ప్రధాన వార్తలు
హ్యాట్రిక్ డౌన్.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) నేడు మూడో రోజూ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు గత ఆరు రోజులుగా రేట్లు పెరుగుదల లేకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు దిగివచ్చాయి. వెండి ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 176 పాయింట్లు తగ్గి 23,994 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 671 పాయింట్లు నష్టపోయి 76,984 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.88బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.33 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.41 శాతం తగ్గింది.నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.Today Nifty position 24-04-2026(time: 10:05 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్ను రూపొందించిన ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు.
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి.
ఇన్ఫోసిస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21% జంప్చేసి రూ. 8,501 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 7,033 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13% బలపడి రూ. 46,402 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,925 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. గైడెన్స్ ఓకే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఆదాయంలో 1.5–3.5 శాతం మధ్య పురోగతిని సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, యుటిలిటీస్, ఏఐ సర్వీసులు దోహదపడగలవని పేర్కొంది. కొత్త ఏడాది పటిష్టంగా ప్రారంభమైనట్లు కంపెనీ తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు కుదురుకుంటున్నాయని తెలియజేసింది. పూర్తి ఏడాదికి గుడ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 29,440 కోట్లను తాకింది. 2024–25లో రూ. 26,713 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం వృద్ధితో రూ. 1,78,650 కోట్లకు చేరింది. ఇతర విశేషాలు...→ క్యూ4లో 3.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ పొందింది. పూర్తి ఏడాదికి 14.9 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్త డీల్స్. → క్యూ4లో 8,440 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,28,594కు పరిమితమైంది. అయితే 2024–25 క్యూ4 సంఖ్య(3,23,578)తో పోలిస్తే 5,016 మంది పెరిగారు. → గతేడాది మొత్తం 20,000 మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ ఎస్. తెలియజేశారు. → ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు జయేష్ వెల్లడించారు. → ఏఐ సంప్రదాయ ఐటీ సర్వీసులు, బీపీవో మోడల్స్కు చెక్ పెడుతున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే ఏఐ ద్వారా ఇతర సర్వీసులు పుంజుకుంటున్నట్లు పరేఖ్ పేర్కొన్నారు. → ప్రస్తుత సీఈవో పరేఖ్ ఐదేళ్ల పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 2% క్షీణించి రూ. 1,242 వద్ద ముగిసింది. కాగా.. యూఎస్ మార్కెట్లో ఇన్ఫీ ఏడీఆర్ 4.5% పతనమై 12.87 డాలర్లను తాకింది.పటిష్ట వృద్ధి ఫైనాన్షియల్, కమ్యూనికేషన్స్, తయారీ విభాగ సర్వీసులతోపాటు.. ప్రాంతాలవారీగా చూస్తే యూరప్లో పటిష్ట వృద్ధి సాధించాం. 2026–27లో ఏఐ సర్వీసులలో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, ఎనర్జీ, యుటిలిటీ, రీసోర్సెస్ విభాగాలలో వృద్ధికి వీలుంది. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్
బిలియనీర్ల హబ్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా చెబుతారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్ఫ్రాంక్ ఈ మేరకు 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్స్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.
కార్పొరేట్
ఇన్ఫోసిస్ లాభం జూమ్
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'
అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!
అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు
ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు
ఇంటింటా ఇండక్షన్ స్టవ్.. ప్రభుత్వం కీలక ఆలోచన!
‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్!
నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్ట...
గోల్డ్ అలర్ట్: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చా...
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో క...
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ...
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత...
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాం...
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాప...
టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వే...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ప్రపంచంలోనే టాప్ కంపెనీకి కొత్త బాస్
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్వేర్ చీఫ్గా జానీ స్రూజీయాపిల్ చిప్ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్ల అభివృద్ధి.డిస్ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్ల తయారీ, ఇంటిగ్రేషన్.
నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
నెలకు రూ. 1.90 లక్షల భారీ జీతం.. కేవలం నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది! ఒక కంపెనీకి అత్యంత కీలకమైన ఉద్యోగి అనిపించుకుని, ఏకంగా 90 శాతం జీతం పెంపు పొందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సైమన్ ఇంగారి అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ పంచుకున్న ఈ ఉదంతం, రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే కౌంటర్ ఆఫర్లను నమ్మి వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కళ్లకు కడుతోంది.కథనంలోకి వెళ్తే.. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో మెరుగైన ఆఫర్ రావడంతో తన ప్రస్తుత సంస్థకు రాజీనామా లేఖ సమర్పించాడు. అప్పటి వరకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న అతనికి, కొత్త చోట రూ. 1.70 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఉద్యోగి రాజీనామాతో షాక్ తిన్న హెచ్ఆర్ విభాగం, అతడిని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ. 1.90 లక్షల జీతం ఇస్తామని 'కౌంటర్ ఆఫర్' ఇచ్చింది. కంపెనీ తనను ఇంతలా గుర్తిస్తోందని మురిసిపోయిన సదరు ఉద్యోగి, తన రాజీనామాను వెనక్కి తీసుకుని పాత సంస్థలోనే ఉండిపోయాడు.అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత కంపెనీ ఆ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతూ లేఖ పంపింది. వ్యాపార లాభాలు తగ్గడం వల్ల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నామని, అందుకే తొలగిస్తున్నామని కంపెనీ కుంటిసాకులు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కొత్తగా ఒక అసిస్టెంట్ను నియమించుకోవడం గమనార్హం. కేవలం రెండు వారాల్లోనే బాధ్యతలన్నీ అప్పగించి వెళ్లిపోవాలని సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఆదేశాలు వచ్చాయని నిర్మొహమాటంగా చెప్పేసింది.ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని ఒక చేదు నిజానికి నిదర్శనం. ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే పెంపుదలలు కేవలం తక్షణ ప్రత్యామ్నాయం దొరికే వరకు చేసే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెంపుతో ఉద్యోగిని ఆపి, ఆ లోపు అతని బాధ్యతలను ఇతరులకు బదిలీ చేసే ప్లాన్ ఇందులో దాగి ఉండవచ్చు. అందుకే, ఒక్కసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాక, కౌంటర్ ఆఫర్లకు లోబడి వెనక్కి తగ్గడం క్షేమం కాదని ఈ కథనం హెచ్చరిస్తోంది.
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్స్క్రిప్షన్ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
కొత్త ఫోన్: ఒప్పో ఎఫ్33 సిరీస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి.
పర్సనల్ ఫైనాన్స్
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.
పింఛను రంగంలో ఎఫ్డీఐ పెంపు!
న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్పీఎస్ ట్రస్ట్ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్పీఎస్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్మార్కింగ్, ఆరు అంకెల హెచ్యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్యూఐడీ నంబర్ (హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్ఫోన్లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా!


