ప్రధాన వార్తలు
ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతుంటారు.రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..
డిజిటల్ గోల్డ్కు అక్షయ తృతీయ మెరుపులు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ, అనలిస్ట్ మానవ్ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు.
రూ.3 లక్షల కోట్లు దాటిన యస్ బ్యాంక్ డిపాజిట్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యస్ బ్యాంక్ నికర లాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 45 శాతం ఎగిసి రూ.1 ,068 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 739 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 9,356 కోట్ల నుంచి రూ. 9,381 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 7,616 కోట్ల నుంచి రూ. 7,650 కోట్లకు పెరిగింది.మొండిబాకీలకు ప్రొవిజనింగ్ 41 శాతం తగ్గి రూ. 187 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్ రుణాల విభాగం దన్నుతో రుణ వృద్ధి 10.7 శాతం మేర పెరిగింది. నికర వడ్డీ మార్చిన్ 2.5 శాతం నుంచి 2.7 శాతానికి మెరుగుపడింది. డిపాజిట్లు రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లకు చేరుకున్నాయి. కొత్త ఎండీ, సీఈవోగా వినయ్ ఎం టోన్సే బాధ్యతలు చేపట్టాక బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని గైడెన్స్కి అనుగుణంగా పటిష్టమైన ఫలితాలతో ముగించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడేళ్లలో మార్జిన్లను 3.25 – 3.50 శాతం స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.నికర వడ్డీ మార్జిన్లు 20 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడినట్లు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం మొండిపద్దులు అత్యంత కనిష్ట స్థాయికి నెమ్మదించాయని పేర్కొన్నారు. మరింత మెరుగైన వృద్ధిని సాధించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ ముందుకు సాగనున్నట్లు వివరించారు.
అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 2025–26 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.29.09 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదిన కార్యకలాపాల ద్వారా ఆదాయం 9.7% పెరిగి రూ.561.32 కోట్ల నుంచి రూ.615.78 కోట్లు చేరింది.టీవీ న్యూస్ రంగంలో ప్రకటనల డిమాండ్ 10 శాతం తగ్గినా, కంపెనీ ప్రకటన ఇన్వెంటరీ 4.5 శాతం పెరగడం ద్వారా పరిశ్రమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఎబిటా రూ.30 కోట్లుగా ఉండగా, ఎబిటా మార్జిన్ 4.9 శాతంగా నమోదైంది. మొత్తం వ్యయాలు 6.47 శాతం పెరిగి రూ.670.89 కోట్లకు చేరాయి. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.155.20 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం సమీకృత ఆదాయం రూ.2,148.46 కోట్లుగా నమోదైంది.‘‘ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ నవంబర్ 14, 2024 నుంచి, స్టూడియో 18 మీడియా డిసెంబర్ 30, 2024 నుంచి అనుబంధ సంస్థల జాబితా నుంచి తప్పుకోవడంతో, 2024–25 ఆర్థిక సంవత్సర గణాంకాలను 2025–26 గణాంకాలతో నేరుగా పోల్చడం సాధ్యం కాదు’’ అని కంపెనీ తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లోనూ కంపెనీ మంచి ఫలితాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించిందని కంపెనీ చైర్మన్ అదిల్ జైనుల్భాయ్ తెలిపారు. సంచలనాల కంటే నిజమైన వార్తలపై దృష్టి పెట్టామన్నారు. కొత్త వ్యాపారాలతో ఆదాయం విభిన్నంగా మారుతోందని, న్యూస్ వ్యాపారాన్ని బలోపేతం చేస్తూనే, విస్తరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు..
పసిడి ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న పర్వదినం అక్షయ తృతీయ (Akshaya Tritiya) వచ్చేసింది. నేడు వారంతపు సెలవు కావడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్ ఉండదు. దీంతో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో (ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు) బంగారం ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 ఉండగా, అది ఏప్రిల్ 19 నాటికి రూ.1,55,780కి చేరుకోవడంతో మొత్తం రూ.3,320 మేర పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏప్రిల్ 13న రూ.1,39,750 ఉండగా, ఏప్రిల్ 19 నాటికి అది రూ.1,42,800కి చేరుకొని వారం రోజుల్లో మొత్తంగా రూ.3,050 మేర పెరుగుదలను నమోదు చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కొత్త ఫోన్: ఒప్పో ఎఫ్33 సిరీస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి.
కార్పొరేట్
రూ.3 లక్షల కోట్లు దాటిన యస్ బ్యాంక్ డిపాజిట్లు
అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
రైలు టికెట్ రహస్యం తెలుసా?
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
జియో ఫైనాన్షియల్ లాభం డౌన్
డిజిటల్ యాడ్స్ డబుల్
మహిళలకు ‘లీడర్షిప్’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ...
కాకమీదున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో క...
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగ...
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పె...
రష్యన్ ఆయిల్.. రయ్ రయ్..
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ రేట్లు పెరగకుం...
భారత్ వృద్ధి వేగవంతం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న...
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?హెచ్సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia)
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
టీసీఎస్ (TCS) నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్ ఐటీ పార్క్లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
పర్సనల్ ఫైనాన్స్
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు
మీ ఈమెయిల్ బాక్స్లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్లాగే కనిపించే నకిలీ సైట్లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్సైట్ అడ్రస్లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్లు, ఎక్స్టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మీ ఫోన్లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు


