Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US grants 30-day waiver to India for buying Russian oil1
మళ్లీ మనకి రష్యా క్రూడ్‌

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్‌ కొనుగోలు చేసేందుకు భారత్‌కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్‌కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌ ఎజెండాతో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్‌ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్‌ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్‌ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్‌ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్‌ తెలిపారు. సముద్ర జలాల్లో 130 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్‌ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 15 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడ్‌తో అరేబియన్‌ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్‌ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్‌ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్‌ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్‌కి చేరుకునేంత దూరంలో, సింగపూర్‌ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్‌కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్‌ కెనాల్‌లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దాదాపు 50 శాతం క్రూడ్‌ దిగుమతుల కోసం హార్మూజ్‌ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్‌కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ’కెప్లర్‌’ అనలిస్ట్‌ సుమీత్‌ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్‌ బ్యారెళ్ల రష్యన్‌ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్‌ బ్యారెళ్ల రష్యన్‌ ఆయిల్‌ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్‌ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్‌కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు. 25 రోజులకు సరిపడా నిల్వలు...ఉక్రెయిన్‌ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్‌కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్‌ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్‌ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్‌ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్‌ ఆయిల్‌ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్‌ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్‌ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు.

Gold Prices Drop Today Check The Latest Rate Update2
మరింత తగ్గిన గోల్డ్ రేటు: లేటెస్ట్ ధరలు ఇలా..

మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Preity Zinta Sells Mumbai Bandra Apartment for Rs 18 5 Crore3
మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న తన ప్లాట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.ప్రీతి జింటా 2025 నవంబర్‌లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్‌ విక్రయించడం విశేషం.ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్‌కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్‌' విలన్‌నవంబర్‌లో విక్రయించిన ప్లాట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

Gold Stranded in Dubai Sold at Discount4
బంగారానికి భారీ డిస్కౌంట్‌.. ఎక్కడ.. ఎందుకు?

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు, అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

Jio Best Recharge Plans With More Than 200 Days5
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!

ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్‌ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.

Tata Steel Plans Rs 11000 Crore Investment in Jamshedpur Plant6
టాటా స్టీల్‌ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు

రాంచీ: అధునాతన గ్రేడ్‌ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్‌పూర్‌ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్‌లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్‌పూర్‌లో 1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. హైడ్రోజన్‌ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement