Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IDFC First Bank flags Rs 590 crore fraud in Haryana govt linked accounts1
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్‌..

ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్‌ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్‌తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Vivo Launches V70 Series with ZEISS Triple Camera Setup in India2
వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్‌’ ట్రిపుల్‌ కెమెరాతో..

న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్‌ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్‌’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్‌’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్‌ పార్ట్‌నర్‌షిప్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది.50 మెగా పిక్సెల్‌(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ జీస్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్‌ కార్నర్లతో ప్రీమియం లుక్‌ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుకు, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తాయి.ఈ రెండూ ఆండ్రాయిడ్‌ 16తో కూడిన ఆరిజన్‌ ఓఎస్‌6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 11 గంటల నావిగేషన్‌ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్‌ తగ్గించడానికి ‘బైపాస్‌ ఛార్జింగ్‌’ సౌకర్యం కూడా ఉంది.వివో వీ70 ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌4 ప్రాసెసర్‌ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.49,999కు లభిస్తుందివివో వీ70 ఎలైట్‌ ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌జెన్‌3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్‌ ధర రూ.61,999గా నిర్ణయించింది.ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్‌ బ్యాంక్‌ కార్డులపై 10% వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్‌ బడ్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఆన్‌లైన్‌ స్టోర్లలో లభిస్తున్నాయి.

Battle for an Affordable Home in Hyderabad House Construction Tips3
సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

ఓ సామాన్యుడు నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలనే ఆశకు రోజురోజుకూ దూరమవుతున్నాడు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలు ఆలోచనను వెనక్కి నెడుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు, నిర్మాణ అనుమతుల జాప్యం, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్య కార్మికుల కొరత.. వంటి రకరకాల కారణాలతో తక్కువ ఆదాయం కలిగిన వారికి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు గృహాల నిర్మాణం కష్టంగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం పన్నులు, రుసుములను తగ్గించి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సరసమైన గృహాల నిర్మాణానికి చేయూత అందిస్తే.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందని నిర్మాణ సంఘాలు సూచిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్కెట్‌లో సరసమైన ఇళ్ల లభ్యత మున్ముందు మరింత తగ్గిపోనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో పెరిగిన ఇళ్ల ధరల తీరు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. సొంతిల్లు కొనగలమా లేదా? అని సామాన్య మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అన్ని వర్గాలకు నగర మార్కెట్‌లో గృహాలు అందుబాటులో ఉన్నాయని, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవచ్చని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. బడ్జెట్‌ ప్రధానం అనుకున్నప్పుడు విస్తీర్ణం పరంగా కొంత రాజీపడితే సరసమైన ఇళ్లు దొరుకుతాయని నిర్మాణదారులు సూచిస్తున్నారు.సొంతింటి కోసం సాయం అందుకోలేని దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని నిర్మాణ రంగ సంఘాలు కోరుతున్నాయి. భూమి ధరలు పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తోంది. శ్రీమంతులు విలాసవంతమైన నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ సాయం అందక సొంతంగా కట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యను గురించి అప్పట్లో నేషనల్‌ అర్బన్‌ హౌసింగ్‌ హ్యాబిటేట్‌ పాలసీ(ఎన్‌యూహెచ్‌హెచ్‌పీ) తీసుకొచ్చింది. వీరి కోసం కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో 10 నుంచి 15 శాతం భూమిని, 20–20 శాతం ఫ్లోర్‌ ఏరియా రేషియో(ఎఫ్‌ఏఆర్‌)ను రిజర్వ్‌ చేసేవారు.ఆ రకంగా ప్రైవేటు డెవలపర్లు సరసమైన గృహాలను నిర్దేశిత శాతం మేరకు నిర్మించేవారు. ప్రభుత్వం బిల్డర్లకు తక్కువ ధరలో భూమి ఇస్తే అక్కడ నిర్మాణాలు చేపట్టి తక్కువ ధరకు ఇల్లు అందించేవారు. కొత్తపేటలో నిర్మించిన హుడా కాలనీ ఇందుకు నిదర్శనం. హెచ్‌ఎండీఏ లే అవుట్లలోనూ ఎల్‌ఐజీ పేరుతో తక్కువ విస్తీర్ణంలో 60 గజాల్లో దొరికే స్థలాలు ఉండేవి. ఈ నిబంధన తొలగించడంతో 150 నుంచి 160 గజాల కంటే తక్కువ దొరకడం లేదు. దీంతో స్థలాలు కొని ఇల్లు కట్టుకుందామంటే ఖరీదుగా మారాయి.అదనపు వసూళ్లతో మరింత భారం.. ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతంలో చూసినా చదరపు అడుగు ధర సగటున రూ.6 వేలకు పైగానే పలుకుతోంది. ఈ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రూ.4 వేలకు చ.అ. విక్రయిస్తున్న ప్రాంతాలు ఉన్నా దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, మెరుగైన మౌలిక సదుపాయలు ఉన్నచోట రూ.80 లక్షలు లేనిదే ఇల్లు రావడం లేదు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి రూ.కోటి పెట్టాల్సిందే. ఐటీ కారిడార్‌లో ఏకంగా రూ.కోట్ల పైమాటే.. అదనపు వసూళ్లతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఒక్కోటి కొత్తగా వచ్చి చేరుతున్నాయి. గతంలో కారు పార్కింగ్‌ ఒక్కదానికే ఛార్జ్‌ చేసేచారు. ఇప్పుడు ఇన్‌ఫ్రా, క్లబ్‌హౌస్‌ చార్జీలు, గ్యాస్‌ పైపులైన్‌ కనెన్షన్‌కు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవి సామాన్య వర్గాలకు భారంగా మారుతున్నాయి. తక్కువ విస్తీర్ణం కారణంగా.. కొన్ని కొత్త నిర్మాణాల్లో వీటి కోసమే రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా జీఎస్టీ, రిజి్రస్టేషన్, స్టాంప్‌ డ్యూటీ తలకు మించిన భారంగా సామాన్య, ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కొందరు బిల్డర్లు సరసమైన ధరల ఇళ్లు నిర్మిస్తున్నారు. 800–1,000 చ.అ. విస్తీర్ణంలో రెండు పడక గదుల ఫ్లాట్లు, 350 చ.అ. విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్‌మెంట్లనూ కడుతున్నారు. ఇవన్నీ సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారుల నుంచి తక్కువ విస్తీర్ణం కారణంగా ఆశించిన మేర స్పందన లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశానికి దూరమని, ఇప్పటికిప్పుడు అక్కడ ఉండలేమని కూడా కొందరు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

India's Forex Reserves Hit All Time High Gold Reserves Rise To4
ఫారెక్స్‌ ఆల్‌టైమ్‌ హై.. బంగారం 128.46 బిలియన్‌ డాలర్లు

ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్‌ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్‌ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్‌ డాలర్లు పెరిగి 573.60 బిలియన్‌ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్‌ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 128.46 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 103 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Core infra sectors growth slows down to 4percent in January5
మౌలిక రంగం మందగమనం 

న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల్లో పనితీరు జనవరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిదానించింది. వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. గతేడాది జనవరిలో వృద్ధి రేటు 5.1 శాతం కాగా, గత డిసెంబర్‌లోనూ 4.7 శాతం స్థాయిలో ఉండడం గమనించొచ్చు. ముఖ్యంగా మడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి సైతం ఫ్లాట్‌గా నమోదైంది. ఇక బొగ్గు ఉత్పత్తి 3.1 శాతానికి పరిమితమైంది. 2025 జనవరిలో బొగ్గు ఉత్పత్తి 4.6 శాతంగా ఉంది. సిమెంట్‌ ఉత్పత్తి 10.7 శాతం వృద్ధికి తగ్గింది. 2025 జనవరిలో ఇది 14.3 శాతం పెరగడం గమనార్హం. ఎరువులు, స్టీల్, విద్యుదుత్పత్తి గతేడాది జనవరితో పోలి్చతే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 2.8 శాతానికి తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతంగానే ఉంది. ఎనిమిది రంగాలకు గాను ఏడింటిలో వృద్ధి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు. ఈ ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2025 డిసెంబర్‌లో ఉన్న 7.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 5.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు.

India digital payments revolution continues to set new Records6
డిజిటల్‌ విప్లవం: క్యాష్‌కు చెక్‌..  యూపీఐదే హవా!

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం సామాన్యుడి జీవనశైలిని సమూలంగా మార్చేసింది. చిల్లర కష్టాలకు చెక్‌ పెడుతూ.. గల్లీ లోని కిరాణా షాపు నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ఎక్క డ చూసినా ఇప్పుడు ‘స్కాన్‌ అండ్‌ పే’ మంత్రమే మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రూపే డెబిట్‌ కార్డులు, తక్కువ–విలువ కలిగిన భీమ్‌–యూపీఐ లావాదేవీల వల్ల దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) సంయుక్తంగా విడుదల చేసిన ‘సామాజిక–ఆర్థిక ప్రభావ విశ్లేషణ’ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని ఇప్సోస్‌ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించింది. యూపీఐ సంచలనం.. రికార్డుల మోత గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు ఏకంగా 11 రెట్లు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,071 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ లావాదేవీల సంఖ్య 2024–25 నాటికి 22,831 కోట్లకు చేరింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో ఒకప్పుడు కేవ లం 4 శాతంగా ఉన్న యూపీఐ వాటా.. ఇప్పు డు ఏకంగా 80 శాతానికి చేరుకుని అగ్రగామిగా నిలిచింది. పీర్‌–టు–మర్చంట్‌ అంటే వినియోగదారు లు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో 26 రెట్ల భారీ వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌–టైమ్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 49% వాటాతో మన దేశం గ్లోబల్‌ లీడర్‌గా కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిన ఏటీఎం క్యూలు దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరగడంతో జేబులో నగదు పెట్టుకుని తిరిగే వారి సంఖ్య గ ణనీయంగా తగ్గింది. నివేదిక ప్రకారం.. 59% మంది వినియోగదారులు, 57% మంది వ్యాపారులు తమ దైనందిన జీవితంలో నగదు వాడకం బాగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు. నగదు డ్రా చేసేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారుల సంఖ్య 69% మేర తగ్గిపోగా, ఏటీఎంల నుంచి డబ్బు లు డ్రా చేయడం 62% మేర పడిపోయింది. వ్యాపారుల్లో ఏటీఎం విత్‌డ్రాలు 61% మేర తగ్గాయి. జీడీపీకి భారీ ఆర్థిక ఊతం నగదు నిర్వహణ ఖర్చులు తగ్గడం, డిజిటల్‌ లావాదేవీల్లో పారదర్శకత పెరగడం ద్వారా యూపీఐ ఏకంగా భారత జీడీపీకి (2022 సంవత్సరంలో) అదనంగా 16.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) జోడింపును అందించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. లావాదేవీలపై అదనపు రుసుములు లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. మారుమూల ప్రాంతాల్లోనూ మారుమోగుతున్న ‘స్కాన్‌ అండ్‌ పే’ డిజిటల్‌ చెల్లింపుల మద్దతు కేవలం మహానగరాలకే పరిమితం కాలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాల్లోనూ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వృద్ధి రేటును గమనిస్తే.. లక్షదీ్వప్‌లో ఏకంగా 136%, మేఘాలయలో 83%, జమ్మూకాశీ్మర్‌లో 76% మేర యూపీఐ లావాదేవీల వృద్ధి నమోదైంది. వినియోగదారులు ఏమనుకుంటున్నారు? చాలా సులభంగా వాడుకునే వీలుండటం (63%), తక్షణమే ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరగడం (59%) వల్లే యూపీఐను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వినియోగదారులు సర్వేలో తెలిపారు. క్యాష్‌బ్యాక్‌ ఆఫ ర్లు (52%), మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం (37%), మెరుగైన భద్రతా ఫీచర్లు (36%) లాంటివి డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నా యి. మరింత మందికి చేరువయ్యేందుకు స్థానిక భాష ల్లో యాప్స్‌ అందుబాటులో ఉండాలని 21% మంది అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నగదు కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరిగిన సగటు భారతీయుడు.. ఇప్పుడు తన స్మార్ట్‌ఫోన్‌నే బ్యాంక్‌గా మా ర్చుకుని పారదర్శకమైన ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాడని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement
Advertisement