Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Maruti Suzuki Invest Rs 35000 Crore In Developing New Gujarat Plant1
రూ. 35వేల కోట్ల పెట్టుబడి: 10 లక్షల వెహికల్స్!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్‌లోని ఖోరాజ్‌లో కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్‌లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.Glad to witness the Investment Letter Handover by Maruti Suzuki India Limited to the Government of Gujarat for setting up a mega car manufacturing facility at Khoraj, with an investment of ₹35,000 crore.Guided by the visionary leadership of Hon’ble Prime Minister Shri… pic.twitter.com/Kso6hLmDUL— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2026

Bank Holidays Next Week 2026 Jan 19 to 25th2
బ్యాంకులకు వరుస సెలవులు!

2026 జనవరి నెలలో సగం రోజులు పూర్తైపోయాయి. కాగా వచ్చే వారంలో (జనవరి 19 నుంచి 24 వరకు) బ్యాంకు ఎన్ని రోజులు పని చేస్తాయి, సెలవు రోజులు ఎన్ని ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.23 జనవరి (శుక్రవారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు / సరస్వతీ పూజ (శ్రీ పంచమి) / వీర్ సురేంద్రసాయి జయంతి / బసంత పంచమి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా & త్రిపురలలో బ్యాంకులకు సెలవు.జనవరి 24 (శనివారం): నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.జనవరి 25 (ఆదివారం): ఆదివారం కారణంగా బ్యాంకు సెలవు.జనవరి 2026లో వారాంతాలతో సహా మొత్తం 16 బ్యాంకు సెలవులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. అంతే కాకుండా నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు. కాగా ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారే అవకాశం ఉంది.అందుబాటులో ఆన్‌లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Tesla Model Y Gets Up To Rs 2 Lakh Discount3
అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

చాలారోజుల నిరీక్షణ తరువాత.. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా భారతదేశంలో 'మోడల్ వై' లాంచ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి దీని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కార్లన్నీ.. షోరూంలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ.. వీటి అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్ ప్రకటించింది.టెస్లా ఇండియా.. ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి మోడల్ Y కొనుగోలుపైై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ స్టీల్త్ గ్రేలో పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో కూడిన స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌కు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ 300 మోడల్ వైలను దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా 100 యూనిట్లను కూడా అమ్మలేకపోయింది.టెస్లా అమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. 2025లో కూడా వరుసగా రెండవ సంవత్సరం సేల్స్ తగ్గినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చైనా బ్రాండ్ బీవైడీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పోటీ & కొన్ని కార్ మార్కెట్లలో సబ్సిడీలు తగ్గడం వల్ల అమెరికా, యూరప్, చైనా అంతటా టెస్లా వాటా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

Who Determines Gold Prices? Know The Details Here4
ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?

బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ధరల పెరుగుదల చాలామంది పసిడి ప్రియులలో నిరాశను కలిగిస్తున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటును ఎవరు నిర్ణయిస్తారనేది చాలామంది తెలుసుకోవాలనుకునే విషయం. ఈ కథనంలో పసిడి ధరలను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంత వరకు ఉంటుంది?, మన దేశంలో గోల్డ్ రేటును ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయనే విషయాలను తెలుసుకుందాం.బంగారం ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలుఎల్‌బీఎంఏ ఫిక్సింగ్: ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్‌బీఎంఏ (లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్) రోజుకు రెండుసార్లు బెంచ్‌మార్క్‌ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తాయి.గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లు: కమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్‌ & మానిటరీ పాలసీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.ద్రవ్యోల్బణం & ఆర్థిక అనిశ్చితి: బంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.మన దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలుదిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలు: భారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.కరెన్సీ మారకం రేట్లు: బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.పండుగలు, వివాహాలు: దేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.దేశీయ సరఫరా, మార్కెట్ ధోరణి: బంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.ఐబీజేఏ: ఐబీజేఏ (ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్) గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.గోల్డ్ రేటును ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మాత్రమే నిర్ణయించదు. ఇది అంతర్జాతీయ మరియు దేశీయ కారకాల కలయికతో నిర్ణయించబడుతుంది. కాబట్టి బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!

