Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hyderabad IT Employee Files Complaint Alleging Years of Unpaid Overtime1
ఐటీ కంపెనీపై కేసు పెట్టిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్‌టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్‌లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్‌ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్‌కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్‌టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

supreme Court ordered SIT to probe Anil Ambani bank loan frauds2
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్‌), దాని గ్రూప్ కంపెనీలతో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసాలపై దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోర్టు ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ దర్యాప్తును ముగించాలని ఈడీ, సీబీఐలకు స్పష్టం చేసింది.కోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలుఒకే ఎఫ్‌ఐఆర్‌పై ప్రశ్నలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిర్యాదు మేరకు సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే బహుళ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతి ఫిర్యాదు వెనుక విభిన్న లావాదేవీలు ఉన్నాయని గుర్తు చేసింది.బ్యాంకు అధికారుల పాత్ర.. నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సంస్థల మధ్య ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.నాలుగు వారాల గడువు.. దర్యాప్తు పురోగతిపై తదుపరి నాలుగు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని రెండు ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది.వాదోపవాదాలుప్రశాంత్ భూషణ్ (పిటిషనర్ తరఫు): రూ.పదివేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైందని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ముకుల్ రోహత్గీ (అనిల్ అంబానీ తరఫు): రిలయన్స్ గ్రూప్ బకాయిలను చెల్లించడానికి ప్రయత్నిస్తోందని, వ్యాపారంలో వచ్చే సాధారణ డిఫాల్ట్‌లను నేరపూరిత చర్యలుగా చూడకూడదని వాదించారు. నిందితులు విదేశాలకు పారిపోతారనే భయాల్లో నిజం లేదని ఆయన హామీ ఇచ్చారు.తుషార్ మెహతా (సొలిసిటర్ జనరల్): నకిలీ బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించిందని, యెస్ బ్యాంక్ పెట్టుబడులపై కూడా విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు.ఇప్పటివరకు చేపట్టిన చర్యలుఇటీవలే ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల​్‌ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆర్‌సీఓఎం మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్‌ను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన తీరును బట్టి చూస్తే తక్షణమే కాలపరిమితితో కూడిన దర్యాప్తు అవసరమని భావించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Anthropic Claude Cowork AI workspace automates complex business3
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన

కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్‌ కోవర్క్‌’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్‌ఇన్‌లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్‌లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్‌ఇన్‌లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్‌ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్‌లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్‌’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను మన కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్‌ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్‌ వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్‌సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Gold and Silver rates on 5th February 2026 in Telugu states4
పసిడి, వెండి గుడ్‌న్యూస్‌.. రేట్లు రివర్స్‌!!

పుంజుకున్న బంగారం, వెండి ధరలు తిరుగుటపా కట్టాయి. భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Key Agenda Items for Upcoming GST Council Meeting5
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు ఇవేనా..

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, ఆడిట్, రిఫండ్ ప్రక్రియలను భారీగా సరళీకరించేందుకు సిద్ధమవుతోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.గత ఏడాది సెప్టెంబర్ 3న జరిగిన సమావేశం తర్వాత, ప్రస్తుత బడ్జెట్ ఆమోద ప్రక్రియ ముగిశాక ఈ కీలక భేటీ జరగనుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు విడతలుగా చర్చలు పూర్తికాగా ప్రాథమిక అజెండా సిద్ధమైంది.రిఫండ్లలో ఇబ్బందుల తొలగింపుప్రస్తుతం వస్తువులు, సర్వీసులకు మధ్య ఉన్న విభజన కారణంగా సేవల రంగంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రిఫండ్లు పొందడంలో వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోతోంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లు అంటే.. ఒక వ్యాపారి తన బిజినెస్‌ కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును, తిరిగి ప్రభుత్వం నుంచి వెనక్కి పొందడం లేదా తదుపరి పన్ను చెల్లింపుల్లో తగ్గించుకోవడం.ఈ నేపథ్యంలో సర్వీసులపై పేరుకుపోయిన ఐటీసీ రిఫండ్‌లను సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపారాల్లో నగదు లభ్యత పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.ప్రభుత్వ విధానం ఇదే..బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ‘పన్ను చెల్లింపుదారులపై నమ్మకం’ అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే సవరించిన రిటర్న్‌ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వీటి ప్రకారం..సెక్షన్ 148 కింద నోటీసు వచ్చినా వివాదాస్పద పన్ను, వడ్డీ చెల్లించి రిటర్న్‌లను అప్‌డేట్ చేస్తే ఆ ప్రక్రియను అక్కడితోనే ముగించే అవకాశం ఉంది.ఆడిట్ పరిధిలోకి రానివారు ఏడాదిలోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.గతంలో రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగేళ్ల వరకు అప్‌డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు.జరిమానాల నుంచి మినహాయింపుఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 440 కింద రక్షణ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయాన్ని తప్పుగా నివేదించిన సందర్భాల్లో నిర్దేశిత అదనపు పన్ను చెల్లిస్తే భారీ జరిమానాల నుంచి మినహాయింపు పొందే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించనుంది. ‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమలు చేయడమే తదుపరి అంశం. అధికారులపై పనిభారం పెరిగినప్పటికీ పన్ను చెల్లింపుదారులకు మేలు చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Stock market updates on 05 February 20266
లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 86 పాయింట్లు తగ్గి 25,691 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 251 నష్టపోయి 83,568 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
Advertisement