Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Why Are Highway Signs Green Know The Details Here1
అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు!

దాదాపు అందరూ భారతదేశంలోని హైవేలపై ప్రయాణించి ఉంటారు. ఆ సమయంలో మీకు అక్కడక్కగా తెల్ల రంగు అక్షరాలతో.. ఆకుపచ్చ రంగు సైన్ బోర్డులను చూసి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా?, జాతీయ రహదారులపై ఇలాంటి రంగులోనే సైన్ బోర్డులు ఎందుకు అమర్చారో!. బహుశా దీనిగురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.డైరెక్షన్ & గైడెన్స్భారతదేశంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు & ప్రధాన జిల్లా రహదారులపై డైరెక్షన్ & గైడెన్స్ సైన్‌లు ఆకుపచ్చ రంగుపై తెల్ల రంగు అక్షరాలతో ఉంటాయి. ఇవి నగరాలు, ఎగ్జిత్, జంక్షన్లు & రూట్ నెంబర్‌లను చూపుతాయి. వేగంగా వెళ్లేవారు కూడా వీటిని వెంటనే గమనించగలరు. పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ఈ రంగు సైన్‌లను సులభంగా చదవాలనే ఉద్దేశ్యంతో ఐఆర్సీ ఈ రంగు సైన్‌లను నిర్దేశించింది.సేఫ్టీ & విజిబిలిటీఆకుపచ్చ బోర్డుపై తెల్లని అక్షరాలు ఉండటం వల్ల దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. పగలు మాత్రమే కాకుండా.. రాత్రి సమయంలో కూడా బోర్డులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ/తెలుపు కలయిక అనేది డ్రైవర్లు ముఖ్యమైన దిశాత్మక వివరాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆకస్మిక లేన్ మార్పులు లేదా చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి తగ్గిస్తుంది.రోడ్డు రకాల గుర్తింపుడ్రైవర్లు తాము ఎలాంటి రోడ్డుపై ఉన్నామనే విషయం తెలుసుకోవడంలో కలర్ కోడింగ్ పనికొస్తుంది. ఇవి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను మార్గాలను సూచిస్తాయి. అయితే పట్టణ లేదా నగర రోడ్లపై సంకేతాలు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు తాము ఏ వేగంతో ప్రయాణించాలో ముందుగానే అంచనా వేసుకోవచ్చు. దీనిద్వారా భద్రత & అవగాహన పెరుగుతుంది.ప్రశాంతతఇతర రంగులతో పోలిస్తే గ్రీన్ కలర్ ప్రశాంతతను ఇస్తుంది. అయితే హైవేపై ఉన్న కలర్ గురించి ట్రాఫిక్ కోడ్‌లలో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ ట్రాఫిక్ డిజైన్ రీసెర్చ్ ప్రకారం.. గ్రీన్ కలర్ తటస్థమైనది. కాబట్టి హైవేపై పసుపు, ఎరుపు రంగు కాకుండా గ్రీన్ కలర్ ఎంచుకున్నారు. డైవర్లు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు.. గ్రీన్ కలర్ చూస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.భారతీయ ప్రమాణాలుఆకుపచ్చ రంగు హైవే సంకేతాలు భారతీయ ప్రమాణాలను (IRC:67-2022) అనుసరిస్తాయి. రాష్ట్రాలు & ఎక్స్‌ప్రెస్‌వేలలో రూట్, దూర సమాచారం కోసం ఆకుపచ్చను స్థిరంగా ఉపయోగించడం ద్వారా, వివిధ ప్రాంతాలు లేదా నేపథ్యాల నుంచి వచ్చిన డ్రైవర్లు సహా, త్వరగా డీకోడ్ చేయగలరని & గందరగోళం లేకుండా సంకేతాలకు ప్రతిస్పందించగలరని ట్రాఫిక్ అధికారులు నిర్ధారిస్తారు.ఇదీ చదవండి: ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

Iran-Israel Conflict: Gold, Silver Prices Surge2
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.వెండి ధరలుబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు!

Demand for Green Buildings Over 720 Registered in Hyderabad3
హరిత భవనాలకు డిమాండ్.. హైదరాబాద్‌లో 720కి పైగా రిజిస్టర్‌!

నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారు హరిత భవనాలపై ఆసక్తి చూపుతున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యకరంగా ఉంచే ఈ భవనాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కాస్త ఖరీదైనా వీటివైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరోస్వచ్ఛమైన గాలి, వెలుతురుతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌర శక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్‌ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు.నిత్యావసరాలకు వినియోగించే నీటిని బయటకు పంపకుండా వాటిని రీసైకిల్‌ చేసి మొక్కలు, బాత్‌రూమ్‌ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది.అదనపు వ్యయం రెండేళ్లలో వాపస్‌..ఈ భవనాల్లో నిత్యం నీరు, విద్యుత్‌ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్‌ మెటీ రియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్‌ బిల్డింగ్స్‌ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్‌ వరకు గ్రీన్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.

Rising Dollar Value Boosts NRI Investment in Indian Real Estate4
పెరిగిన డాలర్ విలువ.. అపార్ట్‌మెంట్స్ కొంటున్న ఎన్‌ఆర్‌ఐలు!

ఏడాది క్రితం ఒక డాలర్‌కు రూ.85 వచ్చేవి.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.92 వచ్చే పరిస్థితి.. అంటే ఏడాదిలో 4.29 శాతం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి ప్రవాసులు ఇక్కడ పెట్టుబడి కోసం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాకపోతే అనుకున్న వెంటనే పెట్టుబడి పెట్టగలిగేది, దీర్ఘకాలంలో లాభాలిచ్చేది స్థిరాస్తి రంగమే కావటంతో ఇటువైపు చూస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ), బెంగళూరు, హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రవాసులకు టైమొచ్చింది.. పెట్టుబడి అనగానే ఎన్‌ఆర్‌ఐ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌)లకు ముందుగా గుర్తొచ్చేది మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లే.. ఆ తర్వాతే స్థిరాస్తి, బంగారం వంటివి. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయన్నది కాదనలేని వాస్తవం. దీంతో రియల్టీ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. డాలర్‌ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణంగా ఎన్‌ఆర్‌ఐలు భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు.రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..భారత స్థిరాస్తి రంగం బూమ్‌లో ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ) వ్యక్తులు భాగస్వాములే.. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, కెనడా, ఆ్రస్టేలియా, పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ప్రవాసుల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎన్‌ఆర్‌ఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.ఎన్‌ఆర్‌ఐలు కొనాలంటే..ఎన్‌ఆర్‌ఐల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్‌ఈఎంఏ) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి(పీఐఓ) దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే కొనుగోళ్లలో పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్‌ ప్రాపర్టీలను మాత్రం కొనుగోలు చేసే వీలు లేదు. వీటి కొనుగోళ్లకు ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. బహుమతి లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ప్రాపర్టీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల ద్వారా కొనుగోళ్లు భారత రూపాయిలలో జరుగుతాయి. ప్రవాసులు కొనుగోలు చేసే ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను మినహాయింపు(టీడీఎస్‌) 12.5 శాతం, స్వల్పకాలిక మూధన లాభాలు 30 శాతం మినహాయింపు ఉంటుంది.విక్రయించాలనుకుంటే..ఫెమా నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ సొంత ఆస్తి, వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని దేనినైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్‌ఆర్‌ఐకి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్‌ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకుంటే మాత్రం కేవలం స్థానికులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతర ఎన్‌ఆర్‌ఐ లేదా భారత సంతతికి గానీ గిఫ్ట్‌గా అందించవచ్చు. అలాగే ప్రవాసులకు అద్దె ఆదాయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.హైదరాబాద్‌లో ప్రవాసుల పెట్టుబడులు..అమెరికా, ఆ్రస్టేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్‌లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకే ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.కొనేముందే పరిశీలించాలియాజమాన్య హక్కులు, పత్రాలు, టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి.స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాలి. నీరు, విద్యుత్‌ వంటి బిల్లులు చెల్లించారో లేదో పూర్తిగా పరిశీలించాలి.కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్‌ టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీలను తీసుకున్నారా లేదా గమనించాలి.నిర్మాణంలో ఉంటే.. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీఓఏ)ను ఇవ్వాల్సిందిగా డెవలపర్‌ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్‌ చేసుకోవడం మంచిది. సులభతరం కూడా.. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్‌కు గానీ మార్ట్‌గేజ్‌కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని డిస్పోజల్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాదీనం, అగ్రిమెంట్‌ వంటి విషయంలో పీఓపీ ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.

Zoho Foundar Sridhar Vembu Says AI Cannot Replace These Jobs5
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026

Iran–Israel War Exposed Secret Strikes to Open Battlefield Why US Involved6
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి?

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతున్న షాడో వార్‌ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధశత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో చూద్దాం.శత్రుత్వానికి పునాదులురెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. ఇరాన్‌లో రాజు మహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాధినేత పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. షా తన రహస్య పోలీసు దళంతో తనపై వ్యతిరేక స్వరాలను అణచివేసేవారు. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరిగింది. దేశంలో చమురు సంపద పెరిగినప్పటికీ, అది సామాన్య ప్రజలకు చేరడం లేదని, కేవలం సంపన్నులకే లాభం చేకూరుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్‌ను అమెరికా తొలగించి షాను గద్దెనెక్కించడంపై ఇరానియన్లలో తీవ్ర వ్యతిరేకత ఉండేది.అప్పటి విప్లవం ఎలా జరిగింది?ఈ విప్లవంలో ప్రధాన నాయకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ.. షా విధానాలను విమర్శించినందుకు ఆయనను 1964లో దేశం నుంచి బహిష్కరించారు. తాను ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పంపేవారు. 1978లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. సైన్యం ప్రజలపై కాల్పులు జరిపినా ఉద్యమం ఆగలేదు. పరిస్థితి చేజారిపోవడంతో 1979 జనవరిలో షా పహ్లవీ దేశం విడిచి పారిపోయారు. 1979 ఫిబ్రవరిలో ఖొమేనీ ఇరాన్ చేరుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన రెఫరెండం ద్వారా ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది.విప్లవం తర్వాత ఏం జరిగింది?దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ (మత పెద్ద) చేతిలోనే తుది నిర్ణయ అధికారం ఉండేలా రాజ్యాంగం మారింది. 1979 నవంబర్‌లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖొమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్‌ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్ (గాజా), హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్) వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలున్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది.అణు బాంబు భయంఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.అమెరికా ఎందుకు మధ్యలోకి వచ్చింది?పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే, అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి.చమురు సంక్షోభంఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం.ప్రాంతీయ ఆధిపత్యంఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది.అణ్వాయుధ నియంత్రణఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు

Advertisement
Advertisement
Advertisement