ప్రధాన వార్తలు
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు.
కారులో ఈ 10 వస్తువులుంటే.. మీరు సేఫ్!
కారు ఉపయోగించే చాలామంది.. లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే, అనవసరమైన వస్తువులనే ఎక్కువ ఉంచుకుంటున్నారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ముఖ్యమైన 10 వస్తువులు ఏవి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జంపర్ కేబుల్స్: వాతావరణంలో జరిగే మార్పులు లేదా ఇతర పొరపాట్ల కారణంగా లైట్లు ఆఫ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ డెడ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో జంపర్ కేబుల్స్ ఉంటే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు.జాక్ & స్పేర్ టైర్: అనుకోని సందర్భాల్లో టైర్ పంక్చర్ అయితే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ టైర్ & జాక్ వంటి వాటిని కారులోనే ఉంచుకోవడం వల్ల.. టైర్ పంక్చర్ సమయంలో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు.ఫస్ట్ ఎయిడ్ కిట్: కేవలం కారులో మాత్రమే కాకుండా.. ప్రతి వాహనంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ వైప్స్, ట్వీజర్స్, పెయిన్ రిలీవర్స్ వంటి అవసరమైన వస్తువులు ఉండాలి.టైర్ ప్రెజర్ గేజ్: టైర్లు బయటికి సరిగానే కనిపించినా, లోపల గాలి ఒత్తిడి సరైన స్థాయిలో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.అదనపు బ్యాటరీలతో ఫ్లాష్లైట్: కారులో తప్పకుండా ఫ్లాష్లైట్ ఉండాలి. దీనికి అదనపు బ్యాటరీలు కూడా చాలా అవసరం. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఫ్లాష్లైట్ ఉపయోగపడుతుంది. కారు బానెట్ క్రింద పరిశీలించాల్సినప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.ఎమర్జెన్సీ బ్లాంకెట్: చలికాలంలో లేదా వాహనం ఆగిపోయినప్పుడు ఒక బ్లాంకెట్ తప్పకుండా అవసరం అవుతుంది. ఇది అత్యవసర సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది.మల్టీటూల్ (స్విస్ ఆర్మీ నైఫ్): చిన్న చిన్న పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్నదే అయినా.. చాలా సందర్భాల్లో పనికొస్తుంది. దీనిని మీరు గ్లోవ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు.వాటర్ బాటిల్: వాటర్ బాటిల్ కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే కాదు. అనుకోని సందర్భాల్లో గాయాలైనప్పుడు, వాటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూడా నీళ్లు అవసరమవుతాయి. సీల్ చేసిన బాటిల్స్ ఉంచుకోవడం మంచిది.ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్: ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఉండడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ ఆఫ్ కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు జీపీఎస్ న్యావిగేషన్ లేదా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ చాలా అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ కాకుండా ఉంచడానికి ఫోన్ ఛార్జర్ & పవర్ బ్యాంక్ తప్పనిసరిగా మీతో ఉంచుకోవాలి.వెహికల్ రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్: కారుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా కారులో ఉంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులు మీ కారును చెక్ చేసే సమయంలో వెంటనే చూపించడానికి ఇవి పనికొస్తాయి.
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?
ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందా.. అని ఎదురు చూసేవారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగానే నిర్ణయించారు. అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదన్నమాట.ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. సీబీటీ నిర్ణయం తర్వాత.. 2025-26 సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఏడు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.
హైదరాబాద్లో మరో గోల్డ్ పాయింట్ సెంటర్
బంగారం, వెండి వ్యాపార రంగంలో ఒకటైన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ అనుబంధ సంస్థ.. ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో తన కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 95వ శాఖ కాగా, హైదరాబాద్లో 6వది, తెలంగాణలో 9వ కేంద్రం ద్వారా సేవలు అందిస్తోంది.ఈ కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రం ద్వారా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు పారదర్శక, శాస్త్రీయ, బాధ్యతాయుత బంగారం రీసైక్లింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు తమ పాత, ఉపయోగించిన బంగారు ఆభరణాలను సురక్షితంగా విక్రయించవచ్చు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను కస్టమర్లు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పారదర్శక విధానాన్ని సంస్థ అమలు చేస్తోంది. రూ.10,000 వరకు విలువైన బంగారానికి తక్షణ నగదు చెల్లింపు లభిస్తుంది. అంతకుమించిన మొత్తాలు IMPS, NEFT లేదా RTGS ద్వారా సురక్షితంగా నగదు బదిలీ చేస్తారు.
కార్పొరేట్
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
ట్రావెల్కి హోలీ జోష్
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
ఐపీఓ రివర్స్ గేర్!
పశ్చిమాసియా పైనే మార్కెట్ ఫోకస్
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్ట...
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ ...
అదానీ గ్రీన్ ఎనర్జీకి నార్జెస్ బ్యాంక్ గుడ్బై!
తమ పోర్ట్ఫోలియో నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల...
దారుణంగా పెరిగిన బంగారం ధరలు.. వార్ ఎఫెక్ట్!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి....
రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన బ్యాంక...
కొత్త జీడీపీ సిరీస్లో జీఎస్టీ, ఈ-వాహన్ డేటా
2022-23 బేస్ ఇయర్గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశ...
అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?
అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత...
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఫోన్ ఛార్జర్కి ఇంత కథ ఉందా!
కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ముఖ్యంగా ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?ప్రారంభ కాలంలో ఫోన్ ఛార్జ్ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్సంగ్ ఫోన్ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్కు వాడే ఛార్జర్ మరొక ఫోన్కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.ఆ తర్వాత యూఎస్బి (యూనివర్సల్ సీరియల్ బస్) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్కు వైర్లెస్గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్లెస్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్లో 100 శాతం ఛార్జింగ్ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు.
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026
ఐక్యూ15ఆర్ స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్తగా 15ఆర్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మొదలైన వాటిల్లో సేల్ మొదలవుతుంది.ఇందులో 6.59 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 జెన్ 5, 7600 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ2, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్లో ఉద్యోగాలు
జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్ టైమ్లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్నెస్కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026
పర్సనల్ ఫైనాన్స్
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్... జాగ్రత్తలు
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్మిట్ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్మెంట్ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్ పేరు, అడ్రస్, పాన్.. మీకు ఓనర్కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్ ఆదాయాన్ని ట్రాక్ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్ చేత రిటర్ను వేయించండి.
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.
జియో ఫైనాన్షియల్ యాప్లో వినూత్న ఫీచర్లు
ముంబై: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్ను మార్కెట్ప్లేస్ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్ స్కోర్ మొదలైనవి కూడా ఇవ్వనుంది.ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్లో జోడిస్తున్నట్లు జేఎఫ్ఎస్ ఎండీ హితేష్ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్ సిఫార్సు చేస్తుంది.దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.


