Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US Supreme Court Ruling Spurs Tariff Refunds for Importers via CAPE System1
ఏప్రిల్ 20 నుంచి యూఎస్‌ టారిఫ్ రీఫండ్లు!

అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20 (వచ్చే సోమవారం) నుంచి సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుమారు 166 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని దిగుమతిదారులకు వాపసు ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది.‘కేప్’ వ్యవస్థతో వేగంగా చెల్లింపులుయూఎస్‌ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ రీఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కేప్’ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఫైలింగ్‌లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ వివరాలను వెల్లడించారు. గతంలోలాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా, దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థను తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకు మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధమైన పరిధిని దాటి విధించిన సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.30 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్‌మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,497 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపసు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!

Maharashtra Mandates Marathi for Taxi Auto Drivers from May 12
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్‌!

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్‌గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది.మెరుగైన సేవలురాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ నూతన విధానాన్ని వెల్లడించారు. ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్ల వల్ల భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘మరాఠీ మన రాష్ట్ర అధికారిక భాష. ప్రజా సేవల్లో దాని వాడకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. డ్రైవర్లకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడటం వస్తేనే ప్రయాణికులకు మెరుగైన భద్రత, సేవలు అందుతాయి’ అన్నారు.అమలు తీరు.. తనిఖీలుఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి రవాణా శాఖకు చెందిన 59 ప్రాంతీయ (ఆర్‌టీఓ), ఉప ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు మరాఠీలో తమ ప్రాథమిక నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి మరాఠీ చదవడం, రాయడం వస్తుందా లేదా అని అధికారులు ధ్రువీకరిస్తారు. కేవలం డ్రైవర్లే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేసే అధికారులపై కూడా నిఘా పెంచనున్నారు. అర్హత లేని వారికి లైసెన్సులు ఇస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!

Gold and Silver rates on 15 April 2026 in Telugu states3
బంగారం ధరలు సలసల!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్‌లో పెరిగిన పసిడి ధరలు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 15 April 20264
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 311 పాయింట్లు పెరిగి 24,153 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1026 పాయింట్లు ఎగబాకి 77,882 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.2బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 95.06 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.18 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 1.96 శాతం పుంజుకుంది.Today Nifty position 15-04-2026(time: 9:42 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

AI Boom Hits Costly Crossroads Investors Question Billion Dollar Bets5
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!

గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్‌ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Summer Heat Sparks EV Battery Risks Safety Tips for Drivers6
ఈవీ వాడుతున్నారా? ఇది మీ కోసమే..

భానుడి భగభగలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులతోపాటు మనం వాడే వాహనాలకు సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరిగిన నేపథ్యంలో వేసవిలో వీటి నిర్వహణపై వాహనదారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడటం లేదా పేలిపోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగించాయి. అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాటరీ ఎందుకు పేలుతుంది?ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యంత శక్తివంతమైనవి, కానీ ఉష్ణోగ్రతను తట్టుకునే పవర్‌ తక్కువగా ఉంటుంది.వాహనం ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత నియంత్రణ తప్పి ఒక సెల్ నుంచి మరో సెల్‌కు వేడి వేగంగా వ్యాపించడాన్ని థర్మల్ రన్‌వే అంటారు. దీనివల్ల బ్యాటరీ సెకన్ల వ్యవధిలో పేలిపోయే అవకాశం ఉంటుంది.బ్యాటరీలోని వోల్టేజ్, ఉష్ణోగ్రతను బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్‌) నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇది సరిగ్గా లేకపోతే బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది.బ్యాటరీ సెల్స్‌ మధ్య ఉండే సెపరేటర్ దెబ్బతిన్నా లేదా తయారీ లోపాలు ఉన్నా అంతర్గత షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగుతాయి.ఎండలో వాహనాన్ని నిలిపి ఉంచి వెంటనే ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.వాహనదారులు పాటించాల్సిన నియమాలువాహనాన్ని నడిపి వచ్చిన వెంటనే ఛార్జింగ్‌ పెట్టకండి. బ్యాటరీ చల్లబడటానికి కనీసం 30 నుంచి 45 నిమిషాల సమయం ఇవ్వండి.నేరుగా ఎండ తగిలే చోట కాకుండా గాలి ఆడే నీడ ప్రదేశంలో మాత్రమే వాహనాన్ని ఛార్జ్ చేయండి.రాత్రంతా ఛార్జింగ్‌కు వదిలేయడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్యలు రావచ్చు. 80-90% ఛార్జ్ అవ్వగానే ప్లగ్ తీసివేయడం ఉత్తమం.ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పుడూ ఎండలో పార్క్ చేయవద్దు. తీవ్రమైన ఎండ బ్యాటరీ ప్యాక్ లోపల రసాయన చర్యల వేగాన్ని పెంచి దాన్ని బలహీనపరుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇండోర్ పార్కింగ్ లేదా షెడ్లను ఎంచుకోండి.తక్కువ ధరకు దొరుకుతున్నాయని నాసిరకం లేదా లోకల్ ఛార్జర్లను వాడకండి. కంపెనీ అందించిన అథెంటిక్ ఛార్జర్ మాత్రమే వాడాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి.బ్యాటరీ నుంచి వింత వాసన రావడం, బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించడం, లేదా ఛార్జింగ్ సమయంలో విపరీతమైన వేడి రావడం వంటివి గమనిస్తే వెంటనే వాడటం ఆపేసి మెకానిక్‌ను సంప్రదించండి.వేసవిలో ఫాస్ట్ ఛార్జింగ్ వాడకం వల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. అత్యవసరమైతే తప్ప రెగ్యులర్ ఛార్జింగ్‌నే వాడటం బ్యాటరీ లైఫ్‌కు, భద్రతకు మంచిది.ఎలక్ట్రిక్ వాహనం అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం వంటిది. మొబైల్ ఫోన్ మాదిరిగానే దీనికి కూడా వేడి నుంచి రక్షణ అవసరం. సాంకేతికత ఎంత పెరిగినా వినియోగదారుడికి ఉన్న అవగాహన మాత్రమే ప్రమాదాలను నివారించగలదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం ఏడాదికి ఒకసారి బ్యాటరీ హెల్త్ చెకప్ చేయించుకోవడం మర్చిపోకండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement
Advertisement
Advertisement