Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

breakdown of Wipro Q2 FY26 results1
విప్రో లాభం ఫ్లాట్‌

ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్‌ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్స్‌ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్‌ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు. హెచ్‌1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..యూఎస్‌ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్‌1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్‌ఆర్‌వో సౌరభ్‌ గోవిల్‌ పేర్కొన్నారు. డిమాండ్‌ ఆధారంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇతర విశేషాలు..2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్‌ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్‌చేసి 4.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

detailed breakdown of Infosys Q2 FY26 performance2
మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు

ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్‌లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.షేరుకి రూ.23 డివిడెండ్‌వాటాదారులకు ఇన్ఫోసిస్‌ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్‌ కాగా నవంబర్‌ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జయేష్‌ సంగ్రాజ్‌కా తెలిపారు.ఇతర విశేషాలుక్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్‌ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.ఈ కాలంలో 3.1 బిలియన్‌ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది. ఆదాయంలో ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్‌ బిజినెస్‌ 8.3 శాతం, కమ్యూనికేషన్స్‌ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి. రిటైల్‌ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్‌ సైన్సెస్‌ 9 శాతం క్షీణించింది.ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.యూరప్‌ బిజినెస్‌ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్‌ వాటా 2.9 శాతమే.ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?

Infosys Founder Narayana and Sudha Murty skip Karnataka caste survey3
కుల గణనలో పాల్గొనబోం

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచి్చన ఎన్యుమరేటర్లతో వారు..‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచి్చన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ..వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్‌ అధికారులు స్పందించలేదు.

Amir Chand Jagdish Kumar Receives SEBI Approval for Rs 550 Crore IPO4
అమీర్‌ చంద్‌ ఐపీవోకు రెడీ

న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్‌ చంద్‌ జగదీష్‌ కుమార్‌(ఎక్స్‌పోర్ట్స్‌) లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది. ఐపీవో నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్‌ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్‌తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీలు కేఆర్‌బీఎల్, ఎల్‌టీ ఫుడ్స్‌సహా సర్వేశ్వర్‌ ఫుడ్స్‌ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Quick commerce major Zepto has raised about 3900 cr5
రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో 

న్యూఢిల్లీ: క్విక్‌కామర్స్‌ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్‌ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్‌పర్స్‌ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్‌ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలీచా తెలిపారు.త్వరలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్‌కామర్స్‌ విభాగంలో బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్‌స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు. విస్తరణపై వ్యయం తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్‌ షీట్‌ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.

Duroflex Mattress files IPO papers with Sebi6
సెబీకి డ్యూరోఫ్లెక్స్‌ ప్రాస్పెక్టస్‌ 

న్యూఢిల్లీ: మ్యాట్రెస్‌ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్‌ తమ పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్‌ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్‌ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్‌.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్‌ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్‌ వాటాపరంగా దేశీయంగా టాప్‌ 3 మ్యాట్రెస్‌ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్‌ బ్రాండ్స్‌ పేరిట మ్యాట్రెస్‌లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్‌ ట్రేడ్‌ స్టోర్స్‌ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది.

Advertisement
Advertisement
Advertisement