ప్రధాన వార్తలు
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది.
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు.
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భారతీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయి అనిశ్చితిని సృష్టించిన ఈ పరిణామాలను ఎదుర్కోవడంలో కార్పొరేట్ కంపెనీల సీఈఓలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం.మునుపెన్నడూ లేని సవాలుసాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కంపెనీల అధినేతలు గత చరిత్రను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం అసాధారణమైంది. గత అనుభవాలేవీ దీనికి సరిపోలవు. ఈ నేపథ్యంలో వ్యాపార రంగానికి పొంచి ఉన్న ప్రధాన ముప్పులు కింది విధంగా ఉన్నాయి.ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ నుంచి ఎరువుల వరకు అన్ని ఉత్పత్తుల ధరలు భారమవుతాయి.ఎఫ్ఎంసీజీ రంగంలో ప్యాకేజింగ్ ఖర్చు 10% కంటే ఎక్కువగా ఉంటుంది. పెట్రో-డెరివేటివ్స్ ధరలు పెరగడం వల్ల ఈ వ్యయం మరింత భారం కానుంది.కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ సంక్షోభంలో పడింది. పశ్చిమ ఆసియా మీదుగా సాగే రవాణా మార్గాలపై అనిశ్చితి నెలకొంది.గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులు, రెమిటెన్స్లు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలకు డిమాండ్ తగ్గి విమాన ప్రయాణాలు మరింత భారంగా మారుతాయి.బంగారం ధరలు తగ్గడం, విలాసవంతమైన బ్రాండ్ మార్కెట్ దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.సీఈఓల వ్యూహరచన.. ఏం చేయాలి?వినియోగదారుడి కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ కార్యాచరణను మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడిని అందించే వినియోగదారుడిని కాపాడుకోవడం ముఖ్యం. ధరలు పెంచడం లేదా ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. ఇది దీర్ఘకాలంలో బ్రాండ్ విలువను దెబ్బతీస్తుంది.వ్యయ నియంత్రణఉద్యోగులను తొలగించడం కంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరంలేని ఇన్వెంటరీ, ఎంతోకాలంగా జాప్యం జరుగుతున్న నిర్ణయాలు, భారీ అప్పులపై వడ్డీలను తగ్గించుకోవాలి. సిబ్బంది సంఖ్యను కత్తిరించకుండానే 20% ఖర్చులను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలి.కాలానుగుణంగా ప్రణాళికలురాబోయే 30 రోజులు, 90 రోజులు, 300 రోజులకు స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. దీన్ని ఉద్యోగులందరికీ వివరించాలి. వారిలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలి. నగదు నిల్వలను కాపాడుకోవడం ముఖ్యం. అదే సమయంలో జీతాల్లో కోతలు విధించకూడదు.బ్యాంకులు, ప్రభుత్వంతో సమన్వయంఇది అసాధారణ పరిస్థితి కాబట్టి బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు గడువును, మూలధన అవసరాలను పునర్వ్యవస్థీకరించుకోవాలి. అలాగే, పరిశ్రమ వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం నుంచి అవసరమైన రాయితీలు, మద్దతు కోరాలి.ఈ సంక్షోభ సమయంలో సీఈఓలు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి రావడం వంటి మార్పులను అందిపుచ్చుకోవాలి. తిరిగి పోటీలో నిలబడగలిగే సామర్థ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత అసలైన నాయకత్వ లక్షణం.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
స్పెషల్ అలవెన్సులు.. పన్ను భారాలు
జీతంలో కొంత భాగాన్ని స్పెషల్ అలవెన్స్ రూపంలో ఇస్తారు. ఉద్యోగస్తులు వాళ్ల సీటీసీ అంటే ’కాస్ట్ టు ది కంపెనీ’లో ’టేక్ హోమ్ పే’ ఎక్కువగా ఉండాలని ఆశిస్తారు. బేసిక్ పే కాకుండా అదనంగా ఇచ్చే జీతాన్ని స్పెషల్ అలవెన్స్ అంటారు. ఇవి కాకుండా ఇంటద్దె అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొదలైన వాటిని కేవలం ఆయా పేర్లలో పేర్కొన్న వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి.ఇవి కాకుండా ఎన్నో స్పెషల్ అలవెన్సులు ఉన్నాయి. స్వభావరీత్యా నిర్దేశించినవి తప్ప అన్ని అలవెన్సులు పన్నుకి గురవుతాయి. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీల నిమిత్తం వీటిని తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కొన్ని పనితీరును బట్టి ఉంటాయి. కొన్ని పని పరిస్థితులను బట్టి ఉంటాయి. 1961వ చట్టంలో ఉన్న అన్ని అలవెన్సులను 2025 చట్టంలో పొందుపరిచారు. చాలా సులభంగా అర్థం అయ్యేలాగా, ఒక పట్టిక రూపంలో పొందుపరిచారు. ఇవి మూడు రకాలు..మినహాయింపు లేని అలవెన్సులు డీఏ, సీసీఏ, పెర్ఫార్మెన్స్ అలవెన్స్, అటెండెంట్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్ మొదలైన వాటిమీద ఎటువంటి మినహాయింపు లేదు. ఇవన్నీ జీతంలో భాగమే. పన్నుకి గురవుతాయి. కొన్ని అలవెన్సులకి షరతులకు లోబడి మినహాయింపులు ఉంటాయి. అవేంటంటే హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, స్టాండర్డ్ డిడక్షన్అలవెన్స్ ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపు. ఈ తరహా అలవెన్సులను మీరు ఖర్చు పెట్టినంత వరకే మినహాయింపునిస్తారు. ఖర్చు పెట్టని మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఉదాహరణకు కన్వేయన్స్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్.. వీటి అన్నింటికి ఖర్చులు పెట్టాలి. ఓచర్లు ఇవ్వాలి.పాత పద్ధతి – కొత్త పద్ధతి.. కొత్త పన్ను విధానంలో బేసిక్ లిమిట్ అధికం. ఎక్కువ శ్లాబ్లు, తక్కువ పన్ను రేట్లు, అందువల్ల అలవెన్స్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. ఈ కింది అలవెన్సులను మినహాయించరు.ఇంటద్దె అలవెన్సు, లీవ్ ట్రావెల్ అలవెన్సు, పిల్లల విద్య అలవెన్సు, పిల్లల హాస్టల్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు (దివ్యాంగులకు కాదు), హెల్పర్, యూనిఫాం అలవెన్సు, ఇంటర్నెట్ అలవెన్సు, ఎంటర్టైన్మెంట్ అలవెన్సు. ఇవన్నీ కాకుండా ఇప్పటి 80సి కింద ఇస్తున్న.. పీఎఫ్, ఎన్నెస్సీలు, జీవిత బీమా, పిల్లల చదువు ఫీజులు.. మొదలైన వాటికి కూడా ఇవ్వరు. ఎన్పీఎస్ చెల్లింపులు, అగ్నివీర్ కార్పస్ ఫండ్ చెల్లింపులు.. ఈ రెండు మినహాయింపులు ఇస్తారు. కొత్త విధానంలో మినహాయింపులు వచ్చేవి కొన్ని..స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000. కన్వేయన్స్ అలవెన్స్ / డైలీ / ట్రాన్స్పోర్ట్ అలవెన్సు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ అలవెన్సు. వృత్తి పన్ను. ఫ్యామిలీ పెన్షను .. రూ. 25,000 వరకు. స్థలాభావం వల్ల అన్ని షరతులు ఇక్కడ పొందుపరచలేదు. చట్టంలోనూ, రూల్స్లోను వివరంగా దొరుకుతాయి.. లేదా ఉంది కదా.. గూగుల్ తల్లి.. సంప్రదించండి. 1961 చట్టంతో పోల్చి కొత్త చట్టాన్ని విశదీకరిస్తే వచ్చిన మార్పులు.ఎంటర్టైన్మెంట్ అలవెన్సుకి మినహాయింపు లేదుప్రత్యేక సామర్థ్యం ఉన్న ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్సులకు మినహాయింపులు కొనసాగుతాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు ఉంది.ఫెనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని ఉండవు. ఇకనుంచి ఒకే పదం ’ట్యాక్స్ సంవత్సరం’.రాబోయే ప్రక్రియలన్నీ డిజిటల్ ప్రపంచంలోనే ఉంటాయి. అరకొర సిబ్బందికి ఏఐ బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. అంతా డిజిటల్ రికార్డులు, డిజిటల్ పరిష్కారాలు, టెక్నాలజీమయం. కాబట్టి, మనకు డిజిటల్ అక్షరాస్యత కావాలి. డిజిటల్ సామర్థ్యాలు.. నైపుణ్యాలు సంపాదించాలి. సర్వసన్నద్ధంగా ముందుకెళ్లాలి.
కార్పొరేట్
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ ఫ్లయిట్ టికెట్ చార్జీలు
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!
కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి
మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
రూ. 60వేల పెట్టుబడి.. రూ. 25కోట్ల ఆదాయం!
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వార...
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజ...
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమ...
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రో...
సరళీకరణ సరిహద్దు దేశాలకుకాదు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన విదేశీ ప్రత్యక్ష ...
చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుత...
వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద...
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్టాక్లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను
చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హువాంగ్ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్ ఒక బ్లాగ్పోస్ట్లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్ ఫ్టాక్టరీలు, కంప్యూటర్ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు. అయిదంచెల కేక్.. విద్యుత్, చిప్లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్’గా ఉంటుందని హువాంగ్ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్ఫిట్టర్లు, స్టీల్వర్కర్లు, నెట్వర్క్ టెక్నీíÙయన్లు, ఇన్స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్ చెప్పారు.సంప్రదాయ కంప్యూటింగ్ మోడల్ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్ సరీ్వసు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్ చెప్పారు. డీప్సీక్–ఆర్1లాంటి ఓపెన్ సోర్స్ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా?
క్రోమ్ బ్రౌజర్లో ఏఐ టూల్స్
సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని కల్పించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో క్రోమ్ బ్రౌజర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్ ఇన్ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్లకు సపోర్ట్ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ జెమిని 3.1 మోడల్పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్టాప్, ఐవోఎస్లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్ డైరెక్టర్ షార్మెయిన్ డిసిల్వా తెలిపారు.వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్ అసిస్టెంట్ ఐకాన్ని క్లిక్ చేసి నేరుగా చాట్ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్ ప్యానెల్ నుంచే ఈమెయిల్స్ రాయొచ్చు, పంపించవచ్చు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!
పర్సనల్ ఫైనాన్స్
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
దగ్గరపడుతున్న డెడ్లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!
ఆర్ధిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత క్లిష్టం.. అత్యంత కీలకం. అలాంటిదే ఈ 2026 మార్చి కూడా. వ్యక్తులుగా మీ ఇన్కంట్యాక్స్ వ్యవహారాల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన బాధ్యతలను తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తి చేసే పని చేపడదాం.ఆర్థిక వ్యవహారాల్లో కూడా మార్చి ముఖ్యమైనది. వ్యవహారాలు పూర్తి దశకి రావడానికి, బడ్జెట్ ప్రకారం నిధులు ఖర్చు పెట్టడానికి, గ్రాంట్లను పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల పూర్తికి.. ఇలా ఎన్నో పన్నుయేతర వ్యవహారాలకు మార్చి కటాఫ్లాంటిది. ఈ గడువు ఓ గండంలాంటిది. బుక్స్ క్లోజ్ చేయాలి. మీరు బుక్స్ రాయకపోయినా, వాటి నిర్వహణ కంపల్సరీ. రాయకపోయినా ఒకసారి వ్యవహారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి.ఏప్రిల్ నుంచి మీ బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, లోన్ చెల్లింపులు, ఇన్సూరెన్స్ చెల్లింపులు, ఇంటి మున్సిపల్ పన్నుల చెల్లింపులు, మెడిక్లెయిమ్, మీ దగ్గర పని చేసే ఉద్యోగులకు సంబంధించి చట్టబద్ధమైన చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, 80సీ కింద అర్హత ఉన్న చెల్లింపులు.. ఇలా ఎన్నో ఉంటాయి. తెలుసుకోండి. తేల్చుకోండి. ఇందులో ఎక్కువ చెల్లింపులకు పాత పద్ధతిలోనే మినహాయింపు దొరుకుతుంది. అయినా చెల్లింపులు చేయడం.. ఒక మంచి అలవాటు. క్రమశిక్షణకు దారి తీస్తుంది.ఆర్ధిక చెల్లింపులలో ముందు, వెనుకలు కాకుండా నిలకడకు దారి తీస్తుంది. ఒక నిశ్చితి పరిస్థితికి దోహదపడుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు వస్తాయి. కాబట్టి, అశ్రద్ధ చేయవద్దు. మీ వ్యాపారం చిన్నదే కావొచ్చు. జీఎస్టీ పరిమితులలోపు ఉండొచ్చు. ఆడిట్ అవసరం లేకపోవచ్చు. కానీ అకౌంట్స్ విషయంలో బద్ధకం వద్దు. ముఖ్యంగా క్యాపిటల్ ఖర్చు, రెవెన్యూ ఖర్చు, సరుకుల నిల్వ మొదలైనవి ముఖ్యమైనవి.జీఎస్టీ టర్నోవరు రిటర్నులతో మీ ఇన్వాయిస్ల ప్రకారం టర్నోవరు, మీ బుక్స్ ప్రకారం టర్నోవరు చెక్ చేసుకోండి. స్థూల ఆదాయం పూర్తిగా పన్నుకి గురికాదు. ఆదాయం కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్గా వచ్చి, జరగాల్సిన పని ఏప్రిల్లో జరగొచ్చు. ఈ వ్యవహారాల్లో టీడీఎస్ అంశం ఉంటుంది. అనుమానం ఉంటే అటు పక్క వెండార్స్తో ఉత్తరప్రత్యుత్తరాలు జరపండి. ఇద్దరి రికార్డుల్లో అంకెలు, వివరణ, అకౌంటింగ్ సర్దుబాటు, సమన్వయం ఒకేలాగా ఉండాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. 2026 మార్చి 31 నాటికి మీ ఆదాయం విషయంలో టీడీఎస్ సరిపోతే సరే సరి. లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడుతుంది.ఆదాయం అంచనాల్లో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు. పన్ను భారం పెరగొచ్చు. గత మూడు వాయిదాల్లో షార్ట్ఫాల్ ఉండొచ్చు. అలాంటి వాటిని మళ్లీ లెక్కించి, కచ్చితమైన లెక్కలు తేల్చండి. రివైజ్ చేసిన లెక్కల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ మార్చి 15 లోపల చెల్లించండి. పాత సంవత్సరాల విషయంలో నోటీసులు రావచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తారు. సూచనలు చేస్తారు. ఒక రాయి విసురుతారు. వాటి సారాంశాన్ని బట్టి మీరు రిటర్నులను రివైజ్ చేసుకోవచ్చు. ముందు రాబోయే ఆపదల కన్నా, ఎంక్వైరీలకన్నా, అసెస్మెంట్ కన్నా, పెనాల్టీల కన్నా ఉత్తమమైనది, శాంతియుతంగా క్లోజ్ అయ్యేది.. రివైజ్ రిటర్ను వేయడం. అనివార్యమైతే వెంటనే రంగంలోకి దూకండి.ఇవి కాకుండా జీఎస్టీలోని కొన్ని స్కీములకు, టీడీఎస్ల డిపాజిట్లకు, టీసీఎస్ఐ చెల్లింపులకు, వృత్తి పన్ను చెల్లింపులకు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు, రిటర్నులకు, ముఖ్యంగా టీడీఎస్ తక్కువ రేట్లతో వర్తింప చేసేందుకు లేదా వద్దనుకునేందుకు ఫారం 13 వేయాలి. అది కూడా 2026 మార్చి 15లోగా దాఖలు చేయాలి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం, కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. కొత్త ఫారాలు వాడుకలోకి వస్తాయి. కొత్త ఫారంలో సమాచారం ఇవ్వడానికి 2026 మార్చి ముగిసేలోగా సర్వం సిద్ధం చేసుకోండి.
ఎన్పీఎస్ నుంచి విత్డ్రా ఇలా..
ఆర్థికంగా ఏదైనా అవసరం వస్తే గట్టెక్కేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతాం. చివరికి ఏదో ఒక రుణమైనా తీసుకుని బయటపడదామని అనుకుంటాం. కానీ, అధిక వడ్డీ రేట్లపై అప్పులు తెచి్చ, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టే బదులు.. ఏవైనా పెట్టుబడులుంటే, వాటిని వినియోగించుకోవడం మంచిది. అలాంటి సందర్భాల్లో జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) నుంచి కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు!. కాకపోతే దీన్ని విచక్షణ మేరకు వినియోగించుకోవాలి. ఎంత అవసరం అయినా... భవిష్యత్తు కోసం ఉద్దేశించినది కనుక వివేకంతో వ్యవహరించాలి.ఎలా వెనక్కి తీసుకోవచ్చు?ఆన్లైన్లో అయితే ప్రొటీన్ ఈగోవ్ పోర్టల్కు వెళ్లాలి. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్), పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ ఆప్షన్తో రీసెట్ చేసుకోవచ్చు.లాగిన్ అనంతరం ‘విత్డ్రాయల్’ సెక్షన్కు వెళ్లాలి. అందులో ట్రాన్సాక్ట్ ఆన్లైన్ సెక్షన్లో విత్డ్రాయల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.విత్డ్రాయల్ రకాన్ని ఎంపిక చేసుకోవాలి. రిటైర్మెంట్ లేదా పాక్షిక ఉపసంహరణ లేదా ముందస్తుగా వైదొలగడంలో ఒకదాన్ని ఎంచుకోవాలి.ఫారమ్లోని వివరాలను పూర్తిచేయాలి. ప్రాన్ను ధ్రువీకరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.ఈ అభ్యర్థన ఆమోదం పొందితే రెండు పనిదినాల్లో సభ్యుడి ఖాతాలో నిబంధనల మేరకు రావాల్సిన మొత్తం జమ అవుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పణకు వీలుగా సీఆర్ఏ వెబ్సైట్ నుంచి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) నుంచి కూడా తీసుకోవచ్చు.పత్రంలో పాన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు న మోదు చేసి, కేవైసీ డాక్యుమెంట్లు జత చేయాలి.ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏదేనీ పీవోపీలో సమరి్పంచొచ్చు. ఎన్పీఎస్ పీవోపీ మీకు సమీపంలో ఎక్క డ ఉన్నదీ గూగుల్ సెర్చ్ద్వారా తెలుసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ ఇలా పీవోపీలు చాలానే ఉన్నాయి.పాక్షిక ఉపసంహరణఎన్పీఎస్లో టైర్–1 ఖాతా ప్రారంభించిన మూడేళ్ల అనంతరం, మూసివేయాల్సిన అవసరం లేకుండా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అర్హత లభిస్తుంది.సొంత చందాల మొత్తం... అంటే తాను చెల్లించిన దాని నుంచి 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యాజమాన్యం జమ చేసిన మొత్తాన్ని గానీ, పెట్టుబడులపై వృద్ధి రూపంలో పెరిగిన మొత్తాన్ని గానీ పరిగణనలోకి తీసుకోరు.జీవిత కాలంలో నాలుగు పర్యాయాలు ఇలా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఒక సారి ఉపసంహరించుకున్నాక మరో నాలుగేళ్ల తరవాత గానీ మళ్లీ ఉపసంహరించుకోలేరు.పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ అవసరాల కోసం పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు.ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సైతం తీసుకోవచ్చు. అప్పటికే సొంతంగా ఇల్లు కలిగి ఉండకూడదు.సభ్యులు లేదా సభ్యుడిపై ఆధారపడిన కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురై... వారి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఖాతాపై రుణం తీసుకుని, దాన్ని తీర్చేయాలనుకున్నా కూడా పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.ఈ విషయాలను గమనించాలి..60 ఏళ్ల నాటికి లేదా 15 ఏళ్ల పాటు చందాలు జమ చేసిన తర్వాత మొత్తం నిధి రూ.8లక్షలు మించకుండా ఉంటే అందులో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి.ఎన్పీఎస్ సభ్యుడు/సభ్యురాలు మరణించినట్టయితే వారి పేరిట ఉన్న ఫండ్ను నామినీకి బదిలీ చేస్తారు.ఎన్పీఎస్ కింద గరిష్ట వయో పరిమితిని 75 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు ఇటీవలే పెంచారు. దీని ప్రకారం సభ్యులు రిటైర్మెంట్ అనంతరం తప్పుకోకుండా.. అప్పటి వరకు సమకూరిన నిధిని ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో కావాల్సినంత నెలవారీ తీసుకోవచ్చు.60 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఎన్పీఎస్లో కొనసాగే వారు సైతం పాక్షిక ఉపసంహరణ ఎంపిక చేసుకోవచ్చు. అయితే రెండు ఉపసంహరణల మధ్య కనీసం మూడేళ్ల విరామం ఉండాలి.తప్పుకోవడంసభ్యులకు 60 ఏళ్లు నిండగానే నిబంధనల ప్రకారం వారు పూర్తిగా ఈ పథకం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.ఎన్పీఎస్ నిధి అప్పటికి రూ.12 లక్షలకు మించి ఉంటే ఎలాంటి పన్ను చెల్లించకుండా మొత్తం నిధిలో 80 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యుటీ ప్లాన్ (పింఛను ఇచ్చేది) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఎన్పీఎస్ నిధి ఒకవేళ రూ.8–12లక్షల్లోపు ఉంటే రూ.6 లక్షలను ఒకే విడత వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయటం... లేదంటే కనీసం ఆరేళ్ల కాలానికి సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ (ప్రతి నెలా నిరీ్ణత మొత్తం) పద్ధతిని, లేదంటే రెండింటి మిశ్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.ఎన్పీఎస్ ఫండ్ విలువ రూ.8 లక్షల్లోపు ఉంటే 100 శాతాన్ని ఒకే విడత ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు.సిస్టమ్యాటిక్ లంప్సమ్ విత్డ్రాయల్ (ఎస్ఎల్డబ్ల్యూ)ను సైతం ఎంపిక చేసుకోవచ్చు. 80 శాతాన్ని ఒకే విడత కాకుండా క్రమానుగతంగా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకునేలా ప్లాన్ చేసుకోవచ్చు.ముందస్తుగా వైదొలగడంఎన్పీఎస్లో 60 ఏళ్లకు ముందుగా కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా వైదొలిగే అవకాశం ఉంది.ఎన్పీఎస్ ప్రారంభించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి.ఆ సమయానికి ఉన్న నిధి నుంచి 20 శాతాన్నే ఉపసంహరించుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సిందే.మొత్తం నిధి రూ.5 లక్షలు లేదా అంత కంటే తక్కువే ఉన్న సందర్భాల్లో నూరు శాతం వెనక్కి తీసుకుని గుడ్బై కొట్టేయొచ్చు.టైర్–2 అకౌంట్ నుంచి ఉపసంహరణఈ ఖాతాలో ఉన్న నిధి మొత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వేచ్ఛగా వెనక్కి తీసుకోవచ్చు.టైర్– 1 మాదిరి ఈ ఖాతా నుంచి నిధి ఉపసంహరణకు ఎలాంటి షరతులూ లేవు.టైర్ –2 ఖాతా నుంచి ఉపసంహరించుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.


