ప్రధాన వార్తలు
జీఎస్టీ వసూళ్ల రికార్డ్.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏప్రిల్ నెలలో రూ.2.43 లక్షల కోట్ల స్థూల ఆదాయం వసూలైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూళ్లు రూ.2.23 లక్షల కోట్లతో పోల్చిచూస్తే 8.7 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఒక నెలలో అత్యధిక వసూళ్ల రికార్డు. దేశీ విక్రయాలపై జీఎస్టీతో పోల్చి చూస్తే, దిగుమతులపై పన్ను ఆదాయమే ఎక్కువ వృద్ధి చూపించడం గమనార్హం. దేశీ విక్రయాలపై జీఎస్టీ 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.దిగుమతులపై జీఎస్టీ 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లు వసూలైంది.సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.52,140 కోట్లు రాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.61,331 కోట్లుగా ఉంది.ఐజీఎస్టీ రూ.1.29 లక్షల కోట్లు వసూలైంది.రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి.రిఫండ్లు సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రూ.2.11 లక్షల కోటు.ఈ ఏడాది మార్చి నెలకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండడం గమనార్హం.7–8 శాతం వృద్ధి సాధారణమేజీఎస్టీ 2.0 అనంతరం ప్రతి నెలా పన్నుల ఆదాయం 7–8 శాతం మేర వృద్ధి చెందడం సాధారణంగా మారినట్టు ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ ప్రతీక్జైన్ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు చెప్పారు. దిగుమతులపై ఆదాయం దేశీ లావాదేవీలను మించడం అన్నది దేశీ వినియోగం కొంత నిదానించడాన్ని తెలియజేస్తోందని జైన్ చెప్పారు.
మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత
కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్ మెసేజ్ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.అసలేం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్వర్క్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.మొబైల్ డేటా లేకపోయినా, నెట్వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్ను చేరుతుంది.అందరి రక్షణే లక్ష్యంగా..ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన
నమ్మావో ముంచేస్తారు!
నేటి వేగవంతమైన ఐటీ రంగంలో ఉద్యోగ మార్పు అనేది సర్వసాధారణం. అయితే, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన కెరీర్ విషయంలో ఎదుర్కొన్న సందిగ్ధత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. కొత్త ఉద్యోగ ఆఫర్ ఒకవైపు, ప్రస్తుత సంస్థ ఇస్తున్న స్ప్లిట్ కౌంటర్ ఆఫర్ మరోవైపు.. ఈ మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక ఒక మిడ్-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పంచుకున్న అనుభవం అనేక మంది ఐటీ నిపుణుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది.ఏమిటీ సమస్య?భారతదేశంలోని ఒక ప్రముఖ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మిడ్-లెవల్ ఇంజినీర్గా పనిచేస్తున్న సదరు ఉద్యోగికి కుటుంబ బాధ్యతలు పెరగడంతో వేతన పెంపు అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో వేరే కంపెనీలో ప్రయత్నించగా తన ప్రస్తుత వేతనం కంటే సుమారు 1.5 రెట్లు ఎక్కువ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. దీంతో ఆయన తన ప్రస్తుత కంపెనీకి రాజీనామా సమర్పించారు.అయితే, ఆయనను వదులుకోవడానికి ఇష్టపడని ప్రస్తుత యాజమాన్యం బయటి ఆఫర్తో సమానమైన వేతనాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఆ పెంపును ఒకేసారి కాకుండా కొంత భాగాన్ని వెంటనే, మిగిలిన భాగాన్ని కొన్ని నెలల తర్వాత ఇస్తామని (స్ప్లిట్ ఆఫర్) యాజమాన్యం ప్రతిపాదించింది. దీనిని డాక్యుమెంట్ చేస్తామని హామీ ఇచ్చినా ఈ పరిస్థితి ఆయనను గందరగోళానికి గురిచేసింది.నెటిజన్ల భిన్న అభిప్రాయాలుఈ అనుభవాన్ని ‘బయటి ఆఫర్ లేదా కౌంటర్ ఆఫర్.. ఏది ఎంచుకోవాలి’ అనే శీర్షికతో సదరు ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారిలో మెజారిటీ వర్గం మాత్రం ‘కౌంటర్ ఆఫర్ను అంగీకరించకుండా, కొత్త సంస్థకే వెళ్లడం ఉత్తమం’ అని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!నెటిజన్లు లేవనెత్తిన అంశాలుఒకసారి మీరు రాజీనామా చేశారంటే మీరు సంస్థను వదిలి వెళ్లడానికి సిద్ధపడ్డారని యాజమాన్యానికి స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కంపెనీలో ఏవైనా లే-ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) జరిగితే ముందుగా టార్గెట్ అయ్యే అవకాశం మీకే ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.కంపెనీలు వాగ్దానం చేసినట్లుగా కొన్ని నెలల తర్వాత రెండో విడత పెంపును ఇస్తాయనే దానికి ఎటువంటి గ్యారెంటీ ఉండదు. వ్యాపార పరిస్థితులు మారితే ఆ వాగ్దానాలు పాటించరని అనుభవజ్ఞులు గుర్తు చేస్తున్నారు.ఒక కొత్త సంస్థలో చేరడం వల్ల కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడమే కాకుండా మీ మార్కెట్ విలువ పెరుగుతుందని, అదే పాత సంస్థలో ఉండటం వల్ల కెరీర్ ఎదుగుదల మందగించవచ్చని మరికొందరు సూచిస్తున్నారు. కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం జీతం మాత్రమే కాకుండా పని సంస్కృతి, భవిష్యత్తు అవకాశాలు, మానసిక ప్రశాంతతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.ఆలోచనలు పాతబడ్డాయా?భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.విశాల్ సిక్కా దార్శనికతవిశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్ఫారమ్ల బేస్డ్ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్ ఫిక్స్
సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. కృత్రిమ మేధ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో వ్యయ నియంత్రణలో భాగంగా మే 20వ తేదీ నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మెటా శ్రామిక శక్తిలో తీవ్ర అనిశ్చితిని నింపుతోంది.ఏమిటీ తాజా పరిణామాలు?ఇటీవల కంపెనీ నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే మెటా ఆర్థికంగా స్థిరమైన పనితీరును కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థాగత మార్పులు తప్పవని యాజమాన్యం స్పష్టం చేసింది. మే 20న ఈ మొదటి దశలో 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2026 పూర్తయ్యే నాటికి ఈ ఉద్యోగ కోతలు మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి.యాజమాన్యం ఏమంటోంది?మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్లె గేల్ మాట్లాడుతూ, తదుపరి రౌండ్ల తొలగింపులు ఉండబోవనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘మేము అత్యంత పోటీ వాతావరణంలో పనిచేస్తున్నాం. వ్యాపార ప్రాధాన్యతలను బట్టి జట్లు, ఖర్చుల విషయంలో చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ప్రభావితమైన కొంతమందిని వేరే విభాగాలకు తరలించే ప్రయత్నం చేస్తామని, మానవతా దృక్పథంతో బాధితులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.ఏఐ పెట్టుబడుల ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా ఉద్యోగాల కోతలకు కారణం కాదని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కంపెనీ తన బడ్జెట్లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనలు, అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థల కోసం మెటా దాదాపు 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయనుంది. ‘ఒక విభాగంలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే మరో విభాగంలో వ్యయం తగ్గించక తప్పదు’ అని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఏఐ విస్తరణ కోసం ఉద్యోగ భద్రతను బలి పెడుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.ఉద్యోగుల్లో ఆందోళనప్రస్తుతం మెటాలో 77,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. పనితీరులో సామర్థ్యాన్ని పెంచే పేరుతో సాగుతున్న ఈ తొలగింపుల వల్ల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతర్గత ఫోరమ్లలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పారదర్శకమైన కమ్యూనికేషన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
కార్పొరేట్
నమ్మావో ముంచేస్తారు!
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
లేఆఫ్స్.. కోత మొదలు.. డేట్ ఫిక్స్
మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన
ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేసింది!
ట్రైన్ టికెట్లపై H1, A1 కోడ్లు: వీటి అర్థం ఏంటో తెలుసా?
70 కోట్లు దాటిన ఫోన్పే యూజర్లు!
నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?
4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్
అంతుచిక్కని పసిడి ధరలు.. మళ్లీ తారుమారేనా..
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి...
940 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2...
దూసుకెళ్తున్న బంధన్ బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బంధన్ బ్యాంక్ షేర్లు దూసుకెళ్త...
భారత్ నెత్తిన చమురు ధరల భారం
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరిత...
ఆయిల్ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరల...
ఇంధన దాహం.. జల వినాశం!
భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వే...
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్కు మేలే!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక మార్పు చోటు చేసుక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
యాపిల్ గ్యాడ్జెట్తో ఐ ఆపరేషన్
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కేవలం విలాసవంతమైన గ్యాడ్జెట్గా భావించిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పుడు ప్రాణాలను రక్షించే, చూపును ప్రసాదించే వైద్య విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్పేషియల్ కంప్యూటింగ్ పరికరాన్ని వైద్యులు విజయవంతంగా ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కంటిశుక్లం ఆపరేషన్లలో..న్యూయార్క్కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్, ఈ గ్యాడ్జెట్ను శస్త్రచికిత్సా పరికరంగా ఉపయోగించారు. 2025 చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణంగా ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కంటిశుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్సల్లో దీని వినియోగం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.‘స్కోప్ ఎక్స్ ఆర్’ పనితీరుఈ సాంకేతికత నేరుగా ఆపరేషన్ గదిలోని సర్జికల్ మైక్రోస్కోప్తో అనుసంధానించబడి ఉంటుంది. మైక్రోస్కోప్ నుంచి వచ్చే ప్రత్యక్ష దృశ్యాలను హై-రిజల్యూషన్ 3డీ నాణ్యతతో సర్జన్ కళ్ల ముందు ఉంచుతుంది. శస్త్రచికిత్స జరుగుతుండగానే రోగి పాత స్కాన్ రిపోర్టులు, కీలక డేటాను సర్జన్ తన చూపును పక్కకు తిప్పకుండానే హెడ్సెట్ స్క్రీన్పై చూసుకోవచ్చు. మానిటర్ల వైపు చూడటానికి పదేపదే తల తిప్పాల్సిన అవసరం లేకపోవడంతో సర్జన్ పూర్తి ఏకాగ్రత రోగి కంటిపైనే ఉంటుంది.‘ఇది ఉన్న పరికరాలను తొలగించదు. కానీ ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అది అంతా మన కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం అద్భుతం’ అని డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్ చెప్పారు.రిమోట్ సహకారంవిజన్ ప్రో ద్వారా మరో కీలక ప్రయోజనం ‘రిమోట్ కొలాబరేషన్’. ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న నిపుణుడైనా వర్చువల్గా ఆపరేటింగ్ థియేటర్లోకి ప్రవేశించవచ్చు. సర్జన్ ఏం చూస్తున్నారో అదే దృశ్యాన్ని రిమోట్ తీసుకున్న నిపుణుడు కూడా చూస్తూ రియల్టైమ్లో సూచనలు ఇచ్చే వీలుంటుంది. ఇది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో, క్లిష్టమైన కేసులలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.సవాళ్లువైద్య రంగంలో మిశ్రమ వాస్తవికత (మిక్స్డ్ రియాలిటీ) ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వాల నుంచి క్లినికల్ అనుమతులు పొందడం క్లిష్టమైన ప్రక్రియ. పరికరాల ధరలు అధికంగా ఉండటం వల్ల సామాన్య ఆసుపత్రులకు ఇవి ఇంకా అందుబాటులో లేవు. దీనిని వాడటానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
ఏఐ ఉచ్చులో కార్పొరేట్ సంస్థలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.పరిష్కారం ఏమిటి?యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’
ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.ఏమిటా కొత్త రోల్? బాధ్యతలు ఇవే..బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో 30% నుంచి 40% సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.సిలికాన్ వ్యాలీ దిగ్గజాల స్పందనఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది (అంటే మానవ సంబంధాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు) అరుదుగా మారుతుంది’ అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్కు ఉన్న డిమాండ్ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది.అర్హతలు, ఎంపిక విధానంఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. ‘మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?’ అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్ ద్వారా సంప్రదిస్తుంది.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..
పర్సనల్ ఫైనాన్స్
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది.
ఇన్వెస్కో కొత్త ఫండ్స్!
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ వీటి లో ఉన్నాయి.మొదటిది సెన్సెక్స్ ఇండెక్స్లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎన్ఎఫ్వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్ ఆఫర్లు మే 7న ముగుస్తాయి.
వ్యక్తిగత హెల్త్ పాలసీకి మైగ్రేషన్ ఇలా..
ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్ ప్యాకేజీలో భాగంగా గ్రూప్ మెడికల్ కవరేజ్ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్–డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.పాలసీని ఎలా మార్చుకోవాలంటే ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్’ ప్లాన్గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్’ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.వారి వద్ద ఉన్న వివిధ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకోండి. సరైన ప్లాన్ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్ ఫామ్, మైగ్రేషన్ ఫామ్ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.మైగ్రేషన్తో ప్రయోజనాలు దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్ పీరియడ్’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ కాలం, కొత్త రిటైల్ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్ ప్లాన్లోకి మాత్రమే మర్చుకోగలరు. వైద్య పరీక్షలు: గ్రూప్ పాలసీలో సాధారణంగా మెడికల్ టెస్టులు ఉండవు. కానీ రిటైల్ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్ ఇన్సూర్డ్ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్ పీరియడ్ యథాప్రకారంగానే వర్తిస్తుంది.పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది.
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్.


