Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SEIL Energy India Limited has been recognized as a Great Place To Work1
ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీకి గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ గుర్తింపు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సరి్టఫికేషన్‌ లభించింది. ఉద్యోగానికి అనువైన సంస్థగా 86 శాతం మంది ఉద్యోగులు ఎస్‌ఈఐఎల్‌ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ గుర్తింపును పొందడం వరుసగా ఇది రెండోసారని వివరించింది. వ్యక్తిగత జీవితం–ఉద్యోగం మధ్య సమతుల్యత, ఉద్యోగుల ఎదుగుదలకు అవకాశాల కల్పన తదితర అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు.

 IHCL sells 25. 52percent stake in Taj GVK to GVK-Bhupal family2
తాజ్‌ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్‌

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌) భాగస్వామ్య సంస్థ తాజ్‌ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్‌ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్‌ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్‌ కుటుంబం తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో 74.99 శాతం వాటా పొందనుంది. కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్‌ 2030)లో భాగంగా అసెట్‌లైట్‌ క్యాపిటల్‌ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్‌సీఎ ల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ చత్వాల్‌ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్‌ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. కాగా.. భవిష్యత్‌ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్‌సీఎల్‌తో 2025 అక్టోబర్‌లో 256 గదుల తాజ్‌ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ జేఎండీ కృష్ణ భూపాల్‌ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్‌తోపాటు.. తాజ్‌ జీవీకే పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ, తాజ్‌ డెక్కన్, తాజ్‌ క్లబ్‌హౌస్‌ (చెన్నై), తాజ్‌ చండీగఢ్, వివాంతా హైదరాబాద్‌(బేగంపేట) ఉన్నాయి.

Reliance Consumer Products acquires majority stake in Udhaiyams3
రిలయన్స్‌ కన్జూమర్‌ చేతికి ఉదయమ్స్‌ 

చెన్నై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ తాజాగా తమిళనాడు సంస్థ ఉదయమ్స్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. అయితే వాటా కొనుగోలు విలువ వెల్లడికాలేదు. ఒప్పందం ప్రకారం ఉదయమ్స్‌ ఆగ్రో ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెలో గత ప్రమోటర్లు ఎస్‌.సుధాకర్, ఎస్‌.దినకర్‌ మైనారిటీ వాటాతో కొనసాగనున్నారు. ఉదయమ్‌ బ్రాండుతో మూడు దశాబ్దాలుగా తమిళనాడు మార్కెట్లో కంపెనీ పటిష్ట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పంపిణీ నెట్‌వర్క్‌ ద్వారా బియ్యం, మసాలా దినుసులు, ఇడ్లీ నూక, స్నాక్స్‌ తదితర నిత్యావసరాలు విక్రయిస్తోంది.

Adani to invest Rs 1 lakh crore in airports4
ఆకాశమే హద్దు

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ విమానాశ్రయాల బిజినెస్‌పై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుంది. రానున్న ఐదేళ్లలో ఇందుకు రూ. లక్ష కోట్లు వెచి్చంచనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ డైరెక్టర్, బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు జీత్‌ అదానీ పేర్కొన్నారు. ఈ నెల 25న నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ విమానాశ్రయ పరిశ్రమపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. వెరసి తదుపరి 11 ఎయిర్‌పోర్టుల బిడ్డింగ్‌లో మరింత భారీగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా ఏవియేషన్‌ రంగం వార్షిక పద్ధతిలో 15–16 శాతం విస్తరించవచ్చునని అంచనా వేశారు. గ్రూప్‌ విమానాశ్రయ పోర్ట్‌ఫోలియోలో నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(ఎన్‌ఎంఏఐఎల్‌) తాజాగా చేరనుంది. తద్వారా దేశీ ఏవియేషన్‌ రంగంలో కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఎన్‌ఎంఏఐఎల్‌లో అదానీ గ్రూప్‌ వాటా 74% కాగా.. 2025 డిసెంబర్‌ 25న వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలకు తెరతీయనుంది. రూ. 19,650 కోట్లు అదానీ గ్రూప్‌ రూ. 19,650 కోట్ల తొలి దశ పెట్టుబడులతో ఎన్‌ఎంఏఐఎల్‌ను అభివృద్ధి చేసింది. వార్షికంగా 2 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్‌ చేయగల సామర్థ్యంతో ఏర్పాటైంది. తదుపరి సామర్థ్యాన్ని 9 కోట్లమంది ప్రయాణికులకు అనువుగా విస్తరించనుంది. తద్వారా ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుర్కొంటున్న సామర్థ్య సవాళ్లకు చెక్‌ పెట్టనుంది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(ఎంఐఏఎల్‌)ను జీవీకే గ్రూప్‌ నుంచి అదానీ గ్రూప్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా అదానీ గ్రూప్‌ అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరులోనూ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది.

Japan MUFG to buy 20percent stake in India Shriram Finance5
శ్రీరామ్‌ ఫైనాన్స్‌పై మిత్సుబిషి ఫోకస్‌

ఇటీవల దేశీ ఫైనాన్షియల్‌ రంగంలో పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ మెజారిటీ వాటాను సొంతం చేసుకోగా, యస్‌ బ్యాంక్‌లో జపనీస్‌ దిగ్గజం ఎస్‌ఎంబీసీ సైతం 25 శాతం వాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో జపనీస్‌ దిగ్గజం ఎంయూఎఫ్‌జీ భారీగా ఇన్వెస్ట్‌ చేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో జపనీస్‌ దిగ్గజం మిత్సుబిషీ యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌(ఎంయూఎఫ్‌జీ) 20 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రెండు సంస్థలు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు అనుగుణంగా శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 47.11 కోట్ల ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 840.93 ధరలో వీటిని ఎంయూఎఫ్‌జీ కొనుగోలు చేయనుంది. తద్వారా శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో 4.4 బిలియన్‌ డాలర్లు(రూ. 39,618 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. వెరసి దేశీ ఫైనాన్షియల్‌ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఇది నిలవనుంది. తాజా డీల్‌.. దేశీ ఫైనాన్షియల్‌ రంగ పటిష్టత, వృద్ధి అవకాశాలపట్ల విశ్వాసానికి ప్రతీకగా శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ ఉమేష్‌ రేవంకర్‌ పేర్కొన్నారు. వాటాదారుల అనుమతి, నియంత్రణ సంస్థల క్లియరెన్స్‌ల తదుపరి ఎంయూఎఫ్‌జీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. తాజా నిధులు సంస్థ మూలధన పటిష్టతకు, దీర్ఘకాలిక వృద్ధికి సహకరిస్తాయని తెలియజేసింది. ఎంయూఎఫ్‌జీతో భాగస్వామ్యం చౌక నిధుల సమీకరణ, మెరుగైన క్రెడిట్‌ రేటింగ్స్‌కు వీలు కలి్పంచడంతోపాటు, పాలన, నిర్వహణలో ప్రపంచ ప్రమాణాల సరసన నిలుపుతుందని పేర్కొంది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ వృద్ధికి మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ గ్రూప్‌ సీఈవో హిరొనోరీ కమెజావా పేర్కొన్నారు. తద్వారా భారత్‌లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. ఇద్దరు డైరెక్టర్లు శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో 20 శాతం వాటా చేజిక్కించుకున్నాక బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను నియమించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎంయూఎఫ్‌జీ వెల్లడించింది. భారత్‌లో యొకొహామా స్పెసీ బ్యాంక్‌ ముంబై బ్రాంచ్‌తో 1,894లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ 1.7 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి కలి్పంచింది. గిఫ్ట్‌ సిటీలో బ్రాంచ్‌ ప్రారంభించిన తొలి జపనీస్‌ బ్యాంక్‌గా నిలుస్తోంది. 2023లో డిజిటల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసులందిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ డీఎంఐ ఫైనాన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. కాగా.. యూఏఈలో రెండో పెద్ద సంస్థ ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీ ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 60 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచి్చంచింది. అంతకుముందే మరో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌లో జపనీస్‌ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంబీసీ) 24 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 16,330 కోట్లకుపైగా వెచ్చించింది.

Air Pollution Effect Difference Between BS4 vs BS6 Vehicles6
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..

ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలుఅంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలుకాలుష్యంఎక్కువచాలా తక్కువNOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువPM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppmడీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరిరియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుందినిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువవాహన ధరతక్కువకొంచెం ఎక్కువనగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతిపర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలంBS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్‌లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!

Advertisement
Advertisement
Advertisement