Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Farm sector can maintain 4 pc growth over next 10 years NITI member1
‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’

ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎక్కువేం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ వ్యాఖ్యానించారు. పాలకు సంబంధించి వృధా కేవలం 0.5 శాతమే ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఆహార వృధాలోనూ చాలా వరకు అరికట్టొచ్చని చెబుతూ.. ఇలా చేస్తే అది గోదాముల్లో పెట్టుబడులకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్నారు. దేశ వ్యవసాయ రంగం వచ్చే పదేళ్ల పాటు 4 శాతం వృద్ధి రేటును సులభంగానే సాధిస్తుందని రమేష్‌ చంద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదాముల వసతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. పీహెచ్‌డీ సీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఏటా 2.5 శాతం చొప్పున పెరుగుతున్నట్టు చెప్పారు. కనుక 4 శాతం వృద్ధి సాధ్యమేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో (క్యూ1) వ్యవసాయ రంగంలో వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం.‘‘కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఈ స్థాయిలో పెరగడం లేదు. కనుక ఈ ఉత్పత్తులను పరిశ్రమలు వినియోగించాలి. లేదంటే ఎగుమతి చేయాలి. ఎగుమతి మార్కెట్‌ను గుర్తించడం మెరుగైన ఆప్షన్‌ అవుతుంది’’అని రమేష్‌ చంద్‌ పేర్కొన్నారు.బియ్యం, గోధుమలకు కావాల్సిన నిల్వ వసతుల్లో (గోదాములు) ఎలాంటి వ్యత్యాసం లేదంటూ.. అదే మొక్కజొన్న విషయంలో మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు. నిర్ణీత పరిమాణానికి మించి నిల్వ చేయకూడదన్న చట్టం ఉంటే.. అలాంటి నియంత్రణలు గోదాముల నిర్మాణంపై పెట్టుబడులను ప్రభావితం చేస్తాయన్నారు.

This is Right time to buy Real estate property2
ఇదిగో ఇల్లు కొనాల్సింది ఇప్పుడే..

రాష్ట్రంలో కొంతకాలం వరకూ స్థిరాస్తి మార్కెట్‌ స్తబ్దుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పోత్సాహకర నిర్ణయాలు, ఫ్యూచర్‌ సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు తదితరాలతో మార్కెట్‌ మళ్లీ గాడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే వేగవంతంగా విధానపరమైన నిర్ణయాలతో పాటు వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలి. అప్పుడే మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడి, క్రయవిక్రయాలు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ ప్రతికూల వాతావరణంలోనే ధరలు, వసతుల విషయంలో కస్టమర్లకు బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. నగదు లభ్యత కావాలి కాబట్టి డెవలపర్లూ అంగీకరించే వీలుంటుంది. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడి దారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పాలసీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్బుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.ఢోకా లేదు.. హైదరాబాద్‌లోని భౌగోళిక వాతావరణం, వనరులు, మౌలిక సదుపాయాలు, దేశ, విదేశీ సంస్థల కార్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌కు ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ఇప్పటికీ హైదరాబాద్‌లో గృహాల ధరలు, అద్దెలు, భూముల రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాస్మోపాలిటన్‌ కల్చర్, తక్కువ జీవన వ్యయం వంటివి నగరానికి అదనపు అంశాలు. దీంతో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఏమాత్రం అలసత్వం ఉండదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌కు ఢోకా ఉండదు.ఇదీ చదవండి: ఓపెన్‌ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!

Gold and Silver rates on 22 November 2025 in Telugu states3
రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి రేట్లు..

దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Flipkart Big Billion Days boosted Walmart Q3 growth4
కలిసొచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌

అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్ట్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ మూడో త్రైమాసికంలో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించడంలో భారత విభాగం ఫ్లిప్‌కార్ట్‌ కీలకంగా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్‌ ’బిగ్‌ బిలియన్‌ డే’ సేల్స్‌ని నిర్వహించిన సమయం తమ సంస్థ ఆదాయాల వృద్ధికి సానుకూలంగా దోహదపడిందని వాల్‌మార్ట్‌ తెలిపింది.ఫిబ్రవరి–జనవరి వ్యవధిని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా వాల్‌మార్ట్‌ ఆదాయం 179.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్యూ3లో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ, క్యూ4లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశంఉందని వాల్‌మార్ట్‌ తెలిపింది.ఈ ఏడాది సెపె్టంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 2 వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నడిచింది. 2018లో 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ 77 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని 80 శాతానికి పెంచుకుంది.

Maruti Suzuki picks up stake in Ravity Software5
సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌లో వాటా కొన్న మారుతీ

టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ రావిటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 7.84 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు మారుతీ సుజుకీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా రూ. 2 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రావిటీ కనెక్టెడ్‌ మొబిలిటీ ఇన్‌సైట్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు పేర్కొంది.ఈ ఫండ్‌ ద్వారా మారుతీ ఇంతక్రితం రెండుసార్లు దాదాపు రూ. 2 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. 2024 మార్చిలో ఏఎంఎల్‌గో ల్యాబ్స్‌లో, 2022 జూన్‌లో సోషియోగ్రాఫ్‌ సొల్యూషన్స్‌లోనూ వాటా కొనుగోలు చేసింది. అత్యున్నతస్థాయి ఆవిష్కరణలకు తెరతీస్తున్న స్టార్టప్‌లలో ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు మారుతీ తెలియజేసింది.కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన స్టార్టప్‌లవైపు దృష్టి పెడుతున్నట్లు తెలియజేసింది. కాగా.. మారుతీ పెట్టుబడుల నేపథ్యంలో ఏఐ, అనలిటిక్స్, మొబిలిటీలో కంపెనీకున్న సామర్థ్యం, నైపుణ్యాలను మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నట్లు రావిటీ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ రుంగ్తా పేర్కొన్నారు.కాగా మారుతీ సుజుకీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 15,980 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 16,150ను తాకింది.

IT Employees To Get Salaries By 7th Of Every Month New Labour Code6
ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్‌ కోడ్‌

ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్‌ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్‌ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లేబర్‌ కోడ్‌లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్‌కోడ్‌ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.అంతేకాకుండా నైట్‌ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్‌ కోడ్‌లను ప్రకటించింది.ఇది చదివారా?: కొత్త జాబ్‌ ట్రెండ్స్‌.. ప్రయోగాత్మక పని విధానాలు

Advertisement
Advertisement
Advertisement