Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

indian Pharma loses Rs 5000 crore1
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో దేశీ ఫార్మా రంగం రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో సరుకు రవాణా, సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే ప్రతికూలతలు ఇందుకు దారితీయనున్నట్టు ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) పేర్కొంది. దేశ ఫార్మా ఎగుమతుల్లో గల్ఫ్‌ దేశాల (జీసీసీ) వాటా 5.58 శాతం ఉన్నట్టు తెలిపింది.2020–21లో పశ్చిమాసియాకు ఎగుమతులు 1,320 మిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2024–25లో 1,749 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అందుబాటు ధరలకే ఔషధాల కోసం యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్‌ భారత్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. ఒక్కో షిప్‌మెంట్‌కు 4,000–8,000 డాలర్ల మేర సర్‌చార్జీతో భారత ఎగుమతులు, దిగుమతుల రవాణా చార్జీలు పెరిగిపోతాయని, భారత ఫార్మాస్యూటికల్‌ కంపెనీలపై భారం పడుతుందని ఫార్మెక్సిల్‌ పేర్కొంది. మార్బి సిరామిక్‌ పరిశ్రమపై పిడుగు గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో గుజరాత్‌లోని మార్బిలో 350 వరకు సిరామిక్‌ టైల్స్‌ తయారీ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సహజవాయువు (ప్రొపేన్‌) కొరత ఇక్కడి పరిశ్రమను వేధిస్తోంది. మార్చి 15 నాటికి సరఫరా పునరుద్ధరించకపోతే మొత్తం పరిశ్రమ మూసివేసే ఆలోచనతో ఉన్నట్టు మార్బి సిరామిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కేజీ కుందారియా తెలిపారు. ‘‘మార్బిలో 750 వరకు పరివ్రమలు ఉన్నాయి.దేశ టైల్స్‌ ఉత్పత్తిలో వీటి వాటా 90 శాతం. గ్యాస్‌ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నాటికి 350 పరిశ్రమలు మూతపడనున్నాయి’’ సిరామిక్‌ ప్యానెల్‌ చైర్మన్‌ జెటా్పరియా తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రొపేన్‌ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, మార్బిలో కేవలం 30 శాతం పరిశ్రమలే గుజరాత్‌ గ్యాస్‌ పంపిణీ సంస్థ కనెక్షన్‌ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఈ సంస్థ 50 శాతం తగ్గించి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

gold and silver prices rising: Growing demand for lightweight jewelry2
పాత బంగారు లోకం

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: వరుస యుద్ధాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్‌ ఇస్తూ ఆభరణాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక తులం బంగారం ధర రూ.1.7 లక్షల మార్కును దాటేయడంతో సామాన్యుడి గుండె గుభేల్‌ మంటోంది. కానీ, ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.మధ్యతరగతి జనం ఇప్పుడు కొత్త నగలు కొనడానికి బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్నిజువెలరీ షాపుల్లో ఇచ్చి (ఎక్స్ఛేంజ్) కొత్తవి చేయించుకుంటున్నారు. లాకర్లలో దాచిన పాత నగలను బయటకు తెచ్చి కొత్త నగలుగా మార్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధర ఇంకా పెరుగుతుందనే భయంతో అవసరాల కోసం ముందుగానే కొనుగోళ్లు చేయడం మొదలెట్టారు. పాత పసిడికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగారం అమ్మకాల్లో సగానికి పైగా గోల్డ్‌ ఎక్స్ఛేంజ్ ద్వారానే సాగుతున్నట్లు జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ప్యూర్‌ వద్దు.. లైట్‌ ముద్దు! పెరిగిన ధర వద్ద బంగారు ఆభరణాలు కొనడం సామాన్యుడికి కలగా మారింది. దీని ప్రభావం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే మధ్యతరగతి పై ఎక్కువగా పడుతోంది దీంతో మార్కెట్లో మరో కొత్త ట్రెండ్‌ మొదలైంది. తక్కువ బరువు, తక్కువ ధరలో లభించే 18 క్యారెట్ల నగలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. డైమండ్స్‌లో కూడా 9 క్యారెట్, 14 క్యారెట్‌ వంటి తక్కువ రేంజ్‌ ఆభరణాలు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సహజ వజ్రాల రేటు భరించలేని మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరకే మెరిసే ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌వైపు మళ్లుతున్నారు. ల్యాబ్‌–గ్రోన్‌ డైమండ్స్‌ ధరలు సహజ డైమండ్స్‌ కంటే చాలా తక్కువ గ్లోబల్‌ డైమండ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 12 శాతం ఉన్న ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్ల వాటా 2029 నాటికి 16 శాతానికికి చేరుతుందని నిపుణుల అంచనా.ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే ‘కాసే’ కేవలం అలంకరణకే కాకుండా, పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు గోల్డ్‌ కాయిన్స్‌పైనే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇవే లాభాలను ఇస్తాయని నమ్ముతున్నారు. రేటు పెరిగినా ఇన్వెస్టర్లు బంగారు నాణేలు కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘రేట్లు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం వేరు. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత’ – అరుణ్‌ నారాయణ్, సీఈఓ టైటాన్‌ జువెలరీ

Indian job postings for women grow 19 percent3
నియామకాల్లో మహిళా సత్తా

ముంబై: కొలువుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. మెరుగైన అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో దేశంలో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు గెలుచుకున్నారు. జాబ్‌ పోర్టల్‌ ఫౌండిట్‌ విడుదల చేసిన ‘ఉమెన్‌ ఇన్‌ ది ఇండియన్‌ వర్క్‌ఫోర్స్‌ 2026’ నివేదిక ప్రకారం.. సీనియర్, అధిక వేతనం, అత్యాధునిక టెక్నాలజీతో ముడిపడిన ఉద్యోగ నియామకాల్లో, టైర్‌–2 పట్టణాల్లో మహిళల నియామకాలు పెరిగాయి. 2025 ఫిబ్రవరి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో ఉద్యోగ నియామకాల్లో 19 శాతం అధిక అవకాశాలను మహిళలు సొంతం చేసుకున్నారు.ఇటీవలి సంవత్సరాల్లో ఇదే మెరుగైన వృద్ధి. ‘‘భారత్‌ వ్యాప్తంగా మహిళల నియామకాల తీరు చూస్తుంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఆరంభ స్థాయి నుంచి సీనియర్‌ పొజిషన్లు, అధిక వేతన విభాగాలు, టైర్‌–2 పట్టణాల్లో మహిళలకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. అయితే అధిక శాతం ఉద్యోగాలు రూ.10 లక్షల వార్షిక వేతనంలోపే ఉంటున్నాయి. అదే సమయంలో అధిక విలువ కలిగిన ఉద్యోగాల్లోనూ మహిళల ప్రవేశం క్రమంగా మెరుగుపడుతోంది’’అని ఫౌండిట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) అనుపమా భిమ్‌రాజిక తెలిపారు. ఇదీ మార్పు.. ⇒ మహిళలు ఆరంభ స్థాయి ఉద్యోగాలైన రిసెప్షనిస్ట్‌ లేదా క్లరికల్‌ ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. మేనేజర్, డైరెక్టర్‌ ఉద్యోగాల్లోనూ వారికి ప్రాధాన్యం దక్కుతోంది. ⇒ రూ.11–25 లక్షల వేతన బ్రాకెట్‌లో మరింత మంది మహిళలు వచ్చి చేరుతున్నారు. ⇒ ఏఐ, డేటా సైన్స్, చిప్స్‌ (సెమీ కండక్టర్లు)లో గతంలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మహిళలకూ అవకాశలు తన్నుకొస్తున్నాయి. ⇒ముఖ్యంగా మహిళలకు మెరుగైన అవకాశాలు మెట్రోలకే పరిమితం కావడం లేదు. టైర్‌–2, 3 పట్టణాలకూ (ఇండోర్, జైపూర్, లక్నో, కోచి, కోయింబత్తూర్‌) విస్తరిస్తున్నాయి. మొత్తం నియామకాల్లో 44 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. 2025 నివేదిక నాటికి ఇది 41 శాతంగా ఉంది. టైర్‌–1 పట్టణాల వాటా 59 శాతం నుంచి 56 శాతానికి తగ్గింది. ⇒ ఐటీ రంగంలో (ముఖ్యంగా డేటా, అనలైటిక్స్‌) మహిళల ప్రాతినిధ్యం గడిచిన ఏడాది కాలంలో 32 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో 16 శాతం, మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో మహిళల వాటా పెరిగింది. ⇒ కొత్త టెక్నాలజీ విభాగాల్లో మహిళలకు అవకాశాలు 26 శాతం నుంచి 31 శాతానికి పెరిగాయి. ⇒ సంప్రదాయంగా మహిళల ఉపాధికి కీలకంగా ఉంటున్న కస్టమర్‌ సర్వీస్‌/బీపీవోలో నియామకాలు 12 శాతం నుంచి 10 శాతానికి, మానవ వనరుల విభాగంలో 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గాయి. ⇒ కంపెనీలు లింగ సమానత్వం విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా.. మరింత మంది మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారా ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది.

Indian women are strengthening their role in household financial management4
‘షి’వల్యూషన్‌ సునామీ!

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: భారత మహిళలు ఇపుడు ఇంటికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా ఆలోచిస్తూ, పెట్టుబడులు పెడుతూ, ఆర్థిక స్వావలంబన వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. గతంలోలాగా కుటుంబ బడ్జెట్‌ పరిమితిలో ఇరుక్కుని ఆరి్ధక ఇబ్బందులతో గడిపేందుకు ఇష్టపడడంలేదు. పెట్టుబడులు, రిటైర్మెంట్, కెరీర్‌ గ్రోత్, ఆర్థిక స్వాతంత్య్రం ఇలా ప్రతి అంశంలో ముందడుగు వేస్తున్నారు. భారత మహిళల ఆర్థిక లక్ష్యాలు, అలవాట్లు, ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంటోంది.మహిళల ఈ ఆర్థిక మలుపు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఇంధనంగా మారింది. కొత్త బలాన్నిస్తోంది. ఒకప్పుడు మహిళల ఆర్థిక ప్రాధాన్యతలు కుటుంబం కేంద్రంగా ఉండేవి. పెళ్లి, పిల్లలు వారి స్కూల్‌ ఫీజులు, తర్వాత ఉన్నత చదువుల కోసం పొదుపుగా బతకడం, పిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం జాగ్రత్త పడడం, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు చేయడం మహిళల ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి . ఇవన్నీ కూడా భర్త ఆధ్వర్యంలో జరిగేవి. మహిళల పాత్ర ఎక్కువగా ’సపోరి్టవ్‌ ఫైనాన్షియల్‌ మేనేజర్‌’గానే ఉండేది.ఇప్పుడు కెరీర్‌ అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం, ఈక్విటీ పెట్టుబడులు, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ వంటి ఆధునిక లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కేవలం కుటుంబ సహాయకురాలిగా కాదుం ఫైనాన్షియల్‌ లీడర్‌గా ఎదుగుతున్నారు. ఇటీవలి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం మహిళల్లో ఆర్థిక అవగాహన గణనీయంగా పెరిగింది. కుటుంబం చుట్టూ తిరిగిన ఆర్థిక ప్రణాళిక గుమ్మం దాటి స్టాక్‌ మార్కెట్‌ దాకా వెళ్లింది. కొత్తతరం మహిళల్లో నా జీవితం – నా డబ్బు అనే భావన బలపడుతోంది. స్వతంత్ర ఆర్థిక ఆలోచనలతో ఇప్పుడు మహిళల లక్ష్యాలు మరింత వ్యక్తిగతంగా, శక్తివంతంగా మారాయి కొత్త తరహా లక్ష్యాలు: ⇒ కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్, అప్‌స్కిల్లింగ్‌ ⇒ పూర్తి స్థాయి ఆర్థిక స్వాతంత్య్రం ⇒ బంగారం దాటి ఈక్విటీ, ముచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ⇒ స్వంత ఇల్లు కొనుగోలు ⇒ వ్యక్తిగత రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ ⇒ ట్రావెల్, లైఫ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ ⇒ సెల్ఫ్‌ కేర్‌ – హెల్త్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ ⇒ ఎంటర్‌ప్రెన్యూర్షిప్, కెరీర్‌ ఫ్లెక్సిబిలిటీ ⇒ పెట్టుబడుల్లో మహిళల కొత్త ట్రెండ్‌ ⇒ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)ల ద్వారా క్రమబద్ధమైన పెట్టుబడులు ⇒ డైరెక్ట్‌ ఈక్విటీ ఇన్వెస్టింగ్‌ ⇒ డిజిటల్‌ ట్రేడింగ్‌ – ఫైనాన్స్‌ యాప్‌ల వినియోగం ⇒ రిస్క్‌ అవగాహనతో విభిన్న ఆస్తుల్లో డైవర్సిఫికేషన్‌ ⇒అత్యవసర నిధులపై ప్రత్యేక దృష్టి.అంకెల్లో కనబడుతున్న మార్పు⇒ 47 శాతం మహిళలు ఆర్థిక నిర్ణయాలు స్వయంగా తీసుకుంటున్నారు ⇒ 98 శాతం పట్టణ మహిళలు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు⇒ 25 శాతానికి పెరిగిన ఈక్విటీ మార్కెట్‌లో మహిళా ఇన్వెస్టర్ల వాటా. 25 శాతానికి చేరిన మహిళా మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య.

Bumper Guards Banned In India and What Penalties You Could Face5
కారుకు బంపర్ గార్డ్.. ఫైన్ కట్టాల్సిందే!

భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్‌లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్‌పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్‌లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం!చూడటానికి బంపర్ గార్డ్‌లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్‌లు ఈ సెన్సార్‌లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.బుల్ బార్‌లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.జరిమానా ఇలా..బుల్ బార్‌ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్‌ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది.

Man Quits Rs 26 Lakh Job Know The Details Here6
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!

సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వెబ్‌సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.A few days ago, I walked away from a ₹26 LPA job right at the time of onboarding.Since then I’ve had very mixed feelings.One side of me says I made the right decision. I didn’t want to get trapped in a job.The other side keeps asking… what if this was a huge mistake?…— Pushkar @ Website Designer (@in_pushkar) March 5, 2026

Advertisement
Advertisement
Advertisement