-
కొత్తమలుపులో శివసేన రాజకీయం
బాల్ థాక్రే 1966లో శివసేనను స్థాపించి మహారాష్ట్రలో దాన్ని ఒక గొప్పశక్తిగా మలిచారు. బొంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండటంతో ఈ పరిణామం భారత రాజకీయాలపై కూడా ప్రభావితం చూపింది. బాల్థాక్రే బలంగా ఒక విషయాన్ని నమ్మేవారు. థాక్రే కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఎన్నికల్లో ఎన్నటికీ పోటీ చేయరు అన్నదే ఆ నమ్మకం. బాల్థాక్రే జీవించి ఉన్నంతవరకు శివసేన ఆ నియమాన్ని గౌరవిం చింది. నిజానికి ఆయన పెద్ద కోడలు అప్పట్లోనే బాంబే మేయర్ కావాలని కోరుకున్నారు. కానీ బాల్థాక్రే ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆయన పెద్దకుమారుడు ఇంట్లోంచి వెళ్లిపోయారు. థాక్రే మరణం తర్వాత ఉద్ధవ్థాక్రే ఆ నియమాన్ని బద్దలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ద్వారా ఉద్ధవ్థాక్రే తండ్రి అంతరాల్లోంచి వచ్చిన ఆ నిబంధనను ఉల్లంఘించారు. తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పడంలో బాల్థాక్రే తర్కం చాలా సులువైనది. వ్యక్తిగత వైభవం కోసం లేదా పదవికోసం, తన కుటుంబం రాజకీయాల్లో పాల్గొంటోందని ప్రజలు తమ గురించి అనుకోకూడదని థాక్రే భావించేవారు. శివసేన అంటే 80 శాతం సామాజిక సేవ, 20 శాతం రాజకీయాలు అని పదే పదే చెప్పేవారు. ఆయన గొప్ప చింతనాపరుడు. ఒక నాయకుడు ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు అతడు ప్రజలవద్దకు వెళ్లి ఓట్ల కోసం అడుక్కోవాలని, అలాంటి వైఖరి శివసేనను దెబ్బతీస్తుందని థాక్రే చెప్పేవారు. ఎందుకంటే శివసేన విభిన్నమైన పార్టీ అని థాక్రే విశ్వాసం. కాబట్టి మహారాష్ట్రలో ఇప్పుడు రెండు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. శివసేన పూర్తిగా సాధారణ రాజకీయ పార్టీగా మారవచ్చు లేదా అది పతనం కావచ్చు. థాక్రే గొప్ప నియమం బద్దలైపోయింది. శివసేన ప్రస్తుత పాత్రను గుర్తిస్తున్నప్పుడు ఈ అంశాన్ని మనసులో ఉంచుకోవాల్సిందే. ఒక శివసైనికుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నది బాల్ థాక్రే చివరి కోరిక అని శివసేన నేత సంజయ్ రౌత్ ఇప్పుడు చెబుతున్నారు. కానీ తన కుటుంబ సభ్యుడొకరు సీఎం కావాలని థాక్రే ఎన్నడూ భావించలేదు. ఈ వాస్తవం ప్రస్తుత శివసేన నాయకత్వాన్ని విచ్ఛిన్న పరుస్తుంది. బాల్థాక్రే రాజరికపాలనపై, కాంగ్రెస్ పార్టీపై పదే పదే దాడిచేసేవారు. రాజరికపాలన క్రమక్రమంగా అంతరించిపోతుందని థాక్రే చెప్పేవారు. శివసేన మిలిటెంట్ పార్టీగానే తప్ప అధికారంపై ఆసక్తి లేకపోవడాన్ని కొనసాగించాలని ఆయన హెచ్చరించేవారు. 1994లో తొలిసారిగా మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చినప్పుడు బాల్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ మనోహర్ జోషిని సీఎంగా నియమించిన థాక్రే తాను మనోహర్ జోషీ రిమోట్ కంట్రోల్గా ఉంటానని బహిరంగంగా చెప్పారు. శివసేన ప్రస్తుత స్థితిని అంచనా వేసేటప్పుడు ఈ నేపథ్యాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఉద్దవ్ థాక్రే దివంగత బాల్థాక్రే మూడవ కుమారుడు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న బీజేపీని తుంగలో తొక్కి మరీ సీఎం అయ్యారు. భారత రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. అయితే శివసేన నైతికతపై చర్చించటం కంటే అధికారం చేజిక్కించుకోవడం ద్వారా శివసేన ఎదుర్కోనున్న బలమైన సవాళ్లను అంచనా వేయడం అవసరం అని నా భావన. శివసేన ఒక పార్టీగా 1999 నుంచి పతనమవుతూ వస్తోంది. బీజేపీ–శివసేన పొత్తులో ప్రధాన భాగస్వామిగా ఉంటున్న స్థితి నుంచి సేన జూనియర్ భాగస్వామిగా పడిపోయింది. తన ఈ పతనానికి బీజేపీనే వేలెత్తి చూపుతున్న శివసేన తన నాయకత్వ శైలిగురించి ప్రశ్నించుకోవడం లేదు. మహారాష్ట్ర శాసనసభలోని 288 సీట్లలో 124 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 58 సీట్లను గెల్చుకుంది. మిగిలిన 164 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. ఈ లెక్కలకు సంబంధించిన తేడాను ఉపయోగించుకున్న శివసేన.. బీజేపీని విడిచి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. థాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే శివసేనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రధానంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉనికిలో ఉన్న పార్టీగా పతనమైన శివసేన ముఖ్యమంత్రి పదవి ద్వారా పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చని ఆశిస్తోంది. సీఎంగా ఉద్దవ్ ప్రతిచోటా ఆదేశించే స్థాయిలో ఉంటారు కాబట్టి ఇతర పార్టీల్లోని నేతలను, కార్యకర్తలను కూడా పార్టీలోకి ఆకర్షించవచ్చు. ఉనికిలేని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. తాను కోల్పోయిన గౌరవాన్ని ముఖ్యమంత్రి పదవి ద్వారా తిరిగి పొందవచ్చని, పార్టీ నాయకులు, కార్యకర్తులు మునుపటిలా పార్టీని వదలకపోవచ్చని థాక్రే కుటుంబం ఆశిస్తోంది. అధికారం దన్నుతో పునర్వైభవాన్ని పొందవచ్చన్నది వీరి ఆశ. ఇప్పుడు కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నుంచి మద్దతు ద్వారా బాంబే కార్పొరేషన్లో ఆధిక్యత సాధించవచ్చని శివసేన నాయకత్వం భావిస్తోంది. 2019లో కంటే 2024 ఎన్నికల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి పదవిద్వారా పొందవచ్చు. శివసేన గత ముఖ్యమంతి నారాయణ్ రానేతో సహా ఇతర పార్టీల్లోకి వెళ్లిన శివసైనికులను అధికార బలంతో తిరిగి ఆకర్షించడమో లేక ప్రతీకారంతో దెబ్బతీయడానికి సీఎం పదవి ఆస్కారం ఇవ్వనుంది. అలాగే చక్కెర ఫ్యాక్టరీలలో, కో ఆపరేటివ్స్లో వాటాను పెంచుకోవచ్చు. పైగా శివసేనకు జాతీయ స్థాయిలో ప్రతిష్ట కూడా పెరగనుంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్రపై పట్టు సాధించడం ద్వారా జాతీయ రాజకీయాలను శాసించవచ్చని శివసేన అంచనా. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే మంచి పాలనను అందిస్తే, సమర్థతను నిరూపిస్తే భవిష్యత్తులో తాను గొప్ప రాజకీయవేత్తగా కావచ్చు. 1999 నుంచి 2014 వరకు 15 సంవత్సరాలపాటు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అనుభవించిన అధికారాన్ని శివసేన సమర్థపాలన ద్వారా అందుకోవచ్చు. అన్నిటికంటే మించి మహారాష్ట్రలో వైఫల్యం నుంచి బీజేపీ గుణపాఠం తీసుకుని దిద్దుబాట పట్టకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావడానికి నరేంద్రమోదీ చిక్కు సమస్యలు ఎదుర్కోవచ్చు. మహారాష్ట్రను కోల్పోవడం భారీ నష్టమని బీజేపీకి అర్థమైంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలు తిరిగి చేపట్టడానికి మోదీ, అమిత్ షాలు పథకాలు ఏమేరకు ఫలిస్తాయన్న అంశంపైనే శివసేన భవిష్యత్తు, ప్రస్తుత అధికార పొత్తు భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధవ్ పోటీ?
సాక్షి ముంబై : శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో సభ్యత్వం లేకపోయినా రాజకీయ పరిస్థితులు, అవసరాల దృష్ట్యా శివసేన చీఫ్ ఉద్ధవ్ మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఆరునెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకుండా మరెలాంటి ఎన్నికలూ లేకపోవడంతో ఈ దఫా ఎమ్మెల్సీగా శాసనమండలికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో శివసేన నుంచి ఎమ్మెల్సీగా నీలం గోర్హే పదవీ కాలం ముగియనుండటంతో ఆ స్థానంలో శివసేన అధినేత మండలికి వెళ్లు అవకాశాలు మెండుగా ఉన్నాయి. 26 మంది విరమణ.. నూతన సంవత్సరంలో శాసన మండలిలోని 26 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ సభ్యులలో 10 మంది ఎన్సీపీకి చెందినవారే ఉన్నారు. దీంతో నూతన సంవత్సరంలో జరగబోయే శాసన మండలి ఎన్నికలపై అందిరి దృష్టి కేంద్రికృమైంది. అయితే బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి మహావికాస్ ఆఘాడి ఏర్పాటవడంతో మెజార్టీ మహాఆఘాడికే ఉంది. దీంతో మహావికాస్ ఆఘా డికి నూతన సభ్యుల ఎన్నికలో పెద్దగా ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. శాసన మండలిలోని 78 మంది సభ్యులలో 26 మంది పదవీకాలం ముగియనుండగా వీరిలో ఎన్సీపీకి చెందిన పది మంది, కాంగ్రెస్ ఏడుగురు, బీజేపీ ఐదుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులుండగా శివసేన, పీఫుల్స్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక్కో సభ్యుడున్నారు. కూటమికి బలం ఉండటంతో.. శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే నేపథ్యంలో ఆరు నెలల లోపు శాసన సభ లేదా శాసన మండలి సభ్యత్వం పొందాల్సి ఉంది. దీంతో ఆయన శాసన సభకు పోటీ చేస్తారా లేదా శాసన మండలికా అనేది కార్యకర్తలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శాసన సభ సభ్యత్వం పొందాలంటే ఆయన కోసం ఎవరో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిరానుంది. కానీ, శాసన మండలి అయితే నూతన సంవత్సరంలో పలువురి సభ్యుల పదవీ కాలం ముగియనుంది. మహావికాస్ ఆఘాడి సభ్యులు మళ్లీ సునాయాసంగా విజయం సాదించేందుకు అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పదవి కాలం ముగియనున్న శాసన మండలి సభ్యుల వివరాలు.. ఎన్సీపీ: విద్యా చవాన్, సతీష్ చవాన్, హేమంత్ టకలే, ఆనంద్ ఠాకూర్; కిరణ్ పావస్కర్, ఖాజా బేగ్, జగన్నాథ్ శిందే, ప్రకాష్ గజబియేలున్నారు. రామరావ్ వడకుతే, రాహుల్ నార్వేకర్లు రాజీనామా చేశారు. కాంగ్రెస్: అనంత్ గాడ్గిల్, హుస్న్బాను ఖాలేఫస్త్ర, జనార్దన్ చందూర్కర్, ఆనందరావ్ పాటిల్, హరిభావు రాఠోడ్, రామహరి రూపనవార్లున్నారు. చంద్రకాంత్ రఘువంశి రాజీనామా చేశారు. బీజేపీ: అరుణ్ ఆడసూడ్, పృథ్వీరాజ్ దేశ్ముఖ్, స్మీతా వాఘ్, అనీల్ సోలేలున్నారు. చంద్రకాంత్ పాటిల్ శాసన సభకు ఎన్నిక కావడంతో ఆయన పదవి ముగిసింది. శివసేన: నీలం గోరే. పీపల్స్ రిపబ్లికన్: జోగేంద్ర కవాడే. ఇండిపెండెంట్: శ్రీకాంత్ దేశ్పాండే, దత్తాత్రేయ సావంత్. -
బీజేపీ అధినాయకత్వంపై ఏక్నాథ్ ఖడ్సే కినుక
జల్గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు. -
బీజేపీ మహిళా నేత అనూహ్య పోస్ట్..!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇక, భవిష్యత్ కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ నాయకురాలు పంకజ ముండే ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. గత బీజేపీ సర్కార్లో పంకజ (40) గ్రామీణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన కజిన్ సోదరుడు ధనుంజయ్ ముండే చేతిలో 30వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పంకజ ముండే తాజాగా పెట్టిన పోస్టు ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. ‘రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత భవిష్యత్తేమిటనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాతో నేను చర్చించుకోవడానికి 8 నుంచి 10 రోజుల సమయం కావాలి’ అని తెలిపారు. తన తండ్రి, బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే 60వ జయంతి సందర్భంగా డిసెంబర్ 12లోపు తన రాజకీయ భవిష్యత్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆమె తెలిపారు. బీడ్ జిల్లాలోని తన తండ్రి స్మారక కేంద్రం గోపీనాథ్ ఘాట్ వద్దకు 12వ తేదీన తమ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తన కజిన్ ధనుంజయ్ ముండేతో తీవ్ర రాజకీయ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో పంకజ ముండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం పెద్ద డ్రామా..!
బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని, మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించేందుకే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారంటూ విస్మయపరిచే వ్యాఖ్యలు గుప్పించారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈ కర్ణాటక ఎంపీ.. శనివారం తన నియోజకవర్గం ఉత్తర కన్నడలోని యెల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులను సురక్షితంగా మళ్లీ కేంద్రానికి చేర్చడానికి ఫడ్నవిస్కు 15 గంటల సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ‘మహారాష్ట్రలో మా పార్టీ వ్యక్తి కేవలం 80 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మేం ఎందుకీ డ్రామాను చేయాల్సి వచ్చింది? మాకు తెలియదా? మెజారిటీ లేదని మాకు తెలిసినా.. ఆయన ఎందుకు సీఎం అయ్యారు? ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి కారణం రూ. 40వేల కోట్లే. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ 40వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కాకుండా దుర్వినియోగమయ్యేవి. అందుకే పక్కా ప్లానింగ్తో ఏదైతే అదయిందని పెద్ద డ్రామాకు తెరతీశాం. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 15 గంటల్లో ఫడ్నవిస్ డబ్బులు తిరిగి సురక్షితంగా ఉండోచోటుకు పంపించారు. అవి కేంద్రానికి వెళ్లిపోయాయి. అవి ఉన్నచోటే ఉంటే తదుపరి సీఎం ఆ నిధులను ఏం చేసేవారో మనందరికీ తెలిసిందే’ అని అనంత్కుమార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇటు బీజేపీని, అటు ఫడ్నవిస్ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. రెండోసారి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. నిజానికి ఇలా జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే ప్రభుత్వ ఆర్థిక విభాగం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టవచ్చు’అని ఫడ్నవిస్ స్పష్టంచేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement