Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Oracle Boss Larry Ellison Wealth Plummets by 193 Billion in Six Months1
ఒరాకిల్‌ బాస్‌కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్‌!

టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్‌లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కుబేరుల జాబితాలో వెనక్కి..బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్‌లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.షేర్ల పతనమే కొంపముంచింది..ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్‌కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.భారీగా ఉద్యోగుల తొలగింపు ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.భారత్‌పై తీవ్ర ప్రభావంమీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది."ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Government Plans Rs 8 Lakh Crore Market Borrowing2
కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక: తొలి ఆరు నెలల్లో..

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి (2026–27 ఏప్రిల్‌-సెప్టెంబర్) రూ.8 లక్షల కోట్ల రుణాలను మార్కెట్‌ నుంచి సమీకరించే ప్రణాళికతో ఉంది. ఆదాయం లోటును పూడ్చుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మేరకు నిధులను సమకూర్చుకోనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.17.20 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి నిధుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.బడ్జెట్‌ సమర్పణ అనంతరం, ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌) మార్పిడి ప్రక్రియలు నిర్వహించడంతో స్థూల మార్కెట్‌ రుణాలు రూ. 16.09 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. ‘‘రూ.16.09 లక్షల కోట్లకు గాను రూ.8.20 లక్షల కోట్లను (మొత్తం లక్ష్యంలో 51%) మొదటి ఆరు నెలల్లో డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా సమీకరించనున్నాం.ఇందులో రూ.15,000 కోట్లు సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీ కూడా ఉంటుంది. 2026–27లో వాస్తవ ద్రవ్యలోటు రూ.16.9 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మార్కెట్‌ నుంచి నికర రుణ సమీకరణ రూ.11.7 లక్షల కోట్లుగా ఉంటుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు నిధులు, ఇతర వనరుల రూపంలో సమకూర్చుకోనున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.

The Era of Made in India CCTV Cameras Begins3
ఇక మేడిన్‌ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం!

న్యూఢిల్లీ: దిగుమతి చేసుకున్న, సర్టిఫై చేయని యూనిట్లపై నిషేధంతో సీసీటీవీ కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాయి. హిక్‌విజన్, టీపీ–లింక్‌లాంటి చైనీస్‌ సీసీటీవీ కంపెనీలపై దీనితో ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.స్టాండర్డైజేషన్‌ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్‌ (ఎస్‌టీక్యూసీ) నిబంధనల అమలుతో సర్వైలెన్స్‌ పరిశ్రమ స్వరూపం మారినట్లు సీపీ ప్లస్‌ బ్రాండ్‌ సీసీటీవీలను తయారు చేసే ఆదిత్య ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. ఎస్‌టీక్యూసీ లేని సీసీటీవీ యూనిట్ల విక్రయాన్ని 2025 ఏప్రిల్‌ 9 నుంచి కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. అయితే అప్పటికే దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు వీలు కల్పించింది. దీనితో పలు సంస్థలు దేశీయంగా ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాయి.

Mahindra to Hike Prices by Up To 2 5 Percent4
పెరిగిన మహీంద్రా కార్ల ధరలు

దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనుండగా, అన్ని వాహనాలపై సగటున 1.6 శాతం పెరుగుదల ఉంటుంది.పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, మొత్తం వ్యయాల మొదలైన కారణాల వల్లనే ధరల పెంపు జరిగిందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. దీంతో XUV 3ఎక్స్ఓ ఈవీ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలో త్వరలోనే వెల్లడవుతాయి. థార్, స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి.మహీంద్రా XUV7XO ధరల సవరణ మొదటి 40,000 బుకింగ్‌ల డెలివరీ తర్వాత జరుగుతుంది. ధరల పెరుగుదల జరిగినప్పటికీ.. కారు ఫీచర్లు లేదా మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు.

Gold Gifts To Tax or Not to Tax5
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?

ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్‌లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్‌లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు

Is Gold Losing Its Shine and Why Investors Are Turning to Silver6
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.గోల్డ్-సిల్వర్ రేషియోఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.బంగారం విలువను కోల్పోదు!ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.సమతుల్యత ఉత్తమం!పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!

Advertisement
Advertisement
Advertisement