Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Markets this week hinge on state election results1
అసెంబ్లీ, క్యూ4 ఫలితాలపై ఫోకస్‌

ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కార్పొరేట్‌ దిగ్గజాల గతేడాది చివరి త్రైమాసిక పనితీరు ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు దారి చూపనున్నాయి. అంతేకాకుండా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. నేడు(4న) ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్‌ పెట్టనున్నట్లు ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. మరోపక్క తమిళనాడు ఫలితాలపైనా ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠతకు తెరతీయడంతో స్టాక్‌ ఇన్వెస్టర్లు సైతం వీటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు సైతం నేడు తెలియనున్నాయి. దిగ్గజాలు రెడీ ఇప్పటికే గతేడాది(2025–26) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్‌ వేడెక్కింది. వారాంతాన కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌సహా.. నాల్కో, సీడీఎస్‌ఎల్, స్టార్‌ హెల్త్, డీమార్ట్, ఏపీఎల్‌ అపోలో తదితరాలు క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం పనితీరు వెల్లడిచనున్నాయి. తాజా జాబితాలో అంబుజా సిమెంట్స్, బీహెచ్‌ఈఎల్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, జిందాల్‌ స్టెయిన్‌లెస్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌ఆర్‌ఎఫ్, మారికో, కోఫోర్జ్‌తోపాటు.. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, హీరో మోటో, గోద్రెజ్‌ కన్జూమర్, పాలీక్యాబ్, శ్రీ సిమెంట్, బీఎస్‌ఈ, పిడిలైట్, లుపిన్, థెర్మాక్స్, ఏబీబీ, బీవోబీ, ఎంసీఎక్స్, స్విగ్గీ, కల్యాణ్‌ జ్యువెలర్స్‌ తదితరాలు చేరాయి. గణాంకాలు ఏప్రిల్‌ నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్‌ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదేవిధంగా చైనా, యూఎస్‌ పీఎంఐ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ప్రధానంగా యూఎస్‌ ఉపాధి కల్పన, నిరుద్యోగ వివరాలు తెలియనున్నాయి. గత వారం యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. ఫెడ్‌ చైర్మన్‌గా పదవీ విరమణ చేయనున్న పావెల్‌ అధ్యక్షతన ఎఫ్‌వోఎంసీ ఫండ్స్‌ రేట్లను 3.5–3.75 శాతం స్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయించింది. చమురు మంట అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధమేఘాలు తొలగక పోవడం, హార్ముజ్‌ సంక్షోభం నేపథ్యంలో లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ గత వారం ఒక దశలో 126 డాలర్లను తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 95కు పతనమైంది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. గతేడాదికి దేశీయంగా వాణిజ్య లోటు 333 బిలియన్‌ డాలర్లను దాటేసింది. 2024–25లో ఇది దాదాపు 284 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. మండుతున్న చమురు ధరలు దిగుమతులు బిల్లును పెంచడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. ఆటుపోట్లకు చాన్స్‌ హార్ముజ్‌పై అనిశ్చితి, బలపడుతున్న చమురు ధరలు తదితర అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణంకానున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా, ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలకు ప్రాధాన్యమున్నప్పటికీ చమురు ధరలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అభిప్రాయపడ్డారు.స్టాక్స్‌కు ఎఫ్‌పీఐల షాక్‌ ఏప్రిల్‌లో రూ. 60,847 కోట్లు ఔట్‌ న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఫలితంగా ఏప్రిల్‌లో నికరంగా రూ. 60,847 కోట్ల(6.5 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి 4 నెలల్లో(జనవరి–ఏప్రిల్‌) రూ. 1.92 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. వెరసి 2025 పూర్తి కేలండర్‌ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్లకంటే అధికంగా అమ్మకాలకు తెరతీశారు. పశ్చిమాసియా సంక్షోభానికితోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్థ్యాలను దెబ్బతీయడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 4 నెలల్లో ఫిబ్రవరిలో మాత్రమే ఎఫ్‌పీఐలు(రూ. 22,615 కోట్లు) ఇన్వెస్ట్‌ చేశారు. ఇది అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకావడం గమనార్హం! అయితే మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం ప్రస్తావనార్హం!!గత వారమిలా.. తొలుత క్యూ4 ఫలితాలతో మార్కెట్లు బలపడినప్పటికీ ఇరాన్‌–యూఎస్‌ యుద్ధంతో చివర్లో డీలా పడ్డాయి. వెరసి గత వారం సెన్సెక్స్‌ నికరంగా 249 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుంది. 76,914 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) వృద్ధితో 23,998 వద్ద స్థిరపడింది. అయితే బ్యాంక్‌ నిఫ్టీ 2.2 శాతం పతనమైంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.3 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ 2 శాతం జంప్‌చేయడం గమనార్హం! సాంకేతికంగా చూస్తే..ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణుల అంచనా. వీటి ప్రకారం నిఫ్టీకి 23,800–23,700 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ లభించవచ్చు. తదుపరి 23,500 వద్ద బలమైన మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 24,600 పాయింట్లను తాకవచ్చు. ఆపై 24,700– 27,800కు చేరే అవకాశముంది. → సెన్సెక్స్‌ 76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ తీసుకునే వీలుంది. 77,500వరకూ పుంజుకోవచ్చు. 78,000 దాటితే 78,500 పాయింట్లను తాకే అవకాశముంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

