Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

gold and silver rates on 19th january 2026 in Telugu states1
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం22 క్యారెట్స్--రూ.1,33,550--రూ.1750 పెంపు24 క్యారెట్స్--రూ.1,45,690--రూ.1910 పెంపుచెన్నైలో22 క్యారెట్స్--రూ.1,34,500--రూ.1700 పెంపు24 క్యారెట్స్--రూ.1,46,730--రూ.1860 పెంపుదేశ రాజధాని నగరం దిల్లీలో22 క్యారెట్స్--రూ.1,33,700--రూ.1750 పెంపు24 క్యారెట్స్--రూ.1,45,840--రూ.1910 పెంపువెండి ధరలుకేజీ వెండి రూ.3,05,000. రూ.10000 పెంపు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Global credit markets hottest levels Major asset managers warning2
ప్రపంచ క్రెడిట్ మార్కెట్‌లో ‘హీట్’

ప్రపంచ క్రెడిట్ మార్కెట్లు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో కార్పొరేట్ బాండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదే సమయంలో రిస్క్‌కు లభించే ప్రతిఫలం (ప్రీమియం) కనిష్ట స్థాయికి పడిపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రెడిట్‌ మార్కెట్లలో కనిపిస్తున్న ‘ఆత్మసంతృప్తి’ (Complacency) భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.రికార్డు స్థాయిలో తగ్గిన ప్రీమియం రాబడిబ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం, కార్పొరేట్ రుణాలపై ప్రీమియం నుంచి లభించే మార్జిన్‌ కేవలం ఒక శాతానికి పడిపోయింది. ఇది జూన్ 2007 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. ఆర్థిక స్థిరత్వంపై నమ్మకం, రేటింగ్‌లు, కరెన్సీలో మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో క్రెడిట్‌ కంపెనీలకు తగిన పరిహారం లభించడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా రిస్క్ ఉన్న విభాగాల్లో క్రెడిట్‌ జోలికి వెళ్లకపోవడమే సరైన వ్యూహమని అబెర్డీన్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ ల్యూక్ హిక్మోర్ పేర్కొన్నారు.బార్‌క్లెస్‌ పీఎల్‌సీ (Barclays PLC) విశ్లేషణ ప్రకారం, యూఎస్ రుణ మార్కెట్లో రిస్క్ పట్ల అశ్రద్ధ లేదా క్రెడిట్‌ కంపెనీల్లో ఆత్మసంతృప్తి స్థాయి 93 శాతానికి చేరింది. ఇది డిసెంబర్ 2024 తర్వాత గరిష్ట స్థాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకు రుణాలు పుట్టడం చాలా సులభమైంది. కొత్త కార్పొరేట్‌ బాండ్లపై చెల్లించాల్సిన అదనపు వ్యయం కేవలం 1.3 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంది. ఇది గత ఏడాది సగటు (3 బేసిస్ పాయింట్లు) కంటే చాలా తక్కువ. ఈ ఏడాది జారీ చేసిన బాండ్లకు విక్రయ పరిమాణం కంటే ఇన్వెస్టర్ల నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం మార్కెట్ జోరుకు నిదర్శనం.ముంచుకొస్తున్న సవాళ్లుమార్కెట్లు ఇంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా, మిడిల​్‌ఈస్ట్‌ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభాలు ఇంకా కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ వాణిజ్యంపై చూపే ప్రభావాన్ని తేలికగా తీసుకోలేం. యూఎస్‌ ఫెడ్ ఛైర్మన్‌ జెరోమ్ పావెల్‌పై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ చిన్న పొరపాటు జరిగితే క్రెడిట్‌ కంపెనీలు ఏమేరకు తట్టుకుంటాయనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.రికార్డు స్థాయిలో బాండ్ల జారీఈ ఏడాది జనవరి తొలి పదిహేను రోజుల్లోనే కంపెనీలు సుమారు 435 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేశాయి. ఇది ఒక రికార్డు. గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ వంటి దిగ్గజాలు కూడా 16 బిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించాయి. పెట్టుబడిదారుల వద్ద నగదు లభ్యత ఎక్కువగా ఉండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశలు మార్కెట్‌ను నడిపిస్తున్నాయి. అయితే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని దిగ్గజ సంస్థలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: మీరు యాక్టివా.. పాసివా?

