ప్రధాన వార్తలు
రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!
భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 2026 జనవరి 14న.. నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని కార్ల తయారీదారు తెలిపారు.కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్లు లాంచ్కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ ధృవీకరించింది.ఇక మహీంద్రా XEV 9S విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఇది 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు కూడా మంచి బుకింగ్స్ పొందింది. మొదటి రోజే ఏకంగా 70000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును మహీంద్రా కార్లు అధిగమించాయి. బుకింగ్లలో ఎప్పటికప్పుడు మహీంద్రా కంపెనీ కొత్త మార్క్ చేరుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి కార్లు కూడా గతంలో గొప్ప అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.
నార్త్ బ్లాక్లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్లోనే కొనసాగనుంది.కొత్త భవనంలో లేని సౌకర్యంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్ బిల్డింగ్లోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రెస్లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్ రోడ్డులోని ప్రెస్కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్ బ్లాక్లోని ప్రత్యేక ప్రెస్కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రతబడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్ బ్లాక్లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.త్వరలో ‘హల్వా వేడుక’బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
ఎంఎస్ఎంఈ రుణాలకు తోడుగా ‘జన్సమర్థ్’
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అన్నీ కలిసి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కోసం ఒకే విధమైన, ప్రమాణీకరించిన (Standardized) డిజిటల్ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.జన్సమర్థ్ పోర్టల్తో వేగంగా రుణాలుకేంద్ర క్యాబినెట్ సూచనల ప్రకారం, రూ.1 కోటి వరకు ఎంఎస్ఎంఈ రుణాలన్నింటినీ ఇకపై ‘జన్సమర్థ్’ (JanSamarth) పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ను వాడటం వల్ల రుణ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్లు, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్), జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లను బ్యాంకులు ఆటోమేటిక్గా పరిశీలిస్తాయి. వ్యక్తిగతంగా పరిశీలన తగ్గడం వల్ల రుణ అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గి వేగంగా నిధులు మంజూరవుతాయి.క్రెడిట్ వృద్ధిగడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈ రంగానికి బ్యాంకులు అందించిన మద్దతు గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో సుమారు రూ.26.43 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయి. దాదాపు 13 మిలియన్ల (1.3 కోట్లు) ఖాతాల్లోకి ఈ రుణాలు చేరాయి. 2024 జనవరి-అక్టోబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన క్రెడిట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ఈ నూతన డిజిటల్ ప్రణాళిక వల్ల చిన్న వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులైన ప్రతి చిన్న వ్యాపారికి సకాలంలో పెట్టుబడి అందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
కార్పొరేట్
పన్ను మినహాయింపు పిటిషన్ తిరస్కరణ
గంటలోనే రిప్లై ఇస్తారని ఊహించలేదు!
10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్పై ప్రభావమెంత?
ఒక్క రోజులో.. రైల్వే సరికొత్త రికార్డు!
ఆ డ్రింక్స్, మద్యంపై పన్నులు ఇంకా పెంచండి: WHO
ఇన్ఫోసిస్కూ తప్పలేదు
ఎయిర్ ఇండియా కొత్త డ్రీమ్లైనర్
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఖరారు
లాభాల్లోనే లాస్.. బలంగానే బిజినెస్
నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో కద...
పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నిలకడగా నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభ...
ఇంకా మించి పోలేదు: వెండి ధరలపై కియోసాకి
బంగారం, వెండి లోహాలపై ఎప్పుడూ బుల్లిష్గా ఉండే ‘రి...
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్.. నిధుల వినియోగంలో వైఫల్యం
దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశ...
రష్యా చమురు దిగుమతుల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా విధించిన కఠిన...
రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు
దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌ...
యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా...
ఆటోమొబైల్
టెక్నాలజీ
మొబైల్ ఫోన్ల తయారీ @ 75 బి.డాలర్లు
మొబైల్ ఫోన్లకు తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) దన్నుతో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ఆఖరు నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తోంది. ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఈ విషయాలు వెల్లడించారు.2026 మార్చితో పీఎల్ఐ స్కీము ముగియనుండటం పరిశ్రమకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వివిధ ప్రోడక్టుల విభాగాలవ్యాప్తంగా భారత్ తయారీ సామర్థ్యాలను బట్టి తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. మరోవైపు, భారత్ దాదాపు 30 కోట్ల యూనిట్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తి స్థాయికి చేరుతుందని మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ కౌంటర్పాయింట్ సహ వ్యవస్థాపకుడు నీల్ షా తెలిపారు.2025లో భారత్లో తయారైన ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఎగుమతయ్యిందని చెప్పారు. టెక్ దిగ్గజం యాపిల్ కారణంగా అమెరికా మార్కెట్ ప్రీమియం ఉత్పత్తులకు అతి పెద్ద ఎగుమతుల మార్కెట్గా నిలిచిందని పేర్కొన్నారు. శాంసంగ్, మోటరోలా వల్ల కూడా గణనీయంగా విలువ చేసే ఎగుమతులు నమోదైనట్లు తెలిపారు.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు అనుబంధ ఆధునిక సాంకేతికతలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు హెచ్సీఎల్ టెక్ (HCLTech) భారీ ఎంట్రీ లెవల్ జీతాలు ఆఫర్ చేస్తోంది. డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ స్కిల్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఈ ఫ్రెషర్లను కంపెనీ అంతర్గతంగా ‘ఎలైట్ కేడర్’గా పిలుస్తోంది.జనవరి 12న జరిగిన డిసెంబర్ త్రైమాసిక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్లో హెచ్సీఎల్ టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘రెండు త్రైమాసికాల క్రితమే ఎలైట్ ఇంజనీర్లపై మా దృష్టిని స్పష్టంగా వెల్లడించాం. రెగ్యులర్ ఫ్రెషర్ నియామకాలతో పోలిస్తే, ఎలైట్ కేడర్కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతాలు అందిస్తున్నాం. ఇది సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది’ అని తెలిపారు.ఎలైట్ కేడర్కు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలంటే పోటీ జీతాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2025 జూలైలో సుందరరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఫ్రెషర్ నియామకాలలో ఎలైట్ కేడర్ వాటా సుమారు 15–20 శాతం ఉంటుంది. కంపెనీ ఇకపై పరిమాణం కంటే నాణ్యత, ప్రత్యేక నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. హెచ్సీఎల్ టెక్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇటీవల ఫ్రెషర్ల జీతాలను గణనీయంగా పెంచడం గమనార్హం.క్యూ3 ముగింపు నాటికి హెచ్సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ హెడ్కౌంట్ స్పల్పంగా 261 తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను జోడించినప్పటికీ, అట్రిషన్, సెలెక్టివ్ రేషనలైజేషన్ కారణంగా మొత్తం వర్క్ఫోర్స్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు చేర్చుకున్న మొత్తం ఫ్రెషర్ల సంఖ్య 10,032 గా ఉంది.హెచ్సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలునోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హెచ్సీఎల్ టెక్ నికర లాభం డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 11% తగ్గి రూ.4,076 కోట్లకు పరిమితమైంది. ఏకీకృత ఆదాయం 13.3% పెరిగి రూ.33,872 కోట్లు నమోదు చేసింది.
ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్కు సవాలుగా మారింది.ఏమిటీ దాడులు?ఇవి సాధారణంగా మనం చూసే వైరస్లు లేదా ఫిషింగ్ లింక్ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్మెంట్ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.ఐఓఎస్ 26 అప్డేట్ ఎందుకు ముఖ్యం?ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్ 26 వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్లు కేవలం ఐఓఎస్ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్ 18) యాపిల్ ఇకపై ప్యాచ్లను అందించదని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?ఇప్పుడేం చేయాలి?మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్డేట్ చేయండి.కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్లోని ‘లాక్డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి.
పర్సనల్ ఫైనాన్స్
మీ డబ్బు - మీ నిర్ణయం..
సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.రియల్టీ..ఇల్లు కొనటానికి డౌన్పేమెంట్ ఎంతవరకూ ఉండాలి? సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్పేమెంట్గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్పేమెంట్ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్పేమెంట్గా చెల్లించాలి. రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్పేమెంట్ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ ఖర్చులు, లీగల్ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి. బ్యాంకింగ్..స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్ ఖాతా లేక లిక్విడ్ ఫండ్సా? లిక్విడ్ ఫండ్స్లో సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్ ఫండ్స్లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్ ఫండ్స్లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్ రేటు చెల్లించేవారికి సేవింగ్స్ ఖాతాకన్నా లిక్విడ్ ఫండ్సే బెటర్. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. బంగారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరా? దేశంలో అన్ని నోటిఫైడ్ జిల్లాల్లోనూ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బీఐఎస్) హాల్మార్కింగ్ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్మార్కింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, సదరు జ్యుయలర్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్–నోటిఫైడ్ జిల్లాలకు మాత్రం ఈ హాల్మార్కింగ్ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్మార్కింగ్ చేస్తాయి. హాల్మార్కింగ్ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్...రిటైరైన వారికి స్టాక్ మార్కెట్లు సురక్షితమేనా? సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్క్యాప్ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్డీలు, ఆర్బీఐ బాండ్లలో పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్...సిప్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? సిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్ టైమింగ్ను చూసుకుని, బాగా రిస్్కను తట్టుకోగలిగే వారికే! సిప్ వల్ల మార్కెట్ టైమింగ్ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్ కూడా యావరేజ్ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి. ఇన్సూరెన్స్ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు ఇన్సూరెన్స్లో కవరవుతాయా?మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్ పీరియడ్ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్ లేదా సి–సక్షన్ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్ నాటల్ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్ పాలసీల్లో మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
రిటైర్మెంటుతో.. లీవ్ ఎన్క్యాష్మెంట్..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైర్మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు ఆలోచిస్తున్న అంశం.. తమ చేతికొచ్చిన లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తంలో మినహాయింపు రూ.3,00,000 పోగా పన్నుకి గురైన మిగతా భాగం గురించే. దీనిపై సమాచారాన్ని ఈ వారం తెలుసుకుందాం.లీవ్ ఎన్క్యాష్మెంట్పై కొన్ని రూల్స్కి లోబడి రూ.3,00,000 వరకు మినహాయింపు ఉండేది. 24–03–2023 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మొత్తాన్ని రూ.25,00,000కు పెంచారు. ఈ డేటు తర్వాత వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది. ఈలోగా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01–01–2016 నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు జీతాలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ భారీగా పెరిగాయి. 