Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

House Rent Allowance Claims Precautions New Rules Costly Mistakes to Avoid 1
ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌... జాగ్రత్తలు

ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్‌మిట్‌ చేసి నాటకం ఆడుతున్నారు. ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్‌ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్‌మిట్‌ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్‌ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్‌లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్‌ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు. బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్‌మెంట్‌ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్‌ ప్రకారం ఇక నుంచి .. అంటే ఏప్రిల్‌1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్‌ పేరు, అడ్రస్, పాన్‌.. మీకు ఓనర్‌కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్‌ ఆదాయాన్ని ట్రాక్‌ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్‌ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్‌ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్‌ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్‌ చేత రిటర్ను వేయించండి.

After Khamenei Death Rising Iran Israel Tensions India Oil and Rupee Shock2
భారత చమురు మార్కెట్‌పై ‘యుద్ధ’ సెగ

పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత్‌పై ముఖ్యంగా చమురు మార్కెట్, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.పెరగనున్న దిగుమతి భారంభారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇది 77 డాలర్ల వద్ద ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో క్రూడ్‌ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. పరిమితంగా రష్యా నుంచి అందుతున్న రాయితీ చమురు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.రూపాయి పతనం - ఆర్థిక సవాళ్లుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి చేరుకోవచ్చు. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది.భారత్ - ఇరాన్ వాణిజ్య సంబంధాలుఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో ఏర్పడే అంతర్గత రాజకీయ మార్పులు భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇరాన్ కొత్త నాయకత్వం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపైనే ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుంది. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవడానికి భారత్‌కు ఈ పోర్ట్ అత్యంత కీలకం కావడంతో అక్కడి రాజకీయ మార్పులు మన వ్యూహాత్మక ప్రయోజనాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.వ్యవసాయ ఎగుమతులురెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యవసాయ ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇరాన్‌కు పెద్ద మొత్తంలో ఎగుమతి అయ్యే బాస్మతీ బియ్యం, టీ, చక్కెర వంటి ఉత్పత్తులకు సంబంధించి చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు. యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత పెరిగితే భారతీయ ఎగుమతిదారులు తమ బకాయిలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.అప్రమత్తతే మార్గంఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీలో భాగమైన భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడం, దౌత్యపరంగా అడుగులు వేయడం కీలకం.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

Tata AIG Launches Accident Super Guard Plus Personal Accident Insurance Plan3
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌

ముంబై: టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘యాక్సిడెంట్‌ సూపర్‌ గార్డ్‌ ప్లస్‌’ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్‌ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్‌లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు. లోన్‌ షీల్డ్‌ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్‌కేర్‌ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

Gold and Silver rates on 2nd March 2026 in India4
బంగారం లాంటి న్యూస్‌! పసిడి ధరలు రివర్స్‌!!

దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి. వరుసగా మూడో రోజులు దారుణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on 02 March 20265
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.8బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.3 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్‌ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్‌ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్‌లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Amazon Removes Referral Fee on Products Under 1000 to from March 166
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్‌లో పట్టు పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా భారీ మార్పులు చేస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.1,000 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై అమ్మకందారుల నుంచి వసూలు చేసే రిఫరల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఏమిటీ రిఫరల్ ఫీజు?అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తువులను విక్రయించినందుకు గానూ ప్రతి అమ్మకంపై సెల్లర్‌ నుంచి కంపెనీ కొంత శాతం కమీషన్‌ను వసూలు చేస్తుంది. దీనినే రిఫరల్ ఫీజు అంటారు. సాధారణంగా ఇది ఉత్పత్తి కేటగిరీని బట్టి 2% నుంచి 16.5% వరకు ఉంటుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1,800 కేటగిరీల్లో రూ.300 నుంచి రూ.1,000 మధ్య ధర ఉన్న ఉత్పత్తులకు ఈ కమీషన్ భారం ఉండదు.కీలక మార్పులు ఇవే..గతంలో (ఏప్రిల్ 2025) కేవలం రూ.300 లోపు వస్తువులకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రూ.1,000 వరకు విస్తరించారు. దీనివల్ల లబ్ధి పొందే ఉత్పత్తుల సంఖ్య 1.2 కోట్ల నుంచి ఏకంగా 12.5 కోట్లకు పెరగనుంది. దాంతోపాటు రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల విక్రేతలకు షిప్పింగ్ ఫీజులో 20% రాయితీ ప్రకటించింది. అమ్మకందారులు తమ వద్దే స్టాక్ ఉంచుకుని కేవలం డెలివరీ బాధ్యతను అమెజాన్‌కు అప్పగించే ‘ఈజీ షిప్’ పద్ధతిలో కూడా ఈ 20% ఫీజు తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.‘ఈ నిర్ణయం వల్ల విక్రేతలకు అమ్మకం ఖర్చులో దాదాపు 70% వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు అమెజాన్ ప్లాట్‌ఫారమ్ మరింత లాభదాయకంగా మారుతుంది’ అని అమిత్ నందా, డైరెక్టర్, అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్ట్నర్ సర్వీసెస్ అన్నారు.తీవ్రమవుతున్న ఈ-కామర్స్ పోటీ..మీషో 2022లోనే జీరో కమీషన్ మోడల్‌ను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను భారీగా ఆకర్షించింది. ఫ్లిప్ కార్ట్ గతేడాది నవంబర్‌లో రూ.1,000 లోపు ఉత్పత్తులపై కమీషన్ రద్దు చేయడమే కాకుండా, తన ‘షాప్సీ’ ప్లాట్‌ఫారమ్‌లో పూర్తిగా జీరో కమీషన్ అమలు చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేతలను తమ ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం. అమ్మకందారులపై భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే వస్తువులు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

Advertisement
Advertisement
Advertisement