Bajaj Pulsar Range Gets A Price Hike5
పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

బజాజ్ ఆటో.. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్ల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. పెరిగిన ధరల కారణంగా.. చాలా బైకుల రేట్లు మారిపోయాయి. ఎంట్రీ లెవల్ పల్సర్ 125 సిరీస్‌లో, నియాన్ సింగిల్ సీట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.79,048 నుంచి రూ.79,939కి పెరిగింది. కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ ధర రూ.85,633 నుంచి రూ.86,411కి పెరిగింది, కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ ధర రూ.87,527 నుంచి రూ.88,547కి పెరిగింది.పల్సర్ N125 బైక్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే NS125 బేస్ వేరియంట్ ధర రూ. 91,182 నుంచి రూ. 92,642కు చేరింది. LED BT రూ. 93,792 నుంచి రూ. 94,253లకు, LED BT ABS రూ. 98,400 నుంచి రూ. 98,955లకు చేరింది. పల్సర్ 150 సింగిల్-డిస్క్ & ట్విన్-డిస్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,11,669 & రూ.1,15,481 వద్ద (వీటి ధరల్లో ఎటువంటి మార్పు లేదు) అలాగే ఉన్నాయి.పల్సర్ NS160, NS200, RS200 ధరలు రూ.702 చొప్పున పెరిగి, ఇప్పుడు రూ.1,20,873, రూ.1,32,726 & రూ.1,71,873 వద్ద ఉన్నాయి. డిసెంబర్ 2025లో 2026 అప్‌డేట్ తర్వాత పల్సర్ 220F రూ.1,28,490 నుంచి రూ.1,29,186లకు చేరింది. 250cc విభాగంలో, పల్సర్ N250 ధర రూ.1,34,166 కాగా, టాప్-ఎండ్ పల్సర్ NS400Z ధర రూ.1,93,830 వద్ద ఉంది.

Demand For Houses and Offices is High in West Hyderabad6
ఇళ్లకైనా, ఆఫీసులకైనా.. అక్కడే డిమాండ్!

మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్‌ ఉంటుంది. అందుకే హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్‌ ఫేవరేట్‌ ప్లేస్‌గా మారింది. గతేడాది జులై–డిసెంబర్‌ (హెచ్‌–2)లో పశ్చిమ హైదరాబాద్‌ హవా కొనసాగింది. 2025 హెచ్‌2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్‌ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోమెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్‌ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్‌ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్‌కు ప్రధాన కారణాలు.పెరిగిన దక్షిణం, తూర్పు..సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్‌ వంటి దక్షిణ హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్‌ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్‌ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌ వంటి తూర్పు హైదరాబాద్‌ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.తగ్గిన ఉత్తరం, సెంట్రల్‌..ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్‌ వంటి ఉత్తర హైదరాబాద్‌ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్‌లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్‌ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్‌ హైదరాబాద్‌ వాటా 3 శాతానికి తగ్గింది.ప్రీమియం ఇళ్లకే మొగ్గు..2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్‌–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్‌ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్‌ కమ్యూనిటీ లివింగ్‌ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.ఆఫీసు అ'ధర'హో..నగరంలో హెచ్‌ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్‌ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్‌ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌(ఎస్‌బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్‌) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్‌) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్‌–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.లాంచింగ్స్‌లో వెస్ట్‌దేనివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్‌లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్‌–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్‌–2తో పోలిస్తే లాంచింగ్స్‌ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్‌ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్‌ సిటీ వాటా 5 శాతంగా ఉంది.నగరంలోని ఆఫీసు స్పేస్‌ లావాదేవీల్లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్‌–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్‌ స్క్వాబ్‌ కార్పొరేషన్, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, రాండ్‌స్టాడ్, గోల్డ్‌మన్‌ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్‌ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ విభాగం ఉంది. థర్ట్‌ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి.

Advertisement
Advertisement
Advertisement