ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు | Nagpur Police delivers summons to Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు

Nov 29 2019 5:55 AM | Updated on Nov 29 2019 5:55 AM

Nagpur Police delivers summons to Devendra Fadnavis - Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఫడ్నవీస్‌ తనపై ఉన్న క్రిమినల్‌ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్‌ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్‌ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement