breaking news
Nara Lokesh Babu
-
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
-
మంగళగిరికి సెక్యూరిటీ లేకుండా వెల్లు ఎంత మంది కాలర్ పెట్టుకుంటారో చూస్తావ్
-
స్వాతి రెడ్డి కాదు.. శ్వేతా చౌదరి అడ్డంగా దొరికిన చంద్రబాబు
-
లోకేష్ పై గుడివాడ లాస్ట్ పంచ్ అదుర్స్
-
నువ్వు, మీ బాబు కలిసి చేసే దందా మాకు తెలియదనుకున్నావా..!
-
ఖాళీ కుర్చీలతో చంద్రబాబు కేబినెట్ సమావేశం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఇక మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
నీ మోకానికి ఒక్క సబ్జెక్టు పాస్ అయ్యావా.. రెడ్ బుక్ ఒకటి మాత్రం పట్టుకుని..
-
పోలీసులను కొడితే కేసులేదు కానీ మమ్మల్ని కలవాలంటే లోకేష్ పర్మిషన్ తీసుకోవాలా ?
-
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్డెత్లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
నువ్వు సౌత్ కొరియా వెళ్ళకు! బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు..
-
బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు.. దొంగ సర్టిఫికెట్ల వాడికి విద్యాశాఖా..?
-
కిర్రాక్ ఆర్పీ, సీమరాజా మాట్లాడేవేంటి..? లోకేష్ పై అంబటి ఫైర్
-
యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? కూటమి ప్రభుత్వంపై సెటైర్లు
నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను ముగించేది ప్రజలే" అని వ్యాఖ్యానించారు. నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్షన్తో రిమాండ్లోకి పంపడంపై మండిపడ్డారు. 'యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా?' అని, జనసైనికులు ఇప్పటికే ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ మొదలుపెట్టారని ఆరోపించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)'వరసగా తప్పుడు కేసులు పెట్టి నాలుగుసార్లు కోర్ట్ బెయిల్ ఇస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ ని రిమాండ్ లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ప్రశ్నించే గొంతులని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైంది. తర్వాత ఏంటి? వ్యక్తిగత దూషణ. ఆల్రెడీ జనసైనికులు ఏఐ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాడి ఫోన్ మీ దగ్గరుంది. అందులో సమాచారాన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకు అండగా నిలుచున్న వాళ్లని, ఎన్నో ప్రశ్నించే గొంతులని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత దిగజారతారో ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z— Prakash Raj (@prakashraaj) July 6, 2026 -
టీడీపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది.. బాబు, లోకేష్ లు ప్రజలను మోసం చేస్తున్నారు
-
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
-
పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం: కాకాణి
సాక్షి, ప్రకాశం: దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదు. పొగాకు ధర క్వింటాకు 16వేలకు పడిపోయింది. ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. పొగాకు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి. రెఫరెన్స్లు ఇవ్వడం దారుణం. తమకు అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.కర్ణాటకలో పొగాకు క్వింటా ధర 36 వేలు.. ఆంధ్రలో 16 వేలు. దీనికి కారణం ఎవరు?. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారు. తక్కువకు రైతుల దగ్గర కంపెనీలకు కట్టబెట్టి.. కంపెనీ నుండి చంద్రబాబు, లోకేష్ లబ్ది పొందే ప్రయత్నం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు వరి తినకపోతే ఇంకెవరు తినేవాళ్ళు లేరా?. ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టిస్తున్నాడు. పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. -
అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు: అమర్నాథ్ సెటైర్లు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. జేఎస్డ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే అన్ని అనుమతులు, రాయితీలు, నీటి సదుపాయం, రైల్వే కనెక్టివిటీ వంటి పనులు పూర్తయ్యాయి. అధికారం వచ్చి రెండేళ్లు గడిచినా వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పరిశ్రమలకే శంకుస్థాపన చేస్తే మీరు ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు. జేఎస్డ్ల్యూకి కావాల్సిన అన్ని అనుమతులు రాయితీలకు జీవో ఇచ్చాం. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారింది.జిందాల్ సంస్థ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఒక యాక్టర్ను వాడుకొని జిందాల్ను ఇబ్బందులకు గురి చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు. ఎటువంటి అనుమతులు, భూమి లేకుండా 2019లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి జేఎస్డ్ల్యూ స్టీల్ను తీసుకొచ్చారు. చంద్రబాబు శిలాఫలకాల ఏర్పాటుకు పెట్టింది పేరు. వేదిక ఏదైనా వైఎస్సార్సీపీని తిట్టడమే చంద్రబాబు లక్ష్యం. ప్రపంచ వేదిక అయినా జగన్నామస్మరణ చేస్తున్నారు..నా మాటలపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏ సైకో చెప్పాడని చింతమనేని మా ప్రభుత్వంలో మంత్రిని అలా అన్నాడు. బాలకృష్ణ మహిళల కోసం ఏ సైకో గాడు చెప్తే మాట్లాడారు. కృష్ణ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయమని ఏ సైకో చెప్పాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న సైకో ఎవడో అందరికీ తెలుసు. మహిళల పుట్టుక కోసం తప్పుగా మాట్లాడిన సైకోగాడు ఎవరో అందరికీ తెలుసు. టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల ఇంటికి వెళ్తే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ బీఎల్ఓలు ఎన్యూమరేషన్కు వెళ్లడం లేదు. వెన్నుపోటు, ద్రోహనికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకి, జన్మనిచ్చిన సీమకి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు..కోవిడ్ ఉన్నా.. మా ప్రభుత్వంలో మంచి ఆదాయాలు వచ్చాయి. మొదట సంవత్సరం ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. చదువు కొనుక్కోవచ్చు కాబట్టి లోకేష్ విదేశాల్లో చదివారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల కోసం మాట్లాడవచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మంత్రులు వారి శాఖల కోసం తప్ప మిగిలిన అన్ని శాఖల కోసం మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అట్టర్ ఫెయిల్యూర్.. రాష్ట్ర చరిత్రలో ఇది ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు. -
ఖబడ్దార్ లోకేష్.. టిప్పర్ తో నన్ను లేపేద్దాం అనుకున్నావా..? తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
-
దమ్ముంటే వేయ్ జైల్లో... నన్ను విప్పమంటావా నీ గుట్టు..?
-
TDP గూండాల కు లోకేష్ సపోర్ట్.. పవన్ చెప్పిందే నిజమైంది!
-
ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేశారు. అలాగే సెట్ చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్.మోహనరావు కూడా కాకినాడ జేఎన్టీయూలో ఈ ఫలితాలను వెల్లడించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేసుకోగా, 2,58,545 మంది పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) అర్హత సాధించారు. కాగా, ఇంజినీరింగ్లో గుంజూరు జిల్లా తాడేపల్లికి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్ నాయుడు టాపర్గా నిలిచాడు. ఫలితాలను https://cets. apsche.ap. gov.in/ EAPCETలో చూడవచ్చు.ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ టాప్ ర్యాంక్స్ ఇవే.. 1. జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (గుంటూరు జిల్లా) 2. కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం) 3. వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి (పల్నాడు) అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ టాపర్లు వీరే.. 1. శంబంగి జశ్వంత్ నాయుడు (విజయనగరం) 2. అక్షజ్ రెడ్డి (మేడ్చల్ మల్కాజిగిరి) 3. హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా) -
సమాధానం చెప్పడం చేతకానప్పుడు ఛాలెంజ్ లు ఎందుకు?
-
మహా మేధావి.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. లోకేష్ పై ధ్వజమెత్తిన లక్ష్మి పార్వతి
-
ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ర్యాంకుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా ఇవాళ విడుదలవుతాయని ప్రచారం జరిగినా.. ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జులై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. విడుదలయ్యే దాకా గ్యారెంటీ కనిపించడం లేదు. -
అబ్బ కొడుకుల నాటకం.. ఒకడు పోలీసులను పంపుతాడు.. ఇంకోడు రౌడీలను పంపుతాడు..!
-
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
మీ తండ్రిని జైలులో పెడితే... పారిపోయింది నువ్వు మిస్టర్ లోకేశ్..!
-
కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి రాజకీయం బట్టబయలు.. ఢిల్లీకి లోకేష్ పరుగు.!
-
టీడీపీ గేమ్లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లోకేష్ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?
-
మంత్రి లోకేష్కు షాకిచ్చిన మహిళలు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించిన మంత్రి నారా లోకేష్కు మహిళలు షాకిచ్చారు. అవనిగడ్డలో బెల్టు షాపుల బాగోతాన్ని లోకేష్ ముందే మహిళలు బయటపెట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకేష్ను మహిళలు నిలదీశారు. మద్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు.మీ గ్రామంలో మద్యం షాపు ఉందా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. అవనిగడ్డలోని వైన్ షాపు నుంచి తెచ్చి తమ గ్రామంలో మద్యం అమ్ముతున్నారని మహిళలు చెప్పారు. తమ గ్రామంలో బెల్టు షాపు లేకుండా చేయాలని మహిళలు కోరగా.. తాను చూసుకుంటానంటూ అక్కడ్నుంచి మంత్రి లోకేష్ జారుకున్నారు. -
జై భీమ్... జై సంవిధాన్!
ఏప్రిల్ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు బెంచ్ ఉరిశిక్ష విధించింది. మొదట ఈ కేసుపై రాష్ట్ర స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు. దానివలన ఫలితం ఉండదని భావించిన మద్రాసు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో నిజాలు బయట కొచ్చాయి. ఉరిశిక్ష వార్త విన్న తర్వాత లాఠీ ప్రభువుల ఉత్సాహా నికి కొంతకాలమైనా కళ్లెం పడుతుందని ఎవరైనా భావిస్తారు.ఉన్నతస్థాయుల్లో పుష్కలంగా పలుకుబడి, అండదండలు ఉన్న అధికారులకు మాత్రం ఏ వార్తలు విన్నా ఎటువంటి భయాలూ ఉండవని తేలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఉరిశిక్షల వార్త వెలువడిన ఒక్క నెలరోజుల నుంచి మరో నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్లో ఖాకీ తాండవానికి సంబంధించి నాలుగు విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్న ‘పొలిటికల్ గవర్నెన్స్’ను గుర్తుచేసు కోవడం ఇక్కడ అసందర్భం కాకపోవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందే లోకేశ్బాబు రచించి, అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చిన రెడ్బుక్ దిశానిర్దేశం గురించి గుర్తుచేయడం కూడా అసంగతమేమీ కాదు. పొలిటికల్ గవర్నెన్స్కూ, రెడ్బుక్ సందేశవ్యాప్తికీ పోలీసుల ‘ఆఫ్ ద రికార్డు’ సేవలు అవసరమైనప్పుడు, ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నతస్థాయి సహకారం ఉంటుందని భావించడం సహజం. కూటమి గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను పబ్లిగ్గా నడిరోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. నో పోలీస్! అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత, మైనారిటీ యువకులను నడివీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్!! థర్డ్ డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్ గవర్నెన్స్ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు?ఈ దేశంలోని ప్రతి పౌరునికీ జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ, ఆత్మగౌరవంతో కూడిన జీవనయాన హక్కునూ భారత రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రసాదించింది. చట్టపర మైన విధివిధానాల ద్వారా తప్ప మరేరకంగా ఈ హక్కులో జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. అయినా పెరిగిపోతున్న పోలీసుల అతి ప్రవర్తన, కస్టోడియల్ మరణాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కినంతనే అతని ప్రాథమిక హక్కులు మాయమై పోవని న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. లాకప్ హింస ద్వారా వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత గౌర వాన్ని ధ్వంసం చేసే హక్కును లాగేసుకోవడమంటే, అనుల్లంఘనీయమైనవిగా భారత రాజ్యాంగం నిర్వచించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. కంచె చేను మేయడ మవుతుంది. రాజ్యాంగ ద్రోహమే అవుతుంది.రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్స లైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్యవ్యవస్థ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే? ఇదిగో ఇలాంటివారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రు అడ్వకేట్గా ఉన్నకాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్ట గలిగారు. సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, నింది తులకు శిక్షపడేలా చేయగలిగింది.మే 8 నుంచి జూన్ 16 వరకు ఏపీలో జరిగిన నాలుగు పోలీస్ సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గానీ, ఉన్నతాధికారుల కార్యాచరణగానీ సందేహాస్పదంగానే కనిపిస్తున్నది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయికృష్ణ అనే యువకు డిని విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈనెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. కుమారుడిని స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెలరోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తన కుమారుడిని కనీసం చూపెట్టాలని కోరినా సీఐ నాగరాజు లక్ష్యపెట్టలేదు. పైగా, ‘మీవాడిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకో పో’ అని కూడా సీఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరకీ, డీజీపీ దగ్గరికీ వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.హైకోర్టులో విజయలక్ష్మి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీ లోగా సాయికృష్ణను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తలు, ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైసీపీ నాయకులతోపాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు సాయికృష్ణ ఉదంతంపై గళం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకొన్నారు.రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి, ఉదంతంపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్నా స్పందించని కమిషనర్ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలి పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట! ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరులను తన నివా సానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట! నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట! సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు.ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సీఐ ఒక్కడే బాధ్యుడవుతాడా? కిందివారికిగానీ, పైస్థాయి వారికిగానీ ఎవ రికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్ఫోర్స్ విజయవాడ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్నది. కృష్ణలంక సీఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ రొటీన్ ప్రకారం డైలీ సిచువేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)ను కమిషనర్ కార్యాలయానికి (గ్రామీణ జిల్లాల్లో అయితే ఎస్పీ ఆఫీసుకు) స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపిస్తారు.అందులో ఆరోజు అరెస్టు చేసి తీసుకొచ్చిన వివరాలు కూడా ఉంటాయి. పైగా రోజుకు రెండుసార్లు కమిషనర్తో స్టేషన్ అధి కారులకు టెలీకాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో కమిషన ర్తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సీఐలందరూ పాల్గొంటారు. ఆరోజు ఇరిగిన వ్యవహారాలన్నీ అందులో చర్చకు వస్తాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పుడు పైస్థాయి అధికారులకు సాయికృష్ణ లాకప్ వ్యవహారం తెలియకుండా ఎలా ఉంటుంది? అతను లాకప్లో చనిపోతే ఆ విషయం కూడా పైస్థాయి అధికారులకు ఎలా తెలియకుండాపోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతికుమార్ కూడా మే 21న ఆత్మహత్య చేసు కున్నారు. ‘సీఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. మళ్లీ పోలీస్ స్టేషన్కు రమ్మని పిలుస్తున్నారు. మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా’ అని ప్రశ్నిస్తూ లైవ్లో ఆత్మ హత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగి ఉంటాయి. పైస్థాయి తోడ్పా టుపై ఎంత భరోసా లేకపోతే ఆ సీఐ ఇంత విచ్చలవిడిగా వ్యవ హరిస్తాడు? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ పరిధిలోనే విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నగర పోలీస్ కమిషనర్కు సీఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందనీ, లేకపోతే శవాన్ని మాయం చేయడంగానీ, ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడంగానీ సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఉదంతంపై, నాగరాజు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశముంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి, లాకప్లో చంపారనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్కాకి చేయరని చెప్పలేము. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది.చేయని నేరాలని అంగీకరించాలని బలహీన వర్గాలను వేధించడం యథేచ్ఛగా జరిగిపోతున్నది. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా ఈ ధోరణి మరింత పెచ్చరిల్లిపోతున్నది. పవర్ చేతిలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాల సభ్యులను నయానో భయానో లొంగదీసుకోవడం అధికారులకూ, నేతలకూ పెద్ద కష్టం కాకపోవచ్చు. తమకు న్యాయం జరిగిందని బాధితుల నోటితో చెప్పించినా ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్ డెత్ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్ కథ లాగా ముగించవలసిన అవసర మున్నది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉన్నది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయ వాడ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి. జై భీమ్, జై సంవిధాన్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
మంత్రి లోకేష్ పరువు తీసిన స్కూల్ పిల్లలు
-
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
‘డీఎస్సీలో అక్రమాలపై చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా?’
సాక్షి, తాడేపల్లి: తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికే ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 పై లోకేష్ సవాల్ని వైఎస్సార్సీపీ స్వీకరిస్తుందని.. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని, మా వెంట దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తామని చెప్పారు.డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలను వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయట పెడితే ఇంతవరకు నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారికి చెప్పి నమ్మించాలని సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరగలేదనేది నిజమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా అని ప్రశ్నించారు.కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం, ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపుకోతకు లేదా అని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గురువారం (18వ తేదీ) శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణలో అవకతవకలపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నట్టు చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:దమ్ముంటే డీఎస్సీ నిర్వహణపై మాట్లాడు లోకేష్:డీఎస్సీ–2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైఎస్ జగన్ చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా సవాల్ విసిరి పారిపోయాడు. ప్లేస్ ఆయన చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, డీఎస్సీ పై బహిరంగ చర్చకు మేం సిద్ధమే. మాతోపాటు దగా పడ్డ అభ్యర్థులను కూడా తీసుకొస్తాం. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతే సరికాదు. డీఎస్సీ నిర్వహణలో తప్పే జరగలేదనుకుంటే మేం అడిగినట్టు సీబీఐ విచారణ కోరాలి.సీబీఐ అంటే చంద్రబాబు ఎంక్వయిరీ అని మాత్రం అనుకోవద్దు. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో విర్రవీగిపోతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కవ్వింపు చర్యలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే 200 మీటర్ల దూరంలో ఉన్నానని నారా లోకేష్ ఛాలెంజ్. స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిలో ఉద్యోగాలిచ్చిందే కాకుండా ఎన్ని జన్మలెత్తినా మీరు డీఎస్సీ నిర్వహించలేరని వాగడం సిగ్గుమాలినతనం తప్ప మరోటి కాదు.సొంత ఛానెళ్లలో తొడలు కొట్టడం, భజన చేయంచుకోవడం కాదు:పరీక్ష నిర్వహణలో ఉద్దేశపూర్వకంగానే కాంప్రమైజ్ అయ్యారని పలు విధాలుగా ఆధారాలతో వైఎస్ జగన్ నిరూపించారు. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఫలితాలు వెల్లడించే వరకు పారదర్శకత లేదని జీవొలతో సహా నిరూపించారు. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచి సెలెక్ట్ అయ్యారని పంపిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పరీక్ష కూడా రాయకుండా డిగ్రీ ఉత్తీర్ణత కావాల్సిన అవసరమే లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని తేలింది.ఇవన్నీ కాదని నిరూపించండి చూద్దాం. ఇంతపెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? కొంతమంది అధికారులను పంపించి మాట్లాడించడమే తప్ప, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? టీచర్ పోస్టులు వచ్చిన వారిని భయపెట్టి పిలిచి, టీడీపీ నాయకుల సమక్షంలో వైఎస్ జగన్ని తిట్టించడం కాదు. దమ్ముంటే, మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని కోర్టులు చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులతో మీటింగ్ పెట్టండి. వారడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు. తప్పు జరగలేదని వారిని ఒప్పించండి. సొంత ఛానెల్లో తొడలు కొట్టించుకోవడం కాదు.. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు.లోకేష్ని మందలించే ధైర్యం చంద్రబాబుకే లేదు:బెంగళూరులో కాపురం ఉంటాడని జగన్ని విమర్శించడం కాదు.. నారా లోకేష్ ఎక్కడ కాపురం ఉంటున్నాడు. వీకెండ్ వస్తే ఎక్కడుంటున్నాడు. తెలంగాణలో ఆధార్ కార్డు పెట్టుకుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తే ఎలా? 2019–24 ఎప్పుడైనా లోకేష్ ఆంధ్రాలో ఉన్నాడా? ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబుకి లేదా? లేక ఆయన్ను నోరెత్తనీయకుండా లోకేష్ అడ్డుకుంటున్నాడా? డీఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగిన ఈ సందర్భంలో ఒకవేళ నారా లోకేష్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా మరెవరైనా ఉండుంటే.. వారిపై చంద్రబాబు సీరియస్ అని ఎల్లో మీడియాలో హెడ్లైన్స్ వచ్చి ఉండేవి.విద్యాశాఖ మంత్రిని త్వరలోనే మార్చేస్తున్నారని బ్రేకింగ్లు వేసేవాళ్లు. కానీ లోకేష్ని పిలిచి మందలించే ధైర్యం చంద్రబాబుకి కూడా లేదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. డీఎస్సీపై చర్చకు ఏ ఛానెల్కి రమ్మన్నా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో డీఎస్సీ అక్రమాలను నిగ్గుతేల్చకుండా వదిలిపెట్టం. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, కేసులకు భయపడటం అనేది జరగదు.గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం:శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు గురువారం (18వ తేదీ) గవర్నర్ని కలిసి డీఎస్సీ నిర్వహణపై విచారణకు ఆదేశించాలని కోరబోతున్నారు. కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు అన్యాయంగా లాకప్లో చంపేశారని లాకప్ డెత్ గురించి రాష్ట్రమంతా చర్చిస్తుంటే దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం, ఎల్లో మీడియా మేకప్ మీద చర్చిస్తోంది.రాజధానిలో శాంతిభద్రతలు గాడితప్పి ప్రశ్నార్థకంగా మారితే దానికి సమాధానం చెప్పకుండా మేకప్ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. తన బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటే దాన్ని పక్కనపెట్టి మేకప్ ఉద్యమం చేపట్టారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ కమిషనర్ ఎక్కడున్నారు?. అసలు లాకప్ డెత్ జరగలేదని చెప్పై ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదా? మహిళల గురించి లోకేష్ ఎంత నీచంగా మాట్లాడిన మాటలన్నీ తీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు?ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే రాష్ట్ర ప్రజలు వినాలా? సాయికృష్ణ తల్లి కూడా మహిళ కాదా? ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్కి ఇచ్చిన విలువ సాయికృష్ణ తల్లి కడుపుకోతకు ఇవ్వలేదా? సాయికృష్ణ ఆచూకీ గురించి తల్లి రోదిస్తుంటే రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నారు. రౌడీ షీటర్ అయితే చంపేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. -
అనిత, నారా లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా నేతలు
-
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
-
నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు. -
వీడియో లైవ్ లో ప్లే చేసి... బాబు, లోకేష్ ను ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్
-
కాలం మారింది.. మీకు మిగిలింది మూడేళ్లే జనం మనసులో జగన్
-
లోకేష్ ను ప్రశ్నిస్తే మధ్యలో రెచ్చిపోతున్న అనితమ్మ
-
ఇంద్ర+వెంకీ సినిమా లో సీన్స్ లా లోకేష్ పై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
అంత భయం ఎందుకు.. YSRCP పేస్ బుక్ బ్లాక్ చంద్రబాబుకు శేఖర్ రెడ్డి కౌంటర్
-
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దమ్ముంటే చర్చకు రండి...! లోకేష్ పై డీఎస్సీ విద్యార్థుల ఫైర్!
-
డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీఈఆర్టీ (SCERT)లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. -
దుబారా ఖర్చుల్లో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు & లోకేష్..
-
లోకేష్ లో L అంటే అదేనా..?
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
మెగా డీఎస్సీ పేరుతో 'మెగా స్కామ్'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 మోసం, దగా, స్కామ్ డీఎస్సీగా మారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈనెల 11న ఆయన మీడియా సమావేశం ద్వారా సాక్ష్యాధారాలతో సహా ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా స్కామ్ జరిగిన తీరుకు ఆధారాలు జత చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఈ మెగా స్కామ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన మెగా డీఎస్సీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతుండటాన్ని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ చెలగాటమాడిన తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రతిభావంతుల జీవితాలతో చెలగాటం‘మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు, ఆయన సుపుత్రుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతిభావంతులైన అభ్యర్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తూ, అత్యంత చాకచక్యంగా మెగా స్కామ్కు తెర తీసి.. చీకటి దందాకు పాల్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ అవకతవకలు, మోసాల వల్ల నేడు లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదు. 16,000 డీఎస్సీ పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతను పూర్తిగా తుంగలో తొక్కారు. డీఎస్సీ నియామకాలను డబ్బులు గుంజే కుంభకోణంగా మార్చాలన్న దుర్బుద్ధితో అత్యంత పకడ్బందీగా, సంస్థాగతంగా తనిఖీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంతటి దారుణమైన అక్రమాలు, అవతవకలు చోటుచేసుకున్న నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ జరగలేదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక డీఎస్సీ. నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యా శాఖ నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి అత్యంత తీవ్రంగా ఖండించదగినవి. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక పర్వాలు (మల్టీ లేయర్)గా సాగిన ఈ మెగా స్కామ్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..వ్యవస్థల ధ్వంసం.. కుట్రకు తొలి అడుగు!డీఎస్సీ నిర్వహణలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పరీక్షల గోప్యతను కాపాడటం కోసం గతంలో ప్రశ్నపత్రాల తయారీని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కి, పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్కు వేర్వేరుగా అప్పగించేవారు. కానీ.. ఈ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ డీఎస్సీ కన్వీనర్ను పక్కనబెట్టారు. ఈ రెండు కీలక బాధ్యతలను ఒకే వ్యక్తికి.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే కట్టబెట్టారు. తద్వారా పారదర్శకతను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీసి, అక్రమాలకు దారి సుగమం చేస్తూ ఈ మెగా స్కామ్కు తొలి అడుగు వేశారు.అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాధ్యతలు.. పేపర్ లీక్పరిస్థితిని మరింత దిగజారుస్తూ, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఒకవేళ వ్యవహారం బయటపడితే వారిని బలిపశువులను చేయవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఈ అక్రమాలకు పరాకాష్టగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతలో భాగస్వామిగా ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే ఈ డీఎస్సీ పరీక్షలో ఏకంగా మొదటి ర్యాంక్ సాధించడం గమనార్హం. ఇది పేపర్ లీక్ కుంభకోణానికి ప్రత్యక్ష నిదర్శనం కాదా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవస్థ ఎంత బలహీన పడిందో స్పష్టం చేస్తున్నాయి. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? మెరిట్ జాబితా నుండి అతడి ఐడీ, డేటాను ఎందుకు రాత్రికి రాత్రే తొలగించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అతడిని ఎందుకు పిలవలేదు? ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించడానికి ఇవే కారణాలు కాదా? ఎస్సీఈఆర్టీలో ఉంటూ ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలుపంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, పేపర్ లీక్ లోతును వెలికి తీయాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.ఫలితాల ప్రకటనలో లోపించిన పారదర్శకతడీఎస్సీ ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా మృగ్యమైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కనబెట్టి, కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్లకే పరిమితం చేస్తూ కేంద్రీకరించారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర అనిశ్చితికి లోనై, తమ ఫిర్యాదులు చెప్పుకోవడానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చింది. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. 1ః1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న పలువురు అభ్యర్థుల పేర్లు తుది ఎంపిక జాబితా నుంచి మాయమయ్యాయి. ‘స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ రూల్స్ 2025’ లోని రూల్ 20ని కచ్చితంగా పాటిస్తే.. మార్కులు, కటాఫ్, స్పోర్ట్స్, వికలాంగుల కోటా వంటి అన్ని హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక, వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికీ తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ, అర్హులైన ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.సీబీఐ దర్యాప్తే శరణ్యంలక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను, కలలను కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా సమాధి చేసింది. ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దల హస్తం ఉంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వారి పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి, వారు నిజాలు నిగ్గు తేల్చలేరు. అందుకే, బాధితులకు న్యాయం జరగాలన్నా, ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగు తొలగాలన్నా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్పోర్ట్స్ కోటా మళ్లింపు.. దొడ్డిదారి నియామకాలకు బ్లూప్రింట్!ఈ కుంభకోణంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు క్రీడాలోకాన్ని విస్మయానికి గురి చేసింది. 2012 నాటి జీవో నంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉండేది. కానీ, చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఈ నిబంధనను తొలగిస్తూ 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నంబర్ 8, జీవో నంబర్ 4, 47లను తీసుకొచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాత పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు. అంటే, తమకు కావాల్సిన వారిని దొడ్డిదారిలో (బ్యాక్ డోర్ ఎంట్రీ) చొప్పించడానికి ముందే ఒక పక్కా బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. తీరా అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామకాలు పూర్తి కాగానే.. మళ్లీ పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ జీవో నంబర్ 23, 25, 56లను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెబుతూ.. పని పూర్తయ్యాక దొడ్డి దారిని మూసి వేయడం వీరి కపట నీతికి అద్దం పడుతోంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ‘ఉపాధ్యాయ పోస్టు బేరసారాల’ వీడియోపై అధికారులు నామమాత్రంగా స్పందించారు. నిందితుడి ఫోన్ నంబర్ స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చకుండా, కేవలం స్టేషన్ బెయిల్పై వదిలేయడం వెనుక ఉన్న హస్తమెవరిదో అర్థమవుతూనే ఉంది. -
తప్పెవరిదో తెలుసుకో... టీడీపీ నేత ఆవేదన
-
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం
-
దమ్ముంటే ఇప్పుడు బయటికి రండి.. మీ కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ
-
DSC పేపర్ లీక్కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
-
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
-
11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్
-
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..
-
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ
-
వాడొక పనికిమాలిన మంత్రి.. లోకేష్ ని కడిగి పడేసిన రోజా
-
గొడ్డలి పార్టీనా.. తెగనరికి భూమిలో పాతకపోతే.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
-
లోకేష్ బాబు.. నీకు దండంరా సామి!
-
మంత్రి మాట్లాడాల్సిన భాష అదా..? జగన్ ను కలిశాక మాతో చెప్పిన మాట
-
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
-
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
-
మా సపోర్ట్ వల్లనే గెలిచారు మాట మీద నిలబడకపోతే... బాబు ప్రభుత్వంపై ఉద్యోగులు ఫైర్
-
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి అవినీతిని బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే
-
Gen-Z అన్నీ చూస్తోంది... బాబూ జాగ్రత్త...
-
1:1 అంటే అర్ధం ఏంటి చంద్రబాబు.. ఇలాంటి మోసాన్ని నా జన్మలో చూడలేదు
-
స్పోర్ట్స్ కోటాలో స్కామ్స్ వింటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..బాబు, లోకేష్ పై జగన్ మాస్ ర్యాగింగ్
-
ఏపీలో కూడా కాక్రోచ్ లు వస్తాయి జాగ్రత్త.. లోకేష్కు జగన్ వార్నింగ్
-
స్కాం కాకపోతే ఆ జీవోలు ఎందుకు రద్దు చేశారు?
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పోస్టుల్లో సర్దుబాటు ఎవరి కోసం చేశారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ కుంభకోణంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్మెన్కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్ను స్కామ్ చేశారు.. చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందిబ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలిచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవస్థను దళారి కేంద్రంగా మార్చారు. మెడల్స్తో సంబంధం లేకుండా.. ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపించినవాళ్లకు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చారు. జూడో అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు లోకేశ్ తోడల్లుడు భరత్. సాఫ్ట్బాల్ అసోషియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్. వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు. వీళ్లే ఉద్యోగాలు ఇస్తారు. గోల్డ్మెడల్ అనే వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని అప్లోడ్ చేశారట. ఆటల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చినప్పుడు.. మెడల్ వచ్చిన వారికి ఇవ్వరా?.. నిజమైన క్రీడాకారులకు ఇది అవమానం కాదా?. క్రీడాకారుల పేరుతో జరిగిన స్కామ్ కాదా ఇది? తమ వాళ్లకు ఉద్యోగుల వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో 47 తెచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చి.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు.అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు. ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి? కేవలం పాల్గొన్నందుకే 270 మందికి ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినవారికిఎలాంటి మెడల్స్ రాలేదు. ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్లో 99 మంది టీచర్ ఉద్యోగాలొస్తే.. మెడల్ రాకపోయినా పాల్గొనందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.డీఎస్సీలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15.26 లక్షలు అమ్ముకుంటున్న బేరసారాల వీడియో బయటకు వచ్చింది. ప్రభుత్వ డీపీ లోగో ఉంది. పైగా ఆ వీడియోలో కాల్ చేసిన నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. అయినా తూతు మంత్రంగా కేసులు పెట్టారు. స్టేషన్బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇక్కడే అర్థమవుతుంది. ఈ ఆధారం చాలదా స్కామ్ జరిగిందని చెప్పడానికి అని వైఎస్ జగన్ అన్నారు. -
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
చంద్రబాబే పోలీస్.. చంద్రబాబే లాయర్
సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గరి నుంచి.. ఫలితాల వెల్లడిదాకా ప్రతీ దశలోనూ నిబంధలను మీరి ప్రవర్తించారని.. ఇక్కడే అవకతవకలు జరిగాయని స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారాయన.డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీకూడా అత్యంత గోప్యంగా జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్లను SCERT (State Council of Educational Research and Training) తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కాని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ కన్వీనర్ను పక్కనపెట్టి, క్వశ్చన్ పేపర్ల తయారీ.. నిర్వహణ, ఈ రెండు కీలక బాధ్యతలను కూడా SCERT డైరెక్టర్కు అప్పగించింది. డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీసింది, అక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే ఆజ్యం పోసింది. ఇక్కడ నుంచే మొదలైంది స్కెచ్..రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడింగ్ పని పనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారు. ఎక్కడైనా పరీక్షల ఫలితాలను పారదర్శకంగా ప్రకటిస్తారు. కానీ బాబు పెట్టిన డీఎస్సీ మాత్రం ఎక్కడా డిస్ప్లే లేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపారు. మార్కులు, కటాఫ్, ర్యాంకులు ఎక్కడా డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియ సెంట్రలైజ్ చేశారు. 1:1 రేషియోలో కాల్ లెటర్లు పంపారు.. .. నవీన్ అనే వ్యక్తి మెరిట్ సాధించాడు. అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదని ఉద్యోగం ఇవ్వలేదట. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, ఆ కేండిడేట్ డేటాను మాయం చేసి, కాల్లెటర్ ఇవ్వనప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎలా వస్తాడు?. నిజంగా మెరిట్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు. తప్పు జరగకపోతే నవీన్ డేటా ఎందుకు తొలగించారు. అంటే తప్పు జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? అందుకే కదా అతను కోర్టుకు పోయింది?. ఒక కేండిడేట్కు ఫస్ట్ ర్యాంకు వస్తే, అందులోనూ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాడా?. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సిస్ ఎవరి చేతుల్లో ఉంది. పేపర్ ఎంత మందికి లీక్ అయింది.. ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవి తేలాలి కదా?. అన్నీ తేలాలి. ఇలాంటి తప్పులు ఇంకెన్నో, అందుకే మేం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.రాష్ట్రంలో చంద్రబాబు పోలీస్.. ఆయనే లాయర్. అధికారం మీదే.. అధికారులు రిపోర్ట్ చేసేది మీకే. అధికారంలో ఉన్నది ఆయనే.. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది?. రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉందా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. చంద్రబాబు కొడుకు విద్యాశాఖ మంత్రి కాబట్టే థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబు తొలి సంతకమే పెద్ద మోసం.. స్కామ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇 👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు. 👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం. 👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. -
దటీజ్ జగన్..
సాక్షి, విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించే విషయంలో అధికార కూటమి నేతలకు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధ్య వ్యత్యాసం కార్మిక లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. కారి్మక నాయకులు సమస్యలు చెప్పేందుకు ముందుకు రాగా.. ‘మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా.. మీకెందుకు?’ అంటూ మంత్రి లోకేష్ అగౌరవంగా మాట్లాడడం కార్మికుల్లో ఆగ్రహం రగిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..నాకేం తెలియదు..అవగాహన లేదంటూ వెళ్లిపోయారు. ఇదే సమయంలో విశాఖకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. సెవెన్హిల్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయి, ప్రమాద కారణాలు తెలుసుకుని, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. రూ.కోటి పరిహారం కోసం పోరాడతామన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క నెలలోనే రూ. కోటి పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో జగన్ చూపిన మానవత్వం, చొరవ కార్మికుల మనసు గెలిచింది. -
జబర్దస్త్ షోకి వెళ్ళావా... లోకేష్ ? ఛీ..ఛీ ప్రభుత్వాన్ని పెట్టుకొని కోటి రూపాయలు ఇవ్వలేరా?
-
అనుభవం లేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? ఏకిపారేసిన వెల్లంపల్లి
-
పరామర్శకు పోయినా మేకప్ లు అవసరమా అనితా..! లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన రాచమల్లు
-
‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’
మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.పవన్వి పచ్చ దగాకోరు మాటలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. పచ్చి దగాకోరు మాటలే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.బాధిత కుటుంబాలకు అండగా నిలవాలినాడైనా, నేడైనా వైఎస్సార్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
కొంచమైనా సిగ్గు లేదా..లోకేష్ కు ఇచ్చిపడేసిన అమర్నాథ్
-
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..! ఇద్దరికి ఇచ్చి పడేసిన అడ్వకేట్ రజిని
-
లోకేష్ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం
-
లోకేష్ అహంకారమే చెపుతుంది, కార్మికులంటే ప్రభుత్వానికి ఎంత ప్రేమో..?
-
లోకేష్ ఎందుకు వచ్చాడు? శవాలను చూడడానికా
-
లోకేష్ నోటి దురుసు.. తిరగబడ్డ బాధిత కుటుంబాలు
-
కార్మిక సంఘాలపై లోకేష్ చీప్ కామెంట్స్ ఇచ్చిపడేసిన గుడివాడ
-
సాటి మనిషి చనిపోతే చూపించాల్సింది మానవత్వం..అహంకారం కాదు..
-
మీకో దండం.. వెళ్లిపొమ్మంటారా? తప్పించుకున్న లోకేష్
-
‘కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రెడ్బుక్ అరాచకం నడుస్తోందని.. లోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారని.. వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. స్టీల్ప్లాంట్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందని అమర్నాథ్ ఆగ్రహవం వ్యక్తం చేశారు.స్టీల్ప్లాంట్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అరకు ఎంపీ తనూజ రాణి డిమాండ్ చేశారు. ప్రమాదానికి భద్రతా వైఫల్యాలే కారణమా..?. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలి. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తనూజ రాణి అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ని కాపాడింది మేము.. అందుకే ఇంతమంది చచ్చారు..
-
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్ గోల.. యూటర్నే శరణ్యం
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థకు సంబంధించిన వరుస వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో పారదర్శకత, భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో సీబీఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంప్ట్ సంస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ సమాధానపత్రాల ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావడం లేదు. ఫ్యాక్ట్చెక్ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను సంతలో సరుకులా రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్ సమాధానపత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా సంప్రదాయ ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. తప్పుల మీద తప్పులు చేస్తున్న సర్కారు రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండడంతో పాలిటెక్నిక్లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యూయేషన్’’ (ఓఎస్ఎం) ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ‘ఇదేం టెక్నిక్ మహాశయా?’ పేరుతో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసింది. దీంతో ఓఎస్ఎం ఎంతో ఉత్తమ విధానమంటూ వివరణ ఇచ్చిన అధికారులు.. సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన ‘కోఎంప్్ట’ సంస్థను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్నఫళంగా ఆన్లైన్ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి ‘తూచ్.. ఇది పైలట్’ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేగాక మళ్లీ మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని, అదీ.. ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కోఎంప్ట్ ఇన్ఫ్రాకు రూ.కోట్లు చెల్లింపు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆన్స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వ్యాల్యూయేషన్ (ఓఎస్ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని కోఎంప్ట్ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇదే సంస్థ సీబీఎస్ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా నిర్వహించి బొక్కబోర్లా పడింది. ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక విద్యాశాఖ విలీన సమయంలో ‘కోఎంప్ట్’ సంస్థకు రూ.కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.05 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను ఓఎస్ఎం విధానంలో చేపట్టారు. ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 45 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా, 100కు పైగా స్క్రిప్టులు చేయించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధానంలో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో ఉత్తమ విధానంపై బురద జల్లుతున్నారని ఖండించారు.తాజాగా మాన్యువల్ మూల్యాంకనంపాలిటెక్నిక్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆ మార్కులను పక్కనబెట్టి, మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని, అదీ వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 7 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ను ఫణంగా పెట్టి, ఇప్పుడు ఆ మార్కులు చెల్లవని, మాన్యువల్ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఎస్బీటీఈటీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేయడం గమనార్హం. -
దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు..! పోతిన మహేష్ మాస్ వార్నింగ్!
-
ఫస్ట్ ర్యాంకర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..?
-
‘వేళ్లన్నీ లోకేష్వైపే.. రాజీనామా చేయాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేక ఉత్తరకొరియా పాలన చేస్తున్నారా? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయటం దారుణమని మండిపడ్డారు. ఏపీలో అన్ని వేళ్లు విద్యాశాఖ మంత్రివైపు చూస్తున్నాయి. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గానీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలి. డీఎస్సీలో స్పోర్ట్స్ కోట పేరిట ఎలా ఉద్యోగాలు ఇస్తారు. నీట్లో జరిగిన అక్రమాలు బయటపడి దేశవ్యాప్తంగా ఎలా కలకలం రేపాయో.. ఏపీలో డీఎస్సీ వ్యవహారం కూడా అదే స్థాయిలో బయటపడుతోంది. చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటుంది. అన్ని వేళ్ళు విద్యాశాఖ మంత్రి వైపే చూపిస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్కు ఆద్యుడు చంద్రబాబే. రష్యాలో లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఎకానమీ చేస్తామంటున్నారు. అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదు. సంపద సృష్టి అని చెప్పిన చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు ఓటేస్తున్నారంటే మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
'కోఎంప్ట్'కు కోట్ల ఫలహారం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్ మంత్రిత్వ శాఖలో అడ్డగోలు అవినీతి బాగోతాలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ దోపిడీకి పాల్పడుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలతో యావత్ రాష్ట్రం విస్మయానికి గురైంది. ఇక లోకేశ్ పేషీ అవినీతి మకిలి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకూ పాకింది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నిర్వాకంతో యావత్ దేశం అవాక్కయింది. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శులను తొలగించిన విషయం తెలిసిందే. అదే కోఎంప్ట్ సంస్థ నిర్వాకంతో గతంలో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న కోఎంప్ట్ సంస్థతో మంత్రి లోకేశ్ పేషీ సాగించిన అవినీతి జుగల్బందీ తాజాగా బట్టబయలైంది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏటా రూ.172 కోట్ల చొప్పున రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ లోకేశ్ పేషీ సాగించిన అవినీతి నిర్వాకం విస్తుగొలుపుతోంది. డిజిటల్ మూల్యాంకనం ముసుగులో దోపిడీ హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ ద్వారా మంత్రి లోకేశ్ పేషీ దోపిడీకి తెగబడింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం ముసుగులో అవినీతికి తెరతీసింది. ఉన్నత విద్యా మండలి అభ్యంతరాలను కూడా బేఖాతరు చేస్తూ అడ్డగోలుగా వ్యవహారం సాగించింది. విశ్వవిద్యాలయాలతో నిమిత్తం లేకుండా ఏపీటీఎస్ ద్వారా కథ నడిపించి.. కోఎంప్ట్ సంస్థకు టెండరు కట్టబెట్టేయడం విస్మయ పరుస్తోంది. నిధుల దోపిడీకి కోఎంప్ట్ ఎడ్యూటెక్ మూడు కేటగిరీల ముసుగులో ప్రతిపాదనలకు లోకేశ్ పేషీ ద్వారా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక్కో విద్యార్థి పరీక్షా పత్రం మూల్యాంకనం కోసం రూ.32, ఒక్కో పరీక్షా పత్రం ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) కోసం రూ.25.75 చొప్పున కోట్ చేసింది. మొత్తం అన్ని ఫీచర్లతో డిజిటలైజేషన్ సేవల కోసం రూ.115 చొప్పున కోట్ చేయడం గమనార్హం. అంతేకాదు కోఎంప్ట్ ఎడ్యూటెక్కు కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను విశ్వవిద్యాలయాలే సమకూర్చాలి. అంటే ఎటువంటి మూల ధన వ్యయం లేకుండానే కేవలం డిజిటల్ ప్రక్రియను మాత్రమే కోఎంప్ట్ సంస్థ నిర్వహిస్తుందని నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉంది. ఆ ప్రతిపాదనలను లోకేశ్ పేషీ ఆమోదించి ఆ మేరకు కోంఎప్్టతో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తోంది. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చజెండా ఊపనున్నాయి. ఏకంగా మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఒత్తిడి వస్తుండంతో తమకు మరోమార్గం లేకుండా పోయిందని విశ్వవిద్యాలయాల అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏటా రూ.172 కోట్ల ప్రాజెక్టుకు ఎత్తుగడ విశ్వవిద్యాలయాల పరీక్షా పత్రాల డిజిటలైజేషన్ ముసుగులో కోఎంప్ట్ సంస్థకు భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు కలిపి 1.50 కోట్ల బుక్లెట్లు (పరీక్షా పత్రాలు) రాస్తారు. ఒక్కో బుక్లెట్కు రూ.115 చొప్పున ఏడాదికి మొత్తం రూ.172 కోట్ల కాంట్రాక్టును కోఎంప్ట్ కు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు లోకేశ్ పేషీ మంత్రాంగం వేగవంతం చేసింది. ఆ ప్రకారం రానున్న మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ముసుగులో కమీషన్ల రూపంలో భారీ అవినీతికి పన్నాగం పన్నింది. వాస్తవానికి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలు పెట్టింది. ఇంతలో సీబీఎస్ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కోఎంప్ట్ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం నిలుపుదల చేసింది. కోఎంప్ట్ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనం చేట్టింది. సీబీఎస్ఈ వ్యవహారంతో ప్రస్తుతం నిలిపివేసింది. అయినా సరే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిజిటల్ మూల్యాంకనం కోసం కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేశ్ పేషీ తీవ్ర ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను పిలిపించి మరీ కోఎంప్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకు టైమ్ లిమిట్ పెట్టి మరీ ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణాలో 20 మంది ఆత్మహత్య కోఎంప్ట్ నిర్వాకం గతంలో తెలంగాణను హడలెత్తించింది. 2019లో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టు దక్కించుకుంది. అడ్డగోలుగా మూల్యాంకనం చేసింది. మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది అంటే 40 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అది తట్టుకోలేక 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. దాంతో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు ఆ సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యూటెక్గా మార్చుకోవడం గమనార్హం.అప్పట్లోనే వెనకేసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం 2013లో అదే గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ జేఎన్టీయూలో రూ.230 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను దక్కించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్గా అప్పటి జేఎన్టీయూ ఉన్నతాధికారులు కాంట్రాక్టు కట్టబెట్టారు. గ్లోబెరేనా టె క్నాలజీస్ ఇ–కంటెంట్ కోసం మలేషియాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్టు కింద జేఎన్టీయూ గ్లోబెరేనా టెక్నాలజీస్కు రూ.20 కోట్లు చెల్లించింది. అడ్డగోలుగా టెండరు కట్టబెట్టడం, నిబంధనలకు విర్దుద్ధంగా నిధుల చెల్లింపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2014లో టీడీపీ ప్రభుత్వం విచారణ కమిటీ పేరుతో కనికట్టు చేసింది. కానీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి అవినీతిని నిగ్గు తేల్చింది. బిల్లుల చెల్లింపును నిలిపివేసింది. దీనిపై గ్లోబెరేనా టెక్నాలజీస్.. కాంట్రాక్టు మేరకు రూ.230 కోట్లు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.పేరుమార్చుకుని ఏమార్చిన కోఎంప్ట్ సీబీఎస్ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం, డిజిటలైజేషన్ ప్రక్రియలో అవకతవకలతో కోఎంప్ట్ ఎడ్యూటెక్ బాగోతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఆ సంస్థను బ్లాక్లిస్టు్టలో పెట్టారు. కానీ అదే సంస్థ కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే మస్కా కొట్టింది. పరీక్షా పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు సీబీఎస్ఈ ఈ ఏడాది ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ (ఓఎస్ఎం) విధానం చేపట్టింది. ఆ కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ సంస్థ దక్కించుకుంది.సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల వెల్లడితో ఆ సంస్థ నిర్వాకం బట్టబయలైంది. విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్షా పత్రాలను పబ్లిక్ క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్) బకెట్లలో భద్రపరచడం పట్ల సైబర్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లీకేజీ బయట పడింది. ఇక పరీక్షా పత్రాలు కంప్యూటర్ స్క్రీన్ మీద సరిగా కనిపించక పోవడం, విద్యార్థులు రాసిన జవాబులకు.. వచ్చిన మార్కులకు పొంతన లేకపోవడం, విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వేయడం తదితర లోపాలు వెల్లడయ్యాయి. అంతేకాదు కోఎంప్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సీబీఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్టు దక్కించుకున్న వ్యవహారాన్ని సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పరిశోధించి మరీ వెలుగులోకి తెచ్చారు. గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదనే నిబంధనను కోఎంప్్టకు అనుకూలంగా మార్చారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకే అర్హత లేదని మార్చడం గమనార్హం. కోఎంప్ట్ కు అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఇలా అడ్డగోలుగా వ్యవహరించారు. గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న ఈ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని మరుగున పరిచేందుకే కోఎంప్ట్ ఎడ్యూటెక్గా పేరుమార్చుకుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్, కోఎంప్ట్ నిర్వాకంపై యావత్ విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. సీబీఎస్ఈ బోర్డ్ చైర్మన్, కార్యదర్శిని పదవుల నుంచి తొలగించింది. -
ఎగేసుకొని వచ్చేసావ్.. విద్యాశాఖలో నీకేం పని అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టు..!
-
నిన్ను నీ కొడుకుని తగలపెట్టాలి అంబటి ఫైర్
-
పవన్ స్క్రిప్ట్లో మిస్సయిన మెయిన్ మెసేజ్!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
లోకేష్ గుట్టురట్టు.. పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు.. మెగా DSCలో లీకులు
-
'బాబు'ది నో ఆన్సర్.. ఓన్లీ డైవర్షన్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మంగళగిరిలో YSRCPలోకి 30 కుటుంబాల చేరిక
-
లోకేష్ కు బిగ్ షాక్..మంగళగిరిలో YSRCPలోకి 30 కుటుంబాల చేరిక
-
ఎందుకు చెప్తున్నా అంటే.... SIR అంటే ఏంటి..? క్లుప్తంగా వివరించిన పేర్ని నాని
-
పనికిమాలిన వెధవలు కూడా మాట్లాడుతున్నారు... అధికారం మారితే మీ బతుకులేంటో ఆలోచించుకోండి
-
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
-
‘యువగళం’ బ్యాచ్కు డీఎస్సీలో దొడ్డిదారిన పోస్టులు
సాక్షి, అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ–2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి, నిర్వహణ లోపాలున్నాయని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, కలెక్టరేట్లలో కనీసం మెరిట్ లిస్టులు కూడా పెట్టకుండా జీఎస్టీ చట్టం తరహాలో నియామక ప్రక్రియను అత్యంత గందరగోళంగా మార్చేశారని మండిపడ్డారు.లోకేశ్ యువగళం పాదయాత్రలో తన వెంట నడిచిన వారికి సొంత సంస్థ హెరిటేజ్లో ఉద్యోగాలిచి్చనంత సులభంగా స్పోర్ట్స్ కోటా కింద చివరకు ‘పేకాట’ (బ్రిడ్జ్) ఆడేవారికి కూడా దొడ్డిదారిన టీచర్ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. డీఎస్సీపై లోకేశ్ ట్విట్టర్లో సొల్లు కబుర్లు ఆపి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెట్, డీఎస్సీ నిర్వహణతో పాటు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు తదితర 16 రకాల అంశాలపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని కోరుతూ సోమవారం సచివాలయంలో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మెరిట్ లిస్టు మాయం ‘మెగా డీఎస్సీ’ అని ఊదరగొట్టి అభ్యర్థులను దగా చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్కులు, కులం, ర్యాంకులతో సహా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రదర్శించడం సంప్రదాయం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా మెరిట్ లిస్టు డిస్ప్లే చేయలేదు. ఆన్లైన్లో పెట్టామని అబద్ధాలు చెబుతున్నారు. ఆన్లైన్ జాబితాలో ప్రతిసారీ అభ్యర్థుల పేర్లు మారిపోతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలతో హత్యలకు పాల్పడితే చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ అని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. ఆర్టీఐతో కోరిన 16 రకాల కీలక అంశాలివీ... 2025 డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఏ జీవో ప్రకారం, ఏ కేటగిరీలో, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు? ఎంపికైన అభ్యర్థుల అర్హత పత్రాలు.. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ వివరాలు ఏమిటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం నియమించిన సెలక్షన్ కమిటీలో ఉన్న పెద్దలు ఎవరు? వారి అర్హతలేమిటి? స్పోర్ట్స్ కోటాలో రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరు? ఎందుకు తిరస్కరించారు? అభ్యంతరాలను పరిశీలించారా? టెట్ , డీఎస్సీ పరీక్షా పత్రాలను ఎవరు తయారు చేశారు? ఈ ప్రక్రియలో లేదా మూల్యాంకనంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు, జీవోల కాపీల వివరాలు వెల్లడించాలి. -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..
-
మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్
-
ఇదే నాకు లాస్ట్ ఛాన్స్.... లోకేష్ వల్ల నా జీవితం నాశనం అయింది
-
రేయ్ మాలోకం... వైఎస్సార్ విగ్రహం జోలికి వస్తే ఖబడ్డార్!
-
CM గా ప్రమోషన్ కోసమే నారా లోకేష్ ఇలా చేశాడు..!
-
లోకేష్ వస్తే యువత బతుకులు మారతాయి అంటే ఏంట్లో అనుకున్న ఈ రేంజ్ లో మారుస్తావ్ అనుకోలేదు నాయన
-
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన!
-
తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు?
నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరెలు కూడా పంచారు.. రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు... గుడి, బడి, ప్రభుత్వ ఆఫీస్ దేనిని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆఫీస్ లకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా!ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మతి పోవల్సిందే. కిరాక్ అంటూ ఒకాయన వైఎస్సార్సీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. ఏభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటివారితో మాట్లాడించి, ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు.ఇంకోక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్ లతో పాటు దేవాన్ష్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్దిగా చదువుకుంటున్న దేవాన్ష్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పెద్ద సబ్జెక్టు లేదన్నమాట.గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ స్వాధీనం అయిన తర్వాత కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైన చర్చ జరిగేది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మనాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దూషించడానికి, వైఎస్సార్సీపీపై తప్పుడు ముద్రలు వేసి ఆత్మ సంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలు ఉంటాయి. కాదనం. కాని ఈ మహానాడులో అచ్చంగా వైఎస్సార్సీపీని బూతులు తిట్టడానికే టైమ్ కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతే తప్ప తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటి? వైఫల్యాలేమిటి? ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం. వచ్చే మూడేళ్లలో ఏమి చేయాలని అనుకుంటున్నాం.. తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా, అన్నీ చేసేశాం అన్న భ్రమ కల్పించే యత్నం చేశారు.మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఊదరగొట్టేవారు. కాని ఈసారి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మహానాడుకు ఫుల్ కవరేజీ ఇచ్చినా, ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే సేకరించిన ఏభై వేల ఎకరాలు కాకుండా అదనంగా ఎందుకు భూమి అడుగుతున్నారు? రైతులకు ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేయవలసిన అవసరం ఉందా? ఇప్పటికే 47వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంకెంత అప్పు దీనికోసం చేస్తారు? రూపాయి కూడా ప్రభుత్వ ధనం వెచ్చించనవసరం లేదని గతంలో అన్నారు కదా! ఇప్పుడెందుకు మాట మార్చారు? ఇలాంటివాటిపై మహానాడు వంటి సభలలో వివరణ ఇచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది కదా! అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకే కాకుండా, ప్రజలకు కూడా ప్రభుత్వ వాదన తెలిసేది కదా!ఎన్నికల మానిఫెస్టోలోని అంశాల గురించి చెప్పి ఎంతవరకు అమలు చేశామో వివరించడానికి కదా ఇలాంటి మహానాడులు జరిపేది. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వలేకపోయారు.. దీని గురించి కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా 33 శాతం సీట్లు ఇస్తామని ప్రసంగిస్తే ఒరిగేదేమి ఉంటుంది? మూడేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?ఎన్నికల టైమ్ లో మహిళలకు పార్టీపరంగా సీట్లు ఎక్కువ ఇస్తే ఓడిపోతామని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పరని గ్యారంటీ ఏమి ఉంది? నిరుద్యోగ భృతి మూడువేలు ఏమైంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఏమైంది? ఇలాంటి ప్రస్తావనలే లేకుండా మహానాడు ముగిస్తే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? జగన్ తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి కదా!ఒకవైపు అమరావతికి వేల కోట్లు అప్పులు తెస్తూ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటే టీడీపీ కార్యకర్తలైనా అంగీకరిస్తారా? చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు, అర్థ సత్యాలు చెప్పి పార్టీవారిని మభ్యపెట్టడం సరైన విధానం అవుతుందా? ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసునని, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని బీరాలు పోయారే. ఎన్నికలయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెప్పండని జనాన్ని అడిగారు. మహానాడులో అప్పులు చేసి సంక్షేమ పథకాలు తగదని చెబుతున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమి అవుతున్నాయన్నదానిపై వివరణ ఇవ్వవచ్చు కదా! పైగా పది లక్షల కోట్ల అప్పు జగన్ టైమ్ లో జరిగిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్ కి తగునా?రాష్ట్రం మొత్తం అప్పు ఎంత? ఈ రెండేళ్లలో ఎంత అప్పు చేశారు? అంతకుముందు టీడీపీ ఐదేళ్ల టరమ్ లో ఎంత అప్పు చేశారు?జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది? ఈ అంశాలపై జగన్ కాగ్ లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తే, చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా జగన్ టైమ్ లో పది లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పడం ధర్మమేనా? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం అంటూ అతిశయోక్తులు చెప్పినా జనం నమ్ముతారా? ఇవన్ని ప్రతి నిత్యం చేసే రొటీన్ ప్రసంగాలే కదా! ఏపీలో ప్రాక్టికల్ గా ఏమి జరుగుతుందో తెలుసుకోలేని అమాయకులుగా జనం ఉన్నారని చంద్రబాబు భావిస్తుంటే చేయగలిగింది ఏమీ లేదు.ఈ మహానాడు లో కేవలం తన కుమారుడు, మంత్రి లోకేష్ కు మరింత ప్రాధాన్యత కల్పించడానికి, కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి దీనిని ఉపయోగించుకున్నారు. అంతవరకు తప్పు లేదు. కాని చంద్రబాబు తన కుమారుడికి కూడా హుందా లేని రాజకీయాలు అలవాటు చేస్తుండడం బాధాకరం. డీఎస్సీ లో అక్రమాలపై జవాబు చెప్పకుండా లోకేష్ ఏదేదో మాట్లాడి దబాయించారనిపిస్తుంది. ఎల్లో మీడియా కూడా తొలి రోజు లోకేష్ కు మంచి కవరేజీ ఇచ్చి చంద్రబాబు ను తగ్గించడం స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడులో చంద్రబాబు కన్నా, వక్తలు లోకేష్ భజనే ఎక్కువగా చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అది నిజమే అనిపిస్తుంది. 1983 నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఇదే తరహాలో ప్రసంగిస్తూ లోకేష్ ను ఉగ్రనరసింహం అని చెప్పి మెప్పుపొందే యత్నం చేశారు.ఏది ఏమైనా ఈ రెండేళ్లలో నిర్దిష్టంగా ఫలానా గొప్ప పనులు చేశామని చెప్పలేని స్థితిలో చంద్రబాబు, లోకేష్ లు ప్రతిదానికి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేయడం, గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర అని, బాబాయిని చంపించారని, తల్లి, చెల్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు స్త్రీలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నది, కొందరు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నది , రెడ్ బుక్ పేరుతో టెర్రర్ సాగుతున్నది అందరికి కనబడుతూనే ఉంది. అయినా వైఎస్సార్సీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే తెలుగుదేశంపైన, చంద్రబాబు, లోకేష్ లపైన వైఎస్సార్సీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్యతో సహా సహా చంద్రబాబుపై వచ్చిన వచ్చిన ఆరోపణలన్నిటిని వారు ఏకరువు పెట్టి సొంత మామ ఎన్టీఆర్ రామారావు ఆయనను ఉద్దేశించి ఎంత తీవ్రంగా దూషించింది వివరిస్తున్నారు.తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. మహానాడులో ఆమోదించిన ఏ తీర్మానం చూసినా, అంతా జగన్ పైన దూషణలే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడారు కాని, పరకాల ప్రభాకర్ ఏభై లక్షల దొంగ ఓట్ల స్కామ్ గురించి సాక్ష్యాధారాలతో సహా వెల్లడించిన అంశంపై మాత్రం నోరెత్తలేకపోయారు. ఇది మహానాడులో పెద్ద బలహీనతగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి వదిలివేశారు. అది రాకపోవడానికే చంద్రబాబే కారణమన్న ఆరోపణలపై మాత్రం జవాబు చెప్పరు. లక్షల మంది మహానాడులో పాల్గొన్నారని అంకెల గారడి చేయవచ్చు. నాణ్యమైన చర్చలు కాని, మంచి ప్రసంగాలు కాని లేకుండా చరిత్రలో నాసిరకం మహానాడుగా ఇది ముగిసిపోయినట్లు అనిపించడం లేదూ! -
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ: వైఎస్సార్సీపీ నిరసన
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ యూత్ వింగ్ నిరసనలు చేపట్టింది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ:కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారు.మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్ని గుట్టుగానే జరుగుతుంది.కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి.కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి.ఆన్ లైన్ లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి.చదువు రానివాడు చూసినా అర్థమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీవిద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నేతలుజరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్న వైఎస్సార్సీపీ నేతలుకార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ అనురాధ , కో-ఆర్డినేటర్లు పి.రాజేశ్వరి, సూర్యప్రకాశ్ గన్నవరపు శ్రీనివాస్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలునెల్లూరు:మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ .500 మంది యువత , నిరుద్యోగులతో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన యువత .యువత, నిరుద్యోగుల నిరసనలతో అట్టుడికిన కలెక్టరేట్ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిమెగా డీఎస్సీ అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారు:ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిబాబు వస్తే జాబ్ వస్తుందని ఓట్లు దండుకున్నారు: జక్కంపూడి రాజామెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీలక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారులక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు.రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు..హెరిటేజ్ లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారునిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలిపవన్ కళ్యాణ్ కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలిడీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జరిగింది: కేకే రాజుఒక్కొక్క పోస్ట్ ను రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకున్నారు.డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలిలోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.డీఎస్సీపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారుప.గో జిల్లా:కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు.. దగా డీఎస్సీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి వైఎస్సార్సీపీ మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులుమహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో పాల్గొన్న ఆచంట నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి తదితర పార్టీ శ్రేణులుఅనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేసిన నేతలురాజమండ్రి:స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్సార్సీపీ ఆఫీసు నుండి చలో కలెక్టరేట్ ఆఫీస్ వరకు మెగా కాదు-దగా డీఎస్సీ మహాధర్నా కార్యక్రమం మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డీఎస్సీ మెగా కాదు-దగా డీఎస్సీపై నిరసనవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వెంటనే బర్త్ రఫ్ చేయాలి మహాధర్నా చలో కలెక్టరేట్ ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు,, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి , రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.తూర్పుగోదావరి జిల్లా...రాజమండ్రిలో భారీ ర్యాలీబొమ్మూరులో పార్టీ ఆఫీసు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీవేణు గోపాలకృష్ణ కామెంట్స్..ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ.పోస్టులను అమ్ముకున్నారుడీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలిస్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థులను దారుణంగా మోసం చేశారుడీఎస్సీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలిగుంటూరు..వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య కామెంట్స్మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందిఅనేక అవకతవకలు జరిగాయి.డీఎస్సీలో భారీ అవినీతి జరిగిందినిరుద్యోగులకు న్యాయం చేయాలిడీఎస్సీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్డీఎస్సీపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?ముఖ్యమంత్రి, లోకేష్ సమాధానం చెప్పాలి.లోకేష్కు సిగ్గుంటే సమాధానం చెప్పి రాజీనామా చెప్పాలిదగా డీఎస్సీ నిర్వహించిందుకు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.లోకేష్ రాజీనామా చేయాలిమిస్టర్ లోకేష్ నోరు విప్పి మాట్లాడాలిఅక్రమాలు జరిగాయని చెబితే మాట్లాడితే దాడులు చేసే పరిస్థితి ఉంది.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.కృష్ణా జిల్లా..డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నంలో ఛలో కలెక్టరేట్లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకూ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న కృష్ణాజిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టుజిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన యువజన విభాగం నాయకులుపేర్ని కిట్టు కామెంట్స్..సకల శాఖా మంత్రి లోకేష్ తన చేతవాటం ప్రదర్శిస్తున్నాడుడబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తోందిడీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కోవచ్చని లోకేష్ నిరూపించారుముందు మీ శాఖలో అవినీతి తగ్గించు లోకేష్తర్వాత ఎదుటి వారి గురించి వెటకారంగా మాట్లాడొచ్చుస్పోర్ట్స్ కోటాలో డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారురాత్రికి రాత్రి సర్టిఫికెట్లు పుట్టించడం ఉద్యోగాలు తీసుకోవడంనీపేరు లోకేష్ కాదు లో క్యాష్డీఎస్సీ అక్రమాల పై మా పోరాటం ఆగదునిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాంవిశాఖ..జక్కంపూడి రాజా కామెంట్స్..డీఎస్సీ మోసాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు?.పవన్ కాపులకు ఎందుకు వ్యతిరేకమో చెప్పాలి.చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కోసమే పవన్ వ్యాఖ్యలు.డీఎస్సీ మోసాల గురించి మాట్లాడి పవన్ రియల్ హీరో అనిపించుకోవాలి.విద్యా శాఖ మంత్రి లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు..డీఎస్సీ అవకతవకలపై నోరు మెదపకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు.వైఎస్ జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పబ్లిసిటీ కోసం దాన్ని రద్దు చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దగా డీఎస్సీ తీశారు.లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారు.నిరుద్యోగుల ఆకలి కేకలు లోకేష్కు వినిపించలేదా?.డీఎస్సీ పేరుతో లోకేష్ కొట్లాది రూపాయలు సంపాదించారు ..స్పోర్ట్స్ కోట పేరుతో లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు.హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారులోకేష్ సీబీఐకు విచారణకు ఒప్పుకోవాలి.లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..టీచర్ పోస్టులు అమ్ముకున్నట్లు ఆడియో వీడియోలు బయటికి వచ్చాయి..నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారు..వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి ఉద్యోగాల నుంచి తీసేశారు.ఎన్నికల ముందు కాపులు సంఖ్య బలం గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడూ కాపులతో నాకేం పనిలేదు అంటున్నాడు.కోట్లు ఖర్చు పెట్టడానికి కాపులు కావాలి కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు అవసరమే లేదా?.అధికారంలోకి వచ్చిన తర్వాత నీ విధానం చూసి కాపులు ఆవేదనలో ఉన్నారు.అనంతపురం..డీఎస్సీ అక్రమాలపై కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటవైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిభారీగా తరలి వచ్చిన విద్యార్థులు, యువజన విభాగం నేతలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్డీఎస్సీ అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్టీడీపీ కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని ఆగ్రహంతిరుపతి..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనతిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడిపార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనపద్మావతిపురం నుంచి కలెక్టరేట్ వరకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ, నిరసనడీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని నినాదాలు.టీచర్ పోస్టులను అమ్ముకుని మెరిట్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు అంటూ ఆగ్రహంసీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు, -
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!
-
‘డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి’
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. 80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారుఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.ఇసుక విధానంపై రోజుకో మాటచంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం. నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయంగత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలిసంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్నువైఎస్సార్సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి
నెల్లూరురూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని, ఆ ఆరోపణలకు తూతూమంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహిస్తున్నామని, ఈ స్కాంపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్టు రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్ల ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వం పిలిచిందని, కానీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, అటు వారిని రిజెక్టెడ్ జాబితాలోనూ చూపలేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.అభ్యర్థులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, బేఖాతరు చేస్తూ అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీఎస్సీ ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారన్నారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు లేకుండా చేశారన్నారు.మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్టు తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు ఒక పోస్టుకు ఒకరిని చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని, చివరకు వారికి కూడా మొండిచేయి చూపారన్నారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
నువ్వు చేసేది నువ్వు చెయ్యి.. దానికి ఫలితం ఖచ్చితంగా మేమిస్తాం
-
అసలు ఏలా స్కామ్ చేశారంటే? సంచలన నిజాలు బయటపెట్టిన DSC అభ్యర్థి
-
స్కాం ఎలా చేశారంటే..? కోట్లల్లో డీల్.. బయటపడ్డ లోకేష్ DSC స్కాం
-
హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు చూశా.. హైబ్రిడ్ మహానాడు ఏందిరా స్వామి
-
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నమంత్రి నారా లోకేష్..
-
ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు)
-
మహానాడులో లోకేష్ వ్యాఖ్యలపై ఇరకాటంలో టీడీపీ
-
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే ప్యాంటు తడుపుకున్నావ్.. లోకేష్ వ్యాఖ్యలపై రోజా రెటైర్లు
-
నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ.. మాట్లాడితే గొడ్డలి గొడ్డలి.. కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ మహానాడు.. రికార్డింగ్ డ్యాన్సులు.. పరువు తీశారు కాదయ్యా..
-
లోకేశ్.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైఎస్సార్సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
హామీలు మరిచి ‘మహా’ నాటకం!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించి రెండేళ్లైనా వాటి ఊసే లేకుండా పాలన సాగించిన చంద్రబాబు కనీసం ఈ మహానాడులోనైనా వాటి గురించి ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిలిస్తూ ‘డిజిటల్’ పేరుతో గొప్ప హైడ్రామాను రక్తి కట్టించారు! సూపర్ సిక్స్లు, సెవెన్లు సహా ప్రజలకు ఇచ్చిన 143 హామీలను ఎందుకు అమలు చేయలేదో.. పోనీ ఎప్పటి నుంచి చేస్తారో.. మహానాడులో కనీసం చర్చించిన పాపాన పోలేదు. చంద్రబాబు కొత్త పథకాలు ఇవ్వకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో.. అందుకు కారణాలేమిటో చెప్పలేదు. దాదాపు రూ.పది వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? వాటిని ఎప్పుడిస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చి అంపశయ్యపైకి చేర్చారు. రోగులకు ‘ఆసరా’ ఊసే లేదు. అక్కచెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మాటే లేదు. వైఎస్ జగన్ హయాంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ప్రతి ఊరిలో కళకళలాడిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు భ్రష్టు పట్టించారంటే సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. కనీవిని ఎరుగని రీతిలో అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపైకి చేరుకుని అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురిస్తే దాని గురించి మహానాడులో కనీసం చర్చ లేదు. మళ్లీ సమస్య తలెత్తకుండా ఏం చేస్తారో చెప్పలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏకంగా 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయో సమాధానం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఎటుపోయిందో చెప్పలేదు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా స్కామ్లు చేస్తూ... ఆచరణ సాధ్యమైన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఎందుకు వద్దో చెప్పడం లేదు. మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్..! లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్లు.. చినబాబు చొరవ అంటూ మరో హైడ్రామా! వైఎస్ జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో 33 శాతం పదవులు మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో మహానాడులో చర్చ లేదు. వైఎస్ జగన్ హయాంలో మహిళలే కేంద్రంగా పాలన సాగించి సింహభాగం పథకాలతో వారికి లబ్ధి చేకూర్చితే.. మహిళా సాధికారతకు కూటమి సర్కారు తూట్లు పొడిచింది. హామీల అమలు, పాలనను గాలికి వదిలేసి ‘రెడ్బుక్’ బెదిరింపులతో అరాచకంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా మహానాడులో బోరు కొట్టించే ప్రసంగాలు.. జగన్పై వ్యక్తిగత విమర్శలు మినహా ఏ ఒక్క అంశంపైనా నిర్మాణాత్మకంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పాలన పడకేసిన చంద్రబాబు సర్కారులో మట్టి నుంచి ఇసుక, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్, మద్యం దాకా దేంట్లో చూసినా దోపిడీనే..! ప్రాంగణాలు వెలవెల.. మహానాడు పేరుతో చంద్రబాబు నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది. టీడీపీ కార్యర్తలు కూడా ఈ డ్రామాను పట్టించుకోకపోవడంతో అన్నిచోట్లా మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయినా సరే రికార్డులు సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. మహానాడుకు వర్చువల్గా 11 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఈ హాజరును తీసుకున్నట్లు సంబరపడ్డారు. నిజానికి మహానాడుకు స్పందన లేకపోవడంతో నాయకులు జనాన్ని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. అనేక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక వచ్చిన కొద్ది మంది కూడా వెనుతిరిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని కదిపినా ఇదేం మీటింగ్? అని విసుక్కోవడం మహానాడు ప్రత్యేకతగా నిలిచింది. పోటాపోటీగా పొగడ్తలు.. మహానాడు ఆద్యంతం అదే పనిగా వైఎస్ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగిడేందుకు నేతలు పోటీలు పడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు జయంతిని చిరకాలం నిర్వహించేలా ‘బాబునాడు’ చేద్దామని ఆయన వేదికపైన ఉండగానే నేతలు చెప్పడాన్ని బట్టి వారి అతి ఏ స్థాయికి వెళ్లిందో చూడవచ్చు. లోకేశ్ రాష్ట్రానికి కాదు.. దేశానికి దిక్సూచి అని, పులి కడుపున పులే పుడుతుందంటూ.. ఆయన పెద్ద పులి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి అందం ఆ కుటుంబాల్లో నారా దేవాన్‡్షకే వచ్చిందంటూ మోకా ఆనంద్సాగర్ అనే నేత పొగడ్తలు కురిపించారు. వైఎస్సార్సీపీని చంపేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అనుచిత వ్యాఖ్యలు చేసి లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయతి్నంచారు. వీటిని వింటూ చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ఎన్టీఆర్ కోసం ఉత్తుత్తి తీర్మానం ఎప్పటిలానే ఈ మహానాడులో పలు ఉత్తుత్తి తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని మరోసారి ఆమోదించారు. ఈసారి ఆ తీర్మానాన్ని చంద్రబాబు పెట్టడం గమనార్హం. భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబే తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో చేయని వాటిని చేసినట్లు, జరగని వాటిని జరిగినట్లు చూపించడానికి చంద్రబాబు తాపత్రయపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే అమలు చేసేసినట్లు చెప్పారు. లోకేశ్ జెన్జీ కామెడీ! మహానాడులో నారా లోకేశ్ పబ్లిసిటీకి పరాకాష్టగా ఆయన జెన్జీ యువతతో సమావేశమై సంభాíÙంచినట్లు ఓ యూట్యూబ్ లింకు ఇచ్చారు. అందులో నలుగురంటే నలుగురే పార్టీ కార్యకర్తలు కూర్చోగా వారితో లోకేశ్ పిచ్చాపాటీగా మాట్లాడారు. దాన్నే జెన్జీ సమావేశంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకోవడం గమనార్హం. -
ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు


