Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 09 February 20261
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 25,822 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 419 పుంజుకొని 84,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.61బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 67.3 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.97 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 2.18 శాతం పుంజుకుంది.Today Nifty position 09-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

NPS Swasthya Pension Scheme described health wallet by PFRDA2
ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్‌పీఎస్ ‘స్వస్థ్య’

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’ అనే కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఒక ప్రత్యేక వాలెట్‌లా పనిచేస్తుంది.ప్రస్తుతం ఈ పథకాన్ని ‘రెగ్యులేటరీ సాండ్‌బాక్స్’ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే, ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతుందో టెక్నాలజీ, కస్టమర్ రక్షణ పరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఈ ట్రయల్ ద్వారా పర్యవేక్షిస్తారు.ఎలా పనిచేస్తుంది?ఎన్‌పీఎస్ స్వస్థ్య అనేది సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాకు అనుబంధంగా ఉండే ఒక ప్రత్యేక ఖాతా. ఈ ఖాతా తెరవాలంటే సభ్యుడికి కనీసం ఒక సాధారణ ఎన్‌పీఎస్ ఖాతా ఉండాలి. సభ్యులు తమ ఇష్టానుసారం ఇందులో నగదు జమ చేయవచ్చు. ఈ నిధులను పెన్షన్ ఫండ్ మేనేజర్లు వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. ఓపీడీ ఖర్చులు, ఆసుపత్రిలో చేరి చికిత్సల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.40 ఏళ్లు దాటిన వారికి..ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ పథకం కీలకమని చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాలోని కార్పస్ నుంచి 30 శాతం వరకు నిధులను ‘స్వస్థ్య’ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల అదనపు పొదుపు చేయకపోయినా పాత పొదుపునే ఆరోగ్య అవసరాలకు మళ్లించుకోవచ్చు.ఉపసంహరణ నిబంధనలుమొదటిసారి ఉపసంహరణ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.50,000 ఉండాలి. ఉపసంహరణల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు మొత్తం నిధిలో 70 శాతం దాటితే సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు నేరుగా సభ్యుడికి కాకుండా హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ (హెచ్‌బీఏ) లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా జరుగుతుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుంది.సవాళ్లు.. నిపుణుల అభిప్రాయంఈ పథకం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 కనీస నిధి ఉండాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఉపసంహరణలపై పన్ను విధింపు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పథకం కావడంతో వైద్య ద్రవ్యోల్బణంకు తగ్గట్టుగా రాబడులు వస్తాయా లేదా అన్నది సందేహమే.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

FDs lost their shine even gold silver volatile best investment plan3
రిస్క్‌ లేకుంటే రాబడి లేదు!

క్యాలెండర్‌ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్‌డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్‌ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్‌ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్‌ ప్లస్‌’ స్టోరీ...కొందరిది రిస్క్‌కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్‌ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్‌’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్‌డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్‌ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్‌డీలు/డెట్‌ ఫండ్స్‌–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్‌ అలోకేషన్‌ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్‌–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్‌ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్‌డీలు, డెట్‌ ఫండ్స్‌తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్‌గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్‌ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్‌లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్‌లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్‌ కోసం, సెంట్రల్‌ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్‌ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్‌ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్‌లు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలే మెరుగైనవి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్‌డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్‌పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్‌డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్‌కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్‌డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్‌కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్‌డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంక్‌ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్‌డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్‌బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్‌డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో), ఇంట్రాడే ట్రేడింగ్‌ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్‌లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్‌డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్‌ సైకిల్‌ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్‌ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

India-US Trade Deal Impact, Budget Analysis and Deep Dive4
బ్రేకవుట్‌కు చాన్సుందా? 

సార్వత్రిక బడ్జెట్‌సహా.. యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌ తదితర అంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నికరంగా బలపడ్డాయి. బడ్జెట్‌లో ఎస్‌టీటీ పెంపుతో ఆదివారం అమ్మకాలు పోటెత్తగా.. యూఎస్‌ డీల్‌ వార్తలతో ఒక్కసారిగా పరుగందుకున్నాయి. వెరసి సాంకేతిక విశ్లేషణల ప్రకారం సమీప భవిష్యత్‌లో బ్రేకవుట్‌కు చాన్సున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ వారాంతాన ప్రస్తుత ఏడాది(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం ఈ వారం అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం ఫలితాల ఆధారంగా ఆయా స్టాక్‌లపై అమ్మకాల, కొనుగోళ్ల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నేడు(9న) ఎస్‌బీఐ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడ్‌కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో ఆటో దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, అశోక్‌ లేలాండ్, పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ, టైటన్‌ కంపెనీ, ఐషర్‌ మోటార్స్, బజాజ్‌ ఎలక్ట్రికల్స్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, అరబిందో, బాటా, గ్లాక్సో, ఫైజర్, ఎస్కార్ట్స్, కర్ణాటక బ్యాంక్, మదర్‌సన్‌ తదితరాలున్నాయి. ద్రవ్యోల్బణంపై దృష్టి 2026 జనవరి వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. 2025 డిసెంబర్‌లో సీపీఐ 1.33 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.71 శాతంకాగా.. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఈ బాటలో 13న గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2025 డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 0.32 శాతం నుంచి 0.83 శాతానికి ఎగసింది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడ్‌ డీల్‌ జోష్‌ యూఎస్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గదర్శకాలు(ఫ్రేమ్‌వర్క్‌) సిద్ధమైనట్లు వారాంతాన ప్రభుత్వం ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించడంతో 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎగుమతి ఆధారిత రంగాలు, కంపెనీలకు జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే యూరోపియన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎగుమతి రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు వెల్లడించారు. అయితే విస్తరిస్తున్న ఏఐ టూల్స్‌ ప్రభావంతో దేశీ ఐటీ రంగంలో అలజడి తలెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత వారం ఐటీ దిగ్గజాల కౌంటర్లు భారీ అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం ప్రాథమికస్థాయి ఐటీ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు తలెత్తాయి. యూఎస్‌ ధరలు.. జనవరి నెలకు బుధవారం(11న), శుక్రవారం(13న) చైనా విభిన్న ద్రవ్యోల్బణ గణాంకాలు, హౌసింగ్‌ డేటా విడుదల చేయనుంది. ఈ బాటలో 2025 డిసెంబర్‌ నెలకు యూఎస్‌ రిటైల్‌ అమ్మకాలు 10న వెల్లడికానుండగా.. 11న వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 12న జనవరి గృహ విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు 13న విడుదలకానున్నాయి. ఈ అంశాలకు సైతం మార్కెట్లలో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కారణంగా తక్కువ సుంకాలతో అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు, వైన్, లిక్కర్, ప్రాసెస్‌డ్‌ పండ్లు తదితరాలు దిగుమతికానున్నాయి.ఆటుపోట్లు తప్పవా?ఇప్పటికే దేశీ స్టాక్‌ మార్కెట్లు కేంద్ర బడ్జెట్, ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై తగినరీతిలో స్పందించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజాగా యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ తొలి దశ ఒప్పందం ఖరారుకావడంతో ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొనసాగుతున్న రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, కరెన్సీ బలహీనతలు, కమోడిటీలలో అమ్మకాలు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వీడి కొనుగోళ్లకు దిగడం సానుకూల అంశమని ప్రస్తావించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని తదుపరి బ్రేకవుట్‌కు వీలున్నదని అంచనా వేశారు. సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే.. → ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలిగా 25,500–25, 450 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇంతకంటే దిగువన 25,100 వద్ద సపోర్ట్‌కు అవకాశముంది. ఒకవేళ బలపడితే 26,300– 26,400 పాయింట్లకు చేరే వీలుంది. వీటిని అధిగమిస్తే 26,800ను తాకవచ్చు. → బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నీరసిస్తే తొలుత 82,800–82,300 పాయింట్ల వద్ద మద్దతు కనిపించే వీలుంది. తదుపరి 81,200 వద్ద సపోర్ట్‌ లభించవచ్చు. ఏస్థాయిల నుంచైనా జోరందుకుంటే 85,800–86,000 పాయింట్లకు చేరే అవకాశముంది.గత వారం అప్‌ గత వారం(1–6) నికరంగా సెన్సెక్స్‌ 1,311 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 83,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 373 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 25,694 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లలో అమ్మకాలతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.1–0.4 శాతం మధ్య నీరసించాయి. బడ్జెట్‌ రోజును మినహాయించి చూస్తే సెన్సెక్స్‌ 2,857 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు(3.5 శాతం) చొప్పున జంప్‌చేశాయి. ఎఫ్‌పీఐల యూటర్న్‌ రూ. 8,100 కోట్ల పెట్టుబడులు దేశీ స్టాక్‌ మార్కెట్లలో 2025 కేలండర్‌ ఏడాదిసహా జనవరిలోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో తాజాగా కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. వెరసి ఈ నెల 6వరకూ రూ. 8,129 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. 2026 జనవరిలో రూ. 35,692 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. 2025లో రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

India Middle Class Faces Financial Insecurity5
వాయిదాల వార్నింగ్‌!

ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది. అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్‌పీఎల్‌. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’.ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.లెక్కేసుకుంటే.. .సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్‌ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్‌ కార్డ్‌ రోలోవర్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్‌ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది.. అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్‌ కి అప్రూవల్‌ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్‌ అయి పోతోంది. జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం జీతం పెరిగిందంటే చాలు లైఫ్‌ స్టయిల్‌ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్‌ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. ‘‘నో–కాస్ట్‌ ఈఎంఐ’’ భ్రమ అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సామాజిక ఒత్తిళ్లు వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్‌ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి. చెల్లించుకోక తప్పదు మూల్యం.. ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్‌ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.మూడు ప్రశ్నలు.. ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. → ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? → ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? → ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్‌స్టయిల్‌కే పనికొచ్చేదా? వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.బయటపడేదిలా.. పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 1. ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి → మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. → ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్‌ కావాలి. 2. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోండి. → ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఆ తరువాతే కొత్త లోన్స్‌ గురించి ఆలోచించాలి. 3. అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి → ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్‌ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. → కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్‌ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 4. ‘‘అవసరం’’, ‘‘అప్‌గ్రేడ్‌’’కి మధ్య వ్యత్యాసం.. → సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు, కొత్త గ్యాడ్జెట్స్‌కు మారుతుండటమనేది అప్‌గ్రేడ్‌ కావాలనే తాపత్రయానికి నిదర్శనం.

PSBs are on track to post record combined profits exceeding 2 lakh cr6
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్‌బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Advertisement
Advertisement
Advertisement