-
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్డే రష్మిక మందన (ఫొటోలు)
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement