ప్రధాన వార్తలు
భారీ పతనంలో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ గణనీయంగా క్షీణించాయి.ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 0.86 శాతం లేదా 195 పాయింట్లు తగ్గి 22,624 వద్ద, సెన్సెక్స్ 0.97 శాతం లేదా 720 పాయింట్లు తగ్గి 72,862 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్లో బీఈఎల్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.95 శాతం, 2.31 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అతిపెద్ద డ్రాగర్లు. నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
మల్టీ అసెట్ ఫండ్స్తో పెట్టుబడుల్లో వైవిధ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్డ్గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఫండ్స్ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు
బెంగళూరు: ఫండ్స్ ఇండియా రూ.25,000 కోట్ల నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏయూఎం రూ.20వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు వృద్ధి చెందడందో ఇది సాధ్యపడింది. ముఖ్యంగా ఏడాది కాలంలో నిర్వహణ ఆస్తులు 58 శాతం పెరగ్గా.. మూడేళ్లలోనూ ఏటా 38 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు సంస్థ ప్రకటించింది.గత 12 నెలల్లో ఫండ్స్ ఇండియా రూ.2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు చెందినవే. 23 శాతం మేర ధనవంతులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 30 లక్షల యూజర్లకు ఫండ్స్ ఇండియా ప్లాట్ఫామ్ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. సిప్ బుక్ రూ.142 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది.
ఆచితూచి... ఐపీఓలకు!
గత ఏడాది ఐపీవోల జోరు మామూలుగా లేదు. రిటైల్ ఇన్వెస్టర్లకు పండుగలా అనిపించింది. చాలా మటుకు ఇష్యూలు లిస్టింగ్ రోజున భారీగానే లాభాలు ఇచ్చాయి. దీనితో ఏ కంపెనీ ఇష్యూ వచ్చినా 50రెట్లు.. 100 రెట్లు సబ్స్క్రయిబ్ అయిపోయేవి. లిస్టింగ్ లాభాల కోసం అప్లై చేసుకోవడమనేది ఒక వ్యూహంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అదే రిటైల్ ఇన్వెస్టర్లు.. ఐపీవో అంటే వెనక్కి తగ్గుతున్నారు. ఇష్యూలు పూర్తిగా సబ్ర్స్కయిబ్ కావడం లేదు. లిస్టింగ్లు నిరాశపరుస్తున్నాయి. ధీమా దెబ్బతింది. అందుకేనేమో! తాజాగా ఐపీఓకి వచ్చిన ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా అనుబంధ కంపెనీని సైతం రిటైలర్లు పట్టించుకోలేదు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం సెంటిమెంటే. 2025లో ఐపీఓలు విజయవంతం కావడానికి ఇదే సెంటిమెంటు కారణమయితే... ఇప్పుడు రిటైలర్లు చాలా ఐపీఓలకు దూరంగా ఉండటానికి కూడా సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కొన్ని ఐపీఓల్లో రిటైర్లు తక్కువమంది ఇన్వెస్ట్ చేసినా... వారు కంపెనీల ఫండమెంటల్స్ చూసే ముందుకొస్తున్నారనే భావన ఉంది. ఏడాది వ్యవధిలోనే పరిస్థితి ఎందుకిలా మారిపోయింది? దీనికి కారణాలేమిటి? చిన్న ఇన్వెస్టర్ల ఆలోచనేంటి? ఏం చేస్తే బెటర్? అనే అంశాలసమాహారమే ఈ ‘సాక్షి’ వెల్త్ స్టోరీ... – సాక్షి, వెల్త్గతంలో ఐపీవో లిస్టయ్యిందంటే చాలు తక్కువలో తక్కువగా 20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు పక్కా అనే విధంగా ఉండేది. అందుకే రిటైలర్ల విభాగంలో ఒక్కో ఇష్యూ 50 రెట్లు, 100 రెట్లు ఓబర్ సబ్ర్స్కయిబ్ అయ్యేది. నిజానికిలా ఓవర్ సబ్్రస్కయిబ్ అయినపుడు నూటికి 90 శాతం మందికి షేర్లు అలాట్ కావు. కానీ... అలాట్ అయితే లాభాలొస్తాయి కదా అనే ఆశతో ఒక్కొక్కరూ తమ కుటుంబీకులకు ఎన్ని ఖాతాలుంటే అన్ని ఖాతాల్లోనూ దరఖాస్తు చేసేవారు. కొద్దిరోజులు తమ క్యాపిటల్ లాకిన్లో ఉండటానికి కూడా ఇష్టపడేవారు. చివరికి అలాట్ అయి లిస్టింగ్ లాభాలొస్తే హ్యాపీ. కాదంటే నిట్టూర్పు. కానీ ఇటీవల చాలా ఐపీఓలు లిస్టింగ్లో పెద్దగా లాభాలివ్వలేదు. ఇష్యూ ధరకు సమానంగా ఫ్లాట్గానో లేకపోతే ఒక్కోసారి అంతకన్నా తక్కువకే లిస్టవుతున్నాయి. దీనితో ఐపీవోలో అలాట్ అయితే చాలు లాభాలు గ్యారంటీ అనే అభిప్రాయం తొలగిపోయింది.ఓవర్ప్రైసింగ్..చాలా మటుకు కంపెనీలు తమ అసలు వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ఐపీవోలకు ధర నిర్ణయిస్తున్నాయి. బులిష్ సెంటిమెంటుని క్యాష్ చేసుకుని, బయటపడిపోయేందుకు ప్రమోటర్లు ప్రయతి్నస్తున్నారనే అపవాదు ఉంది. చాలా ఐపీఓల పరిస్థితి ఇదే అయినా... ఇటీవల లెన్స్కార్ట్ వంటి ఐపీఓలపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి కూడా. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లకి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని, రాబడులపై స్పష్టత ఉండదని అర్థమవుతోంది. లిస్టింగ్కి ముందు.. తర్వాత..కొన్ని కంపెనీల లెక్కల మాయాజాలమో, యాదృచ్ఛికమో అర్థం కావటం లేదు కానీ.. ఐపీఓకి రావటానికి ముందు ఒకటి రెండేళ్లు అద్భుతమైన పనితీరును చూపిస్తున్నాయి. అంతకుముందు చాలా ఏళ్లు ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం. దీంతో ఆ రెండేళ్ల లెక్కలను చూపిస్తూ.. భవిష్యత్తు సూపర్ అంటూ ఊదరగొడుతున్నాయి. అది నమ్ముకుని కొనుక్కుంటే, ఆ తర్వాత వాస్తవం బోధపడుతోంది. లిస్టింగ్ అయిన తర్వాత ఎరి్నంగ్స్ తీరు చూస్తే భయపెట్టేదిగా ఉంటోంది. ఇటీవల కొన్ని డ్రోన్ కంపెనీలు ఇదే బాగోతాన్ని కళ్లకుకట్టాయి.మారిన మార్కెట్ పరిస్థితులుఇరాన్ యుద్ధ ప్రభావం కావచ్చు,. అంతకుముందు అమెరికా టారిఫ్ల వ్యవహారం కావచ్చు. ఇవన్నీ మార్కెట్లను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకటి తరువాత ఒకటిగా చుట్టుముడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లలో తమ షేర్లను అమ్ముతూనే వస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో జరిపిన అమ్మకాలకు దీటుగా దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేసినప్పటికీ... ఇపుడు తాజా ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ఇక లిక్విడిటీ కూడా కష్టంగా మారుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు స్పెక్యులేషన్ కన్నా క్షేమంగా ఉండటమే మిన్న అనే ధోరణికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరేం చెయ్యాలి?పరిస్థితులు ఇలా మారినంత మాత్రాన ఐపీవో మార్కెట్ మొత్తానికే కుప్పకూలిందనుకోవడానికి లేదు. తాజాగా వస్తున్న ఐపీఓల్లో రిటైలర్ల పాత్ర తగ్గినా పూర్తిగా పోలేదు. కొన్ని ఇష్యూల్లో ఫండ్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మార్కట్పై, సదరు కంపెనీలపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పాలి. ఈ వ్యవహారంపై దేశీ మ్యూచువల్ ఫండ్ దిగ్గజం ఒకరు స్పందిస్తూ... ‘‘గతంలో అందరికీ డబ్బులొచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకుని, ముందడుగు వేసే ఇన్వెస్టర్లకే వస్తున్నాయి. అది రిటైల్ ఇన్వెస్టర్లయినా... హెచ్ఎన్ఐలయినా’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్హెచ్సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే
తెలుసా! ఐటీ రూల్స్ మారాయి...
ఆదాయపన్ను కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త పన్ను ప్రయోజనాల్లేకపోయినా.. ఉన్న వాటిల్లో వేతన జీవులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. యాజమాన్యం సమకూర్చే కారు, ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి. బ్యాంకుల్లో నగదు జమలు, నగదు ఉపసంహరణల నుంచి.. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పాన్ సమరి్పంచడం వరకు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాహన కొనుగోళ్ల విషయంలోనూ పాన్ నిబంధనలు మారాయి. హోటల్ బిల్లులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ఒక పరిమితి దాటతే పాన్ సమరి్పంచాలి. ఇంటి యజమానితో తనకున్న సంబంధాన్ని కిరాయిదారు వెల్లడించాల్సిందే. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను పరంగా వస్తున్న ముఖ్యమైన మార్పుల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ...ఇప్పుడు హైదరాబాద్ వాసులకూ మరింత మెరుగైన హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనం అందుబాటులోకి వస్తోంది. ఈ నగరంలోని వేతన జీవులకు ఇప్పటి వరకు వేతనంలో భాగంగా పొందే ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై పన్ను మినహాయింపు 40 శాతంగానే ఉండేది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లోని వేతన జీవులకు మాత్రమే 50 శాతం పన్ను మినహాయింపు నిబంధన వర్తిస్తోంది.ఏప్రిల్ 1 నుంచి ఈ జాబితాలో కొత్తగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు చేరనున్నాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాల పరిధిలోని వారు హెచ్ఆర్ఏపై మరింత అధిక ప్రయోజనం పొందే అవకాశం రానుంది. కొత్త ఆదాపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి ఈ ప్రయోజనం లేదు. పాత పన్ను విధానంలో రిటర్నులు సమరి్పస్తున్న వారు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదీ ఫార్ములా.. హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపునకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(13ఏ) కింద వీటిని పేర్కొన్నారు.ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)⇒ యాజమాన్యం నుంచి వాస్తవంగా అందుకుంటున్న నెలవారీ హెచ్ఆర్ఏ మొత్తం. ⇒ ఇక్కడ పేర్కొన్న ఎనిమిది మెట్రోల్లో నివసించే వారికి మూలవేతనం, డీఏ మొత్తంలో 50 శాతం, ఇతర మెట్రోల్లోని వారికి 40 శాతం. ⇒ వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం నుంచి మూల వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా వచ్చే మొత్తం. ఉదాహరణకు మూలవేతనం రూ.30వేలు ఉంటే.. ఇందులో 10% రూ.3,000 అవుతుంది. ప్రతి నెలా రూ.10,000 అద్దె చెల్లిస్తున్నట్టు అయితే ఇందులో రూ.3,000 మినహాయించగా రూ.7,000 వస్తుంది. నోట్: ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే సంవత్సరం మొత్తం మీద ఆ మేరకు పన్ను మినహాయింపును ఆదాయం నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.ఈ ప్రయోజనానికి ఇవి తప్పనిసరి.. ⇒ వేతన జీవులై ఉండాలి. ⇒ సీటీసీలో హెచ్ఆర్ఏ భాగంగా ఉండాలి. ⇒ అద్దె ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి. ⇒ ఇంటి అద్దెకు సంబంధించి రుజువులు ఉండాలి. ⇒ పాత పన్ను విధానంలోనే రిటర్నులు వేయాలి.వాహన అలవెన్స్లుయాజమాన్యాలు ఉద్యోగుల అధికారిక, వ్యక్తిగత వినియోగానికి సమకూర్చే కార్ల విషయంలోనూ పన్ను పరంగా మార్పులు రానున్నాయి. 1. ఉద్యోగే కారును సొంతంగా కలిగి ఉండడం లేదా అద్దెకు తీసుకున్న సందర్భాల్లో.. అయ్యే వ్యయాలను పనిచేసే సంస్థ భరిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.5,000తోపాటు, అదనంగా డ్రైవర్ కోసం చేసే ఖర్చు రూ.3,000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.7,000తోపాటు, డ్రైవర్ కోసం చేసే చెల్లింపులు రూ.3,000 పన్ను పరిధిలోకి వస్తాయి. 2. ఒకవేళ కారును యాజమాన్యం కొనుగోలు చేసి లేదా కిరాయికి తీసుకుని ఉద్యోగికి సమకూర్చిన సందర్భాల్లో.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ప్రతి నెలా రూ.2,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాలి. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ప్రతి నెలా రూ.3,000తోపాటు డ్రైవర్కు చెల్లింపుల పేరిట రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 3. ఒకవేళ ఉద్యోగి స్వయంగా సమకూర్చుకున్న కారుపై యాజమాన్యం నిర్వహణ అలవెన్స్ చెల్లిస్తున్నట్టయితే.. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్ల వరకు ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.5,000 మినహాయించగా వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాలి. డ్రైవర్ కోసమూ యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే మరో రూ.3,000 మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ⇒ ఇంజన్ సామర్థ్యం 1.6 లీటర్లకు మించి ఉంటే: ఉద్యోగి కారు కోసం వాస్తవంగా చేసిన వ్యయం నుంచి రూ.7,000 మినహాయించగా వచ్చే మొత్తంపై... డ్రైవర్ పేరిట మరో రూ.3,000పైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ ఒకవేళ కారును పూర్తిగా అధికారిక అవసరాల కోసమే వినియోగించినట్టయితే, అటువంటప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటి సేవలు, యుటిలిటీలు..⇒ స్వీపర్లు, గార్డెనర్లు, వాచ్మెన్ వేతనాల కోసం ఉద్యోగులకు యాజమాన్యాలు చేసే వాస్తవ చెల్లింపులపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ గ్యాస్, విద్యుత్, నీటిని ఇతర సంస్థల నుంచి పొందినట్టయితే, ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు ఉద్యోగి చేసిన వాస్తవ చెల్లింపులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం తన సొంత వనరుల నుంచి వీటిని అందించినట్టయితే అప్పుడు ఒక్కోయూనిట్కు అయ్యే వాస్తవ వ్యయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ⇒ ఒక సంవత్సరంలో పనిచేసే సంస్థ నుంచి పొందిన బహమతులు లేదా గిఫ్ట్ వోచర్ల విలువ రూ.15,000 మించితే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇒ పనిచేసే సమయంలో సంస్థ ఉద్యోగులకు ఆహారం, పానీయాలను ఉచితంగా పెయిడ్ వోచర్ల రూపంలో అందిస్తుంటే ఆ మొత్తంపై పన్ను ఉండదు. ఒక్కో భోజనం ఖర్చు గరిష్ట పరిమితి రూ.200.పిల్లల విద్య, హాస్టల్ ప్రయోజనాలుపిల్లల విద్యకు సంబంధించి చేసే ఖర్చులపై మరింత పన్ను మినహాయింపునకు ఇకమీదట అవకాశం లభించనుంది. నెలవారీ ఒక్కొక్కరికి ఉన్న రూ.100 పరిమితి రూ.3,000కు పెరగనుంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, హాస్టల్ కోసం చేసే వ్యయాలపై ప్రస్తుతం ఉన్న నెలవారీ రూ.300 కాస్తా రూ.9,000కు పెరగనుంది. అంటే ఇంత మొత్తంపై ఇకనుంచి పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టం, 2026లోని 280 నిబంధన కింద ఈ ప్రయోజనాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ ప్రయోజనం ఒకే విధంగా అమలు కానుంది. రుజువులు అవసరం..⇒ ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద పాత పన్ను విధానంలో పలు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. ⇒ హెచ్ఆర్ఏ క్లెయిమ్ కోసం ఆర్థిక సంవత్సరంలో అద్దె చెల్లింపులు రూ.1,00,000 దాటితే అప్పుడు ప్రాపర్టీ యజమాని పేరు, చిరునామా, పాన్, అతడితో ఉన్న సంబంధం (రెంటల్ అగ్రిమెంట్) రుజువులు చూపించాలి. ⇒ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కోసం ప్రయాణాలకు అయిన వ్యయాల రుజువులు సమరి్పంచాలి. ⇒ ‘ఇంటి ప్రాపర్టీ ఆదాయం’ నుంచి వడ్డీని మినహాయింపు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే గృహ రుణదాత పేరు, చిరునామా, పాన్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిల్లోనూ మార్పులు..⇒ బ్యాంకుల్లో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ప్రస్తుతం పాన్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమలు, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, ఉమ్మడి అభివృద్ధి (జాయింట్ డెవలప్మెంట్) లావాదేవీ విలువ రూ.20 లక్షలు మించితే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. ⇒ ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతర అన్ని వాహన కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఏ వాహనం కొనుగోలు చేస్తున్నా.. రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చెల్లింపులు రూ. లక్షకు మించితే పాన్ సమర్పణ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇకమీదట పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.
కార్పొరేట్
ఫండ్స్ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెం...
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడిక...
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దల...
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాల...
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చ...
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ...
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభ...
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?
ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందుల...
ఆటోమొబైల్
టెక్నాలజీ
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్లో రిమోట్గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్ తన మేనల్లుడి గురించి లింక్డ్ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు."వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్తో పంచుకున్నారు.కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.పని తీరును మార్చిన ఏఐ2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.బిజీగా ఉన్నట్లు నటన!చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!
పర్సనల్ ఫైనాన్స్
‘ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తు’ మారుతుందా?
ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రంప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధిగత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం) చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు 8.2 శాతంగా కొనసాగుతోంది.
ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు!
‘నాకు కంపెనీ అందించే ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇంకేం పర్లేదు’.. సగటు ఉద్యోగి ధీమా ఇది. కానీ, ఆ ధీమా వెనుక ఒక ముప్పు పొంచి ఉందన్నది చేదు నిజం. ఆసుపత్రి బిల్లు చేతికి వచ్చాక ‘రూమ్ రెంట్ క్యాపింగ్’ పేరుతో సగం డబ్బులు కట్ అయినప్పుడో, లేదా అనుకోకుండా ఉద్యోగం పోయి హెల్త్ కవర్ రద్దయినప్పుడో కానీ ఆ కార్పొరేట్ పాలసీ ఎంత బలహీనమైనదో అర్థం కాదు.వైద్య ఖర్చులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో కేవలం ఆఫీస్ ఇచ్చే పాలసీపైనే ఆధారపడటం అంటే.. వర్షం కురుస్తున్నప్పుడు చిల్లుల గొడుగు పట్టుకుని బయటకు వెళ్లడమే. జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ వంటి ప్రముఖులు సైతం ఈ విషయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నారు. అసలు ఆఫీస్ ఇన్సూరెన్స్లో మనకు తెలియని లోపాలేంటి? సొంతంగా ఒక పాలసీ ఉండటం ఎందుకు అత్యవసరం? తెలుసుకుందాం.కార్పొరేట్ పాలసీల్లోని ‘ఫైన్ ప్రింట్’ చదివారా?చాలా మంది ఉద్యోగులు తమ హెచ్ఆర్ ఇచ్చే పాలసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించరు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీకి తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని కవర్ చేసేలా రూపొందించబడుతుంది. ఇందులో ఉండే కొన్ని పరిమితులు అత్యవసర సమయంలో అవాంతరంగా మారవచ్చు.గది అద్దెపై పరిమితి: మీ పాలసీలో రోజుకు గది అద్దె రూ.5,000 అని ఉందనుకుందాం. మీరు రూ.10,000 గదిని ఎంచుకుంటే కేవలం అద్దెలో వ్యత్యాసమే కాకుండా డాక్టర్ ఫీజులు, సర్జరీ ఖర్చుల్లో కూడా బీమా సంస్థ దామాషా పద్ధతిలో కోత విధిస్తుంది.తక్కువ కవరేజీ: నగరాల్లో వైద్య ఖర్చులు ఏటా 15% వరకు పెరుగుతున్నాయి. ఒక మోస్తరు శస్త్రచికిత్సకే రూ.5-10 లక్షలు ఖర్చవుతున్న రోజుల్లో కంపెనీ ఇచ్చే రూ.3 లేదా 5 లక్షల కవరేజీ ఎంతవరకు సరిపోతుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది.నియంత్రణ లేకపోవడం: పాలసీలో ఏయే జబ్బులు కవర్ కావాలి, ఏ యాడ్ఆన్లు ఉండాలి అనే నిర్ణయం కంపెనీదే తప్ప మీది కాదు.ఉద్యోగం పోతే.. బీమా ఖేల్ ఖతం!కార్పొరేట్ బీమాలో అతిపెద్ద లోపం ఇదే. ఈ పాలసీ ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. మీరు రాజీనామా చేసినా, లేఆఫ్స్ వల్ల ఉద్యోగం కోల్పోయినా లేదా వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నా.. మరుక్షణమే మీ బీమా రక్షణ రద్దవుతుంది. ఒకవేళ ఆ విరామ సమయంలోనే అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏమిటి? కొత్త ఉద్యోగంలో చేరే వరకు మీకు ఎటువంటి రక్షణ అందదు.సొంత పాలసీ ఎందుకు తప్పనిసరి?వ్యక్తిగత ఆరోగ్య బీమాతో కలిగే ప్రయోజనాలు ఇవే..చిన్న వయసులోనే మేలు: తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా ఎటువంటి వైద్య పరీక్షలు లేకుండానే పాలసీ లభిస్తుంది.వెయిటింగ్ పీరియడ్: బీమా తీసుకున్న వెంటనే కొన్ని జబ్బులు కవర్ కావు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అప్పటికే వెయిటింగ్ పీరియడ్ పూర్తయి రక్షణ లభిస్తుంది.నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్ చేయని ప్రతి ఏటా మీ బీమా మొత్తం పెరుగుతూ పోతుంది. ఇది రిటైర్మెంట్ సమయానికి పెద్ద రక్షణ కవచంగా మారుతుంది.పన్ను ప్రయోజనం: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80D కింద వ్యక్తిగత పాలసీకి చెల్లించే ప్రీమియంపై మినహాయింపు పొందవచ్చు. కంపెనీ పాలసీలో ఈ ప్రయోజనం ఉండదు.ఇప్పుడేం చేయాలి?కార్పొరేట్ బీమాను వదులుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాథమిక రక్షణగా వాడుకుంటూనే ఒక వ్యక్తిగత పాలసీని కలిగి ఉండటం మంచి నిర్ణయం. చిన్న క్లెయిమ్లకు ఆఫీస్ బీమాను, పెద్ద ఆపదలు వస్తే మీ సొంత పాలసీని వాడుకోవచ్చు. చివరగా.. ఉద్యోగాలు మారతాయి, కంపెనీ పాలసీలు మారతాయి, కానీ మీ ఆరోగ్యం, మీ ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే ఉండాలి.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
ఫండ్స్లో పెట్టుబడులకు గిఫ్ట్ కార్డులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్ కార్డులు లేదా గిఫ్ట్ ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్ పీపీఐలను ఎల్రక్టానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.గిఫ్ట్ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది.
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది.


