ప్రధాన వార్తలు
వెహికల్ ఇన్సూరెన్స్: తెలుసుకోవలసిన విషయాలు
కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడంవెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.సరైన ఐడీవీ ఎంచుకోకపోవడంవాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.ఎన్సీబీ ఉపయోగించుకోకపోవడంపాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.పాలసీలను పోల్చి చూడకపోవడంఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోకపోవడంఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు.
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
ఇండియా & ఖతార్లలో.. మ్యూజియం ఇన్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్లను అభివృద్ధి చేయడానికి ఖతార్ మ్యూజియమ్స్ - ముంబై కేంద్రంగా ఉన్న నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మధ్య ఐదు సంవత్సరాలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం.. ఖతార్లలో మ్యూజియం ఇన్ రెసిడెన్స్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా పిల్లలకు ఉల్లాసభరితమైన, మ్యూజియం ఆధారిత అభ్యాస అనుభవాలను పరిచయం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం సృజనాత్మకతను ప్రేరేపించడం. మన దేశంలో ఈ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో.. NMACC అమలు చేస్తుంది. కాగా ఖతార్ మ్యూజియమ్స్ నిపుణులు.. మాస్టర్ క్లాసులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించనున్నారు.ఈ సందర్బంగా ఇషా అంబానీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు & విద్యాభివృద్ధి కోసం షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు ఖతార్ మ్యూజియంలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యంతో నిర్వహించనున్న కార్యక్రమాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలతో సహా పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాలలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది.
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది.
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
కార్పొరేట్
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
బయోఫ్యాబ్రి.. భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం
H-1B visa: ఆగిన వర్క్పర్మిట్ల పునరుద్ధరణ
నకిలీ ఉత్పత్తులపై అవగాహన: హెర్బలైఫ్ ఇండియా సరికొత్త కార్యక్రమం
ఐఫోన్ తయారీ ప్లాంట్లో 30,000 మంది నియామకం
జస్ట్ 99.. కానీ కాస్ట్లీ
కొత్త టెక్నాలజీల పరిశీలనకు వర్కింగ్ గ్రూప్
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు: కొనియాడిన అంబానీ
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజ...
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రి...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్...
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ర...
క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటి...
డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు
అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేద...
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స...
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవ...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!
టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్వాట్సప్లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్పెయిరింగ్ అంటున్నారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ ఇలా..సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్లో ఇంటర్నల్గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది.ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్ చేస్తారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలామీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు.వాట్సాప్ సెట్టింగ్స్లో 'Linked Devices' ఆప్షన్ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.వీసీ సజ్జనార్ ట్వీట్వాట్సాప్ ఘోస్ట్పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి'' అని వెల్లడించారు.🚨 Cyber Alert: New WhatsApp “GhostPairing” scam 🚨If you receive a message saying “Hey, I just found your photo” with a link — DO NOT click it, even if it appears to come from someone you know.⚠️ This is a GhostPairing scam.The link takes you to a fake WhatsApp Web page and… pic.twitter.com/7PsZJXw2pt— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్ఫామ్లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.మెటాపై విమర్శలుమోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.మెటా తన ప్లాట్ఫామ్లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!చైనాలో ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్ఫామ్లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.మెటా స్పందనమెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్ఫామ్ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?
సెర్చ్ చేస్తే.. కస్టమ్ యాప్!
గూగుల్, ఓపెన్ఏఐ, పెర్ప్లెక్సిటీలాంటి టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరం ఏఐ–ఆధారిత బ్రౌజర్లకు శ్రీకారం చుట్టాయి. తాజా విషయం ఏమిటంటే.. గూగుల్లోని క్రోమ్ బృందం ‘డిస్కో’ పేరుతో కొత్త జెమిని 3–ఆధారిత బ్రౌజర్ను ఆవిష్కరించింది.ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి అనుమతించే సంప్రదాయ బ్రౌజర్ల మాదిరిగా కాకుండా, గూగుల్ ‘డిస్కో’ జెన్ ట్యాబ్స్ను (Gentabs) ఉపయోగిస్తుంది. ప్రశ్న లేదా ప్రాంప్ట్లను ఇన్పుట్గా తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ట్యాబ్లను ఓపెన్ చేస్తుంది. అంతేకాదు మనం సెర్చ్ చేస్తున్నదానికి సంబంధించి కస్టమ్ యాప్ క్రియేట్ చేస్తుంది.ఉదాహరణకు... మనం ‘డిస్కో’ను ట్రావెల్ టిప్స్ అడిగితే ఆటోమేటిక్గా ప్లానర్ యాప్ను క్రియేట్ చేస్తుంది. గూగుల్ క్రోమ్లాగే బ్రౌజింగ్, ట్యాబ్లను ఒపెన్ చేయడం, ఎక్స్టెన్షన్స్, పేజీలను నావిగేట్ చేయడంలో ‘డిస్కో’ ఉపయోగపడుతుంది.ఈ కొత్త బ్రౌజర్తో యూజర్లు ఎలాంటి కోడ్ను రాయాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన వాటిని సింపుల్గా వివరిస్తే సరిపోతుంది. ఈ ఏఐ–జనరేటెడ్ వెబ్ యాప్తో టెక్స్ ప్రాంప్ట్ల ద్వారా లేఅవుట్స్, విజువల్, ఫీచర్స్కు సంబంధించి మార్పు చేర్పులు చేయవచ్చు.ప్రతి ఏఐ–జనరేటెడ్ కంటెంట్ ఒరిజినల్ వెబ్ సోర్స్తో లింకై ఉంటుంది. మీల్స్ ప్లాన్, ట్రావెల్ ప్లాన్, పిల్లలకు గ్రహాల గురించి పరిచయం చేయడానికి విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడుతుంది డిస్కో. ఒక నిర్దిష్టమైన అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆ అంశానికి సంబంధించి జెన్ ట్యాబ్ ఒక యాప్ను క్రియేట్ చేస్తుంది. సమాచారాన్ని విజువలైజ్ చేసి కాన్సెప్ట్ సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.చదవండి: ఫ్లెక్స్ క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు‘డిస్కో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రతీది సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇది తక్కువ మంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనిని యాక్సెస్ చేయడానికి మీరు వెయిట్ లిస్ట్లో చేరాల్సి ఉంటుంది’ అని గూగుల్ ప్రకటించింది.
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్ఫామ్గా రూపొందుతోంది. భారత్లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్ఫామ్స్లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్ఫామ్లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి.
పర్సనల్ ఫైనాన్స్
బీమా ప్రీమియం పెరిగింది.. మరి కవరేజీ సరిపోతుందా?
విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.టాప్ అప్లతో ఉపశమనం...పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్కు అనువైన టాప్అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే..
ఆర్థిక మార్కెట్లకు 2025 సంవత్సరం ఆశ్చర్యాలకు గురిచేసింది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవల రికవరీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రెండు రకాల ఆస్తులు ప్రత్యేకంగా మెరిశాయి.బంగారం, వెండిబంగారం, క్యాలెండర్ ఇయర్ 2024లో 30% రాబడిని అందించింది. ఇది ఈక్విటీలను మించిన లాభం. మరోవైపు పరిశ్రమల వినియోగంతో డిమాండ్ పెంచుకున్న వెండి 25.3% లాభపడింది. దీంతో వీటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అనుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. కానీ ఇలాంటి సమయంలోనే ‘రాబడులు ఇప్పటికే పెరిగాక వాటిని వెంబడించడం’ అనే ఉచ్చులో పెట్టుబడిదారులు చిక్కుకుంటారు.సమూహాన్ని వెంబడించే మానసిక లక్షణంబంగారంలో రాబడులు పెరిగే సమయంలో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే ధరలు పడిపోతే అదే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ప్రతిస్పందనాత్మక ప్రవర్తనే, పెట్టుబడుల్లో క్రమశిక్షణ, స్థిరత్వం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. మార్కెట్ టైమింగ్ కన్నా, దీర్ఘకాలిక దృష్టితో, విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మార్కెట్ గతంలో ఇచి్చనట్లుగా భవిష్యత్లో కూడా లాభాలను అందిస్తుందనే హామీ ఏమీ ఉండదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమర్థవంతమైన మార్గంఔట్సోర్సడ్ అసెట్ అలొకేషన్. అంటే, మన డబ్బును ఏ ఆస్తిలో ఎంత పెట్టాలి (షేర్లు, బాండ్లు, గోల్డ్, క్యాష్ వంటివి) అనే నిర్ణయాన్ని ఒక ఫండ్ మేనేజర్కే అప్పగించడం.క్లిష్ట పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులుఎప్పటికప్పుడు మారుతూ అస్థిరంగా ఉన్న ప్రపంచ మార్కెట్లలో, ఇటీవల బాగా రాబడులు ఇచ్చిందనే కారణంతో ఒకేరకమైన ఆస్తి తరగతిపైనే పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం కావచ్చు. విభిన్న ఆస్తి తరగతులు ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నాయో చూద్దాం:బంగారం–వెండి: సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడి ఆస్తులుగా భావించే ఈ లోహాలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా కరెన్సీ బలహీనపడినప్పుడు మెరుగ్గా లాభాలను అందిస్తాయి. పరిశ్రమలతో అనుసంధానమై ఉండడం వల్ల ఎక్కువ ఊగిసలాట ఉన్నా వెండిలో అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఈక్విటీలు: వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఆస్తి తరగతి. కానీ వడ్డీ రేట్లు, కంపెనీల లాభాల అంచనాలు, స్థూల ఆర్థిక మార్పులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రాంతాలు, రంగాల మధ్య పనితీరులో పెద్దగా తేడాలు ఉంటాయి.ఫిక్స్డ్ ఇన్కమ్: స్థిరత్వం ఎక్కువ, అంచనా వేయగల ఆదాయాన్ని అందిస్తాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలపై ఒత్తిడి వచ్చినా, రిస్క్ నియంత్రణకు, మూలధన పరిరక్షణకు ఇవి కీలకం. ముఖ్యంగా సంరక్షణాత్మక పెట్టుబడిదారులకు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి ఇవి ఉపయోగం.రియల్ అసెట్స్ ఇతర ప్రత్యామ్నాయాలు: రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీలు ద్రవ్యోల్బణానికి రక్షణనిచ్చే అవకాశముంది. ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అధిక రాబడులు ఇవ్వగలిగినా, ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటాయి.వైవిధ్యీకరణ ఎందుకు కీలకం?: బుల్ మార్కెట్లో ఈక్విటీలు కావొచ్చు, మాంద్య సమయంలో బంగారం కావొచ్చు. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఆస్తి వెంట పరుగులుతీయడం, ఇదిపెట్టుబడుల విషయంలో తప్పు టైమింగ్కు, అధిక ఊగిసలాటకు దారితీస్తుంది. వైవిధ్యీకరణ అంటే, వివిధ పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తించే ఆస్తుల మధ్య పెట్టుబడులను పంచడం. ఇది రిస్క్ను తగ్గిస్తుంది.వైవిధ్యీకరణకి ఉదాహరణ: ఎన్ఎస్ఈ 500 కంపెనీలలో, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31 వరకు, తక్కువ పనితీరు, నిదానమైన వృద్ధి ఉన్న కంపెనీలు, మంచి పనితీరు, అధిక వృద్ధి కంపెనీల కంటే ఎక్కువ రాబడులు ఇచ్చాయి. కానీ ఈ ధోరణి మళ్లీ మారుతోంది. 2024 జూన్ నుంచి, మార్కెట్ మళ్లీ అధిక పనితీరు, అధిక వృద్ధి కంపెనీలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అవి గతంలో ఎదుర్కొన్న అండర్పర్ఫార్మెన్స్లో పావు వంతుకు పైగా రికవరీ సాధించాయి. అందువల ఈక్విటీల పనితీరును బట్టి వైవిధ్యీకరణను పాటించాలి.ఇదీ చదవండి: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లుముగింపు: తరచూ ఒడిదుడుకులకు లోనయ్యే పెట్టుబడుల ప్రపంచంలో, ఆలోచనాత్మకమైన వైవిధ్యీకరణతో బలమైన పోర్ట్ఫోలియో నిర్మించడం తెలివైన పని మాత్రమే కాదు, అవసరం కూడా. అందుకే పెట్టుబడిదారులు తాత్కాలిక రాబడులకన్నా, సమతుల్యత, క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి పెట్టాలి. ప్రఖ్యాతపారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నావల్ రవికాంత్ చెప్పినట్లుగా.. ‘‘జీవితంలో వచ్చే అన్ని రాబడులూ సంపద, సంబంధాలు, జ్ఞానం కలయిక వల్లే వస్తాయి.’’
అప్పుడే తీర్చేయొద్దు!
ఇపుడు ఫోన్ తెరిచి మెసేజ్లు, వాట్సాప్లు చూసినా... మెయిల్ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్ చేసి మరీ... లోన్ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్ యాప్ తెరిచి క్లిక్ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్టెక్ మహిమ. నిజానికి ఈ యాప్లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్ ఛార్జీలెంత? ప్రీపేమెంట్ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి. కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? → రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. → అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు. → పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్ బ్యాంక్లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు. → నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. రుణంతో కలసి సాగడమే.. కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. → రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. → రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు. → నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు. → పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్...→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు. → పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి. → రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. → కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు. → గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. → కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. → ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.ఆదా మామూలుగా లేదుగా..! → రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%. → ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. → రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? → 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది. → ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. → పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వీటిని గమనించాలి.. అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్క్లోజర్ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర కొన్ని బ్యాంక్లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్బై చెప్పేయొచ్చు.
పీఎఫ్ కొత్త రూల్: ఎన్పీఎస్ నుంచి ఇక 80 శాతం విత్డ్రా
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యూటీ ప్లాన్ (క్రమానుగతంగా పింఛను చెల్లించే) కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే ఎన్పీఎస్లో కొనసాగేందుకు అనుమతి ఉంది. దీన్ని ఇప్పుడు 85 ఏళ్లకు పెంచారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను పీఎఫ్ఆర్డీఏ ప్రకటించింది. గెజిట్ ప్రకటించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. పథకం నుంచి వైదొలిగే నాటికి పింఛను నిధి రూ.8లక్షల్లోపు ఉంటే ఆ మొత్తాన్ని సభ్యులు ఒకే విడత, లేక సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో (క్రమానుగతంగా/ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మాదిరి) వెనక్కి తీసుకోవచ్చు. నాలుగేళ్ల విరామంతో సభ్యులు ఇకపై నాలుగు పర్యాయాలు పాక్షిక ఉపసంహరణ చేసు కోవచ్చు. ప్రస్తుతం 3 సార్లకు అనుమతి ఉంది. 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు తర్వాత కొనసాగే వారు మూడేళ్ల విరామంతో మూడు పాక్షిక ఉపసంహరణలే చేసుకోగలరు. ఎన్పీఎస్లో ప్రభుత్వ చందాదారులు సైతం 85 ఏళ్ల వరకు కొనసాగొచ్చు. అంటే 85 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడులను సైతం కొనసాగించుకోవచ్చు. వీరు పథకం నుంచి వైదొలిగే సమయంలో కనీసం 40 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఒకే విడత లేదా క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. రాజీనామా లేక తొలగింపు కారణంగా పథకం నుంచి మందుగా వైదొలిగే ప్రభుత్వ చందాదారులు.. పింఛను నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. పింఛను నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే.. సాధారణ వైదొలగడం, ముందస్తుగా వైదొలగడం లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.


