Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Securities Transaction Taxes for derivatives on futures and options trade increased1
ఫ్యూచర్స్‌ ట్రేడర్లపై ఎస్‌టీటీ గూగ్లీ

న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్‌ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో)పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ని (ఎస్‌టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్‌పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్‌టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే ఆప్షన్స్‌ ప్రీమియంపై, ఆప్షన్స్‌ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్‌టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్‌ ఈక్విటీ మార్కెట్‌పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్‌ ఉంటున్న డెరివేటివ్‌ ట్రేడింగ్‌నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్‌ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్‌ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్‌ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్‌ విక్రయంపై ఎస్‌టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్‌ కాంట్రాక్ట్‌ విక్రయంపై ఎస్‌టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్‌ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం లెమన్‌ సహ వ్యవస్థాపకుడు ఆశీష్‌ సింఘాల్‌ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్‌ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్‌ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్‌ అనంతరం కాన్ఫరెన్స్‌లో నిర్మలా సీతారామన్‌ వివరించారు. మార్కెట్లు డౌన్‌.. ఎస్‌టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్‌ సంబంధ స్టాక్స్‌ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ఎంసీఎక్స్‌ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్‌), ఏంజెల్‌ వన్‌ స్టాక్‌ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్‌ఎల్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్‌ రాఠీ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్‌పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్‌ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్‌ ఫండ్స్‌కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్‌ ఈక్విటీ బ్రోకింగ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆకాశ్‌ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్‌పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్‌ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్‌ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్‌ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్‌పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్‌ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్‌టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎండీ శ్రీపాల్‌ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్‌ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్‌ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్‌ ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్లను ఎస్‌టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో పీఎంఎస్‌ సహ–వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్‌ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్‌ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు.

Investors lost Rs 9. 40 lakh cr in Budget Sunday crash2
మార్కెట్‌ డకౌట్‌

2026 బడ్జెట్‌ మ్యాచ్‌లో నిర్మలా సీతారామన్‌ వేసిన తొలి ఓవర్‌కే స్టాక్‌ మార్కెట్‌ డకౌట్‌ అయింది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్‌ టాస్‌కి బ్రోకరేజీలు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాయి. బడ్జెట్‌ రోజు స్టాక్‌ మార్కెట్‌ పాయింట్ల బ్యాటింగ్‌ చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్‌ వేసిన అనూహ్య బౌన్సర్‌కు సెన్సెక్స్‌–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్‌ ఓవర్‌లోనే సెన్సెక్స్‌పై భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్‌ సెషన్‌కల్లా రెడ్‌ స్కోర్‌బోర్డ్‌ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్‌ అయ్యి వెనుదిరిగితే, ఎల్‌బీడబ్లు్య అప్పీల్‌కి బుల్స్‌ చేతులు ఎత్తేశారు. బడ్జెట్‌ మ్యాచ్‌ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్‌తో ముగిసింది.న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్‌ స్టాక్‌ మార్కెట్‌పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్‌ ప్రమోటర్ల బైబ్యాక్‌లపై 22%, నాన్‌ కార్పొరేట్‌ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బడ్జెట్‌ రోజైన ఆదివారం సెన్సెక్స్‌ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్‌ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్‌ సాగిందిలా బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్‌టీటీ రద్దు, క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్‌ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష ‘‘బడ్జెట్‌లో ఎస్‌టీటీ, కార్పొరేట్‌ బైబ్యాక్‌లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్‌ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్‌ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్‌లో వాల్యూమ్‌ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. మార్కెట్‌లో మరిన్ని అంశాలు ఎల్రక్టానిక్స్‌ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్‌ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్‌ టెక్నాలజీస్‌ 4.21%, కేన్స్‌ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్‌ 2.95%, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌ 2.06%, సైయంట్‌ డీఎల్‌ఎం 1 శాతం లాభపడ్డాయి. → సెన్సెక్స్‌ 30 షేర్లలో టీసీఎస్‌(2%), ఇన్ఫోసిస్‌(1.17%), సన్‌ఫార్మా(0.95%), టైటాన్‌ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్‌బీఐ(5.61%), అదానీపోర్ట్స్‌(5.53%), బీఈఎల్‌(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్‌ (3.88%) õÙర్లు నష్టపోయాయి. → ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్‌ లభించింది. బీఎస్‌ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5.60%, మెటల్‌ 3.85% క్షీణించాయి. కమోడిటీస్‌ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.08%, వినిమయ 2.98%, → ఇండ్రస్టియల్స్‌ 2.66%, విద్యుత్‌ 2.52% పతనమయ్యాయి. బీఎస్‌ ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి. → ఎస్‌టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్‌ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. → క్యూ3లో లాభం 16% వృద్ధి నమోదుతో సన్‌ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది.

Union Budget 2026 Draws Positive Response from Industry3
ఇక ఇండియన్‌ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర

కేంద్ర బడ్జెట్‌ 2026లోని ప్రతిపాదనలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన–అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని వారు ప్రశంసించారు.సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా భారత్‌కేంద్ర బడ్జెట్‌ 2026 భారతదేశాన్ని విశ్వసనీయ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా నిలబెడుతుంది. సుపరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించడం ప్రోత్సాహకరం. ఇది ఆవిష్కరణ, సమర్థత, స్కేలబుల్ డిజిటల్ పరిష్కారాలను అందించడంలో భారతీయ ఐటీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేస్తుంది. ఇండియాఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫండ్, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సిద్ధమైన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.— అతుల్ సోనేజా, సీఓఓ, టెక్ మహీంద్రాక్రిప్టో రంగానికి దీర్ఘకాలిక లాభంభవిష్యత్తు సాంకేతికతల పట్ల కేంద్ర బడ్జెట్‌ స్పష్టమైన నిబద్ధతను చూపుతోంది. ఇండియాఏఐ మిషన్‌కు రూ.2,000 కోట్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూ.500 కోట్లు కేటాయించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. క్రిప్టో రంగానికి ఇది తక్షణ ధరల ప్రభావం కన్నా, బలమైన ఆర్ & డి, టాలెంట్ అభివృద్ధి, నియంత్రిత, ఇండియా-ఫస్ట్ వినియోగాల నిర్మాణానికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తుంది. బ్లాక్‌చెయిన్ ఎంటర్‌ప్రైజ్ స్వీకరణకు, సురక్షిత ఆర్థిక మౌలిక సదుపాయాలకు కీలకమవుతుంది.— విక్రమ్ సుబ్బూరాజ్, సీఈఓ, జియోటస్.కామ్తెలంగాణ లైఫ్ సైన్సెస్ వృద్ధికి ఊతంకేంద్ర బడ్జెట్‌ లైఫ్ సైన్సెస్ రంగంపై చూపుతున్న దృష్టి తెలంగాణలో వృద్ధికి మరింత ఊతమిస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30లో పేర్కొన్న అధునాతన తయారీ, ఆవిష్కరణలు, ఆర్ & డి లక్ష్యాలు ఈ బడ్జెట్‌తో మరింత వేగం పొందనున్నాయి. దీని ద్వారా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాలు సాధ్యమవుతాయని, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ స్థానం బలపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.— శక్తి ఎం. నాగప్పన్, సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్

Centre Showers Boon on Hyderabad with High Speed Rail Corridors4
హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైళ్లు..

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో భాగంగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్‌ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.

Proposed telecom outlay raised BSNL gets Rs 28,473 crore5
బీఎస్ఎన్ఎల్‌కు రూ.28,473 కోట్లు

కేంద్ర బడ్జెట్‌ 2026-27లో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం గణనీయంగా పెరిగిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, బీఎస్ఎన్ఎల్ మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్‌వర్క్ రోలౌట్‌తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి రూ.53,000 కోట్ల కేటాయింపు ఉండగా, తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.73,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇది దాదాపు 40 శాతం వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా, బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.“బీఎస్ఎన్ఎల్ ఏఆర్‌పీయూ (సగటున ఒక్కో యూజర్‌ ద్వారా వచ్చే ఆదాయం) రూ.90 నుంచి రూ.99కు దాదాపు 9 శాతం పెరిగింది. త్వరలో మూడు అంకెల స్థాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా మూడు విభాగాల్లోనూ ఆదాయం పెరిగింది. అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరం ఉంది. తద్వారా బీఎస్ఎన్ఎల్‌ను పునరుజ్జీవన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం,” అని మంత్రి తెలిపారు.ప్రతిపాదిత అదనపు బడ్జెట్‌లో గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ అయిన భారత్ నెట్‌కు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కు స్పెక్ట్రమ్ కోసం సుమారు రూ.1.39 లక్షల కోట్ల విలువైన కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. టవర్లు, మౌలిక వసతులు, బ్యాటరీలు వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయని సింధియా తెలిపారు. గతంలో రూ.4,495 కోట్లుగా ఉన్న సవరించిన అంచనాలను రూ.6,800 కోట్లకు పెంచామని, ఇది దాదాపు 50 శాతం వృద్ధి అని వివరించారు. ఈ బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, పట్టణీకరణ, ఆరు రాష్ట్రాల్లోని ఐదు బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 4,000 ఈ-బస్సుల ప్రవేశపెట్టడం, అలాగే ఆరోగ్యం మరియు విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Union Budget 2026–27 Manufacturing Strategic Frontier Sectors6
పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు

కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ‘వికసిత్ భారత్’ దిశగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేశారు.ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి వరకు.. ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 2.0సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఐఎస్‌ఎం 2.0ను ప్రకటించారు. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ పరికరాలు, మెటీరియల్స్ ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.బయోఫార్మా ‘శక్తి’ఫార్మా రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తారు.అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకంచైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అత్యంత కీలకం.డెడికేటెడ్ కెమికల్ పార్కులుదేశీయ రసాయన ఉత్పత్తిని పెంచడానికి రూ.600 కోట్లతో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ‘ఛాలెంజ్ రూట్’(సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును ఒకే చోట కాకుండా ఏ రాష్ట్రం అయితే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య నిర్వహించే పోటీనే ఛాలెంజ్ రూట్) ద్వారా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్‌)ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం కేటాయింపులను ఏకంగా రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు భారత్‌లోనే తయారవుతాయి.టెక్స్‌టైల్స్ రంగం - ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్వస్త్ర పరిశ్రమ బలోపేతానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, టెక్స్‌టైల్ విసర్తణ, ఉపాధి పథకాలు ఉన్నాయి. పాత టెక్స్‌టైల్ క్లస్టర్లను ఆధునీకరించడం వీటి ప్రధాన ఉద్దేశం.ఇతర కీలక మౌలిక సదుపాయాల పథకాలుకంటైనర్ తయారీ: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటాను పెంచడానికి రూ.10,000 కోట్లతో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్.ఇండస్ట్రియల్ క్లస్టర్లు: దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక వాడలను (Clusters) ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు.హైటెక్ టూల్ రూమ్స్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యాధునిక టూల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం అందిస్తారు.క్రీడా సామగ్రి: సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సామగ్రిని తయారు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.నిర్మాణ పరికరాలు: అధిక విలువ కలిగిన నిర్మాణ, మౌలిక సదుపాయాల యంత్రాల తయారీని దేశీయంగా బలోపేతం చేయనున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

Advertisement
Advertisement
Advertisement