Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Robert Kiyosaki Warning The World is Nuts Glad I Have an EV1
కియోసాకి కొత్త వార్నింగ్‌.. ఈవీలపై కీలక కామెంట్స్‌

ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే రాబర్ట్ కియోసాకి.. మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత ప్రపంచ గందరగోళ పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ప్రపంచం పిచ్చెక్కిపోతోంది!ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశిస్తూ... "ఈ ప్రపంచం పిచ్చెక్కిపోతోంది" (The World is Nuts) అంటూ కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణం లేదా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.ఈవీపై ఆసక్తికర వ్యాఖ్యఇదే క్రమంలో తన వద్ద ఉన్న వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. "నా దగ్గర ఉన్న కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన ధరల పెరుగుదల లేదా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు.రాబర్ట్‌ కియోసాకి వద్ద ఫెరారీ, రోల్స్-రాయిస్‌ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయితే ఈ కార్ల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఉపయోగించకూడదని, ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో ఖర్చులన్నీ పోయాక మాత్రమే విలాసవంతమైన కార్లను కొనాలని ఆయన సూచిస్తారు.ఎప్పుడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడులు పెట్టాలని సూచించే కియోసాకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని గత కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.THE WORLD IS NUTS: Glad one of my cars is an EV.— Robert Kiyosaki (@theRealKiyosaki) April 22, 2026

Telangana Grameena Banks Profit High Jump: Hits Rs 1283 Cr Mark2
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లాభం హైజంప్‌

హైదరాబాద్‌: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,283 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 8 శాతం బలపడి రూ. 34,605 కోట్లను తాకాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 12 శాతంపైగా పెరిగి రూ. 46,548 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 4.33 శాతానికి మెరుగుపడ్డాయి.స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 2.1 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు నమోదుకాలేదు. రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌(ఆర్‌వోఏ) 2.13 శాతంకాగా.. ఆర్‌వోఈ 14.1 శాతంగా నమోదైంది. గతేడాది బ్యాంక్‌ అత్యుత్తమ పనితీరు చూపినట్లు సంస్థ చైర్మన్‌ కె.ప్రతాప రెడ్డి పేర్కొన్నారు. నికర లాభం దాదాపు రెట్టింపైనట్లు తెలియజేశారు.

ONGC Cancels Oil Rig Tender Amid Price Surge and Collusion Concerns3
ఓఎన్‌జీసీ ‘జాక్-అప్ రిగ్‌’ టెండర్ రద్దు!

ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్‌జీసీ సముద్ర గర్భంలో చమురు అన్వేషణ కోసం నిర్వహించిన జాక్-అప్ రిగ్‌(సముద్ర తీర ప్రాంతాల్లో చమురు బావులను తవ్వడానికి ఉపయోగించే తేలియాడే ప్లాట్‌ఫామ్) టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ధరల అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయనే అనుమానాల నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుదలపై అనుమానాలుఈ టెండర్ ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్జీసీ తెలిపింది. ‘కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిడ్డింగ్ ధరలు సుమారు 60% మేర పెరిగాయి. గతంలో రోజుకు 35,606 డాలర్లుగా ఉన్న రేటు తాజా బిడ్డింగ్‌లో ఏకంగా 56,195 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అంచనాలతో పోల్చి చూస్తే ఈ స్థాయి పెరుగుదల ఏమాత్రం సహేతుకం కాదని, ఇది ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్ పరిమితులను మించి ఉందని సంస్థ స్పష్టం చేసింది.కుట్ర కోణంపై ఆందోళనటెండర్లలో పాల్గొన్న సంస్థల మధ్య కుట్ర పద్ధతులు ఉండవచ్చనే ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేసింది. బిడ్ల నమూనాను విశ్లేషించగా సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు ఉండవచ్చని, తద్వారా కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని సంస్థ భావిస్తోంది. ‘ప్రజా సేకరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, ప్రభుత్వ నిధులను వివేకవంతంగా వినియోగించడం మా బాధ్యత. ఈ టెండర్ ప్రక్రియలో సమగ్రత లోపించిందని భావించినందుకే రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని ఓఎన్జీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.పారదర్శకతకే ప్రాధాన్యతమీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఓఎన్జీసీ తమ నిర్ణయం పూర్తిగా సంస్థాగత ప్రయోజనాలు, పారదర్శకతపై ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ‘ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ సేకరణ సూత్రాలను కచ్చితంగా పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యం. పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని లేదా సిండికేట్‌గా ఏర్పడి ధరలను శాసించే ధోరణులను అడ్డుకుంటాం’ అని కంపెనీ తెలిపింది.భవిష్యత్తు కార్యాచరణపరిశ్రమ వర్గాలతో పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే బిడ్ల సేకరణ ప్రక్రియల్లో న్యాయమైన, పోటీతత్వంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తద్వారా ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా జాగ్రత్త పడతామని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Tesla Model YL Premium Launched in India at Rs 61 99 lakh check details4
ఆరు సీట్ల టెస్లా కారు.. వచ్చేసింది ఇండియా..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్లో మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన సరికొత్త 'మోడల్ Y' లాంగ్ వీల్ బేస్ (LWB) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 61.99 లక్షలుగా నిర్ణయించారు. తాజా చేరికతో భారత్‌లో మోడల్ Y శ్రేణి ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ. 59.89 లక్షల నుండి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.ఈ కొత్త వెర్షన్ ప్రధాన ఆకర్షణ దీని విస్తరించిన వీల్ బేస్. 3,040 మిమీ పొడవైన వీల్ బేస్‌తో రూపొందించిన ఈ కారులో 2+2+2 లేఅవుట్‌తో ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌ను అందించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ ఎల్‌డబ్ల్యూబీ వేరియంట్ వెనుక సీటు ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలాన్ని (లెగ్ రూమ్), సౌకర్యాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణించే వీలున్న కారు కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది ఒక ఎంపికగా నిలుస్తుంది.ఫీచర్ల పరంగా చూస్తే, ఈ కారులో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లో 16-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, హీటెడ్-వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం హీటెడ్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ సీట్ల వద్ద థై సపోర్ట్ వంటి సౌకర్యాలతో పాటు వెనుక వరుసలో ఉన్న వారికోసం పిల్లర్-మౌంటెడ్ రియర్ ఏసీ వెంట్లను కూడా ఏర్పాటు చేశారు. టెస్లా సిగ్నేచర్ మినిమలిస్ట్ డిజైన్, ఏరోడైనమిక్ లుక్ ఈ కారు సొంతం.సామర్థ్యం విషయంలోనూ ఈ మోడల్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇందులో అమర్చిన 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు (WLTP సర్టిఫైడ్) ప్రయాణించవచ్చు. ఇక స్పీడ్‌ విషయానికి వస్తే.. కేవలం 5 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది అందుకుంటుంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా, అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఫ్యామిలీ ఎస్‌యూవీగా ఈ టెస్లా మోడల్ Y కారు భారత మార్కెట్లో తన ఉనికిని చాటనుంది.

Delhi Resumes Wheat Procurement After Four Year Gap Benefiting 21000 Farmers5
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్‌న్యూస్‌

దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభంతాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్‌గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.21,000 మంది రైతులకు లబ్ధిరాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థకేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.అవసరమైన పత్రాలుసేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.1. భూమి రికార్డులు2. బ్యాంక్ పాస్‌బుక్3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్‌సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.2021-22 సమయంలో బహిరంగ మార్కెట్‌లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

RBI updates e-mandate rules for transactions over Rs 15000 OTP required for e-Mandate6
ఆటోమెటిక్‌గా కట్‌ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్‌డేట్‌

డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్‌స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్‌కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement