Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Falls as Strong Dollar Gains Amid US Iran Tensions1
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!

పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు.

RBI rejects Ujjivan Universal Bank application Loan Portfolio Imbalance2
ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్‌బీఐ

మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆర్‌బీఐ అభ్యంతరం ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్‌బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్‌బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్‌ బుక్‌ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

Bank of Baroda Jio Launch Bob World Lite Digital Banking Feature Phone Users3
ఫీచర్‌ ఫోన్‌తో సులువుగా ఆన్‌లైన్‌ లావాదేవీలు

దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపి డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు వేసింది. స్మార్ట్‌ఫోన్ లేని సామాన్యులకు కూడా అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను చేరువ చేస్తూ ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ ‘బాబ్ వరల్డ్ లైట్’ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది.ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జియోఫోన్ ‘ప్రైమా 4జీ’ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆశిస్తున్న ఆర్థిక సమగ్రత లక్ష్య సాధనలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా నిలవనుంది.సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు కేవలం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లకే పరిమితమవుతుంటాయి. కానీ, 'బాబ్ వరల్డ్ లైట్' దీనికి భిన్నం. బ్యాంకు, జియో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నా ఈ యాప్ నిరాటంకగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ అవసరం లేకుండా కీప్యాడ్‌తోనే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా సులభమైన నమోదు ప్రక్రియ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే..యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పేమనీ ట్రాన్స్‌ఫర్ (డబ్బు పంపడం)బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లుప్రొఫైల్ మేనేజ్‌మెంట్జియోఫోన్ ప్రైమా 4జీ పరికరాల్లో ఈ యాప్ ముందే లోడ్ చేయబడి ఉంటుంది. పాత వినియోగదారులు జియో స్టోర్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘డిజిటల్ బ్యాంకింగ్‌ను కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఈ ‘లైట్’ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని దేవదత్త చంద్ర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెలిపారు.ఈ భాగస్వామ్యం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ‘జియో ఎప్పుడూ సామాన్యుడికి డిజిటల్ సేవలను అందుబాటు ధరలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపి మేము అందిస్తున్న ఈ సేవలు దేశవ్యాప్తంగా ఉన్న జియోఫోన్ వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

TCS Nashik Harassment Conversion Scandal Tata Group Enforces Zero Tolerance4
‘ఉద్యోగుల దుష్ర్పవర్తనపై రాజీ పడబోం’

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) నాసిక్ బ్రాంచ్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణల కలకలంపై టాటా గ్రూప్ కఠినంగా స్పందించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం స్పష్టం చేశారు.విచారణాధికారిగా సీఓఓఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించేందుకు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైన చోట సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.అసలేం జరిగింది?గత మార్చి నెలలో టీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని తేలింది. ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. బాధితులను బలవంతంగా మతమార్పిడికి ప్రేరేపించడం, మాంసం తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవతలను అవహేళన చేస్తూ ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఏడుగురు అరెస్ట్..నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లుగా గుర్తించారు. వీరిపై లైంగిక వేధింపులు, మత విద్వేషాల ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద 8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.హెచ్ఆర్ అధికారుల వైఫల్యంపై విచారణబాధితులు గతంలోనే కంపెనీకి చెందిన హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పుణెకు చెందిన టీసీఎస్ హెచ్ఆర్ అధికారిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆమె నిందితులకు పరోక్షంగా సహకరించారా అనే కోణంలో నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వం సీరియస్.. సిట్‌ ఏర్పాటుమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘ఇది సమాజంలో విద్వేషాలు నింపే అత్యంత తీవ్రమైన విషయం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. నాసిక్ పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, నైతిక విలువలపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

US Naval Blockade Russia Proposes Uranium Transfer for Peace5
ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్‌ బ్లాకేడ్‌) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.యురేనియం తరలింపునకు ప్రతిపాదనప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.హార్మూజ్‌ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయంపాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్‌ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.యుద్ధం ముగిసేది ఎప్పుడు?ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..

Noida Industrial Workers Protest Wage Hike 12 Hour Shifts Safety Demands6
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..

దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్‌ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్‌మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Advertisement
Advertisement
Advertisement