Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Five Smart Maintenance Tips to Extend Your Car Life1
కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు

చాలామంది కష్టపడి కారు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తరువాత మెయింటెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు తప్పులు చేసినా.. ఆలస్యం చేసినా.. తరువాత భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో.. కారు మెయింటెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏవి? అనే విషయం తెలుసుకుందాం.సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలిటైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలిబ్రేక్స్ పనితీరు చెక్ చేసుకోవాలిబ్యాటరీ & ఛార్జింగ్ సిస్టం చెకింగ్ఎయిర్ అండ్ క్యాబిన్ ఫిల్టర్

Can You Take Loan From EPF Account? Know The Rules2
పీఎఫ్‌పై లోన్ తీసుకోవచ్చా?

ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్‌ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

High salary earners getting nudge notices from Income Tax Dept 3
ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!

భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.ఈ అంశాల్లో వ్యత్యాసాలువిదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.డేటా విశ్లేషణతో గుర్తింపుప్రస్తుత అసెస్‌మెంట్ సైకిల్‌లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్‌లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?ఇది డీఐఎన్ నంబర్‌తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్‌తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.ట్యాక్స్‌ పేయర్స్‌ ఏం చేయాలంటే..సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలిపూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలిఅవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలివడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలిఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Adani Group to Invest 100 Billion in AI Ready Data Centres by 20354
అదానీ గ్రూప్‌ అతి భారీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్‌స్కేల్‌ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్, సపోర్టింగ్‌ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. అదానీ గ్రూప్‌ (Adani Group) ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్‌ వినియోగ సామర్థ్యం, ఫైబర్‌ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్‌ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్‌ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్‌ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్‌ తయారీ యూనిట్లు, క్లౌడ్‌ సర్వీసులు, డేటా స్టోరేజ్‌ సొల్యూషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, నిర్మాణ, ఇంజినీరింగ్‌ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్‌ను గ్లోబల్‌ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Reliance to invest Rs 10 trillion in AI over next 7 years Mukesh Ambani5
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన

భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్‌ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్‌ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్‌ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్‌ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్‌ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్‌ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్‌నగర్‌లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్‌ సంఘటన

PM Narendra Modi Unveils MANAV Vision at India AI Impact Summit 20266
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

Advertisement
Advertisement
Advertisement