ప్రధాన వార్తలు

విప్రో లాభం ఫ్లాట్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు. హెచ్1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..యూఎస్ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఆధారంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇతర విశేషాలు..2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్చేసి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు
ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.షేరుకి రూ.23 డివిడెండ్వాటాదారులకు ఇన్ఫోసిస్ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్ కాగా నవంబర్ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా తెలిపారు.ఇతర విశేషాలుక్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.ఈ కాలంలో 3.1 బిలియన్ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది. ఆదాయంలో ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్ బిజినెస్ 8.3 శాతం, కమ్యూనికేషన్స్ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి. రిటైల్ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్ సైన్సెస్ 9 శాతం క్షీణించింది.ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.యూరప్ బిజినెస్ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్ వాటా 2.9 శాతమే.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచి్చన ఎన్యుమరేటర్లతో వారు..‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచి్చన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ..వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు.

అమీర్ చంద్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు కేఆర్బీఎల్, ఎల్టీ ఫుడ్స్సహా సర్వేశ్వర్ ఫుడ్స్ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది.

రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో
న్యూఢిల్లీ: క్విక్కామర్స్ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్పర్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు.త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్కామర్స్ విభాగంలో బ్లింకిట్, ఇన్స్టామార్ట్లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు. విస్తరణపై వ్యయం తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్ షీట్ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.

సెబీకి డ్యూరోఫ్లెక్స్ ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: మ్యాట్రెస్ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ తమ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్ వాటాపరంగా దేశీయంగా టాప్ 3 మ్యాట్రెస్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్ బ్రాండ్స్ పేరిట మ్యాట్రెస్లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్ ట్రేడ్ స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది.
కార్పొరేట్

విప్రో లాభం ఫ్లాట్

మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

సెబీకి డ్యూరోఫ్లెక్స్ ప్రాస్పెక్టస్

రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో

కుల గణనలో పాల్గొనబోం

రూ.6,500 కోట్లతో జీహెచ్సీఎల్ విస్తరణ

హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు

రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!

ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్లు చూశారా..?

లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025: టాప్లో జెప్టో

నష్టాలకు బ్రేక్ లాభాల్లో మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్మార్కె...

‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పసిడి, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...

340 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...

పసిడి పండుగ..
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్...

యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించిన భారత్..
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థి...

‘ఫిషింగ్’ వసతులు మెరుగుపరచాలి
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వీలుగా నీతి ఆయోగ్ కీలక...

ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్...

ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గిన ధరల దూకుడు
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో...
ఆటోమొబైల్
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ విడుదల
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ(AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ పూర్తిగా అంతర్గతంగా శిక్షణ ఇచ్చిన తన మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ ‘మై ఇమేజ్-1(MAI-Image-1)’ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఓపెన్ఏఐ (OpenAI)పై ఆధారపడుతుండడాన్ని తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది.ఫొటోరియలిస్టిక్ ఇమేజరీ‘MAI-Image-1 మోడల్ ఫొటోరియలిస్టిక్ ఇమేజరీని ఉత్పత్తి చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఫొటోలో లైటింగ్ పరిస్థితులు, నీటిపై ప్రతిబింబాలు, ప్రకృతి దృశ్యాలు అత్యంత వాస్తవికంగా ఉంటాయి. భారీ ఎల్ఎల్ఎంలు వాడుతూ నెమ్మదిగా అవుట్పుట్ ఇచ్చే మోడళ్లతో పోలిస్తే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అత్యంత వాస్తవిక అవుట్పుట్లను సాధించడానికి ఇప్పటికే నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం’ అని కంపెనీ తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ MAI-Image-1 ఇప్పటికే ప్రముఖ ఏఐ బెంచ్మార్క్ అయిన ఎల్ఎంఅరెనా(LMArena)లో టాప్ 10లో స్థానం సంపాదించింది. LMArenaలో ఏఐ అవుట్పుట్ల ఆధారంగా వివిధ మోడళ్లను పోల్చి ఉత్తమమైన వాటికి ఓటు వేస్తారు.ఏఐ ఇమేజ్ జనరేషన్ విభాగంలో ఓపెన్ఏఐ (DALL-E), గూగుల్ (Nano Banana) వంటి సంస్థలు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో సంస్థ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓపెన్ఏఐ తన సోరా(Sora) 2 టూల్ను ఉపయోగించి వీడియోలను సృష్టించే యాప్ను ఇప్పటికే అమెరికా, కెనడాలోని యాపిల్ యాప్ స్టోర్లో ప్రారంభించింది.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 6జీ కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 గిగాబిట్స్ పర్ సెకన్ (Gbps) ఇంటర్నెట్ వేగాన్ని సాధించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం, అతి తక్కువ జాప్యం (Ultra low Latency) వంటి అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో చురుకుగా ముందుకు సాగుతోంది.భారత్లో పరిశోధనలుభారతదేశం కేవలం 6జీ టెక్నాలజీని స్వీకరించే దేశంగా కాకుండా దాని రూపకల్పన, అభివృద్ధి, ప్రమాణాలను నిర్దేశించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో భారత్ 6జీ విజన్ను ప్రారంభించింది. 2023 మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ 6జీ విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి ఈ టెక్నాలజీలను రూపొందించి దేశీయంగా అమలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ పరిశ్రమ, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణాల సంస్థల సహకారంతో 2023 జులై 3న భారత్ 6జీ కూటమిని ప్రారంభించారు. భారత్ 6జీ విజన్కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల చర్చల్లో చురుకుగా పాల్గొనడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం దీని విధుల్లో భాగం.టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (TTDF) పథకం కింద 6జీ టెక్నాలజీకి సంబంధించిన 104కి పైగా పరిశోధన ప్రాజెక్టులకు రూ.275.88 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 6జీకి సిద్ధంగా ఉండే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి 100 5జీ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఇవి భవిష్యత్తులో 6జీ పరిశోధనలకు వేదికగా మారుతాయి.🚨 The UAE has successfully completed its first 6G testing, achieving a record speed of 145 Gbps. pic.twitter.com/uhtmRk6Zrv— Indian Tech & Infra (@IndianTechGuide) October 15, 2025ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్!

మొబైల్ ఫోన్ల ఎగుమతులు.. రెట్టింపు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల ఎగుమతులు సెప్టెంబర్ నెలలో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 95 శాతం అధికంగా 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్టు ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకటించింది. ‘‘సాధారణంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎగుమతులు స్తబ్దుగా ఉంటుంటాయి. ఉత్పత్తి, సీజన్ వారీ రవాణా పరిస్థితులు ఇందుకు కారణం.అయినప్పటికీ ఎగుమతులు పటిష్టంగా నమోదు కావడం అన్నది దేశీయంగా బలమైన ఎకోసిస్టమ్ (తయారీ) ఏర్పడినట్టు తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 13.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 60 శాతం అధిక ఎగుమతులు జరిగినట్టు తెలుస్తోంది. దేశ మొబైల్ ఫోన్ల పరిశ్రమ తయారీ, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇవి కీలక ఆయుధాలు’’అని ఐసీఈఏ పేర్కొంది. అమెరికాకు మూడింతలు భారత్ నుంచి అమెరికా మార్కెట్కు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9.4 బిలియన్ డాలర్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.1 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే మూడింతలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో 70 శాతం మేర (9.4 బిలియన్ డాలర్లు) అమెరికా మార్కెట్కే వెళ్లడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం ఎగుమతుల్లో అమెరికా మార్కెట్కు వెళ్లిన మొత్తం 37 శాతంగా ఉంది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద (2025–26) మొబైల్ ఫోన్ల ఎగుమతులు 35 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ‘‘మొబైల్ ఫోన్ పరిశ్రమలో తదుపరి దశ వృద్ధి అన్నది ఇప్పటి వరకు సాధించిన సామర్థ్యాలు, పోటీతత్వాన్ని కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుంది. విడిభాగాల తయారీ ద్వారా మన సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు.

ఐఫోన్ 18 ప్రో మాక్స్.. లాంచ్ ఎప్పుడంటే?
గత నెలలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. కాగా ఇప్పుడు టెక్ దిగ్గజం ఐఫోన్ 18 ప్రో మాక్స్పై దృష్టి సారించింది. అయితే ఈ కొత్త ఫోనుకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కొన్ని లీక్ అయ్యాయి. యాపిల్ కంపెనీ తన తదుపరి ఐఫోన్లో ఏమి అందిస్తుందని ఇక్కడ తెలుసుకుందాం.ఐఫోన్ 18 ప్రో మాక్స్.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మోడళ్లతో పోలిస్తే కొంచెం చిన్న డైనమిక్ ఐలాండ్ను కలిగి ఉండనుంది. రియర్ డిజైన్ కొంత అప్డేట్ పొందుతుంది.. కానీ కెమెరా ప్లేస్మెంట్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఉంటుంది. మెరుగైన థర్మల్ నిర్వహణకు సహాయపడటానికి ఆపిల్ కొత్త స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించనుంది. డిస్ప్లే పరిమాణాల విషయానికొస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచెస్, ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ పొందనున్నట్లు సమాచారం.కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్కు.. వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. రీడిజైన్ కెమెరా కంట్రోల్ బటన్ రానుంది. వేగవంతమైన పనితీరు, మెరుగైన శక్తి సామర్థ్యం కోసం ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.సాధారణంగా ఎప్పుడూ యాపిల్ కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. కాబట్టి ఐఫోన్ 18 సిరీస్ కూడా అప్పుడే (2026 సెప్టెంబర్) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర.. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్
పర్సనల్ ఫైనాన్స్

అన్ని ఎస్ఎంఎస్లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు
కొన్ని ఆన్లైన్ లావాదేవీలకు (Digital transactions) సంబంధించిన ఎస్ఎంఎస్ సందేశాలను (SMS Alerts) వినియోగదారులకు పంపడాన్ని బ్యాంకులు భవిష్యత్తులో నిలిపేయవచ్చు. రూ.100 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపడాన్ని నిలిపివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ బ్యాంకులు ఆర్బీఐ (RBI) ని ఆశ్రయించాయి.ఆన్ లైన్లో ముఖ్యంగా యూపీఐ ద్వారా పదీ.. ఇరవై.. ఇలా చిల్లర పేమెంట్లు పెరిగిపోయాయి. వీటికి సంబంధించిన ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. దీంతో అలర్ట్ వ్యవస్థ మందగమనానికి దారితీసిందని, దీంతో కొన్నిసార్లు, కస్టమర్లు పెద్ద లావాదేవీలకు సంబంధించిన సందేశాలను కూడా కోల్పోతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో అంతర్గత సంప్రదింపులు జరిపిన తరువాత గత నెలలో ఆర్బీఐకి ఈ విజ్ఞప్తి చేశామని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎస్ఎంఎస్లు నిలిపేసిన పక్షంలో ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రక్షణలు ఇంకా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉందని మరొక బ్యాంకింగ్ అధికారి తెలిపారు. ఒక వేళ రూ.100 పరిమితి ఉన్న తక్కువ విలువ లావాదేవీల అలర్టులు కావాలంటే ఎస్ఎంఎస్లు కాకుండా బ్యాంకింగ్ యాప్లు లేదా ఈమెయిల్స్ లో నోటిఫికేషన్ల ద్వారా వాటిని పొందవచ్చని వివరించారు.ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్డుల కోసం కస్టమర్లతో నుంచి నమోదు చేయించుకోవాలి. అయితే ఈమెయిల్ అలర్టులు ఐచ్ఛికం. అంటే ఎస్ఎంఎస్లు ఆటోమేటిక్గా వెళ్తాయి. కానీ ఈమెయిల్ అలర్ట్ లు ఎంచుకున్న వారికి మాత్రమే వెళతాయి.ఒక్క ఎస్ఎంఎస్ పంపడానికి సుమారు 20 పైసలు ఖర్చవుతుంది. ఇది సాధారణంగా వినియోగదారుల మీదే పడుతుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ ఖర్చును తామే భరిస్తున్నాయి. అదే ఈమెయిల్ అలర్టులకు అయితే పెద్దగా ఖర్చు ఉండదు.

బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు

టీడీఎస్ రూల్స్.. కొత్త సెక్షన్: రూ. 20వేలు దాటితే..
2025 బడ్జెట్లో ప్రవేశ పెట్టుబడి, చట్టంలో చోటు చేసుకున్న టీడీఎస్కి సంబంధించిన అంశాల రూల్స్ గురించి ఈ వారం తెలుసుకుందాం. ఇవన్నీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంటే నడుస్తున్న సంవత్సరానికి అమల్లోకి వచ్చాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెట్టారు. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములకు జీతం లేదా పారితోషికం మొదలైనవి ఇవ్వడం పరిపాటి. సెక్షన్ 194 క్యూ కొత్తగా వచ్చింది. సంస్థ చేసే చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది.ముఖ్యమైన అంశాలు..2025 ఏప్రిల్ 1 నుంచి అమలుచెల్లింపులు అంటే జీతం, పారితోషికం, వడ్డీ, కమీషన్, బోనస్. సంస్థ నుంచి పార్ట్నర్స్ ఇలా డ్రా చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని టీడీఎస్ పరిధిలోకి తీసుకురాలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి వీటన్నింటినీ టీడీఎస్ పరిధిలోకి తెచ్చారు.భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లకు వర్తిస్తుంది.దీనివల్ల కాంప్లయెన్స్, పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు. నిజానికి పిలక ముందే దొరుకుతుంది. ముందర కాళ్లకు బంధం.పైన చెప్పిన ఐదు చెల్లింపులు వెరసి .. ఒక్కొక్కటి కాదు.. అన్నీ జాయింటుగా కలిపి సంవత్సరకాలంలో రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. ఎన్నో విషయాల్లో ఒక్కొక్క చెల్లింపునకు ఒక్కొక్క పరిమితి ఉంది. కానీ ఇక్కడ అన్నీ కలిపి రూ. 20,000 దాటితే, టీడీఎస్ అని అంటున్నారు. ఇది ఇటువంటి చెల్లింపుల మీద ఒక కన్నేసి చూడటమా లేదా కన్నెర్ర చేయడమా తెలియడం లేదు.పార్ట్నర్స్ సాధారణంగా విత్డ్రా చేస్తుంటారు. దీన్నే సొంత వాడకాలని అంటారు. ఇటువంటి విత్డ్రాయల్స్ మీద ఎటువంటి టీడీఎస్ లేదు. ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్పరంగా ఆలోచించి, విత్డ్రాయల్స్ చేయండి.చెల్లింపులు చేతికి రావడం, లేదా అకౌంటుకి క్రెడిట్ చేయడం.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ముందు జరిగితే అప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది.టీడీఎస్ రేటు ఎంత అంటే 10 శాతం. వెరసి చెల్లింపులు రూ. 20,000 దాటితే 10 శాతం చొప్పున టీడీఎస్ చేసి, గవర్నమెంట్ ఖాతాలో జమ చేయాల్సిందే.వెరసి చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటకపోతే టీడీఎస్ రూల్స్ వర్తించవు.సెక్షన్ 194 క్యూ ప్రకారం.. జీతాలు, పారితోషికం, కమీషన్, బోనస్, వడ్డీ మొదలైన చెల్లింపులు టీడీఎస్ పరిధిలోకి వస్తాయి.పార్ట్నర్స్కి వారి మూలధనం మీద లేదా అప్పు మీద వడ్డీ ఇచ్చే సంప్రదాయం ఉంది. అందరు పార్ట్నర్స్ ఒక సమాన మొత్తం క్యాపిటల్గా పెట్టలేరు. అలాగే, అందరూ అప్పు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు. అదనంగా పెట్టుబడి చేసినందుకు.. ఆదనపు రాబడే ఈ వడ్డీ.పని చేసినందుకు జీతం ఉంటుంది. స్లీపింగ్ పార్ట్నర్స్కి జీతం ఉండదు.అలాగే పారితోషికం లాభాల ఆర్జనను బట్టి ఉంటుంది. అలాగే బోనస్సు.. అలాగే కమీషనూ. అంటే బుక్స్ క్లోజ్ చేసి లాభాల్ని తేల్చాలి. మార్చి 31వి వెంటనే తేల్చాలి. గడువుతేదీ ఏప్రిల్ 30. అందుకే బుక్స్ వెంటనే రాయాలి. ఈ కొత్త అంశాల వల్ల బుక్ రాసే ప్రక్రియ సజావుగా, కరెక్టుగా, సకాలంలో పూర్తవ్వాలి. ఎప్పుడో రిటర్ను వేసే ముందు తీరిగ్గా అకౌంట్లు రాయడం, ఫైనలైజ్ చేయడం కుదరదు.టీడీఎస్ రికవరీ, చెల్లింపులు.. బుక్స్లో కనిపిస్తాయి.రిటర్నులు దాఖలు చేయాలి. చివరిగా, పార్ట్నర్స్కి చెల్లింపులు టీడీఎస్ మేరకు తగ్గుతాయి. క్యాష్ఫ్లోలు తగ్గుతాయి. సంస్థలో టీడీఎస్ బాధ్యతలు పెరుగుతాయి. ఈ మేరకు సంస్థలు సిద్ధం కావాలి.

లాభాన్ని నష్టంతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నాకు రూ.1.25 లక్షలకు పైగా దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) వచ్చింది. అదే సమయంలో స్వల్పకాల మూలధన నష్టం కూడా ఎదురైంది. ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుని తక్కువ పన్ను చెల్లించడం సాధ్యపడుతుందా? – సత్యనారాయణ గొట్టిపాటిఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాల మూలధన లాభం వచ్చినట్లయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాల మూలధన నష్టం (ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చే మొత్తం/ఎస్టీసీఎల్)) ఎదురైతే.. అప్పుడు ఎల్టీసీజీ నుంచి ఎస్టీసీఎల్ను మినహాయించుకోవచ్చు. దీనివల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను భారం తగ్గిపోతుంది. ఈక్విటీ పెట్టుబడిని కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండిన తర్వాత విక్రయించనప్పుడు వచ్చే లాభం/నష్టాన్ని దీర్ఘకాలంగా, ఏడాది నిండకుండా విక్రయించినప్పుడు వచ్చే మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం/నష్టం కింద పరిగణిస్తారు.ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రూ.2 లక్షల దీర్ఘకాల లాభం వచ్చిందని అనుకుందాం. రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు. అప్పుడు మిగిలిన రూ.75,000పై 12.5 శాతం చొప్పున రూ.9,375 పన్ను చెల్లించాలి. ఒకవేళ అదే ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 స్వల్పకాల నష్టం వచ్చిందనుకోండి. నికర దీర్ఘకాల లాభం రూ.75వేలలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అప్పుడు నికర దీర్ఘకాల మూలధన లాభం రూ.25,000కు తగ్గుతుంది. దీనిపై 12.5 శాతం రేటు ప్రకారం రూ.3,125 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులపై వచ్చిన నష్టం దీర్ఘకాలానికి సంబంధించి అయితే.. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు. అదే స్వల్పకాల మూలధన నష్టాన్ని స్వల్పకాల మూలధన లాభం, దీర్ఘకాల మూలధన లాభంతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్వల్పకాల నష్టం అన్నది స్వల్పకాల లాభం/దీర్ఘకాల మూలధన లాభం మించి ఉంటే.. అప్పుడు సర్దుబాటు చేసుకోగా మిగిలిన నికర నష్టాన్ని ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు) చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇంటి లోన్ ఉంది. మరో 5 ఏళ్లకు పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో వచ్చే మొత్తంతో గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలా లేక మెరుగైన రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలా? – జ్యోతిర్మయిగృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. గృహ రుణం కాకుండా ఇతర రుణాలు ఉంటే, పెట్టుబడుల కంటే ముందు వాటిని తీర్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. ఈ రుణం రేటుతో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయి. కనుక గృహ రుణం లాభదాయకమే. ఒకవేళ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేయడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తే లేదా భవిష్యత్తు ఆదాయం విషయంలో అనిశ్చితిగా ఉంటే అలాగే ముందుకెళ్లొచ్చు. గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు.