Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Noida Industrial Workers Protest Wage Hike 12 Hour Shifts Safety Demands1
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..

దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్‌ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్‌మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

OpenAI Expands Global Footprint London Becomes Hub for AI Innovation2
లండన్‌లో ఓపెన్‌ఏఐ శాశ్వత కార్యాలయం

ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ బ్రిటన్ రాజధాని లండన్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.కీలక కేంద్రంగా లండన్..లండన్‌లోని ప్రముఖ ‘కింగ్స్‌ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్‌కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్‌ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్‌లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్‌ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. కారణం అదేనా?ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్‌ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్‌లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Dalal Street Tumbles Sensex Nifty Crash as Oil Surges Fed Signals Tight Policy3
తల్లడిల్లిన దలాల్ స్ట్రీట్!

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా మారడంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలువిఫలమైన శాంతి చర్చలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగియడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు, హార్మూజ్‌ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలవైపు మళ్లుతున్నారు.సెగ పుట్టిస్తున్న క్రూడాయిల్ ధరలుయుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102 డాలర్ల మార్కును అధిగమించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న ఆందోళన మార్కెట్‌ను కుంగదీసింది.ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో 2026లో వడ్డీ రేట్ల తగ్గింపు కేవలం ఒక్కసారి మాత్రమే ఉండొచ్చన్న సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్‌ఐఐ) ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా భారత మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ జరిగింది.నేటి మార్కెట్ గణాంకాలు (క్లోజింగ్ సమయానికి)సూచీముగింపునష్టం (పాయింట్లు)శాతం (%)సెన్సెక్స్76,842-702-0.90%నిఫ్టీ23,842-207-0.86%

Taiwan Naval Energy Drills Counter China Blockade Threat Amid Global Oil Shock4
చైనా ‘ఇంధన దిగ్బంధనం’పై తైవాన్ కసరత్తులు

ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్‌ బ్లాకేడ్‌) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.ఎస్కార్ట్ మిషన్లుఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్‌) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్‌లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్‌కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.ఇంధన సంక్షోభం వైపు తైవాన్?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్‌కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్‌ఎన్‌జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Microsoft to Shut Down Outlook Lite App Users Must Switch to Main Outlook Mobile5
ఏళ్ల తరబడి ఉన్న యాప్‌ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్‌

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్‌లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్‌ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్‌లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్‌లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్‌లుక్ మొబైల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్‌లుక్‌ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్‌లుక్ లైట్ యాప్‌లోనే అప్‌గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్‌కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్‌లుక్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్‌మెంట్లు ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్‌కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్‌కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

South Korea's Kim Jung-youn Named World's Youngest Female Tech Billionaire at 226
కొరియా చిన్నది.. కోట్ల సంపదలో పెద్దది!!

సాంకేతిక రంగం అంటేనే సృజనాత్మకతకు, అపారమైన సంపదకు నిలయం. తాజాగా ఈ రంగంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన 22 ఏళ్ల కిమ్ జంగ్-యున్ (Kim Jung-youn) ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా టెక్ బిలియనీర్‌గా ఫోర్బ్స్-2026 జాబితాలో నిలిచారు. గేమింగ్ రంగంలో ఆమె కుటుంబం సృష్టించిన సామ్రాజ్యం, నేడు ఆమెను ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.వారసత్వ సంపద.. అంతర్జాతీయ గుర్తింపుగేమింగ్ దిగ్గజం 'నెక్సాన్' (Nexon) వ్యవస్థాపకుడు, దివంగత కిమ్ జంగ్-జు కుమార్తె జంగ్-యున్. 2022లో తన తండ్రి మరణం తర్వాత, నెక్సాన్ హోల్డింగ్ కంపెనీ అయిన NXCలో ఆమెకు, ఆమె సోదరి జంగ్-మిన్‌కు భారీగా వాటాలు దక్కాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 12, 2026 నాటికి జంగ్-యున్ నికర ఆస్తి విలువ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,520 కోట్లు)ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నివసిస్తున్నారు. సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణ విషయాల్లో చాలా గోప్యంగా ఉండటానికే మొగ్గు చూపుతారు.నెక్సాన్.. గేమింగ్ రంగంలో ట్రెండ్ సెట్టర్1994లో ప్రారంభమైన నెక్సాన్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మాపుల్ స్టోరీ (MapleStory), డంజియన్ & ఫైటర్ (Dungeon & Fighter) వంటి ప్రపంచ ప్రసిద్ధ గేమ్స్ ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఏటా బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆసియా డిజిటల్ గేమింగ్ మార్కెట్‌లో నెక్సాన్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ బలమైన పునాదే నేడు జంగ్-యున్ సంపదకు ప్రధాన వనరు.2026లో యువ బిలియనీర్ల హవాఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 30 ఏళ్లలోపు వయస్సున్న బిలియనీర్ల సంఖ్య 35కు చేరింది. వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 92.4 బిలియన్ డాలర్లు. వీరిలో అత్యధికులు వారసత్వంగా ఆస్తులు పొందిన వారే అయినప్పటికీ, AI (కృత్రిమ మేధ) వంటి రంగాల్లో సొంతంగా ఎదిగిన వారు (Self-made) కూడా 12 మంది ఉండటం విశేషం. టెక్ రంగంలో జంగ్-యున్‌తో పాటు లువానా లోపెస్ లారా(కల్షి), లూసీ గువో (స్కేల్ ఏఐ) వంటి యువ మహిళామణులు కూడా సత్తా చాటుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement