ప్రధాన వార్తలు
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో దేశీ ఫార్మా రంగం రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో సరుకు రవాణా, సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే ప్రతికూలతలు ఇందుకు దారితీయనున్నట్టు ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) పేర్కొంది. దేశ ఫార్మా ఎగుమతుల్లో గల్ఫ్ దేశాల (జీసీసీ) వాటా 5.58 శాతం ఉన్నట్టు తెలిపింది.2020–21లో పశ్చిమాసియాకు ఎగుమతులు 1,320 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 1,749 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అందుబాటు ధరలకే ఔషధాల కోసం యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్ భారత్పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. ఒక్కో షిప్మెంట్కు 4,000–8,000 డాలర్ల మేర సర్చార్జీతో భారత ఎగుమతులు, దిగుమతుల రవాణా చార్జీలు పెరిగిపోతాయని, భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలపై భారం పడుతుందని ఫార్మెక్సిల్ పేర్కొంది. మార్బి సిరామిక్ పరిశ్రమపై పిడుగు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో గుజరాత్లోని మార్బిలో 350 వరకు సిరామిక్ టైల్స్ తయారీ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సహజవాయువు (ప్రొపేన్) కొరత ఇక్కడి పరిశ్రమను వేధిస్తోంది. మార్చి 15 నాటికి సరఫరా పునరుద్ధరించకపోతే మొత్తం పరిశ్రమ మూసివేసే ఆలోచనతో ఉన్నట్టు మార్బి సిరామిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేజీ కుందారియా తెలిపారు. ‘‘మార్బిలో 750 వరకు పరివ్రమలు ఉన్నాయి.దేశ టైల్స్ ఉత్పత్తిలో వీటి వాటా 90 శాతం. గ్యాస్ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నాటికి 350 పరిశ్రమలు మూతపడనున్నాయి’’ సిరామిక్ ప్యానెల్ చైర్మన్ జెటా్పరియా తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రొపేన్ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, మార్బిలో కేవలం 30 శాతం పరిశ్రమలే గుజరాత్ గ్యాస్ పంపిణీ సంస్థ కనెక్షన్ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఈ సంస్థ 50 శాతం తగ్గించి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పాత బంగారు లోకం
సాక్షి, బిజినెస్ డెస్క్: వరుస యుద్ధాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ ఆభరణాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక తులం బంగారం ధర రూ.1.7 లక్షల మార్కును దాటేయడంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. కానీ, ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.మధ్యతరగతి జనం ఇప్పుడు కొత్త నగలు కొనడానికి బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్నిజువెలరీ షాపుల్లో ఇచ్చి (ఎక్స్ఛేంజ్) కొత్తవి చేయించుకుంటున్నారు. లాకర్లలో దాచిన పాత నగలను బయటకు తెచ్చి కొత్త నగలుగా మార్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఇంకా పెరుగుతుందనే భయంతో అవసరాల కోసం ముందుగానే కొనుగోళ్లు చేయడం మొదలెట్టారు. పాత పసిడికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగారం అమ్మకాల్లో సగానికి పైగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ద్వారానే సాగుతున్నట్లు జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ప్యూర్ వద్దు.. లైట్ ముద్దు! పెరిగిన ధర వద్ద బంగారు ఆభరణాలు కొనడం సామాన్యుడికి కలగా మారింది. దీని ప్రభావం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే మధ్యతరగతి పై ఎక్కువగా పడుతోంది దీంతో మార్కెట్లో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. తక్కువ బరువు, తక్కువ ధరలో లభించే 18 క్యారెట్ల నగలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డైమండ్స్లో కూడా 9 క్యారెట్, 14 క్యారెట్ వంటి తక్కువ రేంజ్ ఆభరణాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సహజ వజ్రాల రేటు భరించలేని మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరకే మెరిసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్వైపు మళ్లుతున్నారు. ల్యాబ్–గ్రోన్ డైమండ్స్ ధరలు సహజ డైమండ్స్ కంటే చాలా తక్కువ గ్లోబల్ డైమండ్ మార్కెట్లో ప్రస్తుతం 12 శాతం ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ల వాటా 2029 నాటికి 16 శాతానికికి చేరుతుందని నిపుణుల అంచనా.ఇన్వెస్ట్మెంట్ అంటే ‘కాసే’ కేవలం అలంకరణకే కాకుండా, పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్పైనే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇవే లాభాలను ఇస్తాయని నమ్ముతున్నారు. రేటు పెరిగినా ఇన్వెస్టర్లు బంగారు నాణేలు కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘రేట్లు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం వేరు. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత’ – అరుణ్ నారాయణ్, సీఈఓ టైటాన్ జువెలరీ
నియామకాల్లో మహిళా సత్తా
ముంబై: కొలువుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. మెరుగైన అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో దేశంలో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు గెలుచుకున్నారు. జాబ్ పోర్టల్ ఫౌండిట్ విడుదల చేసిన ‘ఉమెన్ ఇన్ ది ఇండియన్ వర్క్ఫోర్స్ 2026’ నివేదిక ప్రకారం.. సీనియర్, అధిక వేతనం, అత్యాధునిక టెక్నాలజీతో ముడిపడిన ఉద్యోగ నియామకాల్లో, టైర్–2 పట్టణాల్లో మహిళల నియామకాలు పెరిగాయి. 2025 ఫిబ్రవరి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో ఉద్యోగ నియామకాల్లో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు సొంతం చేసుకున్నారు.ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మెరుగైన వృద్ధి. ‘‘భారత్ వ్యాప్తంగా మహిళల నియామకాల తీరు చూస్తుంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఆరంభ స్థాయి నుంచి సీనియర్ పొజిషన్లు, అధిక వేతన విభాగాలు, టైర్–2 పట్టణాల్లో మహిళలకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. అయితే అధిక శాతం ఉద్యోగాలు రూ.10 లక్షల వార్షిక వేతనంలోపే ఉంటున్నాయి. అదే సమయంలో అధిక విలువ కలిగిన ఉద్యోగాల్లోనూ మహిళల ప్రవేశం క్రమంగా మెరుగుపడుతోంది’’అని ఫౌండిట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అనుపమా భిమ్రాజిక తెలిపారు. ఇదీ మార్పు.. ⇒ మహిళలు ఆరంభ స్థాయి ఉద్యోగాలైన రిసెప్షనిస్ట్ లేదా క్లరికల్ ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. మేనేజర్, డైరెక్టర్ ఉద్యోగాల్లోనూ వారికి ప్రాధాన్యం దక్కుతోంది. ⇒ రూ.11–25 లక్షల వేతన బ్రాకెట్లో మరింత మంది మహిళలు వచ్చి చేరుతున్నారు. ⇒ ఏఐ, డేటా సైన్స్, చిప్స్ (సెమీ కండక్టర్లు)లో గతంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మహిళలకూ అవకాశలు తన్నుకొస్తున్నాయి. ⇒ముఖ్యంగా మహిళలకు మెరుగైన అవకాశాలు మెట్రోలకే పరిమితం కావడం లేదు. టైర్–2, 3 పట్టణాలకూ (ఇండోర్, జైపూర్, లక్నో, కోచి, కోయింబత్తూర్) విస్తరిస్తున్నాయి. మొత్తం నియామకాల్లో 44 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. 2025 నివేదిక నాటికి ఇది 41 శాతంగా ఉంది. టైర్–1 పట్టణాల వాటా 59 శాతం నుంచి 56 శాతానికి తగ్గింది. ⇒ ఐటీ రంగంలో (ముఖ్యంగా డేటా, అనలైటిక్స్) మహిళల ప్రాతినిధ్యం గడిచిన ఏడాది కాలంలో 32 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో 16 శాతం, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్లో మహిళల వాటా పెరిగింది. ⇒ కొత్త టెక్నాలజీ విభాగాల్లో మహిళలకు అవకాశాలు 26 శాతం నుంచి 31 శాతానికి పెరిగాయి. ⇒ సంప్రదాయంగా మహిళల ఉపాధికి కీలకంగా ఉంటున్న కస్టమర్ సర్వీస్/బీపీవోలో నియామకాలు 12 శాతం నుంచి 10 శాతానికి, మానవ వనరుల విభాగంలో 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గాయి. ⇒ కంపెనీలు లింగ సమానత్వం విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా.. మరింత మంది మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.
‘షి’వల్యూషన్ సునామీ!
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత మహిళలు ఇపుడు ఇంటికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ఆలోచిస్తూ, పెట్టుబడులు పెడుతూ, ఆర్థిక స్వావలంబన వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. గతంలోలాగా కుటుంబ బడ్జెట్ పరిమితిలో ఇరుక్కుని ఆరి్ధక ఇబ్బందులతో గడిపేందుకు ఇష్టపడడంలేదు. పెట్టుబడులు, రిటైర్మెంట్, కెరీర్ గ్రోత్, ఆర్థిక స్వాతంత్య్రం ఇలా ప్రతి అంశంలో ముందడుగు వేస్తున్నారు. భారత మహిళల ఆర్థిక లక్ష్యాలు, అలవాట్లు, ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంటోంది.మహిళల ఈ ఆర్థిక మలుపు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఇంధనంగా మారింది. కొత్త బలాన్నిస్తోంది. ఒకప్పుడు మహిళల ఆర్థిక ప్రాధాన్యతలు కుటుంబం కేంద్రంగా ఉండేవి. పెళ్లి, పిల్లలు వారి స్కూల్ ఫీజులు, తర్వాత ఉన్నత చదువుల కోసం పొదుపుగా బతకడం, పిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం జాగ్రత్త పడడం, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు చేయడం మహిళల ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి . ఇవన్నీ కూడా భర్త ఆధ్వర్యంలో జరిగేవి. మహిళల పాత్ర ఎక్కువగా ’సపోరి్టవ్ ఫైనాన్షియల్ మేనేజర్’గానే ఉండేది.ఇప్పుడు కెరీర్ అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం, ఈక్విటీ పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి ఆధునిక లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కేవలం కుటుంబ సహాయకురాలిగా కాదుం ఫైనాన్షియల్ లీడర్గా ఎదుగుతున్నారు. ఇటీవలి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం మహిళల్లో ఆర్థిక అవగాహన గణనీయంగా పెరిగింది. కుటుంబం చుట్టూ తిరిగిన ఆర్థిక ప్రణాళిక గుమ్మం దాటి స్టాక్ మార్కెట్ దాకా వెళ్లింది. కొత్తతరం మహిళల్లో నా జీవితం – నా డబ్బు అనే భావన బలపడుతోంది. స్వతంత్ర ఆర్థిక ఆలోచనలతో ఇప్పుడు మహిళల లక్ష్యాలు మరింత వ్యక్తిగతంగా, శక్తివంతంగా మారాయి కొత్త తరహా లక్ష్యాలు: ⇒ కెరీర్ అడ్వాన్స్మెంట్, అప్స్కిల్లింగ్ ⇒ పూర్తి స్థాయి ఆర్థిక స్వాతంత్య్రం ⇒ బంగారం దాటి ఈక్విటీ, ముచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ⇒ స్వంత ఇల్లు కొనుగోలు ⇒ వ్యక్తిగత రిటైర్మెంట్ ప్లానింగ్ ⇒ ట్రావెల్, లైఫ్ ఎక్స్పీరియెన్సెస్ ⇒ సెల్ఫ్ కేర్ – హెల్త్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ⇒ ఎంటర్ప్రెన్యూర్షిప్, కెరీర్ ఫ్లెక్సిబిలిటీ ⇒ పెట్టుబడుల్లో మహిళల కొత్త ట్రెండ్ ⇒ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ల ద్వారా క్రమబద్ధమైన పెట్టుబడులు ⇒ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ ⇒ డిజిటల్ ట్రేడింగ్ – ఫైనాన్స్ యాప్ల వినియోగం ⇒ రిస్క్ అవగాహనతో విభిన్న ఆస్తుల్లో డైవర్సిఫికేషన్ ⇒అత్యవసర నిధులపై ప్రత్యేక దృష్టి.అంకెల్లో కనబడుతున్న మార్పు⇒ 47 శాతం మహిళలు ఆర్థిక నిర్ణయాలు స్వయంగా తీసుకుంటున్నారు ⇒ 98 శాతం పట్టణ మహిళలు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు⇒ 25 శాతానికి పెరిగిన ఈక్విటీ మార్కెట్లో మహిళా ఇన్వెస్టర్ల వాటా. 25 శాతానికి చేరిన మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య.
కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే!
భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.ఎయిర్బ్యాగ్లపై ప్రభావం!చూడటానికి బంపర్ గార్డ్లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్బ్యాగ్లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్లు ఈ సెన్సార్లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్బ్యాగ్లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.బుల్ బార్లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.జరిమానా ఇలా..బుల్ బార్ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది.
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వెబ్సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.A few days ago, I walked away from a ₹26 LPA job right at the time of onboarding.Since then I’ve had very mixed feelings.One side of me says I made the right decision. I didn’t want to get trapped in a job.The other side keeps asking… what if this was a huge mistake?…— Pushkar @ Website Designer (@in_pushkar) March 5, 2026
కార్పొరేట్
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
‘భారతీయ బ్యాంకింగ్పై నమ్మకం’లో కొత్త కోణాలు
ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
పేటీఎం తర్వాత మరో భారీ ఐపీవో.. ఫోన్పే ప్లాన్ ఇదే!
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుత...
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ...
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్త...
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగ...
భారత్ చమురు కొనుగోలుకు అనుమతి అవసరం లేదు
భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ఇత...
వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు!
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్...
రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇరా...
కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
చాట్జీపీటీని బాయ్కాట్ చేసిన 25 లక్షల మంది!
అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్జీపీటీని బాయ్కాట్ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్వర్క్లో ఏఐ మోడల్ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్జీపీటీ యాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్జీపీటీ మొబైల్ యాప్ యూఎస్లో అన్ఇన్స్టాల్ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.
పర్సనల్ ఫైనాన్స్
EPFO సేవల్లో మార్పులు.. ఇక అన్నీ ఆటోమేషన్లోనే!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా అందే సేవలను పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించింది. ఇందుకు ప్రతి చందాదారుడు తప్పనిసరిగా కేవైసీ సమర్పించాలని సూచించింది. అలా కేవైసీ సమర్పించిన వారికి ఈ సేవలన్నీ ఆటోమేషన్ పద్ధతిలో అందుతాయి.ఇకపై మాన్యువల్ విధానానికి తావు ఇవ్వొద్దని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కసరత్తు చేయాలని ఈపీఎఫ్ఓ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చందాదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న తరుణంలో సేవలను వేగంగా అందించే లక్ష్యంతో డిజిటల్ రీఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మానవ జోక్యం లేకుండా... క్లెయిమ్ ప్రాసెస్ను మానవ జోక్యం లేకుండా పూర్తి చేసే వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. పూర్తిగా ఆటో సెటిల్మెంట్ విధానాన్ని విస్తరిస్తోంది. ఒక క్లెయిమ్ పరిష్కారానికి ఇదివరకు మాన్యువల్గా కాగితాల సమర్పణ, అధికారుల ఆమోదం లాంటివి ఉండేవి. ఇకపై అలాంటి జాప్యం లేకుండా ఆటోమేషన్ పద్ధతిలో క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం చందాదారుడు ఆధార్, బ్యాంకు కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.దీంతో మానవ ప్రమేయం లేకుండా సిస్టమ్ ఆధారంగానే క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు. ఈ సందర్భంలోనే ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్/ ఈ –మెయిల్ అప్డేట్ను మరింత పారదర్శకం చేయనున్నారు. ఇనాపరేటివ్ ఖాతాల నిర్వహణకు చెక్ పెట్టాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఈపీఎఫ్ ఖాతాలు, చాలాకాలంగా నిర్వహణ లేని వాటిని ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు సీబీటీ నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఖాతాలు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నాయి. ఆటో–ఇనిషియేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని పైలట్ పద్ధతిలో ప్రారంభించనుంది. చిన్న మొత్తాలున్న ఖాతాలు, ఏళ్ల తరబడి నిర్వహణ లేని ఖాతాలను స్వయంచాలకంగా గుర్తించి, సభ్యుల బ్యాంక్ వివరాలు సరైనవని నిర్ధారించుకొని ఆ నిధులను వెనక్కి ఇచ్చేస్తారు. దీంతో ఏటా వడ్డీ చెల్లింపులు, నిర్వహణ భారం తగ్గుతుంది. ఈడీఎల్ఐ పథకం అమలు కూడా మరింత వేగవంతం కానుంది.క్లెయిమ్స్ను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ విభాగాల మధ్య డేటా సమన్వయానికి చర్యలు చేపట్టనున్నారు. చందాదారులకు ఒకేచోట సేవలు అందేలా యూనిఫైడ్ పోర్టల్ అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకోగా... పనుల ప్రగతి నివేదికపైనా సీబీటీ సమావేశంలో చర్చించారు.యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధారంగా రికార్డుల నవీకరణ, పేరు, పుట్టిన తేదీ సవరణను సులభతరం చేయనున్నారు. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తారు. ఫిర్యాదుకు సంబంధించిన సమస్య పరిష్కారానికి నిర్దేశించిన గరిష్ట సమయం కంటే ముందే పరిష్కరించేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల సిలిండర్ కొత్త రేటు..
మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలురాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.గృహ ఎల్పీజీ రేట్లు యథాతథంఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.
ఇన్సూరెన్స్తోపాటు ఈక్విటీ.. కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘టాటా ఏఐఏ గ్లోబల్ ఈక్విటీ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్ గ్లోబల్ ఇన్వెస్ట్ లాంటి యూనిట్ లింక్డ్ పథకాల ద్వారా ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.ట్రస్ట్ ఎంఎఫ్ మిడ్క్యాప్ ఫండ్ ప్రధానంగా మిడ్–క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మిడ్ క్యాప్ ఫండ్ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్–క్యాప్ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్ బాగ్లా తెలిపారు. ఐసీఐసీఐ ప్రు లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్ రికార్డుతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్ అష్యూర్, స్మార్ట్కిడ్ అష్యూర్, స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ (సిప్ ప్లస్) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.


