Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Luxury Cars Wines Medicine Will Be Cheaper After India EU Pact1
భారత్ - ఈయూ డీల్: భారీగా తగ్గనున్న వీటి ధరలు!

భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. అనేక వర్గాలకు అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా వైన్, విస్కీ అభిమానులు, లగ్జరీ కార్ల ప్రియులు, పరిశ్రమలు & సాధారణ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఈ ఒప్పందం ద్వారా ఇండియా ఉత్పత్తులు యూరప్ దేశాలకు ఎగుమతి, అక్కడి ఉత్పత్తులు భారతదేశానికి ఎక్కువగా దిగుమతి అవుతాయి. సుంకాలు చాలా వరకు తగ్గడం వల్ల.. యూరోపియన్ వస్తువులు మన దేశంలో చౌకగా మారనున్నాయి.తగ్గనున్న ప్రీమియం కార్ల ధరలుమెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లపై ప్రస్తుతం దిగుమతి 100 శాతంగా ఉంది. అయితే ఒప్పందం ప్రకారం, 15,000 యూరోల కంటే ఎక్కువ.. అంటే దాదాపు రూ. 16 లక్షల విలువైన కార్లపై ఇప్పుడు 40 శాతం సుంకం విధిస్తారు. ఆ తరువాత ఈ ట్యాక్స్ క్రమంగా 10 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల కార్ల ధరలు చాలా తగ్గుతాయి.మద్యం ధరలుఒప్పందం తరువాత ఫ్రాన్స్, ఇటలీ & స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకునే వైన్ చౌకగా లభించనుంది. ప్రస్తుతం, భారతదేశం దిగుమతి చేసుకునే వైన్‌పై 150 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తుంది. కొత్త ఒప్పందం దీనిని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ధర ఉన్న వైన్లకు విధించే ట్యాక్స్ విషయంలో ఎలాంటి రాయితీ ఉండదు.ఔషధాలు (మెడిసిన్స్)యూరప్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సాంకేతికతలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా.. క్యాన్సర్ & ఇతర అనారోగ్యాలకు కావలసిన దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాల ధరలు భారతదేశంలో తగ్గనున్నాయి.ఇదీ చదవండి: భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలువాణిజ్య ఒప్పందంతో..దిగుమతి చేసే విమానాల విడిభాగాలు, మొబైల్ ఫోన్లు & హైటెక్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు అవుతాయి. దీంతో ఈ వస్తువుల తయారీ ఖర్చులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాడ్జెట్లు మరింత చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది భారత్‌లో తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.ఉక్కు & రసాయన ఉత్పత్తులువాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇనుము, ఉక్కు & రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాలు (Zero Tariffs) విధించాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు లాభపడతాయి. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు తగ్గి, దీని ప్రభావం చివరికి వినియోగదారులకు కూడా మేలు చేసేలా ఉండనుంది.

Tier 3 College Graduate Reveals How She Landed Job At Google2
షార్ట్‌కట్స్ లేవు, అదృష్టం కాదు.. గూగుల్‌లో జాబ్!

గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని కొందరు అనుకుంటారు. కానీ.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెబుతున్నారు గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఆర్చీ గుప్తా. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గూగుల్ సంస్థలో జాబ్ ఎలా తెచ్చుకున్నారు?, అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?, అనే ఆసక్తికరమైన ఈ కథనంలో తెలుసుకుందాం.ఒక సాధారణ కాలేజీలో చదువుకుని.. గూగుల్‌లో ఉద్యోగం సాధించిన టెక్ ప్రొఫెషనల్ ఆర్చీ గుప్తా ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ప్రతిభకు, కష్టపడే తత్వానికి.. కాలేజీ పేరు లేదా ప్రతిష్ట అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు, అంకితభావం & నిరంతర ప్రయత్నం ఉంటే ఎవరైనా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చని వెల్లడించారు.తాను షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులో.. ఆర్చీ గుప్తా కెరీర్‌లోని ముఖ్యమైన దశలను ఫోటోల రూపంలో చూపించారు. మొదటి ఇంటర్న్‌షిప్ నుంచి మొదటి ఉద్యోగం వరకు.. ఎదురైన తిరస్కారాలు, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వెల్లడించారు. ప్రారంభంలో ఆమెను గూగుల్ తిరస్కరించింది. అదే తిరస్కారం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చిందని, ముందుకు వెళ్లడానికి ప్రేరణగా మారిందని చెప్పారు. పట్టుదలతో శ్రమించి చివరికి గూగుల్‌లో జాబ్ తెచ్చుకుంది.సాధారణ కాలేజీ నుంచి గూగుల్ వరకు ఎదగడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. అదృష్టం మీద ఆధారపడలేదు. సంవత్సరాల పాటు కృషి చేసాను. ప్రతిరోజూ ప్రయత్నించడం చేయడం మానుకోలేదని ఆర్చీ గుప్తా చెప్పారు. ఒక్కసారికే విజయం లభించదు. గొప్ప క్షణాలు వెంటనే కనిపించవు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని ఆమె వివరించారు. View this post on Instagram A post shared by Archy Gupta | Tech, Career, AI (@archy.gupta)

India-EU FTA May Boost India Small Luxury Car Market Says BMW India CEO3
భారత్-ఈయూ డీల్: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?

భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్‌ను విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా & సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం మాత్రమే. ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పదం ఈ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు.భారత్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి గట్టి విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఇండియా కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు.. సంస్కరణలు & భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న విధానాలతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని హర్దీప్ సింగ్ తెలిపారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ మార్పిడి మరింత బలపడుతుందని వివరించారు.ప్రస్తుతం భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వచ్చే కార్లపై భారీగా కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయి. ఇవి తగ్గితే.. వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని బ్రార్ అన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ విక్రయాల్లో దిగుమతి వాటా ఐదు శాతం మాత్రమే ఉంది. ట్యాక్స్ తగ్గేదే ఈ వాటా పెరుగుతుందని అన్నారు.ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు..దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువైన అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.ట్యాక్స్ తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.

India-EU significant trade deal for both countries4
భారత మార్కెట్ రూపురేఖలు మార్చే డీల్‌!

భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు ఇక పండగే! భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలవబడే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో యూరప్‌ నుంచి భారత్‌లోకి వస్తున్న యూరోపియన్ బ్రాండెడ్ కార్లు, అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు, దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేయబోతున్న ఈ ఒప్పందం వివరాలు, ఏయే వస్తువులపై సుంకాలు ఎంత మేర తగ్గుతాయో కింద చూద్దాం.భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వచ్చే దశాబ్ద కాలంలో భారత దిగుమతి మార్కెట్‌ను సమూలంగా పునర్నిర్మించేలా, కీలక రంగాల్లో భారీగా సుంకాలు తగ్గనున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఆటోమొబైల్ రంగంలో..ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం కార్లపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం 70% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని భారత్ క్రమంగా 10%కి తగ్గించనుంది. ఏడాదికి 2,50,000 వాహనాల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు భారత ప్రీమియం కార్ల మార్కెట్‌ను పూర్తిగా రీసెట్ చేస్తుందని ఈయూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఎగుమతులు - సుంకాల ఆదా2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. 90% పైగా వస్తువులపై సుంకాల తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర ట్యాక్స్‌ ఆదా అవుతుందని బ్రస్సెల్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గరిష్టంగా ఉన్న సుంకాలు (యంత్రాలపై 44%, రసాయనాలపై 22%, ఫార్మాపై 11%) గణనీయంగా తగ్గనున్నాయి.వైద్యం, సాంకేతిక రంగంభారతదేశంలో వైద్య సేవల ఖర్చులను తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది. దాదాపు అన్ని వైద్య పరికరాలపై సుంకాలను సున్నాకి తగ్గించనున్నారు. 90% ఉత్పత్తులపై సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. విమానాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించి దాదాపు పూర్తిస్థాయిలో సుంకాల తొలగింపు ఉంటుంది.ఆహారం, పానీయాలుయూరప్ నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ పానీయాలపై సుంకాలను భారత్ భారీగా తగ్గించింది. యూరోపియన్ వైన్‌లపై 20 నుంచి 30 శాతం వరకు సుంకాలు తగ్గనుండగా వివిధ రకాల స్పిరిట్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. అన్నిటికంటే ఎక్కువగా యూరోపియన్ బీరుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలు తగ్గనున్నాయి.కేవలం పానీయాలకే పరిమితం కాకుండా వంట గదిలో అత్యవసరమైన ఆహార నూనెలపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ఐరోపా నుంచి వచ్చే ఆలివ్ ఆయిల్, మార్గరీన్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాల్లో ప్రభుత్వం భారీ కోత విధించింది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన యూరోపియన్ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.భారత ఎగుమతులకు లబ్ధిఏడేళ్ల వ్యవధిలో 99.5% వాణిజ్య వస్తువులపై ఈయూ కూడా సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అందులో..సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు.రసాయనాలు, రబ్బరు, రత్నాలు, ఆభరణాలు.ఈ ఒప్పందం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వినియోగదారుల మార్కెట్‌లో యూరప్ పట్టును బలోపేతం చేయనుంది. అయితే, యూరోపియన్ ఉత్పత్తుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేలా దేశీయ తయారీదారులు ఏ విధంగా సిద్ధమవుతారనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Why E Motorcycle Makers Want Incentives from govt in Budget 2026?5
కేంద్ర బడ్జెట్‌పై ఈవీ తయారీదారుల ఆశలు

దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్‌సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్‌-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్‌ (ప్రధాని ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రివల్యూషన్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ వెహికల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ చైర్‌పర్సన్‌ అంజలి రట్టన్‌ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్‌సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్‌ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్‌సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.పరిశ్రమ డిమాండ్లు ఇవే..అహ్మదాబాద్‌కు చెందిన ‘మ్యాటర్‌’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్‌సైకిల్‌ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్‌లను భారత్‌లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

PMO Key Directives for Agriculture in Budget 20266
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటువ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.బడ్జెట్‌పై అంచనాఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్‌లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Advertisement
Advertisement
Advertisement