Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mobile Data Usage In India Could Soon Get Taxed1
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!

దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Retail inflation rises to 3. 21 Percentage in February as food prices climb2
ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్‌ ద్రవ్యోల్బణం) ఫిబ్రవరిలో 3.21 శాతానికి ఎగిసింది. ఈ ఏడాది జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.74 శాతంగా (సవరించిన) ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ లకి్ష్యత స్థాయి (4 శాతం)కి దిగువనే ఉన్నప్పటికీ.. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన తాజా గణాంకాలు ధరల ఒత్తిళ్లను తెలియజేస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ధరల ఒత్తిళ్లు ఇక ముందూ కొనసాగొచ్చని ఆర్థికవేత్తల అంచనా. 2024 బేస్‌ సంవత్సరంతో, కొత్త సీపీఐ సిరీస్‌ ఆధారంగా విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇంతకుముందు 2012 బేస్‌ సంవత్సరంగా ఉండేది. అలాగే, సీపీఐ పరిధిలో వస్తువులను 299 నుంచి 358కి పెంచారు. ఆహార విభాగం వెయిటేజీ లోగడ ఉన్న 45 శాతం నుంచి 40 శాతానికి దిగొచ్చింది. ⇒ ఆహార వస్తువుల ధరలు జనవరిలో ఉన్న 2.13 శాతం నుంచి ఫిబ్రవరిలో 3.47 శాతానికి పెరిగాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంలో ఆహార విభాగం ధరలే ప్రధాన పాత్ర పోషించాయి. ⇒ ఫిబ్రవరిలో ధరలు అధికంగా పెరిగిన వాటిల్లో ప్రధానంగా వెండి, బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలీఫ్లవర్‌ ఉన్నాయి. ⇒ వెల్లుల్లి, ఉల్లి, ఆలు, కందిపప్పు, లిచీ పండ్ల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం (ధరలు క్షీణించడం) కనిపించింది. ⇒ ఇళ్ల ధరల (నిర్వహణ, మరమ్మతులు) తాలూకూ ద్రవ్యోల్బణం సైతం 3.2 శాతం నుంచి 3.26 శాతానికి చేరింది. ⇒ ప్రాథమిక విద్య ద్రవ్యోల్బణం 3.59 శాతం, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి 4.09 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ⇒ వస్తు రవాణాకు సంబంధించి 7.49 శాతం, ప్రయాణికుల రవాణా సేవలకు సంబంధించి 1.75 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది.చమురు ధరలతో ఇంకా పెరిగే ముప్పుపశ్చిమాసియా సంక్షోభంతో చమురు, గ్యాస్‌ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో.. ప్రతీ 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 0.40–0.60 శాతం మేర అధికమవుతుందని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా.

IHCL Gateway brand reached 50 hotel milestone with signing of property in Hyderabad3
హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని సోమాజిగూడలో గేట్‌వే బ్రాండ్‌ కింద హోటల్‌ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్‌ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్‌వే హోటల్‌గా మార్చనున్నారు.ఇందులో 225 గదులు, ఆల్‌–డే డైనింగ్‌ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్‌ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్‌సీఎల్‌కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్‌ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్‌వే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లియా టాటా తెలిపారు.

TVS has launched the new Orbiter V1 in India at a starting price of Rs 499994
టీవీఎస్‌.. ఆర్బిటర్‌ వీ1

చెన్నై: ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటార్స్‌ తమ ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోని విస్తరించింది. తాజాగా 1.8 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిటర్‌ వీ1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఆవిష్కరించింది. దీనితో పాటు 3.1 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీతో ఆర్బిట ర్‌ వీ2 వేరియంట్‌ కూడా లభిస్తుంది.బ్యాటరీ యాజ్‌ ఏ సరీ్వస్‌ (బీఏఏఎస్‌) విధానంలో ఆర్బిటర్‌ వీ1 ధర రూ. 49,999 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). బీఏఏఎస్‌యేతర విధానంలో రేటు రూ. 84,500 (ఢిల్లీ ఎక్స్‌షోరూం). పూర్తి బ్యాటరీ ఖరీదును ముందస్తుగా చెల్లించాల్సిన లేకుండా, తక్కువ రేటుకే వాహనాన్ని సొంతం చేసుకునేందుకు బీఏఏఎస్‌ విధానం ఉపయోగపడుతుందని కంపెనీ ప్రెసిడెంట్‌ (ఇండియా 2డబ్ల్యూ బిజినెస్‌) గౌరవ్‌ గుప్తా తెలిపారు.

LPG Cylinder Price Today Check Latest Rates in India5
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..

భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్‌లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్‌పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్‌లో ఎల్‌పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.కొత్త ధరలుఢిల్లీడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50ముంబైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836కోల్‌కతాడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50చెన్నైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50హైదరాబాద్‌డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0

Renault Sees India as Global Hub Plans 4 New Models Locally Developed6
2030 నాటికి రెనాల్ట్ టార్గెట్ ఇదే!

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్‌ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Advertisement
Advertisement