ప్రధాన వార్తలు
కార్లయిల్కు స్పైస్జెట్ షేర్లు
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ తాజాగా గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్, ఫైనాన్సింగ్ సంస్థ కార్లయిల్ ఏవియేషన్ పార్ట్నర్స్(సీఏపీ)కు ఈక్విటీ షేర్లను కేటాయించింది. తద్వారా బ్యాలన్స్షిట్ నుంచి 50 మిలియన్ డాలర్ల లయబిలిటీల(రూ. 442 కోట్ల రుణాలు)ను తగ్గించుకుంది. అంతేకాకుండా తాజా నిధులతో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దారి ఏర్పాటు చేసుకోనుంది. 121.18 మిలియన్ డాలర్ల లీజ్ బకాయిల పునర్వ్యవస్థీకరణకు సీఏపీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సెపె్టంబర్ 11న కంపెనీ ప్రకటించింది. దీంతో 89.5 మిలియన్ డాలర్ల లిక్విడిటీకి వీలున్నట్లు తెలియజేసింది. తద్వారా పునర్వ్యవస్థీకరణ చర్యల కొనసాగింపునకు మద్దతు లభించనున్నట్లు పేర్కొంది. కాగా.. కంపెనీ బోర్డు అలాట్మెంట్ కమిటీ షేరుకి రూ. 42.32 ధరలో నాన్ప్రమోటర్ కేటగిరీలో ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 10,41,72,634 షేర్ల జారీకి తాజాగా ఆమోదముద్ర వేసినట్లు స్పైస్జెట్ వెల్లడించింది. అంతేకాకుండా 79.6 మిలియన్ డాలర్ల నగదు మెయింటెనెన్స్ రిజర్వులకు ఒప్పందం వీలు కలి్పంచనుంది. భవిష్యత్లో ఎయిర్క్రాఫ్ట్, ఇంజిన్ల నిర్వహణకు వీటిని వినియోగించనుంది. మరో 9.9 మిలియన్ డాలర్లు లీజ్ ఆబ్లిగేషన్లకుగాను నగదు నిర్వహణా క్రెడిట్స్గా పొందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్)లో స్పైస్జెట్ నికర నష్టం భారీగా పెరిగి రూ. 635 కోట్లను తాకిన విషయం విదితమే. బీఎస్ఈలో స్పైస్జెట్ షేరు దాదాపు యథాతథంగా రూ. 37 వద్ద ముగిసింది.
ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడ్డాయి. ఇప్పటికీ 45 శాతం సంస్థలు ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు సంస్థలు ఏఐ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇతర గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. హెచ్ఆర్ ప్లాట్ఫాం ’డీల్’ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 45 శాతం భారతీయ సంస్థలు ఏఐ వినియోగం విషయంలో ప్రారంభ దశలో ఉండగా, 38 శాతం కంపెనీలు మధ్య స్థాయిలో ఉన్నాయి. కేవలం 17 శాతమే అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి. తమ ప్రధాన వ్యాపార ప్రక్రియలు, ఆవిష్కరణల్లో ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లకు చెందిన 5,500 వ్యాపార దిగ్గజాలతో సెపె్టంబర్లో డీల్ ఈ సర్వే నిర్వహించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు .. → ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ 54 శాతం కంపెనీల్లో మాత్రమే అధికారికంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది 67 శాతంగా ఉంది. సాంకేతిక పురోగతి, సిబ్బంది సన్నద్ధత మధ్య పెరుగుతున్న అంతరాన్ని, శిక్షణపై తక్షణం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది. → మానవ వనరుల (హెచ్ఆర్) కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగుల నిర్వహణ (66 శాతం), ఉద్యోగుల నియామకాల్లో (57 శాతం) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. → పని విధానాలను, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను ఏఐ సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మారుతున్నాయి. అలాగే కంపెనీలు పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపార సంస్థలు దీనికి వేగంగా అలవాటు పడాలి. → ఏఐ వల్ల అంతర్జాతీయంగా 91 శాతం కంపెనీల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన విధుల స్వరూపం మారింది. ఏఐని అనుసంధానించేందుకు మూడో వంతు సంస్థలు (34 శాతం)గణనీయ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. → వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగ విధుల్లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు 43 శాతం కంపెనీలు వెల్లడించాయి. → వచ్చే 1–3 ఏళ్ల వ్యవధిలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ నియామకాలు తగ్గుతాయని 70 శాతం దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకోవడంలో అకడమిక్ డిగ్రీల కన్నా 66 శాతం కంపెనీలు సాంకేతిక సరి్టఫికేషన్లకు, 58 శాతం కంపెనీలు సమస్యల పరిష్కార సామర్థ్యాలకు, 52 శాతం సంస్థలు కమ్యూనికేషన్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. → కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచే విషయంలో భారత సంస్థలు వెనుకబడి ఉన్నాయి. 54 శాతం సంస్థలు మాత్రమే రీస్కిలింగ్పై స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోకెల్లా ఇదే అత్యల్పం. ఈ విషయంలో కెనడా (77 శాతం), బ్రెజిల్ (76 శాతం), సింగపూర్ (74 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి. → 45 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి రీస్కిలింగ్ కార్యక్రమాలు ప్రారంభించలేదు. వచ్చే 12 నెలల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. ఏఐ నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకోవడంలో 63 శాతం సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటుకున్నాయి.
సులువుగా ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) రిజిస్ట్రేషన్ను సులభతరం చేసే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన చర్యలకు శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా ఎండ్టు ఎండ్ డిజిటైజేషన్కు తెరతీయాలని ప్రణాళికలు వేస్తోంది. డిజిటల్ సిగ్నేచర్లను వినియోగించుకోవడం ద్వారా పూర్తిగా పేపర్లెస్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ సమయాన్ని భారీగా కుదించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం నెలలపాటు కొనసాగుతున్న ప్రక్రియను రోజులలోకి తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదేసమయంలో డేటా ప్రైవసీ ఆందోళనలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. సర్వీసుల నాణ్యతను పెంచే బాటలో ఎఫ్పీఐ రిజిస్ట్రేషన్కు రెండో ప్లాట్ఫామ్ను సైతం తీసుకురానున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సీడీఎస్ఎల్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు కీలక పాత్రధారులని గోల్డ్మన్ శాక్స్ నిర్వహించిన 14వ భారత సీఐవో సదస్సు సందర్భంగా పాండే అభివరి్ణంచారు.
ఈసారి ఎయిర్లైన్స్ నష్టాలు రెట్టింపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు నికరంగా రూ. 9,500 కోట్ల–రూ. 10,500 కోట్ల మేర ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన సుమారు రూ. 5,500 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో తెలిపింది. ప్రధానంగా ప్యాసింజర్ల వృద్ధి నెమ్మదించడం, విమానాల డెలివరీలతో ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంలాంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ల ట్రాఫిక్ వృద్ధి 4–6 శాతం మేర ఉంటుందని తెలిపింది. అయితే, ఆర్థికంగా పరిశ్రమపై ఒత్తిడి నెలకొంటుందని నివేదిక పేర్కొంది. కానీ, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తాజా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 7.6 శాతం వృద్ధి చెంది, 16.53 కోట్లకు చేరింది. అక్టోబర్లో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 1.43 కోట్లుగా నమోదైంది. వార్షికంగా 4.5 శాతం, నెలలవారీగా సెపె్టంబర్తో పోలిస్తే 12.9 శాతం పెరిగింది. కానీ సీమాంతర ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా అవాంతరాలు, 2025 జూన్లో విమాన దుర్ఘటన తర్వాత ప్రయాణాలు చేయడంపై సందేహాలు నెలకొనడంలాంటి అంశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వృద్ధి ఒక మోస్తరుగానే ఉండొచ్చని నివేదిక వివరించింది. ఇక సరఫరా వ్యవస్థపరమైన అవరోధాలు, ఇంజిన్ వైఫల్యాల వల్ల విమానాలు ఎగరలేని పరిస్థితులు మొదలైన అంశాలు పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటున్నాయని పేర్కొంది. 2025 మార్చి 31 నాటికి వివిధ కంపెనీలకు చెందిన 133 విమానాలు పక్కన పెట్టాల్సి వచి్చందని, మొత్తం పరిశ్రమ ఫ్లీట్లో ఇది 15–17 శాతమని నివేదిక వివరించింది. నిర్వహణపరమైన సవాళ్ల వల్ల ఎయిర్లైన్స్ వ్యయాలు పెరిగిపోయాయని పేర్కొంది.
పన్ను మినహాయింపులు ఇవ్వాలి
రానున్న బడ్జెట్లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఆర్థిక మంత్రితో ప్రీబడ్జెట్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిలో చోటు కల్పించడం తదితర అంశాలను సూచించారు. ఫైనాన్షియల్ రంగం మరింత లోతుగా విస్తరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డెరివేటివ్స్తో పోలిస్తే నగదు విభాగంలో ఎస్టీటీని కుదించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు తెరతీసిన నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులు నాలుగోసారి ఆర్థిక మంత్రిని కలవడం గమనార్హం! స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈసహా ఎంసీఎక్స్, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ), పెట్టుబడుల రిజిస్టర్డ్ సలహాదారులు, కమోడిటీ పార్టిసిపెంట్ల అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న 2026–27 బడ్జెట్ను సీతారామన్ లోక్సభలోప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రకటించనున్నారు. 33 శాతం అప్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్లు 33 శాతం అధికంగా రూ. 14.6 లక్షల కోట్ల పెట్టుబడుల మొబిలైజేషన్కు వీలు కల్పించాయి. ఈక్విటీ, డెట్, రియల్టీ ట్రస్ట్(రీట్)లు, ఇన్ఫ్రా ట్రస్ట్(ఇన్విట్)లు తదితర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా నిధుల మొబిలైజేషన్ జరిగింది. కార్పొరేట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు విభిన్న ఫైనాన్సింగ్ వ్యూహాలను అందిపుచ్చుకోవడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్ విభాగాలే రూ. 14.2 లక్షల కోట్లను ఆక్రమించడం విశేషం! వెరసి ఆర్థిక వృద్ధికి అనువైన పెట్టుబడులను సమకూర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధా ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ తుది రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించే విషయం విదితమే. ఈ బాటలో గత వారం సైతం ఆర్థికవేత్తలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగ అత్యున్నత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. డిమాండును పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం ఆర్థిక వృద్ధి తదితర లక్ష్యాలతో బడ్జెట్ రూపొందనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
హెల్త్కేర్కు మరిన్ని నిధులు కావాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణకు జీడీపీలో 2.5 శాతం నిధులు కేటాయించాలని ఈ రంగానికి చెందిన అత్యున్నత మండలి ‘నాట్హెల్త్’ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల (అంటు వ్యాధులు కానివి) నియంత్రణకు తక్షణ కార్యాచరణ అవసరమని సూచించింది. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించాలంటూ.. ఇందులో భాగంగా ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వరకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. దేశంలో 65 శాతం మరణాలకు దీర్ఘకాలిక వ్యాధులు కారణం అవుతుండడంతో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచింది. 2026–27 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా హెల్త్కేర్ తరఫున నాట్హెల్త్ కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, బీమా మరింత మందికి చేరువ అయ్యేందుకు, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేందుకు వీలుగా కార్యాచరణను సూచించినట్టు నాట్హెల్త్ ప్రకటించింది. 2025–26 బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి కేటాయింపులు 1.97 శాతంగా ఉన్నాయి. మరిన్ని నిధులను కేటాయించంతోపాటు, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో పటిష్టమైన, భవిష్యత్తుకు వీలైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలని సూచించింది. ఆరోగ్య సంరక్షణను ‘కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’గా ప్రకటించి, రూ.50,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కోరింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం కావడం, వీటికి దీర్ఘకాలిక రుణ అవకాశాలు పరిమితంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, టెక్నాలజీ ఆవిష్కరణలకు రూ.5,000–7,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది.
కార్పొరేట్
సైబర్ ముప్పులపై కార్పొరేట్లలో ఆందోళన
జేపీ అసోసియేట్స్ టేకోవర్...అదానీకి లైన్ క్లియర్!
డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!
ఎస్బీఐ కొత్త ప్రతిపాదన.. ఇలా చేయొచ్చు!
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!
పసిడి రూ. 3,900 డౌన్
ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లో రాజీనామా!
సోషల్ మీడియా ద్వారా వ్యాపారావకాశాలు
996 ఫార్ములా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై ఆగ్రహం!
ఇంటికీ కావాలి ఆపరేటింగ్ ఆపీసర్..
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ ర...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట...
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోల...
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్...
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్నెఫ్ట్, ...
5.2% వద్దే నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.2 శాతం వద...
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్...
ఆటోమొబైల్
టెక్నాలజీ
కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఏఐ వల్ల వైట్కాలర్ (సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.అమెరికాలో ఉద్యోగాల కొరతమహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్కాస్ట్లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.We’re so busy fearing AI will wipe out white-collar jobs that we’re missing a far bigger crisis: the scarcity of skilled trades.Ford CEO @jimfarley98 made a startling revelation in a recent podcast: Ford has 5,000 mechanic jobs unfilled, many paying $120,000 a year, and still…— anand mahindra (@anandmahindra) November 17, 2025భారీ ఆర్థిక నష్టంఈ సంక్షోభం ఫోర్డ్కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్..
రూ.251 రీఛార్జ్ ప్లాన్: 100జీబీ హైస్పీడ్ డేటా
ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.దేశంలో 4జీ మొబైల్ నెట్వర్క్ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్వర్క్ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.Study, Stream, Succeed with #BSNL !Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu— BSNL India (@BSNLCorporate) November 15, 2025
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్ప్లాన్ను ప్రవేశపెట్టింది.మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.ప్లాన్ ప్రయోజనాలుజియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది.
ట్రాన్స్లేటర్ పెన్.. జేబులోనే థియేటర్!
ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!జేబులోనే థియేటర్!సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!ఖుషీ ఖుషీగా.. కుషన్! లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే!
పర్సనల్ ఫైనాన్స్
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్ని టీవీ, సీరియల్స్ షూటింగ్లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు.
ఈ వారం బ్యాంకు సెలవులు ఎన్ని?
బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పలు సేవల కోసం వినియోగదారులు బ్యాంకు శాఖలను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారం ప్రారంభం కాగానే బ్యాంకు శాఖలు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయి.. సెలవులేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు.సాధారణ వారపు సెలవుల్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈ వారం నవంబర్ 22న శనివారం, నవంబర్ 23న ఆదివారం రెండు రోజులు మాత్రమే మూసి ఉంటాయి. ఈ షెడ్యూల్ సెలవులు కాకుండా, వారంలోని అన్ని ఇతర రోజులలో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.సాధారణంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా పాటిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. నవంబర్ 22న నెలలో నాల్గవ శనివారం వస్తుంది. కాబట్టి ఆ రోజన సెలవు ఉంటుంది.బ్యాంకులు ఎప్పుడు మూసిఉంటాయి?ఆర్బీఐ సెలవుదినాలు మినహా ఆదివారాలు, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.నవంబర్ నెలలో ఇప్పటివరకు, ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మొత్తం ఆరు రోజుల పాటు మూసి ఉన్నాయి.ఈ నెలలో సెలవులు ఏమైనా మిగిలి ఉన్నాయా?ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అన్ని బ్యాంకు శాఖలు మూసిఉంచే ఆదివారాలు మినహా నవంబర్ నెలలో మిగిలిన రోజుల్లో అదనపు బ్యాంకు సెలవులు లేవు. జాబితా చేసిన బ్యాంక్ తదుపరి సెలవుదినం డిసెంబరులో మాత్రమే ఉంటుంది.దేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల సందర్భంగా సెలవులను నిర్ణయిస్తారు.
వెల్త్ కంపెనీ నుంచి కొత్త ఫండ్
వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో మెరుగైన రాబడులు అందించేలా హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ను ది వెల్త్ కంపెనీ ఏఎంసీ ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ నవంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తుంది. ఇది ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో (వెండి, పసిడి) ఇన్వెస్ట్ చేస్తుంది.అనిశ్చితి నెలకొన్నప్పుడు, ద్రవ్యోల్బణం నుంచి హెడ్జింగ్ కోసం 50 శాతం వరకు కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంపరంగా హైబ్రిడ్ ట్యాక్సేషన్ ప్రయోజనాలు ఉంటాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు చేస్తేనే ఎక్కువ ప్రయోజనం
ఇప్పుడిప్పుడే కెరియర్లో పురోగమిస్తూ, కుటుంబాలను ఏర్పర్చుకునే దశలో ఉన్న యువతకు సాధికారత కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తోడ్పడుతుందని ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) ఎండీ కమలేష్ రావు తెలిపారు. వాస్తవానికి 26–35 ఏళ్ల వయస్సు గ్రూప్లోని వారు దీర్ఘకాలికంగా ఆర్థిక భరోసాను కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కొంత వెనుకబడుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.ఈ సర్వే ప్రకారం 2025 మార్చి ఆఖరు నాటికి ప్రతి నలుగురు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లలో ఈ వయస్సు గ్రూప్లోని వారు ఒకరే ఉంటున్నారని (మొత్తం పాలసీదారుల్లో 25.24 శాతం) వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇది చెప్పుకోతగిన స్థాయే అయినప్పటికీ 36–45 ఏళ్ల గ్రూప్ వారి వాటా అత్యధికంగా 41.68 శాతంగా, 46–55 ఏళ్ల గ్రూప్ వారి వాటా 23.96 శాతంగా ఉందని తెలిపారు.ఈఎంఐలు, ఇతరత్రా ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మొదలైన వాటి కారణంగా అప్పుడప్పుడే కాస్త అధికంగా ఆర్జించడం మొదలుపెట్టిన వారు కీలకమైన కవరేజీని పెద్దగా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా బీమాకు సంబంధించి చిన్న వయస్సులో ప్రీమియంలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అదే వయస్సు పెరిగి అదే నలభైలు, యాభైల్లోకి వచ్చినప్పుడు ప్రీమియంలు పెరిగిపోతాయి.ఈ విషయాలను యువతకు సమర్ధవంతంగా తెలియజేయడంతో పాటు బీమా కేవలం రక్షణ కవచంగానే కాకుండా ఆకాంక్షలను నెరవేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని బీమా సంస్థలు సైతం వివరించాల్సి ఉంటుందని కమలేష్ రావు చెప్పారు. ఇందుకోసం వెల్నెస్ బెనిఫిట్స్, పొదుపునకు ఉపయోగపడే రైడర్లు, జీవితంలోని దశలను బట్టి కాలవ్యవధులను మార్చుకునే ఆప్షన్లు మొదలైనవి ఆఫర్ చేయాల్సి ఉంటుందన్నారు.


