Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Know about Russian President Putin car Aurus Senat check full details automobile1
పుతిన్ కారు ప్రత్యేకతలివే..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్‌ మోడల్‌ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్‌-110 లిమోజీన్‌ను పోలి ఉండే రెట్రో డిజైన్‌తో దీన్ని రూపొందించారు.ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలుఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మర్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్‌గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్‌ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు

Over 300 IndiGo flights cancelled across major Indian airports know the reason2
300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కార్యాచరణ, సాంకేతిక సంబంధిత సమస్యల కారణంగా అనేక సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయి ప్రయాణ ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి.భోపాల్‌కు రూ.1.3 లక్షలుఇండిగో కొన్ని విమానాలను రద్దు చేసుకున్న కారణంగా ఎయిర్ ఇండియా అనేక మార్గాల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెంచేసినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్-భోపాల్ మార్గంలో ఎయిర్ ఇండియా ఛార్జీలు దాదాపు రూ.1.3 లక్షలకు చేరుకోవడం ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని సంస్థలు వెల్లడించించిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి భోపాల్‌ వెళ్లే కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌లో రాత్రిపూట టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.ఎకానమీ: రూ. 1.03 లక్షలుబిజినెస్ క్లాస్: రూ. 1.3 లక్షలుఎయిరిండియా పోర్టల్‌లో ఈ అత్యధిక ధరలున్నా కేవలం ఒక సీటు మాత్రమే మిగిలి ఉన్నట్లు చూపించింది.#WATCH | Telangana: Chaos at Rajiv Gandhi International Airport in Hyderabad amid delay in IndiGo flights' movement. pic.twitter.com/U46cyOmJxZ— ANI (@ANI) December 4, 2025ఇండిగో విమానాల రద్దు ప్రభావంహైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఇండిగో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీనితో మిగిలిన విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌లో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. విమానాశ్రయ అథారిటీ సైతం ఈ అంతరాయాలను ధ్రువీకరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. అనేక ఇండిగో విమానాలు ‘విమానయాన సంబంధిత సాంకేతికత, కార్యాచరణ సమస్యల వల్ల రద్దు అయ్యాయి’ అని పేర్కొంది.ఇండిగో ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలను పర్యవేక్షించి ప్రయాణీకుల ఫిర్యాదులను సమీక్షించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..

Sundar Pichai says biggest AI fear that keeps him awake at night3
రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

Rich Dad Poor Dad Robert Kiyosaki Urges Public to Join Network Marketing4
ఇది నేర్చుకుంటేనే బయటపడతారు: కియోసాకి

ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత తాజాగా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.LESSON # 3: How to get richer as global economy crashes.Join a network marketing business.Reasons why a network marketing business will make you richer.AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025

How much estimated cost for India for Putin visit5
రష్యా అధ్యక్షుడి పర్యటన.. మామూలు ఖర్చు కాదు..!!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై అడుగు పెడుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్‌ రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 4న మన దేశానికి వస్తున్నారు. ఇందు కోసం భారత్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.పుతిన్‌ భారత్‌ పర్యటనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మోదీ-పుతిన్ ముఖాముఖి సంభాషణ జరుగుతోంది. దీంతో ఉత్సుకత మరింత పెరిగింది. దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు ఎంత ఖర్చు అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం..రూ.150 కోట్లు!భద్రతాపరమైన కారణాలతో సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయదు. అయినప్పటికీ మీడియా అంచనాలు, గత పర్యటనల వ్యయ నమూనాల ప్రకారం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నిమిత్తం ప్రభుత్వానికి రూ.50 కోట్ల నుండి రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అధికారిక గణాంకాలు విడుదల కానప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది మరింత ఖరీదైన దౌత్య పర్యటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఢిల్లీ స్టార్‌ హోటళ్ల ధరలకు రెక్కలుపుతిన్ పర్యటన కారణంగా న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. దీంతో ఆయా హోటళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చెందిన 4,700 చదరపు అడుగుల 'గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్'లో పుతిన్ ఉంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక తెలిపింది. ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఆయనకు ముందు అధ్యక్షులు జో బైడెన్, బిల్ క్లింటన్ వంటి అగ్రశ్రేణి ప్రముఖులు కూడా గతంలో ఇదే సూట్‌లో బస చేశారు.హై ప్రొఫైల్‌ ప్రతినిధుల రాక, పెరిగిన భద్రతా అవసరాలు కూడా హోటల్ సుంకాలను గణనీయంగా పెంచాయి. రష్యన్ బృందం, ఇతర దౌత్య మిషన్ల డిమాండ్ కారణంగా ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లు రేట్లను ఒక్క రాత్రి బసకు రూ.85వేల నుంచి రూ.1.3 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది.

Green economy to surpass 7 trillion by 2030 WEF6
7 ట్రిలియన్‌ డాలర్లకు గ్రీన్‌ ఎకానమీ

అంతర్జాతీయ గ్రీన్‌ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు) విలువ 2030 నాటికి వార్షికంగా 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అంచనా వేసింది. ఇప్పటికే ఇది 5 ట్రిలియన్‌ డాలర్లను అధిగమించినట్టు తెలిపింది. భారత్‌ పునరుత్పాదక విద్యుత్‌ పరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌తో కలసి రూపొందించిన నివేదికను విడుదల చేసింది.పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థతో ఎన్నో రంగాల్లోని వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరిస్తున్న కంపెనీలు లబ్ది పొందుతున్నట్టు వివరించింది. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల్లోనూ గ్రీన్‌ టెక్నాలజీలపై పెట్టుబడులు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. సంప్రదాయ వ్యాపార మార్గాల కంటే పర్యావరణ అనుకూల వ్యాపార ఆదాయాలు కలిగిన కంపెనీలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక వివరించింది.సంప్రదాయ కంపెనీల కంటే పర్యావరణ అనుకూల వ్యాపారాల ఆదాయాలు రెండు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, అలాగే నిధుల వ్యయాలు కూడా పర్యావరణ అనుకూల వ్యాపార కంపెనీలకు తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. దీంతో ఈ కంపెనీలు 12–15 శాతం అధిక ప్రీమియాన్ని క్యాపిటల్‌ మార్కెట్లలో పొందుతున్నట్టు తెలిపింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీల లాభాలు బలంగా కొనసాగుతాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉండడమే దీనికి కారణమని వివరించింది.పునరుత్పాదక విద్యుత్‌లో భారత్‌ టాప్‌ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9 శాతం పెరుగుతుంటే, 13 శాతం వృద్ధితో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక వెల్లడించింది. చైనాలో వృద్ధి 12 శాతంగా ఉన్నట్టు తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఏటా 10 శాతం వృద్ధి నమోదవుతుందంటూ.. 16 శాతం వృద్ధితో భారత్‌ ముందుంటుందని అంచనా వేసింది. 15 శాతం వృద్ధితో చైనా తర్వాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత్, చైనాలో పర్యావరణ అనుకూల ఇంధనాలపై ఏటా 12 శాతం చొ3ప్పున పెట్టుబడులు పెరిగినట్టు వెల్లడించింది. భారత్‌లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో ‘రెన్యూ’ కంపెనీని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 28 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉన్నట్టు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement