Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Corporate tax collections increased by 14. 51 percent1
ఖజానా హౌస్‌ఫుల్‌

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 10 వరకు (2025 ఏప్రిల్‌ 1 నుంచి) ప్రత్యక్ష పన్నుల నికర ఆదాయం.. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.4 శాతం పెరిగి రూ.19.44 లక్షల కోట్లకు చేరింది. ఆదాయపన్ను శాఖ డేటా ప్రకారం రిఫండ్‌లు తగ్గడం, కార్పొరేట్‌ పన్ను (కంపెనీలు చెల్లించే) వసూళ్లు బలంగా ఉండడం ఇందుకు అనుకూలించింది. ఈ కాలంలో కార్పొరేట్‌ పన్నుల వసూలు 14.51% పెరిగి రూ.8.90 లక్షల కోట్లుగా ఉంటే.. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌లు) నుంచి ఆదాయం 5.91 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా తెలియజేస్తోంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో ఖజానాకు రూ.50,279 కోట్లకు సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి వృద్ధి లేదు. పన్ను రిఫండ్‌లు (తిరిగి చెల్లింపులు) 18.82 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల పన్ను వసూళ్లు 4.09 శాతం పెరిగి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్‌ పన్నుల స్థూల ఆదాయం రూ.10.88 లక్షల కోట్లుగా, నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం రూ.11.39 లక్షల కోట్లుగా ఉంది.

India luggage market to touch Rs 267 billion dollers by 20282
క్రేజీ క్రేజీ.. మేడిన్‌ ఇండియా లగేజీ 

ఇప్పుడు ట్రావెల్‌ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్‌ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్‌ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్‌ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్‌కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్‌ లగేజీ, బ్యాగ్‌ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్‌లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్‌ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్‌ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్‌ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. సూట్‌కేసులు, ట్రాలీలు, బ్యాక్‌ప్యాక్‌లు, బిజినెస్‌ బ్యాగ్‌లు మొదలైనవి విక్రయించే అప్పర్‌కేస్‌ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్‌ (మహారాష్ట్ర), రుద్రపూర్‌ (ఉత్తరాఖండ్‌)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దన్ను గల అప్పర్‌కేస్‌ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్‌లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్‌ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్‌ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్‌ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్‌ నైనా పరేఖ్‌ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్‌ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్‌కి మార్చుకుంటున్నామని వివరించారు. కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్‌ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్‌లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. మార్కెట్‌ వాటాపై కన్ను.. యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్‌ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్‌కేస్‌ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్, ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్‌ప్యాక్‌ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Gold Gains Edge Ratio With Silver Hits 61 Amid Market Correction3
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!

బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) ఇటీవల గణనీయ మార్పులను చూపిస్తోంది. ఇది విలువైన లోహాల మార్కెట్‌లో ఉన్న అధిక అస్థిరతను సూచిస్తుంది. 2026 జనవరి చివరలో వెండి ధరలు ఘోరంగా పెరగడంతో ఈ నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 44–46కు పడిపోయింది. వెండి ధరలు ఔన్స్‌కు 100 డాలర్లను మించిపోయాయి.అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో వెండి ధరల్లో తీవ్ర దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, బంగారం-వెండి నిష్పత్తి వేగంగా 60కు పుంజుకుంది. 2026 ఫిబ్రవరి 11 నాటికి ఈ నిష్పత్తి 61 పైన ట్రేడ్ అవుతోంది.నెల ప్రారంభంలో బంగారం-వెండి నిష్పత్తిలో కనిపించిన తీవ్ర అమ్మకాలు, బులియన్ ధరలలో కొత్త ర్యాలీకి దారితీశాయి. బుధవారం (ఫిబ్రవరి 11) స్పాట్ గోల్డ్ ధరలు 0.7% పెరిగి ఔన్స్‌కు 5,057.23 డాలర్లకు చేరాయి. ఏప్రిల్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి ఔన్స్‌కు 5,081.40 డాలర్లను తాకాయి. స్పాట్ సిల్వర్ 2.3% పెరిగి ఔన్స్‌కు 82.56 డాలర్లు చేరింది.ఇక ఫిబ్రవరి 2 నుండి, బంగారం ధరలు 15% పైగా పెరిగాయి, వెండి ధరలు 16% పెరిగాయి. జనవరి 30 న వెండి ఒక్క సెషన్‌లోనే 26% క్షీణతను ఎదుర్కొంది. ఇది లోహ మార్కెట్‌లో తీవ్ర అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది.బంగారం-వెండి నిష్పత్తి అంటే..బంగారం-వెండి నిష్పత్తి అనేది బంగారం, వెండి సాపేక్ష విలువను కొలుస్తుంది. ఇది ఒక ఔన్సు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన వెండి ఔన్సుల సంఖ్యను సూచిస్తుంది. బంగారం ధరను వెండి ధరతో భాగించడం ద్వారా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి రెండు విలువైన లోహాల సాపేక్ష పనితీరు, మార్కెట్ విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.నిష్పత్తి 60 దాటడం దేనికి సూచన?బంగారం-వెండి నిష్పత్తి 43.80 వద్ద కనిష్టంగా గుర్తించడం సాంకేతికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంఘటన అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి 60ని దాటడం మార్కెట్ సాధారణీకరణ దశకి సూచన. అంటే సమీప కాలంలో బంగారం ధరలు వెండి ధరలను అధిగమించే అవకాశం ఉంది.

Vehicle Sales Surge 18pc in January Rural Demand Drives Growth FADA4
జోరుగా వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్‌గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్‌ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.‘‘ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్‌యూవీ/కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్‌ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్‌ సీ ఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు.వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్‌లుక్‌ రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్‌ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్‌ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.జీఎస్‌టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్‌ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాల విభాగాల్లో డిమాండ్‌ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్‌ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది.

LTIMindtree is now LTM unveils new identity and positioning5
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ

ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్‌టీఎం లిమిటెడ్‌ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్‌టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్‌తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్‌టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్‌.. లార్సెన్ & టుబ్రో గ్రూప్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్‌ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్‌అండ్‌టీఐ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే..

PLI Scheme Attracts 55 Companies Commits Rs 13203 Crore Investments6
పీఎల్‌ఐ పథకానికి 55 కంపెనీలు సై..

న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్‌ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం మూడో రౌండ్‌ను కేంద్ర స్టీల్‌ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్‌గ్రేడెడ్‌ అలాయ్‌ స్టీల్‌ తయారీలో 8.7 మిలియన్‌ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్‌కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.వీటిలో పీఎస్‌యూ దిగ్గజం సెయిల్‌ సేలం స్టీల్‌ ప్లాంట్‌తో స్టీల్‌ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్‌ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో పీఎల్‌ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌.. లక్ష్యాలు రెండింటికీ తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్‌ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్‌ టన్నుల స్పెషాలిటీ స్టీల్‌ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు.

Advertisement
Advertisement
Advertisement