01–01–2016 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగస్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులలో రూ.3,00,000 వరకు మినహాయింపు పొంది, మిగతా మొత్తాల మీద 30 శాతం పన్ను, విద్యా సుంకం 4 శాతం.. వెరసి 31.2 శాతం పన్ను చెల్లించి సరిపెట్టుకున్నారు. ఇది సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలజడి మొదలైంది.కొంత మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్ అంశాన్ని లేవదీసి, ఆ మేరకు అదనంగా కట్టిన ట్యాక్స్ రిఫండు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు యధావిధిగా అన్నింటినీ తోసిపుచ్చారు. విషయం ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. అక్కడ ఉపశమనం లభించింది. వడ్డీతో సహా రిఫండ్ వచ్చింది. ఈ విషయం ఉద్యోగ సంఘాల ద్వారా ఊరు, వాడా చేరింది. ఒకే ప్రశ్న మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది.. మీరూ రిఫండు కోసం క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయడం తప్పు కాదు. ఎటువంటి రిస్కు కాదు. ఖర్చేమీ కాదు. ఫైల్ చేయండి.ఇదీ చదవండి: అంతులేని ధరల పెంపు ఆగేదెప్పుడో..ఎలా చేయాలి..కాగితాలన్నీ సమకూర్చుకోండి. మీ గత చరిత్ర ఒక పద్ధతిలో పెట్టండి. ఏ సంవత్సరంలో దాఖలు చేశారు, అక్నాలెడ్జ్మెంటు, రిటర్ను కాపీ, అసెస్మెంట్ ఆర్డరు, ట్యాక్స్ చెల్లించిన చలాన్లు, వాటికి సంబంధించిన అన్ని కాగితాలు.కాలదోషం పట్టిన కేసుల్లో రిటర్ను వేయకూడదు. అలా వేయాలంటే డిపార్టుమెంటు నోటీసులు ఇవ్వాలి. ఈ విషయంలో అలాంటివి జరగవు. ఆటోమేటిక్గా వాళ్లు రిఫండు ఇవ్వరు. మీరు రివైజ్ రిటర్ను వేయాలి.రివైజ్ రిటర్ను వేయాలంటే మీకు అనుమతి కావాలి. ఆ అనుమతి కేంద్ర పన్నుల బోర్డు ఇవ్వాలి. బోర్డు అంటే.. మీరు ఢిల్లీ పరుగెత్తనక్కర్లేదు. మీకు సంబంధించిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ వారికి దరఖాస్తు చేసుకోవాలి.ఇలా దరఖాస్తు చేయడాన్ని కండోనేషన్ అప్లికేషన్ వేయడం అంటారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్లో వీరి కార్యాలయం ఉంది. ప్రత్యక్షంగా ఫైల్ చేయొచ్చు లేదా ఐటీ పోర్టల్లోనైనా చేయొచ్చు. లాగిన్ తర్వాత సర్వీసెస్ బోర్డుకి వెళ్లాక, కండోనేషన్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. నింపండి.ఏ వివరాలు ఇవ్వాలంటే.. మీ వివరాలు, కేసు వివరాలు, గతంలో రిటర్న్ వేసిన వివరాలు, నిజాలన్నీ పొందుపరుస్తూ, నా తప్పేమీ లేదు, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని రివైజ్ రిటర్ను వేయడానికి అనుమతి వేడుకోండి.సాధారణంగా అనుమతి ఇస్తారు. రోజూ వెబ్సైట్ వాచ్ చేయండి. అనుమతి రాగానే రివైజ్ రిటర్ను వేయండి.అన్ని కాగితాలు/వివరాలు ఇచ్చి రిటర్ను వేస్తే రిఫండు వచ్చే అవకాశం ఉంది.
మీ ఇల్లు బంగారంగానూ!
తాకట్టు... రుణం!. ఈ రెండూ భవిష్యత్తుని నిర్ణయించేవే. అది ఎదగటమైనా... పాతాళానికి పడిపోవటమైనా!. దానికి దిక్సూచులు ఏ అవసరానికి తీసుకుంటున్నాం? ఎంత క్రమశిక్షణతో తిరిగి తీరుస్తున్నామనేవే. ఇక రుణ ప్రపంచానికి హృదయం లాంటివి హోమ్లోన్... గోల్డ్ లోన్. ఒకటి ఆశలు నెరవేర్చేదైతే మరొకటి అవసరాన్ని తీర్చేది. మరి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రెండూ ఈ రుణాలిస్తున్నాయి కదా... ఏది మంచిది? ఏ రుణం ఎక్కడ తీసుకుంటే మంచిది? వీటికి సమాధానమే ఈ వెల్త్ స్టోరీ...సరైన రుణాన్ని, సరైన సంస్థను ఎంచుకోకకపోవటం వల్ల లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉండదూ? గృహరుణంలో ఒక్క 0.5 శాతం తేడా వల్ల మనం చెల్లించే సొమ్ము కొన్ని లక్షల రూపాయలు పెరిగిపోతుందంటే ఇబ్బందికరంగా లేదూ? అందుకే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఎక్కడ రుణం తీసుకున్నా... మన అవసరమేంటన్నది ముఖ్యం. ఆ అవసరానికి మనకు ఎంత త్వరగా రుణం వస్తోంది? ఎంత వడ్డీకి వస్తోంది? మన దగ్గర అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయా? మనకు కొన్ని వెసులుబాట్లు అవసరమా? ఇలాంటివన్నీ చూసుకుని, దానికి తగ్గ సంస్థను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. అదెలాగో చూద్దాం... గృహ రుణానికి బ్యాంకే మంచిదా? గృహ రుణం తీసుకునే వారు ఒక్క వడ్డీ రేటే కాకుండా చాలా అంశాలు చూడాలి. అదేమిటంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంకుల్లోనే తక్కువ. ఎందుకంటే ఇవి ఆర్బీఐ రెపో రేటు మాదిరి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేట్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రేట్లకు అనుగుణంగా తక్షణం మార్పుచేర్పులుంటాయి. ఉదాహరణకు 0.5 శాతం గనక వడ్డీ రేటు తగ్గితే... 20 ఏళ్ల కాల వ్యవధికి రూ.50 లక్షల రుణంపై ఏకంగా రూ.3 లక్షలు మిగుల్చుకోవచ్చు. పైపెచ్చు బ్యాంకుల్లో గృహ రుణాలను గరిష్టంగా 30 ఏళ్ల కాలానికీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, దీర్ఘకాలం కారణంగా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. కాకపోతే బ్యాంకుల్లో గృహ రుణ దరఖాస్తుల పరిశీలన చాలా కఠినంగా ఉంటుంది. ప్రాపరీ్టకి క్లియర్ టైటిల్తోపాటు, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ (రుణ పరపతి/ రుణ చరిత్ర) 700కు పైన ఉండాలి. చెల్లింపుల సామర్థ్యాలనూ బ్యాంక్లు చూస్తాయి. దీనికితోడు న్యాయపరమైన క్లియరెన్స్ కూడా తీసుకుంటాయి. కనుక ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎన్బీఎఫ్సీలు ఎవరికంటే... నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) గృహ రుణాల విషయంలో బ్యాంకుల మాదిరి అంత కఠినంగా వ్యవహరించవు. 700కు దిగువన క్రెడిట్స్కోరు ఉన్న వారికి సైతం, ఇతర అర్హతల ఆధారంగా ఇవి రుణాలను అందిస్తుంటాయి. ఆదాయ ధ్రువీకరణల్లేని స్వయం ఉపాధిపై ఉన్న వారికి, తక్కువ ఆదాయ వర్గాలకు సైతం ఎన్బీఎఫ్సీల్లో రుణాలు లభిస్తాయి. పైపెచ్చు ఎన్బీఎఫ్సీల్లో గృహ రుణం కేవలం రోజుల వ్యవధిలో మంజూరవుతుంది. సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే రుణం పొందొచ్చు. అంటే బ్యాంకులతో పోలి్చనపుడు ఎన్బీఎఫ్సీల్లో వేగవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఆశించొచ్చు. కాకపోతే ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. కనుక వడ్డీ రూపంలో కాస్త ఎక్కువ చెల్లించాలి. బ్యాంకుల్లో మాదిరి అధిక రుణం మొత్తం అన్ని ఎన్బీఎఫ్సీల్లో సాధ్యపడదు. వీరికి బ్యాంక్ బెటర్.. → మంచి క్రెడిట్ స్కోరు ఉండి, ఆదాయ ధ్రువీకరణలున్న వారికి. → ఆర్బీఐ నియత్రణల కింద మరింత పారదర్శకత కోరుకునే వారికి. → సమయం పట్టినా తక్కువ వడ్డీకి రుణం కావాలనుకునేవారికి. వీరికి ఎన్బీఎఫ్సీలు.. → తక్కువ ఆదాయం లేదా ఫ్రీలాన్స్, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం వచ్చేవారికి → వేగంగా రుణం మంజూరు కోరుకునే వారికి. ళీ వడ్డీ రేటు కాస్త ఎక్కువైనా.. తమ అవసరాలకు వీలుగా సౌకర్యవంతమైన షరతులపై రుణం కోరుకునే వారికి బంగారంపై రుణం ఎక్కడ నయం? గృహ రుణం మాదిరే బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణమూ సెక్యూర్డ్ కిందికే వస్తుంది. కనుక వీటిపైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ రుణం మొత్తం, వడ్డీ రేటు, కాల వ్యవధి, చెల్లింపుల్లో సౌలభ్యం పరంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బ్యాంక్లు ఎక్కడ బెటరంటే... → బంగారంపై వడ్డీ రేటు బ్యాంకుల్లో తక్కువ. ఇవి 8 శాతం రేటుకే రుణాలిస్తుంటాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ రేటు గరిష్టంగా 12 శాతం వరకు ఉంటుంది. → బంగారంపై బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణాలు తీసుకునే సౌలభ్యం ఉంది. రుణం తీసుకుని, ప్రతి నెలా చెల్లింపులు చేయకుండా.. ఒకేసారి తిరిగి చెల్లించేట్టయితే ఏడాది కాలానికి మంజూరు చేస్తారు. → రుణం తీసుకుని నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించేట్టు అయితే రెండు నుంచి మూడేళ్ల కాలానికి రుణాలిస్తారు. → ఇక బ్యాంకుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులైతే బంగారంపై తక్కువ రేటుకు రుణాలిస్తుంటాయి. → ఆర్బీఐ మార్గదర్శకాలను బ్యాంకులు కచి్చతంగా అనుసరిస్తుంటాయి. కనుక భద్రత, పారదర్శకత ఎక్కువ. → బ్యాంకుల్లో బంగారంపై రుణం అదే రోజు, గంటల్లోనే మంజూరవుతుంది. → కాకపోతే బ్యాంకుల్లో బంగారం విలువపై తక్కువ రుణం లభిస్తుంది. అంటే ఎక్కువ బ్యాంకులు బంగారం విలువలో 65–70 శాతానికి మించి రుణాన్ని ఇవ్వవు. ఎన్బీఎఫ్సీలు ఎక్కడ బెటరంటే... → ఎన్బీఎఫ్సీల్లో బంగారం రుణాలపై అధిక వడ్డీ రేటు అమలవుతుంది. వీటిల్లో 12 శాతం నుంచి 30 శాతం మధ్య రేటు ఉంటుంది. → కేవైసీ పరంగా ఆధార్, పాన్ ఇస్తే చాలు... బ్యాంకుల్లో మాదిరే బంగారంపై రుణం అదే రోజు వేగంగానే మంజూరవుతుంది. → ముఖ్యంగా బంగారంపై అధిక రుణాన్ని ఎన్బీఎఫ్సీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ, ఇందుకోసం అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సిందే. → వడ్డీని ఏ నెలకానెల కట్టేసి.. అసలును చివర్లో కట్టేస్తే సరిపోతుంది. → కాకపోతే వీటిల్లో రుణ కాలవ్యవధి బ్యాంకుల్లో మాదిరి సుదీర్ఘంగా ఉండదు. ఆరు నెలలు, ఏడాదికే ఆఫర్ చేస్తాయి. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. → రుణాన్ని సకాలంలో చెల్లించడంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తాయి. అంగీకారానికి ముందు.. → రుణం తీసుకునే ముందు ఒప్పంద నియమ నిబంధనలు, షరతులు, చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. → తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఆప్షన్లను తెలుసుకోవాలి. → రుణాన్ని నిరీ్ణత కాల వ్యవధికి ముందే తీర్చివేస్తే పెనాల్టీ మాదిరి ఏవైనా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందా? అడగాలి. → వివిధ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య రుణ రేట్లు, చార్జీలను పోల్చి చూసుకోవాలి. → సాధారణంగా దీర్ఘకాల రుణాలకు బ్యాంక్లు అనుకూలం, సౌకర్యం. → అత్యవసరంగా, అధిక రుణం కోరుకునే వారికి ఎన్బీఎఫ్సీలు అనుకూలం.రుణ వ్యయాలు తగ్గించుకోవడమెలా? → రుణం తీసుకోవడానికి ముందు తమ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలి. ఏడాదిలో ఒక్కసారి క్రెడిట్ స్కోరును ఆయా సంస్థలు ఉచితంగా ఇస్తాయి. → 760కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారు తక్కువ వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కోసం డిమాండ్ చేయొచ్చు. → గృహ రుణం అయితే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ (ఆర్బీఐ రెపో/ఈబీఎల్ఆర్) రేటు ఆధారితంగా ఎంపిక చేసుకోవాలి. → రుణం తీసుకునే సమయంలో అధిక రేటు ఉండి, ఆ తర్వాత రేట్లు దిగొస్తే.. మిగిలిన బకాయిని తక్కువ రేటు ఉన్న సంస్థకు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి.
ప్రీ అప్రూవ్డ్ లోన్ గురించి తెలుసా.. బ్యాంక్ ఎవరికి ఇస్తుందంటే?
ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.ఈ లోన్ ఎవరికి ఇస్తారు?బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.గుర్తుంచుకోవాల్సిన విషయాలుబ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.


