Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Finance Minister Nirmala Sitharaman comments on tariffs cut1
టారిఫ్‌ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..

భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.‘మేడిన్‌ ఇండియా ఉత్పత్తులకు గుడ్‌ న్యూస్‌. ఇక వాటిపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్‌ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్‌ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్‌లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్‌ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై (ఎఫ్‌అండ్‌వో) సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్‌అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్‌కి ‘చాలా మంచి‘ డీల్‌ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Vedanta Chairman Anil Agarwal announced will donate 75 percent of his wealth2
వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

వేదాంత గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సంపదలో 75 శాతాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అనిల్‌ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు. అనిల్‌ అగర్వాల్‌కు ఇద్దరు సంతానం కుమారుడు అగ్నివేష్ అగర్వాల్‌, కూతురు ప్రియా అగర్వాల్‌(2013లో ఆకాష్‌ హెబ్బర్‌ను వివాహం చేసుకున్నారు). అనిల్‌ మొత్తం నెట్‌వర్త్‌ సుమారు రూ.3.66 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో తన వ్యక్తిగత సంపదను దానం చేసేందుకు సిద్ధమయ్యారు.ప్రధానితో భేటీ.. ఒక భావోద్వేగ ప్రయాణంఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా జరిగిన ‘గ్లోబల్ ఎనర్జీ లీడర్స్’ రౌండ్ టేబుల్ సమావేశంలో అనిల్ అగర్వాల్ పాల్గొన్నారు. తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపిన చొరవను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ తన మనోభావాలను పంచుకున్నారు.‘మా కుటుంబంలో విషాదం తర్వాత నేను హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. వ్యక్తిగత నష్టంతో కుంగిపోయిన మాకు ప్రధానమంత్రి మోదీ అందించిన ఓదార్పు, సానుభూతి వెలకట్టలేనివి. ఆయన మాటలు నాకు, నా భార్యకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అని అగర్వాల్ పేర్కొన్నారు.కుమారుడి ఆశయ సాధనే లక్ష్యం..అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కేయింగ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమారుడి కోరికలకు అనుగుణంగానే ఈ దాతృత్వ నిర్ణయం తీసుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.ఇకపై తాను వ్యాపార ప్రమోటర్‌గా కాకుండా కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తానని అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. వ్యాపార నియంత్రణ కంటే సామాజిక ప్రభావానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ప్రధాని పరామర్శతీవ్ర దుఖంలో ఉన్న అగర్వాల్ దంపతులను ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరారు. ‘మీరు దృఢంగా ఉండాలి. మీ పనిని కొనసాగించాలి. అది దేశానికి చాలా ముఖ్యం’ అని ప్రధాని ఇచ్చిన సలహా తమకు ఎంతో ఊరటను ఇచ్చిందని అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల బాధలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునే నాయకుడు ఉండటం అదృష్టమని ఆయన ప్రశంసించారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

India has become the largest hotspot for GCCs3
జీసీసీలకు హాట్‌స్పాట్‌గా భారత్‌

అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) ఆకర్షణీయ కేంద్రంగా భారత్‌ స్థానం మరింత బలపడనుంది. 2024 చివరికి దేశవ్యాప్తంగా 1,700 జీసీసీలు ఉంటే, 2030 నాటికి వీటి సంఖ్య2,400కు పెరుగుతుందని ఫిక్కీ, అనరాక్‌ సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వీటి మార్కెట్‌ పరిమాణం 64 బిలియన్‌ డాలర్ల నుంచి 110 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని తెలిపింది. 2024 నాటికి జీసీసీలు 19 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పించగా, 2030 నాటికి 28 లక్షల మంది నిపుణులకు పెరుగుతుందని అంచనా వ్యక్తం చేసింది. దేశంలో జీసీసీల మార్కెట్‌ గత కొన్నేళ్లలో ఎంతో వేగంగా పెరిగినట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి పేర్కొన్నారు.‘కీలకమైన ఐటీ/ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌ సైన్సెస్, ఇంజనీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) రంగాల నుంచి డిమాండ్‌ పెరగడం జీసీసీల వృద్ధికి ఇంధనంగా నిలుస్తోంది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగొచ్చు. భారత జీసీసీ మార్కెట్‌ ఏటా 10 శాతం చొప్పున కాంపౌండెడ్‌గా పెరుగుతూ 2030 నాటికి 105–110 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు’ అని అనుజ్‌ పురి తెలిపారు. టైర్‌–2 నగరాలకూ విస్తరణదేశంలో జీసీసీల కార్యకలాపాలు టాప్‌–7కు వెలుపలి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నట్టు ఫిక్కీ–అనరాక్‌ నివేదిక తెలిపింది. జైపూర్, ఇందోర్, సూరత్, కోచి, కోయింబత్తూర్‌ పట్టణాల్లోనూ జీసీసీలు ఏర్పాటువుతున్నట్టు పేర్కొంది. ‘‘మూడు దశాబ్దాలుగా భారత ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిర్వహణను ఖర్చుగానే చూసే వారు. కానీ, ఇప్పుడు ఇదొక కీలక చోదకం. అంతర్జాతీయ పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు కేంద్రాలుగా మారుతున్నాయి. భారత యువతకు ఎంపికలుగా మారుతున్నాయి’’అని ఫిక్కీలో పట్టణాభివృద్ధి, రియల్‌ ఎస్టేట్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న రాజ్‌ మెండ తెలిపారు. దేశంలోని టాప్‌–7 నగరాల్లో 800 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ వసతులు ఉన్నాయని.. సగం మేర బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే ఏర్పాటైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2025లో నికర వినియోగం 58 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ కాగా, స్థూల లీజింగ్‌ 80 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో జీఐ ఔట్‌సోర్సింగ్‌ జీసీసీ అకౌంట్స్‌ ఔట్‌సోర్సింగ్, నాలెడ్జ్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ జీఐ ఔట్‌సోర్సింగ్‌ తాజాగా హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ని ప్రారంభించింది. కోవసెంట్‌లో భాగమైన ఎనేబ్లర్‌తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 50 మంది సిబ్బంది ఉండగా వచ్చే 12 నెలల్లో ఇది 100కి పెరగనున్నట్లు గ్రూప్‌ సీఈవో తారిఖ్‌ హుసేన్‌ తెలిపారు. 2028 నాటికి మరో 100 మందిని తీసుకోనున్నట్లు వివరించారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ప్రస్తుతం తమకున్న కార్యకలాపాలకు ఈ సెంటర్‌ అనుబంధంగా ఉంటుందని హుసేన్‌ వివరించారు. గ్లోబల్‌ క్లయింట్లకు ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ అందించే క్రమంలో ఏఐ ఆధారిత జీసీసీని ఏర్పాటు చేయడంలో జీఐ ఔట్‌సోర్సింగ్‌కి తోడ్పాటు అందించినట్లు కోవసెంట్‌ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Key Details of Google Bengaluru Expansion4
భారత్‌లో గూగుల్ భారీ విస్తరణ.. 20,000 మందికి ఉద్యోగాలు!

అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విదేశీ సిబ్బందిని అమెరికాకు పిలిపించుకునే బదులు ప్రతిభ ఉన్న చోటికే తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో గూగుల్ భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది.బెంగళూరులో భారీ క్యాంపస్బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు టవర్లలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉండబోతోందని ప్రాథమిక సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 20,000 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. భారత్‌లో ప్రస్తుతం గూగుల్‌కు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్‌తో గూగుల్ ఇండియా తన సిబ్బంది సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. 6.5 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. మిగిలిన రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతాయని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.వీసా ఆంక్షలే వరంగా..అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న మార్పులు భారతీయ ఇంజినీర్లకు వరంగా మారాయి. యూఎస్‌ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు కంపెనీలు దాదాపు 1,00,000 డాలర్లు (సుమారు రూ.91 లక్షలు) వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీసా అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే భారత్‌లోనే స్థానిక బృందాలను నిర్మించడం కంపెనీలకు లాభదాయకంగా మారుతుంది. మానవ వనరులను అమెరికాకు తరలించే ఖర్చు తగ్గడమే కాకుండా, భారతీయ నైపుణ్యాన్ని తక్కువ వ్యయంతోనే వినియోగించుకునే వీలు కలుగుతోంది.ఏఐ రేసులో భారతే కీలకంప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన విభాగాల్లో వందలాది పోస్టుల కోసం గూగుల్ నియామకాలు చేపడుతోంది. గూగుల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి సంస్థలు కూడా భారత్‌లో తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ దిగ్గజ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరగడం గమనార్హం. ఇది గత మూడేళ్లలో అత్యధిక వృద్ధి.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

French prosecutors raided Elon Musk X in Paris check details5
తీవ్ర నేరారోపణలు.. సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ సోదాలు

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్‌ ఆధారిత కంటెంట్‌పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్‌ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్‌ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్‌ఫేక్‌(రియల్‌ ఇమేజ్‌లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్‌బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్‌ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్‌పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Sam Altman testing Codex app for Mac he felt little useless know the reason6
ఏఐ సృష్టికర్తకే తప్పని అభద్రతా భావం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ తన సొంత ఉత్పత్తిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంప్యూటర్ల (మ్యాక్‌) కోసం ఓపెన్‌ఏఐ కొత్తగా ‘కోడెక్స్’ స్టాండలోన్ యాప్‌ను విడుదల చేసిన తరుణంలో ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల కోడెక్స్ టూల్‌ను ఉపయోగించి ఆల్ట్‌మాన్ స్వయంగా ఒక అప్లికేషన్‌ను రూపొందించారు. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పుల కోసం ఏఐని సలహాలు అడగగా అది ఇచ్చిన ఐడియాలు ఆయన ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఎక్స్‌(గతంలో ట్విట్టర్)లో పేర్కొంటూ.. ‘ఏఐ ఇచ్చిన ఐడియాలు చూసిన సమయంలో నేను కొంచెం పనికిరాని వాడినని (Useless) భావించాను. అది నన్ను కొంత విచారానికి గురిచేసింది’ అని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక ఏఐ సృష్టికర్త తాను చేసిన యాప్‌ ఇచ్చిన సమాధానం చూసి అభద్రతకు లోనవ్వడం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కోడెక్స్ మాక్ యాప్ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఈ కొత్త మాక్ యాప్ డెవలపర్ల పనితీరును పూర్తిగా మార్చేయనుంది. దీని ప్రత్యేకతలు గమనిస్తే.. ఒకేసారి ఒక చాట్‌బాట్‌తో కాకుండా సమాంతరంగా ఒకటి కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్లతో పని చేయవచ్చు. కోడింగ్ కష్టాలను తగ్గించి డెవలపర్లు తమ ఆలోచనలను సులభంగా అమలు చేసేలా ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ఏఐ ఏజెంట్లు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారు తరఫున కోడ్ రాయడం, దాన్ని మెరుగుపరచడం, ఇమేజ్ జనరేషన్ వంటి పనులను కూడా చేయగలవు.మార్కెట్‌లో పెరుగుతున్న పోటీగత నెలలో దాదాపు ఒక మిలియన్ మంది డెవలపర్లు కోడెక్స్‌ను ఉపయోగించినట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఆంత్రోపిక్, కర్సర్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో యాపిల్ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక యాప్‌ను తీసుకురావడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.వినియోగదారులకు బంపర్ ఆఫర్ప్రస్తుతం కోడెక్స్ సేవలు ఓపెన్‌ఏఐ ప్లస్, ప్రో, ఎంటర్‌ప్రైజ్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కొత్త యాప్ విడుదల సందర్భంగా ఉచిత వినియోగదారులకు కూడా పరిమిత కాలం పాటు కోడెక్స్ యాక్సెస్‌ను కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఉన్న పెయిడ్ యూజర్లకు రేట్ లిమిట్స్ రెట్టింపు చేసింది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement