ప్రధాన వార్తలు
బంగారం ధరలు రివర్స్.. వెండి భారీ క్రాష్
దేశంలో బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. పసిడి ధరలు చెన్నైలో మాత్రం దిగువకు రాగా మిగిలిన ప్రాంతాల్లో మళ్లీ ఎగువకు వచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండు సెషన్ల నుంచి లాభాల్లో కదలాడిన మార్కెట్ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 26,145కు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 85,518 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 21-11-2025(time:9:25am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్
ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్బుక్) వ్యవస్థాపక డైరెక్టర్గా చేరారు.లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్కు రిపోర్ట్ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
భారతదేశంలో కోట్లాది మంది కుటుంబాలకు జీవిత బీమా (Life Insurance) అంటే గుర్తుకొచ్చే పేరు ఎల్ఐసీ (LIC). పాలసీదారులకు రక్షణ కల్పించడం, వారి జీవితాలకు భద్రతనివ్వడం ఎల్ఐసీ ప్రధాన విధి అయినప్పటికీ కేవలం పాలసీ ప్రీమియంల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటిగా నిలవలేదు. ఎల్ఐసీ భారీగా సంపదను పోగుచేయడానికి, ప్రభుత్వానికి సైతం ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి ఉపయోగించే అసలైన వ్యాపార రహస్యం ఏమిటో చూద్దాం.ఎల్ఐసీకి వచ్చే ఆదాయం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది.పాలసీ ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం.. ఇది బీమా పాలసీలను విక్రయించడం ద్వారా సంస్థకు లభించే ప్రాథమిక ఆదాయ వనరు.పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం.. ఇదే ఎల్ఐసీకి అత్యధిక లాభాన్ని, ఆర్థిక శక్తిని అందించే కీలకమైన వ్యాపారం. పాలసీదారుల నుంచి సేకరించిన నిధులను (పాలసీ మెచ్యూరిటీ చెల్లింపుల కోసం ఉంచాల్సినవి) సంస్థ వివిధ లాభదాయక మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది.స్టాక్ మార్కెట్ఎల్ఐసీ భారతీయ స్టాక్ మార్కెట్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఎల్ఐసీ వద్ద ఉన్న భారీ నిధుల్లో చాలా వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల షేర్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడుతుంది. ప్రైవేట్ సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన మూలధనాన్ని అందిస్తూ ఆయా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేస్తుంది. కంపెనీలు లాభాలు ఆర్జించినప్పుడు ఎల్ఐసీకి డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుంది. కంపెనీల షేర్ ధరలు పెరిగినప్పుడు ఎల్ఐసీకి ఆయా షేర్లను విక్రయించడం ద్వారా భారీగా పెట్టుబడి లాభాలు లభిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ మార్గం అత్యంత లాభదాయకంగా మారుతుంది.ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లుఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిబంధనల ప్రకారం, ఎల్ఐసీ తన నిధుల్లో ఎక్కువ భాగాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లు అతిపెద్ద మార్గంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్రవ్య అవసరాల కోసం జారీ చేసే బాండ్లు, ట్రెజరీ బిల్లులను ఎల్ఐసీ కొనుగోలు చేస్తుంది. ఈ పెట్టుబడులు దాదాపు రిస్క్ రహితమైనవి. వీటిపై నిర్ణీత కాల వ్యవధిలో స్థిరమైన, కచ్చితమైన వడ్డీ ఆదాయం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక స్థిరమైన నిధిని అందిస్తుంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యంఎల్ఐసీ భారీ మొత్తంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడి పెడుతుంది. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, సామాజిక రంగ పథకాలకు ఎల్ఐసీ రుణాలను అందిస్తుంది. కొన్నిసార్లు వాటి బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే రుణ వడ్డీ ఎల్ఐసీకి స్థిరమైన, సుదీర్ఘ కాల ఆదాయ వనరుగా పనిచేస్తుంది.రియల్ ఎస్టేట్ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు, కార్యాలయ భవనాలు, నివాస సముదాయాలు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా కాలక్రమేణా ఆస్తుల విలువ పెరిగినప్పుడు వాటిని విక్రయించడం ద్వారా సంస్థ ఆదాయాన్ని ఆర్జిస్తుంది.అద్దె ఆదాయం, ఆస్తి విలువ పెరుగుదల ద్వారా ఎల్ఐసీ తన బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసుకుంటుంది.ఫండ్ మేనేజ్మెంట్ఎల్ఐసీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ మేనేజర్ల్లో ఒకటిగా ఉంది. కోట్లాది మంది పాలసీదారుల నుంచి సేకరించబడిన వేల కోట్ల రూపాయల నిధులను సురక్షితంగా, లాభదాయకంగా నిర్వహించడం ఎల్ఐసీ ప్రధాన వ్యాపారం. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని కాలక్రమేణా అధిక రాబడిని పొందే సామర్థ్యం ఎల్ఐసీ సొంతం.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
