-
ఆ మూవీకి తెలుగులో ఊహించని రెస్పాన్స్!
కేరళలో రీసెంట్ టైమ్స్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన '2018'. ఈ చిత్రం ఇవాళే తెలుగులో విడుదలైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ను హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనూ ప్రదర్శించారు. ప్రెస్ స్క్రీనింగ్, సెలబ్రిటీ ప్రీమియర్కు అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: చిన్నవయసులోనే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిన సితార.. భారీగా రెమ్యునరేషన్) అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్లో ప్రేక్షకుడిని సీటులోనే కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్-2'.. కానీ కండీషన్స్ వర్తిస్తాయి) కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటోందని, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఇది సిసలైన కేరళ స్టోరీ.. పది రోజుల్లో వందకోట్ల క్లబ్లోకి..!
భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాలీవుడ్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్న కథలు.. విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి కలెక్షన్ల విషయంలో వరుసగా చిన్నాపెద్ద చిత్రాలు నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘2018’ పెనుసంచలనం సృష్టించింది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘2018’.. మే 5వ తేదీన రిలీజ్ అయ్యింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదీ పాన్ ఇండియా సినిమాగా కాదు.. కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యి మరి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ఆడియొన్స్. జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన ‘2018’ చిత్రం.. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు ఈ లిస్ట్లో ఉన్నా ఫుల్ రన్లో ఆ ఫీట్ను సాధించాయి. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. 2018.. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్. క్యాప్షన్కు తగ్గట్లే కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో అందరూ హీరోలే. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా చిత్ర కథ నడుస్తుంది. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలం అయిన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి?. వాటిలో అక్కడి ప్రజలు ఎలా భాగం అయ్యారు? చివరికి ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ. రెండున్నర గంటలపాటు సాగే కథలో.. ద్వితియార్థం సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ప్రేమ, ధైర్యం, సాహసం, త్యాగాలు.. రకరకాల భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించడంతో ఈ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ అనూప్ పాత్రలో అలరించాడు. బిజీ గవర్నమెంట్ ఉద్యోగి చివరికి వరదల్లో చిక్కుకున్న తన కుటుంబం కోసం తాపత్రయపడే షాజీ రోల్లో కున్చాకో బోబన్, ఎన్నారై రమేష్గా వినీత్ శ్రీనివాసన్, నిక్సన్ పాత్రలో అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి పేరున్న ఆర్టిస్టులు మాత్రమే కాదు, సినిమాలో చిన్నపాత్ర కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతుంది. -
‘కేరళకు లేవన్నారు.. స్టాచ్యూకి రూ. 3000 కోట్లు ఎక్కడివి’
బెంగళూరు : వరదలతో అతాలకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పీఎం విగ్రహం నిర్మాణం కోసం మాత్రం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి విచక్షణ లేని నాయకున్ని మీరు ఎక్కడైనా.. ఎప్పుడైనా చూశారా అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. కేరళను వరదలు ముంచేత్తినప్పుడు ముందు కేవలం 100 కోట్ల రూపాయలు.. ఆపై రూ. 500 కోట్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్దార్ పటేల్ విగ్రహం కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుడేవరైనా ఇలాంటి పని చేస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. STATUE or HUMAN BEING.. Dear TROLLS..and FAKE NEWS FACTORY OWNERS who distorted what I said in an interaction on GOD.. WOMEN n RELIGION.... will you try DISTORTING this one too OR does it not serve your purpose ..#justasking pic.twitter.com/MT9360f8Qf — Prakash Raj (@prakashraaj) November 9, 2018 -
రెడ్అలర్ట్ : కేరళలో మలంపుజ డ్యామ్ గేట్ల ఎత్తివేత
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. మలంపుజ డ్యామ్కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
కేరళకు మరో ప్రళయ హెచ్చరిక
తిరువనంతపురం : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యం కేరళ సీఎం పినరయి విజయన్ తీరంలోని మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీనిపై కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిగిన సీఎం.. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్ అలర్ట్ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కాగా ఇటీవల సంభవించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రజలకు వర్ష సూచన భయాందోళనకు గురిచేస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షలకు 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
వికసించిన మే పుష్పం
క్లుప్తంగా
విషపురుగు కాటుతో బాలుడు మృతి
పెళ్లింట విషాదం●
ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన పోటీలు
విద్యుత్ తీగలకు తగిలి బొలెరో దగ్ధం
‘వంశీ గెలిస్తే కార్మికుల పక్షాన గొంతు వినిపిస్తాడు’
దంపతుల ఆత్మహత్యాయత్నం
‘బీఆర్ఎస్కే మాదిగల మద్దతు’
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement