Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Indias first closed door non AC local train in mumbai1
‘వందేభారత్‌ స్టైల్‌’ లోకల్‌ రైలు వచ్చేసింది..

లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్' తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్‌ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధం చేసింది. ఈ కొత్త రైలుకు సంబంధించిన విశేషాలు మీకోసం..ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్‌ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్‌ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది.ఏసీ లేకపోయినా.. గాలికి డోకా లేదు!నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి.అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి 1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది.ప్రయాణికులకు మరిన్ని ఫీచర్లుకేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్‌రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు.12 కోచ్‌ల ఆటోమేటిక్‌ డోర్‌ క్లోజ్‌నాన్‌ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది. ట్రయల్స్ పూర్తయి, సర్టిఫికేషన్ లభించిన వెంటనే ఈ 'వందే భారత్' స్టైల్ లోకల్ రైలు ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది.

IKP Knowledge Park Unveils ARK to Power Indias Deep Science Startups2
హైదరాబాద్ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ కొత్త ప్రోగ్రామ్‌

హైదరాబాద్: భారతదేశాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ ప్రోడక్ట్ లీడర్‌గా నిలబెట్టే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకమైన ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (IKP Knowledge Park) ‘ఐకేపీ ఏఆర్‌కే’(IKP ARK) పేరుతో సరికొత్త వెంచర్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. లోతైన శాస్త్రీయ పరిశోధనలు (Deep-Science) చేసే స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రోగ్రామ్ ఒక వారధిలా పనిచేయనుంది.చాలా స్టార్టప్‌లు అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పటికీ, సరైన సహకారం, రెగ్యులేటరీ నిబంధనలపై అవగాహన లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, ఐకేపీ ఏఆర్‌కే ఒక వినూత్న నమూనాను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన నిపుణులు నేరుగా ఆయా కంపెనీలతో కలిసి పనిచేస్తూ, వ్యాపార విస్తరణలో వ్యవస్థాపకులకు వెన్నుదన్నుగా నిలుస్తారు.ఎంపికైన ప్రతి స్టార్టప్‌కు సుమారు రూ.2 కోట్ల వరకు విలువైన ప్రయోజనాలను ఐకేపీ కల్పిస్తోంది. ఇందులో ప్రాజెక్ట్ మైలురాళ్ల ఆధారిత నిధులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సీడీఎస్‌సీవో, ఎఫ్‌డీఏ వంటి సంస్థల నుండి రెగ్యులేటరీ అనుమతులు పొందడంలో సాంకేతిక మద్దతు ఉంటుంది. ఐకేపీకి ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ పెట్టుబడిదారుల నెట్‌వర్క్ ద్వారా స్టార్టప్‌లు తమ వ్యాపార నమూనాలను మెరుగుపరుచుకుని నిధులు సేకరించుకునే అవకాశం కలుగుతుంది.ఈ ప్రోగ్రామ్ 12 నెలల కాలపరిమితితో మూడు దశల్లో సాగుతుంది. మొదటి దశలో వ్యాపార ప్రణాళిక (బ్లూప్రింట్) సిద్ధం చేయడం, రెండో దశలో నిర్వహణపరమైన ముప్పులను తగ్గించడం, చివరి ఎనిమిది నెలల్లో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి సిరీస్-ఎ ఫండింగ్ సాధించడంపై దృష్టి సారిస్తారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ప్రయోగశాలలోని ఆవిష్కరణలు వేగంగా ప్రజలకు చేరువవుతాయని ఐకేపీ సీఈఓ డాక్టర్ సత్య ప్రకాష్ డాష్ పేర్కొన్నారు.తొలి విడతలో భాగంగా మెడ్‌టెక్, హెల్త్‌టెక్ స్టార్టప్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (TRL 3+) కలిగి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. గత రెండు దశాబ్దాలుగా సుమారు 1,900 కంపెనీలకు అండగా నిలిచిన ఐకేపీ, ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా భారతీయ స్టార్టప్ వ్యవస్థలో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది.

Punjab National Bank to close accounts from tomorrow3
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్‌ అకౌంట్లు క్లోజ్‌!

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్‌బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్‌డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్‌బీ బ్రాంచ్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్‌లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

Stock Market closing April 15; Sensex jumps 1264 points4
భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది.

VinFast VF MPV 7 Launched In India At Rs 24 49 Lakh5
మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 517 కి.మీ. రేంజ్‌

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి తన మూడవ మోడల్ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ (VF MPV 7)ను అధికారికంగా విడుదల చేసింది. వినూత్న ఫీచర్లు, శక్తివంతమైన రేంజ్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. ప్రధానంగా ఫ్లీట్ (Commercial) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.బుకింగ్స్ ప్రారంభంవిన్‌ఫాస్ట్‌ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ కారు అమ్మకాలకు బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు కొనే ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది చివర్లో 'లిమో గ్రీన్' పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.డిజైన్‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. దీని కొలతలు చూస్తే 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు ఉంటుంది. ఏకంగా 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం(బూట్ స్పేస్) ఇచ్చారు.ఎక్స్‌టీరియర్ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ "V" లోగోతో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్‌ని ఇస్తాయి. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు దీని ప్రధాన ఆకర్షణ.ఇంటీరియర్, ఫీచర్లుక్యాబిన్ లోపల ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతను జోడించారు. 10.1-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథరెట్ ఇంటీరియర్, USB-A, USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు ఇ​చ్చారు. ఇక ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో 60.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల (ARAI గుర్తింపు పొందిన) ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. 201 హెచ్‌పీ శక్తిని, 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.

Indian Railways Quiet Hours: Loud Calls, Music Without Headphones Lead to Fine6
పాటలు వింటూ రైలులో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త!

రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతూ పాటలు వినే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. లేదంటే మీరు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణికుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు.. క్వైట్ అవర్స్రైల్వే శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కింది నిబంధనలు అమల్లో ఉంటాయి.మొబైల్ ఫోన్లలో పాటలు వినాలన్నా లేదా వీడియోలు చూడాలన్నా కచ్చితంగా ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ వాడాలి. లౌడ్‌ స్పీకర్ ఆన్ చేయడం నిషిద్ధం.ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కవారికి ఇబ్బంది కలగకుండా తక్కువ స్వరంతో మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ మాట్లాడితే రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.వ్యక్తిగత బెర్త్ లైట్లు మినహా కోచ్‌లోని మిగిలిన అన్ని లైట్లు ఆపివేయాలి. తద్వారా తోటి ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా చూడాలి.ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలుఈ నిబంధనలు రిజర్వ్‌డ్ కోచ్‌ల్లో ప్రయాణించే అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత ప్రయాణికులు వెంటనే రైలులో అందుబాటులో ఉండే ఆర్‌పీఎస్‌ఎఫ్‌/ ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి లేదా టికెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ‘ప్రయాణికుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు’ అని రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలో తెలిపారు.రైలు ప్రయాణాన్ని సుఖమయం చేయడంలో తోటి ప్రయాణికుల సహకారం ఎంతో అవసరం. కాబట్టి ప్రయాణికులు ఈ నియమాలను పాటించి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ కోరుతోంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల అమలుపై మరింత నిఘా పెంచనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!

Advertisement
Advertisement
Advertisement