Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock markets: Sensex gained 320 points to 81857 and Nifty 127 points to 251751
ట్రేడ్‌ డీల్‌ జోష్‌

ముంబై: ఐరోపా సమాఖ్య(ఈయూ)తో మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. బ్యాంకులు, మెటల్‌ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్‌ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 25,175 వద్ద నిలిచింది.⇒ దేశీయ ఆటో రంగ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్‌–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి. దీంతో మార్కెట్లో మరింత పోటీతత్వం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా మహీంద్రాఅండ్‌మహీంద్రా 4%, హ్యుందాయ్‌ మోటార్స్‌ 4% పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.50%, టాటా మోటార్స్‌ పీవీ 1.22%, ఎంఆర్‌ఎఫ్‌ 1.20%, అశోక్‌ లేలాండ్‌ 0.50% నష్టపోయాయి. ⇒ ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో రెడీమేడ్‌ గార్మెంట్స్, కాటన్, హోమ్‌ టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గి ఎగుమతులు మరింత పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో దేశీయ టెక్స్‌టైల్స్‌ కంపెనీ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్, కేఆర్‌పీ మిల్స్‌ 6% ర్యాలీ చేశాయి. వెల్‌స్పన్‌ లివింగ్‌ 4.22%, అలోక్‌ ఇండస్ట్రీస్‌ 2.50%, ట్రిడెంట్‌ 2%, అరవింద్‌ అరశాతం లాభపడ్డాయి. భారత టెక్స్‌టైల్, రెడీమేడ్‌ వ్రస్తాల ఎగుమతులకు అమెరికా తర్వాత యూరోపియన్‌ యూనియన్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.

Made in India brands are expanding in Europe2
యూరప్‌ షాపింగ్‌ కార్ట్‌లో మేడిన్‌ ఇండియా బ్రాండ్స్‌

న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మధ్య తాజాగా కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ప్రధానంగా దేశీ వస్త్ర(టెక్స్‌టైల్స్‌) పరిశ్రమకు గేమ్‌ఛేంజర్‌ కానుంది. 27 దేశాల ఈయూతో ఎఫ్‌టీఏ కారణంగా దేశీ టెక్స్‌టైల్స్‌ ఎగుమతులకు బూస్ట్‌ లభించనుంది. టారిఫ్‌ల ప్రభావంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ తదితర దేశాలతో పోటీలో భారత్‌ సవాళ్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందంతో దాదాపు జీరో డ్యూటీల ద్వారా 264 బిలియన్‌ డాలర్ల(రూ. 22.9 లక్షల కోట్లు) విలువైన ఈయూ మార్కెట్‌కు భారత్‌ ఎగుమతులు ఊపందుకునే వీలున్నట్లు కేంద్ర జౌళి శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశీ టెక్స్‌టైల్స్, దుస్తుల ఎగుమతులకు యూఎస్‌ తదుపరి ఈయూ రెండో పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది.దేశీ టెక్స్‌టైల్స్, దుస్తుల ఎగుమతుల ఆదాయంలో 28 శాతం వాటా ఆక్రమిస్తున్న యూఎస్‌.. భారత్‌ గూడ్స్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించిన విషయం విదితమే. కాగా.. టారిఫ్‌లవల్ల పోటీ దేశాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న దేశీ వస్త్ర పరిశ్రమకు ఎఫ్‌టీఏ జోష్‌నివ్వనున్నట్లు జౌళి శాఖ పేర్కొంది. ఇది శ్రామిక ఆధారిత రంగం కాగా.. ఎఫ్‌టీఏ ప్రభావంతో ధరలతో పోటీ పడటమేకాకుండా మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. దీంతో 264 బిలియన్‌ డాలర్ల(రూ. 22.9 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల మార్కెట్లో మరింతగా పోటీ పడేందుకు దారి ఏర్పడనున్నట్లు వెల్లడించింది.ప్రత్యక్షంగా టెక్స్‌టైల్స్‌ రంగం 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్‌ నుంచి 36.7 బిలియన్‌ డాలర్ల(రూ. 3.19 లక్షల కోట్ల) విలువైన గ్లోబల్‌ టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతులు నమోదవుతున్నాయి. వీటిలో ఈయూ వాటా 7.2 బిలియన్‌ డాలర్లుకాగా.. తాజా ఒప్పందంతో యార్న్, కాటన్‌ యార్న్, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ తదితర ప్రొడక్టులకు భారీ అవకాశాలు ఏర్పడనున్నట్లు జౌళి శాఖ వివరించింది. ఫార్మా ఎగుమతులకు దన్ను ఈయూతో ఎఫ్‌టీఏ కారణంగా దేశీ ఫార్ములేషన్లు, ఏపీఐలు, విలువైన ఔషధాల ఎగుమతులు బలపడనున్నట్లు ఫార్మాక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషీ పేర్కొన్నారు. దేశీ ఫార్మాస్యూటికల్‌ రంగానికి నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా నాణ్యతా సామర్థ్యాలుగల దేశీ ఫార్మా ఎంఎస్‌ఎంఈలకు దన్ను లభిస్తుందని తెలియజేశారు. మైలురాయిగా.. భారత్, ఈయూ మధ్య ఎఫ్‌టీఏను మైలురాయిగా లగ్జరీ బ్రాండ్ల ఆటో రంగ దిగ్గజాలు మెర్సిడెస్‌ బెంజ్, బీఎండబ్ల్యూ, స్కోడా ఆటో, ఫోక్స్‌వేగన్, ఆడి, స్టెల్లాంటిస్‌ అభివర్ణించాయి. దీంతో సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్నివ్వడమేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం దన్నుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాయి.

Donald Trump Post On India EU Mother of All Deals3
'ముందు 50 శాతం డాడీ ట్యాక్స్ చెల్లించండి': ట్రంప్ పోస్ట్!

సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్‌లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలుఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.

Do You Know About 1973 Black Budget in India4
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?

కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1860 ఏప్రిల్ 7న భారత్ బ్రిటిష్ పాలనలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ (మధ్యంతర బడ్జెట్)ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్‌.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.బ్లాక్ బడ్జెట్ గురించిభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా..1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.రూ. 550 కోట్ల ఆర్థిక లోటు..దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా.. ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.

Luxury Cars Wines Medicine Will Be Cheaper After India EU Pact5
భారత్ - ఈయూ డీల్: భారీగా తగ్గనున్న వీటి ధరలు!

భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. అనేక వర్గాలకు అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా వైన్, విస్కీ అభిమానులు, లగ్జరీ కార్ల ప్రియులు, పరిశ్రమలు & సాధారణ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఈ ఒప్పందం ద్వారా ఇండియా ఉత్పత్తులు యూరప్ దేశాలకు ఎగుమతి, అక్కడి ఉత్పత్తులు భారతదేశానికి ఎక్కువగా దిగుమతి అవుతాయి. సుంకాలు చాలా వరకు తగ్గడం వల్ల.. యూరోపియన్ వస్తువులు మన దేశంలో చౌకగా మారనున్నాయి.తగ్గనున్న ప్రీమియం కార్ల ధరలుమెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లపై ప్రస్తుతం దిగుమతి 100 శాతంగా ఉంది. అయితే ఒప్పందం ప్రకారం, 15,000 యూరోల కంటే ఎక్కువ.. అంటే దాదాపు రూ. 16 లక్షల విలువైన కార్లపై ఇప్పుడు 40 శాతం సుంకం విధిస్తారు. ఆ తరువాత ఈ ట్యాక్స్ క్రమంగా 10 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల కార్ల ధరలు చాలా తగ్గుతాయి.మద్యం ధరలుఒప్పందం తరువాత ఫ్రాన్స్, ఇటలీ & స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకునే వైన్ చౌకగా లభించనుంది. ప్రస్తుతం, భారతదేశం దిగుమతి చేసుకునే వైన్‌పై 150 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తుంది. కొత్త ఒప్పందం దీనిని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ధర ఉన్న వైన్లకు విధించే ట్యాక్స్ విషయంలో ఎలాంటి రాయితీ ఉండదు.ఔషధాలు (మెడిసిన్స్)యూరప్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సాంకేతికతలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా.. క్యాన్సర్ & ఇతర అనారోగ్యాలకు కావలసిన దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాల ధరలు భారతదేశంలో తగ్గనున్నాయి.ఇదీ చదవండి: భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలువాణిజ్య ఒప్పందంతో..దిగుమతి చేసే విమానాల విడిభాగాలు, మొబైల్ ఫోన్లు & హైటెక్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు అవుతాయి. దీంతో ఈ వస్తువుల తయారీ ఖర్చులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాడ్జెట్లు మరింత చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది భారత్‌లో తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.ఉక్కు & రసాయన ఉత్పత్తులువాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇనుము, ఉక్కు & రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాలు (Zero Tariffs) విధించాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు లాభపడతాయి. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు తగ్గి, దీని ప్రభావం చివరికి వినియోగదారులకు కూడా మేలు చేసేలా ఉండనుంది.

Tier 3 College Graduate Reveals How She Landed Job At Google6
షార్ట్‌కట్స్ లేవు, అదృష్టం కాదు.. గూగుల్‌లో జాబ్!

గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని కొందరు అనుకుంటారు. కానీ.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెబుతున్నారు గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఆర్చీ గుప్తా. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గూగుల్ సంస్థలో జాబ్ ఎలా తెచ్చుకున్నారు?, అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?, అనే ఆసక్తికరమైన ఈ కథనంలో తెలుసుకుందాం.ఒక సాధారణ కాలేజీలో చదువుకుని.. గూగుల్‌లో ఉద్యోగం సాధించిన టెక్ ప్రొఫెషనల్ ఆర్చీ గుప్తా ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ప్రతిభకు, కష్టపడే తత్వానికి.. కాలేజీ పేరు లేదా ప్రతిష్ట అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు, అంకితభావం & నిరంతర ప్రయత్నం ఉంటే ఎవరైనా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చని వెల్లడించారు.తాను షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులో.. ఆర్చీ గుప్తా కెరీర్‌లోని ముఖ్యమైన దశలను ఫోటోల రూపంలో చూపించారు. మొదటి ఇంటర్న్‌షిప్ నుంచి మొదటి ఉద్యోగం వరకు.. ఎదురైన తిరస్కారాలు, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వెల్లడించారు. ప్రారంభంలో ఆమెను గూగుల్ తిరస్కరించింది. అదే తిరస్కారం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చిందని, ముందుకు వెళ్లడానికి ప్రేరణగా మారిందని చెప్పారు. పట్టుదలతో శ్రమించి చివరికి గూగుల్‌లో జాబ్ తెచ్చుకుంది.సాధారణ కాలేజీ నుంచి గూగుల్ వరకు ఎదగడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. అదృష్టం మీద ఆధారపడలేదు. సంవత్సరాల పాటు కృషి చేసాను. ప్రతిరోజూ ప్రయత్నించడం చేయడం మానుకోలేదని ఆర్చీ గుప్తా చెప్పారు. ఒక్కసారికే విజయం లభించదు. గొప్ప క్షణాలు వెంటనే కనిపించవు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని ఆమె వివరించారు. View this post on Instagram A post shared by Archy Gupta | Tech, Career, AI (@archy.gupta)

Advertisement
Advertisement
Advertisement