-
అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీస్టార్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 2018లో ఏం జరిగిందంటే.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్కు అవార్డు దక్కింది. దానిని 2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్ అవార్డును ఆమెకు అందించారు విజయ్. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు. The 1st @TheRowdyClub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) pic.twitter.com/OgqA8Q0P3U — Vijay Deverakonda (@TheDeverakonda) July 15, 2018 -
నెగెటివ్ అప్రోచ్.. కచ్చా బాదం..సందీప్ రెడ్డి సీక్రెట్ ఇదే!
ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్ను తలపించేలా చేయడం సందీప్రెడ్డి సీక్రెట్గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్రెడ్డితో సంచలనం తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్గా చూపించినా.. కథంతా బోల్డ్గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్వేర్లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. ‘యానిమల్’తో మరో ప్రయోగం సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్ని బోల్డ్గా, వయోలెన్స్గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్రెడ్డి. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్రెడ్డి చెప్పాలనుకే పాయింట్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. వంగాపై బాలీవుడ్ ఫోకస్ యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్రెడ్డికి అడ్వాన్స్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్బాబు, రామ్చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. -
అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసిన బేబీ
-
వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!
తక్కువ సినిమాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాల కంటే తన యాటిట్యూడ్తో యూత్లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ రౌడీ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి.. హీరో.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్డమ్ విజయ్కి అంత ఈజీగా రాలేదు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్లూ తిరిగాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేశాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై గీత గోవిందం, టాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర చిత్రాలతో యూత్ను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్గా నిలిచినా.. విజయ్కి మాత్రం నార్త్లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విజయ్ బర్త్డే నేడు(మే 9). ఈ సందర్భంగా ఈ రౌడీ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ► విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేట గ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో విజయ్ తండ్రి గోవర్దన్రావు ఫ్యామిలీతో కలిసి హైదారాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. యాక్టర్గా అవకాశాలు లభించకపోవడంతో టెలివిజన్ డైరెక్టర్గా మారాడు. సినిమా రంగంపై తనకున్న ఇష్టంతోనే విజయ్ యాక్టర్ అవుతానంటే.. ఆయన అడ్డుచెప్పలేదు. ► విజయ్ తన పాఠశాల విద్యను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీని హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజిల్లో పూర్తి చేశాడు. (చదవండి: ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ) ► డిగ్రీ పూర్తయిన తర్వాత విజయ్ నటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో అవకాశం లభించింది.అందులో విష్ణు పాత్రను పోషించాడు. ► నువ్విలా సినిమా చేస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని అందరిలాగే అడిషన్స్కి వెళ్లాడు విజయ్. ఆ చిత్రంలో అజయ్ అనే చిన్న పాత్రను పోషించాడు. ► తొలి రెండు సినిమాలు విజయ్కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్ర మాత్రం విజయ్కి మంచి గుర్తింపు తెచ్చింది. అయినా కూడా హీరోగా అవకాశాలు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి హీరోగా విజయ్ని సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి ముందుకొచ్చి ఆ చిత్రాన్ని నిర్మించాడు. అదే విజయ్ కెరీర్ని మలుపు తిప్పింది. హీరోగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో స్టార్గా హీరోగా ఎదిగాడు. ► అర్జున్ రెడ్డి తర్వాత విజయ్కి వరుస అవకాశాలు లభించాయి. ఏ మంత్రం వేసావే, నోట, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలకు మిశ్రమ స్పందల రాగా.. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ చూసి షూటింగ్ ప్రారంభించిన ‘జనగణమన’ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ► ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ► 'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) ► ఇక విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్కి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఆ అవార్డుని వేలం వేసి రూ.25 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బంతా ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్కి విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ► ప్రతీ ఏడాదికి ఒకసారి ‘ 'దేవర శాంటా’ పేరిట అభిమానులను సర్ఫ్రైజ్ చేయడం విజయ్కి అలవాటు. ఇలా పేద ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్లోనూ హీరోగా నిలుస్తున్న విజయ్ కెరీర్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ‘సాక్షి’ తరపున, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement