ప్రధాన వార్తలు
"భరతమాతకు మీ ప్రతిభ అవసరం.. దయచేసి రండి''
జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.Open letter to Indians in America.--Dear brothers and sisters from Bharat:Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must…— Sridhar Vembu (@svembu) April 27, 2026
బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!
చైనా కార్ల తయారీ దిగ్గజం బీవైడీ సరికొత్త కారు 'డెంజా జెడ్' (Denza Z)ను ఆవిష్కరించింది. మసెరటి గ్రాన్కాబ్రియో ఫోల్గోర్కు గట్టి పోటీని ఇచ్చే విధంగా రూపు దిద్దుకున్న ఈ కారును కంపెనీ 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది.బీవైడీ కంపెనీ ప్రధానంగా.. ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని విఫణిలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. డెంజా జెడ్ ఆకట్టుకునే స్టైల్ కలిగి.. అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ పొందుతుంది. ఇది కూపే, కన్వర్టిబుల్, ట్రాక్-ఫోకస్డ్ వేరియంట్లలో లభించనుంది.2026 బీజింగ్ ఆటో షోలో కనిపించిన డెంజా జెడ్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రంగులో ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి మసెరటి కారు మాదిరిగా కనిపించే ఈ వాహనం.. ఎక్కువ ఫ్యాబ్రిక్ పొందునట్లు తెలుస్తోంది.డెంజా జెడ్ సిరీస్ మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇవి ఏడబ్ల్యుడీ సామర్థ్యాలను కలిగి సుమారు 1,000 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేలా తయారైంది. ఇది కేవలం రెండు సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారు.ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!కంపెనీ దీనిని చైనా షోరూమ్లలోకి చేర్చడానికి ముందే.. యూరప్, ఇతర దేశాల్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర 400,000-500,000 యెన్ల (58,600-73,200 డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కావాల్సి ఉంది.🇨🇳🔥El 24 de abril, BYD presentó en Pekín un superdeportivo totalmente nuevo y puramente eléctrico.Cuenta con una potencia superior a los 1.000 caballos de fuerza;Acelera de 0 a 100 km/h en menos de 2 segundos;Está equipado con tecnología de carga ultrarrápida...#China #BYD pic.twitter.com/DbRdET6L5M— Hermosa China(Beautiful China) (@90Hercost) April 24, 2026
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!
యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది.
వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!
టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.దీనికి ఉదాహరణ.. ఒరాకిల్లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్గా అనిపించిందని తెలిపారు.ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 639.42 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో 77,303.63 వద్ద, నిఫ్టీ 194.75 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 24,092.70 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, కోహాన్స్ లైఫ్సైన్సెస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, తాన్లా ప్లాట్ఫారమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీ కాట్స్పిన్ ఇండియా లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్కేర్ లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్ వంటివి నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్ ఆఫ్ బరోడా ‘బీవోబీ సీనియర్ సిటిజన్ విశేష్ సమ్మాన్’ పేరుతో వృద్ధులైన ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను తీసుకొచ్చింది. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు అదనంగా ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలను ఈ ఖాతా ద్వారా అందుకోవచ్చు.60 ఏళ్లు నిండిన వారి కోసం ఈ ఖాతాను ప్రత్యేకంగా రూపొందించినట్టు ప్రకటించింది. కుటుంబంలో ఆరుగురు సభ్యుల కోసం ఉచిత ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్లను పొందొచ్చు. అలాగే, ఆన్లైన్లో ఔషధాల కొనుగోలుపై 15 శాతం, డయాగ్నోస్టిక్స్ సేవల చార్జీల్లో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. రివర్స్ మార్ట్గేజ్ రుణంపై ప్రాసెసింగ్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్ అద్దెల్లోనూ 20 శాతం తగ్గింపు పొందొచ్చని సంస్థ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ ప్రకటించారు. ఈ ఖాతాలో కనీస నిల్వ రూ.లక్ష ఉంచాలి.
కార్పొరేట్
"భరతమాతకు మీ ప్రతిభ అవసరం.. దయచేసి రండి''
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!
కార్పొరేట్ జాబ్ వదిలేసి 50 ఏళ్ల వయసులో కోట్ల డాలర్ల కంపెనీ
వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
అమెజాన్లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..
ఐసీఎఫ్, ఎల్హెచ్బీ కోచ్లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?
గూగుల్ క్లౌడ్తో కోవాసెంట్ జట్టు
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..
బంగారం.. వచ్చే వారమూ ఇంతేనా?
దేశంలో బంగారం రేట్లు గత వారంలో సాపేక్షంగా స్థిరంగా...
పబ్లిక్ ఇష్యూకు ప్లేసింపుల్ గేమ్స్
ముంబై: స్వీడన్కు చెందిన గేమింగ్ దిగ్గజం మోడర్న్...
ఇక్కడ బంగారం ధరలు ఫ్రీజ్.. అక్కడ మాత్రం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
ఇందుకేనా బంగారం ధరలు తగ్గుతున్నది..?
గత వారం రోజులుగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ...
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరిం...
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ...
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.వాట్సాప్ హోమ్ స్క్రీన్పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి.
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్ మార్కెట్పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
75 శాతం కోడింగ్ ఏఐతోనే!
టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్లో రాసే కొత్త కోడ్లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.ఏజెంటిక్ యుగంలోకి..గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణగతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్ప్రైజ్ ఏజెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిందని చెప్పారు.ఆరు రెట్లు వేగంగా పనులుగూగుల్ తన సొంత ఎకోసిస్టమ్లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.మాక్ఓఎస్ (macOS)లోని జెమిని యాప్ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
పర్సనల్ ఫైనాన్స్
ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?
ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది.
కొత్త క్రెడిట్ కార్డు.. మొబైల్ ఫోన్ ఉంటే చాలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్టెక్ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్వర్క్తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.సెటప్ చేసుకోవడం ఎలా?పీఎన్బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.💸 ముందుగా మీ యూపీఐ యాప్ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్ను ఎంచుకోవాలి.💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
EPFO: ఎన్నో మార్పులు.. త్వరలోనే మంచి రోజులు
వేతన జీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజులు త్వరలోనే రానున్నాయి. తమ కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్ (PF) నగదును పొందే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈపీఎఫ్ఓ (EPFO) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 మధ్య నాటికి 'ఈపీఎఫ్ఓ 3.0' పేరుతో సరికొత్త అప్గ్రేడెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త మార్పులతో పీఎఫ్ ఉపసంహరణలు ఇకపై బ్యాంక్ లావాదేవీలంత సులభం కానున్నాయి. ఈ వ్యవస్థలో రాబోయే ప్రధాన మార్పులు ఇవే..ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణఈపీఎఫ్ఓ 3.0 లో అతిపెద్ద అప్డేట్ ఏంటంటే.. ఇకపై మీరు మీ పీఎఫ్ నగదును నేరుగా ఏటీఎంల ద్వారా లేదా యూపీఐ (UPI) యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. పేపర్ వర్క్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో నేరుగా లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ అవుతుంది.రూ. 5 లక్షలకు పెరిగిన ఆటో-సెటిల్మెంట్ పరిమితిగతంలో ఆటో-సెటిల్మెంట్ పరిమితి కేవలం రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. దీన్ని ఇప్పుడు ఏకంగా రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే లేదా మరుసటి రోజు కల్లా నగదు చేతికి అందుతుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు!చాలా సందర్భాల్లో కంపెనీలు క్లెయిమ్లను ధ్రువీకరించడంలో ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. కొత్త వ్యవస్థలో ఈ డిపెండెన్సీని తొలగిస్తున్నారు. ఆధార్ ఓటీపీ ద్వారా లేదా స్వీయ-ధ్రువీకరణ ద్వారా క్లెయిమ్లను వేగంగా సెటిల్ చేసుకోవచ్చు.ఫోన్ పే, గూగుల్ పేతో అనుసంధానంనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనివల్ల ఫోన్పే (PhonePe) గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి పాపులర్ డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా పీఎఫ్ లావాదేవీలను సులభంగా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది.ఉపసంహరణ నిబంధనల సరళీకరణవినియోగదారుల సౌకర్యార్థం ఉపసంహరణ కేటగిరీలను ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. వైద్య అవసరాలు: సర్వీస్ నిబంధన లేకుండా ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.చదువు/వివాహం: నిర్ణీత సర్వీసు కాలం తర్వాత అనుమతి ఉంటుంది.గృహ అవసరాలు: ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి కనీసం 5 ఏళ్ల సర్వీసు ఉండాలి.నిరుద్యోగం: ఒక నెల పాటు ఖాళీగా ఉంటే 75% నగదు, రెండు నెలలు దాటితే పూర్తి నగదు ఉపసంహరించుకోవచ్చు.ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే మీ యూఏఎన్ (UAN) యాక్టివ్గా ఉండటంతో పాటు, దానికి ఆధార్, పాన్, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి 32 ప్రముఖ బ్యాంకులతో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంది.ఇక పన్ను నిబంధనల విషయానికి వస్తే.. 5 ఏళ్ల నిరంతర సర్వీసు తర్వాత ఉపసంహరించుకునే నగదుపై పన్ను ఉండదు. అయితే, రూ. 50,000 మించిన విత్ డ్రాయల్స్ విషయంలో పాన్ కార్డు లింక్ చేయకపోతే టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. మొత్తానికి, ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వస్తే కోట్లాది మంది వేతన జీవుల డిజిటల్ కల సాకారమై, పీఎఫ్ సెటిల్మెంట్లలో కొత్త శకం మొదలుకానుంది.
వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్
మ్యూచువల్ ఫండ్స్ అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. అదే సమయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. సరైన ఫండ్ను ఎంచుకోవడానికి మేధావి అయి ఉండాలని, మార్కెట్ గమనాన్ని ప్రతిరోజూ గమనించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే వారెన్ బఫెట్ సిద్ధాంతాలు దీనికి భిన్నంగా ఉంటాయి. 94 ఏళ్ల వయసులోనూ బెర్క్షైర్ హాత్వేను విజయపథంలో నడిపిస్తున్న ఆయన పెట్టుబడి అనేది విజ్ఞానం కంటే కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవహారమని నమ్ముతారు. నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలిచే బఫెట్ సూత్రాలపై ప్రత్యేక కథనం.పెట్టుబడి కాల పరిమితి‘ఒకవేళ స్టాక్ మార్కెట్ పదేళ్లపాటు మూతపడినా మీరు నష్టపోని కంపెనీలనే ఎంచుకోవాలి’ అన్నది బఫెట్ నియమం. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తరచుగా ఫండ్లను మార్చడం వల్ల చక్రవడ్డీ లాభాన్ని కోల్పోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ను ఎంచుకుని దానికి దశాబ్దాల పాటు కట్టుబడి ఉండటమే అసలైన విజయం.మేధస్సు కంటే క్రమశిక్షణ ముఖ్యంపెట్టుబడి పెట్టడానికి ఐక్యూ 160 ఉండాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే చాలని బఫెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా పెరిగినప్పుడు అత్యాశ చెందకుండా సిప్లను కొనసాగించడమే అత్యుత్తమ వ్యూహం.రోజూ మార్కెట్ను గమనించకండిస్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉన్న వ్యక్తి నుంచి ఓపికగా ఉన్న వ్యక్తికి డబ్బు బదిలీ చేసే సాధనం అని బఫెట్ నమ్ముతారు. రోజూ మ్యుచువల్ ఫండ్ ఎన్ఏవీని చూడటం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత అయితే నేటి మార్కెట్ ఒడిదుడుకులు మీకు అనవసరం.భయం, అత్యాశల సమతుల్యతప్రజలందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశగా ఉండండి - ఇది బఫెట్ లైఫ్ మంత్రం. మార్కెట్ కుప్పకూలినప్పుడు చాలామంది సిప్లు ఆపేస్తారు. కానీ, అప్పుడే యూనిట్లు తక్కువ ధరకు వస్తాయనే విషయాన్ని బఫెట్ గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో చేసే అదనపు పెట్టుబడి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది.తెలియనిచోట పెట్టుబడి వద్దుఏదో ఒక సెక్టోరల్ ఫండ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది 50% రిటర్న్స్ ఇచ్చిందని అందులో డబ్బులు పోయడం ప్రమాదకరం. ఆ ఫండ్ రిస్క్ ఏంటి? దాని వ్యూహం ఏంటి? అనేది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.అంచనాలపై ఆధారపడకండిమార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వచ్చే నెల ఎలా ఉంటుంది? అనే అంచనాలు జ్యోతిష్యం లాంటివే తప్ప వాస్తవాలు కావని బఫెట్ అభిప్రాయపడతారు. గత ఆరు నెలల ర్యాంకింగ్ చూసి ఫండ్లను మార్చడం కాకుండా ఫండ్ హౌస్ విశ్వసనీయతను చూసి పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!


