మహేశ్‌ బాబు న్యూలుక్‌ చూశారా? షూటింగ్‌ ప్రారంభం

SSMB28: Mahesh Babu And Trivikram Srinivas Film Shoot Begins - Sakshi

సెట్స్‌లో మహేశ్‌బాబు యాక్షన్‌ ఆరంభమైంది. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ముందు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది.

నెక్ట్స్‌ షెడ్యూల్‌లో పూజా హెగ్డే జాయిన్‌ అవుతారట. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక ‘అతడు (2005)’, ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో దాదాపు పన్నెండేళ్ల తర్వాత రూపొందుతున్న చిత్రం ఇది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top