గ్లోబల్ టాప్ 100లో... మరిన్ని భారతీయ బ్యాంకులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టాప్ 100 బ్యాంకుల జాబితాలో త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు చోటు దక్కించుకోగలవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సేవలు విస్తరిస్తుండటం, బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటం ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చాలా బ్యాంకులు వేగంగా ఎదుగుతున్నాయి. వాటిలో నుంచి కొన్ని బ్యాంకులు కొద్ది కాలంలోనే ప్రపంచంలో టాప్ వంద బ్యాంకుల్లో చోటు దక్కించుకోగలవని భావిస్తున్నాను‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ (43వ ర్యాంకు), ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (73వ ర్యాంకు) మాత్రమే టాప్ 100 బ్యాంకుల్లో ఉన్నాయి. దేశానికి మరిన్ని భారీ స్థాయి బ్యాంకులు అవసరమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే చెప్పిన నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, డిజిటల్ మోసాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన మ్యూల్ హంటర్ సాధనం చాలా మంచి ఫలితాలను ఇస్తోందని మల్హోత్రా చెప్పారు. ఇది ప్రతి నెలా 20,000కు పైగా మ్యూల్ అకౌంట్లను గుర్తిస్తోందని వివరించారు. మోసపూరితంగా కాజేసిన నిధులను మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలను మ్యూల్ అకౌంట్లుగా వ్యవహరిస్తారు. వీటిని గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) మ్యూల్హంటర్డాట్ఏఐ పేరిట ఏఐ ఆధారిత సాధనాన్ని రూపొందించింది. డిజిటల్ మోసాలను అరికట్టడానికి హోంశాఖలో భాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)తో కలిసి పని చేయడంతో పాటు ఇతరత్రా పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. మనం చేయాల్సింది చేయాలి.. అంతే.. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ఫలితం గురించి ఆలోచించకుండా, మనం చేయాల్సినది చేయాలని, ఫలాలు వాటంతటవే లభిస్తాయని విద్యార్థులకు మల్హోత్రా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికన్ టెక్ దిగ్గజం, దివంగత స్టీవ్ జాబ్స్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎదగాలంటే ’కొన్ని చిట్కాలు’ చెప్పాలంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను విద్యాభ్యాసం చేసిన కాన్పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నే వచి్చందని, కర్మ సిద్ధాంతం గురించే చెప్పినట్లు ఆయన వివరించారు. అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం.. ఇటీవలి కాలంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడానికి అమెరికా టారిఫ్ల వడ్డనతో నెలకొన్న వాణిజ్య అనిశి్చతులే కారణమని మల్హోత్రా చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్ వర్గాలే నిర్దేశిస్తాయి తప్ప దాన్ని నిర్దిష్ట స్థాయిలో నిలపాలని ఆర్బీఐ టార్గెట్ ఏదీ పెట్టుకోదని ఆయన తెలిపారు. డాలర్లకు డిమాండ్ పెరిగితే రూపాయి తగ్గుతుందని, అలాగే రూపాయికి డిమాండ్ పెరిగితే డాలర్లకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు. అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, కరెంట్ అకౌంట్పై నెలకొన్న ఒత్తిడి తొలగిపోతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్లో ఫ్లాట్గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్ ఉత్పత్తి 6.7%, సిమెంట్ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్ కార్యకలాపాలపై, విద్యుత్ డిమాండ్పై అక్టోబర్లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్ పనితీరు నేపథ్యంలో అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు.
కార్పొరేట్
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్
జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
విరామ ఆతిథ్యంలోకి మహీంద్రా
100 కోట్లకు 5జీ కనెక్షన్లు
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
గ్లోబల్ టాప్ 100లో... మరిన్ని భారతీయ బ్యాంకులు
ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!
2030 నాటికి 10వేల మంది రైతులకు సపోర్ట్
ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
రూ.120 కోట్లతో ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కేంద్రం విస్తరణ
వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్! తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఉపశమనం క...
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ...
పసిడి హడల్.. వెండి తారుమారు!
దేశంలో బంగారం ధరలు మళ్లీ హడలెత్తించాయి. వెండి ధరలు...
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్ సూచీలు
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ పోకడల మధ్య భారత బెంచ్ మా...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కొత్త పాలసీలు
తెలంగాణ ఆర్థిక ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్...
గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT C...
ఆటోమొబైల్
టెక్నాలజీ
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
సముద్ర గర్భంలో కేబుళ్ల ద్వారా నిమిషాల వ్యవధిలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ప్రపంచం నలుమూలలా చేరవేసే శక్తిమంతమైన కేంద్రాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. అవే డేటా సెంటర్లు. డేటా సెంటర్లు డిజిటల్ స్టోరేజ్ కోసం ప్రాసెసింగ్ హౌస్లుగా పని చేస్తాయి. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పనికి (ఉదాహరణకు, గూగుల్లో శోధించడం, యూట్యూబ్ వీడియో చూడటం, జీమెయిల్ పంపడం, ఫొటోను క్లౌడ్లో సేవ్ చేయడం లేదా ఆన్లైన్ గేమ్ ఆడటం) మూల కారణం డేటా సెంటర్లే. ఈ విభాగంలో టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని భారత్పై కేంద్రీకరించాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇదొకవైపు డిజిటల్ ఇండియాకు శుభపరిణామం అయినప్పటికీ, మరోవైపు దేశ ఇంధన భవిష్యత్తుకు పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే వాదనలున్నాయి.భారత్ ఎందుకు?భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్గా ఉంది. కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు, పెరుగుతున్న 5జీ విస్తరణ, యూపీఐ లావాదేవీలు, ఓటీటీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డేటా డిమాండ్ను తీర్చాలంటే వినియోగదారులకు తక్కువ లేటెన్సీ అంటే వేగవంతమైన సేవలు కల్పించాలంటే డేటా సర్వర్లు భౌగోళికంగా వారికి చేరువలో ఉండాలి.భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం దేశానికి సంబంధించిన సున్నిత డేటాను దేశ సరిహద్దుల్లోనే నిల్వ చేయాలని అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీలకు దేశంలోనే డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధపడేలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సులభతరమైన అనుమతులు కల్పిస్తున్నాయి. భారత్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత ఇందుకు సానుకూల అంశంగా ఉంది.డేటా సెంటర్లకు ఎంత విద్యుత్ కావాలంటే..డేటా సెంటర్లకు తరచుగా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి కారణం వాటిలో నిరంతరం 24/7 పనిచేసే వేలాది సర్వర్లు (కంప్యూటర్లు) ఉంటాయి. డేటాను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం వంటి నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి సర్వర్కు గణనీయమైన విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో సర్వర్లన్నీ అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వేడి పెరిగితే సర్వర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, సర్వర్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి భారీ స్థాయిలో కూలింగ్ వ్యవస్థలు పనిచేయాలి. నివేదికల ప్రకారం, ఒక డేటా సెంటర్లోని మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వరకు కేవలం కూలింగ్ కోసమే ఖర్చు అవుతుంది.ఉష్ణోగ్రత నియంత్రణ ఎలా?సర్వర్లలో ఉత్పత్తి అయ్యే అధిక వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ రూమ్ ఎయిర్ కండిషనింగ్/హ్యాండ్లర్ యూనిట్లను ఉపయోగించి సర్వర్ల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తారు. ఇది అత్యంత సాధారణ పద్ధతి.నీటిని ఆవిరి చేసి దాని ద్వారా ఉత్పత్తయ్యే చల్లదనాన్ని ఉపయోగించి వేడి గాలిని చల్లబరచడం ఇంకోపద్ధతి. వేడి వాతావరణం ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మెరుగైన మార్గం అవుతుంది.లిక్విడ్ కూలింగ్ అనేది ఆధునిక పద్ధతి. సర్వర్ చిప్లకు నేరుగా ప్రత్యేకమైన ద్రవాలను పంపడం ద్వారా వేడిని తొలగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చాలా కంపెనీలు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడి నీటిని సమీపంలోని పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారు.ఇంధన సవాళ్లు..భారతదేశం 2070 నాటికి ‘నికర-శూన్య కర్బన ఉద్గారాల (Net-Zero Emissions)’ లక్ష్యాన్ని సాధించాలని, 2030 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% పునరుత్పాదక వనరుల నుంచి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో ప్రస్తుతం అధిక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం థర్మల్ విద్యుత్ (బొగ్గు). డేటా సెంటర్ల కోసం విపరీతంగా పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ థర్మల్ విద్యుత్పై ఆధారపడాల్సి వస్తే అది మన పునరుత్పాదక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.భారత్ ఎంచుకోవాల్సిన పంథా..ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక సమగ్రమైన, పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరించాలి. భారత ప్రభుత్వం ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. డేటా సెంటర్ ఆపరేటర్లు తమకు అవసరమైన విద్యుత్లో కనీసం 60% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందాలని (ఉదాహరణకు, సోలార్ లేదా విండ్ పవర్ ప్లాంట్లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) తప్పనిసరి చేయాలి. విద్యుత్ వినియోగ సమర్థత (Power Usage Effectiveness) వంటి పారామితుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.లిక్విడ్ కూలింగ్, నేచురల్ ఎయిర్ కూలింగ్ (చల్లని ప్రాంతాల్లో) వంటి అత్యంత సమర్థవంతమైన కూలింగ్ సాంకేతికతలను ఉపయోగించే డేటా సెంటర్లకు అధిక రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ను వృథా చేసే వ్యవస్థలకు బదులుగా ఆధునిక, పర్యావరణ అనుకూల యంత్రాలను ఉపయోగిస్తే కొన్ని రాయితీలు పరిశీలించవచ్చు. సౌర, పవన విద్యుత్ నిరంతరంగా లభించదు. కాబట్టి, ఈ విద్యుత్ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలి. ఇది డేటా సెంటర్లకు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
చాట్జీపీటీ డౌన్ అయితే పరిస్థితేంటి?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్ఫామ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్జీపీటీ(క్లాడ్ఫ్లెయిర్ ఇన్ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్తో రూపొందించారు. గూగుల్ సెర్చ్కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్డేటెడ్, రియల్టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి గూగుల్ ఎకోసిస్టమ్తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్జీపీటీలాగే అదే జనరేటివ్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ఏఐతో టాప్: గూగుల్ ప్లేలో బెస్ట్ యాప్లు ఇవే..
టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక అన్నీ సులభమైపోయాయి. ప్రతి అంశానికీ, పనికీ పదుల సంఖ్యలో మొబైల్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇలా వేలకొద్దీ యాప్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అయిన గూగుల్ ప్లే 2025 ఏడాదికిగానూ ఉత్తమ యాప్లను ప్రకటించింది.గూగుల్ ప్లే యాప్ స్టోర్లో 2025లో అందుబాటులో ఉన్న యాప్లలో గేమ్స్, పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎషన్షియల్.. ఇలా ఒక్కో అంశానికీ కొన్ని ఉత్తమ యాప్లను పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. వీటిలో ఏఐ అనుసంధానిత యాప్లదే పైచేయి. ఉదాహరణకు ఓవరాల్ బెస్ట్ యాప్గా జొమాటోకు చెందిన సోషల్ యుటిలిటీ యాప్ ‘డిస్ట్రిక్ట్’ నిలిచింది. ఇది ఏఐని వినియోగించి వినియోగదారుల అభిరుచులను విశ్లేషించి డైనింగ్తో పాటు ఈవెంట్లు, సినిమా టికెట్ల బుకింగ్ వంటి సోషల్ యుటిలిటీ సేవలు రియల్ టైమ్ సమాచారంతో అందిస్తోంది.ఇక పర్సనల్ గ్రోత్ విభాగంలో ‘ఇన్వీడియో ఏఐ’ అత్యుత్తమ యాప్గా నిలిచింది. దీంతో టెక్ట్స్ రూపంలో ప్రాంప్ట్ ఇచ్చి నేరుగా మంచి మంచి వీడియోలు రూపొందించవచ్చు.బెస్ట్ హిడెన్ జెమ్గా టూన్సూత్ర అనే యాప్ను గూగుల్ ప్లే పేర్కొంది. ఇది ఏఐ-ఆధారిత సినిమాటిక్ మోడ్ ను ఉపయోగించి భారతీయ ప్రసిద్ధ కథలను డిజిటల్ ఎక్స్పీరియన్స్తో ఆసక్తికరంగా మారుస్తుంది.ఫోటో ఎడిటింగ్, నోట్స్ రూపొందించడం వంటి వాటిలో సాయమందించే గుడ్ నోట్స్, లుమినార్ యాప్లు ఉత్పాదకత విభాగంలో ఉత్తమంగా నిలిచాయి. ఇవి ఏఐ ఫీచర్లతో ఫొటో ఎడిటింగ్, నోట్స్ టేకింగ్ను సులభతరం చేస్తున్నాయి.వ్యక్తగత ఆరోగ్య సంరక్షణ, జీవనశైలికి సంబంధించిన అంశాల్లోనూ కొన్ని యాప్లు ఏఐ వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. అలాంటివాటిలో ఉత్తమమైనవే డైలీప్లానర్, స్లీపిసోల్బయో యాప్లు.ఇక గేమింగ్ విషయానికి వస్తే లెక్కలేనన్నీ ఆండ్రాయిడ్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏఐ ఫీచర్లతో లోకల్ ఫ్లేవర్ జోడించిన యాప్లకు మంచి ఆదరణ ఉంటోంది. అలాంటి యాప్లే కుకీరన్ ఇండియా, కమలా, రియల్ క్రికెట్ స్వప్ వంటివి.గూగుల్ కొత్తగా టాప్ ట్రెండింగ్ కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్స్టామార్ట్, సీఖో, అడోబ్ ఫైర్ ఫ్లై వంటి యాప్లు బెస్ట్గా నిలిచాయి.ఆవిష్కరణ, నాణ్యత, యూజర్ ఇంపాక్ట్, సాంస్కృతిక ఔచిత్యం, ఏఐ-ఆధారిత ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ బెస్ట్ యాప్లను గూగుల్ ప్లే ఎంపిక చేసింది. రోజువారీ ఉపయోగం, స్థానికతను జోడించడం, వివిధ రకాల ఫోన్లు, డివైజ్లలో వినియోగించగల వెసులుబాటు ఉన్న యాప్లను హైలైట్ చేసింది. వాస్తవానికి, 69 శాతం మంది భారతీయ యూజర్లు ఏఐతో తమ మొదటి ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ యాప్ల ద్వారానే పొందుతున్నారని గూగుల్ తన బ్లాగ్లో పేర్కొంది.
ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్పో (INEX India)లో ప్రకటించారు.సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్ పరిష్కరిస్తుంది.వాటర్ హైసింత్ హార్వెస్టర్ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది.
పర్సనల్ ఫైనాన్స్
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్ను డాక్యుమెంట్గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.
మెరుగైన రాబడి కోసం.. మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్క్యాప్ ఫండ్స్తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్క్యాప్ పెట్టుబడులు రిస్క్ను తగ్గిస్తాయి. మిడ్క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
తక్కువ పెట్టుబడి.. మెరుగైన రాబడులు: ఎంపిక విషయంలో..
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్ను అధిగమించొచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు.


