Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

BHEL jumps 10percent on strong Q4 profit beat estimates1
బీహెచ్‌ఈఎల్‌ లాభం హైజంప్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్, తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 2.5 రెట్లు ఎగసి రూ. 1,290 కోట్లను అధిగమించింది. ప్రధానంగా విద్యుత్‌ ఉపకరణాల విభాగం జోరు ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 504 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 1.40 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 9,143 కోట్ల నుంచి రూ. 12,554 కోట్లకు జంప్‌చేసింది. దీనిలో విద్యుత్‌ విభాగం టర్నోవర్‌ రూ. 9,510 కోట్లకు బలపడింది. అంతక్రితం క్యూ4లో రూ. 6,192 కోట్లు మాత్రమే నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీహెచ్‌ఈఎల్‌ నిక ర లాభం మూడు రెట్లు వృద్ధిచెంది రూ. 1,600 కోట్లను దాటింది. 2024–25లో కేవలం రూ. 534 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 28,805 కోట్ల నుంచి రూ. 34,590 కోట్లకు పుంజుకుంది. దీనిలో విద్యుత్‌ ఉపకరణాల టర్నోవర్‌ రూ. 20,937 కోట్ల నుంచి రూ. 25,407 కోట్లకు పురోగమించింది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు బీఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 377 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 399కు దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని తాకింది.

 India HSBC Manufacturing PMI came in at 54. 7 in April 20262
ఏప్రిల్‌లో కోలుకున్న తయారీ

న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్‌ నెలలో కాస్తంత మెరుగుపడింది. తయారీ రంగంలో పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ సర్వే) 54.7 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 53.9గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగేందుకు దారితీసింది. కానీ, గత నాలుగేళ్లలో ఇది రెండో బలహీన వృద్ధి కావడం గమనార్హం. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, ఉపాధి కల్పన తదితర అంశాల ఆధారంగా పనితీరును హెచ్‌ఎస్‌బీసీ ప్రతి నెలా అంచనా వేస్తుంటుంది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదల చూస్తారు. విక్రయాలు, ఉత్పత్తికి బలమైన డిమాండ్‌ అనుకూలించినట్టు పీఎంఐ సర్వే తెలిపింది. ‘‘పశి్చమాసియా ఘర్షణల ప్రభావం తయారీపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2022 ఆగస్ట్‌ తర్వాత తయారీ వ్యయాలు వేగంగా పెరిగాయి. దీంతో తుది ధరలు సైతం ఆరు నెలల్లోనే అధికంగా పెరిగాయి’’అని హెచ్‌ఎస్‌బీసీ ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. కొత్త ఎగుమతుల ఆర్డర్లు, ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగినట్టు చెప్పారు. ఎగుమతి ఆర్డర్లు ఏడు నెలల్లోనే వేగవంతంగా పెరిగినట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెన్యా, చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే నుంచి ఆర్డర్లు పెరిగాయి. మరోవైపు తయారీలో ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగింది. 400 తయారీ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి హెచ్‌ఎస్‌బీసీ ప్రతి నెలా ఈ వివరాలు విడుదల చేస్తుంటుంది.

shreyas group expansion plan 10000 entrepreneurs target in telugu states3
10 వేల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దుతాం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌ సంస్థ శ్రేయాస్‌ గ్రూప్‌ తాజాగా మీడియా, స్పోర్ట్స్‌ తదితర రంగాల్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 10,000 మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాస్‌రావు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని వారు శ్రేయాస్‌ ప్రతినిధిగా చేరి, ఈవెంట్స్, రిటైల్, వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌లాంటి రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విధానంలో యువత తమ సొంత ప్రాంతాల్లోనే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని శ్రీనివాస్‌రావు చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా గ్రూప్‌ హిందీ, పంజాబీలాంటి ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోకి విస్తరిస్తోంది. అలాగే కార్పొరేట్‌ క్లబ్, ఉత్సవ్‌ పేరిట ఈవెంట్స్‌ రంగంలో, ఫ్యూచర్‌ సిటీ డెవలపర్స్‌ ద్వారా రియల్టీలోనూ అడుగుపెట్టింది. ఏఐ ఫ్రేమ్స్‌ పేరుతో కృత్రిమ మేధ ఆధారిత వీడియో ప్రొడక్షన్‌ స్టూడియో, ఎనీటైమ్‌ థియేటర్‌ అనే వినూత్న వినోద ప్లాట్‌ఫాంను ప్రారంభిస్తోంది.

RBI Grants Relief to Small NBFCs with Regulatory Exemptions4
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఊరట

డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్‌ ఫండ్‌ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్‌ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీలు ఈ జాబితాలో ఉంటాయి.ప్రస్తుతం టైప్‌ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్‌ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్‌బీఐ యాక్ట్‌ 1934లోని సెక్షన్‌ 45ఐఏ ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్‌ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది.

Traditional School Financial Advice Is Outdated Robert Kiyosaki Warns5
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..కియోసాకి హెచ్చరిక!ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు. ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.జీతంపై ఆధారపడటం వల్లమరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాంప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

Gold Prices Drop by Rs 1200 Check Latest Rates Hyderabad Vijayawada Delhi6
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..

ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

Advertisement
Advertisement
Advertisement