Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

India’s Forex Reserves Climb Second Consecutive Weekly Rise1
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్‌ నిల్వలు

ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్‌ డాలర్లు పెరిగి 703.308 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు(ఏప్రిల్‌ 10) వారంలో ఇవి 3.825 బిలియన్‌ డాలర్లు పెరిగి 700.946 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది. ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్‌ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్‌ డాలర్లు పెరిగి 122.133 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

RBL Bank Q4 Results Net Profit Jumps 3x to rs 230 Crore2
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం మూడు రెట్లు జంప్‌

ముంబై: అస్తుల నాణ్యత మెరుగుదల, ప్రొవిజన్లకు పరిమిత కేటాయింపులు కారణంగా ఆర్‌బీఎల్‌ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం(2025–26) మార్చి త్రైమాసికంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది(2024–25) ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.69 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 7% పెరిగి రూ.1,563 కోట్ల నుంచి రూ.1,671 కోట్లకు ఎగసింది.అయితే నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.89% నుంచి 4.41%కు తగ్గింది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా 4.63% నుంచి క్షీణించింది. త్రైమాసికంలో ప్రొవిజన్లు 14% తగ్గి రూ.678 కోట్లకు పరిమితమవడంతో నిర్వహణ లాభం 11% పెరిగి రూ.955 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2025 మార్చి చివరినాటి 2.60% నుంచి, 2026 మార్చి చివరికి జీఎన్‌పీఏ నిష్పత్తి 1.18 శాతానికి దిగివచ్చింది.ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎండీ, సీఈవో ఆర్‌ సుబ్రమణ్యకుమార్‌ మాట్లాడుతూ, ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకు లోన్‌బుక్‌లో నిరంతర మెరుగుదల కొనసాగుతోంది అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 2027)లో కూడా వృద్ధి నిలకడగా ఉంటుందన్నారు.ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ నుంచి వచ్చే మూలధన పెట్టుబడి మార్జిన్ల పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ఇక విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఖర్చుల నియంత్రణపై కూడా బ్యాంకు దృష్టి సారించిందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, విస్తరణ ఖర్చులు మినహా ఇతర వ్యయాలు తగ్గే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

PlaySimple Games Files for Rs 3150 Crore IPO3
పబ్లిక్‌ ఇష్యూకు ప్లేసింపుల్‌ గేమ్స్‌

ముంబై: స్వీడన్‌కు చెందిన గేమింగ్‌ దిగ్గజం మోడర్న్‌ టైమ్స్‌ గ్రూప్‌ (ఎంటీజీ ఏబీ)కి చెందిన భారతీయ అనుబంధ సంస్థ ప్లేసింపుల్‌ గేమ్స్‌ ఐపీఓ ద్వారా రూ.3,150 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ‘ఈ పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉంటుంది. ఇందులో ప్రమోటర్, సెల్లింగ్‌ షేర్‌హోల్డర్‌గా ఎంటీజీ వ్యవహరిస్తుంది. అందువల్ల, ఈ ఇష్యూ ద్వారా వచ్చే నిధులు ప్లేసింపుల్‌కి కాకుండా ఎంటీజీకే వెళ్తాయి’ అని డ్రాఫ్ట్‌ పత్రాల్లో తెలిపింది. ఐపీఓ పూర్తైన తర్వాత కూడా ప్లేసింపుల్‌లో మెజారిటీ వాటాను కొనసాగించాలనే ఉద్దేశం ఉందని ఎంటీజీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫర్‌ పరిమాణం రూ. 3,150 కోట్లుగా ఉన్నప్పట్టకీ.. నియంత్రణ పరిమితుల్లో ఆఫర్‌ పరిమాణం మారవచ్చు. పబ్లిక్‌ ఇష్యూ తేదీని త్వరలో నిర్ణయిస్తామని కంపెనీ తెలిపింది.

Axis Bank Q4 net profit slips marginally to Rs 7071 crore4
యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ. 7,071 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,071 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64 శాతం మేర తగ్గింది. సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం సుమారు 5 శాతం పెరిగి రూ. 14,457 కోట్లకు చేరింది.ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో వన్‌ టైమ్‌ ప్రాతిపదికన అదనంగా రూ. 2,001 కోట్ల ప్రొవిజనింగ్‌ చేసినట్లు బ్యాంకు తెలిపింది. అనిశ్చితి పెరిగినప్పుడు రిస్క్‌ గవర్నెన్స్‌లో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించింది.గత ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరును కనపర్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌదరి తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి మరింత ఆశావహంగా అడుగుపెడుతున్నామని, సంస్థను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనుబంధ సంస్థ యాక్సిస్‌ ఫైనాన్స్‌కి కేదారా క్యాపిటల్‌తో కలిసి రూ. 2,250 కోట్లు సమకూరుస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ⇒ 4వ త్రైమాసికంలో మొండిపద్దుల్లాంటి వాటికి కేటాయింపులు రూ. 3,522 కోట్లుగా ఉన్నాయి. ⇒ మార్చి 31 నాటికి బ్యాలెన్స్‌ షీట్‌ 17 శాతం వృద్ధితో రూ. 18,86,850 కోట్లకు చేరింది. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు 11 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లు 11 శాతం, టర్మ్‌ డిపాజిట్లు 16 శాతం పెరిగాయి. ⇒ మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా క్యూ3లో 39 శాతంగా ఉండగా, క్యూ4లో స్వల్పంగా పెరిగి 40 శాతానికి చేరింది. ⇒ రుణాలు 19 శాతం పెరిగి రూ. 12,33,57 కోట్లకు చేరాయి. రూ. 6,73,468 కోట్లతో మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 55 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 26 శాతంగా ఉన్నాయి. స్మాల్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌ 17 శాతం, ప్రాపరీ్టపై రుణాలు 16 శాతం, వ్యక్తిగత రుణాలు 6 శాతం మేర పెరిగాయి. కార్పొరేట్‌ రుణాలు 38 శాతం వృద్ధి చెందాయి. ⇒ స్థూల మొండిబాకీలు డిసెంబర్‌ త్రైమాసికం ఆఖర్లో 1.40%గా ఉండగా 1.23 శాతానికి, నికర మొండిబాకీలు 0.42% నుంచి 0.37 శాతానికి నెమ్మదించాయి. రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి రూ. 1,197 కోట్లు రికవర్‌ అయ్యాయి. ⇒ నాలుగో త్రైమాసికంలో స్థూల స్లిపేజీలు రూ. 4,709 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి క్యూ3లో రూ. 6,007 కోట్లుగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 4,805 కోట్లుగా ఉన్నాయి. తాజా క్యూ4లో మొండిబాకీల రికవరీ, అప్‌గ్రేడింగ్‌ రూ. 2,696 కోట్లుగా ఉంది. ఈ వ్యవధిలో దాదాపు రూ. 3,096 కోట్ల ఎన్‌పీఏలను బ్యాంకు రైటాఫ్‌ చేసింది. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య 3,000 తగ్గి, 1.01 లక్షలకు చేరింది. డిజిటల్, టెక్నాలజీపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడం ఇందుకు కారణం.

 India Cements posted a standalone net profit of Rs 54. 75 crore in Q4 FY265
నాలుగు రెట్లు ఎగిసిన ఇండియా సిమెంట్స్‌ నికరలాభం

ముంబై: ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ 2025–26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభం నాలుగు రెట్లకు పైగా పెరిగి రూ.59.5 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం (వాల్యూమ్‌) పెరగడం, అలాగే అమ్మకాల ద్వారా లభించే ఆదాయం (సేల్స్‌ రియలైజేషన్‌) మెరుగుపడడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.14.67 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు 10.5% తగ్గి రూ.1,174.79 కోట్లకు దిగివచ్చాయి. సమీక్షించిన త్రైమాసికంలో దేశీయ అమ్మకాల పరిమాణం 3.12 మిలియన్‌ టన్నులుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 18% పెరుగుదల సాధించింది.నికర రియలైజేషన్‌ (అమ్మకాల ద్వారా లభించే ఆదాయం) త్రైమాసిక ప్రాతిపదికన 3.5%, వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం వృద్ధి కనబరిచింది. మొత్తం ఆదాయం 2.57% పెరిగి రూ.1,254.50 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నష్టాలు రూ.143.69 కోట్ల నుంచి రూ.67.25 కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం 5.33% పెరిగి రూ.4,572.35 కోట్లకు చేరాయి.వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల మూలధన వ్యయం (క్యాపెక్స్‌) ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది. ఈ నిధులను వృద్ధి అవకాశాలు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ ఆల్ట్రాటెక్‌ సిమెంట్, దక్షిణ భారతదేశానికి చెందిన ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌(ఐసీఎల్‌)లో ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసింది. దీంతో 2024 డిసెంబర్‌ 24 నుంచి ఐసీఎల్‌ అ్రల్టాటెక్‌ సిమెంట్‌కు అనుబంధ సంస్థగా మారింది.

pnb-launched-upi-credit-card-how-to-link-in-telugu6
కొత్త క్రెడిట్ కార్డు.. మొబైల్ ఫోన్ ఉంటే చాలు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్‌టెక్‌ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్‌లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.సెటప్ చేసుకోవడం ఎలా?పీఎన్‌బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.💸 ముందుగా మీ యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్‌బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement