ప్రధాన వార్తలు
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్గ్రేడ్ పనులు చేపట్టింది.జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!అధికారుల ప్రకారం.. అప్గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.ఎంక్వైరీ సేవల్లోనూ వేగంటికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.సాంకేతిక సమస్యలకు చెక్ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.కొత్త ఫీచర్లుఅప్గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.ఆన్లైన్ బుకింగ్కు పెరుగుతున్న ఆదరణప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్గ్రేడ్తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది.
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు
దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఉచితంగా సీట్ల కేటాయింపుకొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.ఒకే పీఎన్ఆర్ ఉంటే పక్కపక్కనే సీట్లుఒకే పీఎన్ఆర్పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణవిమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎయిర్లైన్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
డెల్ కంపెనీ సైలెంట్గా ఇంత పని చేసిందా!!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) సైలెంట్గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్లో వెల్లడయ్యాయి.కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్ వర్క్ఫోర్స్, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్ఫోర్స్ తగ్గిపోయినట్లైంది.ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్ఫామ్స్, అట్లాసిన్, బ్లాక్ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి.
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి.
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
కార్పొరేట్
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం
పీఎఫ్సీ డివిడెండ్ రూ. 3.25
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
రూ. 216 కోట్లతో ఎగ్జికామ్ ప్లాంటు
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
డిమాండ్కి తగినంత బొగ్గు సరఫరా
శామ్సంగ్తో ఆర్ఐఎల్ డీల్
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పెట్టుబడికి సంబంధి...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
ఉడుకుతున్న బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో క...
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్య...
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మె...
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏసీ క్లీనింగ్ ఇలా ఈజీ!
మార్చి నెల.. ఎండ... ఉక్కపోతను తట్టుకోవాలంటే ఏసీ ఆన్ చేయాల్సిందే. అయితే నెలల తరబడి వాడకుండా వదిలేసిన ఏసీని ఇప్పుడు సడెన్గా ఆన్ చేస్తే గది త్వరగా చల్లబడదు. పోనీ సర్వీసింగ్ కోసం టెక్నీషియన్ను పిలుద్దామంటే బోలెడంత ఖర్చు. అయితే ఎలాంటి ప్రొఫెషనల్ టూల్స్ అవసరం లేకుండానే, కేవలం ఓ పాత టూత్ బ్రష్, కొద్దిగా నీళ్లతో మీ ఏసీని మీ చేతులతోనే కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు.క్లీనింగ్ మొదలుపెట్టే ముందు ఏసీ పవర్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేయడం మరచిపోవద్దు. కరెంట్, నీళ్లు కలిస్తే చాలా ప్రమాదం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.స్టెప్ 1: ఫిల్టర్లతో మొదలుపెట్టాలి. విండో ఏసీ అయినా, స్ప్లిట్ ఏసీ అయినా ఫ్రంట్ కవర్ ఓపెన్ చేయగానే మెష్ ఫిల్టర్లు కనిపిస్తాయి. గదిలోని దుమ్ము, చెత్తాచెదారాన్ని ఇవే ఆపుతాయి. వీటిని బయటకు తీసి ట్యాప్ కింద పెట్టి ఫోర్స్గా వచ్చే నీటితో శుభ్రంగా కడగాలి. డస్ట్ అంతా పోయి ఫిల్టర్లు పారదర్శకంగా కనిపించేలా కడిగాక పక్కన ఆరబెట్టాలి. ఈ ఒక్క పనితోనే సగం గాలి ఫ్రీగా వస్తుంది.స్టెప్ 2: కాయిల్స్ క్లీనింగ్: ఫిల్టర్ల వెనుక అల్యూమినియంతో చేసిన సన్నటి కూలింగ్ కాయిల్స్ (ఫిన్స్) ఉంటాయి. చల్లటి గాలి వచ్చేది అక్కడి నుంచే కాబట్టి వీటి క్లీనింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇందుకోసం పాత టూత్బ్రష్ను నీళ్లలో ముంచి, ఈ కాయిల్స్పై పైనుంచి కిందకు సున్నితంగా రుద్దాలి. బ్రష్ను మధ్యమధ్యలో నీళ్లలో కడుగుతూ మురికిని తొలగించాలి. గట్టిగా రుద్దితే ఆ సన్నటి కాయిల్స్ వంగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి పైపైన మెల్లగా క్లీన్ చేయాలి.స్టెప్ 3: విండో, ఔట్డోర్ యూనిట్ క్లీనింగ్: మీది విండో ఏసీ అయితే, వెనుక వైపు కూడా కాయిల్స్ ఉంటాయి. వాటర్ పైపుతో ఆ కాయిల్స్పై నీళ్లు కొడుతూ మురికిని కడిగేయాలి. లోపలి మోటార్పై నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి. స్ప్లిట్ ఏసీ (Splict AC) అయితే.. బయట డాబా మీద లేదా గోడకు ఉండే ఔట్డోర్ యూనిట్ను క్లీన్ చేయాలి. దీని చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, బూజును వాటర్ పైపుతో ఫోర్స్గా కొట్టి క్లీన్ చేయాలి. ఇది శుభ్రంగా ఉంటే ఏసీ వేడిని ఈజీగా బయటకు పంపుతుంది.స్టెప్ 4: ఆరేదాకా వెయిట్ చేయాలి: క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. ఎందుకంటే లోపల నీటి తడి అలాగే ఉంటుంది కాబట్టి కనీసం గంటన్నర పాటు దాన్ని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే ప్లగ్ పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే... గాలి ఫ్లో, కూలింగ్ ఎఫెక్ట్ మీకే అర్థమవుతుంది. ఈ సాఫ్ట్ సర్వీసింగ్తో ఏసీ కూలింగ్ పెరగడం ఖాయం. అయితే ఇది టెక్నీషియన్ చేసే పనికి ప్రత్యామ్నాయం కాదు. ఏసీలో గ్యాస్, ఇతరత్రా ఏమైనా పార్టులు పోతే టెక్నీషియన్ రావలసిందే! చదవండి: ఇల్లు కొనాలంటే ఈ వసతులు ఉండాల్సిందే
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.
ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్?మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్బాట్తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్బాట్తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.ప్రయోజనాలు..సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.నష్టాలు లేవా?టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్టాక్లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పర్సనల్ ఫైనాన్స్
మహిళలకు ప్యాసివ్ పెట్టుబడుల దన్ను
దేశీయంగా పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాల్లో నెమ్మదిగానే అయినా, గమనించతగ్గ మార్పులే జరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డేటా ప్రకారం గత ఐదేళ్లలో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. ప్రతి నలుగురు ఫండ్ మదుపరులలో ఒకరు మహిళే ఉంటున్నారు. ఇది పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటాన్నే కాకుండా, వివిధ అసెట్స్, స్కీముల విషయంలో మారుతున్న వారి దృక్పథాన్ని కూడా తెలియజేస్తోంది.పెట్టుబడుల విషయంలో మహిళలు సాధారణంగా చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని, తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు తగ్గ అవకాశాలు పరిశీలిస్తారు. అవసరమైతే నమ్మకమైన ఆర్థిక సలహాదారులను కూడా సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్యాసివ్ ఇన్వెస్టింగ్, అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక సులభతరమైన, సరైన ప్రారంభంగా నిలుస్తోంది. తక్కువ ఖర్చుతో, స్పష్టమైన నియమాల ఆధారంగా ఉండే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది కోర్ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవడంతో పాటునిర్దిష్ట రంగాలు లేదా థీమ్లలో విస్తృతంగాఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజా యాంఫీగణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్యాసివ్ ఫండ్ల నిర్వహణలో దాదాపు రూ. 15 లక్షల కోట్ల ఆస్తులు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇందులోరంగాలవారీ ఇండెక్స్లు, గోల్డ్, సిల్వర్లాంటి కమోడిటీ ఇండెక్స్లు, వేల్యూ .. క్వాలిటీ థీమ్ ఆధారిత ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా..డిజిటల్ మౌలిక సదుపాయాల పురోగతితో మహిళలకు పెట్టుబడి సాధనాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సాధనాలవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యాలు వచ్చినప్పుడే సిసలైన సాధికారత లభించినట్లవుతుంది. విదేశీ పర్యటన కోసం లేదా ఉన్నత విద్య కోసం నిధులను సమకూర్చుకోవడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, పిల్లల చదువులు, ఆరోగ్యం, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత.. ఇలా అనేక లక్ష్యాలు ఉండొచ్చు. ఇలాంటివాటిని సాకారం చేసుకునేందుకు వివిధ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లాంటి ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 50 ఇండెక్స్ను అనుసరించే ఈక్విటీ ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఇది బలమైన పునాదిగా కూడా నిలుస్తుంది. అలాగే, మరింత మెరుగైన ఫలితాల కోసం ఫ్యాక్టర్ ఆధారిత ప్యాసివ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. వేల్యూ, క్వాలిటీ, లో వోలటాలిటీ లేదా మొమెంటంలాంటి లక్షణాల ఆధారంగా ఇవి ఉంటాయి. తరతరాలుగా భారత మహిళలకు పసిడి, వెండితో ఎనలేని అనుబంధం ఉంటోంది.ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో వీటికి కూడా చోటు కల్పించవచ్చు. సరైన స్థాయిలో కేటాయిస్తే, అనిశ్చితుల్లో ఈక్విటీలు నెమ్మదించినా, పోర్ట్ఫోలియోపై తీవ్ర ప్రభావం పడకుండా హెడ్జింగ్ సాధనంగా కూడా ఇవి రక్షణ కలి్పస్తాయి. ఇండెక్స్ ఫండ్లలో బాండ్స్లాంటి స్థిరాదాయాన్ని ఇచ్చే సాధనాలకు సంబంధించిన ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీలాగా, ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ తేదీతో ఉంటాయి. ఇలాంటివి సమీప భవిష్యత్తులో నిర్దిష్ట ఆరి్థక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.సిప్ శ్రేయస్కరం..ఇక సిప్ విధానం ద్వారా ప్యాసివ్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. దీనితో పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమంగా పెట్టుబడిని పెంచుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ గురించి ఆందోళన చెందనక్కర్లేదు. రోజువారీ వార్తల ప్రభావంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితీ ఉండదు.చివరిగా చెప్పేదేమిటంటే దేశీయంగా మహిళలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో సంపదను నిర్వహిస్తున్నారు. వారిలో ఖర్చులపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఫోకస్ పెరిగింది. వారి పెట్టుబడులు ఇప్పుడు మరింత ప్రణాళికాబద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండెక్స్ ఫండ్స్ అనేవి మహిళా ఇన్వెస్టర్లు తమ సామర్థ్యాలను, తెలివైన పెట్టుబడి నిర్ణయాలుగా మార్చుకునేందుకు ఒక చక్కని, సరళమైన అవకాశాన్ని కల్పిస్తాయి. మారే లక్ష్యాలు, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెట్టుబడులను మల్చుకునేందుకు పునాదిగా నిలుస్తాయి.
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక


