Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ATMs May Soon Give Rs 10 Notes as Govt Tests Small Denomination Dispensers1
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.

Induction Cookers See Record Sales as LPG Supply Tightens2
ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్‌..

దేశంలో ఎల్పీజీ కొరత ప్రభావంతో ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు అలాగే ఆన్‌లైన్ వేదికల్లో ఇండక్షన్ కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత శనివారం నుంచి అమ్మకాలు, ఎంక్వైరీలు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడించారు.ఇంతకు ముందు కొన్ని షోరూమ్ చైన్‌లు రోజుకు సుమారు 35–40 ఇండక్షన్ కుక్కర్లను మాత్రమే విక్రయించేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరువైందని వ్యాపారులు చెబుతున్నారు.ఇండక్షన్ కుక్కర్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్ ధరలు ఒక్క రోజులో గణనీయంగా పెరిగాయి. బోరోజ్ షేర్లు సుమారు 13 శాతం, బజాజ్ ఎలక్ట్రికల్స్ 7 శాతం, టిటికే ప్రెస్టీజ్ 7 శాతం, హాకిన్స్ 4.8 శాతం లాభపడ్డాయి. బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్లు కూడా సుమారు 2 శాతం పెరిగాయి.భారతదేశంలో ఎల్పీజీ వార్షిక వినియోగం సుమారు 31.3 మిలియన్ టన్నులు. ఇందులో 87 శాతం వినియోగం గృహ రంగానిదే. ఎల్పీజీ కొరత, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలపై భయాలు ఉండటంతో ఇండక్షన్ కుక్కర్లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, అవసరమైన రంగాలకు మాత్రమే సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.దేశీయ ఉత్పత్తిని సుమారు 10 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షలను సడలించే అవకాశముందని కేంద్రం, చమురు కంపెనీలు తెలిపాయి.

Joyalukkas ​four New Showrooms Opening3
జోయాలుక్కాస్‌ నాలుగు కొత్త షోరూమ్‌లు

హైదరాబాద్‌: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయా లుక్కాస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు కొత్త షోరూమ్‌లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 12న వరంగల్‌లో రెండో షోరూమ్‌ను, 13వ తేదీన విజయనగరం, శ్రీకాకుళంలో, 14న గుంటూరులో రెండో షోరూమ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వేగవంతమైన విస్తరణ చేపడుతున్నట్టు పేర్కొంది.కొత్తగా ప్రారంభించే ప్రతీ షోరూమ్‌ ఆధునిక ఇంటీరియర్, విశాలమైన విస్తీర్ణం, అత్యుత్తమ సౌకర్యాలతో వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూమతిని ఇచ్చేలా రూపొందించినట్టు తెలిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆభరణాల తయారీ చార్జీలపై 40 శాతం ఫ్లాట్‌ తగ్గింపు ఆఫర్‌ను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ నెల 29 వరకే అందుబాటులో ఉంటుంది. మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం ద్వారా తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటున్నట్టు జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్, ఎండీ జోయ్‌ అలుక్కాస్‌ తెలిపారు.

Airline ticket prices jump4
విమాన టికెట్లకు రెక్కలు..!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 12 నుంచి ఇంధన సర్‌చార్జీ విధింపునకు తెరతీశాయి. దేశీ విమాన ప్రయాణికులపై ఒక్కో టికెట్‌కు రూ.399 చొప్పున ఫ్యూయెల్‌ సర్‌చార్జీని వసూలు చేసేందుకు నిర్ణయించాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రయాణ టికెట్‌ చార్జీలను సైతం పెంచేందుకు నిర్ణయించాయి. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ పరిస్థితుల కారణంగా జెట్‌ ఫ్యూయెల్‌ ధరలు పెరగడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే దశలవారీగా వీటిని అమలు చేయనున్నాయి.తొలి దశలో ఈ నెల 12 నుంచి దేశీ విమాన టికెట్లపై రూ. 399 వసూలు చేయనున్నాయి. సార్క్‌ దేశాల విమాన సర్వీసులకు సైతం వీటిని వర్తింపచేయనున్నాయి. ఇక పశ్చిమాసియా విమాన సర్వీసులపై ఇంధన సర్‌చార్జీని ఒక్కో టికెట్‌కు 10 డాలర్లు చొప్పున విధించనుంది. ఆఫ్రికా ప్రయాణాలపై 30 నుంచి 90 డాలర్ల వరకూ ఈ చార్జీల మోత మోగనుంది. ఆగ్నేయ ఆసియా దేశ సర్వీసులపై 20–60 డాలర్ల మధ్య ఈ అదనపు చార్జీ వసూలు చేయనుంది. సింగపూర్‌ ప్రయాణాలుసహా ఈ మార్పులన్నీ మార్చి 12 నుంచి అమల్లోకిరానున్నాయి. ప్రస్తుతం సింగపూర్‌ విమాన సర్వీసులపై ఇంధన సర్‌చార్జీ లేకపోవడం గమనార్హం!

Silver jumped more than Rs 11000 per kg5
సిల్వర్‌ హిట్‌.. క్రూడ్‌ ర్యాలీకి బ్రేక్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక–రాజకీయ పరిణామాలతో మంగళవారం వెండి పరుగులు తీయగా, ముడి చమురు ధరలు కుదేలయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి రేటు కేజీకి రూ. 10,975 పెరిగి రూ. 2,79,275కి ఎగసింది. తద్వారా మూడు సెషన్ల నష్టాలకు బ్రేక్‌ పడింది. 99.9% స్వచ్ఛత బంగారం కూడా రూ. 400 పెరిగి రూ. 1,64,300కి చేరింది.ఇన్వెస్టర్లను కునుకు లేకుండా చేస్తున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలకు త్వరలోనే పరిష్కారం ఉండబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచనప్రాయంగా ప్రకటించడం భౌగోళిక–రాజకీయ మార్పులకు దారి తీయడంతో పసిడి, వెండి రేట్లు పెరిగాయని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.అటు అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో వెండి ఔన్సుకి (31.1 గ్రాములు) 1.38 డాలర్లు పెరిగి 88.33 డాలర్లకు చేరగా, పసిడి 1 శాతం పెరిగి 5,172.86 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో సిల్వర్‌ మే నెల కాంట్రాక్టు 5.07 డాలర్లు (సుమారు 6 శాతం) పెరిగి 89.59 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి 90 డాలర్ల దగ్గర ఉన్న నేపథ్యంలో 95 డాలర్ల (దేశీయంగా రూ. 2.85 లక్షలు) వైపుగా వెళ్లే అవకాశం ఉందని ఆగ్మంట్‌ హెడ్‌ (రీసెర్చ్‌) రెనిషా చెయినాని తెలిపారు. దిగొచ్చిన చమురు..: మూడు రోజులుగా ర్యాలీ చేస్తున్న ముడిచమురు ధరలకు ట్రంప్‌ భరోసాతో బ్రేక్‌ పడింది. ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ క్రూడ్‌ కాంట్రాక్టు బ్యారెల్‌కి రూ. 1,483 (సుమారు 17 శాతం) క్షీణించి రూ. 7,366 వద్ద ట్రేడయ్యింది. అదే విధంగా ఏప్రిల్‌ కాంట్రాక్టు కూడా రూ. 1,245 (15 శాతం) తగ్గి రూ. 7,300 వద్ద ట్రేడయ్యింది. అటు అంతర్జాతీయంగా నైమెక్స్‌ క్రూడ్‌ ఏప్రిల్‌ డెలివరీ 18 శాతం క్షీణించి 88 డాలర్లకు, బ్రెంట్‌ క్రూడ్‌ మే కాంట్రాక్ట్‌ 16 శాతం తగ్గి 84 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

Markets rebound as Sensex rises 640 pts as oil prices fall6
క్రూడ్‌ కూల్‌.. బుల్‌ చల్‌!

వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్‌ 960 పాయింట్లు జంప్‌చేసింది.ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్‌ 640 పాయింట్లు జంప్‌చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. ఐటీ డీలా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్‌ డ్యూరబుల్స్, కెమికల్స్‌ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్‌ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్‌టెల్, టీసీఎస్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. చల్లారిన చమురు...ఉదయం సెషన్‌లో లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్‌లో లైట్‌ స్వీట్‌ చమురు బ్యారల్‌ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్‌ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం.రూపాయి రయ్‌.. 36 పైసలు అప్‌– 91.85కు చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్‌ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.ఎరువుల షేర్లకు బలిమి గ్యాస్‌ కేటాయింపులలో ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్‌(ఆర్‌సీఎఫ్‌) 16%, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) 13%, దీపక్‌ ఫెర్టిలైజర్స్, పారదీప్‌ ఫాస్ఫేట్స్, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 5%, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 4% చొప్పున దూసుకెళ్లాయి.

Advertisement
Advertisement
Advertisement