ప్రధాన వార్తలు
వాణిజ్య గ్యాస్ ధరల పెంపు
చమురు కంపెనీలు ఫిబ్రవరి 1, ఆదివారం నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.49 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,740.50కు చేరుకుంది. అయితే గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.రంగాలపై ప్రభావంగతంలో కమర్షియల్ గ్యాస్ ధరల తగ్గింపుతో ఊపిరి పీల్చుకున్న ఆతిథ్య, క్యాటరింగ్ రంగాలు తాజా పెంపుతో మళ్లీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరగడం వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య గ్యాస్పై ఆధారపడే టీ స్టాళ్లు, స్వీట్ షాపులపై ఈ ప్రభావం నేరుగా పడుతుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె..
కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. ప్రత్యేకతలివే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో తన తొమ్మిదో బడ్జెట్ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ సమీకరణాల నడుమ ఈ చీర ప్రత్యేక చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరను ధరించడం ద్వారా ఆ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పిటన్లవుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న గౌరవాన్ని చాటడానికి ఇదొక సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంజీవరం చీర ప్రత్యేకతలు..కాంజీవరం చీరలను దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఇందులో వాడే జరిలో వెండి తీగపై బంగారు పూత ఉంటుంది. దీనివల్ల చీర చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందులో చీర, అంచు విడివిడిగా నేస్తారు. తర్వాత చాలా బలంగా వాటిని ‘కోర్వాయ్’ పద్ధతిలో జత చేస్తారు. ఒకవేళ చీర చిరిగినా అంచు మాత్రం చీర నుంచి విడిపోకుండా జాగ్రత్తపడుతారు.మూడు దారాల కలయికసాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మూడు పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె..
సండే స్టాక్ మార్కెట్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఆదివారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి.యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్దర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IKIO టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
బడ్జెట్కు ముందు రాష్ట్రపతిని ఎందుకు కలవాలి?
దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్కు తుది ఆమోదం పొందుతారు.#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary 'dahi-cheeni' (curd and sugar) ahead of her ninth consecutive Union Budget presentation. pic.twitter.com/WouiznFEMr— ANI (@ANI) February 1, 2026ఏంటి ఈ ‘డిజిటల్ బహీ-ఖాతా’?బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న ‘లెదర్ బ్రీఫ్కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ 2019లో నిర్మలా సీతారామన్ ‘బహీ-ఖాతా’ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎర్రటి వెల్వెట్ క్లాత్తో చేసిన బ్యాగ్. దీనిపై బంగారు రంగులో మన జాతీయ చిహ్నం (అశోక చక్రం) ముద్రించి ఉంటుంది. 2021 నుంచి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ను పేపర్లెస్గా మార్చారు. ఇప్పుడు ఆ ఎర్రటి బహీ-ఖాతా లోపల కాగితపు పత్రాలకు బదులుగా ఒక డిజిటల్ టాబ్లెట్ ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె..
బంగారం, వెండి ధరల్లో ఊహకందని మార్పు!
భారతదేశంలో బంగారం ధరలు వారం ప్రారంభంలో భారీగా పెరిగి.. వారాంతంలో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఎంత తగ్గాయి?, ఎంత పెరిగాయనే.. విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.జనవరి 25న 1,60,260 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. జనవరి 31న 1,60,580 రూపాయల వద్దకు చేరింది. వారాంతంలో గోల్డ్ రేటు భారీ తగ్గినప్పటికీ.. సోమవారం నుంచి శనివారం వరకు రూ. 3,200 పెరిగినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 1,46,900 రూపాయల నుంచి 1,47,200 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 3,000 పెరిగింది.చెన్నైలో సోమవారం (జనవరి 25) రూ. 1,59,490 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. శనివారం నాటికి రూ. 1,62,550 రూపాయల వద్దకు (3060 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,47,500 నుంచి రూ. 1,49,000లకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?ఢిల్లీలో వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయనే విషయానికి వస్తే.. జనవరి 25న 1,60,410 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం.. జనవరి 31 నాటికి 1,60,730 రూపాయల వద్దకు (3200 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు 1,47,050 రూపాయల నుంచి 1,47,350 రూపాయల వద్దకు (రూ.3000 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. జనవరి 25న రూ.3.65 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జనవరి 31 నాటికి రూ. 3.20 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కేజీ ధర 45000 రూపాయలు తగ్గిందన్న మాట.
బడ్జెట్ రచయితలు వీరే..
భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తున్న మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్ రూపకల్పన వెనుక ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఒక శక్తివంతమైన అధికారుల బృందం గత కొన్ని నెలలుగా శ్రమించింది.బడ్జెట్ వెనుక ఉన్న వ్యక్తులునిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి): బడ్జెట్ రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తూ భారత ఆర్థిక విధానాలను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్న నాయకురాలు.అనురాధ్ ఠాకూర్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి): బడ్జెట్ తయారీలో ఈమె అత్యంత కీలక పాత్ర పోషించారు. వనరుల కేటాయింపు, వృద్ధి ప్రాధాన్యతలు, బడ్జెట్ పత్రాల తుది రూపకల్పనలో ఈమెది ప్రధాన నిర్ణయం.ఆర్వింద్ శ్రీవాస్తవ (రెవెన్యూ కార్యదర్శి): బడ్జెట్లోని పన్నుల ప్రతిపాదనల బాధ్యతను ఈయన పర్యవేక్షించారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాల మార్పులపై కీలకంగా వ్యవహరించారు.ఉమ్లున్మాంగ్ ఉల్నమ్ (వ్యయ కార్యదర్శి): ప్రభుత్వ ఖర్చులు, వివిధ పథకాలకు సబ్సిడీల కేటాయింపులను సమన్వయం చేస్తూ నిధుల దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించారు.ఎం.నాగరాజు (ఆర్థిక సేవల కార్యదర్శి): బ్యాంకింగ్ రంగం బలోపేతం, బీమా, పెన్షన్ వ్యవస్థల వృద్ధిపై దృష్టి సారించారు.అరునిష్ చావ్లా (దీపమ్ కార్యదర్శి): ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.కె.మోసెస్ చాలై (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి మూలధన వ్యయాన్ని పర్యవేక్షించారు.వి.అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశీయ వృద్ధి రేటు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.ప్రధాన లక్ష్యాలు.. వ్యూహాలుఈ బడ్జెట్ ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు నియంత్రణ మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి సారించనుందని అంచనాలున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగ సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కార్పొరేట్
జియో-బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్
ఓవర్టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..
ఎన్బీఎఫ్సీ బంగారం రుణాలు పెరుగుదల
యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్ జట్టు
రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి
వింగ్స్ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం
30 బోయింగ్ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..
కమర్షియల్ విమానాలు మూడు రెట్లు వృద్ధి
‘సెప్టెంబర్ నుంచి మేడిన్ ఇండియా సీ295ల డెలివరీ’
మార్కెట్లోకి బిగ్బాస్ ఎంట్రీ
న్యూఢిల్లీ: దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నేష...
మెటల్స్ క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ మధ్య ఇన...
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు...
త్వరలో బడ్జెట్.. నష్టాల్లో మార్కెట్!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
న్యూయార్క్ బడ్జెట్.. ‘టూ’ డిఫరెంట్!
న్యూయార్క్ సిటీ బడ్జెట్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా...
8 బడ్జెట్లు.. 8 చీరలు.. దేని స్పెషాలిటీ దానిదే!
కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున ...
బంగారం ఇకపైనా ఇలాగేనా? ఆర్థిక సర్వే ఏం చెప్పింది?
గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్...
రేపటి బడ్జెట్ లీకైందా? సోషల్ మీడియాలో వైరల్
కేంద్ర బడ్జెట్ 2026-27 (Union Budget 2026-27) మరిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
హాయ్ ఫ్రెండ్స్... ఇన్స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్ఫాంలలో కొత్త చెల్లింపు సబ్స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్లను పరీక్షించనున్నట్లు మెటా టెక్క్రంచ్కు ధ్రువీకరించింది.మెటా ప్రకారం.. ప్రతి యాప్కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఈ సబ్స్క్రిప్షన్లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్ను మెటా యాప్లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్స్క్రిప్షన్గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మానస్ ఏఐ షార్ట్కట్ను జోడించే పనిలో మెటా ఉంది.అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్ను ఫ్రీమియం మోడల్కు మార్చే యోచనలో మెటా ఉంది.ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.కాగా ఈ కొత్త సబ్స్క్రిప్షన్లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్స్క్రిప్షన్లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి.
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.
ఈ-గేమింగ్ రంగంలో నియామకాలు భళా!
భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.కోర్ డెవలప్మెంట్కు క్రేజ్ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్మెంట్ హబ్గా మారుతోంది. ఇన్స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్స్టాహైర్ అంచనా వేసింది.నియంత్రణలతో భరోసా‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్సింథసిస్ సర్వే తెలిపింది.ప్రతిభను వదులుకోని కంపెనీలుఆర్ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్లోని ఇతర ఏడు ప్లాట్ఫారమ్ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
పర్సనల్ ఫైనాన్స్
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..



