Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rupee Sinks To New Historic Low Against Dollar1
రూపాయికి ఏమైంది?? మళ్లీ రికార్డ్ పతనం..

భారత రూపాయి విలువ మళ్లీ పతనాన్ని చూసింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ .90.57 వద్ద తాజా రికార్డు కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం ముగిసిన రూ .90.41 తో పోలిస్తే భారత కరెన్సీ 14 పైసలు తగ్గింది.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, నిరంతర విదేశీ నిధుల ప్రవాహంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్న కారణంగా గత శుక్రవారం కూడా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 90.49 వద్ద ముగిసింది.రూపాయి పతనానికి ముఖ్యమైన కారణాలుయూఎస్‌‑భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితిఇప్పటివరకు అమెరికా తో వ్యాపార ఒప్పందం పై స్పష్టత రావకపోవడంతో పెట్టుబడిదారుల్లో చాలా అనిశ్చితి నెలకొంది. అత్యధిక టారిఫ్స్, ఒప్పందం ఆలస్యంతో డాలర్‑డిమాండ్ పెరిగింది.విదేశీ నిధుల అవుట్‌ఫ్లోవివిధకాలపు విదేశీ పెట్టుబడి సంస్థలు భారత మార్కెట్ల నుండి పెద్దగా నిధులు ఉపసంహరించుకోవడంతో రూపాయి పనితీరు మీద ఒత్తిడి పెరిగింది. ఈ అవుట్‌ఫ్లోల కారణంగా డాలర్‌ డిమాండ్‌ పెరిగి రూపాయి విలువ తగ్గడం జరిగింది.భారీ దిగుమతులుభారతదేశంలో క్రూడ్ ఆయిల్, ఇతర దిగుమతులు పెరగడం కూడా డాలర్ డిమాండ్‌కు కారణమైంది. ముఖ్యంగా ద్రవ్యమార్కెట్‌లో సరిపడా డాలర్లు లేనప్పుడు సహజంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది.

Gold and Silver rates on 15th December 2025 in Telugu states2
బంగారం, వెండి.. ‘మండే’ ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకెళ్లాయి. రెండు రోజులుగా కాస్త ఉపశమనం ఇచ్చినట్టు కనిపించినా ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) ఒక్కసారిగా ఎగిశాయి. వెండి ధరలు కూడా భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on December 15th 20253
Stock Market Updates: నష్టాల్లో సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 111 పాయింట్లు తగ్గి 25,935కు చేరింది. సెన్సెక్స్‌ (Sensex) 325 పాయింట్లు నష్టపోయి 84,942 వద్ద ట్రేడవుతోంది.🔻అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.4🔻బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 61.4 డాలర్లు🔻యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి.🔻గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.07 శాతం పడింది.🔻నాస్‌డాక్‌ 1.69 శాతం పతనమైంది.Today Nifty position 15-12-2025(time:9:54 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Gold Silver Mutual Funds Start Investing Small4
పసిడి, వెండిపై పెట్టుబడి.. రూ.100 ఉంటే చాలు!

బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా.. యాక్సిస్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ న్యూ ఆఫర్‌.ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది. ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్‌ ఈటీఎఫ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్‌ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో బి.గోపకుమార్‌ తెలిపారు.ఇన్వెస్టర్లు ఈ పథకంలో లంప్‌సమ్‌తో పాటు ఎస్‌ఐపీ మార్గంలోనూ పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ కావడంతో ఇందులో దూకుడుగా స్టాక్‌లను ఎంపిక ఉండదు. అంటే గోల్డ్‌ ఈటీఎఫ్‌, సిల్వర్‌ ఈటీఎఫ్‌ల పనితీరును అనుసరిస్తుంది. అందువల్ల ఫండ్‌ మేనేజర్‌ రిస్క్‌ తక్కువగా ఉండగా, ఖర్చులు కూడా సాధారణంగా నియంత్రిత స్థాయిలోనే ఉంటాయని సంస్థ తెలిపింది.అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీ రేట్లు, డాలర్‌ మారకం విలువ వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి కాబట్టి తక్కువకాలంలో ఊగిసలాటలు ఉండొచ్చు. దీర్ఘకాల పెట్టుబడిదారులు, తమ పోర్ట్‌ఫోలియోలో స్థిరత్వం, వైవిధ్యం కోరుకునేవారికి ఈ పథకం అనుకూలంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్కీమ్‌ సమాచార పత్రం (ఎస్‌ఐడీ)ను జాగ్రత్తగా చదువుకోవడం చాలా అవసరం.

Gold At Rs 1 5 Lakh In 2026 Kotak Forecasts Prices5
బంగారం తులం రూ.1.5 లక్షలకు..

బంగారం ధరలు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరుగు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పసిడి రేటు 10 గ్రాములకు రూ.1.5 లక్షల స్థాయి దిశగా పరుగు కొనసాగించవచ్చని దేశీ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. వెండిపై ఆసక్తి మరింతగా పెరగవచ్చని, కేజీ ధర రూ. 2.1 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. నిఫ్టీ@ 29,000 పాయింట్లు కార్పొరేట్ల ఆదాయాలు మెరుగ్గా ఉంటున్న నేపథ్యంలో 2026 ఆఖరు నాటికి నిఫ్టీ 12 శాతం వృద్ధి చెందవచ్చని, 29,120 పాయింట్లకు చేరొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. మరీ బులిష్‌గా ఉంటే నిఫ్టీ 32,032 పాయింట్లకు ఎగియొచ్చని, బేరిష్‌గా ఉంటే 26,208 పాయింట్లకు తగ్గొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది.‘స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు, దేశీయంగా పెరుగుతున్న పెట్టుబడుల దన్నుతో వచ్చే ఏడాది కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఉద్రిక్తతలు ఎలా ఉన్నప్పటికీ భారతదేశ దీర్ఘకాలిక మార్కెట్‌ వృద్ధి గాథ పటిష్టంగానే ఉంటుంది‘ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎండీ శ్రీపాల్‌ షా తెలిపారు.ఆశావాదం గరిష్ట స్థాయిలో ఉందని, 2025 సవాళ్లతో గడిచినప్పటికీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ సానుకూలంగా తిరిగొస్తారని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో విస్తృత స్థాయి ర్యాలీ లేదని, నిఫ్టీ స్టాక్స్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని షా వివరించారు. మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇంకా ఆల్‌టైం గరిష్ట స్థాయులకు చాలా దూరంలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్‌ వరకు లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఆసక్తి కొనసాగుతుందని, మార్చి తర్వాత నుంచి మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పెరగడం మొదలవుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, బీమా సానుకూలం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ స్టాక్స్‌ సానుకూలంగా ఉన్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.

Stock Market Experts Views and Advice to this week6
ఆటుపోట్లున్నా ముందుకే..! 

గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్‌(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్‌(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్‌ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్‌ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్‌ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్‌ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్‌లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్‌ గరిష్టం 41.68 బిలియన్‌ డాలర్లను తాకింది. నవంబర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్‌లో దిగుమతుల బిల్లు 76 బిలియన్‌ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్‌ విధించిన అదనపు టారిఫ్‌లకుతోడు మెక్సికో సైతం భారత్‌ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్‌ల సమస్యలకు చెక్‌ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్‌ వినియోగ ధరలు, రిటైల్‌ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్‌లుక్‌ తదితర అంశాలు ఫెడ్‌ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్‌ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్‌కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్‌ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.14 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్‌ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్‌), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్‌గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్‌లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్‌లున్నాయ్‌. → సెన్సెక్స్‌ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement