Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India GDP pegged to grow at 7. 4percent for FY261
జీడీపీ వృద్ధి 7.4 శాతం 

న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల బలమైన పనితీరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని, ప్రపంచంలో వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన గుర్తింపును కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ జీడీపీ స్థిర ధరల వద్ద 2025–26లో రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని, 2024–25లో ఉన్న రూ.187.97 లక్షల కోట్ల కంటే 7.4 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. 6.3–6.8 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చన్న గత అంచనాల కంటే ఇది ఎక్కువ. ఆర్‌బీఐ అంచనా 7.3 శాతం కంటే అధికం కావడం గమనార్హం. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ సెపె్టంబర్‌ త్రైమాసికంలోనూ బలమైన పనితీరు (8.2 శాతం) నమోదు చేయడం తెలిసిందే. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ ఈ మేరకు తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. జీఎస్‌టీ సంస్కరణలతో 375 ఉత్పత్తులపై ధరలు దిగిరావడం, ఆదాయపన్ను కొత్త విధానంలో మినహాయింపులను గణనీయంగా పెంచడం, కార్మిక సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం, ద్రవ్యోల్బణం దిగిరావడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడాన్ని సానుకూలతలుగా గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) 7.3 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది. తయారీ 7 శాతం తయారీ రంగం 7 శాతం వృద్ధిని సాధిస్తుందని (గత ఏడాది 4.5 శాతం) ప్రభుత్వం అంచనా వేసింది. సేవల రంగంలో వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.2 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతానికి విస్తరిస్తుందని

Luxury Car Makers are exploring the Indian real estate sector2
బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్‌ విల్లా 

ఇప్పటివరకూ భారత్‌లో విలాసవంత కార్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన గ్లోబల్‌ ఆటో దిగ్గజాలు తాజాగా దేశీ రియల్టీ రంగంపై కన్నేశాయి. ప్రధాన ప్రాంతాలలో రియల్టీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దేశీయంగా సరికొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయనున్నాయి. ఇందుకు 2026 కేలండర్‌ ఏడాదిలో తెరతీయనున్నాయి. ముంబై, చెన్నై సహా ప్రధాన నగరాలు, గుర్గావ్, హైదరాబాద్‌ తదితర అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు వివిధ రియల్టీ డెవలపర్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగ్జరీ కార్ల దిగ్గజం లాంబోర్గిని ప్రమోటర్‌ కుటుంబం దేశీ రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుర్గావ్‌లో విలాసవంత బ్రాండెడ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు మెర్సిడిస్‌ బెంజ్‌ రియల్టీ డెవలపర్స్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఎండబ్ల్యూ సైతం దేశీ రియల్టీ గ్రూప్‌లతో చర్చలు నిర్వహిస్తోంది. అయితే బ్రాండెడ్‌ ప్రాజెక్ట్‌ చేపడుతుందా లేక .. రియల్టీలో కార్యకలాపాలు కలిగిన క్రియేటివ్‌ డిజైన్‌ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ డిజైన్‌వర్క్స్‌పై ముందుకెళుతుందా అనే విషయంపై సందిగ్ధత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ముంబై, చెన్నైలలో హైపెర్ఫార్మెన్స్‌ కార్లు, ఎస్‌యూవీలు రూపొందించే లాంబోర్గిని ప్రమోటర్‌ టోనినో ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు లాంబోర్గిని టోనినో ఎస్‌పీఏ ద్వారా చర్చలకు తెరతీశారు. కార్ల దిగ్గజం లాంబోర్గినీ వ్యవస్థాపకుడు ఫెరూసియో లాంబోర్గిని కుమారుడితడు. కాగా.. ఇప్పటికే దుబాయ్, మియామీ(ఫ్లోరిడా)లలో ప్రాజెక్టులు చేపట్టిన గ్లోబల్‌ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ దేశీ ప్రణాళికలు వెల్లడికావలసి ఉంది. ఈ బాటలో ఆటోమొబైల్‌ దిగ్గజాలేకాకుండా దేశీయంగా రియల్టీ రంగ కార్యకలాపాలపట్ల ప్రీమియం వెల్‌నెస్‌ బ్రాండ్లు, ఫ్యాషనబుల్‌ క్లాతింగ్‌ సంస్థలు, యూరోపియన్‌ డిజైన్‌ స్టూడియోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన నగరాలలో బ్రాండెడ్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు రంగాల గ్లోబల్‌ దిగ్గజాలు ఇప్పటికే డెవలపర్స్‌తో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. సరికొత్త బ్రాండ్లతో సరికొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు.. నాణ్యతా ప్రమాణాలకు హామీనిచ్చేందుకు వీలుండటంతో దేశీయంగా రియల్టీ డెవలపర్లు సైతం గ్లోబల్‌ దిగ్గజాలవైపు చూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సంప్రదాయ బ్రాండెడ్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్లయిన యూఎస్, యూఏఈ, థాయ్‌లాండ్, వియత్నాం తదితరాల జాబితాలో భారత్‌ సైతం చేరనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ సరఫరాలు 55 శాతం జంప్‌చేసినట్లు శావిల్స్‌ బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ 2025–26 నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా వియత్నాం, థాయ్‌లాండ్‌తోపాటు.. భారత్‌లో వృద్ధి సహకరించినట్లు తెలియజేసింది. ఈ ప్రభావంతో టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(తాజ్‌ హోటళ్లు) సైతం చెన్నైలో బ్రాండెడ్‌ రెసిడెన్సీవైపు దృష్టి పెట్టడం గమనార్హం! కారణాలున్నాయ్‌.. ప్రస్తుతం లైవ్‌ బ్రాండెడ్‌ రెసిడెన్స్‌ ప్రాజెక్టుల విషయంలో భారత్‌ ప్రపంచంలో ఆరో ర్యాంకును ఆక్రమిస్తోంది. గ్లోబల్‌ సరఫరాల్లో నాలుగో స్థానంలో నిలుస్తోంది. చేపట్టనున్న ప్రపంచ ప్రాజెక్టులలో పదో ర్యాంకును అందుకుంది. దేశీ రియల్టీ రంగంలో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించిన గ్లోబల్‌ బ్రాండ్లలో ఫోర్‌ సీజన్స్, రిట్జ్‌ కార్ల్‌టన్, మారియట్, అర్మాణీ కాసా, వెర్సేస్‌ హోమ్, ట్రంప్‌ ఫ్యామిలీ, హయత్, పుల్‌మ్యాన్, ఐటీసీ, హిల్టన్‌ తదితరాలున్నాయి. ఈ బాటలో తాజాగా లగ్జరీ బ్రాండ్ల ఆటో దిగ్గజాలు క్యూ కట్టడం గమనించదగ్గ అంశం!ఆకర్షణీయ మార్కెట్‌గా ఒకప్పుడు దిగ్గజాల లక్ష్యంగా నిలిచిన దుబాయ్, మియామీ, లండన్‌ బాటలో ఇప్పుడు భారత్‌ భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రాండెడ్‌ రెసిడెన్స్‌లకు దేశీయంగా అత్యంత సంపన్నవర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. నోయిసిస్‌ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ విశ్లేషణ ప్రకారం టైర్‌–1 మార్కెట్లు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల బాటలో టైర్‌–2 పట్టణాలు సైతం దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, గోవా, సూరత్‌ తదితరాలున్నాయి. గత మూడేళ్లుగా లగ్జరీ ప్రాజెక్టులు జోరందుకోవడం ఇందుకు తోడ్పాటునిస్తోంది!– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Union Budget 2026 Date Set For Sunday3
అఫీషియల్‌: ఆదివారమే కేంద్ర బడ్జెట్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్‌ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్‌ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇది రెండోసారి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

Flying private jets is no longer just for the ultra rich in India4
విమానం మొత్తాన్ని బుక్ చేసుకుని..

ప్రత్యేక విమానం.. వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు, క్రీడాకారుల ప్రయాణ సంబంధ వార్తల్లో తరచూ వినే పదం. ప్రైవేట్‌ జెట్స్‌లో ప్రయాణం వీరికే పరిమితం కాలేదు. వ్యాపారులు, అధిక ఆదాయ వర్గాల సౌలభ్యం కోసం క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టుగా చార్టర్డ్‌ విమానాల్లో (Charter flights) భారతీయ నగరాలతోపాటు విదేశాలూ విహరిస్తున్నారు. తమ వాళ్లను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ఎల్లప్పుడూ గుర్తుండేలా చేస్తున్న సంపన్నుల సంఖ్యా పెరుగుతోంది. ఇక చార్జీలంటారా.. ‘ప్రత్యేకం’ కదా. ఆ మాత్రం ఉంటుంది మరి. ఇండిగో (Indigo), ఎయిర్‌ ఇండియా వంటి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ ఫ్లైట్స్‌ నిర్దేశించిన సమయం, రూట్లలో సేవలు అందిస్తాయి. మనతోపాటు ఇతర ప్రయాణికులూ విమానంలో ఉంటారు. విమానాలు రద్దు, ఆలస్యం అవుతున్న సందర్భాలూ కోకొల్లలు. నాన్‌ షెడ్యూల్డ్ సర్వీసులు ఇందుకు భిన్నం. విమానం మొత్తాన్ని బుక్‌ చేసుకున్న కస్టమర్‌ తనకు అనుకూల సమయానికి బయల్దేరవచ్చు. పెద్ద కంపెనీల బిజినెస్‌ మీటింగ్స్, పెళ్లిళ్ల సీజన్‌లో వీటికి డిమాండ్‌ ఎక్కువ. విమానం అందుబాటులో ఉండి, వాతావరణం అనుకూలించి, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అనుమతి ఉంటే చాలు.. జస్ట్‌ 4 గంటల్లో చార్టర్‌ టేకాఫ్‌ అవుతుందని ప్రైవేట్‌ విమానయాన రంగంలో ప్రముఖ అగ్రిగేటర్‌ ‘జెట్‌ సెట్‌ గో’ చెబుతోంది. రెండు దశాబ్దాల్లో.. నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్ పర్మిట్‌ హోల్డర్స్‌ 2025 సెప్టెంబ‌ర్‌ నాటికి భారత్‌లో 133 మంది ఉన్నారు. వీరి వద్ద 455 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ (విమానాలు+హెలికాప్టర్లు) ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం 156 ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో 44 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. 20 ఏళ్లలో ఆపరేటర్లు మూడురెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ దాదాపు మూడింతలకు చేరుకున్నాయంటే.. ప్రైవేట్‌ జెట్స్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. 412 విమానాలు, హెలికాప్టర్లతో 2012లో అత్యధికంగా 147 మంది ఆపరేటర్లు ఉండేవారు.హైదరాబాద్‌ (Hyderabad) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 7 కంపెనీల వద్ద 11 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఉన్నాయి. నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్‌ పర్మిట్‌ హోల్డర్స్‌ వద్ద ఉన్న విమానాల్లో గరిష్టంగా 37 మంది ప్రయాణించవచ్చు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ ఎయిర్‌లైన్స్‌ సైతం చార్టర్డ్ సర్వీసులను అందిస్తున్నాయి. షెడ్యూల్డ్, నాన్‌–షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు గత ఆర్థిక సంవత్సరంలో 50,563 ప్రత్యేక సర్వీసులతో మొత్తం 8,76,646 మందిని దేశ, విదేశాల్లోని గమ్యస్థానాలకు చేర్చాయి. చార్టర్స్‌ రకాలుప్రైవేట్‌ చార్టర్‌: ఒక సమూహం లేదా వ్యక్తి కోసం మొత్తం విమానాన్నిఅద్దెకు తీసుకోవడం. పబ్లిక్‌ చార్టర్‌: ట్రావెల్‌ కంపెనీలు చార్టర్స్‌లో వ్యక్తిగత సీట్లను విక్రయిస్తాయి. నిర్దిష్ట టూర్‌ ప్యాకేజీలతో పర్యాటక గమ్యస్థానాలకు ఈ సర్వీసులు నడుపుతాయి. కార్గో చార్టర్‌: సరుకు రవాణా కోసం ప్రత్యేక ప్రైవేట్‌ విమానాలు.తేడా ఏమిటంటే.. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ ఫ్లైట్‌: కేటాయించిన సమయంలో నిర్దేశిత విమానాశ్రయాలకు ప్రయాణిస్తాయి. ప్రామాణిక సౌకర్యాలు ఉంటాయి.ఎవరైనా సీటు బుక్‌ చేసుకోవచ్చు. నాన్‌ షెడ్యూల్డ్‌ ఫ్లైట్‌: సౌకర్యవంతమైన సమయం, అనుకూలమైన సేవలు ఉంటాయి. పూర్తిగా ప్రైవేట్‌. వరంగల్‌ వంటి చిన్న విమానాశ్రయాలకూ వెళ్లవచ్చు. - నూగూరి మ‌హేంద‌ర్‌

Rashmika Mandanna Becomes Kodagu No 1 Taxpayer Know The Details Here5
అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ఈమె కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా.. రష్మిక మందన్న సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలలో రూ.4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.కొడగు జిల్లాలోని విరాజ్‌పేటకు చెందిన రష్మిక.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈమె తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు.విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లిహీరో విజయ్‌ దేవరకొండ, హీరో­యిన్‌ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ.. వారు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26న విజయ్‌ - రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్‌ జరుగుతుంది. ఘనంగా పెళ్లి జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్‌. అయితే, ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్‌-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?

Latest Gold and Silver Price in India Today6
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..

బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?

Advertisement
Advertisement
Advertisement