SSMB 28 Update: త్రివిక్రమ్‌తో మహేశ్‌ సినిమా.. రిలీజయ్యేది అప్పుడే!

Mahesh Babu, Trivikram Srinivas Movie Release Date Locked - Sakshi

అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం రాబోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందించనున్నాడు. తాజాగా ఈసినిమా నుంచి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్‌ వదిలింది చిత్రబృందం. సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ అలాంటివి ఏమీ రిలీజ్‌ చేయకుండానే ఏకంగా విడుదల తేదీని ప్రకటించింది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ సినిమా రిలీజవుతున్నట్లు వెల్లడిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. కాగా ఇది మహేశ్‌కు 28వ సినిమా. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్‌ వినోద్‌ ఛాయాగ్రహణం అందిస్తుండగా నవీన్‌ నూలి ఎడిటింగ్‌ చేయనున్నాడు.

చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి
‘అమ్మానాన్నకు డేటింగ్‌ అంటే నచ్చదు, కానీ నాకు అలా కాదు’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top