Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Nissan Gravite 7-Seater MPV Launched1
నిస్సాన్‌ ఎంపీవీ గ్రావైట్‌

ఉదయ్‌పూర్‌: జపాన్‌ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ తమ సెవెన్‌ సీటర్‌ ఎంపీవీ గ్రావైట్‌ని మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.49 లక్షల వరకు (ఎక్స్‌–షోరూం) ఉంటుంది. ప్రస్తుతం మ్యాగ్నైట్‌ పేరిట భారత్‌లో ఒకే ఉత్పత్తిని విక్రయిస్తున్న నిస్సాన్‌కి ఇది రెండో మోడల్‌. ఈ ఏడాది టెక్టాన్‌ ఎస్‌యూవీతో పాటు విశాలమైన సెవెన్‌ సీటర్‌ సీ సెగ్మెంట్‌ ఎస్‌యూవీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ సౌరభ్‌ వత్స తెలిపారు. మొత్తం మీద ఏడాది వ్యవధిలో మూడు వాహనాలను తీసుకొచి్చనట్లవుతుందని వివరించారు. రూ. 6 లక్షల నుంచి దాదాపు రూ. 20 లక్షల వరకు ధర శ్రేణిలో వాహనాలతో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం 160 డీలర్‌íÙప్‌లు ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి వీటి సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు వత్స వివరించారు. అలాగే, ఎగుమతులపైనా దృష్టి పెడుతున్నామని, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల ఎక్స్‌పోర్ట్స్‌ మార్కును అధిగమిస్తామని ఆయన చెప్పారు.

Demand for freshers highest in e-commerce and tech startups2
ఫ్రెషర్స్‌కు పండగే!

ముంబై: ఈ ఏడాది ఫ్రెషర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు రానున్నాయి. 73 % సంస్థలు జనవరి–జూన్‌ మధ్య కాలంలో ఫ్రెషర్లను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ కెరీర్‌ అవుట్‌లుక్‌ సర్వేలో తెలిపాయి. విద్యార్హతలు ఒక్కటే కాకుండా.. అప్ప టికే ఏవైనా ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం, ఇంటర్న్‌íÙప్‌ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని సర్వేలో రిక్రూటర్లు చెప్పారు. 2025 నవంబర్‌ నుంచి 2026 జనవరి మధ్య వివిధ రంగాల్లోని 1,051 సంస్థల రిక్రూటర్లను సర్వే చేసి టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ ఈ ఏడాది ప్రథమార్ధం లో నియామకాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ రంగాల్లో జోరు: రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, తయారీలో ఈ ఏడాది ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలు రానున్నాయి. రిటైల్‌ రంగంలో 91% సంస్థలు ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశంతో ఉన్నాయి. ఆ తర్వాత ఈ–కామర్స్‌ రంగంలో, టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థలో 90 %, తయారీ కంపెనీల్లో 85% ఫ్రెషర్లను తీసుకోనున్నాయి. డార్క్‌ స్టోర్‌ అసిస్టెంట్‌ (క్విక్‌ కామర్స్‌), ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు డిజిటల్‌ సేల్స్‌ అసోసియేట్, జూనియర్‌ వెబ్‌ డెవలపర్లను నియ మించుకోవాలని అనుకుంటున్నాయి. తయారీలో ఇన్వెంటరీ, లాజిస్టిక్స్‌ కోఆర్డినేటర్, బ్యాటరీ అసెంబ్లీ టెక్నీషియన్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకం విషయమై కంపెనీలు నమ్మకంగా ఉన్నాయని, కొన్ని రంగాల్లో నియామకాల ఉద్దేశం 2025 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఉన్న 41% నుంచి, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి 91 శాతానికి పెరిగినట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్‌ తెలిపారు. రవాణా రంగంలో నియామక ఉద్దేశ్యం 77 శాతానికి చేరిందని, విద్యుత్, ఇంధన రంగంలోనూ 22 % నుంచి 72 శాతానికి చేరినట్టు చెప్పారు. బెంగళూరు టాప్‌: ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల అనుభవం ఉన్న వారు వేగంగా ఉపాధి అవకాశాలను పొందగలరని రూజ్‌ తెలిపారు. కేవలం డిగ్రీ అర్హతే కలిగిన వారు అవకాశం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చన్నారు. అధ్యయనమే దీనికి పరిష్కారమని సూచించారు. ఫ్రెషర్లకు అత్యధికంగా బెంగళూరులో (84 శాతం ) అవకాశాలు రానున్నాయి. టెక్నాలజీ, స్టార్టప్‌లకు బెంగళూరు కేంద్రంగా ఉండడం తెలిసిందే. ఇక్కడ ఐటీలో 81 శాతం, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల్లో 90 శాతం, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా కంపెనీల్లో 61 శాతం ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నాయి.

Perpetual Capital-Hurun India Impact 50 list Released3
కార్పొరేట్ల గ్రీన్‌గేమ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, సానుకూల ప్రభావం చూపుతున్న 50 దేశీ కంపెనీల్లో హిందుస్తాన్‌ యూనిలీవర్‌ అగ్రస్థానంలో నిలి్చంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రెండో స్థానంలో, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ మూడో స్థానంలో నిల్చాయి. పర్పెచ్యువల్‌ క్యాపిటల్, హురున్‌ ఇండియా 50 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, దివీస్‌ ల్యాబ్స్‌ కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎస్‌డీజీ లక్ష్యాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా 150 కంపెనీలను వడబోసి ఈ జాబితాను రూపొందించినట్లు హురున్‌ ఇండియా ఫౌండర్‌ అనాస్‌ రెహా్మన్‌ జునైద్‌ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కంపెనీలు ఈ లక్ష్యాలను నివేదికలకు పరిమితం చేయకుండా, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మార్చుకుంటున్నాయని వివరించారు. వినియోగ, వాణిజ్య, సామాజిక రంగాలపై అర్థవంతమైన ప్రభావం చూపే సంస్థలకు తాము తోడ్పాటు అందిస్తున్నామని పర్పెచ్యువల్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ ప్రణవ్‌ ప్రశాంత్, అన్విత ప్రశాంత్‌ వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → ఎస్‌డీజీ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తున్న కంపెనీల సంఖ్యకు సంబంధించి 26 సంస్థలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణే, అహ్మదాబాద్‌ తదుపరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ళీ మెటల్స్, మైనింగ్‌ రంగం నుంచి అత్యధికంగా 7 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్, ఎనర్జీ, కన్జూమర్‌ గూడ్స్‌ రంగాల నుంచి తలో మూడు కంపెనీలు ఉన్నాయి. → హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 97 శాతం పునరుత్పాదక విద్యుత్‌ని వినియోగిస్తోంది. ళీ పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ఇప్పటికే తటస్థ ఉద్గార స్థాయిని సాధించగా, డాక్టర్‌ రెడ్డీస్, టెక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌ తదితర అయిదు దిగ్గజ కంపెనీలు ఇందుకోసం 2030ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. → కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాలపై జాబితాలోని కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయగా, 20 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. పర్యావరణ పరిరక్షణపరమైన చర్యలకు కంపెనీలు (48 సంస్థలు) అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. → లిస్టులోని 50 కంపెనీల మొత్తం ఆదాయం రూ. 48.5 లక్షల కోట్లుగా, లాభం రూ. 4.95 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 10.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.

Nissan Gravite 7 seater MPV Launched At Rs 5 65 Lakh4
నిస్సాన్‌ గ్రావైట్‌.. మరో కొత్త 7-సీటర్‌ కారు వచ్చేసింది..

నిస్సాన్‌ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్‌’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్‌ ట్రైబర్‌ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్‌.. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్‌కు ప్రత్యేకతను ఇస్తాయి.అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్‌ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్‌ ఈ గ్రావైట్‌ను కీలక మోడల్‌గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలునిస్సాన్‌ గ్రావైట్‌ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్‌-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలుఅసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలుఎన్‌-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలుఎన్‌-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలుటెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలుటెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలుటెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఎంటీ – రూ. 8.35 లక్షలుటెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఏఎంటీ – రూ. 8.93 లక్షలుగ్రావైట్‌ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఎక్స్‌టీరియర్డిజైన్ పరంగా నిస్సాన్‌ గ్రావైట్‌.. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్‌ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్‌పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్‌లో రెనాల్ట్‌ ట్రైబర్‌ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి అమర్చారు. బంపర్‌పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్‌ మోడల్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్‌ను అందిస్తున్నాయి.ఫీచర్లు, సేఫ్టీగ్రావైట్‌లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ యాపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్‌తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్.ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్‌ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్‌ ఉన్నాయి.ఇంజిన్, పనితీరుగ్రావైట్‌లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్‌ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)పోటీ మోడళ్లునిస్సాన్‌ గ్రావైట్‌ ప్రధానంగా రెనాల్ట్‌ ట్రైబర్‌తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్‌ఎల్‌6, కియా కారెన్స్‌, కియా కారెన్స్‌ క్లావిస్‌ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

Chinas Lunar New Year Impact on gold silver prices5
పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్‌లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్‌లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.బుధవారం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.బంగారం, వెండి ధరలపై ప్రభావంచైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్‌ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్‌ అమీర్ మక్డా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరమని సూచించారు.షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్‌బ్యాక్‌లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Britannia Industries Gears Up to Compete with Local Players Nationwide6
లోకల్‌తో పోటీకి బ్రిటానియా రెడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్‌ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్‌ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్‌ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్‌ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్‌లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్‌లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్‌డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్‌ తదితర పాపులర్‌ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్‌ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విపిన్‌ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్‌ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement