ప్రధాన వార్తలు
నిస్సాన్ ఎంపీవీ గ్రావైట్
ఉదయ్పూర్: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తమ సెవెన్ సీటర్ ఎంపీవీ గ్రావైట్ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.49 లక్షల వరకు (ఎక్స్–షోరూం) ఉంటుంది. ప్రస్తుతం మ్యాగ్నైట్ పేరిట భారత్లో ఒకే ఉత్పత్తిని విక్రయిస్తున్న నిస్సాన్కి ఇది రెండో మోడల్. ఈ ఏడాది టెక్టాన్ ఎస్యూవీతో పాటు విశాలమైన సెవెన్ సీటర్ సీ సెగ్మెంట్ ఎస్యూవీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. మొత్తం మీద ఏడాది వ్యవధిలో మూడు వాహనాలను తీసుకొచి్చనట్లవుతుందని వివరించారు. రూ. 6 లక్షల నుంచి దాదాపు రూ. 20 లక్షల వరకు ధర శ్రేణిలో వాహనాలతో పోర్ట్ఫోలియోను పటిష్టం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం 160 డీలర్íÙప్లు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటి సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు వత్స వివరించారు. అలాగే, ఎగుమతులపైనా దృష్టి పెడుతున్నామని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల ఎక్స్పోర్ట్స్ మార్కును అధిగమిస్తామని ఆయన చెప్పారు.
ఫ్రెషర్స్కు పండగే!
ముంబై: ఈ ఏడాది ఫ్రెషర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు రానున్నాయి. 73 % సంస్థలు జనవరి–జూన్ మధ్య కాలంలో ఫ్రెషర్లను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ కెరీర్ అవుట్లుక్ సర్వేలో తెలిపాయి. విద్యార్హతలు ఒక్కటే కాకుండా.. అప్ప టికే ఏవైనా ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం, ఇంటర్న్íÙప్ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని సర్వేలో రిక్రూటర్లు చెప్పారు. 2025 నవంబర్ నుంచి 2026 జనవరి మధ్య వివిధ రంగాల్లోని 1,051 సంస్థల రిక్రూటర్లను సర్వే చేసి టీమ్లీజ్ ఎడ్టెక్ ఈ ఏడాది ప్రథమార్ధం లో నియామకాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రంగాల్లో జోరు: రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు, తయారీలో ఈ ఏడాది ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలు రానున్నాయి. రిటైల్ రంగంలో 91% సంస్థలు ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశంతో ఉన్నాయి. ఆ తర్వాత ఈ–కామర్స్ రంగంలో, టెక్నాలజీ స్టార్టప్ సంస్థలో 90 %, తయారీ కంపెనీల్లో 85% ఫ్రెషర్లను తీసుకోనున్నాయి. డార్క్ స్టోర్ అసిస్టెంట్ (క్విక్ కామర్స్), ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అసిస్టెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు డిజిటల్ సేల్స్ అసోసియేట్, జూనియర్ వెబ్ డెవలపర్లను నియ మించుకోవాలని అనుకుంటున్నాయి. తయారీలో ఇన్వెంటరీ, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, బ్యాటరీ అసెంబ్లీ టెక్నీషియన్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకం విషయమై కంపెనీలు నమ్మకంగా ఉన్నాయని, కొన్ని రంగాల్లో నియామకాల ఉద్దేశం 2025 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఉన్న 41% నుంచి, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి 91 శాతానికి పెరిగినట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. రవాణా రంగంలో నియామక ఉద్దేశ్యం 77 శాతానికి చేరిందని, విద్యుత్, ఇంధన రంగంలోనూ 22 % నుంచి 72 శాతానికి చేరినట్టు చెప్పారు. బెంగళూరు టాప్: ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టుల అనుభవం ఉన్న వారు వేగంగా ఉపాధి అవకాశాలను పొందగలరని రూజ్ తెలిపారు. కేవలం డిగ్రీ అర్హతే కలిగిన వారు అవకాశం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చన్నారు. అధ్యయనమే దీనికి పరిష్కారమని సూచించారు. ఫ్రెషర్లకు అత్యధికంగా బెంగళూరులో (84 శాతం ) అవకాశాలు రానున్నాయి. టెక్నాలజీ, స్టార్టప్లకు బెంగళూరు కేంద్రంగా ఉండడం తెలిసిందే. ఇక్కడ ఐటీలో 81 శాతం, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో 90 శాతం, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా కంపెనీల్లో 61 శాతం ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నాయి.
కార్పొరేట్ల గ్రీన్గేమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, సానుకూల ప్రభావం చూపుతున్న 50 దేశీ కంపెనీల్లో హిందుస్తాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో నిలి్చంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిల్చాయి. పర్పెచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా 50 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్ కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎస్డీజీ లక్ష్యాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా 150 కంపెనీలను వడబోసి ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కంపెనీలు ఈ లక్ష్యాలను నివేదికలకు పరిమితం చేయకుండా, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మార్చుకుంటున్నాయని వివరించారు. వినియోగ, వాణిజ్య, సామాజిక రంగాలపై అర్థవంతమైన ప్రభావం చూపే సంస్థలకు తాము తోడ్పాటు అందిస్తున్నామని పర్పెచ్యువల్ క్యాపిటల్ పార్ట్నర్స్ ప్రణవ్ ప్రశాంత్, అన్విత ప్రశాంత్ వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → ఎస్డీజీ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తున్న కంపెనీల సంఖ్యకు సంబంధించి 26 సంస్థలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణే, అహ్మదాబాద్ తదుపరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ళీ మెటల్స్, మైనింగ్ రంగం నుంచి అత్యధికంగా 7 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఎనర్జీ, కన్జూమర్ గూడ్స్ రంగాల నుంచి తలో మూడు కంపెనీలు ఉన్నాయి. → హిందుస్తాన్ యూనిలీవర్ 97 శాతం పునరుత్పాదక విద్యుత్ని వినియోగిస్తోంది. ళీ పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇప్పటికే తటస్థ ఉద్గార స్థాయిని సాధించగా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ తదితర అయిదు దిగ్గజ కంపెనీలు ఇందుకోసం 2030ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. → కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలపై జాబితాలోని కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయగా, 20 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. పర్యావరణ పరిరక్షణపరమైన చర్యలకు కంపెనీలు (48 సంస్థలు) అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. → లిస్టులోని 50 కంపెనీల మొత్తం ఆదాయం రూ. 48.5 లక్షల కోట్లుగా, లాభం రూ. 4.95 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.
నిస్సాన్ గ్రావైట్.. మరో కొత్త 7-సీటర్ కారు వచ్చేసింది..
నిస్సాన్ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్.. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్కు ప్రత్యేకతను ఇస్తాయి.అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్ ఈ గ్రావైట్ను కీలక మోడల్గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలునిస్సాన్ గ్రావైట్ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలుఅసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలుఎన్-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలుఎన్-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలుటెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలుటెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఎంటీ – రూ. 8.35 లక్షలుటెక్నా లాంచ్ ఎడిషన్ ఏఎంటీ – రూ. 8.93 లక్షలుగ్రావైట్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎక్స్టీరియర్డిజైన్ పరంగా నిస్సాన్ గ్రావైట్.. రెనాల్ట్ ట్రైబర్ ప్రాథమిక సిల్హౌట్ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ క్రోమ్ స్ట్రిప్తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్లో రెనాల్ట్ ట్రైబర్ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్తో కలిపి అమర్చారు. బంపర్పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్ మోడల్ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్ను అందిస్తున్నాయి.ఫీచర్లు, సేఫ్టీగ్రావైట్లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్స్క్రీన్ (వైర్లెస్ యాపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్.ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్ ఉన్నాయి.ఇంజిన్, పనితీరుగ్రావైట్లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)పోటీ మోడళ్లునిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెనాల్ట్ ట్రైబర్తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్ఎల్6, కియా కారెన్స్, కియా కారెన్స్ క్లావిస్ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్ ఎంత?
చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.బుధవారం ట్రేడింగ్లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.బంగారం, వెండి ధరలపై ప్రభావంచైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్ అమీర్ మక్డా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్లైన్లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్లో జాగ్రత్త అవసరమని సూచించారు.షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్బ్యాక్లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
లోకల్తో పోటీకి బ్రిటానియా రెడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్ తదితర పాపులర్ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.
కార్పొరేట్
కార్పొరేట్ల గ్రీన్గేమ్
30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు
లోకల్తో పోటీకి బ్రిటానియా రెడీ
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో హెచ్యూఎల్ టాప్
ఉద్యోగాలకు చలిగాలి
నభా పవర్ కొత్త ఓనర్.. టొరెంట్పవర్
వెండి రూ. 5,000 డౌన్
కోడ్ నుంచి క్లౌడ్ వరకు.. ఆంత్రోపిక్తో ఇన్ఫోసిస్ జట్టు
నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్
బ్యాంకుల్లో మిస్ సెల్లింగ్కు ముగింపు!
ఆదుకున్న బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్ గూడ...
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ...
ఐదు కంపెనీల లిస్టింగ్ బాట
రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట...
ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచ...
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జ...
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ....
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణిక...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
ఒప్పో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
కే14ఎక్స్ 5జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు స్మార్ట్ఫోన్ల దిగ్గజం ఒప్పో ఇండియా తెలిపంది. దీని ధర వేరియంట్ని బట్టి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా తమ ఈ–స్టోర్, ఫ్లిప్కార్ట్పై సేల్ రోజున రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంటుతో రూ.13,499 నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెండు వేరియంట్లపై రూ. 1,000 డిస్కౌంటు ఉంటుందని పేర్కొంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50 ఎంపీ ఏఐ కెమెరా, కలర్ఓఎస్ 15 మొదలైన ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ
జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!
ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్లోనే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.బెంగళూరుకు చెందిన గౌరవ్ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.తాజా అప్డేట్లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్ఫారమ్ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్ అగర్వాల్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, మెటా ఛీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, టీసీఎస్ సీఈవో కృతివాసన్ తదితరులు ఉన్నారు.Unsurprisingly, I am at the AI Summit this entire week with folks from my team and colleagues. Come visit us - we are all excited to share a glimpse of what all is cooking in our kitchen!Divided by companies, United by Mission - Let's build AI for Bharat 🙏 pic.twitter.com/eg7QDCDEVZ— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
పర్సనల్ ఫైనాన్స్
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..!
ఉఫ్.. బిగ్ రిలీఫ్!
రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఉండేది హైదరాబాద్లో. ఎఫ్డీని రెన్యువల్ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చెయ్యకుండా... ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్ లింక్డ్ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.ఇక వెంకటాచలం అయ్యర్ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగేసరికి సైలెంటుగా రిఫండ్ చేసేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్ స్టోరీ..బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్ సెల్లింగ్ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్–సెల్ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.మిస్–సెల్లింగ్ ఇదీ...రిజర్వ్ బ్యాంక్ తొలిసారిగా మిస్–సెల్లింగ్కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...కస్టమర్ ప్రొఫైల్కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటంపూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడంబండిల్గా ప్రోడక్టులను అంటగట్టడంకస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడంఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్–సెల్లింగ్ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్ క్లిక్లు అనే లూప్హోల్ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.బలవంతంగా బండిల్ చేయొద్దు..రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్ పార్టీ ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్ చేసుకోవడానికి ఉండదు. కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్ చెక్బాక్స్ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్ తీసుకోవాల్సిందే. డిజిటల్ ‘డార్క్ ప్యాటర్న్స్’ కట్టడిబ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్ ప్యాటర్న్స్’లాంటి డిజిటల్ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏమిటంటే..ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం ముందే యాడ్–ఆన్స్ని సెలెక్ట్ చేసేసి ఉంచడంప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లలాంటివి అంటగట్టడంపేమెంట్ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడంఅన్సబ్స్క్రయిబ్ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటంఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్ ఇంటర్ఫేస్లను తరచుగా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్–ఆధారిత బ్యాంకింగ్లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది. టార్గెట్లే మిస్–సెల్లింగ్కి మూలం..అసలు మిస్–సెల్లింగ్కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...సేల్స్ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడంస్పెషల్ ‘టార్గెట్ డేస్’ని నిర్దేశించడంఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలుథర్డ్ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్షిప్ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి. టెలీమార్కెటింగ్ కష్టాలకు చెక్కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్కి అనుమతి ఉంటుందిడీఎన్డీ కింద రిజిస్టర్ చేసుకుంటే అసలు కాల్ చేయడానికే ఉండదుఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదుప్రమోషనల్ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్సబ్స్క్రైబింగ్ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
మీ లాకర్ ఎంత భద్రం?
బ్యాంకు లాకర్లో పెట్టేదే భద్రంగా ఉంటాయని. మరి అక్కడే చోరీ జరిగితే? తమకు సంబంధం లేదని బ్యాంకులు తప్పించుకోజూస్తే? పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే జరిగింది. 2016లో ఈ బ్యాంకు లాకర్లో ఓ కస్టమర్ ఉంచిన విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. రాష్ట్ర వినియోగ వివాదాల పరిష్కార కమిషన్ రూ.59 లక్షల పరిహారానికి ఆదేశించింది. బ్యాంకు జాతీయ కమిషన్కు అప్పీల్ చేసింది. తాజాగా జాతీయ కమిషన్ తీర్పునిస్తూ... లాకర్ భద్రతలో వైఫల్యం ఉన్నప్పుడు బ్యాంక్ తప్పించుకోలేదని స్పష్టంచేసింది. నష్ట పరిహారాన్ని రూ.5 లక్షలకు తగ్గించింది. మరి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అదే ఈ ‘వెల్త్’ స్టోరీ...రెండేళ్లలో బంగారం ధర 150 శాతానికి పైనే పెరిగింది. వెండి ధర ఐదు రెట్లు ఎగిసింది. మరి ఇంతటి విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉంచటం సేఫేనా? పోనీ బ్యాంకు లాకర్లో పెడితే భద్రతకు గ్యారంటీ ఉంటుందా? వాస్తవానికి ఇల్లయినా, బ్యాంకయినా పటిష్ట రక్షణ చర్యలతోనే అక్కడ పెట్టిన వస్తువులకు భద్రత. ఒకవేళ లాకర్లో విలువైన వస్తువులను కోల్పోతే పరిస్థితేంటి? అందుకు బ్యాంక్లు పూర్తి బాధ్యత తీసుకోవా? సేఫ్ట్ లాకర్ విషయంలో కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా? అసలు లాకర్ ఎవరికి అవసరం? ఒకసారి చూద్దాం...లాకర్ చార్జీలు ఎంతంటే..→ ప్రాంతం, బ్యాంక్, లాకర్ పరిమాణం ఆధారంగా చార్జీలుంటాయి → సాధారణంగా చిన్న లాకర్కు వార్షిక చార్జీ రూ.1,000–3,000 → మధ్యస్థ లాకర్కు రూ.3– 6వేలు... పెద్ద లాకర్కు రూ.6 –12 వేలు → ఈ చార్జీపై జీఎస్టీని ... ఒప్పందానికి సంబంధించి స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. → లాకర్ కోసం బ్యాంక్లు డిపాజిట్లు అడుగుతాయి. లాకర్ను క్లోజ్ చేసినప్పుడు వీటిని తిరిగి పొందొచ్చు. → వార్షిక చార్జీలు బకాయి పడి, కస్టమర్ స్పందించని సందర్భాల్లో లాకర్ బ్రేకింగ్కు అయ్యే చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తాయి.బ్యాంకులపై బాధ్యత లేదా..?→ లాకర్ల నిర్వహణకు సంబంధించి బ్యాంకులపై బాధ్యత ఎంత వరకు అన్నది కస్టమర్తో కుదుర్చుకునే ఒప్పంద పత్రాల్లో వివరంగా ఉంటుంది. → నిర్లక్ష్యం లేదా భద్రత వైఫల్యం కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అందుకు బ్యాంకులదే బాధ్యత. → చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం కారణంగా నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించాల్సిందే. → ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల కారణంగా లాకర్లలో వాటికి నష్టం కలిగితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. కానీ, బ్యాంక్ తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ సమయాల్లో నష్టం ఏర్పడితే అప్పుడు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. → లాకర్లోని వాటికి నష్టం జరిగినప్పటికీ.. బ్యాంకుల బాధ్యత పరిమితంగానే ఉంటుంది. లాకర్ వార్షిక అద్దె చార్జీలకు గరిష్టంగా 100 రెట్ల వరకే అవి చెల్లిస్తాయి. ఉదాహరణకు లాకర్లోని రూ.20 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండాపోయాయనుకోండి. లాకర్ చార్జీ రూ.6,000 ఉంటే, అప్పుడు గరిష్టంగా రూ.6 లక్షల మొత్తాన్ని బ్యాంక్ చెల్లిస్తుంది. → వరుసగా మూడేళ్ల పాటు వార్షిక చార్జీలు చెల్లించకపోతే లేదా ఏడేళ్లపాటు లాకర్ను తెరవకపోతే నోటీసు జారీ చేసి.. మూడు నెలల తర్వాత లాకర్లను బ్యాంక్లు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందన రానప్పుడు.. పేపర్ ప్రకటన ఇచ్చి, ఇద్దరు సాక్షుల సమక్షంలోనే ఈ పని చేయాలి. ఇన్సూరెన్స్తో రక్షణ → లాకర్లను సురక్షితంగా ఉంచేందుకు దాదాపు అన్ని బ్యాంక్లు గట్టి చర్యలు చేపడతాయి. అయినా, కొన్ని ఘటనల్లో కస్టమర్లకు నష్టం జరుగుతుంటుంది → కాబట్టి లాకర్లలో విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచే వారు వ్యక్తిగతంగా వాటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. → బ్యాంకుల మాదిరి లాకర్ చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం అన్న పరిమితి బీమాలో ఉండదు. → బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలకు సైతం బీమా రక్షణ పొందొచ్చు. → దోపిడీ, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా మోసం, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భూకంపాలు లేదా వరదలు కారణంగా లాకర్లోని వాటికి ఏర్పడే నష్టానికి బీమా పరిహారం పొందొచ్చు. → లాకర్లలో ఉంచిన కరెన్సీ నోట్లకు నష్టం వాటిల్లితే బీమా పరిహారం రాదు. → తుప్పు పట్టడం, చెద పురుగులు, వాతావరణంలో తేమ కారణంగా ఏర్పడే నష్టానికి కూడా బీమా పాలసీలో రక్షణ ఉండదు. ఇలాంటి లాకర్లుంటేనే భరోసా... → బ్యాంక్లు లాకర్లకు సంబంధించి సీసీటీవీ కెమెరా, అలారమ్ (హెచ్చరించే) సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాలి. → లాకర్లు సురక్షితంగా ఉండేలా భవన నిర్మాణం ఉండాలి. రాత్రిళ్లు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. → లాకర్ తెరిచిన ప్రతి సందర్భంలో ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ను పంపించాల్సి ఉంటుంది. → లాకర్కు సంబంధించి బ్యాంక్లకు ఉండే బాధ్యత ఎంత మేర? అనేది ఒప్పందంలో వివరంగా ఉండాలి. → నామినేషన్ సదుపాయం కలి్పంచాలి. ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, కాపీని కస్టమర్కు సైతం అందించాలి.వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు.. → కేవలం కొన్ని ఆభరణాలే ఉన్నా... వాటి విలువ తక్కువగా ఉన్నా.. → బ్యాంక్కు వెళ్లి లాకర్ నుంచి తీసుకొచ్చి, మళ్లీ లాకర్లో పెట్టడం వీలు పడని వారు.అసలు లాకర్లు ఎవరికి..? → అధిక విలువ కలిగిన ఆభరణాలున్నప్పుడు. ముఖ్యంగా వారసత్వంగా వచి్చన ఆభరణాలున్నవారికి అనుకూలం. → వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన డాక్యుమెంట్లు ఉన్నప్పుడు. → ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, పార్టనర్íÙప్ డీడ్లు ఉన్నవారు. → పటిష్టమైన రక్షణ చర్యలు లేని అద్దె ఇళ్లలో నివసించే వారు. → ఇళ్లల్లో కేవలం వృద్ధులే ఉండే వారికి బ్యాంకు లాకర్లు ఎంతో ఉపయోగకరం. లాకర్లో వేటికి చోటు..? → బంగారం, వజ్రాభరణాలు → ప్రాపర్టీ క్రయ, విక్రయ దస్తావేజులు → వీలునామాలు, చట్టబద్ధమైన పత్రాలు → బాండ్ సరి్టఫికెట్లు, అరుదైన కలెక్షన్లునమోదు చేస్తే నయం...→ లాకర్లో ఏవేవి ఉంచుతున్నారనే విషయాన్ని ఒక రికార్డులో రాసి ఉంచుకోవటం మంచిది. → ఆభరణాలు, వాటి బరువు, వస్తువుల వివరాలు రాయండి. వీటి కొనుగోలు బిల్లులు, ఫొటోలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. → లాకర్లో తీసి, పెడుతున్న ప్రతి సారీ వాటి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. → ఆభరణాలకు సంబంధించి విలువ నిర్ధారణ సరి్టఫికెట్లు దగ్గర ఉంచుకోవాలి. → లాకర్కు తప్పకుండా నామినేషన్ తీసుకోవాలి. అవసరమైనప్పుడు నామినీని అప్డేట్ చేసుకోవాలి. → ఏడాదిలో ఒకసారి అయినా లాకర్ను తెరిచి, మూయడం చేయాలి. → డాక్యుమెంట్లు తేమ కారణంగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కనుక దెబ్బతినని విధంగా ప్యాక్ చేసి పెట్టాలి.వీటిని ఉంచకండి.. → దేశ, విదేశీ కరెన్సీ నోట్లు → హానికారక మెటీరియల్స్ → పాడైపోయే వస్తువులు → ప్రమాదకరమైన వస్తువులు → ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామగ్రి → చట్టవిరుద్ధమైనవి కూడా..నష్టం జరిగితే... → లాకర్లో ఉంచినవి దెబ్బతిన్నట్టు గుర్తించినా లేదా కనిపించక పోయినా బ్యాంక్ మేనేజర్కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. → బ్యాంక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడి వెళ్లి ఫిర్యాదు చేయాలి. → కస్టమర్ నిర్లక్ష్యం లేని సందర్భాల్లో జరిగిన నష్టానికి బ్యాంక్లు పరిహారం చెల్లించాల్సిందే. → బ్యాంక్లు పరిహారానికి నిరాకరిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించొచ్చు. → అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను సంప్రదించాలి.
డబ్బుతోనే చెడగొడుతున్నారు.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
ప్రఖ్యాత ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనంతల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.1. క్యాష్ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.2. కాలేజ్ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.5. క్యాష్(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.ఆస్తి కరిగిపోతుంది..కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితిరాబర్ట్ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.THE 5-Cs: How to destroy a child’s life with money.I have met many parents who destroy their children’s lives with money….The parents give their child or children the 5-Cs1: CASH: they give their children money never expecting them to earn their money.2: COLLEGE:…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 12, 2026


