ప్రధాన వార్తలు
ఎఫ్ఎంసీజీ అమ్మకాల వృద్ధి తగ్గుదల
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి సెప్టెంబర్ త్రైమాసికంలో పరిమాణం పరంగా 5.4 శాతానికి పరిమితమైనట్టు నీల్సన్ఐక్యూ సంస్థ తెలిపింది. జీఎస్టీ రేట్ల మార్పులకు ముందు నెలకొన్న పరిస్థితులను అవరోధాలుగా పేర్కొంది. అమ్మకాల విలువ మాత్రం 12.9 శాతం పెరిగినట్టు తెలిపింది. ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాల వృద్ధి క్రితం ఏడాది క్యూ2తో పోల్చితే 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిందని.. అయినప్పటికీ వరుసగా ఏడో నెలలోనూ పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక వృద్ధి కనిపించినట్టు తన నివేదికలో నీల్సన్ఐక్యూ సంస్థ వెల్లడించింది. చిన్న ప్యాక్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో అధిక వాటా కలిగిన పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డిమాండ్ క్రమంగా కోలుకుంటోంది. జూన్ త్రైమాసికంతో పోల్చితే మాత్రం పట్టణాల్లో డిమాండ్ తగ్గింది. ఇక గ్రామీణ మార్కెట్లో అందుబాటు ధరల ఆధారంగా చిన్న ప్యాక్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ డిమాండ్లో గ్రామీణ వాటా 38 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో 7.7 శాతం వృద్ధి నమోదు కాగా, పట్టణాల్లో 3.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. మెట్రోల్లో ఈ–కామర్స్ అమ్మకాలు అధికం మెట్రో నగరాల్లో సంప్రదాయ దుకాణాల ద్వారా ఎఫ్ఎంసీజీ అమ్మకాలు తగ్గగా, ఈ–కామర్స్ విక్రయాలు పెరిగినట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా పెరిగినట్టు పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓమ్ని ఛానల్ అమ్మకాలకు (ఆన్లైన్–ఆఫ్లైన్) ఈ–కామర్స్ కీలక చోదకంగా ఉందని, సంప్రదాయ రిటైల్ వాణిజ్యం సైతం తనవంతు వాటా పోషించినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున వినియోగం పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం వచ్చే రెండు త్రైమాసికాల విక్రయాల్లో కనిపించొచ్చని అంచనా వేసింది. ఎఫ్ఎంసీజీ పరిశ్రమ జీఎస్టీ 2.0 (సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి)కు మారే క్రమంలో హోమ్, పర్సనల్కేర్ బ్రాండ్ల విభాగంలో తాత్కాలికంగా వృద్ధి నిదానించినట్టు ఈ నివేదిక వివరించింది. ఇక ఆహారోత్పత్తుల వినియోగంలో వృద్ధి స్థిరంగా 5.4 శాతం స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. పార్మసీల ద్వారా విక్రయించే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల విలువ 14.8 శాతం పెరిగినట్టు, ఇందులో ధరల పెంపు రూపంలో 9.7 శాతం సమకూరినట్టు పేర్కొంది.
ఇజ్రాయెల్ స్టార్టప్లతో జత
టెల్అవీవ్: భారత్, ఇజ్రాయెల్ స్టార్టప్లు సాంకేతిక సహకారమందించుకునేందుకు చేతులు కలపవలసి ఉన్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా సైబర్సెక్యూరిటీ, మెడికల్ పరికరాలు తదితరాలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహకారానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. సొంత స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇజ్రాయెల్తో చేతులు కలపనున్నట్లు పేర్కొన్నారు. పోటీ ధరలలో లోతైన టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన ఆవిష్కరణలను అందించే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. భారత్కున్న విస్తారిత వ్యవస్థల ద్వారా ఇందుకు పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్ వాణిజ్య మంత్రి నిర్ బార్కట్తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు గోయల్ ఇక్కడకు వచ్చారు.
ఇన్ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
ఇండెక్సులలో రీట్స్కు చోటు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు(రీట్స్)ను మార్కెట్ ఇండెక్సులలో చేర్చే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో రీట్స్కు లిక్విడిటీ భారీగా మెరుగుపడే వీలున్నట్లు తెలియజేశారు. 2025 రిట్స్, ఇని్వట్స్ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ పాండే ఇండెక్సులలో రీట్స్ను పొందుపరిచేందుకు పరిశ్రమ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రియల్టీ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు రీట్స్ను జారీ చేస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లకు అధిక ధరల రియలీ్టని ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా డివిడెండ్ ఆదాయం ఆర్జించేందుకు వీలు కల్పించడంతోపాటు.. భవిష్యత్లో పెట్టుబడుల వృద్ధికి సైతం రీట్స్ ఉపయోగపడతాయి. ఇండెక్సులలో చోటు లభిస్తే రీట్స్లో లిక్విడిటీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. మరోపక్క రీట్స్, ఇని్వట్స్ సంబంధిత బిజినెస్ల సులభతర నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎంఎఫ్ పథకాలలో.. ఇన్వెస్టర్లకు రక్షణ కలి్పస్తూనే లిక్విడ్ ఎంఎఫ్ పథకాలలో రీట్స్, ఇన్విట్స్ ఇన్వెస్ట్ చేసేందుకున్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు సెబీ చీఫ్ పాండే తెలియజేశారు. ఈ బాటలో తగిన రక్షణాత్మక విధానాలకు తెరతీయడం ద్వారా గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులలో ప్రయివేట్ ఇని్వట్స్ పెట్టుబడులు చేపట్టేందుకు అవకాశాలను అన్వేíÙస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విధంగా రీట్స్, ఇని్వట్స్లో మరిన్ని పెట్టుబడులను చేపట్టేందుకు వీలుగా సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్ ఆస్తుల మానిటైజేషన్ను పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో పెట్టుబడులపై బీమా రంగ నియంత్రణ సంస్థ, పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత సంస్థ, ఈపీఎఫ్వో తదితరాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఎఫ్లపై సెబీ ఆంక్షలు ప్రీఐపీవోలో పెట్టుబడులకు చెక్ న్యూఢిల్లీ: ప్రీఐపీవోలో షేర్ల కొనుగోలుపై మ్యూచువల్ ఫండ్స్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. సంబంధితవర్గాల సమాచారం ప్రకారం ఐపీవోకుముందు షేర్ల జారీ(ప్లేస్మెంట్స్)లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. తద్వారా ఐపీవోలలో లిక్విడిటీని పెంచడంతోపాటు.. కంపెనీల విలువ నిర్ధారణలో పారదర్శకతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రీఐపీవో షేర్ల జారీలో పాల్గొనకుండా ఆదేశించామని, అయితే యాంకర్ రౌండ్లలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతులు కొనసాగుతాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ నెల మొదట్లో సెబీ యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీ, షేర్ల కేటాయింపులో సైతం సవరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్కు మరింత చోటు కల్పించింది. ఇందుకు వీలుగా యాంకర్ పోర్షన్ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచిన విషయం విదితమే.
రష్యా చమురుకు రిలయన్స్ గుడ్బై
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లోని జామ్నగర్లో ఎగుమతులకు ఉద్దేశించిన రిఫైనరీ యూనిట్ కోసం రష్యా చమురు దిగుమతులను నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్య ఆంక్షలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న సంస్థల్లో రిలయన్స్ ముందుండడం గమనార్హం. జామ్నగర్ కాంప్లెక్స్లో రిలయన్స్కు రెండు రిఫైనరీ యూనిట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేక ఆర్థిక మండలి రిఫైనరీ యూనిట్. ఇందులో రష్యా చమురును రిఫైనరీ చేసి యూరప్, యూఎస్, ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. రోజువారీ 1.7–1.8 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి తక్కువ ధరలపై కొనుగోలు చేస్తూ వచి్చంది. జామ్ నగర్లోనే ఉన్న మరొక యూనిట్ను దేశీ మార్కెట్ అవసరాల కోసం వినియోగిస్తోంది. అయితే, రష్యా చమురు దిగుమతి, దాంతో పెట్రోలియం ఉత్పత్తుల తయారీపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడం గమనార్హం. వీటిని అనుసరిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా చమురు కొనుగోళ్లను నవంబర్ 20 నుంచి నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతంలో కొనుగోలు చేసిన చమురు నిల్వల రిఫైనరీ పూర్తయిన అనంతరం, రష్యాయేతర దేశాల చమురునే ఇక్కడ వినియోగించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్ ద్వారా ఎగుమతి చేసే ఉత్పత్తులు రష్యాయేతర చమురుతో తయారైనవే ఉంటాయని స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నుంచి ఐరోపా ఆంక్షలు అమల్లోకి రానుండగా, దీనికంటే ముందుగానే రష్యాయేతర చమురుకు మారిపోవడం పూర్తవుతుందన్నారు. తద్వారా ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.
రూపాయి భారీ క్రాష్..!
ముంబై: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కె ట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్కరోజులో అత్యధికంగా 98 పైసలు కుప్పకూలి చరిత్రాత్మక కనిష్టం 89.66 స్థాయి వద్ద ముగిసింది. అంతకుముందు అక్టోబర్ 14న 88.91 జీవితకాల కనిష్టంగా ఉంది. అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో అనూహ్య అమ్మకాలు, అమెరికా–భారత్ల వాణిజ్య డీల్పై స్పష్టత లేమి కూడా రూపాయి కోతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 97 పైసలు క్షీణించి 89.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 88.85 వద్ద ఇంట్రాడేలో రికార్డు కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అలాగే జూలై 30న ఒక్కరోజులో 89 పైసల పతన రికార్డునూ చెరిపివేసింది. ‘క్రిప్టో భారీ పతనం, ఏఐõÙర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో అంతర్జాతీయంగా కరెన్సీ మార్కెట్లలో రిస్క్ సామర్థ్యం ఒక్కసారిగా తగ్గింది. ఈ పరిమాణం భారత్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెంచింది’ అని ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అండ్ కమోడిటీ, కరెన్సీ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు.
కార్పొరేట్
రష్యా చమురుకు రిలయన్స్ గుడ్బై
అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!
బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ఈసారి సంపాదనెంత?
ఏఐ ఇన్ఫ్రా కోసం పాక్స్కాన్తో ఓపెన్ఏఐ జట్టు
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్
జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం
విరామ ఆతిథ్యంలోకి మహీంద్రా
100 కోట్లకు 5జీ కనెక్షన్లు
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
గ్లోబల్ టాప్ 100లో... మరిన్ని భారతీయ బ్యాంకులు
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయ...
Stock Market: 26వేల మార్కుపైన ముగిసిన నిఫ్టీ
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార...
వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్! తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఉపశమనం క...
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ...
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటాని...
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షల...
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక...
‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కొత్త పాలసీలు
తెలంగాణ ఆర్థిక ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
జియో కొత్త ఆఫర్.. 18 నెలలు ఉచితం!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త, అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?18 నెలలపాటు ఉచితంజియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్కు సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.ఆఫర్ ఎలా పొందాలంటే.. ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు.
Vreels: టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ను దాటిపోయే కొత్త డిజిటల్ విశ్వం
డిజిటల్ ప్రపంచం ప్రతీ రోజూ మారుతోంది. నేడు మనం వీడియోల కోసం ఒక యాప్, మెసేజింగ్ కోసం మరో యాప్, షాపింగ్ కోసం ఇంకొకటి వాడుతున్నాం.ఈ మధ్యకాలంలో యూజర్లు ఒక ప్రశ్నను తరచూ అడుగుతున్నారు: “ఈ అన్నింటినీ ఒకే వేదికలో పొందలేమా?”ఇదే ప్రశ్న ఒక కొత్త ఆలోచనకు పుట్టుక ఇచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచానికి అందుతున్న – వీరీల్స్ (Vreels) (www.vreels.com).అమెరికాలో ఉండే మన తెలుగువారి ఆలోచన — ప్రపంచానికి కొత్త వేదిక టెక్ ప్రపంచంలో ముందడుగు వేస్తున్న యువతెలుగువారు. అమెరికాలో ఉండి, ప్రపంచం కోసం ఒక అద్భుతమైన యాప్ను రూపొందించారు."సురక్షితం, అందరికీ సులభం, ప్రపంచస్థాయి ఫీచర్లతో" భారతీయ సృజనకు కొత్త రూపం ఇచ్చిన మేధస్సు ఇది. వీరి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది — భారతీయులకు, ముఖ్యంగా క్రియేటర్లకు, యువతకు, ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీ ఇవ్వగల ఒక సరైన వేదికను అందించడం.వీరీల్స్ ఎందుకు ఇతర యాప్లను దాటిపోతోంది?1) వీడియోలు, చాట్, షాపింగ్ — అన్నీ ఒకే యాప్లో.. - మీరు రీల్స్ చేయాలంటే – Vreels - మిత్రులతో చాట్ చేయాలంటే - Vreels - ప్రోడక్ట్స్ కొనాలంటే - Vreels2) టిక్టాక్ & ఇన్స్టాగ్రామ్ కంటే సురక్షితం, స్పష్టత ఎక్కువ AI పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు డేటా సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో, Vreels ప్రతి డేటాను జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి, ఎన్క్రిప్షన్తో రక్షిస్తుంది. ఇక్కడ యూజర్ డేటా అమ్మకం లేదు, లీక్ భయం లేదు. మీరు చూడమంటేనే, మీ డేటా కనిపిస్తుంది.3) Capsules — ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక ఫీచర్ Vreels లోని Capsules మీ జ్ఞాపకాలను భద్రంగా, సమయంతో తాళం వేసి ఉంచుతుంది. మీరు నిర్ణయించిన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే అవి అన్లాక్ అవుతాయి.4) Vreels Shop/Bid — వినోదం దగ్గరే షాపింగ్ యూజర్లు వీడియో చూస్తూ ఉండగానే ప్రోడక్ట్స్ కొనొచ్చు లేదా బిడ్ చేయొచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను నమ్మకంతో విక్రయించొచ్చు.ఇది షాపింగ్ కాదు— భారతీయ డిజిటల్ వ్యాపారానికి ఒక కొత్త దారితీసే ఫీచర్.5) క్రియేటర్ల కోసం ప్రత్యేక అవకాశాలు రిచ్ ఫీచర్లు, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పారదర్శకత — ఇవి అన్ని కలిపి క్రియేటర్లకు TikTok & Instagram కన్నా మెరుగైన వేదికను ఇస్తాయి.22 దేశాల్లో విడుదల… ఇప్పుడు App Store & Play Store లో అందుబాటులోయువ తెలుగువారి ప్రతిభతో పుట్టిన ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store మరియు Apple App Store లో అందుబాటులో ఉంది.ఇది ప్రారంభం మాత్రమే — ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు రానున్నాయి.Vreels — మీ డిజిటల్ ప్రయాణానికి కొత్త స్వరూపం మీరు క్రియేటర్ అయినా, షాపింగ్ ప్రేమికుడైనా, లేదా కొత్త ఫీచర్లు ప్రయత్నించే టెక్-ఎన్తుజియాస్ట్ అయినా — Vreels మీ కోసం. మీ అనుభవం కోసం. మీ భవిష్యత్తు కోసం.ఇప్పుడే ప్రయత్నించండి Vreels — భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి:
యాపిల్కేర్ ప్లస్ ప్లాన్లో కొత్త ఫీచర్లు
ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ యాపిల్కేర్ ప్లస్ ప్లాన్ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్ని అపరిమిత స్థాయిలో రిపేర్ చేయించుకునేందుకు ప్రొటెక్షన్ ప్లాన్ కింద కవరేజీ ఉంటోంది.యాపిల్కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్ కొనుక్కున్నప్పుడే ప్లాన్ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లుఐఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.డివైజ్ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చుగమనించాల్సిన అంశాలుథెఫ్ట్ & లాస్ కవరేజీ కేవలం ఐఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది. (యాపిల్ సాధారణంగా రీప్లేస్మెంట్ ఫీజు వసూలు చేస్తుంది).ప్లాన్ ధర డివైజ్ మోడల్ ఆధారంగా మారుతుంది.
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
సముద్ర గర్భంలో కేబుళ్ల ద్వారా నిమిషాల వ్యవధిలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ప్రపంచం నలుమూలలా చేరవేసే శక్తిమంతమైన కేంద్రాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. అవే డేటా సెంటర్లు. డేటా సెంటర్లు డిజిటల్ స్టోరేజ్ కోసం ప్రాసెసింగ్ హౌస్లుగా పని చేస్తాయి. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పనికి (ఉదాహరణకు, గూగుల్లో శోధించడం, యూట్యూబ్ వీడియో చూడటం, జీమెయిల్ పంపడం, ఫొటోను క్లౌడ్లో సేవ్ చేయడం లేదా ఆన్లైన్ గేమ్ ఆడటం) మూల కారణం డేటా సెంటర్లే. ఈ విభాగంలో టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని భారత్పై కేంద్రీకరించాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇదొకవైపు డిజిటల్ ఇండియాకు శుభపరిణామం అయినప్పటికీ, మరోవైపు దేశ ఇంధన భవిష్యత్తుకు పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే వాదనలున్నాయి.భారత్ ఎందుకు?భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్గా ఉంది. కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు, పెరుగుతున్న 5జీ విస్తరణ, యూపీఐ లావాదేవీలు, ఓటీటీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డేటా డిమాండ్ను తీర్చాలంటే వినియోగదారులకు తక్కువ లేటెన్సీ అంటే వేగవంతమైన సేవలు కల్పించాలంటే డేటా సర్వర్లు భౌగోళికంగా వారికి చేరువలో ఉండాలి.భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం దేశానికి సంబంధించిన సున్నిత డేటాను దేశ సరిహద్దుల్లోనే నిల్వ చేయాలని అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీలకు దేశంలోనే డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధపడేలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సులభతరమైన అనుమతులు కల్పిస్తున్నాయి. భారత్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత ఇందుకు సానుకూల అంశంగా ఉంది.డేటా సెంటర్లకు ఎంత విద్యుత్ కావాలంటే..డేటా సెంటర్లకు తరచుగా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి కారణం వాటిలో నిరంతరం 24/7 పనిచేసే వేలాది సర్వర్లు (కంప్యూటర్లు) ఉంటాయి. డేటాను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం వంటి నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి సర్వర్కు గణనీయమైన విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో సర్వర్లన్నీ అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వేడి పెరిగితే సర్వర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, సర్వర్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి భారీ స్థాయిలో కూలింగ్ వ్యవస్థలు పనిచేయాలి. నివేదికల ప్రకారం, ఒక డేటా సెంటర్లోని మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వరకు కేవలం కూలింగ్ కోసమే ఖర్చు అవుతుంది.ఉష్ణోగ్రత నియంత్రణ ఎలా?సర్వర్లలో ఉత్పత్తి అయ్యే అధిక వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ రూమ్ ఎయిర్ కండిషనింగ్/హ్యాండ్లర్ యూనిట్లను ఉపయోగించి సర్వర్ల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తారు. ఇది అత్యంత సాధారణ పద్ధతి.నీటిని ఆవిరి చేసి దాని ద్వారా ఉత్పత్తయ్యే చల్లదనాన్ని ఉపయోగించి వేడి గాలిని చల్లబరచడం ఇంకోపద్ధతి. వేడి వాతావరణం ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మెరుగైన మార్గం అవుతుంది.లిక్విడ్ కూలింగ్ అనేది ఆధునిక పద్ధతి. సర్వర్ చిప్లకు నేరుగా ప్రత్యేకమైన ద్రవాలను పంపడం ద్వారా వేడిని తొలగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చాలా కంపెనీలు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడి నీటిని సమీపంలోని పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారు.ఇంధన సవాళ్లు..భారతదేశం 2070 నాటికి ‘నికర-శూన్య కర్బన ఉద్గారాల (Net-Zero Emissions)’ లక్ష్యాన్ని సాధించాలని, 2030 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% పునరుత్పాదక వనరుల నుంచి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో ప్రస్తుతం అధిక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం థర్మల్ విద్యుత్ (బొగ్గు). డేటా సెంటర్ల కోసం విపరీతంగా పెరిగే విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ థర్మల్ విద్యుత్పై ఆధారపడాల్సి వస్తే అది మన పునరుత్పాదక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.భారత్ ఎంచుకోవాల్సిన పంథా..ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక సమగ్రమైన, పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరించాలి. భారత ప్రభుత్వం ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. డేటా సెంటర్ ఆపరేటర్లు తమకు అవసరమైన విద్యుత్లో కనీసం 60% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందాలని (ఉదాహరణకు, సోలార్ లేదా విండ్ పవర్ ప్లాంట్లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) తప్పనిసరి చేయాలి. విద్యుత్ వినియోగ సమర్థత (Power Usage Effectiveness) వంటి పారామితుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.లిక్విడ్ కూలింగ్, నేచురల్ ఎయిర్ కూలింగ్ (చల్లని ప్రాంతాల్లో) వంటి అత్యంత సమర్థవంతమైన కూలింగ్ సాంకేతికతలను ఉపయోగించే డేటా సెంటర్లకు అధిక రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ను వృథా చేసే వ్యవస్థలకు బదులుగా ఆధునిక, పర్యావరణ అనుకూల యంత్రాలను ఉపయోగిస్తే కొన్ని రాయితీలు పరిశీలించవచ్చు. సౌర, పవన విద్యుత్ నిరంతరంగా లభించదు. కాబట్టి, ఈ విద్యుత్ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలి. ఇది డేటా సెంటర్లకు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
పర్సనల్ ఫైనాన్స్
బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు..
ఆరోగ్యం అత్యంత విలువైన ఆస్తి. అందుకే, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాలసీ తీసుకునే క్రమంలో బీమా ఏజెంట్లు లేదా మధ్యవర్తులు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా పాలసీదారునికి ప్రతికూలంగా ఉండే అంశాలను చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. పాలసీ తాలూకు నిజమైన నిబంధనలు, పరిమితులు కప్పిపుచ్చడం వల్ల క్లెయిమ్ సమయంలో పాలసీదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏజెంట్లు కావాలనే దాచే లేదా ఎక్కువగా చెప్పని అంశాలేమిటో చూద్దాం.కో-పేమెంట్ నిబంధనచాలా పాలసీల్లో కో-పేమెంట్ నిబంధన ఉంటుంది. దీని ప్రకారం ఆసుపత్రి బిల్లులో నిర్ణీత శాతాన్ని (ఉదాహరణకు, 10% లేదా 20%) పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల ప్లాన్లలో ఇది సర్వసాధారణం. ఏజెంట్లు ఈ ముఖ్యమైన ఆర్థిక భారాన్ని విస్మరిస్తారు.వెయిటింగ్ పీరియడ్స్బీమా పాలసీని కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ప్రభావితం చేస్తాయి. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు (కొన్ని ప్రత్యేక ప్రమాదాలు మినహా) వరకు ఎలాంటి అనారోగ్యానికి క్లెయిమ్ చేయలేరు. కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్, హెర్నియా వంటి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు 1 లేదా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు నుంచే ఉన్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వెంటనే ఈ వ్యాధులకు క్లెయిమ్ రాదని ఏజెంట్లు స్పష్టంగా చెప్పరు.రూమ్ రెంట్ క్యాపింగ్చాలా ప్లాన్లలో బీమా మొత్తం ఆధారంగా రోజువారీ గది అద్దెపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాలసీలో బీమా మొత్తంలో 1% మాత్రమే రూమ్ అద్దెగా నిర్ణయించవచ్చు. దీని అర్థం రూ.5 లక్షల పాలసీకి రోజుకు గరిష్టంగా రూ.5,000 మాత్రమే గది అద్దె కింద చెల్లిస్తారు. మీరు అంతకంటే ఖరీదైన గదిని ఎంచుకుంటే అధిక అద్దెతో పాటు గది అద్దెతో సంబంధం ఉన్న ఇతర ఖర్చులలో కొంత భాగాన్ని (ఉదాహరణకు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు) పాలసీదారుడే భరించాల్సి వస్తుంది.క్లెయిమ్ తిరస్కరణదరఖాస్తు ఫామ్లో పాలసీదారుని మునుపటి ఆరోగ్య చరిత్ర, శస్త్రచికిత్సలు, తీసుకుంటున్న మందుల గురించి తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం వల్ల క్లెయిమ్ సమయంలో బీమా కంపెనీ పాలసీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏజెంట్లు పాలసీ త్వరగా ఆమోదం పొందాలనే ఉద్దేశంతో దాచమని సలహా ఇస్తారు. ఇది క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణం అవుతుంది.సబ్ లిమిట్స్కొన్ని చికిత్సలు లేదా సర్వీసులపై బీమా కంపెనీ నిర్దిష్ట పరిమితులు విధిస్తుంది. ఉదాహరణకు, క్యాటరాక్ట్ శస్త్రచికిత్సకు రూ.40,000 మించి చెల్లించరు. అంబులెన్స్ ఛార్జీలకు రూ.2,000 మించి చెల్లించరు. మీరు ఆ చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా పరిమితి మేరకు మాత్రమే క్లెయిమ్ లభిస్తుంది.కవర్ కాని అంశాలుసౌందర్య చికిత్సలు (Cosmetic Treatment), అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల కలిగే గాయాలు, అప్పుడే పుట్టిన శిశువుల చికిత్స ఖర్చులు (కొన్ని వారాల వరకు), నాన్-మెడికల్ వస్తువులు (గ్లోవ్స్, మాస్కులు, టూత్ బ్రష్, పౌడర్ మొదలైనవి) వంటి అనేక అంశాలను పాలసీ కవర్ చేయదు. ఈ మినహాయింపుల జాబితాను ఏజెంట్లు చాలా అరుదుగా వివరిస్తారు.పాలసీదారులు ఏం చేయాలి?బీమా పాలసీ గురించి ఏజెంట్ మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి.నిబంధనలు, షరతులు, మినహాయింపులు, కో-పేమెంట్ సెక్షన్లను పరిశీలించాలి.పాలసీ పత్రాలు అందిన తర్వాత 15 రోజుల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో మీకు పాలసీ నచ్చకపోతే పూర్తి డబ్బు వెనక్కి తీసుకొని రద్దు చేసుకోవచ్చు.వెయిటింగ్ పీరియడ్స్, కో-పేమెంట్, రూమ్ రెంట్ క్యాపింగ్ గురించి ఏజెంట్ను స్పష్టంగా అడిగి ఈమెయిల్ రూపంలో సమాచారం పొందాలి.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025
మ్యూచువల్ ఫండ్స్ కొత్త రూల్స్పై మరింత గడువు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.అక్టోబర్ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది.
ఆధార్ కార్డుల్లో కొత్త మార్పులు..!!
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అక్రమ ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త మార్పులు చేయబోతోంది. పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం కార్డుదారు ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన సరళీకృత ఆధార్ కార్డును జారీ చేసే విషయాన్ని యూఐడీఏఐ పరిశీలిస్తున్నదని ఆ సంస్థ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.ఆఫ్లైన్ స్టోరేజ్ లేదా ఆధార్ నంబర్ల వాడకాన్ని నిషేధించే చట్టం ఉన్నప్పటికీ అనేక సంస్థలు ఇప్పటికీ ఆధార్ ఫోటోకాపీలను సేకరిస్తున్నాయని ఆయన అన్నారు. హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బ్యాంకులు వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆఫ్లైన్ ధృవీకరణను తగ్గించచడానికి, అలాగే వ్యక్తిగత గోప్యతను రక్షిస్తూ ఆధార్ ఆధారిత వయస్సు ధృవీకరణ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి డిసెంబర్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యూఐడీఏఐ యోచిస్తోంది.“కార్డుపై ఏవైనా వివరాలు ఎందుకు ఉండాలి? కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన ఉంది. మనం ఎలా ప్రింట్ చేసిన కార్డులను ప్రజలు అలా అంగీకరిస్తూనే ఉంటారు. దుర్వినియోగం చేయాలనుకునే వారు వాటిని అలా చేస్తూనే ఉంటారు” అని సీఈఓ భువనేష్ కుమార్ అన్నారు.ఆధార్ కార్డు కాపీల ద్వారా జరిగే ఆఫ్లైన్ ధృవీకరణను పూర్తిగా అరికట్టే నిబంధన కూడా సిద్ధమవుతుందని, దీనిపై ప్రతిపాదనను డిసెంబర్ 1న యుఐడీఏఐ పరిశీలనకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. “ఆధార్ను డాక్యుమెంట్గా ఉపయోగించరాదు. ఆధార్ నంబర్ ద్వారా ప్రామాణీకరించాలి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరించాలి. లేనిపక్షంలో నకిలీ పత్రం అయి ఉండే ప్రమాదం ఉంది,” అంటూ కుమార్ స్పష్టం చేశారు.ఆధార్ కొత్త యాప్ తీసుకొస్తున్న నేపథ్యంలో యూఐడీఏఐ బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థలు తదితర వాటాదారులతో సంయుక్త సమావేశం నిర్వహించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న కొత్త యాప్ ఆధార్ ప్రామాణీకరణ సేవలను మరింత మెరుగుపరచనుందని, ఇది సుమారు 18 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుందని యూఐడీఏఐ భావిస్తోంది.


