అలా అయితే అవుట్‌ అయిపోతావు! గిల్‌కు పంత్‌ వార్నింగ్‌.. వైరల్‌ | Neeche Hi Reh: Pant Warning For Aggressive Shubman Gill Video Viral | Sakshi
Sakshi News home page

అలా అయితే అవుట్‌ అయిపోతావు! గిల్‌కు పంత్‌ వార్నింగ్‌.. వైరల్‌

Jun 21 2025 1:17 PM | Updated on Jun 21 2025 2:47 PM

Neeche Hi Reh: Pant Warning For Aggressive Shubman Gill Video Viral

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్‌తో చెలరేగారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కూడా హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు.

భారీ భాగస్వామ్యాలు
జైసూ 101 పరుగులు సాధించి.. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్‌ 127, పంత్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.  కాగా జైస్వాల్‌ మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (42)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 129 పరుగులు జతచేశాడు.

అనంతరం గిల్‌కు తోడైన పంత్‌ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.

ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్‌ ఎంపిక విషయంలో గిల్‌కు పంత్‌ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ సంధించిన ఫుల్లర్‌ బాల్‌ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్‌.. షార్ట్‌ కవర్‌ దిశగా బాదాడు.

అలా అయితే అవుట్‌ అయిపోతావు!
ఆ సమయంలో నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న పంత్‌.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్‌ అవుట్‌ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్‌ స్టంప్‌లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్‌తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. అతడికి డిప్యూటీగా రిషభ్‌ పంత్‌ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్‌ జరుగుతుండగా.. ఎడ్జ్‌బాస్టన్‌ (బర్మింగ్‌హామ్‌), లార్డ్స్‌ (లండన్‌), ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ (మాంచెస్టర్‌), కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ (లండన్‌) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు
👉షెడ్యూల్‌: జూన్‌ 20- 24
👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
👉టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌
👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).

చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement