breaking news
Nara Lokesh Babu
-
నారా లోకేష్ ఎక్కడ...?
-
లోకేష్ బాబే DSC దొంగ..! DSC అక్రమాలపై YSRCP మరో ఉద్యమం
-
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
-
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం
-
వైఎస్ జగన్ అడిగింది లోకేష్కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
DSC దొంగలు అడ్డంగా దొరికేశారు.. లోకేష్ జైలుకే!
-
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
-
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
7 దశల్లో వెరిఫికేషన్ చేసి ఏం సాధించారు? DSCలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పై జగన్ ఫైర్
-
బాబు ఫ్రస్టేషన్.. ఏపీ పెన్షనర్లకు బిగ్ షాక్.. కొత్త టెన్షన్!
-
ఇప్పుడు సమాధానం చెప్పు లోకేష్
-
ఏమైనా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టండి... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం..
-
అధికారులదే తప్పు.. నేను, నా కొడుకు నిప్పు.. కట్ చేస్తే బూడిద..
-
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో
-
దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్
-
డీఎస్సీలో మరో నాలుగు వికెట్లు డౌన్, నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బట్టబయలు
-
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుకు బిగ్ షాక్.. అడ్డంగా దొరికిన కొడుకు.. పక్కా ఆధారాలతో ఏకిపారేసిన జగన్
-
నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్
-
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
‘లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’
గుంటూరు: డీఎస్సీ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ వ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు.‘డీఎస్సీ పై ప్రభుత్వానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. అందుకే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాట్లాడలేదు. లోకేష్... లవ్ క్యాష్ అన్న సంగతి తెలుసు. లోకేష్ దొరికిపోయిన దొంగ. లోకేష్ రాజకీయాలకు పనికి రారు...మంత్రిగా కూడా పనికి రారు. లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రిని చేస్తే దేశాన్నే అమ్మేస్తారు. లోకేష్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారు. ఆయన రాజీనామా చేయాలి. లోకేష్తోనే టీడీపీ సర్వ నాశనం అవుతుంది. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్ల చేత మాట్లాడిస్తున్నారు. ఇంకా రెండు డిఎస్సీలు పెడతామంటున్నారు. లోకేష్కు మంత్రి సీటులో కూర్చునే హక్కు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా? -
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
DSC స్కాంలో తవ్వేకొద్ది అక్రమాలు.. ఒక్కొక్కటి బయటపడుతుంటే బాబుకు బీపీ పెరుగుతోంది
-
డీఎస్సీ స్కామ్తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
ఒక అడుగు వెనక్కి వేశామంటే అది భయపడి అనుకున్నారా? అంబటి ఫైరింగ్ స్పీచ్
-
DSCలోనే కాదు.. ఫేక్ సర్టిఫికెట్లతో మెడికల్ సీట్లు..
-
ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ లోకేష్.. DSC స్కామ్ జరిగింది.. ఇవిగో ఆధారాలు
-
బాబుకు బిగ్ షాక్.. DSC స్కామ్ లో పెద్ద తలకాయలు
-
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
DSC అక్రమాలపై లోకేష్ జైలుకు వెళ్లడం పక్కా
-
సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి
-
బాబు, లోకేష్కు తెలియకుండా జీవోలు వచ్చాయా?: డీఎస్సీపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. అక్రమాలు లేవని చెప్పిన ప్రభుత్వం, ఆధారాలు బయటకు వచ్చి ప్రజల్లో చర్చ మొదలయ్యాక విచారణకు సిద్ధమంటూ మాట మార్చడం సరికాదని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కర్నూలుకి చెందిన ప్రభాకర్ ఉదంతంపై కమిటీ వేశారు.. ఉద్యోగం ఇచ్చాక కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? వ్యక్తిగత అర్హత గురించి విద్యార్హత గురించి పట్టించుకోకుండా నియామకాలు జరిపి మేము అక్రమాలు బయటకు వచ్చాక సంబంధం లేని వాదనలు వినిపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా విషయంలో అక్రమాలు జరిగినట్టు తేటతెల్లం కాగా అసోసియేషన్లపై నెపం నెడుతున్నారు. స్పోర్ట్స్ పత్రాల్లో అసలైన సంతకాలు ఉన్నాయా లేదా చెప్పాలి? క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు తెలిసే ఇదంతా జరిగింది. కాబట్టి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తున్నారు. అందుకే క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు. అసలు టోర్నమెంట్లు నిర్వహించకుండానే క్రీడాకారులకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాద్ధాంతం అయ్యాక ఇప్పుడు అసోసియేషన్లను అడుగుతామంటున్నారు. ఇది ముమ్మాటికీ మీరు చేసిన పాపం.. ఫలితంగా నిరుద్యోగులు బాధపడే స్థాయికి తెచ్చారు. తప్పు జరగలేదు అంటే ఇన్ని రకాల ఎంక్వయిరీలు ఎందుకు చేస్తున్నారు?.డీఎస్సీపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు.. బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు?. సీఎంకు తెలియకుండానే జీవోలు వచ్చాయా? ఆయన సంతకం చేయకుండానే ఫైల్స్ కదిలాయా? కాబట్టి ఇందులో ప్రత్యక్ష నిందితులు చంద్రబాబు, లోకేష్ అని ఖచ్చితంగా చెప్తున్నాం. న్యాయం అడుగుతుంటే మా గొంతు నొక్కుతున్నారు.. దమ్ముంటే రాజకీయంగా మాట్లాడండి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పనికిరాదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా లోపాలను ఒప్పుకోండి. స్పష్టమైన ప్రకటన చేయండి. విచారణ చేసి నిజాలపై వివరణ ఇవ్వండి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆపేది లేదు. శాఖాపరంగా, ప్రభుత్వం పరంగా అనేక రకాలుగా పొరపాట్లు జరిగాయి. ఇవన్నీ ప్రజలకు తెలియాలి అంటే సీబీఐ విచారణ జరిపించాలి. అంతులేని అక్రమాలకు కారకుడైన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మెగా డీఎస్సీల్లో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు -
అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..
-
సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ
-
అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..
-
DSCలో అక్రమాలు నిజమేనని అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు
-
అధికారులు ముందుకు.. మంత్రిగారు వెనక్కి.. DSCలో బయటపడుతున్న లోకేశ్ లీలలు
-
అధికారుల అబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన లోకేష్.. యాంకర్ ఈశ్వర్ మాస్ ర్యాగింగ్
-
DSC అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే
-
అడ్డంగా దొరికిన లోకేష్.. పుట్టలో పాముల్లాగా బయటపడుతున్న DSC స్కామ్
-
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి
-
‘డీఎస్సీ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు జరిగినట్టు అధికారులు అంగీకరించారు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పారు.. అంటే అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజిలెన్స్తో కాకుండా సీబిఐతో విచారణ జరిపించాలన్నారు.‘‘ఈ అక్రమాల వెనుక నారా లోకేష్ హస్తం ఉంది. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలేవీ?. ఇప్పటికీ అక్రమాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?. పచ్చి అబద్దాలతో మంత్రి లోకేష్ అసెంబ్లీని సైతం అవమాన పరిచారు. వైఎస్ జగన్కు సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. డీఎస్సీ అక్రమాల వెనుక వ్యవస్తీకృత నేరం ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అక్రమాలు చేశారు...జూడో అసోసియేషన్ ఛైర్మన్ భరత్ సాక్షాత్తూ నారా లోకేష్ తోడల్లుడే. ఆ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇవన్నీ బయట పడాలంటే సీబిఐతో విచారణ జరపాల్సిందే. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైఎస్ జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి లేదు. లోకేష్ ఎమ్మేల్యే కాకముందే నేను ఎంపీ అయ్యాను. లోకేష్తో చర్చకు నేను సిద్ధం. కరకట్ట ఇల్లయినా, హైదరాబాదు ఇంటికైనా చర్చకు వస్తా. డేటు, టైం లోకేష్ ప్రకటించాలి’’ అని మార్గాని భరత్ సవాల్ విసిరారు. -
మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు
-
ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..
-
DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట
-
DSC స్కామ్ పై లోకేష్ ఛాలెంజ్ లు నాగమల్లేశ్వరి అదిరిపోయే కౌంటర్
-
MAGAZINE Story: దగా DSCలో మెగా స్కామ్
-
DSCలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం అంగీకారం
-
ఇదే కదా అసలైన ఫేక్ పాలన అంటే
-
లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్
-
సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు
-
కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?
-
పిల్ల చేష్టలు ఇంకా పోలేదు... సీఎం కుర్చీ కోసం బాగా ఆశపడుతున్నట్టున్నావ్!
-
నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. లోకేష్ బండారం బట్టబయలు
-
చేసిందంతా చేసి నీతులు మాట్లాడుతున్నారా... చంద్రబాబు, లోకేష్ పై శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
-
నువ్వు మంత్రిగానే పనికిరావు.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతావా..?
-
ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
-
హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..
-
నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?
-
సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
-
టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..
-
DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?
-
పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు
-
DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!
-
మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...
-
తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!
-
DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?
-
ఆట దగా.. ‘కోటా’ దగా!
సాక్షి నెట్వర్క్: మైదానంలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి.. డీఎస్సీలో ఉద్యోగం రావాలంటే మెరిట్ ఉండాలి. కానీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నడిపిన మెగా డీఎస్సీ దగా నాటకంలో ఉద్యోగం రావాలంటే నకిలీ సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇçప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బైటపెడుతున్నాయి. కేసులు వేరు.. వ్యక్తులు వేరు.. క్రీడలు వేరు. కానీ జరిగింది ఒక్కటే...ఇదో పెద్ద స్కామ్.. స్పోర్ట్స్ కోటా ఎంపిక మొత్తం ఓ పెద్ద కుంభకోణం.. దానిని నిరూపించే కొన్ని ఉదంతాలను చూద్దాం...టాపర్ను బలిచేసి అనర్హురాలికి పోస్టుకోటిపల్లి అనిల్కుమార్ది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామం. మెగా డీఎస్సీలో 2025లో ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు ఎగ్జామ్ రాశారు. ఎస్సీ గ్రూప్–1 మెరిట్ లిస్టులో మూడో వ్యక్తి. అనిల్ కంటే ముందు ఉన్న ఇద్దరికీ ఓపెన్లో 13, 14వ ర్యాంకులు రావడంతో ఓపెన్ కేటగిరీలో పోస్టులు సాధించారు. వారి తర్వాత 73 మార్కులతో అనిల్ (168ఓపెన్ ర్యాంకు) ఉన్నారు. అంటే ఎస్సీ గ్రూప్–1 కేటగిరీ కింద అనిల్ టాప్లో ఉన్నారు. ఆ కేటగిరీ పోస్టు ఆయనకే దక్కాలి. కానీ ఎలాంటి మెరిట్ లిస్టు ప్రకటించకుండా విడుదల చేసిన స్పోర్ట్స్ కోటా కింద ఎస్సీ కేటగిరీకి చెందిన నాగరత్నం అనే మహిళను ఎస్సీ గ్రూప్ 1 సోషల్ రిజర్వేషన్ పోస్టులో భర్తీ చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా నియమించేశారు. తీరా చూస్తే ఆ మహిళా అభ్యర్థి అనర్హురాలు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెగ్యులర్గా పనిచేస్తున్న ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ పెట్టారు. బీపీఈడీ అనేది డిస్టెన్స్ మోడ్లో పూర్తి చేయాల్సిన కోర్సు కాదు. రెగ్యులర్గా కాలేజికి వెళ్లి చేయాల్సిన కోర్సు అది. కానీ ఇక్కడ నాగరత్నం సెలవు పెట్టకుండా కోర్సు పూర్తి చేసినట్టు తేలింది. అంటే, అది ఫేక్ సర్టిఫికెట్. అలాగే, డిగ్రీ కూడా ఫేక్ సర్టిఫికెట్ అని గుర్తించారు. దీనిపై అనిల్తో పాటు స్పోర్ట్స్ కోటాలో నాగరత్నం కంటే ముందు ఉన్న బి.ఎర్రయ్య అనే వ్యక్తి కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని గుర్తించారు. దీంతో ఆమెకు పోస్టు ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. సమాధానం లేని ప్రశ్నలు డీఎస్సీ అభ్యర్థులు, ప్రతిపక్షాలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబుందా? ⇒ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాను ప్రభుత్వం ఎందుకు బహిరంగపరచలేదు? ⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఎవరు తుది నిర్ణయం తీసుకున్నారు? వారి బాధ్యతను ప్రభుత్వం వెల్లడిస్తుందా? ⇒ ఫేక్/అనుమానాస్పద సర్టిఫికెట్లపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై ఒకే స్థాయి విచారణ జరిగిందా? లేక కేసు కేసుకు వేర్వేరు ప్రమాణాలు పాటించారా? ⇒ అనర్హత నిర్ధారణ అయిన అభ్యర్థులకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఆ నియామకాలను రద్దు చేస్తారా? వారికి చెల్లించిన వేతనాల పరిస్థితి ఏమిటి? ⇒ అక్రమంగా పోస్టు కోల్పోయినట్లు చెబుతున్న మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? ⇒ మొత్తం స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎన్ని సర్టిఫికెట్లను, ఎంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఆడిట్ చేశారు? ⇒ గుర్తింపు రద్దయిన లేదా గుర్తింపు లేని స్పోర్ట్స్ సంఘాల సర్టిఫికెట్లను డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఏ నిబంధన ప్రకారం అంగీకరించారు? ⇒ సాఫ్ట్బాల్ అసోసియేషన్కు గుర్తింపు లేకపోయినా ఆ సంఘం జారీ చేసిన సర్టిఫికెట్ల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు?సర్టిఫికెట్లు ఎప్పుడైనా మార్చవచ్చా? శ్రీకాకుళం జిల్లాలోనే ఇది మరో వ్యవహారం. స్పోర్ట్స్ కోటాలో పెద్ద అప్పలరాజుకు పీఈటీ ఉద్యోగం వచ్చింది. పోస్టు కోసం దరఖాస్తు చేసిన సమయంలో హయ్యెస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కింద 37వ నేషనల్ గేమ్స్ 2023 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగా, బ్యాకప్ సర్టిఫికెట్గా 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ పార్టిసిపేషన్ను అప్లోడ్ చేశారు. ఇక్కడే తేడా జరిగింది. బ్యాకప్ సర్టిఫికెట్గా అప్లోడ్ చేసిన 4వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ ఆయనది కాదు. ఆయన సోదరుడు విశ్వేశ్వరరావుది. అంతేకాదు అప్పలరాజు పుట్టిన తేదీ 1998 జూలై 29 కాగా, బ్యాకప్ సర్టిఫికెట్లో విశ్వేశ్వరరావు పుట్టిన తేదీ 2003 జూన్ 12గా ఉంది. అటు సర్టిఫికెట్లు చూసినా, ఇటు పుట్టిన తేదీ చూసినా తేడా ఉందని అధికారులు గుర్తించాలి. అభ్యంతరం పెట్టాలి. ఇదేమీ పరిశీలించకుండా పెద్ద అప్పలరాజుకు ఉద్యోగం ఇచ్చేశారు. వీటిపై ఆరోపణలు వచ్చే సరికి శాప్లో తన సోదరుడు విశ్వేశ్వరరావు సర్టిఫికెట్ తీసేసి బ్యాకప్ సర్టిఫికెట్గా అప్పలరాజుకు చెందిన 6వ ఎలైట్ మెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ 2022 పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పెట్టారు. అభ్యంతరాలు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మార్పులు, చేర్పులు జరిగిపోయాయి.మరి గిరిజనుడైన దుర్గయ్యకు ఆ రూల్ వర్తించదా? పెద్ద అప్పలరాజు అర్హుడైనప్పుడు గిరిజనుడైన దుర్గయ్య కూడా అర్హుడే అని చెప్పాలి. ఆర్చరీలో గోల్డ్ మెడలిస్టు అయిన దుర్గయ్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ పెట్టానని దుర్గయ్య అంటుంటే సిల్వర్ మెడల్ పెట్టారని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ మిస్సయిందనుకుంటే గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ జత పరుస్తానని దుర్గయ్య చెబుతూ వచ్చారు. కానీ పరిగణనలోకి తీసుకోలేదు. దరఖాస్తు గడువు ముగిశాక వెనక్కి వెళ్లి పాత తేదీలతో ధ్రువీకరణ పత్రాలను స్వీకరించడం చట్టబద్ధంగా నిబంధనలకు విరుద్ధమని, సాంకేతికంగా ఆయన దరఖాస్తును పరిశీలించలేమని చెప్పేసింది. ఆన్లైన్లో గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయలేదని దుర్గయ్య దరఖాస్తును పరిశీలించినప్పుడు పెద్ద అప్పలరాజు ఆన్లైన్లో తన తమ్ముడు విశ్వేశ్వరరావు నేషనల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడమే కాకుండా, పుట్టిన తేదీల్లో కూడా తేడాలున్నాయి. దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ అలా చేయలేదు. అప్పలరాజుకు తన తమ్ముడు సర్టిఫికెట్ తీసి, తన సర్టిఫికెట్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా జాబ్ వచ్చాక, అభ్యంతరాలు వచ్చిన తర్వాత. దీనివెనకున్న మర్మమేంటో ప్రభుత్వమే చెప్పాలి. సర్టిఫికెట్ అప్లోడ్ విషయంలో పొరపాటు జరిగిందని, వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్ మార్చడం జరిగిందని పెద్ద అప్పలరాజు మీడియా ముందు కూడా అంగీకరించారు. అర్హత లేకపోయినా కూన రవికుమార్ సంతకంతో ఉద్యోగాలు అర్హత లేని సంఘాల ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇందులో నిబంధనలు కూడా పాటించలేదు. దీనికి సాఫ్ట్బాల్ అసోసియేషనే ఉదాహరణ. సాఫ్ట్బాల్ అసోసియేషన్కు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ గానీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ సర్వీసెస్ గుర్తింపుగానీ లేదు. ఇది లేకుండా ఏ సంఘం పనిచేసే అవకాశం లేదు. 2021లో ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా సంఘం గుర్తింపు రద్దు అయ్యింది. గతంలో ఒక వ్యక్తి సాఫ్ట్బాల్ నేషనల్స్ అడకుండానే హైకోర్టు ఉద్యోగానికి స్పోర్ట్స్ కోటాలో సెలక్టయ్యాడు. అతడి సర్టిఫికెట్పై అనుమానం వచ్చి విచారణ చేయగా అతను నేషనల్స్ అడినట్లు చెబుతున్న తేదీల్లో ఒక కాలేజీలో పరీక్షలు రాస్తున్నట్లు తేలింది. దీంతో 2025 డిసెంబర్ 15న అసోసియేషన్ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్కు అసలు గుర్తింపే లేకుండా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్నది ప్రశ్న. జీవో–4 ప్రకారం నోట్ అని ఒక కాలమ్ ఇచ్చారు. అందులో రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి లేదా ఫెడరేషన్ కార్యదర్శి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఫెడరేషన్ కార్యదర్శి, అసోసియేషన్ కార్యదర్శితోపాటు అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా విచ్చలవిడిగా సర్టిఫికెట్లు ఇచ్చేశారు. అతని సర్టిఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆఖరికి శ్రీకాకుళం సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రమణ భార్య లక్ష్మీదేవికి కూడా ఇదే కోటాలో ఉద్యోగం దక్కింది. శాప్ గుర్తింపు లేదంటూ రెజ్లింగ్ వంటి సంఘాలకు ఉద్యోగాలు నిరాకరించారు. అటువంటిది ఒలింపిక్ అసోసియేషన్ గాని కేంద్రం గుర్తింపు లేని సంఘం నుంచి ఉద్యోగాలివ్వడం వెనుక శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అసోసియేషన్ కార్యదర్శి సమక్షంలో ఈ ప్రక్రియ చేయాల్సి ఉండగా దీనికి భిన్నంగా శాప్ ఎండీకి కూడా సంబంధం లేకుండా శాప్ పరిపాలనా అధికారితో దీన్ని పూర్తి చేశారు. వాలీబాల్ అసోసియేషన్కు కూడా గుర్తింపు లేదని సమాచారం. ముఖ్యనేత అండ, భరోసా లేకుండా ఇలా చేయడం సాధ్యం కాదని డీఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.పోస్టల్ డిపార్ట్మెంట్ నిరాకరించినా.. దగా డీఎస్సీలో ఉద్యోగం.. వెయిట్ లిఫ్టింగ్లో కతిల వెంకటలక్ష్మి తప్పుడు జనన ధ్రువీకరణ ఇచ్చారని రుజువు కావడంతో పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం నిరాకరించారు. ఆమె 1992 మే 20న పుట్టినట్లు స్కూల్ సర్టిఫికెట్లలో ఉంటే 1993 మే 10 పుట్టినట్లుగా బోగస్ జనన ధ్రువీకరణ పత్రం సృష్టించి వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొనట్లు గుర్తించారు. తాజాగా డీఎస్సీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో మాత్రం ఉద్యోగం ఇచ్చేశారు. నాట్ క్వాలిఫైడ్.. కానీ ఉద్యోగం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపోర జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్గా విధులు నిర్వహిస్తున్న మిరియాల గాయత్రి సాయిశ్రీ ఇటీవల సోషల్ (బ్యాక్లాగ్) కేటగిరీలో టీచర్ పోస్టు సాధించారు. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రిమార్క్లో నాట్ క్వాలిఫైడ్ అని ఉన్నా, బీఈడీకి సంబంధించి ఆమె సరైన ఆధారాలు సమర్పించకపోయినా ఫైనల్ లిస్టులో ఉద్యోగం ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం డివైఈఓ కిషోర్ గాయత్రిని తన కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. ఆమె విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ, బీఈడీ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్టు ఆయన తెలిపారు. సాఫ్ట్బాల్ సర్టిఫికెట్లపై అధ్యక్షుడి హోదాలో సంతకం చేసిన కూన రవికుమార్ నకిలీ పత్రాలతో అడ్డంగా దొరికిపోయారు.. దగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ఇదో కొత్త అంకం.. భార్యాభర్తలు ఒకే గేమ్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా కింద రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన షేక్ ఇమాంహుసేన్, అతని భార్య కరిష్మా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జూడో ఛాంపియన్స్ అంటూ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం వీరు కౌతాళం మండలంలో ఉర్దూ ఎస్జీటీగా ఇమామ్ హుసేన్, తెలుగు ఎస్జీటీగా కరిష్మా విధులు నిర్వహిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన ధ్రువపత్రాల్లో స్థానికత వేరువేరుగా ఉన్నాయి. 73కిలోల విభాగంలో జూడో హరిక్రిష్ణ అనే వ్యక్తి స్పోర్ట్స్ సర్టిఫికెట్ను సవరించి అందులో పేరు మాత్రం మార్చి వీరి పేరుతో సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఇమామ్ హుసేన్ స్వస్థలం ఒకచోట విశాఖ, మరో చోట దొర్నిపాడు అని, భార్య కరిష్మాది ఒక చోట దొర్నిపాడు అని మరోచోట విజయనగరం స్వస్థలాలుగా ఉన్నట్లు గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు స్వస్థలాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ అనుమానం. దీనిని బట్టి ఇవీ తప్పుడు స్పోర్ట్స్ ధ్రువీకరణ పత్రాలే అని తెలిసిపోయింది. ఎక్కడైతే చదువుతున్నామో అక్కడి నుంచే స్పోర్ట్స్ ఆడాల్సి ఉంటుంది. కానీ 2014లో కర్ణాటకలో డీఈడీ చదువుతూ అదే ఏడాది 2014లో ఏపీలో జూడో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి సర్టిఫికెట్ ఎలా పొందారన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నొస్సం కరిష్మా ఇంటర్ 2011–2013లో చదివారు. 2014లో ఏదో ఒక కోర్సు చేస్తూ ఉండాలి. జూడో స్పోర్ట్స్ సర్టిఫికెట్లో మాత్రం 2014లో ఆడినట్లు ఉంది. కానీ ఆ సమయంలో ఆమె ఖాళీగా ఉంది. ఎందుకంటే డీఈడీ మాత్రం 2015–2017లో చేసినట్లు సర్టిఫికెట్ ఉంది. అంటే 2017లో డీఈడీ పూర్తి చేసి ఎలాంటి విద్యాభ్యాసం చేయకుండా ఉన్న 2014 సర్టిఫికెట్ ఎలా చెల్లుతుందనేది అనుమానం. -
సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్
-
DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త
-
డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!
-
మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?
-
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)
-
ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?
-
DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
-
CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్
-
సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్
-
తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు
-
బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...
-
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్లు
సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్లు నోరు విప్పడం లేదు. కర్నూలు అనర్హత టీచర్ ప్రభాకర్పై సమాధానం చెప్పని ఐఏఎస్లు.. నకిలీ క్రీడా సర్టిఫికెట్ల టీచర్లపై కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వహిస్తున్నారు. అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యాశాఖ మాజీ కార్యదర్శి కోన శశిధర్ నోరు విప్పడం లేదు. విద్యాశాఖ కమిషనర్ అన్సారియా ఎందుకు మాట్లాడటం లేదన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కార్యదర్శి శ్యామలరావు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా నకిలీ సర్టిఫికెట్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ ఎందుకు నోరు విప్పడం లేదు? గతంలో అంతా సక్రమమన్న అజయ్ జైన్ ఇప్పుడెక్కడ?. శాప్ ఎండీ భరణికి ఇప్పుడు బాధ్యత లేదా?. అర్హతలేని స్పోర్ట్ కోటా టీచర్లపై ఎండీ భరణి ఎందుకు నోరు విప్పడం లేదు?. లోకేష్ను కాపాడటం కోసం నోరు విప్పడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై పోస్ట్ చేస్తే చర్యలంటూ చంద్రబాబు సర్కార్ వార్నింగ్లు ఇస్తోంది. అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. -
సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్
-
ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..
-
లోకేష్ రాజీనామా చేయాలి
-
అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?
-
ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు
-
ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?
-
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీవైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాలమాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు -
టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!
-
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!
-
దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?... మెగా డీఎస్సీ కుంభకోణంపై ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే
-
ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
-
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ -
కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు
-
DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్
-
ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!
-
ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ వరుసగా ఎన్నో సాక్ష్యాలు బయటకు వస్తున్నా ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థి టెట్లో క్వాలిఫై కాకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు?వన్ టు వన్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి..’ అని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. అందులో ఏమన్నారంటే... ఇంకా దాక్కుంటారా..? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ.. మోసాల్లో మెగా, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట దగా అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేశ్తో రాజీనామా చేయించకుండా.. అధికార బలంతో అబద్ధాలు చెబుతూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కుమారుడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ అదృశ్య శక్తి లోకేశ్ కాదంటారా? కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? వన్ టు వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ అర్హత లేదని తెలిసి కూడా పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ తర్వాత దశలు కూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేశ్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ 2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబూ..! ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కింద పనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం. ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే.. వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి మీకు డబ్బా కొట్టించుకోవడం ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బ తీసిన ఈ దారుణమైన స్కామ్ను కప్పిపుచ్చలేరు. పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మరోమారు భరోసా ఇస్తున్నాం. లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు.. టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు.. మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నా.మీ అక్రమాలను ఏపీపీఎస్సీకి పాకించారు..మరో నిర్ఘాంతపరిచే విషయం ఏమిటంటే.. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్ 4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా? డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్మెంట్ను మధ్యలో ఆపేయడంతోపాటు ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపివేయడం వాస్తవం కాదంటారా? .@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల… pic.twitter.com/8dkiPMnKjk— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026 -
DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు
-
లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం
-
41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..
-
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.చంద్రబాబు, లోకేష్లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్
-
DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?
-
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?
-
‘యువగళం పోస్టింగ్స్’.. లోకేశ్ టీమ్కు టీచర్ ఉద్యోగాలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ అక్రమాలమయంగా మారిందనేందుకు మరిన్ని బలమైన ఆధారాలు, కొత్త కోణాలు, సంచలన వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిభావంతులను దగా చేస్తూ, అర్హులకు ద్రోహం తలపెట్టి మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గోప్యతకు, పారదర్శకతకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. అసలు పరీక్షే లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో ఇష్టారాజ్యంగా టీచర్ ఉద్యోగాలను ఇవ్వడం.. జాతీయ స్థాయిలో పతకాలు పొందినవారిని పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం.. ఆ పోస్టులకు బేరం పెట్టిన వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ వైరల్ కావడం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మొత్తం ప్రక్రియపై సీబీఐతో విచారించాలని ఇప్పటికే నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్జీ డిమాండ్ చేస్తుండగా తాజాగా కర్నూలులో మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారిని సైతం మెగా డీఎస్సీ ద్వారా టీచర్లుగా పోస్టింగ్లు ఇవ్వడం చంద్రబాబు సర్కారు బరి తెగింపు చర్యలకు పరాకాష్టగా విద్యావేత్తలు, పరిశీలకులు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎంతో కీలకం. టెట్ మార్కులను బట్టి తలరాతలు మారిపోతుంటాయి. ఇక ఇప్పటికే దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లకు సైతం టెట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కొత్తగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్ పోస్టు కేటాయించటాన్ని బట్టి ఈ ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో ఊహించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ‘అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరేనా..? పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరి చేతికేనా? ఇది స్కామ్కు నాంది కాదా? అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్ ర్యాంకర్గా నిలవడం నిజం కాదా? మరి టాప్ ర్యాంకర్కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? 1 : 1లో వెరిఫికేషన్కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’ 336 కేసులు వేశారంటూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా సూత్రధారులెవరో బయట పెట్టరా? స్కామ్కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందే. నైతిక బాధ్యతగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే..’ అని స్పష్టం చేస్తున్నారు. టెట్ క్వాలిఫై కాకున్నా ఎస్జీటీ పోస్టింగ్.. మెగా డీఎస్సీలో కనీసం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫై కాకుండానే చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బహిర్గతమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీ స్కూల్లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్ను ఎస్జీటీ టీచర్గా నియమించినట్లు తాజాగా తేలింది. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో బుధవారం విచారించిన జిల్లా విద్యాధికారి వాస్తవమేనని నిర్ధారించడం సంచలనం రేపుతోంది. ఒక్క ప్రభాకరే కాకుండా జిల్లావ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాలో సుమారు 25 మంది ఇలా టీచర్ ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయం. మరోవైపు స్పోర్ట్స్లో ఎలాంటి నైపుణ్యం లేకున్నా చాలామంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ వ్యవహారం బయటకు పొక్కడంతో వారంతా బెంబేలెత్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు టీచర్లు సెలవులో వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీల కలకలం.. కర్నూలుకు చెందిన ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, దూరవిద్యా కేంద్రంలో పని చేస్తున్న మరోవ్యక్తి, నెల్లూరుకు చెందిన క్రీడా అసోసియేషన్ నాయకుడితో కలసి మెగా డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. వీరితోపాటు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే తరహాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప అనంతపురం జిల్లాల్లోనూ నకిలీ స్టోర్ట్స్ సర్టిఫికెట్లతో చాలామంది మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్ యువగళం టీమ్కు టీచర్ జాబ్స్..! నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో చురుగ్గా పనిచేసిన వారిలో చాలామందికి మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. యువగళంలో ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీమ్ సభ్యులకు ఈ తరహాలో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ టీమ్లో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు టీడీపీలోని ఓ వర్గం చర్చించుకుంటోంది. సవాల్ స్వీకరించకుండా చినబాబు దబాయింపు..!ఇప్పటికే మెగా డీఎస్సీలో అక్రమాలను మీడియా సాక్షిగా ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరితే మంత్రి లోకేశ్ తోక ముడిచారు. దీన్ని కప్పిపుచ్చేందుకు గత ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా పూర్తయిన గ్రూప్ 1 నియామకాలపై దు్రష్పచారానికి తెర తీశారు. నిజంగానే మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టడం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవన్నీ అమ్మకానికి పెట్టిన ఉద్యోగాలేనని, ఈ వ్యవహారం విద్యాశాఖా మంత్రి కనుసన్నల్లోనే జరిగినట్లు కర్నూలు డీఈవో కార్యాలయంలోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలివ్వడానికి టెట్ అక్కర లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇన్ సర్వీసు టీచర్లకు మాత్రం టెట్ తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు. -
ఏపీ కేబినెట్లో ప్రోటోకాల్పై హైడ్రామా
సాక్షి,అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది. వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, పోస్టర్లలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటోను పక్కనబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి ఫొటో స్థానంలో లోకేష్ ఫొటోను ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిమ్మల రామానాయుడు ఫొటో లేకుండా, లోకేష్ను ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో, నష్టనివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబు అధికారులపై మందలింపుల డ్రామా మొదలుపెట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తూ, తప్పును అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. -
DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..
-
ఓటర్ ఫారాలు పల్లీల పొట్లాలుగా.. అసలేం జరుగుతోంది?'బాధ్యత ఎవరిది?'
-
ఏపీలో ‘CLP’ ట్యాక్స్.. ఆక్వా రంగం కుదేలు: వడ్డీ రఘురాం
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, అప్సడా (APSADA) మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు అద్భుతంగా ఉన్నాయంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వాస్తవాలను తొక్కిపెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆక్వా డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉండి కూడా ఫీడ్ మాఫియాను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, రైతుల ప్రయోజనాలను గాలికొదిలేసి కంపెనీలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా రఘురాం.. ‘రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే ఫీడ్ రేట్లను కేజీకి రూ.14 నుంచి రూ.15 వరకు పెంచేశారు. ఫిబ్రవరి 26న కేజీకి రూ.4, మళ్లీ జూన్ 12న రూ.10 పెంచారు. టన్ను ఫీడ్పై ఏకంగా రూ.15,000 అదనపు భారం పడటంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంట సాగు చేసినా నష్టాలే మిగులుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.ఫీడ్ కంపెనీల వద్ద విలువేది?గతంలో ఫీడ్ రేట్లు పెంచినప్పుడు రైతులు ఆందోళనలు చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వయంగా రూ.4 తగ్గించమని కోరితే.. కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. అంటే సీఎం మాటకు కూడా ఆ కంపెనీల వద్ద విలువ లేకుండా పోయింది. ధరల నియంత్రణ కోసం కమిటీని వేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ కమిటీని ధరలు తగ్గించడానికి వేశారా లేక పెంచడానికా? ఆక్వా అసోసియేషన్ను అడ్డం పెట్టుకుని ఫీడ్ కంపెనీలు ఆడిందే ఆటగా మార్చేశారు.గుజరాత్ కంపెనీ సర్క్యులర్..ఆక్వా రైతుల గోడును పట్టించుకోకుండా ఫీడ్ కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి వనామీ ఫీడ్పై రూ.5.70, టైగర్ ఫీడ్పై రూ.3.85 పెంచుతున్నట్లు గుజరాత్కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో లాలూచీ పడటం వల్లే వారు ఇలా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో కేజీకి రూ.2.85 పెరిగినప్పుడు నానా యాగి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వ హయాంలో రూ.14 పెంచితే ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో జే-ట్యాక్స్ అంటూ అవాకులు చవాకులు పేలినవారు.. ఇప్పుడు ఫీడ్ కంపెనీల నుంచి 'CLP ట్యాక్స్' (C-చంద్రబాబు, L-లోకేష్, P-పవన్ కళ్యాణ్) కింద ఎన్ని వేల కోట్ల ముడుపులు దండుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ముడుపులు అందుతున్నాయి కాబట్టే రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసింది.నాడు ఆక్వాకు స్వర్ణయుగం..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆక్వా రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఫీడ్, సీడ్ నాణ్యత, ధరల నియంత్రణ కోసం చట్టబద్ధంగా 'అప్సడా'ను ఏర్పాటు చేశాం. కోవిడ్ వంటి గడ్డు కాలంలోనూ మార్కెట్ పడిపోకుండా రైతులకు అండగా నిలిచాం. రైతుల కోరిక మేరకు ఫీడ్ ధరల హెచ్చుతగ్గులు ఏడాదికి ఒకసారి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఆక్వా రైతుల కష్టాలను గుర్తించి, ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ఆక్వా రైతులకు అండగా నిలవాలని రైతులు, ఆక్వా రైతుల సంఘాలు వైఎస్ జగన్ను కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు జగన్ గారు భీమవరం వచ్చి ఆక్వా రైతులకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ భీమవరం వస్తున్నారని తెలిసిన సమయంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.240 నుంచి రూ.250కి పెరిగింది. ఇవాళ అదే 100 కౌంట్ రొయ్యల ధర దాదాపు రూ.290–300 వరకు చేరింది. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఆక్వా అథారిటీ పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు.విద్యుత్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకు జీవో 169, 57 కుట్రలు..ఎన్నికల్లో యూనిట్ రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు జీవో నంబర్ 169, జీవో నంబర్ 57ల పేరుతో మోసం చేస్తోంది. 0.90 నుంచి 0.95 వరకు పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలనే అసాధ్యమైన నిబంధన పెట్టి సబ్సిడీని ఎత్తేసే కుట్ర చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 0.78 పవర్ ఫ్యాక్టర్ మించి మెయింటైన్ చేయలేరు. 50 హెచ్పీ కెపాసిటీకి పవర్ ఫ్యాక్టర్ పరికరాలు అమర్చాలంటే హెక్టారుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. రాష్ట్రంలోని 2 లక్షల హెక్టార్ల సాగుపై రూ.1,400 కోట్ల భారాన్ని మోపుతున్నారు. సెప్టెంబర్ 5న వచ్చే విద్యుత్ బిల్లులతో ప్రభుత్వ దగాకోరుతనం పూర్తిగా బయటపడుతుంది.ధరలు తగ్గించకపోతే ఉద్యమం..ఫీడ్ ధరల పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించి... గుజరాత్కు చెందిన స్క్రెట్టింగ్ కంపెనీ వనామీ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.5.70, టైగర్ రొయ్యల ఫీడ్ ధరను కిలోకు రూ.3.85 పెంచింది. ఈ పెంపును వెంటనే రోల్బ్యాక్ చేయ రఘురాం డిమాండ్ చేశారు. మరోవైపు ఆక్వా రైతుల అసోసియేషన్ పేరుతో ప్రభుత్వం కుమ్మక్కై రూ.14–15 వరకు ఫీడ్ ధరలు పెంచే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని... లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచేలా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
బాబూ..! చిరిగిన బ్యాగూ!
ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్వాంటమ్ కంప్యూటింగ్.. నాలుగో పారిశ్రామిక విప్లవం.. అంటూ తండ్రి కబుర్లు! గాలిలో మేడలు కట్టేస్తారు! మరోవైపు తనయుడు ఏసీ రూముల్లో రెడ్బుక్ లెక్కలు చూసుకుంటూ.. ‘ఎక్స్’ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మే పనిలో మునిగి తేలుతుంటారు!! విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి, విద్యార్థులకు ట్యాబ్లు అందించి చదువుల్లో రాణించేలా ప్రోత్సహిస్తే.. చంద్రబాబు సర్కారు అందించింది ‘కుట్టు టెక్నాలజీ’ ‘పిన్నీసు విప్లవం..’ అని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటుతున్నా విద్యార్థులకు అందించాల్సిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీకి పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. బ్యాగులకు జిప్పులు వేద్దామని ప్రయత్నిస్తే జారి చేతికొచ్చేస్తున్నాయి. పుస్తకాలు అమర్చి బ్యాగు పట్టుకుంటే అంచులు వదిలేస్తున్నాయి. భుజానికి తగిలించుకుంటే కాడలు తెగిపోతున్నాయి. దీంతో ఏ విద్యార్థి చేతిలో బ్యాగు చూసినా కుట్ల అల్లికలు.. పిన్నీసుతోనే దర్శనమిస్తున్నాయి. ఇక బూట్ల క్వాలిటీ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. పిల్లల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇచ్చిన బూట్లలో ఒక్కో దాంట్లో రెండు కాళ్లు పెట్టవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతుల్లో మెరిసిన విద్యా కానుక కిట్లను గుర్తు చేసుకుంటూ చదువుల పట్ల చంద్రబాబు సర్కారు అలసత్వంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత్యంతరం లేక గత ప్రభుత్వంలో ఇచ్చిన ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి మళ్లీ భుజాన వేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్న శాఖలో రూ.వందల కోట్లతో అమలు చేస్తున్న పథకం డొల్లతనం చిరిగిన బ్యాగుల సాక్షిగా బట్టబయలైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూటమి సర్కారు పంపిణీ చేసిన నాసిరకం ‘పచ్చ’ కిట్ల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్! – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/నెట్వర్క్పుస్తకాల బరువుకు తొలి రోజే ఫట్..కర్నూలు జిల్లా ఏపీ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ధనరాజ్ పాఠశాల తెరిచిన తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాగులు ఇస్తారా? అని ఆశగా ఎదురు చూశాడు. ఆలస్యంగా చేతికి రాగానే పుస్తకాలన్నీ సర్ది సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. పుస్తకాల బరువుకు బ్యాగు బెల్టులు చేతికొచ్చేశాయి. అడుగు భాగం ఊడిపోయింది. దీంతో మళ్లీ జగనన్న ఇచ్చిన పాత బ్యాగు దుమ్ము దులిపి పుస్తకాలు సర్దుకొని స్కూల్కు వెళుతున్నాడు.సగం బ్యాగులో.. సగం చేతిలోప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చూసినా ఒకటే దృశ్యం. పిల్లల భుజాన బ్యాగు కనిపిస్తున్నా సగం పుస్తకాలు చేతుల్లోనే ఉంటున్నాయి. నాసిరకం బ్యాగు కాడలు తెగిపోయి పుస్తకాలు రోడ్డున పడతాయనే భయంతో మోసుకుని వెళ్తున్నారు. బ్యాగులకు జిప్పులు ఊడిపోవడంతో పిన్నీసులు పెడుతున్నారు. అధ్వానంగా ఉండటంతో జిల్లాలో 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. కొందరు పిల్లలు మూడేళ్ల క్రితం నాటి జగనన్న బ్యాగులనే వినియోగిస్తున్నారు.బుజ్జి బాబుకు బూట్లు షాక్..!అనంతపురం రూరల్ రాజీవ్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారి శశికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్విద్యార్థి మిత్ర’ కిట్ అందింది. ఎంతో సంబరంగా కొత్త షూస్ తొడుక్కోవడానికి ప్రయత్నిస్తే ఒకే దాంట్లో రెండు కాళ్లు దూరిపోయేంత పెద్దవిగా ఉండటంతో బిక్కమొహం పెట్టాడు. వాటిని ధరించి నడవడానికి యత్నిస్తే కాళ్ల నుంచి ఊడిపోతుండటంతో ఇంట్లో పక్కన పెట్టి పాత చెప్పులతో బడి బాట పట్టాడు.బ్యాగులకు పిన్నీస్ టెక్నాలజీ..! టెక్కలికి చెందిన ఒక విద్యార్థి ఉదయాన్నే బడికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. కొత్త బ్యాగులో పుస్తకాలు సర్ది భుజాన వేసుకోబోయాడు. అంతే.. జిప్ ఊడిపోయింది. కాడలు తెగిపోయాయి. అంచులు చిరిగిపోయాయి. బ్యాగ్ లోపలి నుంచి కిందకి పడిపోతున్న పుస్తకాలను గమనించిన విద్యార్థి తల్లి ఉపాయంగా పిన్నీస్ టెక్నాలజీ అమలు చేసింది! బ్యాగు అంచులకు, జిప్పు భాగానికి పిన్నీసులు అమర్చి ఎలాగోలా పిల్లాడిని స్కూలుకు పంపించింది!!చేతిలో బూట్లు.. జేబులో పిన్నీసులు..!ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు పంపిణీ చేసిన కిట్లలో నాణ్యత లోపించడమే కాకుండా బూట్ల సైజులు తలనొప్పిగా మారాయి. విద్యార్థుల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన సైజుల్లో షూలు పంపిణీ చేయడంతో పిల్లలు వాటిని ధరించలేక చేతుల్లో పట్టుకుని ఇళ్లకు వెళ్తున్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, నరసన్నపేట మండలాల్లో బ్యాగులు పంపిణీ చేసిన మూడు వారాలకే కుట్లు విడిపోయాయి. దీంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని బడికి వెళ్తున్నారు. గుండవల్లిపేట ప్రాథమిక పాఠశాలలో 40 మందికి పంపిణీ చేసిన బూట్ల సైజులు సరిపోక కొత్త షూలు కొనుక్కోవాల్సి వచ్చింది.⇒ విశాఖపట్నం జిల్లాలోని 594 పాఠశాలల పరిధిలో 70 వేల మంది విద్యార్థులకు ఇచ్చిన మెజారిటీ బ్యాగులకు బెల్టులు, జిప్పులు ఊడిపోయాయి. బయట మార్కెట్లో రూ.800 నుంచి రూ.1,000 పెట్టి కొనుక్కోలేక ‘జగనన్న’ బ్యాగులనే తెచ్చుకుంటున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో కొత్తగా చేరిన 8 వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ అసలు కిట్లే అందలేదు. ఇచ్చిన బ్యాగులు కూడా వారం రోజుల్లోనే పిగిలిపోవడంతో పాతవాటికే కుట్లు వేయించుకుని పాఠశాలలకు వస్తున్నారు. నాసిరకం మెటీరియల్..గోదావరి జిల్లాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా వేలాది మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ కాలేదు. ⇒ ఏలూరులో గతేడాది 1,19,118 మంది విద్యార్థులు ఉండగా ఈసారి ఐదు వేల బ్యాగులు తగ్గించి 1,14,575 బ్యాగులకే ఇండెంట్ పెట్టారు. తీరా ఇచ్చిన అరకొర బ్యాగులు కూడా రెండు నెలలకే జిప్పులు ఊడిపోయి నిరుపయోగంగా మారాయి.⇒ తూర్పు గోదావరి జిల్లాలో 1,148 పాఠశాలల్లో చదువుతున్న 93,849 మంది విద్యార్థులకు కిట్లు పూర్తిస్థాయిలో అందలేదు. ఇచ్చిన బ్యాగులూ చిరిగిపోవడంతో విద్యార్థులు సివిల్ డ్రెస్లు, సొంత బ్యాగులతో బడికి రాక తప్పడం లేదు.⇒ కాకినాడ జిల్లాలో 1,28,988 మంది విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల్లో నాణ్యత లేకపోవడంతో రెండు నెలలకే పాడైపోయాయి. దీంతో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 85,207 మంది విద్యార్థులకు కిట్లు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు ముగుస్తున్నా ఇంకా 900 మందికి అందలేదు. ఇచ్చిన హ్యాండిల్స్ ఊడిపోతుండటంతో నెల రోజులకే బ్యాగులు మూలనపడ్డాయి. బుక్స్ బరువుకు బ్యాగులు ‘ఫట్’..కోస్తాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటినా కిట్లు అరకొరగానే అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 3 జతల యూనిఫాంను కూటమి సర్కారు 2 జతలకు కుదించి కుట్టు కూలి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టింది.⇒ నెల్లూరు జిల్లాలోని 3,221 ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థుల్లో 6,677 మందికి ఇప్పటికీ బ్యాగులు అందలేదు. మరో 40 వేల మందిని బెల్టులు, బూట్లు, సాక్స్ కొరత వేధిస్తోంది. టెన్త్ విద్యార్థులు రోజూ మోసే 32 పుస్తకాల బరువుకు నాసిరకం బ్యాగులు ‘ఫట్’ మంటున్నాయి.⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా 1.71 లక్షల మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా తీవ్ర నాణ్యతా లోపంతో ఏకంగా 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. బ్యాగుల జిప్పులు ఊడిపోవడం, కాడలు తెగిపోవడంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని, సగం పుస్తకాలు చేతుల్లో పట్టుకుని దయనీయంగా బడిబాట పడుతున్నారు. లెక్కలు దేవుడెరుగుకృష్ణా జిల్లాలో అధికారికంగా పంపిణీ సంఖ్య స్పష్టంగా వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు బ్యాగులు, బూట్లు సరిగ్గా అందలేదని, ఇచ్చిన కొన్నింటిలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.సీఎం సొంత జిల్లాలో సగం మందికే..!సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో పిల్లల దుస్థితి మరింత దయనీయంగా ఉంది. బడి తెరిచి నెలలు కావస్తున్నా డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే బ్యాగుల పంపిణీ పూర్తి కాలేదు. చిత్తూరు నగరంలోని గిరింపేట మున్సిపల్ స్కూల్లో పిల్లలు బ్యాగుల ముఖమే చూడలేదు.⇒ తిరుపతి జిల్లాలో పంపిణీ చేసిన 60 శాతానికి పైగా బ్యాగుల హ్యాండిళ్లు, బెల్టులు అప్పుడే తెగిపోయాయి. పుస్తకాల బరువును ఆ బ్యాగులు మోయలేక చిరిగిపోతుంటే.. సమగ్ర శిక్ష అధికారులు మాత్రం అంతా బాగుందంటూ ఏసీ రూముల్లో కూర్చుని ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారు.కిట్లు ఆలస్యం.. అందినవి ఖేల్ ఖతం!కర్నూలు జిల్లాలో 1,445 పాఠశాలల్లో 2,63,521 మంది విద్యార్థులకు గాను 1.83 లక్షల మందికే బ్యాగులందాయి. జూలై చివరి వరకు పంపిణీ ఆలస్యమవడమే కాకుండా 30–40 శాతం బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోయాయి. కోడుమూరు బాలికల స్కూలులో మూడు నెలలైనా కిట్లు అందలేదు.⇒ అనంతపురంలో 1,91,905 మందికి పంపిణీ చేసినట్లు చెబుతున్నా నెల రోజుల్లోనే బ్యాగులకు చిరుగులు పడ్డాయి. సైజులు సరిపోని బూట్లతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.నాడు ‘జగనన్న కానుక’ నేడు బాబు సర్కారు ‘శిక్ష’!వైఎస్సార్సీపీ హయాంలో ‘జగనన్న విద్యా కానుక’ కింద బడి తెరిచిన తొలిరోజే అత్యుత్తమ నాణ్యతతో 3 జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఏడాదంతా చెక్కుచెదరని బ్యాగ్, సైజులకు తగ్గ షూస్, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చారని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్న నాసిరకం కిట్లు వారికి శిక్షలా మారాయి. దీంతో విద్యార్థులు మళ్లీ ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి భుజాన వేసుకుంటున్నారు. నాసిరకం కిట్లకు రూ.867.56 కోట్లుసాక్షి, అమరావతి: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర 2 పథకం కోసం రూ.867.56 కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు నాణ్యతపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా నాణ్యత తనిఖీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మరో విడ్డూరం. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా వ్యక్తిగత పర్యవేక్షణతో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన స్కూల్ బ్యాగులు, విద్యా కానుక కిట్లను అందించారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. రూ.92 కోట్ల బ్యాగుల్లో నాణ్యత డొల్ల..సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర–2 పథకం కింద 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బ్యాగులు సరఫరా చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 33,07,036 మంది విద్యార్థులకు ఒక్కో బ్యాగ్కు రూ.278 చొప్పున మొత్తం రూ.91,93,56,008 ఖర్చు చేశారు. రూ.91.93 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన బ్యాగులు విద్యార్థులకు కనీసం విద్యా సంవత్సరం పాటు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అవి ఇలా తీసుకోగానే చిరిగిపోతున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నాణ్యత తనిఖీలకు రూ.4.38 కోట్లు..ప్రభుత్వం కేవలం కిట్లు కొనుగోలు చేయడమే కాకుండా థర్డ్పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ (టీపీక్యూఏ) కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.5 శాతం కేటాయించింది. ఈ లెక్కన రూ.4,38,11,650 ఖర్చు చేసినట్లు చూపించారు. ఇంత మొత్తం నాణ్యత తనిఖీలకు కేటాయించిన తర్వాత కూడా బ్యాగుల నాణ్యతపై ఫిర్యాదులు రావడం గమనార్హం. అంటే తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, రూ.4.38 కోట్లు వృథా చేశారని స్పష్టమవుతోంది. అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించినా2026–27 విద్యా సంవత్సరానికి కిట్ల కొనుగోలుకు తొలుత రూ.830.04 కోట్లకు పరిపాలనా అనుమతి పొందగా.. అనంతరం దానిని రూ.867.56 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం సవరించినా అనుమతి ఇచ్చింది. అంటే అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించారు. ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన పథకంలో విద్యార్థులకు అందే బ్యాగుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఏకంగా రూ.867 కోట్ల విలువైన పథకం.. బ్యాగులకు రూ.91.93 కోట్లు.. నాణ్యత తనిఖీలకు మరో రూ.4.38 కోట్లు.. కేటాయించినా సరే బ్యాగులు చిరిగిపోవడం, కిట్ల పంపిణీ అస్తవ్యస్థంగా జరగటాన్ని బట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చారని స్పష్టమవుతోంది. -
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్.. చంద్రబాబు
-
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
-
5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. మీరు వాళ్ళని ఏం చేసారో తెలుసా
-
బాబు బుద్ధులే కొడుక్కి వచ్చాయి... నువ్వు ఓ పిరికిపందవి... ఉతికారేసిన కారుమూరి
-
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..
-
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).ఇవి కూడా చదవండి: రేవంత్ టూర్కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్లలో ఆఫీస్లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అన్ని ఆఫీస్లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? -
చేతకాని లోకేష్.. ఎన్టీఆర్ మనవడా..?
-
నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి...? దమ్ముంటే చర్చకు రండి...
-
సినిమాల్లో సోది డైలాగులు చెప్పి ఒకడు... పాదయాత్ర అంటూ ఇంకొకడు.. సంచలన కామెంట్స్
-
‘విద్యాశాఖ నిర్వహణలో మంత్రి లోకేష్ ఘోర వైఫల్యం’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధ్వానంగా మారాయని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత విద్యాశాఖను గాలికొదిలేసి మిగతా అన్ని శాఖల్లో వేలుపెడుతూ, దేశ విదేశాల్లో ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్లలో కనీసం బాత్రూమ్లకు నీళ్లిచ్చే దిక్కులేక, మౌలిక వసతులు కరువై దాదాపు 100 మంది అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...బాత్రూమ్లకు నీళ్లివ్వలేని దౌర్భాగ్యస్ధితి...రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, ఇక్కడ విద్యాశాఖలో ముక్కుపచ్చలారని పేద పిల్లల ప్రాణాలు పోతున్నాయి. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది విద్యార్థులు మరణించారు. చనిపోయిన వారిలో 8 నుంచి 13 సంవత్సరాల లోపు వయసున్న పేద పిల్లలే ఎక్కువగా ఉన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, అమాయక విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఒక మానవీయ కోణంలో మాట్లాడుతున్నాను.విద్యామంత్రి 4 నిమిషాలు ఈ బాత్రూమ్ల వద్ద ఉండగలరా?సెట్టూరు మండలం జెడ్పీ హైస్కూల్లో బాత్రూమ్లు సరిగ్గా లేక పక్కన ఉన్న గోడ చాటుకు కాలకృత్యాల కోసం వెళ్లిన తేజా హర్షవర్ధన్ అనే ఎస్సీ విద్యార్థిపై గోడ కూలి అక్కడికక్కడే చనిపోయాడు. అక్షయ్ అనే మరో బాలుడికి కాలు విరిగింది. అలాగే రాయలప్పదొడ్డిలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు పామ్ పాండ్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కనీసం బాత్రూమ్లకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ విద్యాశాఖ ఉంది. కనేకల్లు హాస్టల్లో 650 మంది పిల్లలు ఉంటే నీళ్లు లేక దుర్గంధం మధ్య గడుపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి సవాల్ విసురుతున్నా.. కనేకల్లు హాస్టల్ బాత్రూమ్ల వద్ద కనీసం 4 నిమిషాలు నిలబడే ధైర్యం ఉందా?.రూ. లక్షన్నర పెట్టి బోర్ వేసే గతి లేదా?..ఒక హాస్టల్లో 650 మంది పిల్లలుంటే రూ. లక్షన్నర పెట్టి ఒక బోర్ వేయించడానికి ఎమ్మెల్యేకు తీరిక లేదు, కలెక్టర్కు పట్టదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడు చూసే శాఖ కాబట్టి ఎవరూ మాట్లాడకూడదా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్. జగన్ 'గోరుముద్ద' ఒక్క పథకానికే రూ. 7,245 కోట్లు ఖర్చు చేశారు. కానీ నేడు కూటమి పాలనలో హాస్టళ్లలో పురుగులు పడ్డ ఆహారం పెడుతున్నారు. నరసన్నపేట బసివలసలో 8 ఏళ్ల రష్మిక, 12 ఏళ్ల కల్పన అనారోగ్యంతో చనిపోయారు. కేజీబీవీలు, గురుకులాల్లో సరైన వసతులు లేక పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది..ఇసుక, మద్యంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులపై లేదా?కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 372 అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రోజూ రూ. 20 నుంచి 25 లక్షల అక్రమ సంపాదన వస్తోంది. ఇసుక, కంకర, మద్యం, విండ్ పవర్ కాంట్రాక్టులు, దోపిడీలపై ఉన్న శ్రద్ధ.. హాస్టళ్లకు వెళ్లి పిల్లలకు కనీస వసతులు కల్పించడంలో ఎందుకు లేదు? ప్రజావేదికల వద్ద ఎమ్మెల్యే బంధువుల చుట్టూ తిరిగే కొద్దిమంది ఉపాధ్యాయులు బడులు, హాస్టళ్ల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జన్మదిన వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యత పాఠశాలల నిర్వహణపై ఎందుకు పెట్టడం లేదు?.రూ. కోటి పరిహారం ఇవ్వాలివిద్యార్ధి చనిపోయిన తర్వాత రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మాజీ ఎంపీ తలారి రంగ్య మండిపడ్డారు. బెల్ట్ షాపుల ద్వారా రోజూ లక్షలు దండుకుంటున్న ఎమ్మెల్యే తన సొంతంగా రూ. 50 లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ. 50 లక్షలు.. మొత్తం కోటి రూపాయల పరిహారం మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఇవ్వడంతో పాటు... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పాలన చేతకాకపోతే తప్పుకోవాలని తేల్చి చెప్పారు. -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్లో జగన్ తన ప్రజెంటేషన్లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ సంచలన వీడియోను విడుదల చేసిన ఆయన.. మేఘనను కన్నకూతురిలా చూసుకున్నామని, పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామని జోగి రమేష్ పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం, చదివించడం, వారికి వివాహం చేయడం తమ బాధ్యత అని చెప్పారు. అదే బాధ్యతలో భాగంగా తన కుమారుడు రాజీవ్కు మేఘనతో ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారని అన్నారు. విడిపోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. అయితే వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు.మతమార్పిడి ఆరోపణలపై స్పందనమేఘన ఇచ్చిన ఫిర్యాదులో మతమార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంపై జోగి రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్య బైబిల్ చదివితే తప్పా? ఏసుక్రీస్తు బోధనలు వినడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. తిరుపతి వెళ్తామని, దుర్గగుడికి వెళ్తామని, యాగాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. కేవలం మత విశ్వాసాల ఆధారంగా తన కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.ఎల్లో మీడియాపై ఆగ్రహంటీడీపీ అనుకూల ఎల్లో మీడియా సంస్థలు తన కుటుంబ సమస్యను పదేపదే ప్రసారం చేసి వ్యాపారం చేసుకున్నాయని జోగి రమేష్ అన్నారు. ఒక కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బహిరంగంగా చర్చించడం సమంజసం కాదన్నారు. “మీకు పిల్లలు లేరా? మీకు కుటుంబాలు లేవా?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ వ్యవహారాలను రోడ్డుపైకి తీసుకురావద్దని కోరారు.మహా టీవీ వంశీని ఉద్దేశించి కూడా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ వివాదంపై నెల రోజులుగా వార్తలు ప్రసారం చేస్తూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు రాజీవ్ సామర్థ్యం గురించి ప్రశ్నించే ముందు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిని ప్రశ్నించాలని అన్నారు. కుటుంబ విషయాలను రాజకీయ, మీడియా అంశంగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, లోకేష్.. ఏ ఇంట్లో లేవు?తనపై రాజకీయ కక్షతోనే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని జోగి రమేష్ చెబుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీసీ నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కారుమూరి, సునీల్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నికల తర్వాత తన కుమారుడిని అరెస్ట్ చేయించారని, నకిలీ మద్యం కేసులో తనను.. తన సోదరుడిని 83 రోజుల పాటు జైలులో పెట్టారని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. “రాజకీయంగా నాపైకి రండి.. వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు” అని చంద్రబాబు, నారా లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఆధారాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలుతన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని జోగి రమేష్ తెలిపారు. కుటుంబ వివాదాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికారు. తన కుమారుడు, మేఘన మధ్య సమస్యలు ఉన్నప్పటికీ.. మేఘనను తాను కన్నకూతురిలానే చూసుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. “ఏ కుటుంబంలో సమస్యలు లేవో చంద్రబాబు చెప్పాలి” అని ప్రశ్నించిన ఆయన.. ప్రముఖుల కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.వసంత కృష్ణప్రసాద్ వల్లే ఇదంతా..మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయానికి తన కోడలు మేఘన వెళ్లిన సంచలన వీడియోను విడుదల చేసిన జోగి రమేష్.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. తాను ఏ రోజూ వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పారు. వ్యక్తిగత అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు.“ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగుతుంది” అని జోగి రమేష్ పేర్కొన్నారు. తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'! -
లోకేష్ చేతిలోకి పార్టీ వెళ్తే.. సొంత పార్టీ నేతల షాకింగ్ కామెంట్స్
-
ప్రభుత్వ బడులు ఖాళీ.. లోకేష్ తప్పుడు లెక్కలపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
అడ్డంగా బుక్కైన లోకేష్ సార్.. ఎత్తుకెళ్లి LKGలో వేయండి
-
ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. ‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్’( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – యూడీఐఎస్ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.𝗧𝗵𝗲 𝗣𝗹𝗶𝗴𝗵𝘁 𝗼𝗳 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗦𝗰𝗵𝗼𝗼𝗹𝘀 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵: 𝗔 𝗖𝗿𝗶𝘀𝗶𝘀 𝗼𝗳 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗮𝗻𝗱 𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻𝗧𝗵𝗲 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 𝗕𝗲𝗵𝗶𝗻𝗱 𝘁𝗵𝗲 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗖𝗹𝗮𝗶𝗺𝘀 𝗼𝗳 𝘁𝗵𝗲… pic.twitter.com/iJEkKuRO6w— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2026‘ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.‘2019–24 మధ్య గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.‘ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం’.ఇది కూడా చదవండి: అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను.. ‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’ అని వెల్లడించారు. -
బాబూ.. లోకేష్ను కాపాడే ప్రయత్నమా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ, గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు తన కుమారుని కాపాడుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సమస్యలు మీద కాకుండా రాజకీయాలు మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన స్కాం నుంచి బయట పడటం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్-1 అవకతకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపలేదు. తన కుమారుని కాపాడుకోవటం మీద చంద్రబాబు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రజాధనంతో సభలు పెడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు. లోకేస్ తోడల్లుడు భరత్, ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు. మీ వారిని కాపాడుకోవడానికి తాపత్రయమా చంద్రబాబు?. పనిక కాక ముందు ఒక జీవో.. పని అయ్యాక ఒక జీవోనా? సీబీఐ విచారణ జరిపించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?.ఇది కూడా చదవండి: తగ్గితే నెగ్గుకురాలేం.. జనసేనలో కొత్త ఆందోళనఒకొక్క టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలు వరకు అమ్ముకున్నారు. వైఎస్ జగన్ లక్ష 30 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేశారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ వినిపించలేదు. అది వైఎస్ జగన్ క్రెడిబిలిటి. మీ పార్టీ నాయకులు సంతకాలు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అని ప్రజలు నమ్ముతున్నారు. డేటా సెంటర్లకు మేము వ్యతిరేకం కాదు. డేటా సెంటర్లకు 10 టీఎంసీ నీళ్లు అవసరం. ఆ నీటిని డేటా సెంటర్లకు ఎలా ఇస్తారు?. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు. చంద్రబాబు పాదంతో మరోసారి కరువు సంభవించింది. ఆంధ్రప్రదేశ్ను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం కోసమే బహిరంగ సభ పెట్టారు అంటూ మండిపడ్డారు. -
ఆటవిక పరిపాలన @ ఏపీ
భారత రాజ్యాంగానికి అతీతులమనే భావన ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో బలంగా పాతుకొనిపోయింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చట్టుబండలైన చలనదృశ్యాలు గజ్జెకట్టి మరీ గంతు లేస్తున్నాయి. రక్షకులే భక్షకులుగా మారిన ఆటవిక రాజ్య వికటాట్టహాసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రాథమిక హక్కుల సంగతి దేవుడెరుగు, ప్రజల ప్రైవేట్ ఆస్తులను సైతం గద్దెలమీదున్న గద్దలు ఇష్టారీతిన ఎగరేసుకు పోవడం రివాజుగా మారింది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్స్గా మారి ప్రైవేట్ ట్యాక్స్లను పిండుకుంటున్నారు. ప్రకృతి వనరులను సొంత ఖజానాల్లోకి తవ్వి పోసుకుంటున్నారు. రొచ్చు గుంటల్ని సైతం వదలకుండా చేపలవేటకు బయల్దేరు తున్న నాయకమన్యుల కక్కుర్తి కంపు ప్రజల నాసికాఘ్రాణ సహనాన్ని సవాల్ చేస్తున్నది.యువతరం ఆశల మీద, ఆకాంక్షల మీద పాలకులే పూను కొని గంజాయి మత్తును వెదజల్లుతున్నారనేందుకు సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి. నవయువత స్వప్నతరంగాలను దారి మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని బలంగా నమ్మవలసి వస్తున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ‘ఉడ్తా పంజాబ్’ రోజులను గుర్తుకు తెస్తున్నది. పోలీసు వాహనాల్లోనే రాచమర్యాదలతో గంజాయి రవాణా గమ్యంవైపు సాగి పోతున్నది. అనధికార రాష్ట్ర మొక్క హోదాను గంజాయి మొక్క అనుభవిస్తున్నదనుకోవాలేమో! పగల్లేదు, రాత్రి లేదు... ఎనీ టైమ్, ఎనీ సెంటర్, ఎనీ లొకాలిటీ... విచ్చలవిడిగా మద్యం అందు బాటులో ఉంటున్నది.లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపులే కాదు, వాటికి మొలతాడు షాపులు కూడా మొలకెత్తి డోర్ డెలివరీ స్టేజికి చేరుకున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రవహిస్తున్న మద్యం క్యూసెక్కుల లెక్కకూ, రాష్ట్ర స్థాయి విక్రయాల లెక్కకూ హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. అనధికార కల్తీ సరుకు అంగళ్లను ముంచెత్తుతున్నదనేందుకు ఇదే పెద్ద రుజువు. అనధికార అమ్మకాలకు సంబంధించిన ధరవరలను, వేలం పాటలను ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించి వాటాలను నిర్ణయిస్తున్నారనే వార్తలు బహిరంగ రహస్యాలుగా చలామణి అవుతున్నాయి. అడ్డుకట్టల్లేని వారుణి వాహిని ఊరూవాడల్ని ముంచెత్తుతుంటే జనజీవనం మీద దాని పర్యవసనాలెలా ఉంటాయో విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అద్దంకి ఘటన చెబుతున్నదేమిటి? ఆ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు చేసే వ్యాపారులు పరిమితిని మించి అక్రమ రవాణాను యథేచ్ఛగా చేసుకోవడానికి అడ్డంకులు లేకుండా ఎవరి వాటాలు వారికి పంచే ఒప్పందం కోసం ఒక పొట్టేళ్ల పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి ఒక మంత్రి పీఏ సమన్వయకర్తగా వ్యవహరించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గ్రానైట్ వ్యాపారులతో పాటు కొందరు అధికార రాజకీయ నేతలు, అరడజన్ మందికి పైగా ఎస్ఐలు, ఒకరో ఇద్దరో సీఐలు, ఎంపిక చేసుకున్న కొందరు పెంపుడు మీడియా ప్రతినిధులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఒక ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా పార్టీ జరిగింది.లిక్కర్ గ్లాసుల గలగలలూ, పొట్టేళ్ల మాంసం ఘుమ ఘుమల మధ్య చర్చలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాత అతిథులను తగురీతిన సత్కరించి గ్రానైట్ వ్యాపారులు వీడ్కోలు పలికారట. అలా బయల్దేరిన ఒక కారుకు సమీపంలోని శంఖవరప్పాడు అనే గ్రామం వద్ద ఆక్సిడెంట్ జరిగింది. చుట్టుముట్టిన గ్రామస్తులు అందులో ప్రయాణిస్తున్న మఫ్టీలో ఉన్న ఇద్దరు ఎస్ఐలను గుర్తించలేదు. డ్రైవర్తోపాటు ఈ ఇద్దరూ ప్రయాణంలో కూడా తాగుతున్నట్టుగా గమనించి ఆ కారును అక్కడే నిలిపేశారు. 108 వాహనాన్ని పిలిచి ప్రమాదా నికి గురైన ఆటోలోని ప్రయాణికుల్ని అందులో పంపించారు. కారు డిక్కీలో కూడా మద్యం బాటిళ్లు ఉండొచ్చనే అనుమానంతో తెరవాలని డిమాండ్ చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న స్థానిక సీఐ హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. డిక్కీ ఓపెన్ చేయడానికి వీల్లేదని స్థానిక ప్రజలపై బెదిరింపునకు దిగారు. అదే సమయంలో ఒక పాలక పార్టీ నాయకుడిదిగా అనుమానిస్తున్న కారు అక్కడికి చేరుకొని మఫ్టీ ఎస్ఐలను ఎక్కించుకొని వెళ్లిపోయింది. సీఐ బెదిరంపులను లెక్క చేయకుండా స్థానిక ప్రజలు కారు డిక్కీని ఓపెన్ చేసి నిర్ఘాంతపోయారు. పెద్ద మొత్తంలో గంజాయి, ఒక బ్లూ కలర్ బ్యాగ్లో భారీ మొత్తంలో నగదు, ఒకటో రెండో ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అందులో కనిపించాయి. జరిగిన ఘటనపై స్థానిక డీఎస్పీ, ఎస్పీలు చెరో రకమైన కథను వినిపించారు. దూడ గడ్డి కోసమే తాటిచెట్టు ఎక్కారనేది వారు చెప్పిన కథల సారాంశం. పోలీసు వాహనాల్లోనే యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నదనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు నిజమేనని అద్దంకి ఘటన రుజువు చేసింది. అక్రమ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగ గణం ఏకమై వనరుల్ని లూటీ చేసి వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణకు కూడా ఈ ఘటన సాక్ష్యంగా నిలబడింది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వ పెద్దలుగానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ, దీనిపై మౌనం వీడకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యవహారాలే ఇప్పుడు ‘ఆర్డర్ ఆఫ్ ద డే’గా అర్థం చేసుకోవలసి వస్తున్నది.డీఎస్సీ – 2025 పరీక్షలను రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రహస నంగా మార్చిందో వెల్లడిస్తూ జరిగిన అవకతవకలను చాలా కాలం క్రితమే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పరీక్షలను రద్దు చేయాలనీ, అక్రమాలకు బాధ్యుడైన విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనీ కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత చూపెడుతున్న ఆధారాలపై స్పందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగింది. జగన్ హయాంలో జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు, యెల్లో మీడియా డైవర్షన్ గేమ్ను ఆశ్రయించారు. మొన్న గురువారం నాడు జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. గ్రూప్–1 పరీక్షలతో పాటు, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు నేను సిద్ధమే, మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.ఈ సవాల్పై రెండు రోజులు గడిచినా పాలకపక్షం నోటమాట పెకల్లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాల గురించి వారికి స్పష్టంగా తెలుసు కనుకనే సీబీఐ విచారణ పేరు వినగానే బాబు, లోకేశ్ల నోళ్లు మూతపడ్డాయి. రద్దయిన నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ అంశం ఒక్కటి మాత్రమే ఉన్నది. డీఎస్సీలో లీకేజీతోపాటు స్పోర్ట్ కోటా పేరుతో మూడొందల పైచిలుకు పోస్టులకు బేరాలు పెట్టడం, డీఎస్సీ పరీక్ష రాయని వారితో ఆ పోస్టులను నింపేయడం, అందుకోసం పాత జీవోల స్థానంలో కొత్త జీవోలను విడుదల చేయడం, పని పూర్తికాగానే పాత నిబంధనలతో మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడం అనే కుట్రపూరిత వ్యవహారం ఇమిడి ఉన్నది. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆడిన నాటకం, చేసిన నయవంచన అనేందుకు జీవోల ప్రహసనమే తిరుగులేని సాక్ష్యం.నిబంధనలకూ, సంప్రదాయాలకు విరుద్ధంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణను, ప్రశ్నాపత్రాల తయారీని ఒకే సంస్థ చేతిలో పెట్టారు. ఆ సంస్థకు సంబంధించిన ఔట్సోర్సింగ్ విద్యార్థికి మొదటి మెరిట్లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకసారి ప్రశ్నా పత్రం లీకయితే ఒక్కడితోనే ఆగిపోతుందా? ఒక్కడితోనే ఆగిపోతే మాత్రం అది చెల్లుబాటవుతుందా? లీకేజీ జరిగిందని గమనించినందువల్లనే తదుపరి మెరిట్ లిస్ట్ నుంచి సదరు వ్యక్తి పేరును తొలగించి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండా అతని లాగిన్ ఐడీని తీసేశారన్నది నిజం కాదా? అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ఎంపికయిన టీచర్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారి చేత ప్రదర్శనలు చేయించే చౌకబారు ఎత్తుగడలకు సర్కార్ దిగజారింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువమంది మెరిటోరియస్ అభ్యర్థులే ఉండవచ్చు. సందేహం లేదు. లీక్ కారణంగా రద్దయిన నీట్ పరీక్షలో కూడా చాలామంది మెరిట్ అభ్యర్థులు సెలెక్టయ్యారు. రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా వారు ఎంపికయ్యారు. కాకపోతే వారికి అనవసర ఆందో ళన, అధిక శ్రమ. అందుకు కారణం మరెవరో కాదు. పరీక్ష నిర్వాహణా వ్యవస్థ నిర్వాకం. ప్రభుత్వ అసమర్థత. డీఎస్సీకి కూడా ఇదే వర్తిస్తుంది.అద్దంకి గంజాయి, డీఎస్సీ అవినీతి బయటకు స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ నిర్వాకాలు మాత్రమే. అన్ని రంగాల్లోనూ రెండేళ్లల్లోనే ఈ సర్కార్ సర్వభ్రష్టత్వాన్ని సాధించింది. జగన్ సర్కార్ మెరిట్ విద్యార్థులకూ, పేద రోగులకూ అందు బాటులోకి తెచ్చిన పదిహేను మెడికల్ కాలేజీలను పీపీపీ జపంలో ఈ సర్కార్ మూలన పడవేసింది. పిల్లలందరికీ న్యాయమైన ఉచిత విద్యను అందించాలని జగన్ సర్కార్ ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలకు బాబు సర్కార్ పాతరేసింది. ఫలితంగా ఇప్పటికే ఐదులక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేసినట్టు అసెంబ్లీలోనే ప్రభుత్వం అంగీ కరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పీపీపీ ముసుగులో చేస్తున్న ప్రైవేటీకరణ ఎంత దూరం వెళ్లిందంటే ఇకమీదట ఆస్పత్రి సేవలు, తాగునీటి సరఫరా, ఆర్టీసీ సేవలు, చివరకు చెత్త ఎత్తడం కూడా పీపీపీలోకి మారబోతున్నాయి. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే లక్ష్యంతోనే పీపీపీ మంత్రాన్ని బాబు సర్కార్ జపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం, యువతరాన్ని మత్తులో జోగేలా చేయడం, రాజీకీయ ప్రత్యర్థులను వేటాడటం, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మడం ప్రధాన ఎజెండాలుగా పాలక కూటమి అమలుచేస్తున్నది. సొంత ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి పౌరహక్కులకు పాతరేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక్కొక్కడూ వందల కోట్లు వెనకేసుకున్నారని అదే పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలను చూసి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అవినీతి కూపంలో మునకలేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మాత్రం నానాటికీ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్నారు. ఇటువంటి ఆటవిక పాలనను ఇంకెంతకాలం భరించాలి? చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జియోకి జీవోకి తేడా తెలియని నువ్వు... జగనన్నలా ఛాలెంజ్ చేసే దమ్ముందా?
-
‘సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్కు బీపీ ఎందుకు?’
సాక్షి, తాడేపల్లి: సీబీఐ పేరు వింటే చంద్రబాబు, లోకేష్లకు బీపీ పెరుగుతోందని.. డీఎస్సీలో అక్రమాలపై విచారణ అంటే తట్టుకోలేక పోతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు.‘‘కొత్తకొత్త జీవోలతో గేట్లు ఎత్తి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మెరిట్ లిస్టుల పేరుతో మరో మోసం చేశారు. డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చుకోవటానికే గ్రూప్-1ను తెర మీదకు తెచ్చారు. సిట్తో విచారణ జరిపినా గ్రూప్-1లో తప్పులు కనపడలేదు. అందుకే రెండో సిట్ వేసి తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దమ్ముంటే సీబీఐతో విచారణ జరపాలి. డీఎస్సీ, గ్రూప్-1 రెండిటి పైనా సీబిఐ విచారణ చేయించాలి’’ అని అరుణ్కుమార్ డిమాండ్ చేశారు.శాసనమండలిలో దీనిపై చర్చిద్దామంటే చంద్రబాబు, లోకేష్ పారిపోయారు. సీబీఐతో విచారణ అంటే ఎందుకంత భయం?. తప్పు చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకోండి. డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. స్పోర్ట్స్ లో పాల్గొనడమే అర్హతగా ఉద్యోగాలు ఇస్తారా?. ఇలాంటి వారు పిల్లలకు ఏం పాఠాలు చెప్తారు?ఇదీ చదవండి: ‘సర్’లో ఈ నాలుగైదు రోజులే కీలకం..ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఏపీని గంజాయి విక్రయ రాష్ట్రంగా మార్చారు. లింగమనేని రమేష్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్తో ఒకరిని చంపేస్తే కేసులు ఉండవా?. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా చర్యల్లేవు. ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికినా కేసుల్లేవు. కూటమి నేతలు, వారి పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయా?’’ అంటూ అరుణ్కుమార్ ప్రశ్నించారు. -
పీవీ సింధూ పోస్టుకి, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాకూ తేడా తెలీదు
-
ఒక్కో పోస్టు 15 లక్షలు.. అడ్డంగా దొరికాక తండ్రి.. కొడుకు గజగజ
-
బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!
-
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
-
చర్చ జరిగితే కచ్చితంగా చుక్కలే.. అందుకే జగనన్నని రానివ్వకుండా..


