Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Buying Your First Home Hidden Costs You Must Know House Construction Tips1
ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా?

సొంతిల్లు.. సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. తొలి ఇంటి కొనుగోలు మధ్యతరగతి కుటుంబానికి ఓ మైలురాయి. అయితే, మొదటిసారి ఇల్లు కొనేవారు కేవలం ఆస్తి విలువ (Market Value), నెలవారీ ఈఎంఐ (EMI) లెక్కలతోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ నుంచి మెయింటెనెన్స్ వరకు ఎదురయ్యే 'అదనపు బాదుడు' గురించి అవగాహన లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రారంభంలోనే భారీ భారంఆస్తి కొనుగోలులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, లీగల్ ఛార్జీలు, బ్రోకరేజ్, గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజులు వంటి లావాదేవీ ఖర్చులు ముఖ్యమైన భాగం. ఇవి సాధారణంగా ముందస్తుగా చెల్లించాల్సి ఉండటంతో, కొనుగోలుదారుడి నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఖర్చులను రుణంగా పొందడం కష్టం కాబట్టి డౌన్ పేమెంట్‌కు తోడు అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుంది.ఫర్నిషింగ్, ఫిట్-అవుట్ ఖర్చులుఇల్లు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు ఫర్నిచర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్స్ వంటి ఖర్చులు తప్పనిసరి అవుతాయి. ముఖ్యంగా అన్‌ఫినిష్డ్ లేదా కొత్తగా నిర్మించిన ఇళ్ల విషయంలో ఫిట్-అవుట్ ఖర్చులు మరింత పెరుగుతాయి. ఇవి చిన్నచిన్న ఖర్చులుగానే కనిపించినా, అన్నీ కలిపి పెద్ద మొత్తానికి చేరుతాయి.పునరావృత ఖర్చులుఇల్లు కొనుగోలు తర్వాత నిర్వహణ చార్జీలు, ఆస్తి పన్ను, గృహ బీమా, మరమ్మతులు, అపార్ట్‌మెంట్ సొసైటీ ఫీజులు వంటి ఖర్చులు నిరంతరం ఉంటాయి. అద్దెదారులతో పోలిస్తే యజమానులు ఈ ఖర్చులను నేరుగా భరించాల్సి రావడం వల్ల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారంగా మారుతుంది.ఈఎంఐలే కాదు.. వడ్డీ చూసుకోవాలిచాలా మంది కొనుగోలుదారులు ‘తక్కువ ఈఎంఐ’ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ గృహ రుణం మొత్తం కాలపరిమితిలో చెల్లించాల్సిన వడ్డీని పరిగణనలోకి తీసుకోరు. 20–30 సంవత్సరాల దీర్ఘకాల రుణాలలో, మొత్తం చెల్లింపు ఆస్తి అసలు ధర కంటే గణనీయంగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే, ఈఎంఐ తక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో భారీ వడ్డీ భారం ఉంటుంది.అవకాశ వ్యయండౌన్ పేమెంట్ కోసం వినియోగించే పెద్ద మొత్తాన్ని ఇతర పెట్టుబడుల్లో పెట్టి ఉంటే వచ్చే లాభాన్ని కోల్పోవడం ‘అవకాశ వ్యయం’గా పరిగణించాలి. అలాగే, అధిక ఈఎంఐల వల్ల భవిష్యత్ పొదుపులు, పెట్టుబడులపై పరిమితులు ఏర్పడతాయి. ఇది ఆర్థిక స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశంగా నిపుణులు చెబుతున్నారు.సమగ్ర ప్రణాళిక అవసరంఇల్లు కొనుగోలు జీవితంలో ఒక కీలక మైలురాయి అయినప్పటికీ, అది ఆర్థికంగా భారంగా మారకుండా ముందస్తు ప్రణాళిక అత్యంత అవసరం. కేవలం ఆస్తి ధర లేదా ఈఎంఐల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల స్థోమత తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అన్ని అనుబంధ ఖర్చులను ముందుగానే అంచనా వేసి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలను విశ్లేషించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్లు!

ICICI Axis Bank Launch Biometric Authentication for UPI Card Payments2
బయోమెట్రిక్‌తో యూపీఐ, కార్డు చెల్లింపులు

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ ఐమొబైల్‌ యాప్‌లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్‌ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్‌ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్‌ నంబరును ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్‌ బ్యాంక్, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్‌ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌హోల్డర్లు ఫేస్‌ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది.

Dollar Industries Founder Deen Dayal Gupta Passes Away at 883
డాలర్‌ ‘బిగ్‌ బాస్‌’ గుప్తా కన్నుమూత

కోల్‌కతా: హౌజరీ ఉత్పత్తుల సంస్థ డాలర్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్‌ దీన్‌దయాళ్‌ గుప్తా (88) కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. 1937 సెప్టెంబర్‌ 13న హర్యానాలోని మాన్హేరు గ్రామంలో జన్మించిన గుప్తా 1962లో కోల్‌కతాకి చేరుకుని, హౌజరీ ఉత్పత్తుల తయారీ, విక్రయ వ్యాపారాన్ని చేపట్టారు.1972లో డాలర్‌ ఇండస్ట్రీస్‌కి పునాది వేశారు. అయిదు దశాబ్దాల పాటు సారథ్యం వహిస్తూ రూ. 1,700 కోట్ల ఆదాయాలు గల అగ్రగామి హౌజరీ, దుస్తుల తయారీ దిగ్గజంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో పలు పురస్కారాలు అందుకున్నారు.

Rohit Jain Appointed as RBI Deputy Governor4
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యుటీ గవర్నర్‌ టి. రవి శంకర్‌ స్థానంలో రోహిత్‌ జైన్‌ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ నియామక కమిటీ (ఏసీసీ) రోహిత్‌ జైన్‌ నియామకానికి ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జైన్‌ ఆర్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. రవి శంకర్‌కు పొడిగించిన పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జైన్‌ మే 3వ తేదీ లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్‌బీఐ చట్టం–1934 ప్రకారం, కేంద్ర బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి.వీరిలో ఇద్దరిని రిజర్వ్‌ బ్యాంక్‌ అంతర్గత అధికారుల నుంచి, ఒకరిని కమర్షియల్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి, మరొకరిని మానిటరీ పాలసీ విభాగానికి నేతృత్వం వహించేలా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఆర్‌బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్‌.సి. ముర్ము, పూనమ్‌ గుప్తా, స్వామినాథన్‌ జే తదితరులు ఉన్నారు.

Kotak Mahindra Bank Q4 net profit rises 13percent YoY to Rs 4,027 crore5
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం రూ. 4,027 కోట్లు

న్యూఢిల్లీ: రుణాల వృద్ధి, మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ తగ్గుదల వంటి సానుకూలాంశాల ఊతంతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 4,027 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌ ప్రాతిపదికన) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 3,663 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం అధికం. లాభం సుమారు రూ. 3,737 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ. 7,284 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ. 7,876 కోట్లకు పెరిగింది. రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై బ్యాంక్‌ బోర్డు రూ. 0.65 మేర డివిడెండ్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాబోయే రోజుల్లో మార్జిన్లు నిర్దిష్ట శ్రేణికి పరిమితం కావచ్చని బ్యాంక్‌ గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ దేవాంగ్‌ ఘీవాలా తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్‌ వేల్యుయేషన్‌ భారీగా ఉండటం వల్లే దాని కోసం పోటీపడలేదని ఎండీ అశోక్‌ వాస్వానీ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధర కన్నా తక్కువ రేటుకే బిడ్లు రావడమనేది అంచనాలకి, వాస్తవానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాపారం యథాప్రకారంగానే ఉన్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు సహా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధించి ఇతరత్రా ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గృహ రుణాల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు గణనీయంగా ఉనట్లు పేర్కొంది. సైబర్‌ రిస్క్ లు, ఏఐ సంబంధ ముప్పులను ఎదుర్కొనేందుకు సిస్టమ్స్‌ను పటిష్టం చేసుకోవడంపై బ్యాంకు మరింతగా పెట్టుబడులు పెడుతోంది.మరిన్ని విశేషాలు..→ నిర్వహణ లాభం వార్షికంగా 7 శాతం పెరిగి రూ. 5,855 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.8 శాతం వృద్ధితో రూ. 14,175 కోట్లకు, వడ్డీ వ్యయాలు 0.9 శాతం పెరిగి రూ. 6,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం 2.1 శాతం క్షీణించి రూ. 3,116 కోట్లకు తగ్గింది. → అసెట్‌ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.30 శాతం నుంచి 1.20 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.31 శాతం నుంచి 0.25 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రొవిజనింగ్‌ గణనీయంగా 43 శాతం మేర తగ్గి రూ. 909 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు నెమ్మదించి, లాభాలకు ఊతమిచ్చింది. → నికర వడ్డీ మార్జిన్‌ వార్షికంగా 4.97 శాతం నుంచి 4.67 శాతానికి చేరింది. క్రితం క్వార్టర్‌లో ఇది 4.54 శాతంగా నమోదైంది. నిధుల సమీకరణ వ్యయాలు 5.09 శాతం నుంచి 4.45 శాతానికి తగ్గాయి. → 2026 మార్చి 31 నాటికి నికరంగా రుణాలు 16 శాతం వృద్ధితో రూ. 4.96 లక్షల కోట్లకు చేరాయి. → మొత్తం డిపాజిట్లు 15 శాతం వృద్ధి చెంది రూ. 5.72 లక్షల కోట్లకు చేరగా, కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) నిష్పత్తి 43.3 శాతంగా ఉంది. రుణ, డిపాజిట్ల నిష్పత్తి 86.6 శాతంగా ఉంది. → స్లిప్పేజీలు 32 శాతం తగ్గి రూ. 1,018 కోట్లకు దిగి వచ్చాయి. → మొత్తం కస్టమర్ల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. → కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన లాభం 10 శాతం వృద్ధితో రూ. 4,933 కోట్ల నుంచి రూ. 5,423 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 19,288 కోట్లుగా నమోదైంది.

India April Exports Rise Despite West Asia Crisis6
ఏప్రిల్‌లో సానుకూలంగా ఎగుమతులు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ.. దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెల మొదటి మూడు వారాల్లో మంచి పనితీరు చూపించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు చెప్పారు. భారత్‌ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీ పరిశ్రమకు మంచి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెల ఎగుమతులు, దిగుమతుల డేటాను వాణిజ్య శాఖ మే 15న విడుదల చేయనుంది. మార్చి నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. హర్మూజ్‌ జలసంధి మూసివేతతో ఎగుమతులు ఇతర మార్గాల ద్వారా వెళుతున్నట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పురోగతి గురించి మాట్లాడుతూ.. వారం క్రితం సంప్రదింపులు చక్కగా కొనసాగినట్లు చెప్పారు. అవి ఇక ముందూ కొనసాగుతాయన్నారు. యూఏఈ, యూకే, ఐరోపా సమాఖ్యతో పాటు నాలుగు ఐరోపా దేశాల కూటమి ఈఎఫ్‌టీఏతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడాన్ని ప్రస్తావించారు. మరో 12 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. చిలీ, పెరూ, ఇజ్రాయెల్, గల్ఫ్‌ సహకార సమాఖ్య, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, యూరేíÙయా ప్రాంత దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు మంత్రి గోయల్‌ వెల్లడించారు. 2025–26లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 88 బిలియన్‌ డాలర్లు లేదంటే 90 బిలియన్‌ డాలర్లు దాటి ఉండొచ్చన్నారు.

Advertisement
Advertisement
Advertisement