ప్రధాన వార్తలు
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
మార్కెట్కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్
సిప్ ఓకే... తప్పు చేయొద్దు!
స్టాక్ మార్కెట్లలో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పదం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను (సిప్ను) ప్రోత్సహించే కంపెనీలు కావొచ్చు... ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్ గురువులు కావొచ్చు. అందరూ దీన్నో తారకమంత్రం మాదిరి జపిస్తుంటారు. నిజానికి ఇన్వెస్టర్లకు కూడా ఇదో హుక్ లాంటిది. కోటి రూపాయలనే టార్గెట్గా పెట్టుకుని, 10వేలతో సిప్ ప్రారంభించినవారు చాలామంది ఉన్నారు. కాకపోతే వారంతా నిజంగా కోటి రూపాయలు సంపాదించారా? లేక నష్టాలొచ్చాయని మధ్యలోనే వదిలేసారా? ఒకవేళ కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతకాలానికి సంపాదించి ఉంటారు? ఎంత క్రమశిక్షణ పాటించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే సిప్కు కావాల్సినవి ఇవే. సిప్ అంటే అదేదో మంత్రదండం కాదు. అక్షయపాత్ర కూడా కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయటం ద్వారా సంపద సృష్టించే ఒక సాధనం మాత్రమే. ఆ రిసు్కల్ని తెలియజేసేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...రాబడికి గ్యారంటీ ఉండదు...చాలా మంది నిర్ణిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. దీనివెనుక అంచనాల్లో పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాబడి విషయంలోనే ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. → ఈక్విటీల్లో పెట్టుబడిపై ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తుందని అనుకుంటుంటారు. → ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని భావిస్తుంటారు. → ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. సిప్తో రిస్క్ ఉండదని అనుకుంటుంటారు. → కానీ ఇవేవీ నిజం కావు. వాస్తవాలను తెలుసుకోవాలి... → ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల మాదిరి ఈక్విటీల్లో రాబడులు స్థిరంగా ఉండవు. → ఈక్విటీ రాబడులు అన్నవి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయన్న డిస్క్లోజర్ను తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి. → మార్కెట్ ర్యాలీల్లో 15 శాతమే కాదు. 18– 25– 35 శాతం వార్షిక రాబడులు వచి్చన సందర్భాలు కూడా ఉన్నాయి. → కానీ ఆటుపోట్ల తరుణంలో రాబడులు 10–12 శాతం మించకపోవచ్చు. → మరీ ముఖ్యంగా ప్రతికూల సమయాల్లో సగటు వార్షిక రాబడి 7–9 శాతం మించకపోవచ్చు. ఒకోసారి అంతకన్నా తక్కువకూడా రావచ్చు. → ఇక సిప్ తొలినాళ్లలో అయితే (మూడేళ్లలోపు) మార్కెట్ దిద్దుబాట్లు ఎదురైతే.. రాబడి కాదు, నష్టాలకూ స్వాగతం పలకాల్సి వస్తుంది. → పైన కొటేషన్లో చెప్పుకున్నట్టు ప్రతి నెలా రూ.10,000తో 20 ఏళ్లలో కోటికి అధిపతి కావాలంటే వార్షిక రాబడి 12.7 శాతం తక్కువ కాకుండా ఉండాలి. ఉదాహరణలు.. → 2020 మార్చిలో కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు 40% నష్టపోవడం తెలిసిందే. → 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే పెరుగుతూ, తగ్గుతూ, స్థిరీకరణకు గురవుతున్నాయి. → కానీ వైరస్పై కొంత స్పష్టత రావడంతో మార్కెట్లు వెంటనే రివర్స్గేర్ తీసుకున్నాయి. 2023 వరకు ర్యాలీ చేశాయి. ఈ కాలంలో సిప్ రాబడులు అద్భుతంగా ఉన్నాయి.రిస్క్ లూ ఉంటాయ్.. → అనుకున్న కాలానికి అనుకున్నంత సమకూరాలంటే అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు. → మార్కెట్లు సైడ్వేస్ (ఓ పరిధిలోనే)లో ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చు. దీనివల్ల దీర్ఘకాల రాబడులు తగ్గిపోతాయి. → పక్కా ప్లాన్తో సిప్ చేసినా.. ఫండ్ ఎంపిక సరిగ్గా లేకపోతే చివర్లో అనుకున్నంత రాబడి సాధ్యం కాదు.ప్రవర్తనా లోపాలే ఎక్కువ... → కొంత మంది ఆదాయం సర్దుబాటు చేయలేక సిప్లను మధ్యలోనే ఆపేస్తుంటారు. → కొంత మంది మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పి నష్టాలను చూసి భయంతో సిప్కు టాటా చెబుతుంటారు. → మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఉత్సాహం కొద్దీ అధిక వ్యాల్యూషన్ల వద్ద అదనంగా సిప్ చేస్తుంటారు. → అదే మార్కెట్ల పతనాల్లో మాత్రం నమ్మకం సడలి ఉన్న సిప్లను ఆపేస్తుంటారు. కానీ, నిజానికి పతనాల్లోనే సిప్లకు అదనంగా జోడించుకోవడం తెలివైన పని. → కొందరు ఒక లక్ష్యం, స్పష్టత లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. లక్ష్యం, కాల వ్యవధి ఆధారంగా సరితూగే పథకాలనే ఎంపిక చేసుకోవాలి. → నిపుణుల సూచనలు కాకుండా స్నేహితులో, సహచర ఉద్యోగో లేక బంధువు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి వద్దు. → స్వల్పకాల కోసం సిప్ చేయడం సరికాదు. సిప్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనం. → గడిచిన ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిన (అప్పటికే బాగా పెరిగిన) ఫండ్స్లో సిప్ చేయడం సరికాదు. → పెట్టుబడి తక్కువ మొత్తమే అయినా ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అతి వైవిధ్యంగా చెబుతారు. ఇది కూడా తప్పే.ఇదీ వాస్తవం.. → సిప్పై దీర్ఘకాలంలో రాబడి 10–12 శాతంగానే ఉంటుందన్న అంచనా వాస్తవికం. 15–20 శాతం అంచనా వేసుకోకూడదు. → కనీసం 10–15 ఏళ్ల పాటు అయినా స్థిరంగా సిప్ చేసుకుంటూ వెళ్లాలి. → మార్కెట్ టైమింగ్ (ఎప్పుడు ఎటు కదులుతుందో అంచనా) కాకుండా క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. → సిప్ అన్నది పవర్ఫుల్ టూల్. అద్భుతమైన మంత్రదండం కాదు. కానీ, క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సిప్ చేస్తే సంపద సాధ్యం. → అవాస్తవిక అంచనాలతో ముందుకెళితే చివర్లో ఫలితం నిరాశకు గురి చేయొచ్చు. ముందు మొదలెడితే... మ్యాజిక్ → నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏటా 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.91.98 లక్షలు సమకూరుతుంది. → 20 ఏళ్లకు బదులు మరో 5 ఏళ్లు పెంచి 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.70 కోట్లు సమకూరుతుంది. అంటే ఐదేళ్లలో రూ.78 లక్షలు అదనంగా వస్తుంది. → 30 ఏళ్ల పాటు ఇంతే మేర ఇన్వెస్ట్ చేస్తే సమకూరే సంపద రూ.3.08 కోట్లు. → ప్రతి నెలా 10వేలు చొప్పున, ఏటా 10 శాతం అదనంగా సిప్ పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే.. (12 శాతం రాబడి అంచనా ఆధారంగా) → 20 ఏళ్లలో రూ.1.86 కోట్ల సొమ్ము సమకూరుతుంది. → 25 ఏళ్లలో రూ.3.93 కోట్లు ఏర్పడుతుంది. → 30 ఏళ్లలో రూ.7.98 కోట్ల నిధి సొంతం అవుతుంది.
అమ్మో.. అల్యూమినియం.. రికార్డ్!
అంతర్జాతీయ మార్కెట్లో అల్యూమినియం ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో గత నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకడమే కాకుండా, భారత మార్కెట్లో కూడా అల్యూమినియం ధర కేజీకి రూ.375 వద్ద ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించింది. 2026లో గ్లోబల్ కమోడిటీ మార్కెట్లో బెస్ట్ పెర్ఫార్మర్గా అల్యూమినియం నిలుస్తోంది. దీంతో తక్కువ ధరలో ఉన్నప్పుడు అల్యూమినియంపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు అదృష్టవంతులని చెప్పవచ్చు.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు» నిర్మాణ, ఆటోమొబైల్ రంగాల డిమాండ్: ఇళ్లు, వాహనాలు మరియు ప్యాకేజింగ్ పరిశ్రమల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం.» ఇంధన ధరల ప్రభావం: అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్ అవసరం. చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారమై, ఆ భారం వినియోగదారుడిపై పడుతోంది.» సరఫరా లోటు: పర్యావరణ నిబంధనల వల్ల ఉత్పత్తి తగ్గడం, మరోవైపు గోదాముల్లో నిల్వలు అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. యుద్ధ భయాల వల్ల షిప్పింగ్ మార్గాల్లో అంతరాయం కలగడం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా లోహాల వైపు మొగ్గు చూపడంతో 'రిస్క్ ప్రీమియం' పెరిగి ధరలను పైకి నెట్టాయి.చైనా, అమెరికా వ్యూహాత్మక డిమాండ్ప్రపంచ అల్యూమినియం వినియోగంలో సగానికి పైగా వాటా కలిగిన చైనా, తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భారీగా కొనుగోళ్లు చేస్తోంది. మరోవైపు రక్షణ రంగం, ఆయుధాల తయారీ కోసం అమెరికా తన సైనిక అవసరాలకు అల్యూమినియంను పెద్ద ఎత్తున సేకరిస్తోంది.మరింత పెరుగుతాయా?ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ఏడాది పొడవునా అల్యూమినియం ధరలు బుల్లిష్గానే (పెరుగుదల ధోరణి) ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరఫరా మెరుగుపడకపోయినా లేదా చైనా ఆర్థిక వ్యవస్థ మందగించకపోయినా, ధరలు మరింత కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు..
ఎన్బీఎఫ్సీ నిధుల భారం బ్యాంకులపైనే
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) మరింత పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. బ్యాంకుల్లో రుణ రేట్లు తక్కువగా ఉండడమే కారణమని పేర్కొంది.ఎన్బీఎఫ్సీ నిధుల సమీకరణలో బ్యాంకుల వాటా 2026 మార్చి నాటికి 43 శాతానికి చేరిందని, 2027 మార్చి నాటికి 45 శాతానికి పెరగొచ్చని తెలిపింది. 2025–26 మొదటి ఆరు నెల్లలో క్యాపిటల్ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లపై నిధుల సమీకరణకు ఎన్బీఎఫ్సీలు మొగ్గు చూపించగా, తదుపరి ఆరు నెలల్లో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంకుల వైపు మొగ్గు చూపించినట్టు వివరించింది.‘‘బ్యాంకు రుణ రేట్లు గత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. బాండ్ ఈల్డ్స్ మాత్రం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తగ్గగా, తర్వాతి కాలంలో మళ్లీ పెరగడం మొదలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కరెన్సీ మారకం విలువల్లో అనిశ్చితుల ఫలితంగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) జారీ వాటా కూడా సమీప కాలంలో స్దబ్దుగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణకు సెక్యూరిటైజేషన్ (చెల్లింపుల్లేని రుణాలను విక్రయించడం) కొంత మద్దతునివ్వొచ్చు. స్థూల ఆర్థిక అనిశి్చతుల నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్లు), కార్పొరేట్ బాండ్ ఈల్డ్స్ సమీప కాలంలో గరిష్టాల్లోనే ఉండొచ్చు. కార్పొరేట్ బాండ్ వడ్డీ రేట్లు బ్యాంక్ రుణ రేట్ల కంటే అధికంగానే కొనసాగొచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది.
ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతుంటారు.రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..
కార్పొరేట్
సిప్ ఓకే... తప్పు చేయొద్దు!
ఎన్బీఎఫ్సీ నిధుల భారం బ్యాంకులపైనే
రూ.3 లక్షల కోట్లు దాటిన యస్ బ్యాంక్ డిపాజిట్లు
అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
రైలు టికెట్ రహస్యం తెలుసా?
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
జియో ఫైనాన్షియల్ లాభం డౌన్
బిగ్ రిలీఫ్.. చల్లబడిన బంగారం ధరల వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
ఊగిసలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా...
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ...
కాకమీదున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పె...
రష్యన్ ఆయిల్.. రయ్ రయ్..
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ రేట్లు పెరగకుం...
భారత్ వృద్ధి వేగవంతం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న...
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?హెచ్సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia)
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!
‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
టీసీఎస్ (TCS) నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్ ఐటీ పార్క్లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
పర్సనల్ ఫైనాన్స్
కొత్త క్రెడిట్ కార్డు.. ఎల్ఈడీ లైట్లతో..
ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్ఫాం ‘చెక్’, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్ ఏయూ క్రెడిట్ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.ఎల్ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్ విధానం ఈ క్రెడిట్ కార్డు ప్రత్యేకత అని చెక్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్ కార్డులోని ఎల్ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్ఎఫ్సీ ఫీల్డ్ సాయంతో ఎల్ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్ కార్డు కావాలనుకొనే వారు చెక్ యాప్ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు
మీ ఈమెయిల్ బాక్స్లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్లాగే కనిపించే నకిలీ సైట్లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్సైట్ అడ్రస్లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్లు, ఎక్స్టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మీ ఫోన్లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.


