Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Anant Ambani First Asian to Receive Global Humanitarian Award1
అనంత్‌ అంబానీకి అరుదైన అవార్డ్‌

వ్యాపారవేత్త అనంత్‌ అంబానీ అరుదైన అవార్డు అందుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణలో అనూహ్య ప్రభావం చూపినందుకు అమెరికన్ హ్యూమేన్ సొసైటీ అంతర్జాతీయ విభాగమైన గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ.. అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా, అలాగే అతి పిన్న వయస్కుడిగా అంబానీ చరిత్ర సృష్టించారు.అంబానీ స్థాపించిన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం‘వంతారా’ విజ్ఞాన ఆధారిత సంరక్షణా కార్యక్రమాలు, పెద్ద స్థాయిలో రక్షణ–పునరావాస చర్యలు, అలాగే జాతి సంరక్షణలో కొత్త దారులు చూపినందుకు విశేషంగా ప్రశంసలు అందుకుంది. గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ అధ్యక్షురాలు, సీఈవో డాక్టర్ రాబిన్ గాంజర్ట్ మాట్లాడుతూ, “ప్రతి ప్రాణికి గౌరవం, ఆరోగ్యం, ఆశ ఇవ్వాలన్న అంకితభావాన్ని వంతారా ప్రతిబింబిస్తోంది. దీనికి దార్శనికుడు అనంత్ అంబానీ,” అని పేర్కొన్నారు. వంతారాను ఆమె “చికిత్స, పునరుజ్జీవనానికి నిలయంగా నిలిచిన విశిష్ట సంరక్షణ కేంద్రం”గా అభివర్ణించారు.ఈ గౌరవం అందుకున్న అనంత్ అంబానీ ‘సర్వభూతహిత’ భావాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి ప్రాణికి గౌరవం, శ్రద్ధ, భరోసా ఇవ్వడం మా ధర్మం. సంరక్షణ రేపటికి వాయిదా వేయదగినది కాదు” అని అన్నారు. గతంలో ఈ అవార్డును బెట్టి వైట్, షిర్లీ మెక్‌లేన్, జాన్ వేన్ వంటి ప్రముఖులు, అలాగే అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్. కెన్నెడీ, బిల్ క్లింటన్ అందుకున్నారు.కఠినమైన గ్లోబల్ హ్యూమేన్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వంతారా, జంతు ఆహారం, ప్రవర్తనా సంరక్షణ, వైద్య సేవలు, సహజ ప్రవర్తనకు అవకాశాలు వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు చూపింది. వంతారా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న జాతుల పునరుద్ధరణ, శాస్త్రీయ సంరక్షణ పరిశోధనలు, ప్రకృతి వాతావరణాల్లో జంతువుల పునర్నివాసంపై దృష్టి సారిస్తున్నాయి. View this post on Instagram A post shared by Reliance Foundation (@reliancefoundation)

Gold and Silver rates on 9th December 2025 in Telugu states2
బంగారం తియ్యగా.. వెండి చేదుగా..!!

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి తారుమారయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు (Today Gold Price) తగ్గాయి. అయితే మాత్రం ఇందుకు విరుద్ధంగా వెండి ధరలు మాత్రం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on December 9th 20253
Stock Market Updates: తీవ్ర నష్టాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 198 పాయింట్లు తగ్గి 25,761కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 620పాయింట్లు నష్టపోయి 84,482 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.06బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62.47 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.168 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.35 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.14 శాతం నష్టపోయింది.Today Nifty position 09-12-2025(time: 9:52 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ICICI Prudential AMC announced its IPO price band of Rs 2,061 to Rs 2,165 per share4
ఐసీఐసీఐ ఏఎంసీ @ రూ. 2,0612,165

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూకి రూ. 2,061–2,165 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 11న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్‌ సంస్థ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌(యూకే) 4.89 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 10,602 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ నెల 19న లిస్టింగ్‌కానున్న కంపెనీ విలువ రూ. 1.07 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రస్తుతం ఏఎంసీలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం భాగస్వామ్య కంపెనీ ప్రుడెన్షియల్‌ హోల్డింగ్స్‌ కలిగి ఉంది. కాగా.. ఇప్పటికే ఈ విభాగంలో నాలుగు సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ, శ్రీరామ్‌ ఏఎంసీ, నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దేశీయంగా లిస్టయ్యాయి. ఈ బాటలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఐదో కంపెనీగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో అడుగుపెట్టనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ గ్రూప్‌ నుంచి ఐదో లిస్టెడ్‌ కంపెనీగా నమోదుకానుంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ(జేవీ)లో భాగస్వామ్య సంస్థ వాటా విక్రయించినప్పటికీ తాము మెజారిటీ వాటాను కొనసాగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొన్న విషయం గమనార్హం!

Reliance Industries Limited once again tops Wizikey 2025 Newsmakers rankings5
మీడియా ప్రచారంలో రిలయన్స్‌ టాప్‌

న్యూఢిల్లీ: మీడియా ప్రచారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రారాజుగా నిలుస్తోంది. దేశీ మీడియాలో ఎక్కువగా కనిపించే లిస్టెడ్‌ కంపెనీగా విజికీ న్యూస్‌మేకర్‌ ఇండెక్స్‌లో వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నట్టు విజికీ న్యూస్‌మేకర్‌ ర్యాంకింగ్స్‌ 2025 ప్రకటించింది. సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్తల స్కోరు 2021లో 84.9గా ఉంటే, 2022లో 92.56, 2023లో 96.46, 2024లో 97.43, 2025లో 97.83కు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంటే మీడియా ప్రచారంలో రిలయన్స్‌ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నట్టు ఈ డేటా తెలియజేస్తోంది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, మీడియా అనలైటిక్స్‌ ద్వారా 4 లక్షలకు పైగా ప్రచురణల్లో బ్రాండ్‌కు ఉన్న ప్రచారం, గుర్తింపును విజికీ న్యూస్‌మేకర్‌ ర్యాంకింగ్స్‌ విశ్లేíÙస్తుంటుంది. ప్రభుత్వరంగ అగ్రగామి బ్యాంక్‌ ఎస్‌బీఐ 92.81 స్కోరుతో రెండో స్థానంలో ఉంటే, 88.41 స్కోరుతో హెచ్‌డీఎఫ్‌సీ మూడో స్థానంలో నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐటీసీ టాప్‌–10లో ఉన్నాయి. జొమాటో 11, స్విగ్గీ 12, వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) 13వ ర్యాంక్‌ దక్కించుకున్నాయి. బ్రాండ్‌ వారీ వార్తల పరిమాణం, ప్రముఖ వార్తల్లో వాటికి దక్కిన స్థానం, ఆయా ప్రచురణలకు ఉన్న విస్తరణ, రీడర్లు ఆధారంగా 0 నుంచి 100 వరకు స్కోర్‌ను విజికీ న్యూస్‌మేకర్స్‌ ర్యాంకింగ్స్‌ కేటాయించింది. నాలుగు లక్షలకు పైగా ప్రచురణల్లో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చాయి, ఏ బ్రాండ్‌కు తరచూ ప్రచారం లభిస్తోందన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది.

Public Sector Banks Write Off Rs 6. 15 Lakh Crore In Loans Over 5 Years6
రూ.6.15 లక్షల కోట్ల రుణాల మాఫీ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో రూ.6.15 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి దీనిపై లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్‌బీఐ డేటా ప్రకారం.. గత ఐదు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్‌ 30 వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,15,647 కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయి’’అని వెల్లడించారు. వసూలు కాని మొండి రుణాలను (ఎన్‌పీఏలు) బ్యాంక్‌లు నిబంధనల మేరకు మాఫీ చేస్తాయని వివరించారు. అయినప్పటికీ అలా మాఫీ చేసిన రుణాల వసూలుకు అవి చర్యలు కొనసాగిస్తాయని చెప్పారు. ఆదాయపన్ను చట్టం, 2025 కింద కొత్త పన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్‌) 2027–28 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫై చేయనున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా లోక్‌సభకు వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement