ప్రధాన వార్తలు
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
జేబులో జ్యూసర్.. బాటిల్ బ్యాగ్!
మీ సమ్మర్ను రిఫ్రెషింగ్గా మార్చే ‘స్మార్ట్’ మ్యాజిక్ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్తో చెమటలకు గుడ్ బై చెప్పేసి, చిల్ అవ్వండి!జేబులో జ్యూసర్!ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్ డ్రింక్స్ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్’గా జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్ పోర్టబుల్ జ్యూసర్!ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్ బాటిల్! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్ఫుల్ బ్యాటరీని మీ మొబైల్ చార్జర్ లేదా పవర్ బ్యాంక్తో చార్జ్ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్ జ్యూస్లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్ లీక్–ప్రూఫ్ డిజైన్తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!బాటిల్ బ్యాగ్!బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్ను స్టయిలిష్గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్ బాటిల్ క్యారియర్ బ్యాగ్!ఇందులో బాటిల్తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్ పాకెట్ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్ సేఫ్గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్కైనా లేదా ట్రావెలింగ్కైనా ఈ బ్యాగ్ మీకు మంచి క్లాసీ లుక్ను ఇస్తుంది. ధర రూ. 500 మాత్రమే!ఐస్ ముక్కల ‘మ్యాజిక్ కప్పు’!ఫ్రిజ్లో ఉన్న ఐస్ ట్రే నుంచి ఐస్ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్ ఐస్ మేకర్ కప్పు!ఇది మామూలు ఐస్ ట్రే కాదు, ఒక స్మార్ట్ సిలికాన్ సిలిండర్. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్లో పెట్టుకుని ఐస్ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్ గ్రేడ్ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్లోని ఇతర వాసనలు ఐస్కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే!
ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్బీఐ కీలక ప్రకటన!
చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.ఆర్బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.ఈ-చెక్ అంటే?ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్లైన్లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.ఇదీ చదవండి: భారత్లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
బిగ్ షాక్.. భారత్లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్లోని దోహా బ్యాంక్ తన భారత్లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అలయంజ్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి సోనియా రావల్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. జేవీ ద్వారా దేశీ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ఎండీ హితేష్ సేథియా తెలిపారు.బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్ సొల్యూషన్స్ అందించనున్నట్లు అలయంజ్ ఎస్ఈ బోర్డు సభ్యుడు క్రిస్ టౌన్సెండ్ వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక అనుభవం, దేశీయంగా డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్లు, ఎలక్ట్రిషన్లు, టెక్నీషియన్లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
కార్పొరేట్
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దల...
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాల...
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మ...
జియో ఐపీవో ఎప్పుడంటే?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్...
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ...
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభ...
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?
ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందుల...
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్లో రిమోట్గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్ తన మేనల్లుడి గురించి లింక్డ్ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు."వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్తో పంచుకున్నారు.కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.పని తీరును మార్చిన ఏఐ2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.బిజీగా ఉన్నట్లు నటన!చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
రవి అస్తమించినా సౌర కాంతులు!
సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే సోలార్ ప్లాంట్ల పని ముగిసిపోతుంది. కానీ చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న దున్హువాంగ్ సోలార్ ప్లాంట్ను చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. నిప్పులు కురిపించే ఎడారి ఎండను ఒడిసిపట్టి రాత్రి వేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ప్లాంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 12,000 భారీ అద్దాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక సరికొత్త విప్లవమని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఏమిటీ ప్లాంట్ ప్రత్యేకత?ఈ ప్లాంట్ మనం చూసే సాధారణ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లతో పనిచేసేది కాదు. దీన్ని ‘మొల్టెన్ సాల్ట్ కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ (సీఎస్పీ) ప్లాంట్ అని పిలుస్తారు. దీని నిర్మాణం చూస్తే మధ్యలో ఒక భారీ టవర్, దాని చుట్టూ వేల సంఖ్యలో అద్దాలు అమర్చి ఉంటాయి. ఇక్కడ ఉన్న 12,000 అద్దాలు సూర్యుడు కదులుతున్న దిశకు అనుగుణంగా వాటికి అవే పొజిషన్ను సర్దుబాటు చేసుకుంటాయి. ఇవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి సరిగ్గా 260 మీటర్ల ఎత్తున్న సెంట్రల్ టవర్పైకి కేంద్రీకరిస్తాయి.ఆ టవర్ పైభాగంలో ఉండే రిసీవర్లో ‘ద్రవ ఉప్పు’(మొల్టెన్ సాల్ట్) ఉంటుంది. అద్దాల నుంచి వచ్చే తీవ్రమైన వేడి వల్ల ఈ ఉప్పు సుమారు 565 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.రాత్రి పూట విద్యుత్తు ఎలా సాధ్యం?ఈ ప్లాంట్లోని అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. పగటిపూట వేడెక్కిన ఈ ద్రవ ఉప్పును భారీ ఇన్సులేటెడ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ ఉప్పు తనలోని వేడిని చాలా కాలం పాటు కోల్పోదు. సూర్యుడు లేని సమయంలో లేదా రాత్రి వేళల్లో ఈ వేడి ఉప్పును ఉపయోగించి నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. తద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఈ టవర్ ద్వారా ఏటా సుమారు 390 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను దీని ద్వారా తగ్గిస్తున్నారు.China’s solar plant in Dunhuang uses 12,000 mirrors to focus sunlight onto a central tower, heating molten salt to extreme temperatures.The real magic? It stores that heat so that power can be generated even after the sun goes down. pic.twitter.com/lDq0NB8jWl— Harsh Goenka (@hvgoenka) March 24, 2026భవిష్యత్తుకు మార్గదర్శిప్రపంచం ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి స్వచ్ఛమైన ఇంధనం వైపు మళ్లుతోంది. బ్యాటరీ స్టోరేజ్ ఖరీదైన వ్యవహారంగా ఉన్న తరుణంలో ‘మొల్టెన్ సాల్ట్’ ద్వారా ఉష్ణాన్ని నిల్వ చేయడం అనేది అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గం. దున్హువాంగ్ ప్రాజెక్టు కేవలం చైనాకే కాదు, ఎడారి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా ఒక గొప్ప అవకాశం అని కొందరు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!
పర్సనల్ ఫైనాన్స్
ఫండ్స్లో పెట్టుబడులకు గిఫ్ట్ కార్డులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల దిశగా మరింత మంది ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు సెబీ.. గిఫ్ట్ కార్డులు లేదా గిఫ్ట్ ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను (పీపీఐలు) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఎవరైనా సరే గిఫ్టీపీపీఐలను కొనుగోలు చేసి వేరొకరికి కానుకగా ఇవ్వొచ్చు. ఈ గిఫ్ట్ పీపీఐలను స్వీకరించిన వారు వాటితో తమకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకంలో యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలను ఏప్రిల్ 14లోపు తెలియజేయాలని సెబీ కోరింది. గిఫ్ట్ పీపీఐలను ఎల్రక్టానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఏడాదిగా ఉంటుంది. గిఫ్ట్ పీపీఐ ద్వారా ఒక్కో ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ పరిమితి పెట్టింది.గిఫ్ట్ పీపీఐలను అనుమతించాలంటూ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చేసిన వినతి మేరకు సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. రిటైల్ కొనుగోళ్లకు సంబంధించి గిఫ్ట్ కార్డులు ఎంతో ప్రాచుర్యం పొందడం తెలిసిందే. ఇప్పుడు వీటిని పెట్టుబడుల వైపు మళ్లించేందుకు సెబీ నిర్ణయం తోడ్పడనుంది.
ఇక ఫింగర్ప్రింట్తోనే పేమెంట్స్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఫీచర్ ముఖ్యాంశాలురూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని బయోమెట్రిక్ ఫీచర్ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.యాక్టివేట్ చేసుకునే విధానంభీమ్ యాప్లో ఈ కొత్త ఫీచర్ను యాక్టివేట్ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్ఫారమ్లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది.
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026


