Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 07 April 2026 in Telugu states1
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోతులం బంగారం22 క్యారెట్స్--రూ.1,37,350--రూ.750 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,49,840--రూ.820 తగ్గింపుచెన్నైలో22 క్యారెట్స్--రూ.1,38,600--రూ.1300 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,51,200--రూ.1420 తగ్గింపుఢిల్లీలో22 క్యారెట్స్--రూ.1,37,500--రూ.750 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,49,990--రూ.820 తగ్గింపుముంబై, బెంగళూరులో22 క్యారెట్స్--రూ.1,37,350--రూ.750 తగ్గింపు24 క్యారెట్స్--రూ.1,49,840--రూ.820 తగ్గింపుహైదరాబాద్‌లో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,55,000. రూ.5,000 తగ్గింపుఢిల్లీలో ఈరోజు వెండి ధరకేజీ వెండి రూ.2,50,000. ఎలాంటి మార్పు లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 07 April 20262
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.11బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 111 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.44 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 07-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Air India CEO Campbell Wilson Resigns Before Term End3
ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా

టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిర్ ఇండియా కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో కీలక పాత్ర పోషించిన విల్సన్ తన పదవీకాలం ముగియక ముందే తప్పుకోవడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల క్రితం ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ సంస్థలో భారీ మార్పులు వస్తాయని ఆశించింది. అయితే, ఊహించిన దానికంటే పరివర్తన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. కొత్త సీఈఓను నియమించే వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఆయన తన నోటీసు పీరియడ్‌లో ఉన్నారు. తన నిష్క్రమణకుగల కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది జూన్‌లో జరిగిన ఏఐ 171 అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వెలువడిన అనంతరం ఆయన పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగోలో కూడా ఇటీవల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన రాజీనామాను ప్రకటించగా సంస్థ ఇప్పటికే కంపెనీ చీఫ్‌ను ప్రకటించింది. ఆయన ఆగస్టు నాటికి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఎయిర్ ఇండియా విషయంలో టాటా గ్రూప్ కొన్ని నెలల క్రితమే కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు సరైన అభ్యర్థి దొరకలేదు. ఇండిగో తన కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకోగా, ఎయిర్ ఇండియా చీఫ్‌ కోసం కొందరి పేర్లను పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే తీవ్ర పరిణామాలు

Trump Slams Journalists Over Leaks on Daring Iran Rescue Mission of US Pilots4
రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే అంతే..

ఇరాన్‌లో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వైమానిక దళ పైలట్లను రక్షించేందుకు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన సైనిక చర్యకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేసిన జర్నలిస్టులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా సమాచారాన్ని లీక్ చేసిన వారిని కనుగొని, వారికి సహకరించిన జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ రెస్క్యూ మిషన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను అమెరికా సైనిక చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. అయితే, ఇదే సమయంలో మీడియా తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.జర్నలిస్టులకు జైలు శిక్ష!నిర్దిష్ట మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించనప్పటికీ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే వివరాలను ప్రచురించిన పత్రికలపై ట్రంప్ మండిపడ్డారు. ‘మొదటి పైలట్‌ను మాత్రమే రక్షించారనే సమాచారాన్ని ముందే బయటపెట్టడం ద్వారా ఇరానియన్లకు మనం క్లూ ఇచ్చినట్లయింది. ఇది రెండో పైలట్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘మేము ఆ సమాచారాన్ని లీక్‌ చేసిన వాళ్లని పట్టుకుంటాం. అదొక వికృత మనస్తత్వం. సదరు వార్తను ప్రచురించిన జర్నలిస్టు తన సోర్స్‌ వెల్లడించకపోతే వారు కూడా జైలుకు వెళ్లాల్సిందే. ఈ మిషన్‌ను వారు ఎంతటి ప్రమాదంలోకి నెట్టారో ప్రపంచం అర్థం చేసుకోవాలి’ అని ట్రంప్ స్పష్టం చేశారు.176 యుద్ధ విమానాలువారాంతంలో జరిగిన ఈ దాడి వివరాలను ట్రంప్ వివరించారు. ఈ రెస్క్యూ మిషన్ ఎంత భారీ స్థాయిలో జరిగిందో ఆయన వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మొదటి పైలట్ రక్షణకు 21 యుద్ధ విమానాలు, రెండో పైలట్ రక్షణకు 155 యుద్ధ విమానాలు ఉపయోగించినట్లు చెప్పారు. ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించేందుకు డెకాయ్(మోసపూరిత) ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా విమానాలు ఏడు వేర్వేరు ప్రాంతాలపై చక్కర్లు కొట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఎంతమంది సైనికులు పాల్గొన్నారని జాయింట్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కెయిన్‌ను ట్రంప్ ప్రశ్నించగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన మౌనం వహించారు. అయితే ట్రంప్ స్పందిస్తూ ఆ సంఖ్య వందల్లో ఉంటుందని చెప్పారు.ఇరాన్ ప్రయోగించిన ‘హ్యాండ్-హెల్డ్ షోల్డర్ క్షిపణి’ ద్వారా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌-15ఈ స్ట్రైక్ ఈగిల్’ కూలిపోయింది. ఆ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ఇరాన్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 48 గంటల పాటు శత్రువుల కంట పడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. శత్రు దళాలు గంటగంటకూ అతనికి దగ్గరవుతున్న తరుణంలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్ ద్వారా అతడిని సురక్షితంగా కాపాడినట్లు ట్రంప్‌ చెప్పారు.విమానాల పేల్చివేతరెస్క్యూ సమయంలో ఇసుకలో చిక్కుకుపోయిన అమెరికా సైనిక విమానాలను శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు సైన్యం వాటిని పేల్చివేసింది. ‘మా దగ్గర ఉన్న అత్యుత్తమ సాంకేతికతను ఇరానియన్లు కాపీ కొట్టే అవకాశం ఇవ్వదలచుకోలేదు. అందుకే వాటిని ముక్కలుగా పేల్చేశాం’ అని ట్రంప్ వివరించారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

AI Disruption Reshapes Hiring Trends TeamLease Digital CEO Neeti Sharma5
ఏఐతో హైరింగ్‌ ధోరణుల్లో మార్పులు

కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.అంతేగాకుండా కోవిడ్‌ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్‌ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్‌ సైట్‌ లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్‌ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి. ఉత్పాదకత 30 శాతం వరకు అప్‌..ఏఐతో కోడింగ్, సపోర్ట్‌లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్‌ సపోర్ట్‌లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్‌ల రైటింగ్‌లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని, తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్‌లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు. బడా టెక్‌ కంపెనీలు సైతం బ్యాలెన్స్‌ షీట్స్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు. నిపుణులకే డిమాండ్‌..ఏఐ వల్ల రొటీన్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్‌ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్‌ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్‌ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

Indian IT services are facing a subdued fourth quarter for fiscal 20266
క్యూ4లో ఐటీ డీలా!

ముంబై: భారతీయ ఐటీ సేవల రంగం 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని నిస్తేజంగా ముగించే అవకాశముందని బ్రోకరేజ్‌ సంస్థల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో (క్యూ4) త్రైమాసికవారీ(సీక్వెన్షియల్‌) వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. అయితే రూపాయి బలహీనత అనుకూలతకావడంతో వార్షిక ప్రాతిపదికన కొంత మెరుగుదల కనిపించవచ్చని పేర్కొంటున్నారు. డిమాండ్‌ స్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, జనరేటివ్‌ ఏఐ వల్ల ధరలు నిర్ణయించే విధానంలో మార్పులు, ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనిశ్చితి పెరుగుతోందని వివరించారు. మార్చి త్రైమాసిక ఫలితాల కంటే, ఆర్థిక సంవత్సరం 2026–27 అంచనాలు(గైడెన్స్‌)పైనే మార్కెట్‌ దృష్టి కేంద్రీకృతమైనట్లు తెలియజేశారు. ప్రధానంగా వృద్ధి అవకాశాలపై స్పష్టత, ఆదాయంపై ఏఐ ప్రభావాలు, మార్జిన్ల నిలకడకు ప్రాధాన్యమున్నట్లు అభిప్రాయపడ్డారు.వృద్ధి మందగమనం, ఏడాది చివర్లో రికవరీత్రైమాసిక ప్రాతిపదికన (సీక్వెన్షియల్‌గా) చూస్తే, ఎఫ్‌వై 26 నాలుగో త్రైమాసికం (క్యూ4) పనితీరు నిరుత్సాహకరంగానే ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు భావిస్తున్నాయి. టైర్‌–1 ఐటీ కంపెనీల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ‘‘స్థిర మారకపు విలువల ఆధారంగా టైర్‌–1 కంపెనీల వృద్ధి –1.1 శాతం నుంచి 0.9 శాతం మధ్య ఉండవచ్చు. మధ్యస్థాయి (మిడ్‌–టైర్‌) కంపెనీల వృద్ధి –1.8 శాతం నుంచి 3.4 శాతం వరకు ఉండొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా క్యూ4ను ‘సాధారణ త్రైమాసికం’గానే అభివర్ణించింది. పెద్ద కంపెనీల (లార్జ్‌ క్యాప్‌) వృద్ధి –1.0 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండవచ్చని, మిడ్‌–క్యాప్‌ కంపెనీలు మాత్రం మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తాయని పేర్కొంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో (క్యూ4) సెలవులు లేదా తాత్కాలిక విరామాలు లేకపోవడం కొంత మద్దతు ఇచి్చంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ రంగాలకు ఇది ఉపయోగపడింది. అయితే తక్కువ పని దినాలు, ఐచ్చిక ఖర్చులపై (డి్రస్కిషనరీ స్పెండింగ్‌) కొనసాగుతున్న అప్రమత్తత వైఖరి కారణంగా ఈ ప్రభావం కొంత మేర తగ్గింది. ఇక నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రధానంగా డీల్‌ల విస్తరణ, విలీనాలు/కొనుగోళ్లు వల్లనేనని, డిమాండ్‌ పెరుగుదల వల్ల కాదని బ్రోకరేజ్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మార్జిన్లకు కరెన్సీ ఆసరాదేశీయ ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికంలో (క్యూ4) మార్జిన్లు స్థిరంగా ఉండే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. రూపాయి బలహీనత కారణంగా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, కోటక్‌ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ ప్రభావంతో 35 నుంచి 320 బేసిస్‌ పాయింట్ల వరకు మార్జిన్‌ విస్తరణ సాధ్యమని భావిస్తున్నాయి. అయితే ఇది స్థిరమైన వృద్ధి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, కొత్త డీల్‌ల ప్రారంభ ఖర్చులు, ఉత్పాదకత ఆధారిత ధరల విధానం మార్జిన్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద, స్వలకాలంలో రూపాయి బలహీనత మార్జిన్లకు కొంత ఊరటనిచి్చనా, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విలీనాలు–కొనుగోళ్లు, నియామకాల ప్రభావంప్రధాన ఐటీ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో భారీగా విలీనాలు, కొనుగోళ్లు (ఎం–ఏ) చేపట్టాయి. టీసీఎస్‌ కూడా దశాబ్దం తర్వాత ఈ దిశగా అడుగుపెట్టింది. కృత్రిమ మేధ, డేటా, సెమీకండక్టర్ల వంటి అనుబంధ సామర్థ్యాల కోసం ఈ కొనుగోళ్లు జరిగాయి. అయితే జనరేటివ్‌ ఏఐ ప్రభావంతో ఈ సామర్థ్యాలపై కూడా డిఫ్లేషన్‌ ఒత్తిడి ఉండొచ్చని కోటక్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనాలు, కొనుగోళ్లు ఆదాయ వృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయన్నది కీలకం. ఇదే సమయంలో కంపెనీల్లో నియామకాలు మందగించే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్‌ మహీంద్రా సంస్థలు ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాయి. తాజా నియామకాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.ఏఐ ప్రభావంతో వాల్యుయేషన్లకు కొత్త సవాలుకృత్రిమ మేధ కారణంగా ఏర్పడే ‘ధరల తగ్గుదల’ (డిఫ్లేషన్‌) అనేది మధ్యకాల ఆందోళన నుంచి ఇప్పుడు ఐటీ రంగం వాల్యుయేషన్లు, భవిష్యత్‌ అంచనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ‘‘ఈ డిఫ్లేషన్‌ భయాలతో ఐటీ షేర్లలో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. ఐటీ సేవల ఫీజు ఇప్పుడు ‘ఏజెంట్‌–ఆగ్మెంటెడ్‌’ (ఏఐ సహాయంతో నిర్ణయించబడే విధంగా) మారుతుండగా, ఒప్పందాల పునరుద్ధరణలు తగ్గింపు ధరలతో జరుగుతున్నాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ‘‘ఏఐ ప్రభావం తక్షణ ఫలితాలకంటే భవిష్యత్‌ మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల ప్రధాన ప్రశ్న ఏఐ ప్రభావం ఉంటుందా కాదా అనేది కాదు; కంపెనీలు కొత్త ఏఐ ఒప్పందాల ద్వారా ఈ డిఫ్లేషన్‌ ప్రభావాన్ని ఎంత త్వరగా తగ్గించగలవన్నదే కీలకం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది.యుద్ధం ఎఫెక్ట్‌...ఆర్థిక సంవత్సరం 2026 తొలి మూడు త్రైమాసికాల్లో టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్‌ వంటి దిగ్గజాలు బలమైన ఆర్డర్‌బుక్స్‌తో ఆర్థిక సంవత్సరం 2027 వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.., పల్చిమాసియా యుద్ధం తీవ్రతరమవడంతో పరిస్థితి మారింది. భారత ఐటీ కంపెనీలకు కీలకమైన క్లయింట్‌ సెగ్మెంట్లపై యుద్ధ ప్రభావం పడే అవకాశముంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్ణయాలలో జాప్యం, ఏఐ డిఫ్లేషన్‌ ప్రభావంపై మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలు ముఖ్యమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఖర్చు తగ్గింపునకు దారి తీసే అవకాశాలు తక్కువేనని కోటక్‌ అభిప్రాయపడింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2027 డిమాండ్‌పై స్పష్టత ఇంకా అనిల్చితంగానే ఉంది.

Advertisement
Advertisement
Advertisement