Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Tech Giants Double Standards Transparency vs Exploitation1
‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.కోట్లలో డౌన్‌లోడ్‌లు.. వందల కోట్లలో ఆదాయం!టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్‌డ్రెస్ లేదా న్యూడిఫై యాప్‌లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్‌లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్‌ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్‌లో 18, గూగుల్ ప్లే స్టోర్‌లో 20 ఇలాంటి యాప్‌లను పరిశోధకులు గుర్తించారు.సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!వినియోగదారులు యాప్‌ స్టోర్‌ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్‌లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్‌ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్‌లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.నిబంధనలు ఏం చెబుతున్నాయి?యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్‌ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్‌లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్‌లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్‌వేర్‌లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడినగ్నత్వ యాప్‌ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?బ్లూమ్‌బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్‌లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్‌లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్‌లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు

Bindi Ban Hijab Allowance Lenskart Sparks Social Media Firestorm2
సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌.. సీఈఓ వివరణ

ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొంటోంది. కంపెనీకి చెందిన ‘స్టాఫ్ యూనిఫాం అండ్ గ్రూమింగ్ గైడ్’ పేరుతో వైరల్ అవుతున్న ఒక డాక్యుమెంట్ మతపరమైన వివక్షకు తావిచ్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకంపై నిషేధం విధిస్తూ హిజాబ్‌కు అనుమతినివ్వడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వివాదం ముదరడంతో సంస్థ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.వివాదానికి కారణం ఏమిటి?ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం.. లెన్స్‌కార్ట్ అంతర్గత మార్గదర్శకాల్లో స్టోర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని వివాదాస్పద నిబంధనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు నలుపు రంగు హిజాబ్, అలాగే సిక్కు ఉద్యోగులు నల్లటి తలపాగాలను ధరించవచ్చని గైడ్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు బిందీలు (స్టిక్కర్లు) పెట్టుకోకూడదని, పురుషులు లేదా మహిళలు ఎవరూ మతపరమైన తిలకం లేదా టిక్కా ధరించకూడదని నిబంధనలు స్పష్టం చేశాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బిందీ, తిలకాలను నిషేధించి ఇతర మతపరమైన గుర్తులను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.I want to speak directly that this document does not reflect our present guidelines.Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…— Peyush Bansal (@peyushbansal) April 15, 2026పీయూష్ బన్సాల్ సంజాయిషీఈ వివాదంపై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన కంపెనీ సీఈఓ పీయూష్ బన్సాల్, వైరల్ అవుతున్న పత్రం తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. ‘మా వస్త్రధారణ విధానం సంవత్సరాలుగా మారుతూ వస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్నది పాత డాక్యుమెంట్‌. ఇది మా కంపెనీ ప్రస్తుత వైఖరిని ప్రతిబింబించదు. బిందీ లేదా తిలకం ధరించడంపై మా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దీనివల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఆయన వివరించారు.

BBC Announces Historic Job Cuts 2000 Employees to Be Laid Off3
బీబీసీలో 2,000 మంది ఉద్యోగులపై వేటు!

ప్రపంచ ప్రఖ్యాత ప్రసార సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఈ సంస్థ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దాదాపు 500 మిలియన్ పౌండ్ల (677 మిలియన్‌ డాలర్లు) వార్షిక బడ్జెట్‌లో 10 శాతం మేర పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.దశాబ్ద కాలంలోనే భారీ కోతలుబీబీసీ చరిత్రలో గత పదేళ్ల కాలంలో ఇవే అతిపెద్ద తొలగింపులు. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి తల్ఫాన్ డేవిస్ సిబ్బందికి పంపిన ఈమెయిల్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఈ నిర్ణయం సిబ్బందిలో అనిశ్చితిని సృష్టిస్తుందని నాకు తెలుసు. కానీ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల మేము పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాం’ అని డేవిస్ పేర్కొన్నారు.కారణాలు ఏమిటి?అదుపులో లేని ద్రవ్యోల్బణం.లైసెన్స్ ఫీజు, వాణిజ్య ఆదాయంపై పెరిగిన ఒత్తిళ్లు.ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ.నాయకత్వ మార్పుగత జనవరి 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎడిటింగ్‌లో జరిగిన పొరపాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ ఇప్పటికే బీబీసీపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయడం సంస్థకు మరింత తలనొప్పిగా మారింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాట్ బ్రిటిన్ వచ్చే నెలలో కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1, 2027 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో మరింత కఠినమైన పొదుపు చర్యలు ఉంటాయని సంస్థ సంకేతాలిచ్చింది.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు

Gold and Silver rates on 16 April 2026 in Telugu states4
కాకమీదున్న పసిడి ధరలు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్‌లో పెరిగిన పసిడి ధరలు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 16 April 20265
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.93బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 94.9 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.8 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Self Driving Cars: Who Is Liable When AI Takes the Wheel?6
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ప్రమాదానికి బాధ్యులెవరు?

సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్‌లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్‌ డ్రైవర్‌ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.బాధ్యత ఎవరిది? డ్రైవర్‌దా లేక సాఫ్ట్‌వేర్‌దా?సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్‌ ఎర్రర్‌) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్‌పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్‌దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్‌వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్‌వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానంసెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్‌లో ఉందా లేక అటానమస్ మోడ్‌లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుత కంపెనీల విధానాలుసైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్‌కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.భారత్‌లో పరిస్థితి ఏమిటి?భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్‌) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్‌లు సెటిల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!

Advertisement
Advertisement
Advertisement