తిరుమలకు కాలినడకన చేరుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌..! | Trivikram Srinivas Reached Tirumala On Foot with His Wife | Sakshi
Sakshi News home page

Trivikram Srinivas: కాలినడకన తిరుమలకు త్రివిక్రమ్‌

Jun 17 2024 9:35 PM | Updated on Jun 17 2024 9:35 PM

Trivikram Srinivas Reached Tirumala On Foot with His Wife

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తన భార్య సౌజన్యతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement