Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Prices Surge Within Hours Latest Rates in Hyderabad Vijayawada Delhi1
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!

మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

Robert Kiyosaki Reveals Which Assets Can Survive Market Crashes2
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు.

Hyderabad to Become Global City in 10 Years Says Minister Sridhar Babu3
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.

Skyroot Aerospace Raises 60 Million Dollars4
యూనికార్న్‌ క్లబ్‌లోకి హైదరాబాద్‌ స్కైరూట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్‌ ‘స్కైరూట్‌’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్‌తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.సాధారణంగా ఒక స్టార్టప్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్‌గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ పెట్టుబడి రౌండ్‌కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్‌కో గ్రూప్‌ వ్యవస్థాపకులు, ఆర్కామ్‌ వెంచర్స్‌ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ ఇన్వెస్టర్‌, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్‌ శ్రీరామ్‌ కూడా ఇందులో చేరనున్నారు.కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్‌-1' రాకెట్‌ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్‌ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్‌-2' రాకెట్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.ఈ రాకెట్‌ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్‌ ఇంజిన్‌తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.ప్రస్తుతం స్కైరూట్‌ సంస్థ 'విక్రమ్‌-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్‌లో పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్‌ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్‌ లాంచ్‌ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

2026 Force Traveller Launched5
ఫోర్స్‌ సరికొత్త 'ట్రావెలర్‌ ఎన్‌' సిరీస్‌

భారతీయ అతిపెద్ద వ్యాన్‌ తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్, తన ఐకానిక్‌ ట్రావెలర్‌ ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తూ కొత్త ‘ఫోర్స్‌ ట్రావెలర్‌ ఎన్‌’ సిరీస్‌ని ఆవిష్కరించింది. అంబులెన్స్‌లు, స్కూల్‌ బస్సులు, డెలివరీ వాహనాల కోసం రూపొందించిన ఈ కొత్త శ్రేణితో ‘షేర్డ్‌ ప్యాసింజర్‌’ మొబిలిటీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త ‘ట్రావెలర్‌ ఎన్‌’లో డిజిటల్‌ క్లస్టర్, 9–అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, మెరుగైన ఎన్‌వీహెచ్‌ (నాయిస్, వైబ్రేషన్, హార్‌‡్షనెస్‌) టెక్నాలజీ, అధునాతన హెచ్‌వీఏసీ సిస్టమ్, ఎర్గోనామిక్‌ సీట్లు వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచి్చంది. అలాగే రోబోటిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేటెడ్‌ డోర్‌ హెమ్మింగ్‌ టెక్నాలజీ ద్వారా బిల్డ్‌ క్వాలిటీ, స్ట్రక్చరల్‌ ఇంటిగ్రిటీని పెంచింది.ఈ వాహనాల్లో బీఎస్‌–4 స్టేజ్‌2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్‌ఎం 2.6 సీఆర్‌ ఇంజిన్‌ను అమర్చారు. వాహన యజమానుల కోసం ‘ఫోర్స్‌ కేర్‌’ కింద పొడిగించిన వారంటీ, ‘ఐ–పల్స్‌’ ద్వారా రియల్‌–టైమ్‌ వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి సేవలను సంస్థ అందిస్తోంది. ఈ నెల(మే) రెండోవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

Rising Memory Chip Prices Set to Slow Smartphone Sales in India6
స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు బ్రేక్‌: కారణం ఇదే!

మెమొరీ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 10–12 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఒక నివేదికలో తెలిపింది.ధరలపరమైన ఒత్తిళ్లు, డిమాండ్‌ నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. ‘డీఆర్‌ఏఎం, ఎన్‌ఏఎన్‌డీ ధరలు పెరగడంతో డివైజ్‌ల ధర పెరిగింది. దీనితో మాస్‌ సెగ్మెంట్‌కి సంబంధించిన ఉత్పత్తులు భారంగా మారాయి. వాటితో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రభావం తక్కువగా ఉంది‘ అని సీఎంఆర్‌ వీపీ ప్రభు రామ్‌ తెలిపారు. నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో షిప్‌మెంట్లు రెండు శాతం తగ్గాయి. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..ట్రాన్షన్, వన్‌ప్లస్‌ అమ్మకాలు వరుసగా 30 శాతం, 28 శాతం క్షీణించాయి.టాప్‌ 5 బ్రాండ్లలో వివో, ఒప్పో అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. శాంసంగ్, షావోమీ, రియల్‌మీ విక్రయాలు వరుసగా 8%, 7%, 12 శాతం క్షీణించాయి.చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో 21 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాంసంగ్‌ (17 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (12 శాతం), రియల్‌మీ (10 శాతం) ఉన్నాయి.ఐఫోన్‌ 16 దన్నుతో యాపిల్‌ షిప్‌మెంట్లు 6 శాతం పెరగ్గా, సంస్థ మార్కెట్‌ వాటా 9 శాతంగా నమోదైంది.ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్లో చైనా బ్రాండ్‌ ఐటెల్‌ మొబైల్‌ అమ్మకాలు 26 శాతం పడిపోయినప్పటికీ 35 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత స్థానాల్లో లావా (34 శాతం వాటా), హెచ్‌ఎండీ (18 శాతం వాటా) ఉన్నాయి.చిప్‌సెట్స్‌ తయారీ సంస్థల్లో భారత్‌లో మీడియాటెక్‌ 48 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 25,000 పైబడిన ఫోన్లు) క్వాల్‌కామ్‌ 36 శాతం వాటాను దక్కించుకుంది.

Advertisement
Advertisement
Advertisement