ప్రధాన వార్తలు
చిన్న బ్యాంకులు... పెద్ద అడుగులు
న్యూఢిల్లీ: పేరుకు చిన్నవే అయినా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) వేగంగా వృద్ధి చెందుతున్నాయి. గత అయిదేళ్లలో నియామకాలు, డిపాజిట్లు, రుణాల కార్యకలాపాల్లో ముందుకెళ్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎఫ్బీల్లో 95,249గా ఉన్న సిబ్బంది సంఖ్య వార్షికంగా 13.3 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరంలో 1.8 లక్షలకు పెరిగింది. ఇదే వ్యవధిలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.3 శాతం వార్షిక వృద్ధితో 18.1 లక్షలకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఎస్ఎఫ్బీల్లో నియామకాల జోరు కొనసాగింది.11 ఎస్ఎఫ్బీలకు గాను ఎనిమిది లిస్టెడ్ బ్యాంకులు ప్రథమార్ధంలో దాదాపు 9,000 మందిని తీసుకున్నాయి. 2020–25 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) సిబ్బంది సంఖ్య 0.8 శాతం తగ్గగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.6 శాతం పెరిగింది. మరోవైపు, 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎస్ఎఫ్బీల రుణాలు రూ. 94,441 కోట్ల నుంచి 24.2 శాతం పెరిగి రూ. 2,78,564 కోట్లకు ఎగిశాయి. అటు బ్యాంక్ డిపాజిట్లు కూడా రూ. 62,667 కోట్ల నుంచి 33.5 శాతం పెరిగి రూ. 2,65,586 కోట్లకు చేరాయి. చిన్న సంస్థలకు పీఎస్బీ రుణాల దన్ను మరోవైపు, పీఎస్బీల దన్నుతో 2025 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా కొత్త రుణాలు లభించినట్లు క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం, ఎంఎస్ఎంఈలకు అదనంగా ఇచ్చిన రుణాలు గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 17.7 శాతంతో పోలిస్తే 32.5 శాతానికి పెరిగినట్లు వివరించింది. మొత్తం రుణాల్లో ఎంఎస్ఎంఈల వాటా 1.72 శాతం మేర పెరిగింది. సురక్షితమైన సెక్యూర్డ్ క్రెడిట్ వైపు మొగ్గు చూపుతూ పీఎస్బీలు గణనీయంగా రుణాలివ్వడం ఇందుకు తోడ్పడింది. అలాగే ఎంఎస్ఎంఈల నిర్వచనంలో మార్పులు కూడా అధిక రుణ వితరణకు కారణంగా నిల్చినట్లు నివేదిక పేర్కొంది. అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాల్లో అసెట్ నాణ్యత కాస్త క్షీణించినప్పటికీ మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల పోర్ట్ఫోలియో పరిస్థితి సంతృప్తికరంగానే ఉన్నట్లు వివరించింది. యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి..ఎస్ఎఫ్బీలు భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తూ, యూనివర్సల్ లైసెన్సుపై దృష్టి పెట్టాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సు రావడానికి ముందుగానే సర్వసన్నద్ధంగా ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలోను శాఖలను చురుగ్గా విస్తరిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇలాంటి మార్కెట్లలో టెక్నాలజీ వినియోగం పరిమితంగా ఉంటుంది కాబట్టి సిబ్బంది సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా హైరింగ్ని కూడా పెంచుకుంటున్నాయి. ఇటీవలే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి యూనివర్సల్ బ్యాంక్గా లైసెన్సు వచి్చంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గతేడాది లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకూ లైసెన్సుపై ఆసక్తిగా ఉంది.
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో
జైసల్మేర్: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో ఈవీని (ఎలక్ట్రికల్) ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐసీఈ వెర్షన్ని 2024 ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వెర్షన్ 285 కి.మీ. రేంజినిస్తుంది. మరోవైపు, సెవెన్ సీటర్ ఎక్స్యూవీ 7ఎక్స్వోని కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు (ఎక్స్షోరూం) ఉంటుంది.ఇది ఎక్స్యూవీ 700కి కొత్త వెర్షన్. ఎక్స్యూవీ 700 అమ్మకాలు ప్రతి నెలా సుమారు 7,000 యూనిట్లుగా ఉండగా, 7ఎక్స్వో రాకతో విక్రయాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కొత్త ఉత్పత్తులు, వేరియంట్లతో ఈ ఏడాది అమ్మకాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది బొలెరో, బొలెరో నియో కొత్త వెర్షన్లను ప్రవేశపెట్టగా, ఈసారి ఎక్స్యూవీ 7ఎక్స్వో, ఎలక్ట్రిక్ ఎక్స్ఈవీ 9ఎస్ దన్నుతో విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం కార్లతో పాటు చిన్న కమర్షియల్ వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపినట్లు రాజేశ్ తెలిపారు. పరిశీలనలో రేట్ల పెంపు కమోడిటీల రేట్లు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం తదితర పరిణామాల నేపథ్యంలో వాహనాల రేట్ల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే కొద్ది వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే హుందాయ్, బీవైడీ, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్స్ మొదలైనవి జనవరి నుంచి రేట్ల పెంపు ప్రకటించాయి. అటు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తదితర దిగ్గజాలు కూడా రేట్ల పెంపును పరిశీలిస్తున్నాయి.
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్ను సెంటిమెంట్గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్టాప్లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
పెరిగిన ఆధార్ కార్డు ఛార్జీలు
ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్లెస్ ఆధార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.ధర పెరుగుదలకు కారణంపీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar యాప్ ఉపయోగించాలి.➤యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.You can easily check the delivery status online.To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026
అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026
20 నిమిషాల్లో కోటీశ్వరుడైన ట్రేడర్!
బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
కార్పొరేట్
అంధ మహిళా క్రికెట్ జట్టుకు రూ. 5కోట్ల చెక్
విల్సన్కు 'టాటా'.. ఎయిరిండియా సీఈఓ కోసం కసరత్తు!
అమెరికా అలా చేసిందంటే మనకు దెబ్బే..
భలే మంచి బాస్! కార్పొరేట్ ఆఫీస్లో వైరల్ వీడియో
కంటి జబ్బులకు వినూత్న చికిత్స
బ్యాంకులకు ఎల్డీఆర్ టెన్షన్!
పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు
లోకల్ కంపెనీల గ్లోబల్ జంప్
ఎయిర్ ఇండియా సీఈవోను తప్పిస్తున్నారా?
కోటి ఆశలతో కొత్త ఏడాది
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పస...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స...
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు దూసుకెళ్తున్నాయ...
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ద...
జపాన్ను దాటిన భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస...
బ్యాంక్లకు ఆర్థిక శాఖ ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు...
పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమ...
బ్యాంకింగ్ వ్యవస్థకు ఎన్బీఎఫ్సీల నుంచి సవాళ్లు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రం...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో ‘కొత్త’ ప్లాన్లు.. ఇక ఏడాదంతా సిమ్ యాక్టివ్
ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికమ్ కంపెనీ రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు చవక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి నెలా నంబర్ ను రీఛార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏడాది పొడవునా సిమ్ను యాక్టివ్గా ఉంచుకునే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..రూ.3,599 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.రూ .1,748 ప్లాన్కాలింగ్ ఒక్కటే ఉంటే చాలు మొబైల్ డేటా అవసరం లేదు అనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో వ్యాలిడిటీ 336 రోజులు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ ఓన్లీ ప్యాక్ కాబట్టీ ఎలాంటి డేటా రాదు. 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియోఏఐ క్లౌడ్, జియో టీవీలకు యాక్సెస్ పొందుతారు.
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్లు Wi-Fi కనెక్షన్ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్వర్క్ల మధ్య సజావుగా హ్యాండ్ఓవర్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్
ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా..
రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్ప్రెస్లో భోపాల్కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.LORE UPDATE: I forgot my IPAD on a train to bhopal (Dakshin Express, 28.12.25)Realised an hour later,between all the chaos (and lots of crying 😭) we called #139 and registered a report on #RailMadad app. Amazingly, within minutes we got a call from the helpline, a quick…— Diya (@diyaatwt) December 30, 2025
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం
ముందుగా టాక్స్ కాలమ్ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్మెంట్ ఇయర్ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్ డిడక్షన్ను, వృత్తి పన్ను డిడక్షన్ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్ VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్ శ్లాబ్ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.ఇప్పుడు రాబోయే మార్పులు: 🔸 చట్టం సులభరీతిలో ఉంది. 🔸 నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 🔸 ఇక నుంచి అకౌంటింగ్ ఇయర్, అస్సెస్మెంట్ సంవత్సరం అని ఉండదు. 🔸 ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్ ఇన్కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 🔸 మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్ పడదు. 🔸 దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్షిప్.. టైటిల్ డీడ్స్లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 🔸 రిబేటు రూపంలో బేసిక్ లిమిట్ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్ లిమిట్... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే. 🔸 అలాగే పాత పద్ధతిలో కూడా...చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి.
70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..ఏమిటీ 70/10/10/10 ఫార్ములామీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.
పోస్టాఫీసు పథకాలు.. కొత్త వడ్డీ రేట్లు
దేశంలో పోస్టాఫీసులు అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. పోస్టాఫీసు స్కీముల్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, స్థిరమైన, కచ్చితమైన రాబడిని పొందుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఇండియా పోస్ట్ దేశంలోనే అత్యధిక స్థాయిలో చిన్న పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి వర్గానికి పథకాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పోస్టాఫీసు స్కీములు ఉన్నాయి. 2026 సంవత్సరానికి గానూ అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్టాఫీస్ పొదుపు పథకాలు.. వాటికి లభించే వడ్డీ రాబడి గురించి తెలుసుకుందాం..సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అన్ని అగ్రశ్రేణి బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఈ పథకంపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును ఈ పథకం అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా అనేది బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం. బాలికల చదువు, భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బాలిక దగ్గర నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు అమ్మాయి పేరు మీద ఎస్ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంమహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళలు, బాలికలు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పొదుపు కార్యక్రమం. పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో లభ్యమయ్యే ఈ పథకం స్థిర వడ్డీ ఆదాయంతోపాటు మూలధన సంరక్షణను అందిస్తుంది. రెండేళ్ల గరిష్ట కాల పరిమితితో ఉండే ఈ పథకాన్ని ప్రభుత్వం 2025 మార్చి 31తో నిలిపేసింది. అంతకుముందు ఖాతా తెరిచినవారికి ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది దేశంలో మంచి ఆదరణ పొందిన, స్థిర-ఆదాయ పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద కచ్చితమైన రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై వడ్డీ రేటును 7.7 శాతంగా ఉంచింది.పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (POMIS) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన, ఆమోదించబడిన పెట్టుబడి పథకం. 7.4% వడ్డీ రేటుతో, ఇది అత్యధిక రాబడినిచ్చే పథకాలలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ ఆదాయం నెలవారీగా చేతికొస్తుంది.
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్
ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్లైన్లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


