ప్రధాన వార్తలు
సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..
అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.వెండి ధరలువెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది.
ఐఫోన్ 18 వివరాలు లీక్.. ధర ఇంతేనా?
యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఓ కొత్త ఐఫోన్ మోడల్ లాంచ్ చేస్తూ ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 పేరుతో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఐఫోన్ 18 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ కూడా కొత్త ఫీచర్స్ పొందనున్నాయి. ప్రో & ప్రో మ్యాక్స్లలో 6.27 అంగుళాల 120Hz, 6.86 అంగుళాల 120Hz అలాగే ఉన్నాయి. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ పొందుతుంది. ఇందులో భాగంగానే.. ఐఫోన్ 18 ప్రో కోసం A20 ప్రో చిప్ 2nm ప్రాసెస్ అందించనున్నారు.కెమెరా విషయానికి వస్తే.. ఒక వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో & ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1,34,900 & రూ.1,49,900గా ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే స్టోరేజ్.. కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్లను బట్టి ధరలు మారుతాయి.
పెరిగిన థార్ ధరలు.. ఒకేసారి రూ. 20వేలు!
మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో తన థార్ ధరలను సవరించింది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను రూ. 20వేలు పెంచింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి.మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అయిన AX 2WD ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద అలాగే కొనసాగుతుంది. 2WD & 4WD కాన్ఫిగరేషన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్లతో లభించే.. LX ట్రిమ్లతో సహా అన్ని ఇతర వెర్షన్లు ఇప్పుడు రూ. 20,000 పెరిగాయి.ధరల పెరుగుదల తరువాత.. మహీంద్రా థార్ టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 17.19 లక్షలకు చేరింది. ఈ ఆఫ్ రోడర్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో.. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్లలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్న్యూస్!
ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్లను నేరుగా ఫీడ్లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్ సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!
దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.మాక్రాన్ ఉపయోగించిన సన్గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.“బంగారం, వెండి లేదా బిట్కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?A: No. I do not care.Q: Why Not?A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026
కార్పొరేట్
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
అమెజాన్ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!
దుబాయ్ బ్యాంకు చేతికి ఆర్బీఎల్ బ్యాంక్
రూ.623 కోట్ల పెట్టుబడి.. స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
దేశీ ఎంట్రప్రెన్యూర్ల హవా.. చైనాను వెనక్కి నెట్టిన భారత్!
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,210 కోట్లు
దావోస్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్ గోయిల్
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్బస్
ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..
ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అం...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..
ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (R...
జియో బ్లాక్రాక్: 8 నెలల్లో 10 లక్షల ఇన్వెస్టర్లు
జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏ...
మెండుగా వ్యాపార విశ్వాసం!
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వ్యాపార విశ్వాస సూచీ...
ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నాలుగేళ్లలో (2030 నాటికి...
రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు
దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమ...
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి అణు ప్రాజెక్టులు?
భారతదేశ ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా ‘కర్సర్’ (Cursor) వంటి ఏఐ సాధనాల ద్వారా కేవలం ప్రాంప్ట్లు ఇస్తూ వందల సంఖ్యలో కోడ్ లైన్లను రాయడాన్ని డెవలపర్లు అలవాటు చేసుకుంటున్నారు. దీనినే ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైబ్ కోడింగ్కు ప్రత్యామ్నాయంగా ఏసీఈ(AI-Assisted Code Engineering) అనే కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.ఏంటి వైబ్ కోడింగ్?ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కార్పతి ఇటీవల వైబ్ కోడింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. డెవలపర్లు లోతైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకపోయినా కేవలం సహజ లాంగ్వేజీ ప్రాంప్ట్ల ద్వారా (Natural Language Prompts) ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి సాఫ్ట్వేర్ నిర్మించే ప్రక్రియను ఇది సూచిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇది భవిష్యత్తు అని అంగీకరించినప్పటికీ శ్రీధర్ వెంబు మాత్రం దీనివల్ల జరిగే నష్టాలను హెచ్చరించారు.‘ఏసీఈ’ ఎందుకు ముఖ్యం?శ్రీధర్ వెంబు అభిప్రాయం ప్రకారం, కేవలం ఏఐ ఇచ్చే ఫలితాలపై ఆధారపడటం వల్ల కంప్యూటర్ సైన్స్లోని మౌలిక అంశాలైన ఆప్టిమైజేషన్, అబ్స్ట్రాక్షన్, కంపైలేషన్ వంటి క్లిష్టమైన దశలను డెవలపర్లు విస్మరించే ప్రమాదం ఉంది.అసిస్టెడ్ కోడ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలుక్రమశిక్షణ కలిగిన ఇంజినీరింగ్గా దీనికి గుర్తింపు ఉంది. ఏసీఈ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ సాధనాలు, కోడింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించేలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏఐ మీకు సహాయం చేస్తుంది. అదేసమయంలో నిత్యం మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. వైబ్ కోడింగ్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కోతలకు అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుండగా, ఏసీఈ విధానం అనుభవజ్ఞులైన ఇంజినీర్లను అందిస్తుందని వెంబు స్పష్టం చేశారు.టెక్ పరిశ్రమ ఇప్పటికే లేఆఫ్స్ ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కేవలం ‘వైబ్’ మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో కూడిన ఏఐ అసిస్టెడ్ కోడింగ్ను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు
సుదీర్ఘ కాలం పాటు మందగమనంలో ఉన్న ఐటీ రంగంలో డిస్క్రెషనరీ టెక్నాలజీ ఖర్చులు (ఐచ్చికంగా ఆలోచించి అవసరాలకు మాత్రమే చేసే ఖర్చు) మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనపు నిధులను వెచ్చించే కంటే అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా నిధులను మళ్లించడంపైనే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.అంతర్గత పొదుపుతోనే కొత్త ప్రాజెక్టులుఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ జిమిత్ అరోరా విశ్లేషణ ప్రకారం, ప్రతి రంగంలోని క్లయింట్లు తాము పూర్తిస్థాయి టెక్నాలజీ కంపెనీలుగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అయితే, టెక్నాలజీ బడ్జెట్ల వృద్ధి కేవలం తక్కువగానే (లో-టు-మిడ్ సింగిల్ డిజిట్) ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ కొత్త పెట్టుబడుల ద్వారా కాకుండా రోజువారీ కార్యకలాపాల (బిజినెస్ యాజ్ యూజువల్ - BAU) ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జరుగుతోంది. ఖర్చులను కుదించి ఆ నిధులను అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లించడంపైనే కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.ఏఐ డీల్స్తో జోష్ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ క్యూ3 ఫలితాల సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, యుటిలిటీస్ రంగాల్లో డిస్క్రెషనరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీల్స్పై క్లయింట్లు ఆసక్తి చూపడం ఐటీ రంగానికి కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, స్థిరమైన డిమాండ్ వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెరుగుతున్నాయి.అప్రమత్తత అవసరం..పరిస్థితి మెరుగుపడుతున్నా అప్రమత్తత అవసరమని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వేతనాల పెరుగుదల వంటి చట్టబద్ధమైన ఖర్చుల వల్ల మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని, అందుకే సంస్థలు నియంత్రణాత్మక వ్యయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పూర్తిస్థాయిలో డిస్క్రెషనరీ ఖర్చులు ఊపందుకుంటాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు
‘మొబైల్ విడిభాగాలపై సుంకాల్లో కోత పెట్టాలి’
మొబైల్ ఫోన్ విడిభాగాలైన మైక్రోఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, వేరబుల్స్పై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేసింది. అలాగే, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు గాను క్యాపిటల్ గూడ్స్, ఇతర విడిభాగాలపై టారిఫ్లను సవరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఇటీవల చైనా విధించిన నియంత్రణ చర్యలు దేశీ మొబైల్ ఫోన్ల తయారీకి ముప్పుగా మారతాయని పేర్కొంది.ఐసీఈఏలో యాపిల్, ఫాక్స్కాన్, డిక్సన్, షావోమీ, వివో, ఒప్పో తదితర సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ‘తయారీ మెషినరీ ఎగుమతులపై చైనా ఇటీవల విధించిన ఆంక్షలు సరఫరా పరమైన సమస్యలను పెంచుతాయి. దిగుమతి పరికరాలపై భారత్ ఆధారపడి ఉండడం వ్యూహాత్మక బలహీనతగా మారింది. కనుక అన్ని రకాల విడిభాగాలు, సబ్ అసెంబ్లీలు, అసెంబ్లీల దిగుమతులపై జీరో సుంకం ప్రయోజనాన్ని వర్తింపజేయాలి’ అని ఐసీఈఏ సూచించింది. దీని ఫలితంగా స్వావలంబన పెరుగుతుందని, అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వం ఇనుమడిస్తుందని అభిప్రాయపడింది. రూ.6.76 లక్షల కోట్లకు ఉత్పత్తి..దేశీ ఎల్రక్టానిక్స్ పరిశ్రమ 25 లక్షల మందికి ఉపాధి కలి్పస్తుండడం గమనార్హం. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐసీఈఏ అంచనా. ఇందులో 30 బిలియన్ డాలర్లు మేర ఎగుమతులు ఉంటాయని పేర్కొంది. 2024–25లో రూ.5.5 లక్షల కోట్ల మొబైల్ ఫోన్ల తయారీ నమోదు కాగా, ఇందులో ఎగుమతులు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొన్ని రకాల సంక్లిష్టమైన, ప్రత్యేకమైన మెషినరీ అవసరం మొబైల్ ఫోన్లు, లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమని పేర్కొంటూ.. అయినప్పటికీ ఇవి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులకు దూరంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ఈ మెషినరీ దేశీయంగా తయారు కావడం లేదని, దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లించాల్సి వస్తున్నట్టు.. ఫలితంగా మూలధన వ్యయాలు 7.5–20 శాతం మధ్య అధికంగా వెచ్చించాల్సి వస్తున్నట్టు వివరించింది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
పర్సనల్ ఫైనాన్స్
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను లైఫ్స్టైల్ సూపర్ యాప్గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు.
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
ఎస్బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్బీఐ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం?ఇది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.


