Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Rate Big Jump In Indian Market  1
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్‌ నడుస్తుండడంతో డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్‌ మార్కెట్‌) ఔన్స్‌కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్‌ 31న ఔన్స్‌ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్‌ డాలర్‌ బలహీనపడడం, యూఎస్‌ ఫెడ్‌ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్‌ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.

Indian Passenger Lauds TDR System For Refund After 7 Hour Train Delay2
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..

కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్‌లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్‌గా..టీడీఆర్ గురించినిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్‌ను తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.Received Message from IRCTC that Train was 7 hours late. Booked a Bus Ticket to the Destination.Instead of Cancelling Train Ticket, Filed TDR on Nov 30th 2025.Refund initiated on Dec 1st 2025.Super Fast. Credit where due for timely communication from Railways 👍… pic.twitter.com/weZiQNuenT— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) December 1, 2025

Oakley Meta Glasses With Meta AI Integration Now Available for Purchase in India3
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..

ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్‌లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్‌లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్‌గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 3K వీడియో రిజల్యూషన్‌లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్‌లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.

Four Ways You Can Quickly Check Your PF Balance4
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్‌గా..

ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్ పోర్టల్‌లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్‌ను యూనిఫైడ్ పోర్టల్‌లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్‌ల తర్వాత స్వయంచాలకంగా డిస్‌కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.EPFOHO UAN టెక్స్ట్‌లో మీ UAN నంబర్‌ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్‌లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్‌ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO ​​సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్‌ను సులభంగా చూడవచ్చు.EPFO వెబ్‌సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్‌పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.EPFO ​​పోర్టల్‌లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?

Tech Founders Anti Screen Experiment Turns Into 120000 Viral Success in Just 3 Days5
చిన్న ఐడియా.. మూడు రోజుల్లో రూ.కోటి సంపాదన!

ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్‌ ఫోన్‌ వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకుందామని ఓ టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.రెండేళ్ల క్రితం, ఆన్‌లైన్‌లో క్యాట్‌జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్‌ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్‌లైన్ ఫోన్‌ వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్‌ వాడాలంటే కొత్త నంబర్‌, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్‌షెల్ హ్యాండ్‌సెట్‌ను తీసుకుని, దాన్ని బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్‌ చేసుకుని కాల్స్‌ మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్‌మెంట్‌లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్‌లైన్‌లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికి ‘ఫిజికల్ ఫోన్’ అని పేరు పెట్టి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఏదో 15–20 ప్రీ–ఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్‌ బ్రాండ్ కింద 90–110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్‌సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్‌ ఉత్పత్తుల షిప్పింగ్‌ని ప్రారంభించనుంది.ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌టైమ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్‌ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్‌ను డయల్ చేయడం ద్వారా లేదా ‘స్టార్‌’(*) కీని నొక్కి ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్‌గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు.

BSNL Rs 1 Plan Full Details Here6
రూపాయికే నెలరోజుల రీఛార్జ్!.. డైలీ 2జీబీ డేటా

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల రూ. 199 ప్లాన్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు మరోమారు రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ అందించనుంది.బీఎస్ఎన్ఎల్ ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీనిని దీపావళి సమయంలో కూడా కొనసాగించింది. ఇప్పుడు మరోమారు ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్కువమంది ప్రజలు ఈ ప్లాన్ కోరుకోవడం వల్లనే దీనిని మళ్లీ తీసుకురావడం జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.Back by public demand - BSNL’s ₹1 Freedom Plan!Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2— BSNL India (@BSNLCorporate) December 1, 2025రూ.199 ప్లాన్ వివరాలుబీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

Advertisement
Advertisement
Advertisement