Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Vietnam 27 Billion USD Banking Scandal Real Estate Tycoon Asset Auction1
రూ.2.26 లక్షల కోట్ల నిధులు మళ్లింపు.. మరణశిక్ష

ఆసియా బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడి, మరణశిక్ష పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రూంగ్ మై లాన్(69) ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్‌సీబీ) నుంచి ఆమె కొల్లగొట్టిన సుమారు 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.26 లక్షల కోట్లు) నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ భారీ వేలం ప్రక్రియను చేపడుతున్నారు.వేలం జాబితాలో ఏమేమున్నాయి?వియత్నాం సివిల్ జడ్జిమెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన వివరాల ప్రకారం, విలాసవంతమైన భవనాల నుంచి చిన్నపాటి వస్తువుల వరకు వేలంలో ఉంచనున్నారు. హో చి మిన్ సిటీలోని ఖరీదైన ఆఫీస్ స్పేస్‌లు, టే నిన్ ప్రావిన్స్‌లోని భారీ ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ హెర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగులు, 8,500 కంటే ఎక్కువ డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వేలం వేయనున్నారు. ఒక లగ్జరీ కారు, రెండు ట్రక్కులు, భారీ యంత్రాలతో పాటు లాన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన ‘రెవరీ సాయిగాన్’ యాచ్ (విహార నౌక) ఉంది. లగ్జరీ ఫర్నీచర్ కంపెనీకి చెందిన సుమారు 3,70,000 ఇన్వెంటరీ వస్తువులను కూడా ఈ వేలంలో విక్రయించనున్నారు.కేసు నేపథ్యం ఏమిటి?వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న ట్రూంగ్ మై లాన్ సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్‌లోని నిధులను దశాబ్ద కాలం పాటు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 2024లో బ్యాంక్ నుంచి 12.3 బిలియన్ డాలర్లను మళ్లించినందుకుగాను కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక నేరాల కింద రెండో దఫా విచారణలోనూ ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆమె చేసిన కుంభకోణం వల్ల కలిగిన మొత్తం నష్టం 27 బిలియన్ డాలర్లుగా తేల్చారు. దీన్ని రికవరీ చేసేందుకు ఆమె వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులను జప్తు చేశారు.ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Govt to Fix BT Cotton Seed MRP for 2026-27 Kharif Season2
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!

దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధరను (ఎంఆర్‌పీ) కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది. 2026-27 సీజన్‌కు సంబంధించి బోల్‌గార్డ్-1 (బీజీ-1), బోల్‌గార్డ్-2 (బీజీ-2) రకాల ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ట ధర మాత్రమే. కంపెనీలు లేదా డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు కానీ, ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.ధరల్లో మార్పు ఉంటుందా?గత కొన్నేళ్ల ధోరణిని పరిశీలిస్తే ఈ ఏడాది విత్తన ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తుది నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది (2025-26) బీజీ-2 450 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.900గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2024-25లో ఇది రూ.864గా ఉండేది. 2016లో ధరల నియంత్రణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజీ 1 ధర రూ.635 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.2019-20లో కూడా ప్రభుత్వం ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది సుమారు 4 శాతం మేర ధరలు పెరిగినందున ఈసారి పెంచకపోయినా విత్తన పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.ధరల నియంత్రణపై భిన్నాభిప్రాయాలుకాటన్ సీడ్స్ ప్రైస్ ఆర్డర్-2015 ప్రకారం, ధర పెంచినా పెంచకపోయినా ఏటా ప్రభుత్వం ఎంఆర్‌పీని నోటిఫై చేయడం చట్టపరమైన బాధ్యత. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2016కు ముందు విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విత్తనాలను విక్రయించి రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రభుత్వం గరిష్ట ధరను (క్యాప్‌) నిర్ణయిస్తోంది. ఇది రైతులకు రక్షణ కవచం లాంటిదని అధికారులు పేర్కొంటున్నారు.బీటీ పత్తి విత్తనాల ధరల నిర్ణయాన్ని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్‌) వ్యతిరేకిస్తోంది. బీటీ విత్తనాలకు ధర నిర్ణయించడం వల్ల నాన్-జీఎం (సాధారణ) పత్తి విత్తనాలు కేవలం రూ.300-400కే లభిస్తున్నాయని, అలాగే గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి బీటీ విత్తనాలకు తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు.సాగులో బీటీ పత్తిదే హవా..కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ గత నెల లోక్‌సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 95 శాతం బీటీ పత్తిదే. అయితే, బీటీ పత్తిలోని ప్రొటీన్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని గులాబీ రంగు పురుగు పెంచుకోవడం ఇప్పుడు శాస్త్రవేత్తలను, రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పండించే అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఉధృతి పెరగడం సాగు ఖర్చును పెంచుతోంది.ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

India Shields Energy Imports with Boosted LPG Output3
వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పెరిగిన స్వదేశీ ఉత్పత్తిఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్‌పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

SEBI Urges Directors Act Responsibly Avoid Baseless Allegations HDFC Bank4
స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతగా మెలగాలి: సెబీ

కార్పొరేట్ గవర్నెన్స్‌లో కీలకమైన స్వతంత్ర డైరెక్టర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించకూడదని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్-టైమ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పాండే, కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం స్వతంత్ర డైరెక్టర్ల ప్రాథమిక విధి అని గుర్తుచేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే వాటిని లేవనెత్తాలని సూచించారు.గందరగోళానికి తావుండకూడదుఅతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో నైతిక విభేదాల కారణంగా తప్పుకుంటున్నట్లు పేర్కొనడం మార్కెట్‌లో కలకలం రేపింది. ఈ పరిణామంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీగా పతనమవ్వడమే కాకుండా బ్యాంక్ అంతర్గత పరిపాలనపై పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై స్పందిస్తూ ‘సరైన ఆధారాలు, రికార్డులు లేకుండా కేవలం ఊహాగానాలతో కూడిన ఆరోపణలు చేయడం ఎవరికీ తగదు’ అని సెబీ చీఫ్ పేర్కొన్నారు.ఎల్‌ఓడీఆర్ నిబంధనలే కీలకంలిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్టోజర్‌ రిక్వైర్‌మెంట్స్‌(ఎల్‌ఓడీఆర్‌) నిబంధనలు, కంపెనీల చట్టం కింద స్వతంత్ర డైరెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పాండే వివరించారు. కంపెనీ పనితీరుపై ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఆ అంశాలను బోర్డు సమావేశం మినిట్స్ సమావేశంలో తప్పనిసరిగా నమోదు చేయాలని పట్టుబట్టాలి. అనైతిక ప్రవర్తన, మోసాలు లేదా కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి అంశాలను అస్పష్టంగా వదిలేయకుండా, అధికారికంగా రికార్డ్ చేయాలని ఆయన సూచించారు.ఆర్‌బీఐ క్లీన్ చిట్.. సెబీ నిశిత పరిశీలనహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే స్పందించిందని, ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేదని ఆర్‌బీఐ వెల్లడించిన విషయాన్ని పాండే ప్రస్తావించారు. అతాను చక్రవర్తి రాజీనామా లేఖలోని అంశాలను సెబీ లోతుగా పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు తాము బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయబోమని, అయితే నియంత్రణ సంస్థగా తన విధులను సెబీ నిర్వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Gold and Silver rates on 24 March 2026 in Telugu states5
ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

ED FEMA Violations Trap Indians Investing in Dubai Real Estate via ICC6
క్రెడిట్ కార్డుతో ఆస్తులు కొంటున్నారా? చిక్కులు తప్పవు

విదేశాల్లో, అందులోనూ దుబాయ్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న భారతీయులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను (ఐసీసీ) ఉపయోగించి దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన పలువురికి నోటీసులు జారీ అవుతున్నాయి. అజాగ్రత్తగా చేసిన ఈ లావాదేవీలు ఇప్పుడు ‘ఫెమా’ ఉల్లంఘనల కింద ఇన్వెస్టర్లను ఇరకాటంలో పడేసింది.అసలు ఏం జరిగింది?దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు పంపిన పేమెంట్ లింక్‌ల ద్వారా లేదా నేరుగా అక్కడికి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు భారీగా చెల్లింపులు చేశారు. ప్రాథమిక డిపాజిట్లు చెల్లించడానికి చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, భారతీయ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరం.చట్టం ఏం చెబుతోంది?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఒక భారతీయుడు ఏడాదికి గరిష్టంగా 2,50,000 డాలర్ల వరకు మాత్రమే విదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది అధికారిక బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారానే జరగాలి. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను కేవలం కరెంట్ అకౌంట్ లావాదేవీలకే (హోటల్ బిల్లులు, షాపింగ్, సర్వీసులు) వాడాలి. క్రెడిట్ కార్డ్ లావాదేవీ అనేది ఒక రకమైన స్వల్పకాలిక రుణం. విదేశాల్లో ఆస్తులు కొనడానికి క్రెడిట్‌ కార్డులో అప్పు తీసుకోవడాన్ని ఆర్‌బీఐ నిషేధిస్తుంది.ఇన్వెస్టర్ల పరిస్థితినోటీసులు అందుకున్న వారు ఇప్పుడు అటు ఆస్తిని వదులుకోలేక, ఇటు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపును వెనక్కి తీసుకోవాలని బిల్డర్‌ను కోరవచ్చు. అయితే, కొత్తగా నిధులు పంపాలంటే ప్రస్తుత డాలర్ రేటు ప్రకారం భారీగా ఖర్చవుతుంది. నిబంధనల ఉల్లంఘనకు గానూ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ప్రస్తుతం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించడంతో ఆస్తిని తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది.పరిష్కారం ఉందా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇన్వెస్టర్లు ‘కాంపౌండింగ్’ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను సరిదిద్దుకోవచ్చు. తాము తెలియక చేసిన పొరపాటును అంగీకరిస్తూ ఆర్‌బీఐ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ నిధుల మూలాలు సక్రమంగా ఉండి హవాలా వంటి అక్రమ మార్గాలు లేవని తేలితే ఈడీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. నిబంధనల ప్రకారం కొంత జరిమానా చెల్లించి లావాదేవీని రెగ్యులరైజ్ చేయవచ్చు. ఒకవేళ పొరపాటు చిన్నదైతే ఆర్‌బీఐ రూ.2 లక్షల వరకు పెనాల్టీతో సరిపెట్టే అవకాశం ఉంది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం సౌలభ్యం కోసం క్రెడిట్ కార్డులను వాడటం ముప్పును కొనితెచ్చుకోవడమే. ఇన్వెస్టర్లు నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలి.ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్

Advertisement
Advertisement
Advertisement