ప్రధాన వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!
సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026
బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం..
సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలుఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Zenith Roy Chakraborty (@zenithroyofficial)నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?
అపార్ట్మెంట్ల ధరలు పెరిగే అవకాశం!
పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలు (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఎన్నికల ప్రభావంనిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?
1.70 లక్షల ల్యాండ్ రోవర్ కార్లు రీకాల్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో సుమారు 1.70 లక్షల హైబ్రిడ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారులోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన లోపం వల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది.సమస్య ఏమిటంటే?ఈ వాహనాల్లోని DC-DC కన్వర్టర్లోని బూస్ట్ కంట్రోల్ మైక్రోచిప్లో అంతర్గత లోపం ఉన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ భాగం 12-వోల్ట్ బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్ను నియంత్రిస్తుంది. ఇది విఫలమైతే, వాహనానికి అందే విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. దీనివల్ల కారు ప్రొపల్షన్ (ముందుకు కదిలే శక్తి), బాహ్య లైట్లు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.హెచ్చరిక సంకేతాలుసిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడానికి ముందు, డ్యాష్బోర్డ్ పై "Stop Safely Electric Fault Detected" అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ దీనిని గమనించకుండా డ్రైవింగ్ కొనసాగిస్తే గేర్బాక్స్ సరిగ్గా పనిచేయదు. కారు 'న్యూట్రల్' మోడ్లోకి వెళ్తుంది.సెంట్రల్ డిస్ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఆగిపోతాయి. చివరగా ఇంజిన్, బాహ్య లైట్లు పనిచేయడం నిలిచిపోయి వాహనం ఆగిపోతుంది.ప్రభావితమైన మోడళ్లు మొత్తం 1,70,169 ఎస్యూవీలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎవోక్ (2020-2023), స్పోర్ట్ (2019-2024), వెలార్ (2021-2024), రేంజ్ రోవర్ స్టాండర్డ్ (2020-2024) మోడళ్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ డిస్కవరీ(2021-2024), డిస్కవరీ స్పోర్ట్(2020), డిఫెండర్ (2020-2024), జాగ్వార్ ఇ-పేస్ (2021-2022), ఎఫ్-పేస్ (2021-2024) వాహనాలకూ రీకాల్ వర్తిస్తుంది.పరిష్కారం ఇంకా సిద్ధం కాలేదురాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సమస్యకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం సిద్ధంగా లేదు. సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ అప్డేట్ కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. వాహన యజమానులకు ప్రమాదం గురించి హెచ్చరిస్తూ జూన్ 12, 2026 నాటికి నోటీసులు అందుతాయి. పరిష్కారం సిద్ధమైన తర్వాత తుది మరమ్మతు లేఖలు కంపెనీ పంపుతుంది.భారత్పై ప్రభావం?ప్రస్తుతానికి ఈ రీకాల్ కేవలం అమెరికా మార్కెట్కే పరిమితం చేసింది కంపెనీ. అయితే, భారతీయ యజమానులు (ముఖ్యంగా దిగుమతి చేసుకున్న మోడళ్లు వాడుతున్న వారు) గ్లోబల్ VIN (వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్) తనిఖీల ద్వారా తమ కారు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కియోసాకి కొత్త వార్నింగ్.. ఈవీలపై కీలక కామెంట్స్
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?
ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.కేటగిరీ మారినా.. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..
మనం రోజూ ఆగే పానీపూరీ బండి ఒక వారం రోజులు కనిపించకపోతే ఏమనుకుంటాం? బహుశా ఆ పానీపూరీ వాలా ఊరెళ్లాడనో లేక తనకు ఆరోగ్య సమస్యనో అనుకుని మరో బండి వద్దకు వెళ్తాం. కానీ ఒక కస్టమర్ మాత్రం తాను రెగ్యులర్గా వెళ్లే పానీపూరీ బండి వ్యక్తి ఎందుకు రావట్లేదో ఆరా తీశాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో కింద చూద్దాం.ఎక్స్ (ట్విట్టర్) యూజర్ అంకిత్ పాండే నిత్యం ఒకే బండి దగ్గర పానీపూరీ తినేవాడు. వరుసగా పది రోజుల పాటు ఆ బండి కనిపించకపోవడంతో అంకిత్ అనుమానం వచ్చి పాత గూగుల్పే లావాదేవీల ద్వారా సదరు బండి నిర్వాహకుడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అవతలి నుంచి వచ్చిన సమాధానం అంకిత్ను కలిచివేసింది.తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ వైద్య ఖర్చుల కోసం తన జీవనోపాధి అయిన పానీపూరీ బండిని అమ్మేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేయడానికి పని లేదు. ‘సార్, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి’ అని అతను అడిగిన ఆ ఒక్క మాట అంకిత్ ఆలోచనను మార్చేసింది.సహాయం కాదు.. భాగస్వామ్యం!కేవలం కొంత ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోవడం కంటే అతనికి మళ్లీ ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు. రోడ్డు పక్కన బండి పెట్టే స్థాయి నుంచి అతడిని ఒక గౌరవప్రదమైన షాపు యజమానిని చేసేలా మాస్టర్ ప్లాన్ వేశాడు.కొత్త బిజినెస్ మోడల్ ఇలాఅంకిత్ పాండే రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ప్రధాన కూడలిలో నెలకు రూ.15,000 అద్దెతో ఒక షాపు లీజుకు తీసుకున్నాడు. పానీపూరీ బండి వ్యక్తితో నెలకు రూ.20,000 వేతన ఒప్పందం చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపు ఓపెన్ ఉండేలా ప్లాన్ చేశాడు.నమ్మకమే పెట్టుబడిగా..‘ఈ షాపు ద్వారా రోజుకు కనీసం రూ.5 వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంటే నెలకు రూ.1.5 లక్షల ఆదాయం. ఖర్చులన్నీ పోను మీరు రూ.60 నుంచి 70 వేల వరకు లాభం పొందవచ్చు’ అని ఆ బండి వ్యక్తి గణాంకాలతో సహా వివరించడం అంకిత్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నీ కోల్పోయిన వ్యక్తిలో ఇంకా ఎదగాలనే తపన కనిపిస్తోంది. ఇది సానుభూతితో చేస్తున్న సాయం కాదు, ఒక వ్యక్తి మనస్తత్వానికి నేను పెడుతున్న పెట్టుబడి’ అని అంకిత్ పేర్కొన్నారు.My panipuri wala disappeared 10 days ago. No cart, no sign. I used to go there almost daily, so it felt strange.Today I found his number from old GPay payments and called him.He said he sold his entire cart because his wife was admitted to the hospital.Everything gone. No…— Ankit Pandey (@iamankitpande) April 23, 2026నెటిజన్ల రియాక్షన్ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఒకరిలో ఉన్న ఎదుగుదలను గుర్తించి భాగస్వామిగా చేర్చుకోవడం గొప్ప విషయం’ అని ఒక యూజర్ కొనియాడారు. ‘వ్యాపారం పుంజుకున్నాక సదరు వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా అనేది గమనించాలి. డబ్బు మనుషులను మారుస్తుంది’ అని మరొకరు హెచ్చరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం గొప్ప విషయమే, కానీ ఆ వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించి అతడిని తిరిగి ఒక వ్యాపారస్థుడిగా మార్చడం నిజమైన సామాజిక బాధ్యత అని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
కార్పొరేట్
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..
తాన్లా లాభం రూ. 134 కోట్లు
రిలయన్స్ లాభం డీలా
బిల్గేట్స్ను వెనక్కి నెట్టిన అదానీ
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
పెరిగిన యూనియన్ బ్యాంక్ లాభం.. రూ.5 డివిడెండ్
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
పెట్రోల్ ధరలు పెరగొచ్చా..? స్పందించిన కేంద్రం
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజ...
పసిడి, వెండి.. డబుల్ ధమాకా!
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. ...
నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్ట...
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ...
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని ...
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్ మార్కెట్పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
75 శాతం కోడింగ్ ఏఐతోనే!
టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్లో రాసే కొత్త కోడ్లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.ఏజెంటిక్ యుగంలోకి..గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణగతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్ప్రైజ్ ఏజెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిందని చెప్పారు.ఆరు రెట్లు వేగంగా పనులుగూగుల్ తన సొంత ఎకోసిస్టమ్లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.మాక్ఓఎస్ (macOS)లోని జెమిని యాప్ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఏమిటీ వివాదం?మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.నియంత్రణ సంస్థల నిఘా నీడలో..కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ వాదనఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా యువత నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని అత్యంత ప్రతిభావంతులైన కొందరు యువతను ఉద్దేశించి రష్యాలోని లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇపుడు నెట్టింట ఆందోళనకరంగా మారింది. అయితే భయపడకండి, ఆశాజనకంగా ఉండండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములవ్వండి! అంటూ ఒక సవాలును యువత ముందుంచడమే ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? ఆయన వ్యాఖ్యల అర్థం పరమార్థం ఏంటి?జాక్ మా సందేశంయూనివర్శిటీలోని మేధావులతో జాక్ మాట్లాడుతూ “ప్రపంచంలోని 99.9శాతం మందికి భవిష్యత్తు లేదు” అన్న వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు. అత్యంత తెలివైన, సమర్థులైన యువత భయానికి, నిరాశకు లొంగిపోతే, ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు ముందుకొస్తారన్న జాక్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాస్కో యూనివర్శిటీకి చెందిన మీరు కూడా సమస్యలను పరిష్కరించలేకపోతే, మీరే భయపడితే.. ఇక ప్రపంచంలోని 99.9% మందికి భవిష్యత్తు ఉండదు.” అని అన్నారు. వెంటనే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపించారు. తెలివైన, సమర్థులైన యువతే భయపడి చేతులు ముడుచుకు కూర్చుంటే, ఇక ప్రపంచాన్ని రక్షించే వారెవరూ ఉండరు. అందుకే సమస్యలొస్తాయని భయపడటం మానేసి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు నిచ్చారు.సానుకూలంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృథా చేసుకోవద్దని యువ మేధావులకు సూచించారు. భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా, పని మొదలుపెట్టాలని చెప్పారు. ఆందోళన చెందితే, మకో అవకాశమేదీ ఉండదు. భయం నుండి కార్యాచరణకు మారడమే గొప్ప విజయం అని పేర్కొన్నారు. Jack Ma explains why action matters more than worrying about the future pic.twitter.com/zKHPzHJRS1— Mindset Machine (@mindsetmachine) April 16, 2026 నిజానికి ప్రపంచంలోని ప్రతి ఆందోళన ఒక అవకాశమే అన్నారు. యంత్రాల వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ప్రజలు భయపడితే, మార్పు గురించి ఆందోళన చెందితే ఫలితం లేదు. నిజానికి అది పూరించాల్సిన ఖాళీ. విద్యావంతులైన, సమర్థులైన యువత చేయాల్సిన పని ఈ ఆందోళనల నుండి దాక్కోవడం కాదు, వాటి వద్దకు నేరుగా వెళ్లి, వాటిని అర్థం చేసుకుని, పరిష్కారాలను గుర్తించడం. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవడం. సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించడం మొదలుపెడితే ప్రపంచ భవిష్యత్తును మార్చవచ్చు అని జాక్మా సూచించడం విశేషం.
పర్సనల్ ఫైనాన్స్
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.


