Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Employees Being Investigated Have Been Suspended TCS on Nashik Sexual Harassment Probe1
TCSలో కలకలం.. రంగంలోకి పోలీసులు

ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్‌లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.ఇదీ చదవండి: టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్‌ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

Simplest Way to Deactivate Your Deceased Family Member Aadhaar2
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..

సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్‌ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్‌కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026

Smart Kitchen Gadgets That Make Cooking Effortless and Stylish3
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!

వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్‌లో, తక్కువ శ్రమతో స్టయిలిష్‌గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్‌! మీ కిచెన్‌లో టేస్ట్‌ మాత్రమే కాదు, హెల్త్‌ కూడా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ స్మార్ట్‌ ఆయిల్‌ స్ప్రేయర్‌ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్‌ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్‌ మ్యాజిక్‌ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్‌తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్‌ ఫ్రయ్యర్‌లో చికెన్‌ రోస్ట్‌ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్‌ కూడా తగ్గుతుంది! సలాడ్స్‌ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్‌ ఫినిషింగ్‌ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్‌ ఫామ్‌!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్‌ మేకర్‌! ఇందులో ఉన్న స్మార్ట్‌ ‘నాబ్‌’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్‌మెంట్‌ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్‌ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్‌ పార్ట్నర్‌!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్‌ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్‌ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్‌ డిష్‌ నట్‌ బౌల్‌!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్‌ టైమ్‌ను క్లీన్‌గా, స్టయిలిష్‌గా మార్చే చిన్న మ్యాజిక్‌ బౌల్‌! ఇందులో డబుల్‌ డిష్‌ బౌల్స్‌ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్‌ నట్స్‌ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్‌లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!

TCS Makes Only 25000 Fresher Offers This Fiscal Know The Details Here4
టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!

Mercedes Benz EQA EQB A Class Sedan And EQE SUV Discontinued In India Market5
బెంజ్ కీలక నిర్ణయం: నాలుగు మోడల్స్‌కు గుడ్‌బై!

ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది.మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్‌గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

Silver Prices Surge in a Week, Rates Jump to Rs 2.65 Lakh per Kg6
వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!

భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.వెండి ధరలుఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.వెండి రేటు పెరగడానికి కారణాలుపారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్‌లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!

Advertisement
Advertisement
Advertisement