stock market updates on 19th january 20263
25,500 మార్కు వద్దకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు తగ్గి 25,545 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 449 పాయింట్లు నష్టపోయి 83,116 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 19-01-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Detailed Breakdown of Q3 FY26 top banks Results4
ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 19,807 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 17,657 కోట్లు ఆర్జించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 11 శాతం బలపడి రూ. 18,654 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 32,600 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 13,250 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.35 శాతంగా నమోదయ్యాయి.కొత్త కార్మిక చట్టాల అమలు కారణంగా రూ. 800 కోట్ల వ్యయాలు నమోదైనట్లు బ్యాంక్‌ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,154 కోట్ల నుంచి రూ. 2,838 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.24 శాతానికి నీరసించగా.. గత 12 నెలల కాలంలో 500 బ్రాంచీలను కొత్తగా జత కలుపుకుంది. దీంతో వీటి సంఖ్య 9,616ను తాకింది. ఈ కాలంలో బ్యాంక్‌ మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు 5,000 తగ్గి 2.15 లక్షలకు పరిమితమైంది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 19.9 శాతంగా నమోదైంది.ఐసీఐసీఐ బ్యాంక్‌.. డౌన్‌ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 12,538 కోట్లకు పరిమితమైంది. ప్రాధాన్యతా రంగ అడ్వాన్సులంటూ తప్పుగా నమోదుచేయడంతో ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రుణాలకు రూ. 1,283 కోట్ల ప్రొవిజన్‌ చేపట్టింది. దీంతో లాభాలు దెబ్బతిన్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 4 శాతం బలహీనపడి రూ. 12,883 కోట్లకు చేరింది. కాగా.. ఎండీ, సీఈవో సందీప్‌ బక్షి పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించేందుకు బోర్డు నిర్ణయించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 21,932 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతంగా నమోదయ్యాయి.ట్రెజరీ కార్యకలాపాలు మినహాయించి, వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 7,525 కోట్లకు చేరింది. కొత్త కారి్మక చట్టాల అమలులో భాగంగా రూ. 145 కోట్ల వ్యయాలు నమోదు చేసినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రెట్టింపై రూ. 2,556 కోట్లకు చేరాయి. తాజా స్లిప్పేజీలు రూ. 5,356 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.53 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 17.34 శాతంగా నమోదైంది. ఐసీఐసీఐ అనుబంధ సంస్థలలో ప్రుడెన్షియల్‌ లైఫ్‌ నికర లాభం రూ. 390 కోట్లకు, లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాభం రూ. 659 కోట్లకు, ఏఎంసీ లాభం రూ. 917 కోట్లకు చేరాయి.యస్‌ బ్యాంక్‌.. హైజంప్‌ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 952 కోట్లను తాకింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 259 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 22 కోట్లకు పరిమితంకావడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 612 కోట్ల లాభం ఆర్జించింది.కొత్త కార్మిక చట్టాల అమలుకు రూ. 155 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 2,466 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,633 కోట్లకు చేరింది. స్థూల స్లిప్పేజీలు రూ. 1,248 కోట్ల నుంచి రూ. 1,050 కోట్లకు క్షీణించగా.. స్థూల మొండిబకాయిలు 0.1 శాతం మెరుగుపడి 1.5 శాతాన్ని తాకాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 14.5 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు

Key Comparison Active vs Passive Funds5
మీరు యాక్టివా.. పాసివా?

స్టాక్‌ మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు... షేర్ల గురించి ఎక్కువగా తెలియని వారు కూడా మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఏ షేర్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్‌ చేయాలో, ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో అవన్నీ చూసుకోవటానికి మ్యూచువల్‌ ఫండ్లలో ఓ పెద్ద వ్యవస్థ ఉంటుంది. అవన్నీ చేస్తూ... ఏడాది తిరిగేసరికల్లా చక్కని రాబడినిస్తాయి కనక మ్యూచువల్‌ ఫండ్లు చాలామందిని ఆకర్షిస్తుంటాయి. బ్యాంకు వడ్డీని మించి రాబడి సాధించాలన్నా... ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా ఇదో మంచి మార్గం. సరే! మరి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి? అంటే షేర్లలోను, బాండ్లలోను ఇన్వెస్ట్‌ చేసేయాక్టివ్‌ ఫండ్స్‌లోనా? లేక ఇండెక్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్‌ ఫండ్స్‌లోనా? ఏది బెటర్‌? దీన్ని వివరించేదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’...భారతదేశ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరిందిపుడు, ఒకరకంగా ఇది రికార్డు స్థాయి. ఇందులో పాసివ్‌ ఫండ్స్‌ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. మిగిలిన విలువ యాక్టివ్‌ ఫండ్స్‌ది. అసలు మనదేశంలో ఇండెక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే పాసివ్‌ ఫండ్ల విలువ రూ.14 లక్షల కోట్లకు చేరుతుందని ఎవరైనా ఊహించారా? మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందనేది నిపుణుల మాట. దీంతో పాసివ్‌ ఫండ్లు మంచివా... లేక యాక్టివ్‌ ఫండ్సా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. నైపుణ్యం, అనుభవం ఉన్న ఫండ్‌ మేనేజర్లు మాత్రమే, నిరంతరం మార్కెట్‌ని మించి రాబడులు అందించగలరనే భావన కొన్నాళ్ల కిందటిదాకా ఉండేది. కానీ, ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు క్రమంగా ఖర్చులను ఆదా చేసే, సరళంగా ఉండే, దీర్ఘకాలికంగా విశ్వసనీయంగా ఉండే పాసివ్‌ విధానంవైపు మళ్లుతున్నారు. ఈ రెండింట్లో ఉండే సానుకూల, ప్రతికూలాంశాలు చూస్తే...ఇండెక్స్‌ వర్సెస్‌ యాక్టివ్‌ ఫండ్స్‌..ఇండెక్స్‌ ఫండ్స్‌ అంటే, సెన్సెక్స్, నిఫ్టీ50, నిఫ్టీ– 500 లాంటి నిర్దిష్ట మార్కెట్‌ సూచీని ప్రతిబింబించేవి పాసివ్‌ ఫండ్స్‌. ఇవి ఆ సూచీలోని స్టాక్స్‌లో, అదే పరిమాణంలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రత్యేకంగా షేర్లను ఎంచుకోవడం, మంచి సమయం కోసం వేచి ఉండటంలాంటిది ఉండదు. ఈ తరహా ఫండ్స్‌లో ఖర్చులు చాలా తక్కువ. దాదాపు సదరు ఇండెక్స్‌ స్థాయిలో పనితీరు కనపరుస్తాయి (కొంత వ్యయాలు పోగా).అదే యాక్టివ్‌ ఫండ్స్‌ని తీసుకుంటే బెంచ్‌మార్క్‌కి మించిన రాబడులను అందించేలా వీటిని ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అధ్యయనం, షేర్ల ఎంపిక, వ్యూహాత్మకంగా సర్దుబాట్లు చేయడంలాంటి హడావిడి ఉంటుంది. ఈ తరహా ఫండ్‌లు ప్రామాణిక సూచీలకు మించిన పనితీరు సాధించే అవకాశం ఉంటుంది. వీటిల్లో పరిశోధనలు, ట్రేడింగ్‌ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఖర్చుల నిష్పత్తి కూడా ఎక్కువే.ఏవి ఎలా ఉంటాయ్‌..ఇండెక్స్‌ ఫండ్స్‌ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఏదో ఒక్క మేనేజరు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. మార్కెట్‌ హెచ్చుతగ్గులపరమైన ప్రభావమే తప్ప నిర్దిష్ట స్టాక్‌పరమైన ప్రతికూల ప్రభావం ఉండదు. మరోవైపు, యాక్టివ్‌ ఫండ్స్‌ విషయానికొస్తే ఇవి నిర్దిష్ట సాధనాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడితే పెట్టుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఫండ్‌ పనితీరు దెబ్బతినే అవకాశాలూ ఉంటాయి.వాస్తవ పరిస్థితిఆర్థిక సమాచార సేవల సంస్థ ఎస్‌ అండ్‌ పీకి చెందిన ఎస్‌పీఐవీఏ ఇండియా నివేదిక ప్రకారం (2025 మధ్య, అంతకు ముందు ట్రెండ్స్‌) దాదాపు 65–66 శాతం లార్జ్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్స్, 2025లో తమ తమ బెంచ్‌మార్క్‌ సూచీలకన్నా తక్కువ రాబడులను అందించాయి. దీర్ఘకాలికంగా అంటే పదేళ్ల పైగా వ్యవధిలో చూస్తే సుమారు 80 శాతం మిడ్, స్మాల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్స్‌ వెనుకబడ్డాయి. అయితే, కొన్ని యాక్టివ్‌ ఫండ్‌లు తీవ్ర హెచ్చుతగ్గుల మార్కెట్లలో కూడా రాణించగలిగే విధంగా ఉంటాయి. మరోవైపు, పాసివ్‌ ఫండ్స్‌ అనేవి కొంత రిస్కు తక్కువ వ్యవహారంగా విశ్వసనీయమైన స్థాయిలో రాబడులు అందించేందుకు అవకాశం ఉంది. ఎవరికి .. ఏవి అనువు..ఇండెక్స్‌ ఫండ్స్‌: తొలిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు, దీర్ఘకాలిక సిప్‌ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్‌ ప్రణాళికల్లో ఉన్నవారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలనుకునేవారు. ప్రతి రోజూ మార్కెట్లను, పెట్టుబడులను చూస్తూ కూర్చోవడానికి ఇష్టపడని వారు. యాక్టివ్‌ ఫండ్స్‌: పనితీరును సమీక్షించుకోవడానికి ఇష్టపడే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, నిర్దిష్ట రంగాలు/థీమ్‌ల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కోరుకునేవారు.ఖర్చులు కీలకం..ఇండెక్స్‌ ఫండ్స్‌కి సంబంధించిన పెద్ద సానుకూల అంశం ఖర్చులు తక్కువగా ఉండటం. డైరెక్ట్‌ ప్లాన్లయితే సాధారణంగా 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటాయి. మరోవైపు, యాక్టివ్‌ ఫండ్‌లు సాధారణంగా 1.5 – 2.5 శాతం శ్రేణిలో చార్జీలు విధిస్తాయి. కాలక్రమేణా ఈ చార్జీలన్ని కలిపితే తడిసి మోపెడవుతుంది. దీర్ఘకాలంలో ఇదొక సైలెంట్‌ వెల్త్‌ కిల్లర్‌లాంటిది. 20–25 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఆఖర్లో ఈ వ్యయాల భారం పెట్టుబడి, నిధిని బట్టి లక్షలు, కోట్లల్లోనూ ఉంటుంది. ఆ మేరకు రాబడీ తగ్గుతుంది.హైబ్రిడ్‌ వ్యూహంతో మేలు..చాలా మంది నిపుణులు ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి హైబ్రిడ్‌ వ్యూహమైన ‘కోర్‌–శాటిలైట్‌’ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే 60–70 శాతం మొత్తాన్ని (కోర్‌) తక్కువ వ్యయాలతో కూడుకుని ఉండే ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. వీటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి, పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం లభిస్తుంది. ఇక 30–40 శాతం మొత్తాన్ని అనుబంధంగా (శాటిలైట్‌), అధిక లాభాలను ఆర్జించి పెట్టే అవకాశమున్న నిర్దిష్ట యాక్టివ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే రకం పెట్టుబడి వ్యూహం ఉపయోగపడకపోవచ్చు. ఇండెక్స్‌ ఫండ్లతో ఖర్చులు ఆదా అవుతాయి. రాబడులు కాస్త అంచనాలకు అందే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ముఖ్యంగా నిలకడగా మార్కెట్‌ని మించి రాబడులను సాధించడం కష్టంగా ఉండే లార్జ్‌–క్యాప్‌ సెగ్మెంట్‌కి సంబంధించి ఇవి అనువైనవిగా ఉంటాయి. యాక్టివ్‌ ఫండ్స్‌ అనేవి అధిక రాబడుల ఆశలు కలి్పస్తాయి, కానీ ఫీజులు, రిసు్కలు అధికంగా ఉంటాయి. ఏదైతేనేం.. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. యాంఫీ, ఫండ్‌ ఫ్యాక్ట్‌ షీట్లు, విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల ద్వారా ఫండ్‌ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మీ రిస్క్‌ ప్రొఫైల్, లక్ష్యాలకు అనువుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయాలి.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!

Q3 earnings, global trends to drive stock markets this week6
క్యూ3 ఫలితాలే దిక్సూచి 

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలే నిర్దేశించనున్నాయి. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నప్పటికీ సమీపకాలంలో కార్పొరేట్‌ పనితీరు, గ్లోబల్‌ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. గత వారాంతాన ఇండెక్స్‌లను ప్రభావితం చేయగల బ్లూచిప్‌ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు.. బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్యూ3 పనితీరు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(19న) కనిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ వారం మరిన్ని కంపెనీలు క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో బీహెచ్‌ఈఎల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తదితరాలు చేరాయి. వీటితోపాటు పలు మిడ్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ప్రకటించనున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ట్రంప్‌ ఎఫెక్ట్‌ యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్‌ చేయడంసహా.. ఇరాన్‌లో అంతర్యుద్ధానికి మద్దతు పలకడం, గ్రీన్‌ల్యాండ్‌ తమదేనంటూ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడి సాధానాలుగా భావించే పసిడి, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రిస్క్‌ పెట్టుబడులు నీరసించే వీలున్నట్లు విశ్లేíÙంచారు. మరోపక్క యూఎస్‌తో భారత్‌ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కిరాకపోవడం సైతం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. విదేశీ గణాంకాలు నేడు చైనా.. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4) జీడీపీ గణాంకాలు ప్రకటించనుంది. జూలై–సెప్టెంబర్‌(క్యూ3)లో ఎకానమీ 4.8 శాతం ఎగసింది. ఈ బాటలో డిసెంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లపై స్పందించనుంది. ఇక మరోవైపు యూఎస్‌ క్యూ3 జీడీపీ వృద్ధి రేటు తుది గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ నెల 17కల్లా నమోదైన నిరుద్యోగ గణాంకాలు ప్రకటించనుంది. వారం చివర్లో యూఎస్‌తోపాటు.. దేశీయంగా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. కాగా.. 27 దేశాలతోకూడిన యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్చా వాణిజ్య చర్చలు తుది దశకు చేరినట్లు వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొన్నారు. నెలాఖరుకల్లా ఒప్పందం ఖరారుకానున్నట్లు మంత్రి తెలియజేశారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement