Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India retail market set to reach Rs 21. 5 lakh crore by 20351
రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: దేశ రిటైల్‌ మార్కెట్‌ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్‌ మార్కెట్‌ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్‌ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. భారత రిటైల్‌ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్‌ మార్కెట్‌లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. టెక్నాలజీ పాత్ర కీలకం.. ‘‘భారత రిటైల్‌ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్‌సింఘి తెలిపారు. ఏజెంటింక్‌ కామర్స్‌ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్‌ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్‌ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్‌ కామర్స్‌ ప్రభావితం చేస్తోంది. భారత్‌లో డిజిటల్‌ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్‌ జెడ్‌లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్‌నర్‌ భారత్‌ మిమానీ తెలిపారు. ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్‌ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్‌ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ అభిప్రాయపడ్డారు.

Wholesale price inflation rises to 9-month high of 1. 81percent in January2
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్‌ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81 శాతానికి ఎగబాకింది. డిసెంబర్‌ 2025లో ఇది కేవలం 0.83 శాతంగా ఉండగా.. ఒక్క నెల వ్యవధిలోనే 1%‡ పెరగడం గమనార్హం. నవంబర్‌లో మైనస్‌లో ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది. ఎందుకింతలా పెరిగింది? ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోలి్చతే ఈసారి ’బేసిక్‌ మెటల్స్‌’ (లోహాలు), టెక్స్‌టైల్స్‌ (వ్రస్తాలు), రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో, అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశముంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగసింది. రంగాలవారీగా పరిస్థితి ఇలా.. టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86 శాతానికి చేరింది. ప్రధానంగా లోహాలు, వ్రస్తాలు, రబ్బరు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువులు విభాగంలో ద్రవ్యోల్బణం 2.21 శాతంగా నమోదైంది. డిసెంబర్‌తో పోలి్చతే (3.12%) ఇది కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి. సామాన్యుడికి నేరుగా సంబంధమున్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో సున్నా (0.00%) వద్ద ఉండగా, జనవరి నాటికి 1.41 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, విద్యుత్‌ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్‌ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచి్చంది. ఇందులో ద్రవ్యోల్బణం –4.01 శాతం (మైనస్‌)గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. గత మూడు నెలల ట్రెండ్‌.. టోకు ధరల సూచీ గమనాన్ని గమనిస్తే.. స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్‌ 2025: –0.13% (ధరల తగ్గుదల) డిసెంబర్‌ 2025: 0.83% (స్వల్ప పెరుగుదల) జనవరి 2026: 1.81% (భారీ పెరుగుదల) నవంబర్, డిసెంబర్‌ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్‌ రేటును –0.13 శాతంగా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు.

Massive Google, Amazon, Microsoft Layoffs Baba Vanga AI Prediction 20263
డేంజర్‌లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?

పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్‌బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు.

Tata AIA Old Bridge Mutual Fund Roll Out New Fund Offers4
మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘కొత్త’ ఆఫర్స్‌!

ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్‌ కొత్తగా ఎన్హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్, ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ పెన్షన్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్‌ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్‌ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్‌ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్‌ బ్రిడ్జ్‌ ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్‌ లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఈ ఫండ్‌ని ఓల్డ్‌ బ్రిడ్జ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్‌–అప్‌ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్‌. కనీసం రూ. 5,000 నుంచి, సిప్‌ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కేవలం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.

AI May Almost Completely Replace IT, BPO Jobs Says Vinod Khosla5
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

Jio Targets Top AI Talent at India AI Impact Summit 20266
జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!

ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్‌ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్‌ అగర్వాల్‌ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్‌లోనే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.బెంగళూరుకు చెందిన గౌరవ్‌ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.తాజా అప్డేట్‌లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్‌మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్‌ అగర్వాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, మెటా ఛీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ అలెగ్జాండర్‌ వాంగ్‌, టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌ తదితరులు ఉన్నారు.Unsurprisingly, I am at the AI Summit this entire week with folks from my team and colleagues. Come visit us - we are all excited to share a glimpse of what all is cooking in our kitchen!Divided by companies, United by Mission - Let's build AI for Bharat 🙏 pic.twitter.com/eg7QDCDEVZ— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026

Advertisement
Advertisement
Advertisement