Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hyderabad ranks second in GCC leasing in India1
జీసీసీ లీజింగ్‌లో హైదరాబాద్‌ హవా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) లీజింగ్‌కి సంబంధించి హైదరాబాద్‌ అత్యంత వేగంగా ఎదుగుతోంది. 2020–24 మధ్య కాలంలో 18.6 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌తో దేశం మొత్తం మీద 17 శాతం వాటా దక్కించుకుంది. బెంగళూరు తర్వాత రెండో స్థానంలో నిలి్చంది. జీసీసీలపై శావిల్స్‌ ఇండియా రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 112 మిలియన్‌ చ.అ. జీసీసీల లీజింగ్‌లో టెక్‌ సిటీల త్రయం (బెంగళూరు, హైదరాబాద్, పుణె) 70 శాతం వాటా దక్కించుకుంది. ప్రతిభావంతుల లభ్యత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) తక్కువగా ఉండటం మొదలైనవి హైదరాబాద్‌కి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 2020–24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 262 మిలియన్‌ చ.అ.లుగా ఉండగా, అందులో జీసీసీ లీజింగ్‌ వాటా 112 మిలియన్‌ చ.అ.తో 43 శాతంగా నమోదైంది. → హెల్త్‌కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్‌ అగ్రగామిగా ఉంది. జీనోమ్‌ వేలీలాంటి వ్యవస్థలు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌ రంగాల జీసీసీలకు కూడా నగరం కేంద్రంగా నిలుస్తోంది. → దేశీయంగా ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుంది. → సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసులు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌–తయారీ, ఫార్మా, రిటైల్, కన్జూమర్‌ సర్వీసుల ఆధిపత్యం కొనసాగనుంది. → సంప్రదాయ ఐటీ సరీ్వసుల ఉద్యోగాలతో పోలిస్తే జీసీసీల్లో జీతభత్యాలు 12–20 శాతం అధికంగా ఉంటున్నాయి. ఏఐ/ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌లాంటి అధునాతన అంశాలకు ప్రాధాన్యత ఉంటోంది. → రాబోయే రోజుల్లో 2030 నాటికి జీసీసీల లీజింగ్‌ ఏటా 30 మిలియన్‌ చ.అ. మేర పెరగనుంది. → 2025–30 మధ్య కాలంలో భవిష్యత్తులో దేశీయంగా ఏర్పాటయ్యే జీసీసీల్లో ఆటోమోటివ్, లైఫ్‌ సైన్సెస్, సెమీకండక్టర్‌ కేంద్రాల వాటా 30 శాతంగా ఉంటుంది. → అంతర్జాతీయంగా 100 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్ల వరకు ఆదాయాలు ఉండే జీసీసీ సెగ్మెంట్‌ కంపెనీలకు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. → నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, పాలసీ సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు మొదలైనవి భారత్‌ను అగ్రగామి జీసీసీ హబ్‌గా నిలుపుతాయి.

Automakers extend sales surge beyond festive season in November2
ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి 

ముంబై: పండగ సీజన్‌ తర్వాత కూడా ప్యాసింజర్‌ వాహనాలకు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) డిమాండ్‌ కొనసాగింది. ఈ నవంబర్‌లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్‌లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. ∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్‌లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్‌సైకిల్‌ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్‌ సిగ్మెంట్‌లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్‌ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘పండుగ డిమాండ్‌ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్‌లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్‌ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్‌ సెంటిమెంట్‌తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.

Automobile retail sales sustain momentum in November says FADA3
కొనసాగిన పండగ సీజన్‌ జోష్‌..

న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్‌లోనూ ఆ జోష్‌ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. జీఎస్‌టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్‌సేల్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్‌సేల్‌ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఏర్పడే డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్‌íÙప్‌ల దగ్గర స్టాక్స్‌ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్‌లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్‌ కాగా ఈసారి నవంబర్‌లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్‌లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్‌ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్‌ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్‌లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్‌ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్‌ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్‌ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్‌ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్‌ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్‌ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్‌లో లక్షన్నర బుకింగ్స్‌ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్‌ పీరియడ్‌లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్‌లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్‌లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్‌ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి.

Why CNG Car Mileage Higher Than Petrol4
అందుకే.. పెట్రోల్ కంటే సీఎన్‌జీ కారు మైలేజ్ ఎక్కువ!

సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్‌జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇంధన రసాయన నిర్మాణంపెట్రోల్ అనేది C8​H18 వంటి హైడ్రోకార్బన్‌ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియోసీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్పెట్రోల్‌లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువCNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు.

Why Platinum Prices Lower Than Gold and Silver5
పీక్‌లో గోల్డ్, సిల్వర్: డీలా పడిన ప్లాటినం!

భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..బంగారం ధరలు పెరగడానికి కారణాలుద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి ధరలు పెరగడానికి కారణాలుఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలుబంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.

Huge Demand for EV Batteries6
ఈవీ బ్యాటరీలకు భారీ డిమాండ్‌

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్‌ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ (సీఈఎస్‌) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్‌ 17.7 గిగావాట్‌ హవర్‌ (జీడబ్యూ్యహెచ్‌) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి (సీఏజీఆర్‌) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్‌ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్‌ వివరించింది.‘‘భారతదేశ ఎలక్ట్రిక్‌ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌ 4, సోడియం అయాన్‌ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్‌తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్‌ ఎండీ వినాయక్‌ వలింబే తెలిపారు. ఎల్‌ఎఫ్‌పీ జెన్‌4 సెల్స్‌ అన్నవి ఇప్పుడు 300 వాట్‌హవర్‌/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.సవాళ్లను అధిగమించాలి..భారత్‌ తన ఎలక్ట్రిఫికేషన్‌ (ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్‌ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్‌లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్‌్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement