Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Snapshot latest IPO listings in India1
ఐదు కంపెనీల లిస్టింగ్‌ బాట

రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ 2025 బాటలో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. తాజాగా సెబీ ఐదు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. జాబితాలో విరూపాక్ష ఆర్గానిక్స్, డ్యురోఫ్లెక్స్, ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్, ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌ కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కాగా.. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. ఆర్‌అండ్‌డీ ఫార్మాహైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్‌ ఐపీవోకు వస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అయితే ఐపీవోకు ముందుగా రూ. 148 కోట్ల విలువైన ప్లేస్‌మెంట్‌కు వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పరిశోధన– అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఆధారిత ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా నిలుస్తోంది. సంబంధిత ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీ చేపడుతోంది.పరుపుల తయారీపరుపుల తయారీలో సుప్రసిద్ధమైన డ్యురోఫ్లెక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 184 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.25 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ముంబై కంపెనీ 120 సొంత, నిర్వహణా స్టోర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. అంతేకాకుండా ప్రస్తుత కోకో స్టోర్ల లీజ్, రెంట్, లైసెన్స్‌ ఫీజులతోపాటు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సైతం వినియోగించనుంది. 1963లో ఏర్పాటైన డ్యురోఫ్లెక్స్‌ మార్కెట్‌ వాటా రీత్యా దేశీయంగా పరుపుల తయారీలోని టాప్‌–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఫర్నీచర్‌సహా బెడ్డింగ్‌ సంబంధిత ప్రొడక్టులను సైతం తయారు చేస్తోంది.విస్తరణపై దృష్టివెల్డింగ్‌ కన్జూమబుల్స్‌ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీ చేపట్టే ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 2.25 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను హోనడ్, ఖాలాపూర్‌(మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌) వద్ద కొత్తగా వైర్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు.. వాడా, పాల్ఘర్‌(మహారాష్ట్ర)లోగల యూనిట్‌ విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వెల్‌నెస్‌ ప్రొడక్టులతోవిభిన్న మైక్రోన్యూట్రియంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. 1993లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా వివిధ మైక్రోన్యూట్రియంట్‌ ప్రీమిక్స్‌లతోపాటు.. బ్రాండెడ్‌ వెల్‌నెస్, క్లినికల్‌ న్యూట్రిషన్, థరెప్యూటిక్‌ ఫార్ములేషన్స్, వినియోగానికి సిద్ధంగా ఉండే(రెడీ టు యూజ్‌) ఆహారోత్పత్తులను తయారు చేస్తోంది.పెట్టుబడి వ్యయాలకుహైవోల్టేజీ, ఎక్స్‌ట్రా హైవోల్టేజీ విద్యుత్‌ ప్రసార లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసే ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా 90 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 10 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లతోపాటు.. భూగర్భ కేబుళ్ల ప్రాజెక్టులు, సమీకృత నిర్వహణా సర్వీసులు తదితర కార్యకలాపాలు సైతం చేపడుతోంది.ఇదీ చదవండి: ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

Zoho cofounder Sridhar Vembu doesnt believe AI will wipe out jobs2
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్‌పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్‌ జడ్జ్‌మెంట్‌), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్‌వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్‌ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్‌ వెంబు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్‌ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్‌లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్‌ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

gold and silver rates on 17 February 2026 in Telugu states3
కరుగుతోన్న బంగారు కొండ..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

stock market updates on 17 February 20264
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు తగ్గి 25,603 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 171 దిగజారి 83,096 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.13బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 68.3 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.05 శాతం పెరిగింది.నాస్‌డాక్‌ 0.22 శాతం దిగజారింది.Today Nifty position 17-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Russia Currency Shift Dollar Trade Twist Raises Global Indian Economic Stakes5
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్ స్థానాన్ని మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా రష్యా-అమెరికా మధ్య జరుగుతున్న ఈ కరెన్సీ గేమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అమెరికా డాలర్లలో వ్యాపారం సాగిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.డాలర్ వైపు రష్యా మొగ్గు ఎందుకు?2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాలను డాలర్లకు బదులు రూబుల్స్, యువాన్, రూపాయిల్లోకి మార్చింది. అయితే, 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం రష్యా తిరిగి అమెరికన్ డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది.ఇందుకు కారణాలుఅమెరికాలో ట్రంప్‌ మరోసారి అధ్యక్షడయ్యాక ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతోంది. ఇంధన రంగాలు, ఖనిజాల వ్యాపారంలో తిరిగి డాలర్లను అనుమతించడం ద్వారా ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలని రష్యా భావిస్తోంది. చైనా యువాన్ లేదా ఇతర కరెన్సీల కంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం కలిగి ఉండటం రష్యాకు అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇది కూడా రష్యా డాలర్లలో వ్యాపారం కొనసాగించాలనుకోవడానికి ఒక కారణంగా ఉంది.ప్రపంచ వాణిజ్యంపై ప్రభావంరష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్‌లోకి వస్తే అది ‘డీ-డాలరైజేషన్’ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే, చమురు వ్యాపారం తిరిగి డాలర్లలో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.భారత్‌పై ప్రభావమెంత?రష్యా-అమెరికా మధ్య మారుతున్న ఈ ఆర్థిక సమీకరణాలు భారతదేశంపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విషయానికి వస్తే ఇప్పటివరకు రష్యా నుంచి రూపాయిల్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ కొంత లబ్ధి పొందింది. అయితే, రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లితే భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భవిష్యత్తులో భారత్ రష్యా నుంచి చేసే దిగుమతులను తగ్గించి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని గమనించాలి. బంగారం, ఎగుమతుల రంగంలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Govt notified 100 percent FDI in insurance sector6
బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్‌డీఐలు

బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సా హక విభాగం (డీపీఐఐటీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో మాత్రం 20 శాతానికే అనుమతి ఉంటుంది.విదేశీ పెట్టుబడులున్న భారతీయ బీమా కంపెనీల విషయంలో బోర్డ్‌ చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లలో కనీసం ఒక్కరైనా రెసిడెంట్‌ భారతీయ పౌరులై ఉండాలి. ఇన్సూరెన్స్‌ చట్టాల సవరణకు సంబంధించిన సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా బిల్లు 2025ని డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Advertisement
Advertisement
Advertisement