Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mercedes Benz Cars To Get Costlier By 2 Percent 1
రెండోసారి పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో విక్రయించే తమ వాహనాలపై 2 శాతం ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.2026 ప్రారంభమైన తరువాత బెంజ్ కంపెనీ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండో సారి. సంస్థ జనవరిలో కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ఫారెక్స్‌లో అస్థిరత మరియు వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు కారణమని పేర్కొంది.ధరల పెరుగుదల C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE క్యాబ్రియోలెట్ వంటి కార్ల మీద మాత్రమే కాకుండా కొత్తగా ప్రారంభించిన V-క్లాస్ వంటి మోడళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

NSE Finalises 20 Merchant Bankers2
మర్చంట్‌ బ్యాంకర్ల ఎంపిక.. ఎన్‌ఎస్‌ఈ ఐపీవో సన్నాహాలు

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్‌ ఎక్స్చేంజ్ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా 20 మర్చంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసింది. అంతేకాకుండా పలు లా, ఇంటర్మీడియెరీ సంస్థలను సైతం ఎంపిక చేసుకుంది. శ్రీనివాస్‌ ఇంజేటి అధ్యక్షతన ఎన్‌ఎస్‌ఈ ఐపీవో కమిటీ ఇందుకు అనుమతించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఎస్‌ఈ బోర్డ్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీవోపై ముందుకెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజా ఎంపికలను చేపట్టింది. ఎంపికైన మర్చంట్‌ బ్యాంకర్లలో కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్‌ క్యాపిటల్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ తదితరాలున్నాయి.

No Ticket Booking on March 14 and 15 Indian Railways Know the Reason3
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!

కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్‌ఎస్ సిస్టమ్‌తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్‌లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్‌కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.PRS అంటే?PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్‌కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు.

Infosys Expansion of Mohali Development Center4
ఇన్ఫోసిస్‌ మొహాలీ క్యాంపస్‌ విస్తరణ

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. మొహాలీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (డీసీ)ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్‌ తదితర రంగాల్లో గ్లోబల్‌ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్‌ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ ఉపయోగపడుతుందని వివరించింది.కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్‌వో జయేష్‌ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్‌లో ఇన్ఫికి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Robert Kiyosaki Warns Market Crash Is Accelerating Urges Investment in Gold Bitcoin and Oil5
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!

చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్‌లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము.

Stock Market Closing Update 13th March 20266
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement