Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Rich Dad Poor Dad Robert Kiyosaki Celebrates silver 1
సిల్వర్‌ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి

వెండి ధర మళ్లీ రికార్డ్‌ యిలో ఎగిసింది. భారత్‌లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్‌‌కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్‌ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్‌ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.అంతకు ముందు ఈ వైట్‌ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్‌ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025

Chinese Village Fines Unmarried Couples And Pregnancies2
పెళ్లి చేసుకోకుంటే పన్ను కట్టాలా?

ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్‌ ఈజ్‌ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి స​ంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు.

Real Estate Boom Continues in Hyderabad with Record Registrations3
రియల్‌ ఎస్టేట్‌.. ఫుల్‌ జోష్‌!

హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్‌ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్‌లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్‌తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్‌ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.విశాలమైన ఇళ్లు.. విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో రిజిస్ట్రేషన్‌ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.లగ్జరీదే హవా.. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు.

Rent House or Own House4
అద్దె.. సొంతిల్లు.. ఏది బెటర్‌?

ఏటేటా పెరుగుతున్న ఇంటి అద్దెలు ఒకవైపు.. తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్న గృహ రుణాలు మరోవైపు.. మధ్యలో సగటు కొనుగోలుదారుడు నలిగిపోతున్నాడు. అద్దె ఇంట్లోనే జీవితం సాగదీద్దామా లేక సొంతిల్లు కొనుగోలు చేసి జీవితంలో మరో మెట్టు ఎక్కుదామా? అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. పోనీ, ధైర్యం చేసి ముందడుగు వేయాలంటే డౌన్‌ పేవ్‌మెంట్, ఈఎంఐల భయం.. అలా అని అద్దె ఇంట్లోనే సరిపెట్టుకుందామంటే పెరిగే అద్దెలు, అడ్వాన్స్‌లు భారంగా మారుతున్నాయి. ..ప్రతీ గృహ కొనుగోలుదారుల సంకట పరిస్థితి ఇదే. వాస్తవానికి దేశంలోని పట్టణాలలో ఇది సర్వ సాధారణమైపోయింది. పెరుగుతున్న ఇంటి అద్దెలు, ఆకర్షణీయమైన గృహ రుణాలతో చాలా మంది తమ నెలవారీ వ్యయాల గురించి పునరాలోచిస్తున్నారు. అద్దె చెల్లిస్తూ ఉండటం మంచిదా? లేక ఈఎంఐ చెల్లిస్తూ సొంతింటిని కొనుగోలు చేయడం మంచిదా? అని! ∙సొంతిల్లు అనేది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇది సమాజంలో గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారడం అంత సులభమేమీ కాదు. జీవితకాలం కష్టపడి చేసిన పొదుపు ఖర్చవడంతో పాటు బ్యాంక్‌ నుంచి తీసుకునే గృహ రుణానికి నెలవారీ వాయిదా(ఈఎంఐ) ఆర్థిక వ్యయం భారీగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె వంటి మెట్రో నగరాలలో అద్దెలు గణనీయంగాపెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులను పునరాలోచిస్తున్నారు. ఇంటి యాజమాన్యం తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇల్లు కొనడం ప్రయోజనకరం.. అద్దె పెంచుతామనో, నచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఇంటి యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంటిని మనకు నచి్చనట్లు డిజైన్‌ చేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. పైగా సొంతింటి కొనుగోలులో ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌–80(సీ) కింద అసలు చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుతో పాటు సెక్షన్‌ 24(4) కింద గృహరుణంపై చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. ఇల్లు కొనడంలో సవాళ్లు.. తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసే చాలా మందికి అతిపెద్ద అడ్డంకి డౌన్‌ పేమెంట్‌. సాధారణంగా బ్యాంక్‌లు ఆస్తి విలువలో 75–80 శాతం వరకు గృహ రుణాన్ని అందిస్తాయి. అంటే మీరు మిగిలిన 20 శాతం సొమ్మును ఏర్పాటు చేసుకోవాలి. దీనికి తోడు రిజి్రస్టేషన్, స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, మధ్యవర్తులెవరైనా ఉంటే వాళ్ల కమీషన్‌ భరించక తప్పదు. ఉదాహరణకు.. రూ.60 లక్షల ఇంటిని కొనుగోలు చేద్దామని మీరు భావిస్తే.. ముందుగా రూ.15–18 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణ అర్హత అంశం. ఆదాయం, వయస్సు, క్రెడిట్‌ స్కోర్, అప్పటికే ఉన్న అప్పులు.. ఇవన్నీ మీరు ఎంత రుణానికి అర్హత సాధిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరమైన ఆదాయం ఉన్న వేతన జీవులకే రుణం మంజూరుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఎందుకంటే గృహ రుణమనేది సుమారు 15– 20 ఏళ్ల కాలం పాటు ఉండే దీర్ఘకాలిక నిబద్ధతతో కూడుకున్న అంశం. అందుకే అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకోవాలి. దీన్ని మీ ఆదాయం తట్టుకోగలదని నిర్ధారించుకోవాలి.ఆర్థిక స్థోమత చెక్‌ చేసుకోవాలిఈ రోజుల్లో పెరిగిన ప్రాపర్టీ ధరలకు సొంతిల్లు కొనాలంటే బ్యాంక్‌ నుంచి గృహ రుణం తప్పనిసరి. తీసుకునే రుణానికి ఈఎంఐ ఎంత కట్టాలని మాత్రమే చూడకూడదు. కొనే ఇంటికి నిర్వహణ చార్జీలు, సొసైటీ రుసుములు, గృహ బీమా, భవిష్యత్తులో ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపర్చుకోవాలి బ్యాంక్‌ గృహ రుణానికి మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఆదాయం ఎక్కువ ఉండగానే సరిపోదు క్రెడిట్‌ స్కోర్‌కు కూడా బాగుండాలి. అందుకే మంచి క్రెడిట్‌ స్కోర్‌(750, అంతకంటే ఎక్కువ) ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందే వీలుంటుంది. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులు, వ్యక్తిగత, వాహన రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని క్లియర్‌ చేసి ఆ తర్వాత గృహ రుణానికి వెళ్లడం ఉత్తమం.పొదుపును ప్రారంభించండి తీసుకున్న గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తుండంతోనే సరిపోదు. మధ్యలో ఏమైనా అత్యవసర ఖర్చులు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డౌన్‌ పేమెంట్‌ కోసం ప్రత్యేక పొదుపు నిధిని ప్రారంభించండి. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు.. కానీ అంతిమంగా మీ రుణ భారాన్ని తగ్గిస్తుంది. సరసమైన గృహాలను వెతకండి: ఠి ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడుస్తుంటే మాత్రం సాధ్యమైనంత వరకు సరసమైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవడం బెటర్‌. విలాసం, ఆధునిక వసతుల జోలికి వెళ్లకుండా.. మెరుగైన మౌలిక, సామాజిక వసతులు కల్పిపంచే ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాకుండా సరసమైన గృహ నిర్మాణాలకు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద రుణ సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.పెరుగుతున్న అద్దెలు.. మెట్రో నగరాలలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో అద్దెలు ఏకంగా 72 శాతం మేర పెరిగాయి. ప్రజా రవాణా, మెట్రోలతో అనుసంధానమై ఉన్న చాలా ప్రాంతాల్లో అయితే ప్రాపరీ్టల ధరల కంటే ఇంటి అద్దెలే అధికంగా పెరిగాయి. నగరంలో ఇంటి అద్దెలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం మేర పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హైటెక్‌ సిటీ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్‌పల్లి వంటి ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో 2బీహెచ్‌కే అద్దె సుమారు రూ.35 వేల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, ఉప్పల్, ఎల్బీనగర్‌ వంటి శివారు ప్రాంతాలలో అయితే రూ.25 వేల నుంచి ఉంటున్నాయి. కోకాపేట, మోకిల, తెల్లాపూర్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో రూ.50–70 వేల మధ్యలో చెబుతున్నారు.ఆ పరిస్థితుల్లో అద్దె బెటర్‌.. స్థిరమైన ఉద్యోగం కాకపోయినా లేదా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా అద్దెకు ఉండటమే ఉత్తమం. జీవితంలో స్థిరపడ్డాక సొంతిల్లు కొనాలనే ముందస్తు ఆలోచన అత్యంత తెలివైన దీర్ఘకాలిక నిర్ణయాలలో ఒకటి. అందుకోసం ముందునుంచే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ఉత్తమం. ఇది మొదట్లో కాస్త భారం, భయం అనిపించినా.. ప్రతి ఈఎంఐ చెల్లింపు సమయంలో నా జీవిత కలను సొంతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులనే ధైర్యం వస్తుంది.

Gold and Silver rates on 27th December 2025 in Telugu states5
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!

దేశంలో బంగారం, వెండి ధరలు లావాలా ఎగిశాయి. వరుసగా ఆరో రోజూ ధరలు అంత ఎత్తున ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

IndiGo slapped with Rs 13 lakh GST penalty6
ఇండిగోకు మరో నోటీసు.. భారీ జరిమానా

ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ ఇండిగోపై భారీ జరిమానా పడింది. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇండిగో విమానయాన సంస్థపై రూ.13 లక్షలకు పైగా పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఏకీభవించని ఇండిగో, చట్టపరమైన మార్గాల్లో దీనిని సవాలు చేయనున్నట్లు ప్రకటించింది.పంజాబ్ రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండిగో సంస్థపై రూ.13,28,255 జరిమానాను విధించింది. ఈ ఉత్తర్వులు తప్పుగా భావిన్తున్నట్లు ఇండిగో తెలిపింది. దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన తమకు ఈ అంశంలో న్యాయపరంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, ఈ మేరకు బయటి నుంచి పన్ను నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేసింది.“ఈ నేపథ్యంలో తగిన అధికారి ముందు ఈ ఉత్తర్వును సవాలు చేస్తాం” అని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ జరిమానా తమ ఆర్థిక స్థితి, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపదని కూడా కంపెనీ స్పష్టం చేసింది.ఇటీవల కార్యాచరణ, వాతావరణ సంబంధిత సవాళ్ల కారణంగా వందలాది విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమవడం వంటి అంతరాయాల తర్వాత ఇండిగోకు ఈ జీఎస్టీ నోటీసు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాబోయే సెలవుల సీజన్‌లో పెరిగే ప్రయాణ డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement