Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Benefits of making extra Home Loan payments1
గృహ రుణానికి ముందే గుడ్‌బై

ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్‌... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్‌తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్‌గ్రేడ్‌ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్‌గ్రేడ్‌ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా! అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్‌మెంట్‌ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్‌ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...రూ.5,000 చేసే మ్యాజిక్‌ ఇదీ...ఉదాహరణకు శ్రీకర్‌ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... → శ్రీకర్‌ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 → 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. → కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... → 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. → ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది. → ఇలా స్మార్ట్‌ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.ఒకే విడతా లేక నెలవారీనా..?→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం → దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది → బోనస్‌ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. → అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. → అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.అంత ఆదా సాధ్యమా?→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. → ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. → ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు. → రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. → ఒకవేళ బ్యాంక్‌ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్‌ ఇస్తే.. అంగీకరించొద్దు. ఫ్లోటింగ్‌ – ఫిక్స్‌డ్‌ రేటు రుణం→ ఫ్లోటింగ్‌ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. → ఫిక్స్‌డ్‌ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. → ప్రస్తుతం బ్యాంక్‌లు/ ఎన్‌బీఎఫ్‌సీలు ఫ్లోటింగ్‌ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. → ఒకవేళ బ్యాంక్‌ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్‌ ఇస్తే.. అంగీకరించొద్దు.

RBI interest rate decision and FIIs activity to drive markets2
వృద్ధి గుడ్‌.. మరి వడ్డీ రేట్లో?

మార్కెట్లు ఆల్‌టైమ్‌ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్‌ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్‌కు గురయ్యింది. ఈ సారి మాత్రం మార్కెట్లు ముందుకెళ్ళి, కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. గత వారం చివర్లో... అది కూడా మార్కెట్లు ముగిశాక విడుదలైన క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు మార్కెట్‌ను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది వారి అభిప్రాయం. ఎందుకంటే వృద్ధి రేటు అంచనాలను మించింది. తయారీ, సర్వీసు రంగాలు 9 శాతం వృద్ధిని దాటి పరుగు తీయడంతో ఆరి్థక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇది ఆరు త్రైమాసికాలలోనే అత్యధికం. కాబట్టి ఈ ప్రభావం సోమవారం మార్కెట్లలో ప్రతిఫలించనునున్న విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌ టారిఫ్‌ల నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లను సవరించటమనేది దేశ ఆరి్థక వ్యవస్థ బలపడటానికి ఉపకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. దేశీ కీలకాంశాలివే... → ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే దేశీయ అంశాల్లో ప్రధానమైనది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి విధానంపై జరిపే సమీక్షా సమావేశం. ఈ నెల 5న (వారాంతాన) ఈ సమావేశం ముగుస్తుంది. మరింతగా రేట్లను తగ్గించటమా... లేదా యథాతథ పరిస్థితిని కొనసాగించటమా అన్నది మార్కెట్లను ప్రభావితం చేయనుంది. వృద్ధి రేటు పెరిగింది కనక రేట్ల కోత ఉండొచ్చన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది. → డిసెంబరు 1న (సోమవారం) అక్టోబర్‌ నెలకు సంబంధించిన దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలవుతాయి. సెపె్టంబర్‌లో ఐఐపీ 4 శాతం వద్ద నిలకడగా నమోదైంది. తయారీ రంగం 4.8 శాతం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. → నవంబర్‌ నెలకు ఆటో రంగ విక్రయ గణాంకాలు సైతం 1న వెలువడనున్నాయి. దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సర్వీసులు, కాంపోజిట్‌ పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. సాంకేతికంగా స్పీడ్‌.. → గత వారం మొదట్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాయి. దీంతో సరికొత్త గరిష్టాలను తాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85707 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,203 పాయింట్ల వద్ద ముగిశాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం సైతం మార్కెట్లు మరింత పుంజుకునే వీలుంది. నిఫ్టీ 26,300 పాయింట్లను దాటితే.. 26,800– 26,850 వరకూ బలపడవచ్చు. ఇలాకాకుండా ఈ స్థాయిలో బలహీనపడితే.. తొలుత 26,000 పాయింట్లకు నీరసించవచ్చు. తదుపరి 25,850–25,800 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ లభించే వీలుంది. గమనించాల్సిన ప్రధాన షేర్లు... అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్, భారత్‌ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్, గెయిల్‌ ఇండియా కంపెనీల షేర్లను గతవారం పలు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్‌ చేశాయి. వీటి టార్గెట్‌ ధరను అప్‌గ్రేడ్‌ చేశాయి కూడా. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు ఈ షేర్లలో కదలికలను గమనించవచ్చు.

Sakshi Special Story About Credit card profits and losses3
మీ కార్డు సంపాదిస్తోందా?

చాలామందికి క్రెడిట్‌ కార్డంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా... క్రమశిక్షణతో వాడితే క్రెడిట్‌ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లూ వస్తాయి. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లలో ఉచిత సదుపాయాలు... ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినప్పుడు నో–కాస్ట్‌ ఈఎంఐ తీసుకుంటే... రూపాయి వడ్డీలేకుండా వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం... ఇలా చాలా లాభాలుంటాయి. కాకపోతే ఒక్కటే షరతు. ఏ క్రెడిట్‌ కార్డుపై ఎంత కొన్నా... బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించెయ్యాలి. అలాకాకుండా ఈ సారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో...! మీ పని అయిపోయినట్లే!!.సరైన ఆదాయం లేకపోవటమో... అప్పులంటే భయమో... లేదా సమాచారం లేకపోవటమో... ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్నవారు ఐదారు శాతానికి మించి లేరు. అమెరికా లాంటి దేశాల్లో ఏకంగా 80 శాతం మందికిపైగా కనీసం ఒక్క క్రెడిట్‌ కార్డయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్‌ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలున్నాయి కాబట్టే... కంపెనీలు రకరకాల ఆఫర్లిస్తూ మరింతమందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇదీ.. అసలైన లాభం ప్రతి క్రెడిట్‌ కార్డుకూ ఓ లిమిట్‌ ఉంటుంది. ఉదాహరణకు రాఘవకు యాక్సిస్‌ బ్యాంకు కార్డుంది. దాని లిమిట్‌ రూ.6 లక్షలు. అంటే రూ.6 లక్షల వరకూ తను వాడుకోవచ్చన్న మాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే... తన జేబులో రూ.6 లక్షలున్నట్లే కదా? ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచి్చనా... డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పనిలేదు కూడా. ఇక ప్రతి కార్డుకూ బిల్లింగ్‌ తేదీ... చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్‌ తేదీకి 30 రోజుల సైకిల్‌... చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధన్న మాట. బిల్లింగ్‌ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్న మాట. దాన్ని గడువులోపు చెల్లించేస్తే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు.ఇదీ.. ప్రమాదానికి సంకేతం మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ రూ.2 లక్షలు వాడారనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించటంతో పాటు... ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడినదాంట్లో 5 శాతాన్ని చెల్లించవచ్చని (మినిమం బిల్‌) పేర్కొంటారు. అంటే రూ.10వేలు చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36 శాతానికిపైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే ఆపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్‌ను దాటి వాడినా భారీ చార్జీలు చెల్లించాలి. వీటివల్ల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయిపోతాయి. ప్రతినెలా కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదని గుర్తుంచుకోవాలి. క్రెడిట్‌ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే.కో–బ్రాండెడ్‌ కార్డులు కూడా... చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు ఆఫర్‌ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీబ్యాంకు ఐఓసీతో జతకట్టి సిటీ–ఐఓసీ కార్డును ఆఫర్‌ చేసింది. సిటీ క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్‌ బ్యాంకు కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోలు లేదా డీజిల్‌ పోయించుకుంటే 2 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ వస్తుందన్న మాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయొచ్చు కూడా.రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్‌.. → ఎస్‌బీఐ క్యాష్‌ బ్యాక్‌ కార్డ్‌: ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ఫ్లాట్‌ 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. → యాక్సిస్‌ బ్యాంక్‌ ఏస్‌: కొనుగోళ్లపై 2–5 మధ్య క్యాష్‌ బ్యాక్‌. గూగుల్‌ పేతో లింక్‌ చేసుకోవచ్చు. → హెచ్‌డీఎఫ్‌సీ రిగాలియా: ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు.ఇలా చేయొద్దు... → కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, ప్రతి నెలా ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. → ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అవసరం లేకపోయినా క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లు చేయడం స్మార్ట్‌ కానే కాదు. → వార్షిక ఫీజుపైనా దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా... కొన్ని సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇదీ క్యాష్‌బ్యాక్‌ పవర్‌.. → ఒక నెలలో కార్డుతో ఆన్‌లైన్‌లో రూ.30,000 ఖర్చు చేశారు. → 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద రూ.1,500 వెనక్కి వస్తుంది. → ఇలా ఒక ఏడాదిలో రూ.18,000 ఆదా చేసుకోవచ్చు. → ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్‌లో ఏటా రూ.18,000 చొప్పున పదేళ్లు ఇన్వెస్ట్‌ చేసుకుంటే, 12 శాతం రాబడి ఆధారంగా రూ.3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్‌ అంటే ఇలా.. → క్రెడిట్‌కార్డు బిల్లును ప్రతి నెలా గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. → కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయనే చేయొద్దు → గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్‌ సదుపాయం యాక్టివేట్‌ చేసుకోవాలి. → లిమిట్‌ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. → క్రెడిట్‌ కార్డులు రెండుకు మించకుండా చూసుకోండి.

BSNL Rs 199 Recharge Plan Details4
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..

భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Say About A Winner As The Global Economy Crashes5
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్‌కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.HOW MUCH WILL $100 BUY?1900: $100 would buy 8 months of groceries.1960: $100 was worth $372000: $100 worth $62025: $100 worth $3.80Money tip # 2: On how to be a winner as the global economy crashes is:“Stop Being a Loser.”Losers are losers because they…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 30, 2025

Nothing Phone 3A Lite Launched in India6
నథింగ్‌ ఫోన్‌ ‘3ఎ లైట్‌’: ధర ఎంతంటే?

లండన్‌ ఆధారిత టెక్‌ కంపెనీ నథింగ్‌ కొత్తగా తమ ఫోన్‌ (3ఎ) లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్‌ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్‌ ఫోన్‌ డిసెంబర్‌ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్‌ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్‌ ఫోన్‌ ‘3ఎ లైట్‌’లో 6.77 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, ట్రూలెన్స్‌ ఇంజిన్‌ 4.0, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్‌ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్‌ పొందవచ్చు.

Advertisement
Advertisement
Advertisement