Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Iran–Israel Tensions Trigger Fertilizer Shock India Food Security at Risk1
చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్‌ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్‌కు సవాలుగా మారింది.లెక్కలివే..భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్‌ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్‌ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.ఆహార భద్రతపై ప్రభావంభారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్‌) సరఫరా ఇప్పుడు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలురష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్‌ఈస్ట్‌ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).ప్రభుత్వ ధీమాపరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

Stock Market closing updates On march 11 20262
స్టాక్‌ మార్కెట్‌లో ‘బ్లడ్‌ బాత్‌’

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్‌లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్‌లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్‌ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Middle East Tensions Global Inflation Central Banks Toward Rate Hikes3
వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.అంచనాలు తలకిందులుఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.గత తప్పిదాల నుంచి పాఠాలు2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్‌ బ్యాంకులు భావిస్తున్నాయి.బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితియూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.ఇదీ చదవండి: చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

Gas Supply Disruption Clouds India QSR Sector LPG Prices Surge Stocks4
చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

దేశీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్‌ఆర్‌) విభాగంపై గ్యాస్ సెగ ముసురుతోంది. వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్‌లో ప్రధాన క్యూఎస్‌ఆర్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన సమస్యలు మరో రెండు వారాలకు పైగా కొనసాగితే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.సరఫరా గొలుసులో సంక్షోభంప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తాజా నివేదికలో క్యూఎస్‌ఆర్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించింది. ప్రధాన క్యూఎస్‌ఆర్ చైన్‌లో దాదాపు 60-65 శాతం వంట ప్రక్రియ పూర్తిగా ఎల్‌పీజీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలు కేవలం ఒకటి నుంచి రెండు వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. సరఫరా లోటు కారణంగా మార్చి నెలలోనే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర 8 శాతం మేర పెరిగింది. ఇది నేరుగా రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది.ఆదాయం, మార్జిన్లపై ప్రభావంఒకవేళ సరఫరా నిలిచిపోయి, రెస్టారెంట్లు ఐదు రోజుల పాటు మూతపడితే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రతి స్టోర్ ఆదాయం 6 శాతం తగ్గే అవకాశం ఉంది. రెస్టారెంట్ స్థాయి ఎబిటా మార్జిన్లు సాధారణం కంటే 14-20 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో వాణిజ్య వినియోగదారులపై రేషనింగ్(ప్రాధాన్యత క్రమంలో పరిమితంగా పంపిణీ చేయడం) విధించడం రెస్టారెంట్లకు శాపంగా మారింది.ముంచుకొస్తున్న ముప్పు.. ప్రత్యామ్నాయం తప్పదా?పెద్ద సంస్థల కంటే చిన్న, స్వతంత్ర రెస్టారెంట్లు ఈ సంక్షోభానికి త్వరగా ప్రభావితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి వంటి కీలక షిప్పింగ్ మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రెస్టారెంట్ విభాగం ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (విద్యుత్ ఆధారిత వంట పరికరాలు) లేదా సెంట్రలైజ్డ్ కిచెన్ మౌలిక సదుపాయాల వైపు మళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Iran-Israel War Sparks LPG Crisis Indian Railways Kitchens Face Disruption5
గ్యాస్ సిలిండర్లకు ఐఆర్‌సీటీసీ స్వస్తి?

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.ఐఆర్‌సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.సంక్షోభానికి కారణాలుభారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్‌లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందుచూపుతో..రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్‌పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్‌సీటీసీ భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

West Asia Tensions Disrupt LPG Supply Hyderabad IT Corridor Hostels Issue6
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Advertisement
Advertisement
Advertisement