Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market Closing Update 10th April 20261
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Gratuity in India Eligibility Calculation Formula Latest Rules Explained2
గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.గ్రాట్యుటీ అంటే ఏమిటి?‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.గ్రాట్యుటీ పొందడానికి అర్హతలుగ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.ఎలా లెక్కిస్తారు?గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్‌+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.ఉదాహరణ:రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.ముఖ్యమైన అంశాలుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: రఫేల్‌ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!

Free Homes in Spain This Tiny Village Offers Jobs3
స్పెయిన్‌లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!

ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్‌లోని అరెనిల్లాస్‌. ఈ గ్రామం స్పెయిన్‌లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్‌ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్‌ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్‌ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్

Funding for Indian Tech Startups Declines by 18pc in FY254
టెక్‌ స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్‌..

న్యూఢిల్లీ: దేశీ టెక్నాలజీ అంకుర సంస్థల నిధుల సమీకరణ గత ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 14.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 18 శాతం క్షీణించింది. అయితే, 2023–24లో సమీకరించిన 9.7 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే పెరిగింది. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ’ట్రాక్షన్‌’ ఇండియా టెక్‌ వార్షిక ఫండింగ్‌ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నిధులను దక్కించుకున్న స్టార్టప్‌లపరంగా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, చైనా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో నిల్చింది. జర్మనీ, ఫ్రాన్స్‌కన్నా ముందుంది. తాజా గణాంకాల ప్రకారం సీడ్‌ స్థాయి స్టార్టప్‌లలో పెట్టుబడులు 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 1.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. వ్యాపారాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్న ఎర్లీ స్టేజ్‌ అంకురాల్లోకి ఫండింగ్‌ 3.6 బిలియన్‌ డాలర్ల నుంచి 33 శాతం ఎగిసి 4.8 డాలర్లకు పెరిగింది. లేట్‌ స్టేజ్‌ స్టార్టప్‌లకు నిధులు 9.2 బిలియన్‌ డాలర్ల నుంచి 38 శాతం క్షీణించి 5.6 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. నివేదికలో మరిన్ని వివరాలు.. 2025–26లో 100 మిలియన్‌ డాలర్ల పైబడిన ఫండింగ్‌ లావాదేవీలు 13 నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 23గా, 2023–24లో 13గా నమోదయ్యాయి. నిధులను ఆకర్షించడంలో ఫిన్‌టెక్, రిటైల్‌ టాప్‌ రంగాలుగా నిల్చాయి. ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్, ఫిన్‌టెక్‌ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను లభించాయి. నెక్స్‌ట్రాలోకి 710 మిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు, నెయిసాలోకి 600 మిలియన్‌ డాలర్లు, ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీలోకి 344 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌లోకి దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 3.6 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఫిన్‌టెక్‌ సంస్థలు 14 శాతం అధికంగా 2.4 బిలియన్‌ డాలర్లు దక్కించుకున్నాయి. రిటైల్‌ స్టార్టప్‌లలోకి పెట్టుబడులు 32 శాతం క్షీణించి 3.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2.4 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఐపీవోలపరంగా టెక్‌ సంస్థల ఇష్యూలు 52 శాతం పెరిగి 47కి చేరాయి. లెన్స్‌కార్ట్, గ్రో, మీషోలాంటి బడా ఐపీవోలు వీటిలో ఉన్నాయి. 2024–25లో 4 అంకురాలు యూనికార్న్‌ హోదా (1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌) దక్కించుకోగా, 2025–26లో ఇది 50 శాతం పెరిగి 6 స్టార్టప్‌లకు చేరింది.

Government Targets Two Key Bidders for IDBI Bank Privatization5
ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయానికి దారి దొరికిందా?

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్‌ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్‌ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్‌ మానిటైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్‌ బిడ్‌ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.ఇది బ్యాంక్‌ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్‌వత్సా సంస్థ ఫెయిర్‌ఫాక్స్, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలు చేశాయి. బ్యాంక్‌లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి.

Gold vs War Why Russia and Turkey are Selling Gold6
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్‌తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102

Advertisement
Advertisement
Advertisement