Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

How To Changes Your Address in Aadhaar App1
ఆధార్ యాప్ ద్వారా అడ్రస్ చేంజ్: చాలా సింపుల్

ఆధార్‌ కార్డులో చిరునామా మార్చుకోవాలంటే.. ఒకప్పుడు మీసేవ లేదు ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో.. ఇంట్లో కూర్చునే అడ్రస్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ యాప్‌ ద్వారా కూడా దీనిని అప్డేట్ చేసుకోవచ్చు.అవసరమయ్యే డాక్యుమెంట్స్ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి గుర్తింపు కార్డుగా.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు మొదలైనవాటిలో ఎదో ఒకటి కావాలి.అడ్రస్ అప్డేట్ చేయడం ఎలా?➤యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.➤యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత.. ఆధార్ నెంబర్ & ఓటీపీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.➤తరువాత కెమెరా స్క్రీన్‌లో.. మీ ముఖాన్ని చూపిస్తూ, గ్రీన్ లైట్ వచ్చేవరకు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళుమూసి తెరవాలి.➤ఫేస్ డిటెక్షన్ పూర్తయిన తరువాత.. హోమ్ పేజీకి వెళ్తారు. అక్కడ సర్వీసెస్ విభాగంలో.. మై ఆధార్ అప్‌డేట్ సెలక్ట్ చేసుకోవాలి.➤అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందుబాటులో ఉందో ఎంచుకుని.. కంటిన్యూ చేయాలి.➤డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది.➤అయితే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కనిపిస్తుంది, కాబట్టి మీరు మార్చాలన్న కొత్త చిరునామా ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి.➤మీరు 'ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్' క్లిక్ చేస్తే, మీ ముఖం మళ్లీ ధృవీకరించబడుతుంది.➤ఇవన్నీ పూర్తయిన తరువాత .. ఆన్‌లైన్‌లో 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

From PAN Aadhaar Rules To Credit Score Updates From January 1st 20262
మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు..

2025 ముగియడంతో.. 2026 ప్రారంభం నుంచి అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవి జీతం పొందే వారిని, యువత, సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తాయి. కొత్తగా వచ్చిన రూల్స్ గురించి వివరంగా..పాన్ కార్డుకు ఆధార్ లింక్‌పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ గడువును పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నేటి నుంచి పాన్ - ఆధార్ లింక్ చేయడం కుదరదు. దీనివల్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయలేరు. ట్యాక్స్‌ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్‌, షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.క్రెడిట్ స్కోర్ అప్‌డేట్‌ఇప్పటివరకు బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. అంటే.. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌లో చాలా వేగంగా ప్రతిబింబిస్తాయి.ఎల్‌పీజీ సిలిండర్ ధరలు2026 సంవత్సరం మొదటి రోజు నుంచి ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెరిగింది. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.మెరుగైన డిజిటల్ చెల్లింపు భద్రతమోసాలను అరికట్టడానికి బ్యాంకులు UPI లావాదేవీలపై కఠినమైన తనిఖీలను, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మరింత బలమైన సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేస్తాయి.పిఎం కిసాన్ గుర్తింపు కార్డులుభారత ప్రభుత్వం PM-Kisan పథకం కోసం కొత్త రైతు ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఐడీకి.. రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్ & బ్యాంక్ వివరాలు అనుసంధానించబడి ఉంటాయి.

Commercial LPG Cylinder Prices Hiked By Rs 111 on New Year3
భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

2026 సంవత్సరం మొదటి రోజు భారతదేశం అంతటా.. హోటళ్ళు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను రూ.111 పెంచాయి. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది.ముంబైలో కూడా ఇదే విధంగా రూ.1,531.50 నుంచి రూ.1,642.50కి పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1,684 నుంచి రూ.1,795కి పెరిగింది. చెన్నైలో అత్యధిక ధరలు (రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి) నమోదయ్యాయి. ధరలు పెరగడం వల్ల.. రోజువారీ కార్యకలాపాలకు గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders. The rate of the 19 KG commercial LPG gas cylinder has been increased by Rs 111, effective from today, 1st January.In Delhi, the retail sale price of 19kg commercial LPG cylinder is now Rs 1691.50…— ANI (@ANI) January 1, 2026

India Surpasses Japan And When It May Overtake Germany Economy4
ఆర్ధిక వ్యవస్థలో భారత్.. జర్మనీని అధిగమించాలంటే?

2025 చివరి నాటికి భారతదేశం జపాన్‌ను అధిగమించి.. ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సమీక్ష ప్రకారం.. ఇండియా జీడీపీ 4.18 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక మన దేశం ముందున్న టార్గెట్ జర్మనీని అధిగమించడమే.అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగవ స్థానంలో నిలిచిన భారత్.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ఇప్పుడు నాలుగవ స్థానం నుంచి జర్మనీని అధిగమించి.. మూడో స్థానంలోకి చేరుకోవడానికి గట్టిగా కృషి చేయాలి. దేశం మరింత సమృద్ధిగా మారాలి. 2030 నాటికి భారత్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.లక్షలాది ఉద్యోగాలు అవసరంజనాభా పరంగా.. భారతదేశం 2023లో దాని పొరుగు దేశమైన చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో మాత్రం నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2024లో భారతదేశ తలసరి జీడీపీ 2,694 డాలర్లుగా ఉంది. ఇది జపాన్ కంటే 12 రెట్లు, జర్మనీ కంటే 20 రెట్లు తక్కువ.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది 10-26 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. కాబట్టి దేశం లక్షలాది మంది యువ గ్రాడ్యుయేట్లకు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది.రూపాయి పతనం & ఆర్థిక సవాళ్లుఅమెరికాతో వాణిజ్య ఒప్పందం లేకపోవడం, దేశ వస్తువులపై సుంకాల ప్రభావం గురించి కొనసాగుతున్న ఆందోళనల కారణంగా, డిసెంబర్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ భారీగా తగ్గింది. 2025లో రూపాయి విలువ దాదాపు ఐదు శాతం పడిపోయింది.2047 నాటికి..ప్రస్తుతం.. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఈ ఊపును ఇదే మాదిరిగా కొనసాగిస్తూ.. 2047 నాటికి (స్వాతంత్య్రం వచ్చి వందేళ్ల సందర్భంగా) అధిక మధ్య ఆదాయ స్థితిని సాధించాలనే ఆశయంతో, దేశం ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు & సామాజిక పురోగతి యొక్క బలమైన పునాదులపై నిర్మిస్తోంది" అని ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!

New Year Gold and Silver Price 1st January 2026 in India5
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..

వరుసగా మూడు రోజులు తగ్గిన తరువాత.. బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. నేడు (2026 జనవరి 1) గరిష్టంగా హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 170 రూపాయలు పెరిగింది. చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల రేటు రూ. 400 తగ్గింది. వెండి రేటు మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Kumar Mangalam Birla Says India Economic Rise On Kaun Banega Crorepati6
సీఏ చేయకపోతే స్థానం లేదన్నారు.. అప్పుడే గొప్ప పాఠం నేర్చుకున్నా!

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్.. కుమార్ మంగళం బిర్లా ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన భారతదేశ ఆర్థిక పెరుగుదల గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా వెల్లడించారు.కుమార్ మంగళం బిర్లా.. భారతదేశం నేడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేర్కొన్నారు. నా కెరీర్ ప్రారంభంలో.. భారతదేశం ఒక రోజు ఆర్థికంగా జపాన్‌ను అధిగమిస్తుందని ఊహించలేదు. అయితే ఈ వేగవంతమైన మార్పు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. యువతకు.. భారతదేశంలో ఉండటానికి ఇంతకంటే మంచి సమయం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారతదేశం గురించి మాత్రమే కాకుండా.. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. తాను విదేశాల్లో ఎంబీఏ చదవాలని అనుకున్నట్లు, అయితే.. తన తండ్రి మాత్రం ముందు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హత సాధించాలని కఠినంగా ఆదేశించారు. సీఏ చేయకపోతే కుటుంబ వ్యాపారంలో స్థానం లేదని తండ్రి స్పష్టంగా చెప్పడంతో బిర్లా భావోద్వేగానికి లోనైనట్లు చెప్పారు.తండ్రి సీఏ చేయమని చెప్పినప్పుడు.. నేను నా తాత దగ్గరకు వెళ్లాను. కానీ తాత జోక్యం చేసుకోవడానికి నిరాకరించి, స్వయంకృషితో ఈ సవాలును ఎదుర్కోవాలని సూచించారు. తల్లిని అడిగినప్పుడు.. ''కన్నీళ్లతో అయినా నవ్వుతో అయినా సీఏ పూర్తి చేయాల్సిందే'' అని చెప్పినట్లు, ఆ మాటలు నా మనసులో బలంగా నిలిచిపోయినట్లు కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు.ఇదీ చదవండి: సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!ఆ అనుభవం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నానని కుమార్ మంగళం బిర్లా తెలిపారు. జీవితంలో గానీ, వృత్తిలో గానీ నమ్మకం & గౌరవం అనేవి శ్రమతోనే సంపాదించాల్సి ఉంటుందని, దానికి ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. View this post on Instagram A post shared by @sonytvofficial

Advertisement
Advertisement
Advertisement