Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 17th December 2025 in Telugu states1
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా ఎగిశాయి. ఒక్క రోజు ఊరటనిచ్చి అమాంతం దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా పెరిగాయి. వెండి ధరలు అయితే రికార్డు స్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 17th 20252
Stock Market Updates: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమై స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు లాభంతో 25,895 వద్ద, సెన్సెక్స్‌(Sensex) 115 పాయింట్లు లాభపడి 84,795 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 17-12-2025(time:9:37 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

SBI YONO New version launched3
ఎస్‌బీఐ యోనో కొత్త వెర్షన్‌.. 20 కోట్లు టార్గెట్‌!

ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్‌)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్‌బీఐ 2.0 మెరుగైన వెర్షన్‌ అని, కస్టమర్లకు మెరుగైన సేవల అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఎస్‌బీఐకి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై పూర్తి స్థాయి సదుపాయాలను వచ్చే 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.‘‘డిజిటలైజేషన్‌కు యోనో 2.0 మూలస్తంభంగా ఉంటుంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌కు ఉమ్మడి కోడ్‌ ఉంటుంది. దీంతో వివిధ ఛానళ్ల మధ్య అనుసంధానత సాఫీగా సాగుతుంది. దీని కారణంగా కొత్త ఉత్పత్తులను, సేవలను ఎస్‌బీఐ వేగంగా కస్టమర్లకు అందించగలదు. యోనోకి ప్రస్తుతం 10 కోట్ల కస్టమర్లు ఉన్నారు. యోనో మొబైల్‌ బ్యాంకింగ్‌ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌పై కస్టమర్ల సంఖ్య 20 కోట్లకు చేర్చాలన్నది మా ఉద్దేశ్యం. వచ్చే రెండేళ్లలో దీన్ని చేరుకుంటాం’’అని శెట్టి చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌)ను 3 శాతం సాధిస్తామని మరోసారి ప్రకటించారు. ర్యామ్‌ విభాగంలో (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ) రుణాల పరంగా 14 శాతం వృద్ధి సాధిస్తామని, అలాగే రూ.25 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో మైలురాయిని అధిగమిస్తామని చెప్పారు. బంగారం రుణాలు, ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ (అన్‌సెక్యూర్డ్‌ వ్యక్తిగత రుణాలు)లో మంచి వృద్ధి సాధిస్తామన్నారు.

Winter Vacations Goa Kerala Emerge as Top Travel Destinations4
ఈ వింటర్‌ వెకేషన్‌కు అంతా అక్కడికే!

దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్‌ సీజన్‌లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్‌ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్‌లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్‌ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.‘ఎయిర్‌బీఎన్‌బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్‌లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్‌లు, బ్యాక్‌వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్‌డోర్‌ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్‌బీఎన్‌బీ కంట్రీ హెడ్‌ అమన్‌ప్రీత్‌ బజాజ్‌ తెలిపారు.సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్‌ ట్రావెల్‌ సీజన్‌లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్‌బీఎన్‌బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..లక్షద్వీప్‌లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్‌లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్‌వాటర్స్‌ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్‌లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్‌ జెడ్, మిలీనియల్స్‌ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్‌ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.సీజనల్‌ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్‌ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్‌ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్‌లను ప్లాన్‌ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్‌ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్‌పూర్, జైపూర్‌లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది.

SIP Boosts Mutual Fund Industry Growth5
ఫండ్‌ పరిశ్రమకు సిప్‌ దన్ను

అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్లు (సిప్‌), మార్కెట్‌ వృద్ధితో అసెట్‌ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఈవో నిమేష్‌ షా తెలిపారు. రిటైర్మెంట్‌ లేదా పిల్లల చదువులాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం సిప్‌ విధానంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మదుపరులు, చివరివరకు పెట్టుబడులను కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు.యాక్టివ్‌ వ్యూహాలు అత్యధిక రాబడులను అందించినంత వరకు వాటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతుందని షవివరించారు. దేశీయంగా యాక్టివ్‌ ఫండ్లు సహేతుకమైన పనితీరును కనపరుస్తున్నందున వాటిల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏదైనా ఫండ్‌ సంస్థకు ఇతర సంస్థల నుంచి పోటీ, లేదా నియంత్రణ నిబంధనలపరమైన రిసు్కల కన్నా పనితీరు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే పెద్ద రిసు్కగా ఉంటుందని షా వివరించారు.‘‘డిజిటైజేషన్, డెమోగ్రాఫిక్స్, ఆర్థిక అసెట్ద్‌లోకి కుటుంబాల పొదుపు మొత్తాలు భారీగా వస్తుండటంలాంటి అంశాల దన్నుతో భారత జీడీపీ గణనీయంగా వృద్ధి నమోదు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ఊతంతో దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల ఆదాయ వృద్ధి రూపంలో ఈక్విటీ మార్కెట్లలో కూడా ఇది ప్రతిఫలిస్తోంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులను కొనసాగించే వారికి సముచితమైన ప్రతిఫలం దక్కుతుందని ఇవి నమ్మకం కలిగిస్తున్నాయి’’ అని షా తెలిపారు.లిస్టయినా జవాబుదారీతనం యథాతథం.. ‘‘స్టాక్‌ మార్కెట్లలో కంపెనీ లిస్టయినప్పటికీ మా జవాబుదారీతనం, బాధ్యతలేమీ మారవు. ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించి, వారి సంపద వృద్ధి చెందితేనే మా ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి యూనిట్‌హోల్డర్లకు ఒనగూరే ప్రయోజనాలతో షేర్‌హోల్డర్ల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అన్నింటికన్నా ప్రధానంగా డబ్బును నిర్వహించే రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగానే మమ్మల్ని మేము భావిస్తాం. లిస్టింగ్‌ తర్వాత కూడా అదే కొనసాగుతుంది. ఫండ్‌ పరిశ్రమ చాలా విస్తృత స్థాయి వ్యాపారం. ఇన్వెస్టర్లకు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నియంత్రణ సంస్థ వ్యయాలను క్రమబదీ్ధకరించింది. దీనితో ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ మరింత అందుబాటులోకి వస్తాయి. అలాగే మార్జిన్లు తగ్గినా పరిమాణం పెరగడం వల్ల సంస్థకు ఆ మేరకు భర్తీ అవుతుంది. కాలక్రమేణా అధిక లాభాలకు దోహదపడుతుంది’’ అని షా చెప్పారు.ఇక ఐపీవో వల్ల కంపెనీ నిర్వహణ స్వరూపం ఏమీ మారదన్నారు. గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడులు కొనసాగిస్తున్న ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌ పాక్షికంగానే వాటాలను విక్రయిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంకు మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని తెలిపారు. కాబట్టి అదే మేనేజ్‌మెంట్, అవే పెట్టుబడి సూత్రాలు, గవర్నెన్స్‌తో వ్యాపారం కొనసాగుతుందన్నారు. పబ్లిక్‌ ఇష్యూతో లిక్విడిటీ, యాజమాన్యం పెరుగుతుందే తప్ప కంపెనీ వ్యూహంలో మార్పు ఉండదని షా తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎంతో పేరున్న పలు దిగ్గజ సంస్థలు యాంకర్‌ ఇన్వెస్టర్లుగా ఈ ఇష్యూలో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. తమ బిజినెస్‌ మోడల్, నిర్వహణ క్రమశిక్షణ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, భారత అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమపై వాటికున్న నమ్మకానికి ఇది నిదర్శనంగా ఉంటుందని వివరించారు.

 Gujarat Kidney and Super Speciality IPO: Company sets price band at Rs 108 and Rs 114 per share6
గుజరాత్‌ కిడ్నీ @ రూ. 108–114

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ కంపెనీ గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూకి తాజాగా రూ. 108–114 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా దాదాపు రూ. 251 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 128 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్‌ హాస్పిటల్‌ కొనుగోలుతోపాటు.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్‌ సెంటర్‌ పాక్షిక చెల్లింపులకు వెచ్చించనుంది. అంతేకాకుండా వడోదరలో కొత్త ఆసుపత్రి ఏర్పాటు, రోబోటిక్స్‌ పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులకు సైతం నిధులు కేటాయించనుంది. కంపెనీ గుజరాత్‌లో మధ్యస్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement