ప్రధాన వార్తలు
సిల్వర్ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి
వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.అంతకు ముందు ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?
ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్లో హాట్ టాపిక్గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి సంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు.
రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.విశాలమైన ఇళ్లు.. విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్లో రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.లగ్జరీదే హవా.. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు.
అద్దె.. సొంతిల్లు.. ఏది బెటర్?
ఏటేటా పెరుగుతున్న ఇంటి అద్దెలు ఒకవైపు.. తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్న గృహ రుణాలు మరోవైపు.. మధ్యలో సగటు కొనుగోలుదారుడు నలిగిపోతున్నాడు. అద్దె ఇంట్లోనే జీవితం సాగదీద్దామా లేక సొంతిల్లు కొనుగోలు చేసి జీవితంలో మరో మెట్టు ఎక్కుదామా? అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. పోనీ, ధైర్యం చేసి ముందడుగు వేయాలంటే డౌన్ పేవ్మెంట్, ఈఎంఐల భయం.. అలా అని అద్దె ఇంట్లోనే సరిపెట్టుకుందామంటే పెరిగే అద్దెలు, అడ్వాన్స్లు భారంగా మారుతున్నాయి. ..ప్రతీ గృహ కొనుగోలుదారుల సంకట పరిస్థితి ఇదే. వాస్తవానికి దేశంలోని పట్టణాలలో ఇది సర్వ సాధారణమైపోయింది. పెరుగుతున్న ఇంటి అద్దెలు, ఆకర్షణీయమైన గృహ రుణాలతో చాలా మంది తమ నెలవారీ వ్యయాల గురించి పునరాలోచిస్తున్నారు. అద్దె చెల్లిస్తూ ఉండటం మంచిదా? లేక ఈఎంఐ చెల్లిస్తూ సొంతింటిని కొనుగోలు చేయడం మంచిదా? అని! ∙సొంతిల్లు అనేది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇది సమాజంలో గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారడం అంత సులభమేమీ కాదు. జీవితకాలం కష్టపడి చేసిన పొదుపు ఖర్చవడంతో పాటు బ్యాంక్ నుంచి తీసుకునే గృహ రుణానికి నెలవారీ వాయిదా(ఈఎంఐ) ఆర్థిక వ్యయం భారీగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె వంటి మెట్రో నగరాలలో అద్దెలు గణనీయంగాపెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులను పునరాలోచిస్తున్నారు. ఇంటి యాజమాన్యం తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇల్లు కొనడం ప్రయోజనకరం.. అద్దె పెంచుతామనో, నచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఇంటి యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంటిని మనకు నచి్చనట్లు డిజైన్ చేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. పైగా సొంతింటి కొనుగోలులో ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్–80(సీ) కింద అసలు చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుతో పాటు సెక్షన్ 24(4) కింద గృహరుణంపై చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. ఇల్లు కొనడంలో సవాళ్లు.. తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసే చాలా మందికి అతిపెద్ద అడ్డంకి డౌన్ పేమెంట్. సాధారణంగా బ్యాంక్లు ఆస్తి విలువలో 75–80 శాతం వరకు గృహ రుణాన్ని అందిస్తాయి. అంటే మీరు మిగిలిన 20 శాతం సొమ్మును ఏర్పాటు చేసుకోవాలి. దీనికి తోడు రిజి్రస్టేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు, మధ్యవర్తులెవరైనా ఉంటే వాళ్ల కమీషన్ భరించక తప్పదు. ఉదాహరణకు.. రూ.60 లక్షల ఇంటిని కొనుగోలు చేద్దామని మీరు భావిస్తే.. ముందుగా రూ.15–18 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణ అర్హత అంశం. ఆదాయం, వయస్సు, క్రెడిట్ స్కోర్, అప్పటికే ఉన్న అప్పులు.. ఇవన్నీ మీరు ఎంత రుణానికి అర్హత సాధిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్లు స్థిరమైన ఆదాయం ఉన్న వేతన జీవులకే రుణం మంజూరుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఎందుకంటే గృహ రుణమనేది సుమారు 15– 20 ఏళ్ల కాలం పాటు ఉండే దీర్ఘకాలిక నిబద్ధతతో కూడుకున్న అంశం. అందుకే అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకోవాలి. దీన్ని మీ ఆదాయం తట్టుకోగలదని నిర్ధారించుకోవాలి.ఆర్థిక స్థోమత చెక్ చేసుకోవాలిఈ రోజుల్లో పెరిగిన ప్రాపర్టీ ధరలకు సొంతిల్లు కొనాలంటే బ్యాంక్ నుంచి గృహ రుణం తప్పనిసరి. తీసుకునే రుణానికి ఈఎంఐ ఎంత కట్టాలని మాత్రమే చూడకూడదు. కొనే ఇంటికి నిర్వహణ చార్జీలు, సొసైటీ రుసుములు, గృహ బీమా, భవిష్యత్తులో ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్ను మెరుగుపర్చుకోవాలి బ్యాంక్ గృహ రుణానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ తప్పనిసరి. ఆదాయం ఎక్కువ ఉండగానే సరిపోదు క్రెడిట్ స్కోర్కు కూడా బాగుండాలి. అందుకే మంచి క్రెడిట్ స్కోర్(750, అంతకంటే ఎక్కువ) ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందే వీలుంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు, వ్యక్తిగత, వాహన రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని క్లియర్ చేసి ఆ తర్వాత గృహ రుణానికి వెళ్లడం ఉత్తమం.పొదుపును ప్రారంభించండి తీసుకున్న గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తుండంతోనే సరిపోదు. మధ్యలో ఏమైనా అత్యవసర ఖర్చులు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డౌన్ పేమెంట్ కోసం ప్రత్యేక పొదుపు నిధిని ప్రారంభించండి. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు.. కానీ అంతిమంగా మీ రుణ భారాన్ని తగ్గిస్తుంది. సరసమైన గృహాలను వెతకండి: ఠి ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడుస్తుంటే మాత్రం సాధ్యమైనంత వరకు సరసమైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్లనే ఎంచుకోవడం బెటర్. విలాసం, ఆధునిక వసతుల జోలికి వెళ్లకుండా.. మెరుగైన మౌలిక, సామాజిక వసతులు కల్పిపంచే ప్రాజెక్ట్లను ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాకుండా సరసమైన గృహ నిర్మాణాలకు ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద రుణ సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.పెరుగుతున్న అద్దెలు.. మెట్రో నగరాలలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో అద్దెలు ఏకంగా 72 శాతం మేర పెరిగాయి. ప్రజా రవాణా, మెట్రోలతో అనుసంధానమై ఉన్న చాలా ప్రాంతాల్లో అయితే ప్రాపరీ్టల ధరల కంటే ఇంటి అద్దెలే అధికంగా పెరిగాయి. నగరంలో ఇంటి అద్దెలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం మేర పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్పల్లి వంటి ఐటీ హబ్కు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో 2బీహెచ్కే అద్దె సుమారు రూ.35 వేల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాలలో అయితే రూ.25 వేల నుంచి ఉంటున్నాయి. కోకాపేట, మోకిల, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో రూ.50–70 వేల మధ్యలో చెబుతున్నారు.ఆ పరిస్థితుల్లో అద్దె బెటర్.. స్థిరమైన ఉద్యోగం కాకపోయినా లేదా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా అద్దెకు ఉండటమే ఉత్తమం. జీవితంలో స్థిరపడ్డాక సొంతిల్లు కొనాలనే ముందస్తు ఆలోచన అత్యంత తెలివైన దీర్ఘకాలిక నిర్ణయాలలో ఒకటి. అందుకోసం ముందునుంచే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ఉత్తమం. ఇది మొదట్లో కాస్త భారం, భయం అనిపించినా.. ప్రతి ఈఎంఐ చెల్లింపు సమయంలో నా జీవిత కలను సొంతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులనే ధైర్యం వస్తుంది.
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
దేశంలో బంగారం, వెండి ధరలు లావాలా ఎగిశాయి. వరుసగా ఆరో రోజూ ధరలు అంత ఎత్తున ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇండిగోకు మరో నోటీసు.. భారీ జరిమానా
ప్రముఖ ఎయిర్లైన్స్ ఇండిగోపై భారీ జరిమానా పడింది. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇండిగో విమానయాన సంస్థపై రూ.13 లక్షలకు పైగా పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఏకీభవించని ఇండిగో, చట్టపరమైన మార్గాల్లో దీనిని సవాలు చేయనున్నట్లు ప్రకటించింది.పంజాబ్ రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండిగో సంస్థపై రూ.13,28,255 జరిమానాను విధించింది. ఈ ఉత్తర్వులు తప్పుగా భావిన్తున్నట్లు ఇండిగో తెలిపింది. దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద ఎయిర్లైన్ అయిన తమకు ఈ అంశంలో న్యాయపరంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, ఈ మేరకు బయటి నుంచి పన్ను నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేసింది.“ఈ నేపథ్యంలో తగిన అధికారి ముందు ఈ ఉత్తర్వును సవాలు చేస్తాం” అని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ జరిమానా తమ ఆర్థిక స్థితి, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపదని కూడా కంపెనీ స్పష్టం చేసింది.ఇటీవల కార్యాచరణ, వాతావరణ సంబంధిత సవాళ్ల కారణంగా వందలాది విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమవడం వంటి అంతరాయాల తర్వాత ఇండిగోకు ఈ జీఎస్టీ నోటీసు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాబోయే సెలవుల సీజన్లో పెరిగే ప్రయాణ డిమాండ్ను సమర్థంగా నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది.
కార్పొరేట్
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?
ఇండిగోకు మరో నోటీసు.. భారీ జరిమానా
మా బ్యాంకులో రూ.2,434 కోట్ల ఫ్రాడ్
ప్రాంతీయ భాషలే ప్లస్
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
రూ.26 లక్షల ఆఫర్.. మేనేజర్ వల్ల బంగారంలాంటి ఛాన్స్ మిస్!
ముంబయిలో రెండో ఎయిర్పోర్ట్.. కార్యకలాపాలు షురూ!
వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే!
‘కొత్త ఏడాదిలో భారత్ను వదిలి వెళ్తున్నా!’
పెట్రోల్ బంకులు @ 1,00,000
2025లో అహో 2026లో ఒహో
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత...
లిస్టింగ్కు శాంసంగ్ నో
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్ యోచన లేదని దక్షిణ ...
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వ...
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ ...
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల...
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్కు ప్రేరణనివ్వడం ద్వార...
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధర...
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో క...
ఆటోమొబైల్
టెక్నాలజీ
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి.
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది.
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.


