Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IndiGo Turmoil Government Orders Major Operational Cuts1
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్‌ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్‌ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్‌వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Gold and Silver rates on 10th December 2025 in Telugu states2
సిల్వర్‌ సునామీ.. పసిడి ధరల తుపాను!!

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఒక రోజు పైకి, ఒక రోజు కిందకు అన్నట్లు సాగుతున్న పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) అమాంతం పెరిగాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా మూడో రోజు సునామీలా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 10th 2025 3
Stock Market Updates: లాభాల్లోకి మార్కెట్లు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయానికి ముందు భయం మధ్య బుధవారం ఫ్లాట్ ప్రారంభమైన భారత స్టాక్స్ తరువాత ఊపందుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 184 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 84,850 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 25,886 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగాయి.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ (USD Index) 99.03బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 62.41 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.1 శాతం తగ్గింది.నాస్‌డాక్‌ 0.1 శాతం లాభపడింది.Today Nifty position 10-12-2025(time: 9:36)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Worlds Most Indebted Companies Top Firm Owes More Than Indias GDP4
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్‌ జీడీపీ కంటే ఎక్కువ!

ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రుణం పెరుగుతూ వస్తోంది. విస్తరణ, రీఫైనాన్స్ లేదా పెట్టుబడి అవసరాల కోసం కంపెనీలు రుణాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆదాయం తగ్గినప్పుడు ఈ రుణాలు భారీ భారంగా మారుతాయి. కొన్నిసార్లు సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆస్తుల అమ్మకం లేదా విభాగాల మూసివేతల వరకు వెళ్తాయి.ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రుణాన్ని పరిశీలిస్తే కళ్లు చెదిరే అంకెలు బయటపడుతున్నాయి. అత్యధిక రుణభారంతో ఉన్న టాప్ 10 కంపెనీలలో ఐదు చైనా, మూడు అమెరికా, ఒకటి ఫ్రాన్స్, ఒకటి కెనడా దేశాలకు చెందినవి. అమెరికా తన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజాలతో ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోనే అత్యంత రుణం ఈ కంపెనీదే..అమెరికన్ మార్టగేజ్ సంస్థ ‘ఫెన్నీ మే’ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణం ఉన్న కంపెనీగా నిలిచింది. దీని రుణ భారం 4.21 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశ జీడీపీ కంటే అధికం. అంతేకాదు.. యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడా వంటి దేశాల జీడీపీకన్నా కూడా ఎక్కువ.అప్పుల్లో టాప్ 10 కంపెనీలుర్యాంక్కంపనీదేశంమొత్తం రుణం1ఫెన్నీ మేఅమెరికా$4.21 ట్రిలియన్2ఫ్రెడ్డీ మాక్అమెరికా$3.349 ట్రిలియన్3జేపీ మోర్గాన్ చేజ్అమెరికా$496.55 బిలియన్4అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$494.86 బిలియన్5చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్చైనా$479.33 బిలియన్6బిఎన్పి పరిబాస్ఫ్రాన్స్$473.67 బిలియన్7ఐసిబిసిచైనా$445.05 బిలియన్8బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$400.70 బిలియన్9సిటిక్ లిమిటెడ్చైనా$386.79 బిలియన్10రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాకెనడా$377.70 బిలియన్భారత్‌లో అంబానీ కంపెనీ టాప్‌భారతదేశంలో ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక రుణభారం ఉన్న సంస్థ. దీని మొత్తం రుణం 43.24 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.3.8 లక్షల కోట్లు. ఇది భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ రుణం అవకాశమా.. సవాలా?కార్పొరేట్ రుణం విస్తరణకు ఉపయోగపడినా, సరైన నిర్వహణ లేకపోతే ఇది భారీ ఆర్థిక సవాలుగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత రుణపడి ఉన్న కంపెనీలు, అధిక రుణభారం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి.

How to Get Richer as The World Economies Crash Robert Kiyosaki Tweet5
వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.ధనవంతుడిని $లో కొలుస్తారు.సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.LESSON # 7:: How to get richer as the world economies crash:Are you working to get rich or are you working to get wealthy?Definitions: Rich is measured in $.Wealth is measured in TIME.For example a rich person might say: “I have $1 million in the bank.”A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025

US tariffs Have Had No Impact on Chinese Trade6
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!

అమెరికా టారిఫ్‌లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్‌ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్‌ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్‌ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్‌ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్‌ పవర్‌గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్‌లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్‌ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్‌లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్‌కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్‌ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement
Advertisement