Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Paytm is dominant leader in Indian merchant payments1
మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్‌

న్యూఢిల్లీ: మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ప్లాట్‌ఫామ్‌ దూసుకుపోతోంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వ్యాపార వృద్ధిలో ఈ విభాగం కీలకంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ పేర్కొంది. కంపెనీకి ‘బై’ (కొనుగోలు) రేటింగ్‌ ఇస్తూ రూ.1,350 లక్ష్యాన్ని ప్రకటించింది. 2025–26 నుంచి 2027–28 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 22 % చొప్పున వృద్ధి చెందుతుందని (సీఏజీఆర్‌) అంచనా వేసింది. ఈ కాలంలో ఎబిట్డా మార్జిన్లు పెరుగుతాయని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మర్చంట్‌ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా పేటీఎం ఎదుగుతున్నట్టు వివరించింది.అధిక చెల్లింపుల లావాదేవీలతోపాటు, వేగంగా రుణా ల మంజూరును ప్రస్తావించింది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై 4.5 కోట్ల వర్తకులు ఉన్నారని, డివైజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పెరుగుతున్న కొద్దీ పేటీఎం ఆదాయాలు మెరుగుపడనున్నట్టు జెఫరీస్‌ తన నివేదికలో పేర్కొంది. చెల్లింపుల గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) ఏటా 23% చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2026 మార్చి నాటికి ఇది రూ.24 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. పేటీఎం మర్చంట్‌ లెండింగ్‌ (వర్తకులకు రుణాల మంజూరు) అన్నది రిటైల్‌ రుణాలను మించినట్టు తెలిపింది.యూపీఐ ద్వారా రుణ వితరణకు ఉన్న దీర్ఘకాల వృద్ధి అవకాశాలనూ ప్రస్తావించింది. ఆర్థిక సేవల ఆదాయం ఏటా 28 శాతం చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.12,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2028 మార్చి నాటికి రూ.1,700 కోట్ల నికర లాభాన్ని పేటీఎం ప్రకటించొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.574 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

India unemployment rate dropped to 3. 1 Percentage in 20252
2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం గతేడాది (2025లో) 3.1 శాతానికి తగ్గింది. 2024లో ఇది 3.2 శాతంగా ఉంది. పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే, 2025 వివరాలను కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ⇒ 15 ఏళ్లకు వయసుపైబడిన మహిళల్లో నిరుద్యోగం 2024 మాదిరే 2025లోనూ 3.1% వద్దే ఉంది. పురుషుల్లో ఇది 3.3% నుంచి 3.1 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో 2.4 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇది 2.5%గా ఉంది. పల్లెల్లో పురుషుల నిరుద్యోగం 2.6 %గా ఉంటే, మహిళల్లో 2.1%గా నమోదైంది. ⇒ స్వయం ఉపాధి రేటు 2024లో ఉన్న 57.5 % నుంచి 2025లో 56.2 శాతానికి తగ్గింది. ⇒ సాధారణ లేబర్‌ పనుల్లో ఉపాధి 20.2%గా ఉంది. ⇒ వ్యవసాయ రంగంలో ఉపాధి 2025లో 43 శాతంగా నమోదైంది. 2024లో ఉన్న 44.8 శాతంతో పోల్చితే తగ్గింది. ⇒ నిర్మాణ రంగంలో ఉపాధి రేటు 12.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ఇతర సేవల్లో ఇది 12.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది. ⇒ కార్మికుల ఆర్జన మెరుగుపడింది. పురుషుల సగటు ఆర్జన 2024లో రూ.22,891గా ఉంటే, 2025లో రూ.24,217కు పెరిగింది. మహిళా కార్మికుల ఆర్జన రూ.17,126 నుంచి రూ.18,353కు వృద్ధి చెందింది.

Oil industry pushes ethanol as cooking fuel to cut LPG imports3
ఇక ఎల్‌పీజీ బదులు ఇథనాల్‌

న్యూఢిల్లీ: దేశీయంగా కుటుంబాలు ఎల్‌పీజీకి బదులుగా ఇథనాల్‌ను వినియోగించడాన్ని ప్రోత్సహించవలసిందిగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్‌ఐపీఐ) కోరుతోంది. వంటకు శుద్ధ ఇంధనంగా ఇథనాల్‌ను వినియోగించేందుకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయవలసిందిగా ఆలిండియా డిస్టిల్లరీస్‌ అసోసియేషన్‌(ఏఐడీఏ)ను కోరింది. ఎల్‌పీజీస్థానే బయోఇంధన వినియోగాన్ని విస్తరించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని పెట్రోలియం పరిశ్రమ అభిప్రాయపడింది.ఇథనాల్‌ ఆధారిత వంట స్టవ్‌లపై రీసెర్చ్‌ కొనసాగుతున్నట్లు ఏఐడీఏ సదస్సు సందర్భంగా ఎఫ్‌ఐపీఐ డైరెక్టర్‌(డౌన్‌స్ట్రీమ్‌) ఆర్‌ఎస్‌ రవి తెలియజేశారు. ఎల్‌పీజీ ఎక్విప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎల్‌ఈఆర్‌సీ) తదితర ఏజెన్సీలు, వివిధ ఐఐటీలు ఇథనాల్‌ ఆధారిత సమర్థవంత కుకింగ్‌ స్టవ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నమూనా(ప్రొటోటైప్‌) స్టవ్‌లు సిద్ధంకానున్నట్లు వెల్లడించారు. ఇథనాల్‌తో వంటకు.. వంటకు ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగించుకోగలిగే విషయంలో ఐడీఏసహా.. సంస్థ సభ్యులు రెండు విధాలుగా మద్దతివ్వవలసి ఉన్నట్లు రవి పేర్కొన్నారు. ఇథనాల్‌ వంట స్టవ్‌ల ఉత్పత్తిని పెంచేందుకు తయారీదారులకు సహకరించడంతోపాటు.. కుటుంబాలకు ప్రత్యక్షంగా ఇథనాల్‌ డెలివరీ అయ్యేందుకు సరఫరాల చైన్‌ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు వివరించారు. ఇథనాల్‌ సరఫరాల ద్వారా ప్రస్తుతం చమురు పరిశ్రమకు ఇస్తున్న మద్దతు స్థాయిలోకాకుండా ఇందుకు విభిన్నంగా వ్యవహరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.సరఫరా చైన్‌ అభివృద్ధి, డెలివరీ అంశాలు కీలకమని, దేశీయంగా ఇథనాల్‌ను వంట ఇంధనంగా మార్పుచేసేందుకు ఏఐడీఏ ముందుకురావాలని రవి డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పెట్రోల్‌లో ఇధనాల్‌ను 20 శాతం మిక్స్‌(ఈ20) చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఈ20 పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది.డీజిల్‌లో కలిపేందుకు వీలైన ఏబీఏ ఉత్పత్తిని పెంచడం, ఇథనాల్‌ టు సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌(ఎస్‌ఏఎఫ్‌)కు సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై అభ్యర్థనలతోపాటు.. వంటకు వీలయ్యే ఇథనాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టవలసిందిగా ఏఐడీఏను రవి కోరారు. బయోఇంధన వ్యవస్థలో వంట ఇంధనాన్ని చేర్చడం ద్వారా ఇంధన భద్రతను పెంచుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు చమురు పరిశ్రమ, డిస్టిల్లరీలు సహకరించుకోవడం ద్వారా దేశీయంగా ఇథనాల్‌ ఆధారిత వంటకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.

India Bioeconomy Surges to USD 195 Billion in 20254
బయోఎకానమీ బూమ్‌...!

న్యూఢిల్లీ: భారతీయ బయోఎకానమీ విలువ గణనీయంగా పెరుగుతోంది. బయోటెక్నాలజీ ఆధారిత రంగాల్లో వేగవంతమైన అభివృద్ధితో దేశీయ ‘బయోఎకానమీ విలువ 2025లో 195 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది (2024) విలువ 166 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి చెందింది. బయోటెక్‌ రంగాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ‘బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌’ (బీఐఆర్‌ఏసీ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. విస్తరిస్తున్న బయోఎకానమీ పరిధి: ఒకప్పుడు ‘బయోఎకానమీ’ అనేది బయోఫార్మా, బయోఇండ్రస్టియల్‌ వంటి రంగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం దీని పరిధి పెరిగింది. బయోఫ్యూయల్స్, ఎంజైమ్‌ సొల్యూషన్స్, డిజిటల్‌ బయాలజీ ప్లాట్‌ఫారŠమ్స్, కాంట్రాక్ట్‌ రీసెర్చ్, బయోలాజిక్స్‌ తయారీ, వ్యవసాయ బయో ఇన్‌పుట్స్‌ వంటి విభాగాలకు విస్తరించింది. దీంతో బయోఎకానమీ విస్తృత పారిశ్రామిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తోంది. వృద్ధికి ప్రధాన కారణాలు: బయోఎకానమీ వృద్ధికి నాలుగు ప్రధాన కారణాలున్నాయి. ⇒ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం అమలు వల్ల ఇంధన దిగుమతులు తగ్గడం ⇒ జీఎల్‌పీ–1 ఔషధాల వినియోగం పెరగడం ⇒ పరిశ్రమల్లో ఎంజైమ్స్, సూక్ష్మజీవాల ఆధారిత బయోసొల్యూషన్స్‌ వినియోగం పెరగడం... ⇒ మూడు లక్షలకు పైగా భారతీయ నిపుణులకు ఉపాధి కల్పిస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ ఈ అంశాలన్నీ బయోఎకానమీ విస్తరించేందుకు ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఈ పరిణామాల వల్ల 2025లో బయోఎకానమీకి అదనంగా 29.6 బిలియన్‌ డాలర్ల విలువ చేకూరింది. గడిచిన కొన్నేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలిచింది. కీలకంగా బీఐఆర్‌ఏసీ పాత్ర బీఐఆర్‌ఏసీ గ్రాంట్‌ ఫండింగ్, ఈక్విటీ సపోర్ట్, మెంటరింగ్, భాగస్వామ్యాల ద్వారా బయోఫార్మా, మెడ్‌టెక్, అగ్రి బయోటెక్, హెల్త్‌టెక్, ఇండ్రస్టియల్‌ బయోటెక్, క్లీన్‌టెక్‌ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడులను ప్రోత్సహించింది. 900కిపైగా ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది. దాదాపు 35,000కు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది.2030 నాటికి బయోఎకానమీని 300 బిలియన్‌ డాలర్లకు, 2047 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ‘‘గత 14 ఏళ్లలో బీఐఆర్‌ఏసీ భారత బయోటెక్నాలజీ రంగాన్ని ఆవిష్కరణల ఆధారిత శక్తివంతమైన వ్యవస్థగా మార్చింది. స్టార్టప్స్, సంస్థలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వందలాది ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడింది,’’ అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రాజేష్‌ ఎస్‌ గోఖలే తెలిపారు.

BYD Atto 1 EV Launched at 2026 Bangkok International Motor Show5
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?

చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్‌పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్‌తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఉన్నాయి.

Gold and Silver Price Update in India 6
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!

బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

Advertisement
Advertisement
Advertisement