-
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్లో మరింత క్రేజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్ను ఈ చిత్రంతో అందుకున్నారు. సినిమా టాక్తో సంబంధం లేకుండా సూపర్ కొట్టి టాలీవుడ్లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్ మహేశ్.. ఆయన క్రేజ్కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్ను భారీ మొత్తానికి నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. హిందీలో క్రేజ్ టాలీవుడ్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్,తారక్,రామ్ చరణ్ వంటి స్టార్స్ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళితో ప్లాన్ చేశారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు. Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥 @MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy — Satvik (@SatvikV1) February 8, 2024 Dum Masala Biryani Erra Kaaram Ara kodi ready ga pettukoni full ga enjoy chese Guntur Kaaram vacchesindhi 🤤 Guntur Kaaram, now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/ROm8FYyjcU — Netflix India South (@Netflix_INSouth) February 8, 2024 -
‘గుంటూరు కారం’ ఎఫెక్ట్.. ‘గురూజీ’కి బన్నీ షాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్ అయినా హిట్ లేకుంటే అంతే సంగతి. ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయంటే ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేస్తుంది. డైరెక్టర్ల విషయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ స్టార్ హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అయిందంటే.. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ ఖాతాలోకే వెళ్తుంది. అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ముందుకు రారు. తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగినట్లు తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ గురుజీపై బాగానే పడినట్లు అనిపిస్తుంది. (చదవండి: భారీ ధరకు ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్.. ఎన్టీఆర్కి పెద్ద భారమే!) ఈ చిత్రం విడుదలకు ముందు.. అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ ప్రకటించాడు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ‘గుంటూరు కారం’ చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ.. సినిమాకు తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వినిపిసించింది. ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. మహేశ్ కారణంగా సినిమాకు ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చాయని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. మహేశ్ లాంటి స్టార్ హీరోని త్రివిక్రమ్ సరిగా వాడుకోలేకపోయాడని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇవన్నీ చూసిన బన్నీ.. తివ్రిక్రమ్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: రూపాయి తీసుకోకుండా సినిమా చేయనున్న మహేశ్! కారణం అదేనా?) పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో సినిమా రాబోతుందని గీతా ఆర్ట్స్ అఫిషియల్గా ప్రకటించింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ అల్లు అర్జున్తోనే బోయపాటి సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బన్నీకి బోయపాటి కథ వినిపించాడట. ఆయన ఓకే చెప్పిన తర్వాత గీతా ఆర్ట్స్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అంట్లీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాతే బోయపాటి మూవీ ఉంటుందని మరో ప్రచారం సాగుతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇవన్నీ వరుసగా రాబోతున్న చిత్రాలు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పట్లో త్రివిక్రమ్తో బన్నీ సినిమా రావడం కష్టమే. -
గుంటూరు కారం కలెక్షన్స్.. ఆల్టైమ్ రికార్డ్ సెట్ చేసిన మహేశ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తొలి వారంలో రూ. 212 కోట్లు వసూల్ చేసినట్లు అఫీషియల్గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రాంతీయ భాషలో మాత్రమే విడుదలైన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్ను క్రియేట్ చేసింది. రిజనల్ ఫిల్మ్ పరంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. మహేశ్ బాబు కెరీర్లో రూ.200+ గ్రాస్ మార్క్ను అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా రూ. 100 కోట్ల క్లబ్లో మహేశ్ బాబు చిత్రాలు ఐదు ఉన్నాయి. టాలీవుడ్లో ఈ రికార్డ్ మహేశ్ పేరుతో మాత్రమే ఉంది. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 sets the BOX-OFFICE ablaze!! 🔥🕺#GunturKaaram grosses over a SMASHING 𝟐𝟏𝟐 𝐂𝐑 Worldwide in it’s 1st Week ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 (Highest for a regional cinema)💥💥 Watch #BlockbusterGunturKaaram at… pic.twitter.com/KyXpMsIwHf — Haarika & Hassine Creations (@haarikahassine) January 19, 2024 -
తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు
సూపర్స్టార్ మహేశ్ బాబు తన ప్యాన్స్కి షాకింగ్ న్యూస్ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు. అతడు, ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేశ్బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరుకారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. మహేశ్బాబు మాస్ యాక్షన్, డ్యాన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో నెక్లెస్ పాటతో పాటు కుర్చి సాంగ్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నామని మహేశ్ అన్నారు. (చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్.. అసలు విషయం బయటపెట్టిన సూపర్ స్టార్) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ మరిన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ‘గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉండాలని నేను, త్రివిక్రమ్ ముందుగానే అనుకున్నాం. ఈ మూవీ తర్వాత తెలుగులో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. బహుశా ఇదే నా చివరి తెలుగు చిత్రం కావొచ్చు. అందుకే మాస్ సాంగ్స్ ఉండాలనుకున్నాం. ఈ మూవీలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి సాంగ్.. నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయడానికి మొదట్లో టెన్షన్ పడ్డాను. నెక్లెస్ పాట షూటింగ్ అయితే ముందే పూర్తి చేశాం. ఆ తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. కుర్చి సాంగ్ రిలీజ్కి కొద్ది రోజుల ముందు(డిసెంబర్ 22)పూర్తి చేశాం. చాలా అద్భుతంగా అనిపించింది. నా కెరీర్ బెస్ట్ సాంగ్ ఇదే’ అని మహేశ్ అన్నారు. ప్రస్తుతం మహేశ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో ‘ఇదే ఆఖరి సినిమా కావచ్చు అంటే ఆయన ఇకపై తెలుగు సినిమాలు చేయరా’ అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ చెప్పింది నిజమే! మహేశ్బాబు మరో రెండు,మూడేళ్ల వరకు తెరపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే తన తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్కి దాదాపు రెండేళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత మహేశ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం గ్యారెంటీ. దీంతో మహేశ్ బాబు తదుపరి ఎలాంటి చిత్రం చేసినా.. అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉన్న చిత్రాలే చేయాలి. తెలుగు సినిమాల మాదిరి ఆ చిత్రాల్లో మాస్ సాంగ్స్, డ్యాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అది దృష్టిలో పెట్టుకోనే.. గుంటూరుకారంలో తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులను నచ్చే సాంగ్స్, స్టెప్పులు ఉండేలా మహేశ్ జాగ్రత్త పడొచ్చు. -
వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి) డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది. ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్ని సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) -
Guntur Kaaram: అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేశ్
సూపర్స్టార్ మహేశ్బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది ఆయన మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం నేడే(జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకు తగ్గట్లే సినిమాలో ఘాటు ఎక్కువే ఉందనుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో టాక్ చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది. మిక్స్డ్ టాక్.. మహేశ్ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు కానీ కొన్నిచోట్ల సీన్లు, డైలాగులు పేలవంగా ఉండటం, కథ కూడా బలహీనంగా ఉండటంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ సహా ఫైటింగ్ సీన్స్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం సినిమా చూశాడు. భార్య నమ్రత, తనయుడు గౌతమ్, కూతురు సితార అతడి వెంట ఉన్నారు. థియేటర్లో మహేశ్బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్, రచయిత వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు.. మహేశ్తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు. థియేటర్లో అభిమాన హీరో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంతో కేకలు పెట్టారు. అయితే మహేశ్, త్రివిక్రమ్, వంశీ ముఖాల్లో చిరునవ్వే కనిపించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు. మహేశ్ను అలా దిగాలుగా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. Superstar @urstrulyMahesh at sudarshan 35mm 😍🔥 #GunturKaaram pic.twitter.com/vbVwvWVWo8 — Mahesh Fans Campaign ™ (@ursMFC) January 12, 2024 Actor Mahesh Babu Arrived At Sudharshan Theatre For Watching His Movie With Fans#GunturKaaramOnJan12th #GunturKaaram #MaheshBabu pic.twitter.com/njfKeMAX29 — Pawar Dilip Kumar Choudhary (@DkpChoudhary) January 12, 2024 చదవండి: గుంటూరు కారం ఓటీటీ పార్ట్నర్ ఇదే! సినిమా సత్తాను బట్టి.. -
‘గుంటూరు కారం’ మైండ్ బ్లోయింగ్ మేకింగ్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజ్.. అదిరిపోయిన యాక్షన్ సీన్స్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అర్ధరాత్రి నుంచే గుంటూరు కారం రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు మహేశ్.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు బద్దలుకొడుతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ఆల్టైమ్ రికార్డులకెక్కింది. తాజాగా గుంటూరు కారం చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను యూనిట్ షేర్ చేసింది. షూటింగ్ సెట్స్లో మహేశ్ ఎంతో ఫన్నీగా నవ్విస్తూ ఉన్న విజువల్స్ అందరినీ మెప్పిస్తాయి. రెండురోజుల క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గుంటూరు కారంతో ఈసారి గట్టిగా కొడతామంటూ మహేశ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతి సినిమాకు తన తండ్రి ఫోన్ చేసేవారని, ఈసారి తన తండ్రి పాత్రను ప్రేక్షకులు పోషించాలని స్టేజీ మీద ఎమోషనల్ అయ్యాడు. ఇకపై తనకు తల్లయినా, తండ్రయినా ప్రేక్షకులే అంటూ రెండు చేతులెత్తి మొక్కాడు. దీంతో ఎప్పటికీ మహేశ్కు అండగా తాము ఉంటామంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదలైన గుంటూరు కారం మేకింగ్ వీడియోను మీరు చూసేయండి. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
Guntur Kaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందరి కన్ను గుంటూరు కారం చిత్రం మీదే ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్తో ఆ అంచనాలను త్రివిక్రమ్ మరింతగా పెంచేశాడు. సినిమాలో మాస్ సీన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ విడదలకు ముందే గుంటూరు కారం ట్యాగ్ను ఆయన ఫ్యాన్స్ ట్రెండింగ్లో పెట్టేశారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హైదరబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశపడ్డారు. అదే వేడుకలో ట్రైలర్ను కూడా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ అనుమతి రాకపోవడంతో తాజాగా యూట్యూబ్లో విడుదల చేశారు. సినిమా కలెక్షన్స్పై కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ వైరల్ కామెంట్ చేశారు. అన్ని సెంటర్స్లలో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్కు దగ్గరగా ఉంటామని ఆయన పేర్కొన్నాడు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికే భారీగా థియేటర్స్ దక్కాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ ఆయిన ఫ్యాన్స్ ఫుల్ క్లారటీతో ఉన్నారు .అమెరికాలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.RRR తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేది గుంటూరు కారం సినిమానే. -
గురూజీ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే బొమ్మ బ్లాక్బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఆ విషయంలో సమర్థుడు అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే! ఈ ట్వీట్కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో -
Guntur Kaaram Songs: ‘కుర్చీని మడతపెట్టి..’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరుకారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.మీనాక్షీ చౌదరి, ప్రకాశ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. (చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘కుర్చీని మడతపెట్టి..’ అనే మాస్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాట ప్రోమోని నిన్న విడుదల చేయగా..ఎంత వైరల్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పద ప్రయోగాన్ని వాడుకొని తమన్ బాణీ కట్టాడు. రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అదించారు. ప్రముఖ సింగర్స్ సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో అదిరిపోయే బీట్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. ‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి" మరియు "తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్స్టార్ కృష్ణ గారి యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి. పాట మధ్యలో 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ మహేశ్బాబు డైలాగ్ చెప్పడం విశేషం. మహేశ్బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదిరిపోయిన ఈ వీడియో సాంగ్పై ఓ లుక్కేయండి. -
Guntur Kaaram Movie HD Stills: మహేష్బాబు మాస్ జాతర ‘గుంటూరు కారం’ మూవీ స్టిల్స్
-
ఆ సమయంలో చాలా కంగారుగా అనిపించింది: గుంటూరు కారం హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖలేజా తర్వాత మహేశ్బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో మరో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ మహేశ్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన రియల్ లైఫ్లోనూ సూపర్స్టారేనని అన్నారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. 'మహేశ్బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. సెట్లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నేను సెట్లోకి వచ్చిన మొదటి రోజు కాస్తా టెన్షన్ పడ్డా. ఫస్ట్ షాట్లోనే ఆయనతో పని చేశా. అప్పుడు చాలా కంగారుగా అనిపించింది. అప్పుడు వెంటనే మహేశ్బాబు.. నో టెన్షన్.. కాస్త సమయం తీసుకోండి. ఏం కాదంటూ చాలా కూల్గా మాట్లాడారు' అని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం చాలా సరదాగా అనిపించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
త్రివిక్రమ్కు రూ.6 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
టాలీవుడ్లో కొందిమంది డైరెక్టర్లకి మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనను సామాన్యులే కాదు స్టార్ హీరోలు సైతం అభిమానిస్తారు. ఆయనలోని దర్శకత్వ ప్రతిభ కంటే ఆయన కలం నుంచి జారువాలే పదునైన సంభాషణలకు ఫ్యాన్స్ ఎక్కువ. తనదైన మాటలతో ప్రేక్షకులను నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. ఆలోచింపజేస్తారు. అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ‘మాటల మాంత్రికుడు’అని పిలుచుకుంటారు. ఆయన బర్త్డే(నవంబర్ 7)ను ప్రతి యేటా పండుగలా జరుపుకుంటారు. ఈ సారి కూడా త్రివిక్రమ్ బర్త్డే గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. పలువురు సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ హీరో మాత్రం బర్త్డే విషెస్తో పాటు ఖరీదైన బహుమతిని అందజేశాడట. ఏంటా బహుమతి? త్రివిక్రమ్ బర్త్డే సందర్భంగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’నుంచి ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడా పాట మహేశ్ ఫ్యాన్స్ ఫెవరేట్ ట్రాక్గా మారింది. ఈ సంగతి పక్కకి పెడితే.. బర్త్డే రోజు త్రివిక్రమ్కి ఖరీదైన బహుమతి అందిందనే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్కి చెందిన ఓ ఆగ్రహీరో రూ.6 కోట్ల విలువ చేసే ప్రాపర్టీనీ బహుమతిగా అందించాడట. ఇప్పుడీ గిప్ట్ రూమర్ టాలీవుడ్ని షేక్ చేస్తోంది. ఎవరా హీరో? త్రివిక్రమ్ కొంతకాలంగా టాలీవుడ్కు చెందిన ఓ స్టార్ హీరోకి సపోర్ట్గా ఉంటున్నాడు. ఆ హీరో చేయాల్సిన సినిమాలకు స్టోరీస్, డైరెక్టర్స్ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే పుట్టిన రోజు కానుకగా ఆ హీరో త్రివిక్రమ్కు రూ. 6 కోట్ల విలువ చేసే బహుమతిని అందించారట. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. -
త్రివిక్రమ్ బర్త్ డే కి 6కోట్లు గిఫ్ట్..హీరో ఎవరంటే..
-
'ధమ్ మసాలా' వచ్చేసింది.. చూసేయండి'!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో సాంగ్ విడుదల చేశారు. గంటూరు కారం మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేయడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥 - https://t.co/egSALSY4Xt A @MusicThaman Musical 🎹🥁 ✍️ @ramjowrites 🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/0nku6bu9P8 — Guntur kaaram (@GunturKaaram) November 7, 2023 -
'అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు'
టాలీవుడ్ డైరెక్టర్స్లో ఆయన స్టైలే వేరు. ఆయన పేరు వింటే చాలు సినిమాల్లోని డైలాగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. అందరిలా కేవలం డైరెక్షన్ చేయడమే కాదు.. కథ, మాటల రచయితగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ చేసిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో పాత్రల కంటే.. ఆయన రాసిన మాటలు, డైలాగ్స్ మాత్రమే మనకు గుర్తుంటాయి. జంధ్యాల, ముళ్లపూడి లాంటి మహానుభావుల్లాగే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉందని నిరూపించాడు. తన సినిమాల్లో తన పంచ్ డైలాగ్లతో నిజ జీవితంలోని సంఘటలను సున్నితంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే సొంతం. రచయితగా మొదలైన సినీ ప్రస్థానం.. స్టార్ డైరెక్టర్గా ఎదిగిన తీరు చూస్తే ఆయనేంటో అర్థమవుతుంది. అంతలా టాలీవుడ్లో తన డైలాగ్స్తో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తోన్న ఆ లెజెండరీ డైరెక్టర్ ఎవరో కాదు.. మన త్రివిక్రమ్ శ్రీనివాసుడే. నువ్వే నువ్వే చిత్రం నుంచి ఇప్పటి గుంటూరు కారం వరకు ఆయన ప్రయాణం మరిచిపోలేని జ్ఞాపకం. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన ఆకెళ్ల నాగ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్గా పేరు సంపాదించారు. స్వయంవరం సినిమాతో రచయితగా త్రివిక్రమ్ జర్నీ మొదలైంది. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు కథ, మాటల రచయితగా పనిచేశారు. అయితే తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మహేశ్ బాబుతో తీసిన అతడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమాలు అందించారు. ప్రస్తుతం మహేశ్బాబుతో గుంటూరు కారం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. నవంబర్ 7న మాటల మాంత్రికుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కలం నుంచి దూసుకొచ్చిన టాప్ టెన్ డైలాగ్స్ గురించి తెలుసుకుందాం. త్రివిక్రమ్ టాప్ డైలాగ్స్ 1. సన్ ఆఫ్ సత్యమూర్తి - 'మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్' 2. జులాయి - 'మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. మనకి రాని పని ట్రై చేయకూడదు' 3. జులాయి - 'లాజిక్లు ఎవరు నమ్మరు.. అందరికి మ్యాజిక్లే కావాలి.. అందుకే మన దేశంలో సైంటిస్ట్ల కన్నా బాబాలే ఫేమస్' 4. నువ్వు నాకు నచ్చావ్ - 'మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి.. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.' 5. అల వైకుంఠపురములో- 'నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. కానీ చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది' 6. నువ్వే నువ్వే - 'సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు' 7. అరవింద సమేత వీరరాఘవ - 'పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?' 8. జల్సా - 'అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే.. మనం చేసే యుద్ధానికి అర్థమేముంది' 9. అత్తారింటికీ దారేది - 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు' 10. తీన్ మార్ - 'కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం.. జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం' -
Birthday Special: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్కు మసాల బిర్యానీ రెడీ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్గా విడుదలైన సాంగ్ ప్రోమోను వింటే మహేశ్ ఫ్యాన్స్కు డబుల్ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్-త్రివిక్రమ్ కాంబోలో మ్యూజిక్ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ సెన్సేషన్ అని తెలిసిందే. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్ మ్యూజిక్ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్ను ఎంజాయ్ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. -
గుంటూరు కారం నుంచి దీపావళి ధమాకా
-
పాన్ ఇండియా హీరోయిన్ తో అల్లు అర్జున్ తను ఎవరంటే..!
-
త్రివిక్రమ్ పెద్ద డైరెక్టర్ అంటే నేను ఒప్పుకోను..!
-
ఫోటోలో ఎవరో తెలుసా..? డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న టాప్ దర్శకుడి కుమారుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్లోని టాప్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టడమే కాకుండా బాక్సాఫీసుల వద్ద కలెక్షన్స్ సునామీని తెచ్చిన డైరెక్టర్గా ఆయనకు ఎనలేని గుర్తింపు ఉంది. అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు, ఇటు మాస్ను మెప్పించగల దర్శకుడు ఆయన. కొద్దిరోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్తో సంబంధం లేకుండా ఆమె కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగానే దుల్కర్ సల్మాన్- మీనాక్షి చౌదరి కాంబోలో ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మాతగా సౌజన్యనే తెరకెక్కిస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్-సౌజన్య కుమారుడు రిషీ మనోజ్ దర్శకుడిగా పరిచయం కానున్నట్లు ధృవీకరించారు. ఇప్పటికే రిషీ పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్తో పాటు అతని కుటుంబం ఎప్పుడూ లైమ్లైట్కు దూరంగా ఉంటారు. ఇటీవలే సౌజన్య తన సినిమాల ప్రమోషన్స్లో భాగంగా రావడం ప్రారంభించారు. అయితే, ఇదిగో త్రివిక్రమ్ కుమారుడు రిషీ తాజా చిత్రం అంటూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుమారుడు రాజా చెంబోలు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ ఫోటోలో సౌజన్య కూడా ఉన్నారు. ముగ్గురూ వైజాగ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ డైరెక్టర్ పిల్లలు మాత్రం పెద్దగా సినీ ఇండిస్ట్రీలో అడుగుపెట్టన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. టాలెంట్ ఉంటేనే ఈ పరిశ్రమలో సక్సెస్ అవుతారు. మొదటి అడుగు వరకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. ఆపై కొనసాగాలంటే తనలోని సత్తాను నమ్ముకోవాల్సిందే. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ కొడతారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement