Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Prices Surge Across Major Cities Weekly Trends and Latest Rates1
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?

వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Inverter vs Non Inverter AC Which One Should You Choose This Summer2
ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ

నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ప్రతిఒక్కరూ ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్లగానే వినియోగదారులకు తలెత్తే ప్రధాన ప్రశ్న.. 'ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? లేక నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా..?' అని. తక్కువ ధరలో వస్తుందని కొందరు, విద్యుత్ ఆదా అవుతుందని మరికొందరు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలు, లాభనష్టాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇన్వర్టర్ ఏసీఇన్వర్టర్ ఏసీ అనేది అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఇందులోని కంప్రెసర్ తన వేగాన్ని వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచు తుంది.నాన్-ఇన్వర్టర్ ఏసీనాన్-ఇన్వర్టర్ ఏసీ అనేది పాత పద్ధతిలో పనిచేస్తుంది. కంప్రెసర్ అయితే పూర్తిగా ఆన్‌లో ఉంటుంది లేదా పూర్తిగా ఆఫ్‌లో ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోవడం, మళ్లీ వేడి పెరగగానే వెంటనే స్టార్ట్ కావడం దీని ప్రత్యేకత. ఏసీ అనగానే సామాన్యుడికి గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కానక్కర్లేదు కాబట్టి విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది జేబుకు ఉపశమనాన్ని ఇస్తుంది.అదే నాన్-ఇన్వర్టర్ ఏసీ విషయానికొస్తే.. కంప్రెసర్ ప్రతిసారీ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ కావాల్సి రావడంతో కరెంట్ బిల్లు భారమయ్యే అవకాశం ఉంది. గదిలో ఒకే రకమైన చల్లదనం ఉండాలని కోరుకునే వారికి ఇన్వర్టర్ ఏసీ సరైన ఎంపిక. ఇది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆగిపోయిన ప్రతిసారీ గదిలో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం, మళ్లీ తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.జీవితకాలం పరంగా రెండూ మెరుగైనవే అయినప్పటికీ, నిర్వహణలో తేడాలున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ.. విషయంలో పీసీబీ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. ఒకవేళ ఇవి పాడైతే మరమ్మతు ఖర్చు కాస్త ఎక్కువేగానే ఉంటుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ.. దీని టెక్నాలజీ చాలా సరళంగా ఉంటుంది. విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి. మెకానిక్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడాల్సి వస్తే.. కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ వైపు వెళ్లడమే తెలివైన పని అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం, అప్పుడప్పుడు మాత్రమే వాడే వారైతే నాన్-ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. - పసుపులేటి. వెంకటేశ్వరరావు.

Torrent Gas Hikes CNG Price by Rs 2 50 KG in Jaipur3
మొన్న పెట్రోల్.. నేడు సీఎన్‌జీ: పెరిగిన ధరలు!

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఏర్పడింది.ఇలాంటి సమయంలో మన దేశంలోని టొరెంట్ గ్యాస్ సంస్థ జైపూర్‌లో కేజీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను రూ.2.50 పెంచింది. దీంతో వినియోగదారులపై పెరుగుతున్న వ్యయ భారం మరింత పెరిగింది. ఇంధన ధరలలో విస్తృతమైన పెరుగుదల సవరణల మధ్య ఈ పెంపు చోటుచేసుకుంది, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి.ఎల్‌పీజీ ధరలుసీఎన్‌జీ ధరల పెంపుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రధాన నగరాల వ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కి చేరింది. 5 కేజీల చిన్న సిలిండర్ల ధరలు కూడా రూ.51 మేర పెరిగింది. కోల్‌కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు ఏకంగా రూ.218 మేర పెరిగాయి.ధరలు పెరుగుదలకు కారణం!మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ పోకడల ఆధారంగా వాణిజ్య ఎల్‌పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. తాజా ధరల పెంపునకు కారణం.. సౌదీ కాంట్రాక్ట్ ధరలో 44% భారీ పెరుగుదలే అని తెలుస్తోంది. ఈ ధర మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో మెట్రిక్ టన్నుకు 780 డాలర్లకు పెరిగింది. ఎల్‌పీజీ సరఫరా తగ్గిపోవడం కూడా సిలిండర్ ధరలు పెరగడానికి కారణం అవుతోంది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!

Bengaluru Resident Calls 2BHK House Hunt In City A Nightmare4
ఐటీ సిటీలో ఇ‍ల్లు.. ఇంత కష్టమా?

దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో నివసించే సగటు ఉద్యోగికి ఇప్పుడు 'సొంత ఇల్లు' అనేది ఒక తీరని కలగా మారుతోంది. నగరంలో ఇళ్ల ధరలు, అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి 'రెడ్డిట్' (Reddit) వేదికగా పంచుకున్న తన చేదు అనుభవాలు నగరంలోని భయానక రియల్ ఎస్టేట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.పీడకలగా మారిన ఇంటి వేటబెంగళూరు నగరంలో ఒక రెండు పడక గదుల (2BHK) ఇంటి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఒక "పీడకల"గా మారిందని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. "బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎటు వెళ్తోంది?" అనే శీర్షికతో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మూడేళ్ల క్రితం రూ. 1.4 కోట్లుగా ఉన్న ఒక ఫ్లాట్ ధర, ప్రస్తుతం ఏకంగా రూ. 2 కోట్లకు చేరింది. సదరు అపార్ట్‌మెంట్ ఒక పెద్ద మురికి కాలువ సమీపంలో ఉండటమే కాకుండా, అనేక లోపాలు, అసౌకర్యాలు ఉన్నాయి. అయినా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉందనే సాకుతో ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అద్దెలు కూడా భారమే..కేవలం కొనుగోలు ధరలే కాకుండా, అద్దెలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. గతంలో తక్కువ ధరకే లభించిన ఫ్లాట్‌లకు ఇప్పుడు నెలకు రూ. 70,000 పైగా అద్దె చెల్లించాల్సి వస్తోందని, ఇది నమ్మశక్యంగా లేదని నివాసితులు వాపోతున్నారు. మూడు, నాలుగేళ్లలో డబ్బు ఆదా చేసి ఇల్లు కొందామనుకునే లోపే, ధరలు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.పరిస్థితి తీవ్రతకొన్ని ప్రాంతాల్లో 2BHK ఫ్లాట్లు ఏకంగా రూ. 2.5 కోట్లకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఇంత ధర పెట్టినా డిమాండ్ తగ్గకపోవడం, సామాన్య, మధ్యతరగతి ప్రజలను గృహ కొనుగోలుకు దూరం చేస్తోంది. పెరుగుతున్న ధరలు, క్షేత్రస్థాయిలోని సమస్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Centre Pushes Induction Use Amid LPG Concerns5
ఇండక్షన్‌ హీటర్లపై కేంద్రం ఫోకస్‌!

పశ్చిమాసియా సంక్షోభంతో ఎల్‌పీజీ లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇండక్షన్‌ హీటర్లు, వాటికి అనువుగా ఉండే ఇతరత్రా పాత్రల వాడకాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్పత్తి కంపెనీలతో శుక్రవారం చర్చలు జరిపింది.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సారథ్యంలో జరిగిన సమావేశంలో విద్యుత్‌ శాఖ కార్యదర్శి పంకజ్‌ అగర్వాల్, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ లవ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.ఇండక్షన్‌ హీటర్లు, కుక్కర్లలాంటి పాత్రల తయారీని వేగవంతం చేసేందుకు, ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చించినట్లు వివరించారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని, హాట్‌ కేక్‌ల్లాగా అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు.

Apple 50th Anniversary Sale iPhone 17 Price Cuts6
ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!

టెక్ దిగ్గజం ఆపిల్.. తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'పై డిస్కౌంట్ ప్రకటించింది. కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశం.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.1,49,900. దీనిని కంపెనీ డిస్కౌంట్ కింద రూ.1,02,900కు అందిస్తోంది. అంటే రూ. 47వేలు తగ్గింపు లభిస్తోందన్నమాట. ఇందులో రూ.4000 క్యాష్ బ్యాక్, రూ.1000 తక్షణ తగ్గింపు మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద రూ.6000 డిస్కౌంట్ అందిస్తోంది. పాత ఫోన్‌లపై రూ. 36వేలు వరకు ఎక్స్ఛేంజ్ (మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది) లభిస్తుంది. ఈ ఆఫర్ ఆపిల్ అధీకృత రీసెల్లర్, ఇమాజిన్ స్టోర్‌లలో లభిస్తుంది.ఈ సేల్‌లో ఐఫోన్ 17 ప్రో (256GB) కూడా ఉంది. దీనిని ఇప్పుడు రూ. 89,900లకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో తక్షణ డిస్కౌంట్ లభించదు. కానీ.. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లభిస్తాయి. స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర కూడా చాలావరకు తగ్గింది. స్మార్ట్‌ఫోన్ ధరలు మాత్రమే కాకుండా.. ఐప్యాడ్ (2025), వై-ఫై + సెల్యులార్ వెర్షన్, ఐప్యాడ్ ప్రో (M5) లైనప్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.ఇదీ చదవండి: బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?

Advertisement
Advertisement
Advertisement