ప్రధాన వార్తలు
పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఏ దేశమూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలగాలనుకోవడం లేదని చెప్పారు.నిర్మాణాత్మక చర్చలు - స్థిరమైన బంధాలుఓ కార్యక్రమంలో గ్రీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములతో అమెరికా జరుపుతున్న చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని వెల్లడించారు. అమెరికా వాణిజ్య విధానాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించినప్పటికీ దాని ప్రభావం వల్ల భాగస్వామ్య దేశాలు తమ ఒప్పందాల నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటివరకు ఏ దేశం కూడా మా వద్దకు వచ్చి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని చెప్పలేదు’ అని గ్రీర్ పేర్కొన్నారు.ఈయూ, ఇతర దేశాలతో సమన్వయంప్రస్తుత వాణిజ్య ఒప్పందాలకు అమెరికా కట్టుబడి ఉందనే అంశాన్ని బలోపేతం చేయడానికి గ్రీర్ ఇప్పటికే ఈయూలోని తన సహచరులతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇతర కీలక దేశాల అధికారులతో కూడా ఇలాంటి చర్చలు జరపడానికి షెడ్యూల్ ఖరారైంది. అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ షెడ్యుల్ను రూపొందించినట్లు అమెరికా చెప్పింది.విశ్లేషకుల అభిప్రాయంఅమెరికాలోని అంతర్గత చట్టపరమైన మార్పులు లేదా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభావితం చేయవనే నమ్మకం వాణిజ్య భాగస్వాముల్లో ఉందని గ్రీర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యూఎస్ అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించడమే కాకుండా మిత్రదేశాల మధ్య విశ్వాసాన్ని పటిష్టం చేస్తుంది. వాణిజ్య విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అమెరికా తన గ్లోబల్ ట్రేడ్ లీడర్షిప్ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!
ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!
కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి మన తరఫున పనులు పూర్తి చేసే ఏజెంటిక్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా మాస్టర్ కార్డ్ తన వినూత్న ఏజెంటిక్ కామర్స్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. కేవలం వస్తువులను సిఫార్సు చేయడమే కాకుండా వినియోగదారుడి అవసరాలను గుర్తించి బేరసారాలు ఆడి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ ఏఐ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితేంద్ర రాజ్పుత్ కొన్ని అంశాలు వెల్లడించారు.స్థానిక భాషల్లో ఆర్థిక లావాదేవీలుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్ కార్డ్ తన ఏజెంటిక్ వ్యవస్థను రూపొందించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సైతం ఏఐ ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో వినియోగదారుడు మొదటగా తనకిష్టమైన భాషను ఎంచుకోవచ్చు. వాయిస్ సపోర్ట్తో కూడిన ఈ టెక్నాలజీ వివిధ భారతీయ భాషల్లో సంభాషించగలదు.భారతీయ నిబంధనలకు అనుగుణంగా డేటా స్థానికీకరణ (Data Localization), గోప్యత, భారతీయ ఆర్థిక చట్టాలకు లోబడి ఈ ఫ్రేమ్వర్క్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ‘మేము భారతదేశంలో దశాబ్దాలుగా సర్వీసులు అందిస్తున్నాం. ఇక్కడి డేటా నిబంధనల ఆధారంగానే మా ఏజెంటిక్ కామర్స్ ఏర్పాటు చేశాం’ అని రాజ్పుత్ స్పష్టం చేశారు.సాధారణ ఈ-కామర్స్ Vs ఏజెంటిక్ కామర్స్సాధారణ ఈ-కామర్స్లో మీరు ఒక వెబ్సైట్కి వెళ్లి వస్తువులను వెతికి, ధరలను పోల్చి, మీరే ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఏఐ కేవలం ‘మీకు ఫలానా వస్తువులు నచ్చవచ్చు’ అని సిఫార్సులు మాత్రమే చేస్తుంది.ఏజెంటిక్ కామర్స్లో ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. మీరు దానికి ఒక పని చెబితే (ఉదాహరణకు: వచ్చే వారం మా నాన్నగారి పుట్టినరోజు కోసం రూ.5000 బడ్జెట్లో ఒక మంచి వాచ్ కొనాలి), అది స్వయంగా ఇంటర్నెట్లో వెతుకుతుంది. రివ్యూలు చదువుతుంది. ఉత్తమమైన ధర ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. చివరగా మీ అనుమతితో లావాదేవీని పూర్తి చేస్తుంది.మోసాలకు తావులేని ఆటోమేషన్ఏఐ ఏజెంట్లు స్వయంగా ఖర్చు చేస్తాయంటే భద్రతపై ఆందోళన కలగడం సహజం. దీన్ని అరికట్టడానికి మాస్టర్ కార్డ్ టోకెనైజేషన్, పాస్ కీ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏజెంట్ లావాదేవీ చేయాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి కంపెనీ తన ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేసింది. ఇది వినియోగదారుడి గత చరిత్రను విశ్లేషించి అసాధారణ మార్పులను వెంటనే గుర్తిస్తుంది. గ్రాఫ్ ఆధారిత సాంకేతికత ద్వారా సింథటిక్ ఐడెంటిటీలు, అంతర్జాతీయ మోసగాళ్ల నెట్వర్క్లను పసిగట్టడం మాస్టర్ కార్డ్ ప్రత్యేకతని కంపెనీ తెలిపింది.ఉద్యోగాల కోత కాదు..ఏజెంటిక్ ఏఐ రాకతో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు రాజ్పుత్ స్పందిస్తూ ‘కచ్చితంగా ఉద్యోగాల స్వరూపంలో మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగాల కోత కంటే వివిధ జాబ్ రోల్స్పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని విశ్లేషించారు. మెకానికల్ పనులను ఏఐ చూసుకుంటే మానవులు మరింత సృజనాత్మక, వ్యూహాత్మక పనుల వైపు మళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్కు రెడీనా?
బంగారం, వెండి ధరలు.. మళ్లీ కొత్త మార్క్లు
దేశంలో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలతో కొనుగోలుదారులకు షాకులిస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) ఐదో రోజు కొత్త మార్క్లను తాకాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
నగదు వ్యవహారాలు వద్దే వద్దు ..!
నగదు వ్యవహారాలు ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. వ్యవస్థలో నగదు చెలామణి ఈ జనవరిలో రూ. 40 లక్షల కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఇది వార్షికంగా 11.1% చొప్పున పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదల ఒక చరిత్రను సృష్టిస్తోంది. మరోవైపు డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా యూపీఐ వాడే వారి సంఖ్య 400 మిలియన్లు. దానిని మరో 600 మిలియన్లకు పెంచి ‘ఒక బిలియన్’కి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు ‘స్కాన్అండ్పే’ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తు ‘డిజిటల్ ప్రపంచమే’. అయినా మనిషి మారడం లేదు. నగదు వదలట్లేదు. రాజకీయ ఎన్నికల్లో నగదు పంపిణీ గురించి వింటాం. సినిమా ఇండస్ట్రీలో అది పరిపాటి. రియల్ ఎస్టేట్లో అలవాటు. లంచావతరాలకు దురలవాటు. ఎందుకో ఈ పొరపాటు చేసిన తర్వాత, దొరికిపోయిన తర్వాత గ్రహపాటు అని సరిపెట్టుకోవడం సాధారణమైంది. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సక్రమమైన మార్గంలోనే సంపాదిస్తూ చౌక రోజుల్లో ఇళ్లు, ఫ్లాటు కొన్నారు. కాలం కలిసొచ్చింది. వాటిని అమ్మినప్పుడు భారీ లాభాలు వచ్చాయి.అయితే మార్కెట్ ధరని మించిన ప్రతిఫలాన్ని నగదులో తీసుకున్నారు. సక్రమమైన(వైట్) వ్యవహారాన్ని ఆదాయపన్ను వారికి డిక్లేర్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంట్లో కొండచిలువగా నగదు నిలువ ఉంది. ఏం చేయాలి? ఇదొక పెద్ద ప్రశ్న..! ఇంతటితో ఆగిపోయిందా? లేదు. జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు స్నేహితుడికి వైద్యం నిమిత్తం రూ.6 లక్షలు నగుదు రూపంలో ఇచ్చింది. ఆ స్నేహితుడు తన భార్య ఆనారోగ్యం కోసం ఖర్చు పెట్టినా భార్య చనిపోయింది. తరువాత ఇన్సూరెన్సు డబ్బు బ్యాంకు ద్వారా వచ్చాయి. ‘చేతిలో నగదు లేదు. తను తిరిగి చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తం చెక్కు ద్వారా ఇస్తాను’ అంటున్నాడు. ఇప్పుడు ఆ జాలి గుండె కలిగిన ఆ ఇల్లాలు ఆ మొత్తాన్ని ఎలా చూపించాలన్నది ప్రశ్న.మంచికి పోతే చెడు ఎదురురొచ్చింది..? తండ్రి బతికున్నప్పుడు జాగాలో సగం రాయించుకున్నాడు పెద్ద కొడుకు. పెద్దలు ఇద్దరూ కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మిగిలిన సగం జాగా పెద్దవాడికే అమ్మేశారు. కానీ పెద్దవాడు వ్యాపారంలో బాగా సంపాదించడం వలన తన దగ్గర ఉన్న నగదు కుటుంబ సభ్యులకిచ్చి వ్యవహారం నడిపించాడు. డబ్బు మీద వ్యామోహం వలన అందరూ నగదు వైపే మొగ్గు చూపించారు. ఒక్కొక్కరి చేతిలో పదేసి లక్షల మూట చేరింది. అటు పెద్దకొడుకు తన ‘బ్లాక్మనీ’ని వదిలించుకొని మిగతా అందరికి నగదు పంచి ఇచ్చాడు.నగదు నాగుపాములా తయారైంది.! అన్నదమ్ములు ఐక్యంగా ఉన్న కుటుంబంలో అన్న పురోహితుడు, తమ్ముడు క్యాటరింగ్ చేసేవారు. ఇద్దరికి దశ తిరిగింది. బాగా డబ్బులు నగదు రూపంలో వచ్చాయి. భార్యామణుల సలహామేరకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. కాలక్రమేణా పెద్ద మొత్తాలుగా మారాయి. టీడీయస్.. ఇన్కమ్టాక్స్.. పన్ను ఎగవేత ఉద్దేశంతో ఇన్కమ్ రిటర్నులు వేయడం లేదు. ఇప్పుడేం చేయాలనేది ఎడతెగని ప్రశ్న..?తను ఒక చిన్న ఇంట్లో ఉంటూ తన పది ప్లాట్లు కేవలం నగదుకే అద్దెకిచ్చి, అద్దె వసూలు చేస్తూ జీవితం కులాసాగా గడుపుతున్నాడు గోవిందం. పొరపాటున ఒక కిరాయిదారునికి ఇచ్చిన రశీదు కొంప ముంచింది. ఒకటి నగదు రశీదు. రెండవది పన్ను ఎగవేత. వీటి విషయం ఏమిటంటే.. నగదు వ్యవహారాలను చేయకండి. అసలు ప్రోత్సహించకండి. నల్లధనం (బ్లాక్ మనీ) వైపు వెళ్లొద్దు. నగదులో అప్పు ఇవ్వడం తప్పు. పుచ్చుకోవడం మరీ తప్పు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకు ద్వారా చెల్లిస్తే అది ఆదాయంగా మారి పన్నుకి గురి అవుతుంది. నగదు తీసుకోవడం తప్పని చెప్పాం కదా..! పోనీ దానిని అకౌంటు చేస్తే కనీసం మీ నిజాయితీ తెలుస్తుంది. గణనీయంగా పెరిగిన నగదు వ్యవహారాలను కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా కనుక్కొవచ్చు. డిపార్ట్మెంట్ వారి వద్ద ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ విభాగాలున్నాయి. మీరు సంపాదించిన ‘ధనం’ మీ దగ్గర ఉన్నా, వారి దగ్గర ‘ఇంధనం’ లాంటి సమాచారం ఉంది. ఈ రెండింటిని అనుసంధానం చేసే అవకాశం ఇవ్వకండి. సౌకర్యం కోసం నగదుని ఆశ్రయించకండి. అన్ని విధాల బ్యాంకు దారి సక్రమమైన రహదారి.
900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్..
టొయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్యూవీ టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.ట్రాన్స్మిషన్ సాఫ్ట్వేర్ లోపమే కారణంకంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్మిషన్లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్వేర్ లోపం వల్ల ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్మిషన్ ఓవర్-రివింగ్కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్మిషన్కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.లెక్సస్ ఎల్ఎక్స్లోనూ ఇదే యూనిట్గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ను లెక్సస్ ఎల్ఎక్స్ మోడల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.రీకాల్లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్ను సంప్రదించాలని సూచించింది.భారత్లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 174 పాయింట్లు పెరిగి 25,746 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 582 పాయింట్లు పుంజుకొని 83,381 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.47బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.08 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.69 శాతం పెరిగింది.నాస్డాక్ 0.9 శాతం పుంజుకుంది.Today Nifty position 23-02-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్..
బీమా వృద్ధికి ఎఫ్డీఐల దన్ను
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..
శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయం...
బంగారం రూ.2 లక్షలకు?
ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్ర...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్ట...
బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను ...
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా స...
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించ...
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే..
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్లోడ్లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు.
పర్సనల్ ఫైనాన్స్
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.Although Bitcoin is crashing I bought one more whole Bitcoinfor $67k.Why? Two reasons: # 1: Because the Big Print will begin when the US debt crashes the dollar and “The Marxist Fed” begins printing trillions in fake dollars.#2: The magical 21 millionth Bitcoin is…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 20, 2026
పీఎఫ్పై లోన్ తీసుకోవచ్చా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.
ఎక్కువ జీతాలొచ్చేవారికి ఐటీ నోటీసులు!!
భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.ఈ అంశాల్లో వ్యత్యాసాలువిదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.డేటా విశ్లేషణతో గుర్తింపుప్రస్తుత అసెస్మెంట్ సైకిల్లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?ఇది డీఐఎన్ నంబర్తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.ట్యాక్స్ పేయర్స్ ఏం చేయాలంటే..సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలిపూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలిఅవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలివడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలిఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


