Tendulkar-Anderson Trophy
-
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ల అత్యుత్తమ Ind-Eng జట్టు.. కోహ్లికి నో ప్లేస్!
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) టెస్టు సిరీస్ గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఇరుజట్లకు ఇదే తొలి సిరీస్. దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది.ఇక విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే తొలి సిరీస్ కూడా ఇదే. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో దిగ్గజాలు లేని భారత జట్టు స్టోక్స్ బృందాన్ని వారి సొంతగడ్డపై ఢీకొట్టనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.విరాట్ కోహ్లికి నో ప్లేస్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్.. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేశారు. అయితే, వీరిద్దరు సంయుక్తంగా ఎంచుకున్న ఈ జట్టులో టీమిండియా దిగ్గజ బ్యాటర్, లెజెండరీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం చోటు ఇవ్వలేదు.ఈ విషయం గురించి నాసిర్ హుసేన్ మాట్లాడుతూ.. టీమిండియా- ఇంగ్లండ్ నుంచి మేము ఎంపిక చేసుకున్న అత్యుత్తమ జట్టులో కోహ్లి లేడు. జో రూట్ కూడా లేడు. వారిద్దరు లేకపోవడాన్ని అందరూ జీర్ణించుకోలేకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్ నుంచి విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్తో పాటు ‘వాల్’ రాహుల్ ద్రవిడ్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్తో పాటు ప్రస్తుత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ చోటు ఇచ్చారు.21వ శతాబ్దానికి గానూ ఆర్థర్టన్, నాసిర్ హుసేన్ ఎంచుకున్న భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..వీరేందర్ సెహ్వాగ్, అలిస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్-2025కి భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవేభారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్. -
భారత్తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
టీమిండియా(Ind vs Eng 1st Test)తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జాక్ క్రాలేతో పాటు బెన్ డకెట్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో ఓలీ పోప్ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో భారీ శతకం (171)తో విరుచుకుపడిన పోప్నకు సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వగా.. జేకబ్ బెతెల్ (Jacob Bethell)కు నిరాశే మిగిలింది.ఇక బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఈ జట్టులో క్రిస్ వోక్స్కు స్థానం దక్కింది. డిసెంబరు తర్వాత అతడు ఇంగ్లండ్ తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇక దుర్హం సీమర్ బ్రైడన్ కార్సే కూడా భారత్తో తొలి టెస్టులో భాగం కానున్నాడు. సొంతగడ్డపై అతడికి ఇదే మొదటి టెస్టు కావడం విశేషం.చివరగా అతడు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఆయా దేశాల్లో జరిగిన సిరీస్లలో పాల్గొన్నాడు. మరోవైపు.. జేమీ స్మిత్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ టీమిండియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్లకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఇదే తొలి సిరీస్. శుక్రవారం (జూన్ 20) నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. లీడ్స్లోని హెడ్డింగ్లీ మైదానం ఇందుకు వేదిక.టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.భారత్తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.సిరీస్ పేరు అదే.. గెలిచిన కెప్టెన్కు పటౌడీ పతకంటీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్కు ఇరు దేశాల దిగ్గజాలను గుర్తు చేసేలా టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy) పేరు ఖరారైంది. ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును మారుస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గతంలోనే ప్రకటించింది. దాంతో పటౌడీ పేరు తొలగించడంపై విమర్శలు వచ్చి చర్చ జరిగింది. కానీ ఈసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు.తాము అనుకున్న పేరునే ఖాయం చేసింది. తొలి టెస్టుకు ముందు రోజు ఈ నెల 19న ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. అయితే పటౌడీని ఏదో ఒక రూపంలో గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి మాత్రం ఈసీబీ సానుకూలంగా స్పందించింది. టెస్టు సిరీస్లో విజేతగా నిలిచే కెప్టెన్కు ‘పటౌడీ మెడల్’ను అందజేస్తారు.కాగా భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పటౌడీ ససెక్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జట్ల తరఫున కూడా ఆడగా... ఆయన తండ్రి ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ భారత్, ఇంగ్లండ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో వారి గౌరవార్ధం ఇప్పటి వరకు ‘పటౌడీ ట్రోఫీ’గా పిలిచారు. అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్లుగా సచిన్ టెండూ ల్కర్ (200), జేమ్స్ అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు -
గిల్, బుమ్రా కాదు!.. భారత్కు గేమ్ ఛేంజర్లు వీరే: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ బృందంతో తలపడే భారత జట్టులో 23 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నాడని జోస్యం చెప్పాడు. అదే విధంగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ (Tendulkar-Anderson Trophy) ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన బ్రేకౌట్ స్టార్స్పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వీరిద్దరు కీలకం‘‘టీమిండియా తరఫున ఈ పర్యటనలో రాణించే ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ముందు వరుసలో ఉంటాడని చెప్పగలను. సర్రీ తరఫున కౌంటీ క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు’’ అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘శార్దూల్ ఠాకూర్కు ఇది కీలకమైన టూర్. అతడి చేరికతో టీమిండియాకు రెండో బౌలిండ్ చేంజ్ ఆప్షన్ లభించినట్లయింది. మెరుగైన ఎకానమీతో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. కాబట్టి భారత బౌలింగ్ విభాగంలో అతడు కీలక పాత్ర పోషించనున్నాడు’’ అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు. కాగా గిల్, బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లను కాదని పనేసర్ ఈ ఇద్దరి పేర్లు చెప్పడం గమనార్హం.అత్యధిక పరుగుల వీరుడిగాకాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఐపీఎల్-2025లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ స్టార్ బ్యాటర్.. 15 మ్యాచ్లలో కలిపి ఏకంగా 759 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మూడు వన్డేలు ఆడిన సాయి సుదర్శన్ 127 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఒక టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక టెస్టుల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయని 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్తో సిరీస్తో ఆ కలను నెరవేర్చుకోనున్నాడు.అతడి రీ ఎంట్రీమరోవైపు.. 33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ 2024లో సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత.. ఇప్పుడే మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ ఇంగ్లండ్తో సిరీస్తో సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక ఈ సిరీస్కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్! -
కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!
ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో భారత జట్టు స్టోక్స్ బృందంతో తలపడనుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడే తొలి టెస్టు సిరీస్ కావడంతో గిల్ సేన ఎలా ఆడబోతుందన్న అంశంపైనే క్రికెట్ ప్రేమికుల దృష్టి కేంద్రీకృతమైంది.అతడికి ఎవరూ సాటిరారుఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోహ్లి సేవలను కచ్చితంగా మిస్ అవుతుందని.. అతడి పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. క్లాస్ ప్లేయర్ లేకుండా బరిలోకి దిగడం భారత జట్టుకు కాస్త కష్టంగానే ఉంటుందని తెలిపాడు.ఈ మేరకు.. ‘‘పోరాటతత్వం గల.. అదే విధంగా క్రీడాస్పూర్తిని రగిల్చే కోహ్లిని టీమిండియా మిస్ అవుతుందనడంలో సందేహం లేదు. గెలుపు కోసం అతడు పడే తాపత్రయం, అందుకోసం అతడు చేసే పోరాడే విధానానికి ఎవరూ సాటిరారు.18వ నంబర్ను అతడు తన గుర్తింపుగా మార్చుకున్నాడు. వేరొక భారత ఆటగాడి జెర్సీపై నంబర్ 18ను చూడటం కాస్త చిత్రంగానే అనిపించవచ్చు. సుదీర్ఘకాలంగా అతడు టీమిండియా క్లాస్ ప్లేయర్గా కొనసాగిన తీరు అమోఘం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.కోహ్లి ఉంటేనే మజాఅదే విధంగా కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తాను అతడి మెసేజ్ చేశానన్న స్టోక్స్... అతడు లేని టెస్టు క్రికెట్ ఆడటం అంత గొప్పగా ఉండదని చెప్పానన్నాడు. ‘‘ విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటంలో ఎంతో మజా ఉంటుంది. కానీ ఇకపై అది జరుగబోదని తెలిసి నాకు కాస్త విచారంగా అనిపించింది.మైదానంలో ఉన్నప్పుడు యుద్ధరంగంలో ఉన్నట్లే నేను, కోహ్లి భావిస్తాం. ఆట విషయంలో మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు మీద అతడు ఎంతో గొప్పగా ఆడాడు. అతడొక క్లాస్ ప్లేయర్’’ అని స్టోక్స్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దిగ్గజ కెప్టెన్ కూడా!కాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్లో.. 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు సాధించాడు. ఇందులో ముప్పై శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. టీమిండియా టెస్టు కెప్టెన్గా కోహ్లి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు.. గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48 విజయాలు), స్టీవ్ వా(41 విజయాలు) తర్వాత అత్యధిక టెస్టు విజయాలు (40) అందుకున్న సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్గా పది టెస్టులు ఆడిన కోహ్లి.. మూడింట జట్టును గెలిపించాడు.చదవండి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..!