Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SBI hikes ATM transaction charges1
ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీల పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎం, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రాయల్ మెషిన్ (ఏడీడబ్ల్యూఎం) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత పరిమితిని మించి ఉపయోగించే కస్టమర్లపై ఫీజులు పెరిగాయి. ఈ సవరించిన ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత, ఎస్‌బీఐ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణ చేస్తే ఒక్కో లావాదేవీకి రూ.23 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.11 + జీఎస్టీగా నిర్ణయించారు. ఇంటర్‌చేంజ్ ఫీజు పెరుగుదల నేపథ్యంలో ఏటీఎం సేవల ధరలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.ప్రభావం వీరిపైనే..ఉచిత లావాదేవీ పరిమితిని మించి ఎస్‌బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఈ మార్పులు ప్రధానంగా ప్రభావం చూపుతాయి. అయితే, పలు ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి మినహాయింపును ఎస్‌బీఐ ఇచ్చింది.ఉచిత లావాదేవీల పరిమితులురెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర కలిపి) యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితిని దాటిన తర్వాత సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై అన్ని ప్రదేశాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. గతంలో వీరికి అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి.ప్రభావం లేని ఖాతాలివే.. ఈ సవరణల వల్ల కింది ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాలు – ప్రస్తుత ఛార్జ్ నిర్మాణమే కొనసాగుతుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఎస్‌బీఐ ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితంగా, ఉచితంగా కొనసాగుతాయి. కిసాన్ క్రెడిట్ కార్డు (కేకేసీ) ఖాతాలకు కూడా ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.

India CPI inflation rises to 1. 33percent in December2
ధర దడ.. 3 నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో 2025 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.33 శాతం పెరిగింది. మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్‌లో 0.71 శాతంగా, 2024 డిసెంబర్‌లో 5.22 శాతంగా నమోదైంది. తాజాగా ఇది పెరిగినప్పటికీ వరుసగా నాలుగో నెలలోనూ, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న కనిష్ట పరిమితి రెండు శాతం లోపే ఉండటం గమనార్హం. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం–చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పులు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం, రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగినట్లు సీపీఐ డేటాను విడుదల చేసిన సందర్భంగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో (0.76 శాతం) పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా 2.03 శాతం స్థాయిలో నమోదైంది. ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైన టాప్‌ అయిదు పెద్ద రాష్ట్రాల్లో కేరళ (9.49 శాతం), కర్ణాటక (2.99 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (2.71 శాతం) ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేసే బాధ్యతను రిజర్వ్‌ బ్యాంక్‌కి కేంద్రం అప్పగించిన సంగతి తెలిసిందే.

HCLTech hikes fresher salaries3
ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు అనుబంధ ఆధునిక సాంకేతికతలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) భారీ ఎంట్రీ లెవల్ జీతాలు ఆఫర్ చేస్తోంది. డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ స్కిల్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఈ ఫ్రెషర్లను కంపెనీ అంతర్గతంగా ‘ఎలైట్ కేడర్’గా పిలుస్తోంది.జనవరి 12న జరిగిన డిసెంబర్ త్రైమాసిక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో హెచ్‌సీఎల్ టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘రెండు త్రైమాసికాల క్రితమే ఎలైట్ ఇంజనీర్లపై మా దృష్టిని స్పష్టంగా వెల్లడించాం. రెగ్యులర్ ఫ్రెషర్ నియామకాలతో పోలిస్తే, ఎలైట్ కేడర్‌కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతాలు అందిస్తున్నాం. ఇది సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది’ అని తెలిపారు.ఎలైట్ కేడర్‌కు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలంటే పోటీ జీతాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2025 జూలైలో సుందరరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఫ్రెషర్ నియామకాలలో ఎలైట్ కేడర్ వాటా సుమారు 15–20 శాతం ఉంటుంది. కంపెనీ ఇకపై పరిమాణం కంటే నాణ్యత, ప్రత్యేక నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇటీవల ఫ్రెషర్ల జీతాలను గణనీయంగా పెంచడం గమనార్హం.క్యూ3 ముగింపు నాటికి హెచ్‌సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ హెడ్‌కౌంట్ స్పల్పంగా 261 తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను జోడించినప్పటికీ, అట్రిషన్, సెలెక్టివ్ రేషనలైజేషన్ కారణంగా మొత్తం వర్క్‌ఫోర్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు చేర్చుకున్న మొత్తం ఫ్రెషర్ల సంఖ్య 10,032 గా ఉంది.హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలునోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 11% తగ్గి రూ.4,076 కోట్లకు పరిమితమైంది. ఏకీకృత ఆదాయం 13.3% పెరిగి రూ.33,872 కోట్లు నమోదు చేసింది.

India direct tax collections rise 8. 82percent in fy 20264
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 18.38 లక్షల కోట్లు 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 1 నుంచి జనవరి 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ. 18.38 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.82 శాతం పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూళ్లు పెరగడం, పన్నుల రిఫండ్‌లు నెమ్మదించడం ఇందుకు కారణం. ఆదాయ పన్ను శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం కార్పొరేట్‌ ట్యాక్స్‌ల వసూళ్లు నికరంగా 12.4 శాతం పెరిగి రూ. 8.63 లక్షల కోట్ల కు చేరగా, వ్యక్తుల–హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), కార్పొరేట్‌యేతర వర్గాల నుంచి వసూళ్లు 6.39 శాతం పెరిగి రూ. 9.30 లక్షల కోట్లకు చేరాయి. సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను వసూళ్లు ఫ్లాట్‌గా రూ. 44,867 కోట్లుగా ఉన్నాయి. ట్యాక్స్‌ రిఫండ్‌లు 17 శాతం క్షీణించి రూ. 3.12 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 4.14 శాతం పెరిగి రూ. 21.50 లక్షల కోట్లకు చేరాయి.

TCS net profit fell 14percent to Rs 10657 cr in Q35
లాభాల్లోనే లాస్‌  బలంగానే బిజినెస్‌

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 10,657 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కొత్త కారి్మక చట్ట నిబంధనల అమలు ప్రభావం చూపినట్లు టీసీఎస్‌ పేర్కొంది. ఇందుకు రూ. 2,128 కోట్లు(వన్‌టైమ్‌) కేటాయించింది. లేదంటే నికర లాభం 8.5 శాతం ఎగసి రూ. 13,438 కోట్లకు చేరేదని తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2లో రూ. 12,075 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 67,087 కోట్లకు చేరింది. క్యూ2లో రూ. 63,973 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఆర్డర్లు గుడ్‌ తాజా సమీక్షా కాలంలో టీసీఎస్‌ 9.3 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటాదారులకు రూ. 11 మధ్యంతర డివిడెండ్‌తోపాటు షేరుకి రూ. 46 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను సైతం బోర్డు సిఫారసు చేసింది. వెరసి ఒక్కో షేరుకీ రూ. 57 చొప్పున చెల్లించనుంది. మార్జిన్లు ఓకే తాజా త్రైమాసికంలో టీసీఎస్‌ నిర్వహణ మార్జిన్లు క్యూ2తో పోలిస్తే నిలకడగా 25.2 శాతంగా నమోదయ్యాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో 24.5 శాతం మార్జిన్లు సాధించింది. క్యూ2 బాటలో రానున్న త్రైమాసికంలోనూ ఆదాయం వృద్ధి కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్‌ తెలియజేశారు. ఏఐ ఆదాయం 17 శాతం జంప్‌చేసినట్లు వెల్లడించారు. ఆదాయంలో ఉత్తర అమెరికా వాటా 1.3 శాతం పుంజుకోగా.. యూకే 3.2 శాతం నీరసించింది. దేశీ ఆదాయం 34 శాతం క్షీణించింది. క్యూ3లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 11,151 తగ్గి 2025 డిసెంబర్‌ 31 కల్లా 5,82,163కు పరిమితమైంది. ఇందులో, పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా 1,800 మంది ని్రష్కమించినట్లు సంస్థ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు బీఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,236 వద్ద ముగిసింది.

SBI Har Ghar Lakhpati scheme monthly Rs 610 could build Rs 1 lakh6
ప్రతి ఇంట్లో లక్షాధికారి! ఈ ఎస్‌బీఐ స్కీమ్‌ గురించి తెలుసా?

ప్రతి కుటుంబం తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్న ఖర్చుల వల్ల భవిష్యత్‌ కోసం పొదుపు, పెట్టుబడులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలంటే అధిక జీతం లేదా ఒకేసారి భారీ పెట్టుబడి అవసరమనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఈ భావనకు భిన్నంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకువచ్చిన ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పథకం నిలుస్తోంది. నెలకు కేవలం రూ.610 పెట్టుబడితోనే రూ.1 లక్ష కార్పస్ ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పథకం?ఇది ఎస్‌బీఐ అందిస్తున్న ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితి పాటు ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు పూర్తయ్యాక ఒకేసారి మొత్తం (అసలు + వడ్డీ) లభిస్తుంది. క్రమమైన పొదుపు అలవాటును పెంపొందించడం, ఆర్థిక ఒత్తిడి లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.ఈ ఆర్డీ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.రూ.610తో రూ.1 లక్ష ఎలా?ఈ పథకంలోని 10 ఏళ్ల ప్లాన్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నెలకు రూ.610 చొప్పున పొదుపు చేస్తే, 10 సంవత్సరాల అనంతరం వడ్డీతో కలిపి సుమారు రూ.1 లక్ష కార్పస్ లభిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ.20 పొదుపు చేస్తే చాలు.. ఆరు అంకెల మొత్తాన్ని సాధించవచ్చు. ఈ కారణంగానే వేతనజీవులు, ఉద్యోగులు, కొత్తగా పొదుపు చేసేవాళ్లు, తక్కువ ఆదాయం కలిగినవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా మారింది.వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. ‘హర్ ఘర్ లఖ్‌పతి’ ఆర్డీ పథకంపై వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితి, పొదుపుదారు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి. సాధారణ పౌరులకైతే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 6.55 శాతం, 5–10 సంవత్సరాల కాలానికైతే 6.30% వడ్డీ లభిస్తుంది.అదే సీనియర్ సిటిజన్లు అయితే 3–4 సంవత్సరాల కాలానికి గరిష్ఠంగా 7.05 శాతం, 5–10 సంవత్సరాల కాలానికి 6.80% వడ్డీ అందుకుంటారు. ఈ వడ్డీ రేట్లు ఎస్‌బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మారవచ్చు అన్నది గమనించాలి.తక్కువ కాలంలో లక్ష్యం చేరాలంటే?త్వరగా రూ.1 లక్ష కార్పస్ కావాలనుకునే వారు ఎక్కువ నెలవారీ చందాతో తక్కువ కాలాన్ని ఎంచుకోవచ్చు. 3 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.2,510, 5 సంవత్సరాల్లో రూ.1 లక్ష కావాలంటే నెలకు సుమారు రూ.1,420 పొదుపు చేయాల్సి ఉంటుంది.రూ.1 లక్ష కన్నా ఎక్కువ కావాలంటే..ఈ పథకం కేవలం రూ.1 లక్ష వరకే కాదు. పొదుపుదారులు రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు వంటి అధిక లక్ష్యాలను కూడా ఎంచుకోవచ్చు. లక్ష్యం మొత్తాన్ని బట్టి నెలవారీ చందా ఆధారపడి ఉంటుంది. పిల్లల చదువు, వివాహ ఖర్చులు, అత్యవసర నిధి వంటి మధ్యకాలిక అవసరాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఎవరు అర్హులు?భారతీయ పౌరుడెవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవవచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతా కలిగి ఉండవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు.

Advertisement
Advertisement
Advertisement