ఉద్యోగి సగటు వేతనం కేవలం 14,136 డాలర్లు (సుమారు రూ. 11.8 లక్షలు) మాత్రమే. ఈ క్రమంలో సీఈఓ, భారతీయ ఉద్యోగి వేతన నిష్పత్తి అత్యధికంగా 1,523:1గా ఉండటం గమనార్హం.ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,51,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో మెజారిటీ వాటా భారత్దే కావడం విశేషం. మన దేశంలో 2,56,900 మంది ఉద్యోగులు ఉండగా, ఉత్తర అమెరికాలో 41,600 మంది, యూరప్లో 14,600 మంది, బ్రిటన్లో 7,800 మంది పనిచేస్తున్నారు. కంపెనీ తన మార్జిన్లను మెరుగుపరుచుకుంటూ ఆదాయ వృద్ధి అంచనాలను 4 శాతం నుండి 6.5 శాతానికి పెంచడం, భవిష్యత్తులో ఐటీ మార్కెట్లో సంస్థ మరింత పట్టు సాధిస్తుందనే సంకేతాలను ఇస్తోంది.ఇదీ చదవండి: డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
పర్సనల్ ఫైనాన్స్
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.
పింఛను రంగంలో ఎఫ్డీఐ పెంపు!
న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్పీఎస్ ట్రస్ట్ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్పీఎస్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్మార్కింగ్, ఆరు అంకెల హెచ్యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్యూఐడీ నంబర్ (హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్ఫోన్లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!


