Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 12th December 2025 in Telugu states1
పసిడి పిడుగు.. సిల్వర్‌ షాక్‌!! దారుణంగా ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లాయి. బంగారం ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్‌ కొట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఒక్కసారిగా ఎగిశాయి. ఇక వెండి ధరలు అయితే వరుసగా ఐదో రోజూ భారీ స్ఠాయిలో దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 12th 20252
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 119 పాయింట్లు పెరిగి 26,017కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 408 పాయింట్లు లాభపడి 85,226 వద్ద ట్రేడవుతోంది.ఎల్ అండ్ టీ, హిందాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు నిఫ్టీ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, హెచ్ యూఎల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ ఎం షేర్లు లాభాల బుకింగ్ లో పతనమయ్యాయి.Today Nifty position 12-12-2025(time: 9:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Key Insights from LinkedIn Latest Professional Report3
మాకంటూ సొంత బాట

దేశంలో మెజారిటీ నిపుణులు తమ కోసం తాము కష్టపడాలన్న అభిలాషతో ఉన్నారు. కృత్రిమ మేథ (ఏఐ), కొత్త నైపుణ్యాల పట్ల ఆసక్తి, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ల మద్దతుతో వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని విస్తరించుకోవడం సులభమన్న అభిప్రాయం లింక్డ్‌ఇన్‌ సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి లింక్డ్‌ఇన్‌ ఒక నివేదికను విడుదల చేసింది. నిపుణుల లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్స్‌లో ‘ఫౌండర్‌’ (వ్యవస్థాపకుడు) అని జోడించినవి గత ఏడాది కాలంలో 104 శాతం పెరిగాయి. ప్రతి పది మందిలో ఏడుగురు నిపుణులు తమకోసం కష్టపడాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు పలు అంశాలు అనుకూలిస్తున్నట్టు లింక్డ్‌ఇన్‌ నివేదిక తెలిపింది.చిన్న సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ ఒక భాగంగా మారిపోయింది. వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించడం సులభమని 82 శాతం మంది చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార వృద్ధికి ఏఐని కీలకంగా 83 శాతం మంది పరిగణిస్తున్నారు. 11–200 మధ్య ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఏఐపై అవగాహన 52 శాతం పెరిగింది.81 శాతం చిన్న, మధ్యస్థ వ్యాపార సంస్థలు ఏఐ సామర్థ్యాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌ స్థానం ప్రత్యేకం..‘‘భారత్‌లో చిన్న వ్యాపార సంస్థలు అసాధారణ వేగం, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నాయి. ఏఐని వేగంగా స్వీకరించడం, నైపుణ్యాలను పెంచుకోవాలన్న అభిలాష, విశ్వసనీయమైన నిపుణుల నెట్‌వర్క్‌ల కలయిక భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇవన్నీ కలసి వ్యాపారాన్ని ప్రారంభించడం, విస్తరించడం, విజయవంతం చేయడాన్ని పునర్‌నిర్మిస్తున్నాయి’’ అని లింక్డ్‌ఇన్‌ భారత్‌ మేనేజర్‌ కుమరేష్‌ పట్టాభిరామ్‌ తెలిపారు.ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు

people avoid term insurance because of myths will clarify4
జీవిత బీమాపై అపోహలు తగ్గాలి

భవిష్యత్‌ ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక పొదుపు, రిటైర్మెంట్‌ అనంతరం ఆదాయ రక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జీవిత బీమా రంగం స్థిరంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్‌ టెక్నాలజీ, మొబైల్‌ ప్లాట్‌ఫారమ్‌లు, త్వరిత పాలసీ జారీ వ్యవస్థలతో బీమా కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతోంది. అయినప్పటికీ జీవిత బీమాపై ప్రజల్లో ఇంకా కొన్ని అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఆర్జన మొదలుపెట్టిన యువతలో బీమా అవసరం లేదన్న భావన ఎక్కువగా కనిపిస్తోంది. కానీ చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉండడమే కాక, దీర్ఘకాల కవరేజీ లభిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం, ముందస్తు రిటైర్మెంట్‌ లక్ష్యంగా పెట్టుకున్న యువత కోసం ప్రస్తుతం నెలకు రూ.1,000 నుంచి ప్రారంభమయ్యే సేవింగ్స్‌ ఆధారిత ప్రణాళికలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సంక్లిష్టంగా అనిపించిన బీమా ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌ అయింది. మొబైల్‌ యాప్‌ల నుంచి పాలసీ కొనుగోలు, డాక్యుమెంటేషన్, అదే రోజున పాలసీ జారీ వరకు అన్నీ సరళతరం కావడంతో బీమా ఇప్పుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మారింది.దేశీయ బీమా రంగంలోని కంపెనీలు ప్రస్తుతం 98–99% క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రేటు సాధిస్తున్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించగానే మరుసటి రోజే సెటిల్మెంట్‌ చేసే సంస్థలు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.పొగ తాగే అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే రోజుకు రూ.30 కన్నా తక్కువే ప్రీమియం అవుతుంది. కాఫీ ధర కంటే కూడా తక్కువ. దీంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబ ఆదాయ రక్షణకు, గృహ రుణాలు వంటి ఆర్థిక భారం తీర్చేందుకు టర్మ్‌ ప్లాన్‌ కీలకంగా ఉపయోగపడుతుంది.కొత్త తరహా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాలు పాలసీదారుల జీవితకాలంలోనే అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్లు చికిత్స ఖర్చులను భర్తీ చేసి కుటుంబ పొదుపులను రక్షిస్తాయి. స్మార్ట్‌ ఆర్థిక ప్రణాళికలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కీలకం . ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా, భవిష్యత్‌ అవసరాలను తీర్చే ఆర్థిక సాధనంగా మారిందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు

Intel and Tata intend to explore manufacturing and packaging of Intel products5
టాటా ప్లాంట్లలో ఇంటెల్‌ చిప్‌ల తయారీ

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్‌ భారత మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్‌లు) తయారీ, అసెంబ్లింగ్‌ కోసం టాటా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్‌ ప్రకటించింది. ‘‘స్థానిక మార్కెట్ల కోసం ఇంటెల్‌ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌ను త్వరలో ప్రారంభం కానున్న టాటా ఎల్రక్టానిక్స్‌ ఫ్యాబ్, అండ్‌ ఓఎస్‌ఏటీ కేంద్రాల్లో నిర్వహించేందుకు, అత్యాధునిక ప్యాకేజింగ్‌పై సహకారాన్ని కూడా ఇంటెల్‌–టాటా పరిశీలించనున్నాయి’’అని టాటాగ్రూప్‌ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, కన్జ్యూమర్, ఎంటర్‌ప్రైజ్‌ మార్కెట్‌ కోసం ఉద్దేశించిన ఏఐ పీసీ పరిష్కారాల విస్తరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిపింది. టాటా గ్రూప్‌ రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని దొలెరాలో చిప్‌ తయారీ యూనిట్‌ను, అలాగే అసోంలో ప్యాకేజింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంప్యూటర్‌ మార్కెట్, కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్న భారత మార్కెట్‌లో వేగంగా విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఇంటెల్‌ కార్పొరేషన్‌ సీఈవో లిప్‌ బు టన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇంటెల్‌తో ఒప్పందం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి. ఇరు సంస్థలూ కలసి సెమీకండక్టర్లు, సిస్టమ్‌ సొల్యూషన్లను అందించడం ద్వారా.. భారీగా విస్తరించనున్న ఏఐ మార్కెట్‌లో గణనీయమైన వాటాను సొంతం చేసుకోగలవు’’అని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు.

India must become self reliant in critical technologies and industries6
కీలక టెక్నాలజీల్లో భారత్‌ స్వావలంబన సాధించాలి 

గాందీనగర్‌: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్‌ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్‌ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్‌ దీనదయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్‌ గుజరాత్‌ గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్‌ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌లాంటి క్రిటికల్‌ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

Advertisement
Advertisement
Advertisement