Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market closing April 1 Sensex settles off days high1
స్టాక్‌ మార్కెట్లు ముగిశాయిలా..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్‌ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ టాప్‌ గెయినర్‌గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి.

ATM rules changed HDFC PNB Bandhan Bank atms new rules from April 12
ఏటీఎం రూల్స్‌.. ఇక మారిపోయాయ్‌..

దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్‌డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్‌ విత్‌డ్రా లిమిట్‌ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గిందిఅయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్‌ను పీఎన్‌బీవన్‌ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.బంధన్ బ్యాంక్బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇ‍క తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.

Shell India Joins Nayara Fuel Prices Surge as Crude Oil Tops3
నయారా బాటలో షెల్‌ ఇండియా!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.బెంగళూరులో ధరల మోతతాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్‌ కంపెనీ అవుట్‌లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధరపెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52 అంతర్జాతీయ సంక్షోభంఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలుముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Enterprise AI Shifts Focus From Model Power to Operational Control4
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..

కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్‌లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్‌నర్‌ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్‌ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్‌గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్‌ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్‌ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్‌పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్‌ను ఒక ఫీచర్‌గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్‌ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

South India Retirement Readiness Lags Despite Rising Health Awareness5
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్‌తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్‌ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.నివేదికలోని అంశాలు..దక్షిణాది ప్రజలు తమ ఫిట్‌నెస్‌పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్‌లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.బీమా: హెల్త్ చెకప్‌ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.10 ఏళ్లకే నిధులు ఖాళీ?పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.ఒంటరితనం దూరంఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!

Smart Loan Choices Key Checks Before Borrowing for Home Car Education6
లోన్‌ కావాలా? ఇవి తెలియకపోతే ఇబ్బందే!

ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు, కారు కొనుగోలు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం రుణం తీసుకోవడం సర్వసాధారణం. అయితే, అవసరం కదా అని ఏ ఆర్థిక సంస్థ కనిపిస్తే అందులో అప్పు చేయడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. అందుకే, ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలను పాఠకుల కోసం అందిస్తున్నాం.క్రెడిట్ స్కోరురుణం మంజూరు చేయడంలో క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి. దరఖాస్తుకు ముందే మీ స్కోరును సరిచూసుకోండి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరుచుకున్నాకే లోన్‌కు వెళ్లడం ఉత్తమం.ఎలాంటి వడ్డీ రేటో ముందే తెలుసుకోండి..వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర వడ్డీ. ఇందులో రుణ కాలపరిమితి మొత్తం వడ్డీ మారదు. రెండోది ఫ్లోటింగ్ రేటు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు మార్పులకు అనుగుణంగా వడ్డీ మారుతుంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మీకు ఏది లాభదాయకమో నిర్ణయించుకోండి.తిరిగి చెల్లించే సామర్థ్యంనెలవారీ ఆదాయంలో 40% నుంచి 50% మించి అన్ని లోన్ల ఈఎంఐలు ఉండకుండా చూసుకోవాలి. లోన్ తీసుకునే ముందే ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీరు ఎంత చెల్లించగలరో లెక్కవేసుకోండి.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలుకేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, జీఎస్టీ వంటి వాటిపై కూడా కన్నేయాలి. ఒక్కోసారి తక్కువ వడ్డీ అని చెప్పి ఇతర ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితికాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది కానీ, మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి, మీ ఆర్థిక స్థితిని బట్టి సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం తెలివైన పని.ముందస్తు చెల్లింపు నిబంధనలుమీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ మొత్తాన్ని ముందే కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు ఏమైనా పెనాల్టీలు విధిస్తున్నాయో అడగండి. ముఖ్యంగా పర్సనల్ లోన్ల విషయంలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి.ఇతర నిబంధనలులోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు ‘ఫైన్ ప్రింట్’ (లోసుగులతో కూడిన ఇతర నిబంధనలు) చదవండి. బీమా తీసుకోవాలనే నిబంధన లేదా సర్వీస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు అందులో ఉండవచ్చు.ఇతర బ్యాంకుల ధరలతో పోలికఒక్క బ్యాంక్‌తోనే ఆగిపోకుండా కనీసం 3-4 ఆర్థిక సంస్థల ఆఫర్లను పోల్చి చూడండి. ప్రస్తుతం అనేక వెబ్‌సైట్లు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకే చోట పోల్చి చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.లోన్ ఇన్సూరెన్స్దురదృష్టవశాత్తూ రుణగ్రహీతకు ఏదైనా జరిగితే, ఆ అప్పు కుటుంబ సభ్యులపై భారం కాకుండా ఉండేందుకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఇది తప్పనిసరి కాకపోయినా భద్రత దృష్ట్యా ఆలోచించదగ్గ విషయం.బ్యాంక్ విశ్వసనీయత, సేవలుకేవలం తక్కువ వడ్డీ ఇస్తున్నారని తెలియని యాప్‌ల ద్వారా లేదా గుర్తింపు లేని సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దు. ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలను మాత్రమే ఎంచుకోండి. అలాగే వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి.రుణం అనేది అవసరానికి ఆసరా కావాలి కానీ, అది మీ ప్రశాంతతను దూరం చేసే భారం కాకూడదు. పైన పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!

Advertisement
Advertisement
Advertisement