stock market rally about defence and aerospace sector, sakshi special story2
ఇన్వెస్టర్లూ పారాహుషార్‌!!

స్టాక్‌ మార్కెట్లో తరచూ కొన్ని థీమ్‌లు మెరుస్తాయి. భవిష్యత్తు అద్భుతమంటూ బ్రోకరేజ్‌ కంపెనీలు కొన్ని రంగాల స్టోరీలు తెరపైకి తెస్తాయి. మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వ ఫోకస్, కంపెనీలు పెట్టే ఖర్చు... వీటి ఆధారంగా ఈ స్టోరీని అల్లుతారు. వీటికి నిపుణుల సిఫారసులు తోడవుతాయి. దీంతో ఆ రంగంలోని షేర్లు దూసుకుపోతాయి. సహజంగానే ఆ రంగంలోని దిగ్గజాలు ఆ ర్యాలీని లీడ్‌ చేస్తూ ఉంటాయి. తమాషా ఏంటంటే... అదే థీమ్‌ ముసుగులో ఆ రంగానికి చెందిన చిన్నాచితకా కంపెనీలు కూడా రివ్వుమంటాయి. ఫండమెంటల్స్‌ ఏమాత్రం లేని షేర్లు లీడర్లను మించిపోతుంటాయి. ఇదే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆపరేటర్ల హస్తవాసితో దూసుకెళ్లే షేర్ల జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళితే... ఆ తరవాత పతనంలో అమ్ముకోవటం అంత తేలిక్కాదు. ఇదంతా ఎందుకంటే... ఇపుడు మన మార్కెట్లో డిఫెన్స్, ఏరోస్పేస్‌ థీమ్‌ నడుస్తోంది. ఏడాదిగా ఈ రంగంలోని షేర్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. షేరు పీఈ (షేరుకు ఆర్జన) ఏకంగా 150–200 దాటిపోతోంది కూడా. అంటే... ఆ కంపెనీ ఇంకో 200 ఏళ్లలో సంపాదించే ఆదాయానికి తగ్గట్టుగా ఆ షేరు ఇప్పుడే పెరిగిపోయిందన్న మాట. మరి ఇలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తపడాలి కదా? అదెలాగో వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్‌’ స్టోరీ...ఒకే ఒక్క ఏడాదిలో డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగంలో ఉన్న, ఉన్నట్లు చెబుతున్న పలు షేర్లు రెండు, మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ రంగం లాంగ్‌టర్మ్‌ పటిష్ఠంగానే ఉంది. కొన్ని కంపెనీల ఆర్డర్‌ బుక్స్‌ కూడా భారీగానే ఉన్నాయి. ఒక రంగం బాగుందంటే దానర్థం ఆ రంగంలోని షేర్లను ఏ ధర పడితే ఆ ధరకు కొనొచ్చని కాదు కదా? ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదేమిటంటే మొదట స్టోరీ. దాంతో భారీగా రీ–రేటింగ్‌. ఫండ్లు, ఆ రంగంపై అవగాహన ఉన్నవారు, సమాచారం తెలిసినవారు ముందుగా ఆయా షేర్లు కొంటారు. ఇదంతా స్మార్ట్‌ మనీ. షేర్లు పెరుగుతాయి. అప్పుడు రిటైలర్లు కొంటారు. ఇంకా పెరుగుతాయి. ఇక దొరకవేమోనన్న భయంతో మరికొందరు రిటైలర్లు దూకుతారు. వేల్యుయేషన్లు పెరిగిపోతాయి. కరెక్షన్‌ ఆరంభం. అయితే ధర తగ్గటం... లేదా దీర్ఘకాలంపాటు అక్కడే కదలటం. ఇలా ఏ రకంగానైనా దెబ్బతినేది ఆలస్యంగా కొన్న రిటైలర్లే. అందుకే రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏం చేయాలో చూద్దాం... 1. ఆర్డర్‌ బుక్‌ భారీగా ఉన్నా... → డిఫెన్స్‌ వ్యవహారాల్లో ఎగ్జిక్యూట్‌ కావటానికి దీర్ఘకాలం... అంటే 3–5 ఏళ్లు పడుతుంది. → ఎగ్జిక్యూషన్‌ రిసు్కలు ఎక్కువ. ఆర్డర్లన్నీ ఆచరణలోకి రాకపోవచ్చు కూడా. 2. ప్రభుత్వ ప్రీమియం పెరుగుతోంది... → చారిత్రకంగా చూస్తే ప్రభుత్వ రంగ డిఫెన్స్‌ కంపెనీలు 10–20 పీఈ మధ్య ట్రేడయ్యేవి. → ఇపుడైతే వాటి చారిత్రక విలువల కన్నా 5–10 రెట్లు ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. 2. ఆర్జనను మించి షేరు పరుగు... → ఈ కంపెనీల ఆదాయాలు ఏటా 20 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి. → కానీ ఈ కంపెనీల షేర్ల విలువ ఏడాదిలో 200–300 శాతం పెరిగిపోతోంది. ఇలాగైతే జాగ్రత్త... → స్టాక్‌ నిట్టనిలువుగా పెరుగుతూ వచ్చిందంటే... కొనేముందు ఆలోచించండి. → స్టాక్‌ ధర ఎంత ఉంది? దాని ఆదాయం ఎంత పెరుగుతోంది? అనేది చూడండి. → నిదానంగా కొనటం ముఖ్యం. ఒకేసారి మొత్తం కొంటే తరవాత కష్టం. చెయ్యాల్సిందేంటి? → కరెక్షన్‌ కోసం చూడండి. ఎందుకంటే షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. కనీసం 30–40 శాతం తగ్గేదాకా ఎదురుచూడండి. → షేరు ధర కన్నా... కంపెనీ ఆదాయం పెరుగుదలపై ఫోకస్‌ పెట్టండి. → వేగంగా పెరుగుతున్న చిన్న షేర్ల కన్నా... లీడర్లపై దృష్టిపెట్టండి. లోకల్‌ కంపెనీల డ్రీమ్‌ రన్‌... జాగ్రత్త! తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్, అపోలో మైక్రో సిస్టమ్స్, సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, బొందాడ ఇంజినీరింగ్‌ వంటి షేర్లు డిఫెన్స్‌ థీమ్‌తో ఇటీవల బీభత్సంగా ఎగిశాయి. ఎంటార్‌ షేరు ఏకంగా రెండుమూడు నెలల వ్యవధిలోనే 3–4 రెట్లు పెరిగిపోయింది. ఆదాయాలకు మించి పెరుగుతున్న ఇలాంటి షేర్లలో కరెక్షన్‌ వస్తే అది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి రిటైలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఇవీ.. డిఫెన్స్‌లో లీడర్లు → హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ → భారత్‌ ఎల్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ → భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌.. హెవీ డిఫెన్స్‌లో → మజగన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స లిమిటెడ్‌ → కొచిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ → గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ ప్రైవేటు డిఫెన్స్‌ షేర్లు... (స్మాల్‌–మైక్రోకాప్‌) → డాటా పాటర్న్స్‌ ఇండియా → పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ → సోలార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బాగా పెరిగిన తెలుగు రాష్ట్రాల షేర్లు → ఎంటార్‌ టెక్నాలజీస్‌ → అజాద్‌ ఇంజినీరింగ్‌ → బొందాడ ఇంజినీరింగ్‌ → సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (ఒకనాటి మెగాసాఫ్ట్‌) → అపోలో మైక్రో సిస్టమ్స్‌ (వీటిలో చాలా షేర్లు నిట్టనిలువుగా పెరిగినవని) పక్క పట్టిక చూస్తే 320 పీఈ వద్ద ట్రేడవుతున్న షేర్లు ఆరు నెలలు తిరక్కుండా ఆరేడు రెట్లు పెరిగిన షేర్లు కనిపిస్తాయి. నెలలోనే రెట్టింపయిన షేర్లూ ఉన్నాయి. మరి వీటి ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగాయా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన జవాబు రాదు. ఆదాయాలు కొంత పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఆదాయాలకు 10 నుంచి 20 రెట్లు షేర్లు పెరిగిపోవ టమే ఆందోళనకరం. రిటైలర్లు ఇలాంటి సమయాల్లో ఇంకా పెరుగుతాయనే ఆశతో ఎంటరయితే పడిపోయే అవకాశమూ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. పైపెచ్చు స్టోరీ ఆధారంగా పెరిగిన షేర్లు ఆ స్టోరీ గనక నిజం కాకపోతే నేలచూపులు చూడొచ్చు. అపుడు రిటైల్‌ ఇన్వెస్ట ర్లు ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. నష్టాలు భారీగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థీమ్‌ల వెంట పరుగులు పెట్టవద్దన్నది నిపుణుల సలహా. ఒకవేళ మీరు గనక థీమ్‌ను బలంగా నమ్మితే... ఆ రంగంలో లీడర్లను ఎంచుకోవాలే తప్ప చిన్నషేర్ల వెంట క్విక్‌ మనీ కోసం పరుగులు పెడితే ఇబ్బందులేనన్నది గ్రహించాలి. (రమణమూర్తి మంథా)

BMW M440i Launched in India at Rs 1 09 crore3
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త M440iను భారతదేశంలో రూ.1.09 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా భిన్నంగా.. ఫోల్డబుల్ హార్డ్-టాప్ రూఫ్‌ పొందుతుంది.M440i కన్వర్టిబుల్‌ 3.0-లీటర్, ఆరు-సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా.. 369bhp పవర్, 500Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, బీఎండబ్ల్యూ xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ (AWD) పొందుతుంది. 4.9 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకునే ఈ కన్వర్టిబుల్ టాప్ స్పీడ్ 250 కిమీ/గం.డిజైన్ పరంగా.. ఈ మోడల్ పెద్ద కిడ్నీ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన బాడీవర్క్, స్పోర్టీ బంపర్‌లు పొందుతుంది. ఇది స్టాగర్డ్ సెటప్‌తో కూడిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, వెనుక భాగంలో వ్రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.లోపల క్యాబిన్‌లో 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉన్నాయి. దీనికి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోల్స్టరీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెర్సిడెస్-బెంజ్ CLE క్యాబ్రియోలెట్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

What Most People Get Completely Wrong About Passive Income Says Robert Kiyosaki4
'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పాసివ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.పూర్తిగా యాక్టివ్ వర్క్ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు. కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్‌కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.పాసివ్ ఇన్‌కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలుమొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్‌కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

Global Shift to Gold May Drive Prices to 8000 Dollars by 2031 Deutsche Bank5
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

Cotton Shipment Decline Hits India Textile Exports6
డీలాపడ్డ టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు: కారణం ఇదే!

పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్‌మెంట్‌లు)లో తగ్గుదల కారణంగా టెక్స్‌టైల్స్, గార్మెంట్‌ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్‌టైల్స్‌ (–3.9%), రెడీమేడ్‌ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్‌ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.భారత్‌ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్‌–మేడ్‌ టెక్స్‌టైల్స్‌ రూపాయి పరంగా 3.6% పెరిగినా, డాలర్‌ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్‌ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్‌ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్‌ మార్కెట్లలో భారత్‌ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్‌ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు.

Advertisement
Advertisement
Advertisement