Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KPMG India Pre-Budget Survey 2026-27 highlights1
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు

కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్‌హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణతయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.కొత్త ఐటీ చట్టం - సరళీకరణకొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..టీడీఎస్‌/టీసీఎస్‌ నిబంధనల అమలులో సరళత.క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్‌మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.స్టాండర్డ్ డిడక్షన్మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.జీఎస్టీ, ఇతర సంస్కరణలుజీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్‌మ్యాచ్‌లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.ప్రస్తుత డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

BASF will open Global Digital Hub in Hyderabad in the first quarter 20262
హైదరాబాద్‌లోకి మరో అంతర్జాతీయ కంపెనీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్‌ఎఫ్‌ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్‌వర్క్‌లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్‌హాఫెన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న బీఏఎస్‌ఎఫ్‌ డిజిటల్ హబ్‌ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్‌కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్‌లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్‌ప్లేస్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

Quick practical guide to check manufacturing date of car tyres3
కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!

సాధారణంగా వాహనదారులు టైర్లలో గాలి ఉందా? త్రెడ్ (గ్రిప్) కనిపిస్తోందా? అని మాత్రమే చూస్తుంటారు. కానీ, టైరు బయటకు కొత్తగా కనిపిస్తున్నా, దాని లోపల రబ్బరు నాణ్యత కోల్పోయి, పేలవంగా ఉండవచ్చని మీకు తెలుసా? వాహన భద్రతలో టైర్ తయారీ తేదీ (Manufacturing Date) అత్యంత కీలకమైన అంశమని అంతర్జాతీయ రవాణా భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.ఎప్పుడు తయారైందో తెలుసుకోవడం ముఖ్యమా?టైర్లు కేవలం రబ్బరుతో తయారు చేసిన వస్తువులు మాత్రమే కాదు; అవి రసాయనాలు, ఆయిల్స్‌, కొన్ని రకాల పాలిమర్ల మిశ్రమం. కాలక్రమేణా టైరు వాడినా వాడకపోయినా గాలిలోని ఆక్సిజన్, వేడి కారణంగా ఆ రబ్బరు గట్టిపడి ‘ఆక్సిడైజేషన్’ ప్రక్రియకు లోనవుతుంది. దీనివల్ల టైరు తన పట్టును (Grip) కోల్పోవడమే కాకుండా ప్రయాణంలో ఒక్కసారిగా పేలిపోయే (Blowout) ప్రమాదం ఉంది.నిపుణుల హెచ్చరికటైర్ త్రెడ్ బాగున్నా సరే తయారీ తేదీ నుంచి 6 ఏళ్లు దాటితే ఆ టైరును మార్చడం సురక్షితం. ఒకవేళ టైరును అసలు వాడకుండా స్పేర్ వీల్‌గా ఉంచితే 10 ఏళ్ల తర్వాత దాన్ని కచ్చితంగా తొలగించాలి.ఎప్పుడు తయారైందో ఎలా తెలుసుకోవాలి?ప్రతి టైరు సైడ్‌వాల్‌పై DOT (Department of Transportation) కోడ్ ఉంటుంది. ఇది టైరు తయారీ అంశాలను తెలియజేస్తుంది. ఈ కోడ్ చివర ఉండే నాలుగు అంకెలు అత్యంత ముఖ్యం. అందులో మొదటి రెండు అంకెలు తయారీ వారం (01 నుంచి 52 వరకు)ను తెలియజేస్తాయి. చివరి రెండు అంకెలు తయారీ సంవత్సరం తెలుపుతాయి.ఉదాహరణకు:మీ టైరుపై డాట్‌ కోడ్‌లో చివరి అంకెలు ‘2419’ అని ఉంటే, అది 2019వ సంవత్సరం 24వ వారంలో తయారైందని అర్థం. ప్రస్తుతం 2026 నడుస్తోంది కాబట్టి, ఈ టైరుకు ఇప్పటికే 6 ఏళ్లు దాటిపోయాయి. దీన్ని వాడటం రిస్క్‌తో కూడుకుంది.పాత టైర్లలో సహజంగా కనిపించేవి..సైడ్‌వాల్‌పై చిన్న పగుళ్లు రావడం.నల్లగా ఉండాల్సిన టైరు బూడిద రంగులోకి మారడం.టైరు అక్కడక్కడ ఉబ్బినట్లు కనిపించడం.రబ్బరు పీచులుగా ఊడిపోవడం.టైర్ లైఫ్‌టైమ్‌ పెరగాలంటే..కనీసం నెలకోసారి తయారీదారు సూచించిన పీఎస్‌ఐ (Pounds per Square Inch) ప్రకారం గాలిని తనిఖీ చేయండి.ప్రతి 5,000 - 8,000 కి.మీలకు ఒకసారి టైర్ల స్థానాలను మార్చండి (Rotation).వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోతే టైర్లు ఒకవైపు మాత్రమే అరిగిపోయి త్వరగా పాడవుతాయి.ఎండలో ఎక్కువసేపు వాహనాన్ని ఉంచడం వల్ల రబ్బరు త్వరగా దెబ్బతింటుంది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు

GST Treatment of Educational Consultancy Services supreme court4
ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలకు ఊరట

విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలు అందించే ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు అందించే కన్సల్టెన్సీ సేవలను ‘సేవల ఎగుమతి’(Export of Services) గానే పరిగణించాలని, వాటికి జీఎస్టీ రీఫండ్‌ పొందే హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో జీఎస్టీ చట్టంలోని ‘ఇంటర్మీడియరీ’ (మధ్యవర్తిత్వ) సేవలపై చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు తెరపడింది.హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టుజస్టిస్‌ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. గ్లోబల్‌ అపర్చునిటీస్‌ అనే ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ సంస్థకు జీఎస్టీ రీఫండ్‌ మంజూరు చేయాలని గత ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.కోర్టు తీర్పులో అంశాలు..‘విదేశీ వర్సిటీలకు అందించే సేవలు స్వతంత్రమైనవి. వీటిని కేవలం మధ్యవర్తిత్వ సేవలుగా చూడలేం. విద్యార్థులు భారత్‌లో ఉన్నారనో లేదా పారితోషికం విదేశీ కరెన్సీలో వస్తుందనే కారణాలతో ఈ సేవలను 'ఇంటర్మీడియరీ సేవలు'గా పరిగణించడం సాధ్యం కాదు. విద్యార్థులు వర్సిటీల్లో చేరిన తర్వాతే కమిషన్ అందవచ్చు, కానీ అది సంస్థ అందించే సేవల ఎగుమతి స్వభావాన్ని మార్చదు’ అని న్యాయస్థానం పేర్కొంది.ఐజీఎస్‌టీ చట్టంపై స్పష్టతఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చట్టంలోని సెక్షన్‌ 2(13) ప్రకారం 'ఇంటర్మీడియరీ' నిర్వచనాన్ని ఈ కేసులో లోతుగా విశ్లేషించారు. సదరు కన్సల్టెన్సీ కేవలం విద్యార్థులకు, వర్సిటీలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించడం లేదని, అది ఒక స్వతంత్ర సేవగా పరిగణించబడుతుందని దిల్లీ హైకోర్టు ఇదివరకే తేల్చింది. ప్రభుత్వం దీన్ని ఏజెంట్ సేవగా అభివర్ణించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీలకే పరిమితం కాకుండా విదేశాలకు సేవలు ఎగుమతి చేసే ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. కొన్ని సంస్థలకు నిలిచిపోయిన కోట్లాది రూపాయల జీఎస్టీ రీఫండ్‌లు విడుదల కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు

Adani-Embraer signed MoU to set up aircraft assembly facility5
అదానీ గ్రూప్‌-ఎంబ్రేయర్ మధ్య ఒప్పందం

భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer SA) మధ్య కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో ప్రాంతీయ వాణిజ్య విమానాల (Regional Transport Aircraft) తయారీ, అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.సాధారణంగా ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ నుంచి విమాన విడిభాగాలను మాత్రమే సేకరిస్తుంటాయి. కానీ, పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేసేందుకు అవి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో అదానీ-ఎంబ్రేయర్ భాగస్వామ్యం భారత విమానయాన రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపనుంది.ఒప్పందంలోని ప్రధానాంశాలుఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే ఎంబ్రేయర్ విమానాల అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. విమానాల విక్రయాలకు సంబంధించి తగినంత స్థాయిలో ఆర్డర్లు లభించిన వెంటనే అసెంబ్లీ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (Technology Transfer), శిక్షణ, పటిష్టమైన సప్లై చైన్ వ్యవస్థ ఏర్పడుతుంది.ప్రభుత్వ మద్దతుభారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘ఆత్మనిర్భర్ భారత్’, దేశంలోని చిన్న పట్టణాలను విమాన మార్గాలతో అనుసంధానించే ‘ఉడాన్’ (UDAN) పథకాలకు ఈ ఒప్పందం ఊతం ఇస్తుంది. దీనివల్ల భారత్‌-బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి వివరాలు, ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. పనుల ప్రారంభ గడువు (Timeline) వంటి అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం విజయవంతం అయితే భారత్ కేవలం విమానాల వినియోగదారు దేశంగానే కాకుండా ప్రపంచ స్థాయి విమానాల తయారీ కేంద్రంగా కూడా అవతరిస్తుంది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు

agriculture sector pressing for a major boost in farm R and D Budget 20266
వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు

దేశవ్యాప్తంగా 2026-27 కేంద్ర బడ్జెట్ కోసం సన్నాహాలు జరుగుతున్న వేళ అన్నదాత గళం మరోసారి బలంగా వినిపిస్తోంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, అనిశ్చిత వాతావరణం, మందగిస్తున్న ఉత్పాదకత వంటి సవాళ్ల నడుమ.. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) రంగానికి భారీగా నిధులు కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.పరిశోధన రంగానికి నిధుల కరువుభారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధనా వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గణాంకాలను పరిశీలిస్తే 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (DARE)కి రూ.10,466 కోట్లు కేటాయించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే నామమాత్రపు పెరుగుదలే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌ (ICAR) బడ్జెట్‌లో సుమారు 85 శాతం నిధులు కేవలం శాస్త్రవేత్తల జీతాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. వాస్తవ పరిశోధనలకు మిగిలేది అత్యల్ప వాటా మాత్రమే. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమ వ్యవసాయ జీడీపీలో 2% నుంచి 4% వరకు పరిశోధనలపై ఖర్చు చేస్తుంటే భారత్ కేవలం 0.3% నుంచి 0.7%** మధ్యనే ఉండటం గమనార్హం.క్షేత్రస్థాయిలో వాస్తవాలువిత్తనాలు, ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండగా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే సాంకేతికత కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 50 శాతం సాగు వర్షాధారంగానే సాగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కరువులు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. వీటిని తట్టుకునే ‘క్లైమేట్ రెసిలెంట్’ (వాతావరణ నిరోధక) వంగడాల సృష్టికి నిధుల కొరత అడ్డంకిగా మారింది.బడ్జెట్‌పై ఆశలుప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి కట్టుబడి ఉండాలంటే ఈసారి బడ్జెట్‌లో విప్లవాత్మక మార్పులు అవసరం. ప్రధానంగా చేయాల్సినవి..1. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పరిశోధనల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు.2. కీలకమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ‘జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు.3. పరిశోధనలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పొలాల వరకు చేరేలా విస్తరణ సేవల బలోపేతం.ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలంటే వ్యవసాయ శాస్త్రంలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం. బడ్జెట్ 2026 ద్వారా ప్రభుత్వం పరిశోధన రంగానికి పెద్దపీట వేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తుందని ఆశిద్దాం.ఇదీ చదవండి: వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం

Advertisement
Advertisement
Advertisement