Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Three Companies Line Up IPOs to Raise Over Rs 3000 Crore1
పబ్లిక్‌ ఇష్యూకు మూడు కంపెనీలు

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,000–1,053 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 1,900 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్‌ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 3,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 20న షేర్లను ఆఫర్‌ చేయనుంది. తొలుత 2025 ఆగస్ట్‌ దరఖాస్తులో రూ. 5,200 కోట్ల సమీకరణకు సిద్ధపడినప్పటికీ పరిమాణాన్ని కుదించింది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,125 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. మార్చి 2న లిస్ట్‌కానున్న కంపెనీ రూ. 12,325 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.కంపెనీ తీరిలా 2010లో ఏర్పాటైన రెనెవబుల్‌ ఎనర్జీ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ప్రధానంగా వాణిజ్య(కమర్షియల్‌), పారిశ్రామిక(ఇండ్రస్టియల్‌) రంగాలకు పవన, సౌర, హైబ్రిడ్‌(పునరుత్పాదక) విద్యుత్‌ సరఫరాసహా ఇంధన సరీ్వసులను అందిస్తోంది. ఆయా రంగాలకు నెట్‌ జీరో, కర్బననిర్మూలన సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. 2025 జూలై 31కల్లా కంపెనీ 2.54 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు.. మరో 2.53 జీడబ్ల్యూ కాంట్రాక్ట్‌డ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 5.07 జీడబ్ల్యూ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024–25లో ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,610 కోట్లను అధిగమించింది. నష్టాల నుంచి బయటపడి రూ. 28 కోట్ల నికర లాభం ఆర్జించింది. డేటా సెంటర్లు, ఏఐ, టెక్నాలజీ, సిమెంట్, స్టీల్‌ తది తర రంగాల క్లయింట్లకు సరీ్వసులు అందిస్తోంది.గౌడియం ఐవీఎఫ్‌ ఐపీవో 20న ఫెర్టిలిటీ సర్వీసుల సంస్థ గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 75–79 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనుంది. దీనిలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్‌ మనికా ఖన్నా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా సంస్థ రూ. 165 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్‌ చేయనుంది. వెరసి కృత్రిమ గర్భధారణ(ఫెర్టిలిటీ) సరీ్వసులందించే సంస్థ తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను దేశవ్యాప్తంగా 19 కొత్త ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు వెచ్చించనుంది. రూ. 20 కోట్లు రుణచెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఈ నెల 27న లిస్ట్‌కానున్న సంస్థ రూ. 575 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.కంపెనీ తీరిలా ఖన్నా ఏర్పాటు చేసిన గౌడియం ఐవీఎఫ్‌ దేశీయంగా రీప్రొడక్టివ్‌ టెక్నాలజీలలో సుప్రసిద్ధమైంది. 7 ప్రధాన కేంద్రాలుసహా 28 అనుబంధ విభాగాల ద్వారా సంస్థ సేవలు సమకూర్చుతోంది. 2024–25లో ఆదాయం రూ. 48 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ. 10 కోట్ల నుంచి రూ. 19 కోట్లకు జంప్‌చేసింది. కంపెనీ తొలుత(జనవరిలో) 1.83 కోట్ల ఈక్విటీ షేర్ల జారీసహా.. ప్రమోటర్‌ 25.31 లక్షల షేర్లు ఆఫర్‌ చేయనున్నట్లు పేర్కొంది. తదుపరి వీటి సంఖ్యను సవరించింది. ఐపీవో చేపట్టేందుకు 2025 జూలైలో గోప్యతా మార్గంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.కార్ల్స్‌బెర్గ్‌ ఐపీవో చూపు మాల్ట్‌ పానీయాల డెన్మార్క్‌ దిగ్గజం కార్ల్స్‌బెర్గ్‌ దేశీ బిజినెస్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని యోచిస్తోంది. తద్వారా వాటాదారులకు విలువ చేకూర్చాలని చూస్తున్నట్లు గ్రూప్‌ సీఈవో జాకబ్‌ ఆరుప్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. అయితే పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. దేశీయంగా పటిష్ట వృద్ధిని సాధిస్తున్న కంపెనీ దేశీ బిజినెస్‌ను లిస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. సంస్థ వాటాదారుల విలువ పెంచేందుకు ఐపీవోసహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇంతకుమించి మాట్లాడేందుకు చట్ట సంబంధిత అంశాలు అడ్డుపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్‌ అంశంపై స్పందించలేనని, అయితే వాటాదారులకు విలువ చేకూర్చడంపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.

Kia Seltos Crosses 6 Lakh Unit Production Milestone In India2
కియా తొలి మోడల్‌.. 6 లక్షల కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్‌ (Kia Seltos) మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఉత్పత్తి 6 లక్షల యూనిట్లను అధిగమించినట్లు కియా ఇండియా ప్రకటించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తూ వస్తోంది. సెల్టోస్.. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి మోడల్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రెండో తరం వెర్షన్‌లో అందుబాటులో ఉంది.కియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సెల్టోస్ అమ్మకాలలో సుమారు 29 శాతం వాటా టాప్ వేరియంట్లదే. అధునాతన భద్రతా సాంకేతికతలు, అధిక సౌకర్యాలున్న ఫీచర్ రిచ్ వెర్షన్లను కస్టమర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.సెల్టోస్‌ను ప్రారంభం నుంచే ప్రత్యేకతతో రూపుదిద్దినట్లు కియా ఇండియా పేర్కొంది. విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ ఈ ఎస్‌యూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. ఈ మోడల్‌లో మూడు 1.5 లీటర్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 115 హెచ్‌పీ శక్తినిచ్చే సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌‌ ఉన్నాయి.ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా విస్తృత ఎంపికలు కల్పించింది. సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ; డీజిల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్; టర్బో పెట్రోల్‌కు 6-స్పీడ్ ఐఎమ్‌టి, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.ఫీచర్లు.. ధరప్రస్తుతం సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ మాట్లాడుతూ.. “6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటడం వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు రంగాల్లో ఉన్న బలమైన పునాది కారణంగానే సెల్టోస్ ఈ స్థాయికి చేరుకుంది. మిడ్-ఎస్‌యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మోడల్‌గా ఇది నిలిచింది” అని తెలిపారు.

Stock Market Close Highlights February 18, 20263
స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ.. ఆదుకున్న మెటల్‌, బ్యాంక్‌ షేర్లు

భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ ఆదుకోవడంతో సూచీలు వరుసగా మూడవ సెషన్ లాభాలను విస్తరించాయి.మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 283.29 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 83,734.25 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.95 పాయింట్లు లేదా 0.37 శాతం ఎగిసి 25,819.35 వద్ద ముగిసిందిసెన్సెక్స్ లో టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎం అండ్ ఎం 2.8 శాతం వరకు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్టెక్, టీసీఎస్ 1.6 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.5 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.54 శాతం పెరిగింది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ బుధవారం 3.5 శాతం క్షీణించింది.రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.2 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.23 శాతం పడిపోయింది.

EPFO may keep PF interest rate at 8 25pc for FY264
ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?

ఎంప్లాయూస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్‌ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

HUL leader in CSR spending in India Perpetual Capital Hurun India Impact5
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో హెచ్‌యూఎల్‌ టాప్‌

భారతదేశ కార్పొరేట్ దిగ్గజాలు కేవలం లాభాల ఆర్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని టాప్ 50 కంపెనీలు గడిచిన ఏడాదిలో ఏకంగా రూ.8,000 కోట్లను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాయి. ఈ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందడం విశేషం.అగ్రస్థానంలో హిందుస్థాన్ యూనిలీవర్సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో హిందుస్థాన్ యూనిలీవర్ 53.9 పాయింట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో హెచ్‌యూఎల్‌ ప్రదర్శించిన సమతుల్య పనితీరు ఈ ఘనతకు కారణమైంది.టాప్ 5 కంపెనీల వివరాలుర్యాంక్కంపెనీస్కోరు (పాయింట్లు)కీలక అంశం1హిందుస్థాన్ యూనిలీవర్53.9సమతుల్య ఎస్‌డీజీ పనితీరు2హెచ్సీఎల్ టెక్నాలజీస్53.8అత్యధిక మహిళా శ్రామిక శక్తి (67,217 మంది)3గ్రాసిమ్ ఇండస్ట్రీస్52.6సుస్థిర పారిశ్రామిక విధానాలు4టాటా మోటార్స్51.8గ్రీన్ మొబిలిటీ5డాబర్ ఇండియా50.3బాధ్యతాయుతమైన వినియోగం సాంకేతిక రంగంలో మహిళా సాధికారతఈ జాబితాలో 53.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రగతిని కనబరిచింది. భారత సాంకేతిక రంగంలోనే అత్యధికంగా 67,217 మంది మహిళలకు ఉపాధి కల్పించి మహిళా సాధికారతలో ఆదర్శంగా నిలిచింది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల తగ్గింపు, శక్తి-సమర్థవంతమైన డిజిటల్ సొల్యూషన్ల విస్తరణలో ఈ సంస్థ ముందుంది.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంకార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాయి.జాబితాలోని 50 కంపెనీలలో 48 సంస్థలు పర్యావరణ లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలోగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.40 కంపెనీలు ఉత్పత్తి, వినియోగంలో పారదర్శకతను పాటిస్తున్నాయి.30 కంపెనీలు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు అడుగులు వేస్తున్నాయి.ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 50 కంపెనీలు కలిసి మొత్తం రూ.48.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. తమ భారీ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)సీఎస్‌ఆర్‌ ద్వారా కంపెనీలు తాము సంపాదించే లాభాల్లో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేస్తాయి. అంటే.. సమాజం నుంచి వనరులను తీసుకుంటున్న కంపెనీలు తిరిగి సమాజానికి మేలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఒక నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ లాభాలు లేదా టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ సగటు నికర లాభంలో కనీసం 2 శాతం మొత్తాన్ని సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు ఖర్చు చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

India AI Impact Summit 2026 Peril Artificial Intelligence on Jobs6
ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

భారత్‌లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్‌ సర్వీసులో చాట్‌బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్‌లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్‌ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్‌ ఆల్‌’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000

Advertisement
Advertisement
Advertisement