Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Supreme Court Redefines Telecom Spectrum Public Asset what govt will do1
ఏజీఆర్‌ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!

భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్‌) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్‌కామ్‌ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్‌ఫాల్‌ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్‌ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్‌.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!

Gold and Silver rates on 04 March 2026 in Telugu states2
బిగ్‌రిలీఫ్‌.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

India Stays Alert as West Asia Tensions, Govt Confirms 50 Day Oil Reserves3
భారత్‌ క్రూడాయిల్‌, ఎల్పీజీ నిల్వలు ఇలా..

పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.నిల్వల లభ్యత ఇలా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం ముడి చమురు 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజులకు సరిపోతాయి. మొత్తంగా 50 రోజుల వరకు ఎటువంటి సరఫరా అంతరాయం లేకుండా దేశ అవసరాలను తీర్చవచ్చు. ఇవి కాకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూరులోని వ్యూహాత్మక నిల్వల్లో 4.094 మిలియన్ టన్నుల ముడి చమురు సిద్ధంగా ఉంది. ఇది మన మొత్తం సామర్థ్యంలో (5.33 మెట్రిక్‌ టన్నులు) సుమారు 77 శాతానికి సమానం.స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్..భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ప్రతిరోజూ సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను దేశం వినియోగిస్తోంది. గతంలో దిగుమతుల్లో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి దిగుమతులు పెరగడంతో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా వచ్చే చమురు వాటా 50 శాతానికి చేరింది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం ద్వారా సరఫరా సవాలుగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వ చర్యలుపరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ‘మేము అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా చమురును సేకరిస్తున్నాం. రిఫైనరీలు అవసరమైనప్పుడు ఇతర వనరుల నుంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి’ అని ఒక అధికారి తెలిపారు.ధరల పెంపు ఉంటుందా?ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. అయితే, యుద్ధం 10-15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎల్పీజీ పరిస్థితి ఏమిటి?వంట గ్యాస్ విషయంలోనూ భారత్ ఊరటనిచ్చే సమాచారమే ఇచ్చింది. భారత్ వద్ద 25-30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. మనం 80-85% ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. 2025 ఆ‍ర్థిక సంవత్సరంలో 20.67 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే రెండు వారాల్లో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతరాయాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకే రాజ్యసభలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: యుద్ధ భయాలు.. మార్కెట్‌లో నీలినీడలు

Stock market updates on 04 March 20264
యుద్ధ భయాలు.. మార్కెట్‌లో నీలినీడలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.15బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.2 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.94 శాతం నష్టపోయింది.నాస్‌డాక్‌ 1.02 శాతం దిగజారింది.అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా భారీగా తగ్గాయి.దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.Today Nifty position 04-03-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Middle East War Shakes Global Markets US Stocks Plunge Oil Collapse5
క్రూడ్‌ కల్లోలం.. గ్లోబల్‌ మార్కెట్లు కుదేల్‌

అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్‌ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్‌డాక్‌ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్‌అండ్‌పీ 500లోని 95 శాతం స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 5.4 శాతం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 5.8 శాతం పతనమయ్యాయి.అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆయిల్‌ అప్‌.. గోల్డ్‌ డౌన్‌..అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.ఇదీ చదవండి: పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?

RBI says 98. 44 Percent of withdrawn Rs 2000 banknotes returned6
రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్‌బీఐ

ముంబై: మార్కెట్‌ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది.అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.

Advertisement
Advertisement
Advertisement