Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

RBI confirmed six NBFCs surrendered their licenses1
ఆరు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సుల సరెండర్‌

అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్‌ ఫైనాన్స్, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తమ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సులను రిజర్వ్‌ బ్యాంకుకి సరెండర్‌ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్‌ శ్యామ్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, రామా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్‌ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్‌లో టాటా మోటర్స్‌ ఫైనాన్స్‌ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్‌లో పిరమాల్‌ ఫైనాన్స్‌లో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలీనమైంది.మరోవైపు, నిర్దిష్ట ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌ లేని, అసెట్స్‌ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ చేయించుకోనక్కరలేదు. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు నో రిజిస్ట్రేషన్‌ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్‌బీఐ వద్ద నమోదు (రిజిస్టర్‌) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్‌ నుంచి మినహాయింపును ఆర్‌బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్‌–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్‌ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్‌ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్‌ 45ఏఐ కింద ప్రతీ ఎన్‌బీఎఫ్‌సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్‌ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్‌ తక్కువేనని ఆర్‌బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌ (శాఖలు/యాప్‌/డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్‌ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Zscaler AI Security Report highlights India rapid rise in enterprise AI2
ఏఐ వినియోగంలో భారత్‌ జోరు

దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్‌ప్రైజ్‌ విభాగంలో ఏఐ/ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నిగ్‌) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్‌ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది. ఏజెంటిక్‌ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్‌ మధ్య జీస్కేలర్‌ జీరో ట్రస్ట్‌ ఎక్సే్చంజ్‌ ప్లాట్‌ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్‌ లెరి్నంగ్‌ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్‌ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్‌లో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఆంథ్రోపిక్‌ సీఈవో డేరియో, క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఎమోన్‌ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్‌ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్‌ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్‌–ఫస్ట్‌ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్‌ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్‌ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్‌–ఇన్సూరెన్స్‌ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్‌ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్‌ డిమాండ్‌కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్‌లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్‌క్రిమినల్స్, నిఘా గ్రూప్‌లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్‌ వేగంతో, భారీ స్థాయిలో సైబర్‌ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్‌లోకి 18,000 టెరాబైట్స్‌ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్‌ ఫొటోలకు సమానం. ఏజెంటిక్‌ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్‌లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్‌ జీరో ట్రస్ట్‌ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

major developments NSE India and India Post have just been announced3
ఎన్‌ఎస్‌ఈ, ఇండియా పోస్ట్‌ జట్టు

మ్యుచువల్‌ ఫండ్స్‌ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా పోస్టల్‌ శాఖ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) జట్టు కట్టాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్‌కి చెందిన 1.64 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్‌ని, ఎన్‌ఎస్‌ఈ ఎంఎఫ్‌ ఇన్వెస్ట్‌ ప్లాట్‌ఫాంని ఉపయోగించుకోనున్నాయి. తొలి దశలో చిన్న పథకాలతో మొదలుపెట్టి రెండో దశలో పూర్తి స్థాయి స్కీములు, పోర్ట్‌ఫోలియో అనలిటిక్స్, ప్రాంతీయ భాషల్లో సపోర్ట్, సలహా సేవలను అందుబాటులోకి తేనున్నాయి.గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వారు తమ దగ్గరుండే పొదుపు మొత్తాలను, సంపద సృష్టికి ఉపయోగపడే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం మ్యుచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం రూ.81 లక్షల కోట్లకు చేరింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Titan Q3 results: Net profit surges 61 percent to Rs 1684 crore: revenue jumps 43 percent4
టైటాన్‌ లాభం హైజంప్‌

న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్‌ దిగ్గజం టైటాన్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి. కాగా.. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్‌ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్‌లేన్‌ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్‌ ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్‌లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్‌లేన్‌ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది.

Gold ETFs alone accounted for approximately  Rs 24040 crore5
బంగారమే బిగ్‌ బాస్‌

న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్‌లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్‌కు మించి బంగారం ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్‌లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్‌ఆర్‌కే క్యాపిటల్‌ డైరెక్టర్‌ స్వప్నిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌/ పన్ను ఆదా ఫండ్స్‌) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్‌ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్‌.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్‌ల్లోకి డిసెంబర్‌లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్‌లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి.

Pet Friendship: Growing craze for AI animal breeding6
బిలియన్‌ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్‌

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: భారత్‌లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్‌ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్‌ పెట్స్‌ (ఏఐ పెట్స్‌) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్‌ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్‌ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్‌ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్‌ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్‌ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్‌ వర్చువల్‌ పెట్స్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్‌ డాలర్లని అంచనా. వెంచర్‌ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్‌లు ప్రధానంగా సబ్ర్‌స్కిప్షన్లు,ఇన్‌–యాప్‌ కొనుగోళ్లు, పెట్‌ యాక్సెసరీస్‌ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్‌ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్‌ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్‌ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్‌ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్‌ పెట్స్‌ కాన్సెప్ట్‌ కొత్తది కాదు. జపాన్‌లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్‌ వర్చువల్‌ పెట్స్‌కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్‌ టామ్, ఫ్రెండ్స్‌ యాప్స్, విడ్జెట్స్‌ వంటి అప్లికేషన్లు పాపులర్‌ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్‌ పెట్స్‌ మరింత అడ్వాన్స్‌డ్‌గా మారాయి. పాకెట్‌ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్‌లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement