Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

stock market updates on 22nd january 20261
Stock Market Updates: పడిలేచిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం పుంజుకున్నాయి. లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 250 పాయింట్లు ఎగిసి 25,408 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 793 పాయింట్లు పుంజుకుని 82,703 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.05బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.03 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.2 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.18 % లాభంతో ముగిసింది.Today Nifty position 22-01-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

LinkedIn Report Reveals AI Engineer as Top Emerging Job in Hyderabad2
హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్‌ జాబ్స్‌ ఇవే..

హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్‌ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్‌ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్‌గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్‌లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్‌తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్‌లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్‌ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్‌ సెర్చ్‌ను ఈజీ చేస్తున్న లింక్డ్‌ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్‌ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్‌లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్‌ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్‌లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్

TCS Infosys Shine Bright in Global IT Brand Rankings3
టీసీఎస్, ఇన్ఫోసిస్‌.. తిరుగులేని బ్రాండ్లు

భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌ అంతర్జాతీయంగా అత్యంత విలువైన బ్రాండ్లుగా తమ ఆధిపత్యాన్ని కాపాడుకున్నాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదిక ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో టీసీఎస్‌ అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలవగా, ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌–25 విలువైన ఐటీ బ్రాండ్లు ఇందులో చోటుచేసుకున్నాయి.అమెరికా, భారత్‌ చెరో ఎనిమిది ర్యాంకులతో ముందున్నాయి. యాక్సెంచర్‌ 42.3 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్‌ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో ఏడాది. టీసీఎస్‌ వరుసగా ఐదో ఏడాది ఈ జాబితాలో రెండో స్థానాన్ని కాపాడుకుంది. టీసీఎస్‌ విలువను 21.2 బిలియన్‌ డాలర్లుగా బ్రాండ్‌ ఫైనాన్స్‌ అంచనా వేసింది.ఇక 16.4 బిలియన్‌ డాలర్లతో మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఇన్ఫోసిస్‌ నిలిచింది. గత ఆరేళ్లుగా మూడో స్థానంలో ఉంటూ వస్తున్న ఇన్ఫోసిస్‌ విలువ ఏటా 15 శాతం చొప్పున పెరగడం గమనార్హం. హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో టాప్‌–10లో చోటు దక్కించుకోగా.. టెక్‌ మహీంద్రా 12వ స్థానంలో ఉంది. అలాగే, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సైతం ఈ జాబితాలో భారత్‌ నుంచి విలువైన బ్రాండ్లుగా నిలిచాయి.

SBI General Launches SBIG Health Alpha Health Insurance Plan4
ఎస్‌బీఐ జనరల్‌ నుంచి హెల్త్‌ ఆల్ఫా

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘ఎస్‌బీఐజీ హెల్త్‌ ఆల్ఫా’ పేరుతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పరిష్కార్నాన్ని ఆవిష్కరించింది. కస్టమర్ల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. ఎన్నో రకాల ఆప్షనల్‌ (ఐచ్ఛిక) ప్రయోజనాలతో తీసుకోవచ్చని తెలిపింది.మెరుగైన క్యుములేటివ్‌ బోనస్, సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా రక్షణ) ఆప్షన్లలో సౌలభ్యం, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో అనుసంధానం, నేటి జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన కవరేజీని హెల్త్‌ ఆల్ఫా అందిస్తుందని వెల్లడించింది. ఇందులో 50కు పైగా కవరేజీ ఆప్షన్లు ఉన్నట్టు, జిమ్, క్రీడా గాయాలు, ఫిట్‌నెస్‌ సంబంధిత గాయాలకు ఓపీడీ కవరేజీ ప్రయోజనం ఉన్నట్టు తెలిపింది.జీవితాంతం ఒకే తరహా ప్రయోజనాలతో కాకుండా, వివిధ స్థాయిల్లోని అవసరాలకు అనుగుణంగా (వివాహానంతరం ప్రసవ సంబంధిత, పిల్లల ఆరోగ్య సంబంధిత, వృద్ధాప్యంలో అదనపు కవరేజీ తదితర) ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. అదనపు యాడాన్‌లను తీసుకుని, అవసరం లేని వాటిని ఆప్ట్‌ అవుట్‌ చేసుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని తెలిపింది.

Dr. Reddys Q3 net declines 14 percent to Rs 1210 crore5
డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,210 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ నికర లాభం రూ. 1,210 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో నమోదైన రూ. 1,413 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఆదాయం రూ. 8,357 కోట్ల నుంచి రూ. 8,727 కోట్లకు చేరింది. కీలకమైన అమెరికా మార్కెట్లో లెనాలిడోమైడ్‌ విక్రయాలు నెమ్మదించడం, నిర్దిష్ట ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, కొత్త లేబర్‌ కోడ్‌ల అమలుకు సంబంధించి వన్‌–టైమ్‌ ప్రొవిజన్‌ చేయాల్సి రావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు బుధవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ తెలిపింది. బ్రాండెడ్‌ వ్యాపారాలు మెరుగ్గా రాణించడం, ఫారెక్స్‌పరమైన సానుకూల ప్రయోజనాల వల్ల ఆ లోటు భర్తీ అయినట్లు కంపెనీ కో–చైర్మన్‌ జి.వి. ప్రసాద్‌ తెలిపారు. ప్రధాన వ్యాపార వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యాపార భాగస్వాములకు దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని ముఖ్యాంశాలు.. → గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం నుంచి ఆదాయం 7 శాతం పెరిగి సుమారు రూ. 7,375 కోట్ల నుంచి రూ. 7,911 కోట్లకు పెరిగింది. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయం రూ. 3,383 కోట్ల నుంచి రూ. 2,964 కోట్లకు తగ్గింది. యూరప్‌ విక్రయాలు 1,209 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ. 1,447 కోట్లకు పెరిగాయి. ఇక భారత మార్కెట్లో అమ్మకాలు 19 శాతం వృద్ధితో రూ. 1,346 కోట్ల నుంచి రూ. 1,603 కోట్లకు చేరాయి. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం సుమారు రూ. 1,436 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో 6, యూరప్‌లో 10, భారత్‌లో రెండు, వర్ధమాన మార్కెట్లలో 30 కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో కొత్త బ్రాండ్‌లను ఆవిష్కరించడం, ధరల పెరుగుదల, అధిక అమ్మకాలు మొదలైన అంశాలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయి. → ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం రూ. 822 కోట్ల నుంచి 2% క్షీణించి రూ. 802 కోట్లకు తగ్గింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం క్షీణించి రూ. 1,155.50 వద్ద క్లోజయ్యింది.

Gomini Launches India First Managed Cow Care Service6
బిట్‌ కౌయిన్‌...

అంతా డిజిటల్‌మయంగా మారుతున్న నేపథ్యంలో పాడి వ్యాపారం కూడా డిజిటల్‌ బాట పడుతోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం ఆవుల్ని డిజిటల్‌గా కొనుక్కుని, మెయింటెనెన్స్‌ బాదరబందీ లేకుండా, రాబడిని అందుకునే విధంగా గోమిని అనే ఓ స్టార్టప్‌ సంస్థ వినూత్న వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. బిహార్‌కి చెందిన ఈ స్టార్టప్‌ని అర్జున్‌ శర్మ అనే ఔత్సాహిక వ్యాపారవేత్త ప్రారంభించారు. మేలుజాతి దేశీ ఆవుల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మోడర్న్‌ టెక్నాలజీతో ఒక్కో ఆవుకి ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌–ఫంజిబుల్‌ టోకెన్‌)ని సృష్టించి, వాటిని విక్రయిస్తున్నారు. దీనితో అమెరికా, కెనడా, లండన్‌ ఎక్కుణ్నుంచైనా సరే ఇన్వెస్టర్లు ఎన్‌ఎఫ్‌టీలను కొనుక్కోవడం ద్వారా సదరు ఆవులను సొంతం చేసుకోవచ్చు. ఇలా అమ్మిన ఆవుల పోషణ భారాన్ని ఇన్వెస్టర్ల తరఫున ఇక్కడే గోమిని చూసుకుంటుంది. అంతేకాదు వారికి పెట్టుబడి మీద రాబడి కింద ప్రతి నెలా డివిడెండ్‌ మాదిరి రెండు కిలోల స్వచ్ఛమైన నెయ్యిని కూడా పంపిస్తుంది. అది కూడా వారు కొనుక్కున్న ఆవు ఇచ్చిన పాల నుంచి తీసినదే అయి ఉంటుంది. రూ. 15 లక్షల వరకు రాబడి ..ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోవు. సదరు ఆవు సంతతి పెరిగే కొద్దీ మరింత ఆదాయాన్ని కూడా ఇన్వెస్టరు పొందవచ్చు. పాలు, పిడకలు, అగరొత్తులు ఇత రత్రా ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 25% రాబడిని అందుకోవచ్చు. మొత్తం మీద కాస్తంత ఇన్వెస్ట్‌ చేస్తే ఓ ఆవును, దాని జీవితకాలంలో రూ. 15 లక్షలకు పైగా రాబడులు అందుకోవచ్చని శర్మ వివరించారు. సరే, దీనికి ఎన్‌ఎఫ్‌టీలాంటి సంక్లిష్టమైన టెక్నాలజీ హంగులు ఎందుకంటే, కొనుగోలు, ఆ తర్వాత జరిగే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం అంటారు అర్జున్‌ శర్మ. ఈ విధానంలో సిసలైన యజమానిని ధ్రువీకరించే డిజిటల్‌ సరి్టఫికెట్‌ జారీ చేస్తారని తెలిపారు. ఇందులో ఆవు జాతి, వయస్సు, విశిష్ట గుర్తింపు, లొకేషన్, ఆరోగ్యం వివరాలు, రెవెన్యూ షేరింగ్‌ ఒప్పందం వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం బిహార్‌లో కంపెనీకి మూడు క్లస్టర్లు ఉన్నాయి. గో సేవను కేవలం చా రిటీకి పరిమితం చేయకుండా రాబడినిచ్చే లాభ సాటి పెట్టుబడి మార్గంగా మార్చడం వల్ల గో సంరక్షణ వైపు మరింత మంది ఇన్వెస్టర్లను మళ్లించవచ్చనేది అర్జున్‌ శర్మ ఆలోచన. తద్వారా అంతరించిపోతున్న మేలిమిజాతి దేశీ ఆవులను సంరక్షించవచ్చని ఆయన తెలిపారు. ఈ వినూత్న ప్రయత్నానికి నాబార్డ్‌ కూడా తోడ్పాటు అందిస్తోంది. రైతుకు కూడా ప్రయోజనం .. కేవలం ఇన్వెస్టర్ల కోణంలోనే కాకుండా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు శర్మ తెలిపారు. ఫార్మ్‌లను నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. తద్వారా ఇటు గోమాతకి అటు మహిళల ఉపాధికి కూడా తోడ్పాటు అందించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రకాల ప్లాన్లు కూడా ప్రవేశపెట్టారు. రూ. 3,97,000 నుంచి కొనుగోలు చేయొచ్చు లేదా ముందుగా రూ. 30,000 బుకింగ్‌ కింద కట్టి ప్రతి నెలా ఈఎంఐ కింద ఓ 24 నెలలు రూ. 17,500 కట్టేలా కూడా ప్లాన్లను గోమిని అందిస్తోంది. కేవలం నెయ్యితో సరిపెట్టకుండా ఆవు పేడను కూడా మానిటైజ్‌ చేసే పనిలో ఉన్నారు అర్జున్‌ శర్మ. ఒక్క కేజీ పొడి ఆవు పేడతో అగరొత్తుల్లో ఉపయోగించే 1.4 కేజీ పొడిని తయారు చేయొచ్చని, దీనికి మరింత ఎక్కువ విలువ లభిస్తుందని ఆయన చెప్పారు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement