Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gurugram Based Founder Fires Employee After Work From Home Request1
WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్

కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గురుగ్రామ్‌కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్‌లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్‌ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్‌లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు.

Are You Working for Money or Making Money Work for You Kiyosaki Quote2
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. ➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. ➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!

Reliance Retail Becomes Hectacorn3
‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్

రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్‌అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్‌కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.ఈ రిపోర్ట్‌లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి.

4 Day Work Week and No Fixed Hours A New Standard for Corporate Culture4
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..

కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.ఒక్క మెసేజ్‌తో మొదలైన చర్చ'స్పైసీ మార్గరిటా' అనే ఎస్‌ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు."నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.బర్న్ అవుట్ నేర్పిన పాఠంతానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలువారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్‌ను దాటవేసే స్వేచ్ఛ.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుబెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.బెన్ గూడీ నేపథ్యంలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్‌గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు.

Oracle Hires CFO With 29 7M Dollars Deal After Cutting 30000 Jobs5
ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!

ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్‌ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్‌కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.హిలరీ మ్యాక్సన్‌ ఒరాకిల్‌లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్‌లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.కంపెనీ భారీ లేఆఫ్స్ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్‌లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!

Post Office Schemes Offer High Returns latest Interest Rates6
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్‌తో కూడిన స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్‌ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్‌కమ్‌మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement