Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AI Brings Risks Says Sebi Chief Tuhin Kanta Pandey1
ఏఐ ప్రమాదం.. సెబీ చైర్మన్ హెచ్చరిక!

ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్‌టెక్ (సూపర్‌వైజరీ టెక్నాలజీస్) & రెగ్‌టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు.

Rising Real Estate Demand in City Outskirts Growing Trend of Weekend Homes2
సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

⁠వీకెండ్‌ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్‌ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్‌ హోమ్స్‌ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్‌ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్‌ హోమ్స్‌లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఎవరు కొంటున్నారంటే.. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్‌ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్‌ హౌస్, ఓపెన్‌ జిమ్‌ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.అద్దెకు కూడా.. వీకెండ్‌ హోమ్స్‌ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్‌ హోమ్స్‌ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్‌ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్‌ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్‌ వెండింగ్స్‌ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.ఈ ప్రాంతాలలో డిమాండ్‌.. నగరం ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్‌పల్లి, జహీరాబాద్‌ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌ ఉంది. చార్టెడ్‌ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్‌ హోమ్స్‌ను డిజైన్‌ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.

China To Ban Half Steering Wheel After Flush Door Handles Know The Details Here3
అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!

చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్‌ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది.

Infosys gives higher performance bonus best in recent quarters4
భారీ బోనస్‌.. ఐటీ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.ఈసారి మెరుగైన చెల్లింపులుఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం.. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్‌హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం.

RBI Currency Update 2026 Rs100 and Rs500 Notes Get Security Upgrade No Demonetisation5
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?

కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2013లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్‌బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?

Customs at Airports Not Barrier but a Safeguard for Travelers and Nations6
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే

అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ జోన్‌కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.విదేశీ నివాస కాలం కీలకంమీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.బంగారం నిబంధనలుభారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.గోల్డ్ బార్లు.. కాయిన్స్ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.మద్యం, నగదు పరిమితులువిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీనగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?కస్టమ్స్‌ క్లియరెన్స్‌లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్‌గా పర్సనల్‌ యూజ్‌ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.సురక్షిత ప్రయాణం కోసం సూచనలుకస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.-దవనం శ్రీకాంత్

Advertisement
Advertisement
Advertisement