love story
-
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
తమిళ యాక్షన్ స్టార్ విశాల్( Vishal,), యువ నటి సాయి ధన్షిక(Sai Dhanshika)లు తమ పెళ్లి ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇక వారి గురించి రూమర్స్ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. కానీ..పుష్కరకాలం దాటిన ఈ జంట స్నేహం, ప్రేమగా విడదీయరాని బంధంగా మార్చిన సందర్భాలేమిటి? అంటే ఓ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దీని గురించి వివరాలు తెలియాలంటే.. దాదాపు ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.నటుడు–దర్శకుడు టి రాజేందర్ (టిఆర్ అని కూడా పిలుస్తారు) తమిళనాట సీనియర్ సినీ ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రేమసాగరం వంటి చిత్రాల ద్వారా మనకూ గుర్తోస్తారు. వయసు, అనుభవం ఎంత ఉంటే ఏం లాభం? పరిణితి లేనప్పుడు అన్నట్టుగా ఆయన గతంలో నటి సాయి దన్షిక విషయంలో ప్రవర్తించిన తీరు పూర్తిగా ఆక్షేపణకు గురైంది.తమిళనటులు కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయి ధన్షిక కీలక పాత్ర పోషించిన విజితిరు తమిళ చిత్రం 2017లో థియేటర్లలో వచ్చింది. ఈ చిత్రంలో టి రాజేందర్ అతిధి పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాట్లాడిన సాయి ధన్సిక తన ప్రసంగంలో వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పింది. అయితే నటి సాయి ధన్షిక తన పేరు మర్చిపోవడం టి.రాజేందర్ను తీవ్ర ఆగ్రహావేశాలకు అసహనానికి గురి చేసింది. దాంతో ఆమెను అదే వేదికపైనే చెడామెడా తిట్టిపోశాడు. ఆమె అప్పట్లో రజనీకాంత్ సినిమాలో (కబాలి) నటిస్తోంది కాబట్టి పొగరు పట్టిందంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు. అయితే ధన్షిక తాను టి రాజేందర్ను గౌరవిస్తానని పొరపాటున పేరు మర్చిపోయానని అందుకు క్షమించాలని కోరడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, టిఆర్ మాత్రం ఆగలేదు. తన తిట్ల పరంపరను కొనసాగించాడు పైగా సారీ అంటూ ధన్సిక చెప్పడాన్ని కూడా హేళన చేస్తూ ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. విషాదం ఏమిటంటే ఈ మాటలకు ఆమె సహనటులు సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం..అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించిన సాయి ధన్సిక, దీంతో తీవ్రంగా చలించిపోయింది. కన్నీటి పర్యంతమైపోతూ దానిని దాచడానికి విఫలయత్నం చేసింది. ఈ ప్రెస్ మీట్ ట్విట్టర్లో వైరల్ అయింది.ఈ కార్యక్రమంలో టి రాజేందర్ విచక్షణా రహిత ప్రవర్తన విషయంలో ధన్షికకు తన సహనటుల నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వేదికపై టిఆర్ ప్రవర్తనను ఖండించకుండా ఆస్వాదించిన మిగిలిన నటులు దర్శకుడు వెంకట్ ప్రభులపై కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఇది తెలుసుకున్న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్పిసి) అధ్యక్షుడు విశాల్ టి రాజేందర్ ప్రవర్తనను స్పష్టంగా ఖండించాడు ‘ధన్షిక క్షమాపణలు చెప్పినా, మిస్టర్ టిఆర్ ఆమెను లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను‘ అని విశాల్ అన్నాడు. అప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్గా కొనసాగుతున్న సాయి ధన్షిక, విశాల్లను ఆ సంఘటన మరింత దగ్గర చేసిందని, వారి బంధం మరింత బలపడిందని అంటారు. -
సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?
-
వినూత్న ప్రేమకథతో..
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తమ తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరలక్ష్మీ పప్పుల సమక్షంలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, దర్శకుడు భాను రూపొందించిన ఈ చిత్రం ఒక సరికొత్త ప్రేమకథతో యువతను ఆకట్టుకోనుంది. సామాజిక స్పృహ, సందేశాత్మక చిత్రాలకు పేరుగాంచిన భాను, మొదటిసారి స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజుల నాన్స్టాప్ షూటింగ్తో పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.జూన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువతను విపరీతంగా ఆకట్టుకునే ఐదు అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక పెద్ద సంగీత కుటుంభం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు, అలాగే ఒక కొత్త టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. డెబ్భై ఐదు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన ఒక అబ్బాయి, పదహారణాల తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్వాహణ మర్రి రవికుమార్. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ సంస్థ లో నిర్మాత కనకదుర్గారావు పప్పుల ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు. -
సినిమాని తలపించేలా ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి లవ్స్టోరీ..!
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది. తాను ఆంద్రప్రదేశ్లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్లో సవివరంగా వెల్లడించింది. చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Jaclyn Forero (@jaclyn.forero) (చదవండి: వెయిట్లాస్కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్గేట్స్ ఏమన్నారంటే..) -
స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్ స్టోరీ వైరల్!
గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్కు బ్రేకప్ చెప్పిన మలైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.కుమార్ సంగక్కరగా పాపులర్ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించు కున్నాడు. చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించిఅనూహ్యంగా క్రికెట్ కరియర్లోకి1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్గా, శక్తివంతమైన బ్యాక్హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర 1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్కు కోచ్గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్కు చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ, తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు.(సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)ప్రేమకథ ఎలా మొదలైందంటేసంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్వుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్తో సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యెహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమపక్షులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్రస్తుత సీజన్కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. -
సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు : శోభిత
-
నాగచైతన్య- శోభిత లవ్ స్టోరీ.. ఎలా, ఎక్కడ మొదలైందో తెలుసా? (ఫోటోలు)
-
'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా జరిగిపోయింది'.. శ్రియా శరణ్ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం టచ్లోనే ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.సోషల్ మీడియా వేదికగా తన భర్త అండ్రీ కొచ్చీవ్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. మార్చి 19న 2017లో మొదటిసారి అతన్ని కలుసుకున్నట్లు వెల్లడించింది. అనుకోకుండా ఓ రాంగ్ ఫ్లైట్.. ఓ డైవింగ్ ట్రిప్ వల్లే మేమిద్దరం ఒక్కటయ్యామని పేర్కొంది. అసలు మా ఇద్దరికీ ఎలా కుదిరిందో ఇప్పటికీ తెలియదని.. ప్రస్తుతం ప్రతిరోజు కలిసి నడుస్తున్నామని ఇన్స్టాలో రాసుకొచ్చింది. 2017 నుంచి 2025 వరకు తన భర్తతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను పోస్ట్ చేసింది. అలాగే తన ముద్దుల కూతురితో దిగిన ఫోటోను కూడా పంచుకుంది.కాగా.. శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడింది. ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి హాజరయ్యారు. -
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) -
ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు దారుడు, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) డైరెక్టర్గా నియమించారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషంగా నిలిచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఎవరీ అలెక్సీస్? వీరిద్దరి లవ్ స్టోరీ ఏంటీ అనే ఆసక్తి ఏర్పడింది. మరి ఆవివరాలేంటో చూసేద్దామా!ప్రమాణ స్వీకారం తర్వాత, పటేల్ ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబం,స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. వారి వల్లే తానిక్కడ ఉన్నానిని చెప్పాడు. అలాగే సోదరి నిషా మేనల్లుడు లండన్ నుండి వచ్చారని పేర్కొన్నాడు. తన అందమైన ప్రేయసి అలెక్సిస్ కూడా ఇక్కడే ఉంది అనగానే చప్పట్లు మారుమోగిపోయాయి. WATCH: Kash Patel's full remarks after being sworn in as FBI Director:"Anyone who thinks the American Dream is dead, look right here. You're talking to a first-generation Indian kid who is about to lead the law enforcement community in the greatest nation on God's Earth." pic.twitter.com/PQrCkme9az— Rapid Response 47 (@RapidResponse47) February 21, 2025కాశ్ పటేల్ (44) అక్టోబర్ 2022లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకెన్ అమెరికా టూర్లో అలెక్సిస్ (26)ను మొదటిసారి కలిశారు. ఇద్దరూ దేశభక్తులు, వారు సంప్రదాయవాద విలువలను ఇష్టపడ్డారు. అలా వారిద్దరి పరిచయం క్రమంగా బలపడింది. 2023లో డేటింగ్ ప్రారంభించారు.చదవండి: Maha Kumbh : పవిత్ర త్రివేణీ సంగమం వద్ద యాంకర్ సుమBirdFlu భయమేల చికెన్ను తలదన్నే గింజలు గుప్పెడు చాలుఅలెక్సీస్ వినాష్ విల్లేకు చెందిన గాయని, పాటల రచయిత్రి కూడా. అనేక స్వచ్ఛసంస్థలతో కలిసి పనిచేస్తోంది. 1999 నవంబర్ 3న ఆమె అర్కాన్సాస్లో పుట్టింది. అయితే ఆమె బాల్యం అంతా ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్లోనే గడిచింది. అమెరికా వచ్చిన తరువాత యూఎస్మీదే, అక్కడి సంగీతం మీద ఇష్టం ఏర్పడింది. బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో చదివి వ్యాపారం మరియు రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కేవలం 8 ఏళ్ల వయస్సులో తన మొదటి పాటను రాయడం విశేషం.విలియమ్స్-ముర్రే రైటింగ్ అవార్డు, ఎకనామిక్ క్రిటికల్ థింకింగ్ అవార్డులను గెలుచుకుంది. -
ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..
దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్ విమెన్ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్ దీక్షిత్. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్కి. ఇక వినోద్ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ సభ్యుడు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై 11, 1962న షీలా వినోద్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్ టిప్స్..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....) -
వరల్డ్ ఫేమస్ లవర్.. పుష్ప గాడు ప్రేమిస్తే అట్టా ఉంటది మరి
-
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్ల సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!
చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్ లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.కదిరి నరసింహా దేవాలయంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్ దేశం నుంచి మోహియార్ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్రవదన స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్ అనే పేరులు పెట్టుకుని ఆ అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
చెల్లెలు కలిపిన బంధం..ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ లవ్ స్టోరీ
ఆరు నెలల తర్వాత.. నా అభిప్రాయం చెప్పా.. ప్రపంచంలో ప్రతీజీవి తోడు కోరుకుంటుంది. ఆ తోడు కోరుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం కీలకం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యతలు అన్నింటిని సరిచూసుకుంటూ.. నచ్చిన జోడీని ఎంచుకోవడం, అదికూడా ఆకర్షణ కాకుండా జీవితంగా భావించి.. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకొని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంటే.. ఒక మహాయజ్ఞంలాంటిదే. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్– ప్రియాంక దంపతుల ప్రేమ వివాహంలో. నేడు (శుక్రవారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ కేకన్ తన ప్రేమ వివాహ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..– సాక్షి, మహబూబాబాద్నేను, ప్రియాంక ఒకరినొకరం ఇష్టపడిన విషయం ఇంట్లో తెలిసింది. కొన్నిరోజులు చర్చలు జరిగాయి. ముందుగా ప్రియాంక కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. కొంతసమయం తీసుకొని మా కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ, నేను కొన్ని ఆంక్షలు పెట్టాను. ఆ సమయంలో నేను సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్న. నేను సివిల్స్ సాధించిన తర్వాతే పెళ్లి అనుకున్నాం. విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకు, అటు ప్రియాంకకు చెప్పాను. నా ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. సివిల్స్ బాగా రాశాను. మంచి ర్యాంకు వస్తుందని చెప్పాను. అంతా సంప్రదాయం ప్రకారం లగ్నపత్రిక పెట్టుకున్నారు. పెళ్లికి 15 రోజుల ముందు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీఎస్కు సెలక్ట్ అయ్యాను. కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రియాంక ఫోన్లో అభినందనలు తెలిపినప్పుడు ఇద్దరి సంతోషం చెప్పలేను. ఆ తరువాత సంప్రదాయబద్ధంగా మా వివాహం జరిగింది. నేను అనుకున్నట్లు ఒకవైపు ప్రియాంకను, మరోవైపు ఐపీఎస్ను సాధించాను. ఇప్పటివరకు మా వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మా ఇద్దరికి తోడు మా బాబు విరాజ్. ముగ్గురం సంతోషంగా ఉన్నాం.అవగాహన లేకపోతే బంధం గుదిబండనే..మనిషికి మహిళ తోడు అవసరం. వివాహం అనేది అందరి జీవితంలో కీలక ఘట్టం. దీనికి ఆచితూచి అడుగులు వేయాలి. ప్రేమ అనేది ఒక ఆకర్షణ కావద్దు. ఇద్దరి బంధమనుకోవాలి. ఒకరి భావాలు మరొకరు పంచుకుంటూ ఒక అవగాహనతో వెళ్లాలి. లేకపోతే ఇరువురి కుటుంబ సభ్యులకు గుది బండగానే ఉంటుంది. ఇష్టపడటం, అనుకున్న ల క్ష్యాలను సాధించి తర్వాత వివాహం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. నేటి యువత ఈ దిశగా ఆలో చించాలి. కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది.నాన్న అంటే అందరికీ భయమే.. కానీ చెప్పక తప్పదు..ఒకవైపు చెల్లెలి ఫ్రెండ్. అప్పటికే ఆమె బీటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. నేను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నా. నేనంటే ఇష్టమని ప్రియాంక చెప్పడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యా. మొదట ఏమి చెప్పాలో తెలియలేదు. సివిల్స్ సాధనే నా లక్ష్యం. ఈ సమయంలో ప్రేమ ఏంది అనుకున్నా. నా అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం అడిగాను. ఆమె కూడా సరేనంది. మాది పెద్ద కుటుంబం. నాన్న అంటే ముగ్గురు అన్నలతోపాటు అందరికీ భయమే. కానీ, ఆయన మాత్రం మాతో సరదాగానే ఉంటూనే పద్ధతిగా ఉండాలని చెబుతారు.. ఇటువంటి పరిస్థితిలో ప్రియాంక ప్రపోజ్ చేసిన విషయం ఇంట్లో చెప్పలేను. అలా అని ఉండలేను. నాలోనే నేను ఆలోచనలో పడ్డా. ఆరు నెలల తర్వాత ప్రియాంకకు ఓకే అని నా అభిప్రాయం చెప్పాను.చెల్లెలు కలిపిన బంధంమా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో మా పిన్ని కూతురు అత్తగారి ఇల్లు ఉంటుంది. మా చెల్లి అంటే అందరికి ఇష్టం. ఆమెకు కూడా మేం అంటే ప్రాణం. అందుకోసమే తరచూ నేను అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మా చెల్లి దగ్గరికి తన స్నేహితురాలు ప్రియాంక వచ్చేది. చెల్లిని కలిసినప్పుడు ఒకరోజు ప్రియాంకను పరిచయం చేసింది. ఆమె కూడా సరదాగా మాట్లాడేది. కానీ, అది ప్రేమగా మారుతుందని అనుకోలేదు. చూస్తూ ఉండగానే ఒకరోజు నేనంటే ఇష్టమని నా చెల్లెలికి చెప్పింది. ఈ విషయం చెల్లి నాకు చెప్పేందుకు తడబడినా.. చివరకు చెప్పింది. -
ప్రేమించుకుందాం.. రా
తెలుగు చిత్రపరిశ్రమ(Telugu Film Industry) వెండితెర ప్రేమతో నిండిపోనుంది. అరడజనుకు పైగా ప్రేమకథలు(Love Story) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి... ప్రేమించుకుందాం.. రా! అంటూ వెండితెర కోసం ప్రేమలో పడిన నటీనటుల గురించి ఈ ప్రేమికుల దినోత్సవం(Valentine Day) సందర్భంగా మీరూ ఓ లుక్ వేయండి.సాగర్ లవ్స్ మహాలక్ష్మిసాగర్గా కాలేజీకి వెళ్తున్నారు రామ్. కాలేజీలో మహాలక్ష్మిని ప్రేమించాడు. మరి... సాగర్ లవ్ సక్సెస్ అయ్యిందా? అతని చదువు ఏమైంది? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్లో చూడాలి. రామ్ హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యూత్పుల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ సాగర్గా రామ్, మహాలక్ష్మీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్, భాగ్యశ్రీలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.నారీ నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిల ప్రేమలో శర్వానంద్ ఇరుక్కున్నారు. ఫైనల్గా ఏ అమ్మాయి ఈ హీరో ప్రేమను దక్కించుకుంది? అనే ప్రశ్నకు సమాధానం ‘నారీ నారీ నడము మురారి’ సినిమా చూసి తెలుసుకోవాలి. శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడము మురారి’. ‘సామజ వరగమన’ మూవీతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.యాక్షన్ లవ్ స్టోరీ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ వంటి లవ్స్టోరీ మూవీస్లో నటించి, ఆడియన్స్ను మెప్పించారు అక్కినేని అఖిల్. తాజాగా ఈ యంగ్ హీరో మరో లవ్స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించనున్న నెక్ట్స్ ఫిల్మ్లో అఖిల్ హీరోగా చేస్తున్నారని తెలిసింది.ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ యాక్షన్ లవ్స్టోరీ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందట. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని తెలిసింది. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లవ్వుకు లైఫ్ ఇద్దామా...‘లవ్వే లైఫ్ అందామా... లవ్వుకు లైఫ్ ఇద్దామా’ అంటూ తన లవ్ను సూపర్బ్గా ప్రపోజ్ చేశారు సందీప్ కిషన్. మరి... సందీప్ లవ్స్టోరీ సక్సెస్ అయ్యిందా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొని సందీప్ తన లవ్ను సాధించుకున్నారు? అన్నది ‘మాజాకా’ మూవీలో చూడాలి. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీ మూవీ ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో నటించారు.నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం, తండ్రి లవ్స్టోరీకి కొడుకు ఏ విధంగా హెల్ప్ చేశాడు? కొడుకు లవ్స్టోరీకి తండ్రి ఏ విధంగా సపోర్ట్ చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ‘మాజాకా’ మూవీ ఉంటుందని సమాచారం.ఇద్దరు అమ్మాయిల ప్రేమలో... ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎవర్నీ ప్రేమించడు. మరి... ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి ప్రేమకోసం ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ లవ్స్టోరీ మూవీ ‘హాష్ ట్యాగ్ సింగిల్’. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ముక్కోణపు ప్రేమకథ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ఈ ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ట్రయాంగిల్ లవ్స్టోరీగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.మాజీ ప్రేమికుల కథకొంత కాలం ప్రేమించుకుని, విడిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రేమికులు కలుసుకోవాల్సి వస్తే? కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే? ఎలా ఉంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘డెకాయిట్: ఏ లవ్స్టోరీ’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో విడిపోయిన ప్రేమికులుగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కనిపిస్తారు. ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత శ్రుతీహాసన్ను తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్లో మృణాల్ ఠాకూర్ ఫైనలైజ్ అయ్యారు. ప్రేమ బాధ భయంకరం‘ప్రేమ చాలా గొప్పది... కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది’’ అంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రేమకథా చిత్రం ‘దిల్ రుబా’ కోసమే కిరణ్ అబ్బవరం ఈ డైలాగ్ చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ లవ్స్టోరీ మూవీ ‘దిల్ రుబా’. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా, నాజియా డేవిసన్ మరో లీడ్ రోల్లో నటించారు. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. లవ్లో ఫెయిలై, మళ్లీ లవ్లో పడే ఓ కుర్రాడి కథగా ‘దిల్ రుబా’ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. అలాగే రవి నంబూరి అనే కొత్త దర్శకుడు తీస్తున్న లవ్ స్టోరీ మూవీలోనూ కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నట్లుగా తెలిసింది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారట.ప్రేమలో సంఘర్షణఓ కాలేజీ అమ్మాయి ప్రేమ, ఆ ప్రేమ కారణంగా ఆ యువతి ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమలో సంఘర్షణకు గురయ్యే అమ్మాయి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిడిల్ క్లాస్ లవ్స్టోరీమిడిల్ క్లాస్ బాయ్ లవ్స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ‘90స్’ వెబ్ సిరీస్తో ఆడియన్స్ను అలరించిన ఆదిత్యా హాసన్ డైరెక్షన్లో ఓ లవ్స్టోరీ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనుండగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.‘బేబీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ‘డ్యూయెట్’ అనే మరో లవ్స్టోరీ ఫిల్మ్ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన మిథున్ వరదరాజకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ప్రేమ తుఫాన్! ‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు’ అంటూ ఓ ఇంటెన్స్ లవ్ డైలాగ్ చెప్పారు హీరోయిన్ అనంతికా సనీల్కుమార్. ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో అనంతికా సనీల్ కుమార్, హను రెడ్డి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ ఇంటెన్స్ లవ్స్టోరీ సినిమాను నిర్మించారు.ప్రేమలో బ్రేక్ అప్ అయిన తర్వాత లైఫ్లో ఓ అమ్మాయి ఎలా మూవ్ ఆన్ అయ్యింది? అసలు ఆమె ప్రేమ ఎందుకు విఫలమైంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్, రెబ్బా ప్రగడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.తెలంగాణ లవ్స్టోరీ ‘నీది నాది ఒకే కథ, విరాటపర్వం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల నిర్మాతగా మారి, రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఖమ్మం–వరంగల్ సరిహద్దుప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ఇది. నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. వీరే కాదు... మరికొంతమంది హీరోలు–హీరోయిన్లు కూడా లవ్స్టోరీ మూవీస్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి.. హ్యాపీగా ఫీలయ్యా: శివ కార్తీకేయన్
ప్రతి వ్యక్తికి ఓ లవ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది ప్రేమలో సక్సెస్ అయితే..మరికొంతమందికి విఫలం అవుతారు. అయితే సక్సెస్ అయినా కాకపోయినా సరే ఫస్ట్లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకం. మొదటగా ప్రేమించిన అమ్మాయి/ అబ్బాయిని మర్చిపోలేం. అందరిలాగే తాను కూడా తన ఫస్ట్లవ్ని మర్చిపోలేనని అంటున్నాడు తమిళ హీరో శివకార్తీకేయన్(Sivakarthikeyan ). ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు శివకార్తికేయ. రీసెంట్గా ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన లవ్స్టోరీని చెప్పుకున్నాడు. తన ఫస్ట్లవ్ విఫలమైందని చెప్పారు. ‘కాలేజీ డేస్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాది వన్సైడ్ లవ్. ఆమెను కలిసి నా ప్రేమను వ్యక్తం చేయలేదు. కానీ దూరంగా చూస్తూనే ప్రేమించాడు. ఓ సారి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం చూశాను. అప్పటి నుంచి ఆమెను చూడలేదు. నా ప్రేమ విషయం చెప్పకుండానే విఫలం అయింది. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్లో ఆమెను మళ్లీ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తి కాదు. వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. అది చూసి ‘మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదు(నవ్వుతూ..)’ అని సంతోషించాను’ అని శివకార్తీకేయ తన ఫెల్యూర్ లవ్స్టోరీని చెప్పుకొచ్చాడు.కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.సినిమాల విషయానికొస్తే.. శివ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకు ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తీకేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మాఫియా డాన్తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?
ఒకప్పుడు బాలీవుడ్లో మాఫియా డాన్ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్తో ప్రేమలో పడి కెరీర్ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్కి మారారు.డాన్తో ప్రేమలో..మోనికా బేడి కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్లో బిజినెస్ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.ఐదేళ్లు జైలు శిక్ష!అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్తో పరిచయమే ఆమె కెరీర్ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది. తెలుగులోనూ సినిమాలు..శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. షారుఖ్, సల్మాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది. హిందీ బిగ్బాస్ సీజన్ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. View this post on Instagram A post shared by Monica Bedi (@memonicabedi) -
నమ్మించి నట్టేట ముంచిన కండక్టర్
కర్ణాటక: బస్సు కండక్టర్ యువతికి టికెట్ ఇస్తూ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడునెలలకే ముఖం చాటేశాడు. వివరాలు.. ఎంఎస్ పాళ్య బీఎంటీసీ డిపోకి చెందిన కండక్టర్ కం డ్రైవర్గా పని చేస్తున్న మంజునాథ్.. రోజు ఎంఎస్ పాళ్య నుంచి యలహంకకు బస్సును నడిపేపాడు. ఆ బస్సులో ప్రయాణించే యువతికి టికెట్ ఇస్తూ మాటలు కలిపాడు. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్న సంగతి చెప్పకుండా, ప్రేమ అంటూ యువతి వెంటపడి ఒప్పించాడు. ఇద్దరూ జాలీ ట్రిప్లకు వెళ్లేవారు. కండక్టర్ ప్రవర్తన సరిలేదని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. కానీ మంజునాథ్ మాయలో పడిన యువతి వివాహం చేసుకొంది. మొదటి పెళ్లాంతో నెలమంగలలో కుటుంబం ఉందని తెలిసి యువతి భర్తని నిలదీసింది. దీంతో నువ్వు నాకు వద్దంటూ అతడు దూరం పెట్టాడు. మూడునెలల గర్భంతో ఉన్న యువతి.. అన్యాయం జరిగిందంటూ పోలీస్ కమిషనర్, మహిళా సహయవాణికి ఫిర్యాదు చేశారు. తనకు భర్త కావాలి. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలంటూ యువతి డిమాండ్ చేసింది.అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని.. -
పాకిస్తాన్ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి
లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్ బాబు(30) కథ ఇది. పాక్ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్ఎఫ్ జవాన్లు ఖఖర్ పోస్ట్ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్లోని మండి బహాఉద్దీన్ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై పారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్ అధికారులు వెల్లడించారు. -
‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..
ప్రేమ గుడ్డిదని, అది చిగురించినప్పుడు సరిహద్దులు కనిపించవని అంటారు. ఇది ‘బాబు’ ప్రేమకథతో మరోమారు నిజమని తేలింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చెందిన బాబు తాను ప్రేమించిన పాక్ యువతి కోసం సరిహద్దులు దాటి, తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.బాబు సోషల్ మీడియా(Social media)లో చూసి, ఒక పాక్ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనే ప్రేమలో పడిన బాబు ఆ యువతి కోసం వీసా, పాస్పోర్టు లేకుండా దేశ సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ప్రేమికుని అసలు పేరు బాదల్, అయితే బాబు అని ముద్దుగా ఇంట్లోనివారు పిలుస్తుంటారు. ఇప్పుడు అతని కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాబును సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.అలీగఢ్ జిల్లా బార్లా పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ అలియాస్ బాబు(30) సోషల్ మీడియాలో చూసి, ఒక పాక్ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమలో బాబు ఎంతగా మునిగిపోయాడంటే.. వెంటనే ఇంటిని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరైన వీసా, పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాడు. పాకిస్తాన్లోని మోజా మోంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన బాబును పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024, డిసెంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసుల విచారణలో బాదల్ తాను సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ యువతి ప్రేమలో పడ్డానని, ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చానని చెప్పాడని సమాచారం.బాదల్ ఢిల్లీలోని గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబంలోని ముగ్గురు సోదరులలో అతను రెండవవాడు. బాబు ఓ పాకిస్తానీ యువతితో ఫేస్బుక్లో చాట్ చేస్తుంటాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపావళికి ముందు బాబు ఇంటికి వచ్చాడని, తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు తన గుర్తింపు కార్డు(Identity card), ఇతర పత్రాలను ఇంట్లో పెట్టి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి బాబుకు సంబంధించిన సరైన సమచారం అందలేదన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ పోలీసులు.. బాబును వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు, అతను ఏమీ చూపించలేదు. దీంతో అతను పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 13, 14 కింద అరెస్టయ్యాడు. కాగా బాబు గతంలో రెండుసార్లు భారత్-పాక్ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడని, అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదని పాక్ పోలీసులు చెబుతున్నారు.బహౌద్దీన్ ప్రాంతంలో పట్టుబడిన బాబును అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాబు పాక్లోకి ప్రవేశించడం ప్రేమ కోసమేనా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి కానీ, భారత రాయబార కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా తమ బాబు తమ ఇంటికి వస్తాడని అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆలయాల్లో నూతన సంవత్సర సందడి -
OTT: జీవితం అర్థం చెప్పే ప్రేమకథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కథా ఇన్నూవరే’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రేమ..ఈ భావం మనిషికి మనసుకి ఓ మధురానుభూతి. మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ఈ ప్రేమ ప్రతి దశలోనూ ఉంటుంది. ఆ మహత్తరమైన ప్రేమను వెండితెరకు తీసుకురావడానికి తరతరాలుగా ఎంతో మంది దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు విష్ణుమోహన్ ఓ చక్కటి ప్రేమ పంధాను ఈ సినిమాకోసం ఎంచుకున్నారు. మళయాళ దర్శకుడైన విష్ణుమోహన్ సినిమాలన్నీ చాలా వరకు సున్నితమైన భావావేశాలతో రూపొందించబడ్డాయి. అటువంటి కోవలోనే ప్రస్తుతం ఈ సినిమా కథా ఇన్నూవరే కూడా తీశారు. ఓ నాలుగు ప్రేమ కథలు ఒకే కథగా కథా ఇన్నూవరే..(ఇప్పటి వరకు కథ) సినిమాలో చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు విష్ణుమోహన్. 2018 సంవత్సరంలో ప్రముఖ హీరో రాణా నిర్మాతగా తెలుగులో ఓ సినిమా తీశారు. దాని పేరే C/o కంచరపాళెం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అఫీషియల్ గా నామినేట్ అయింది. ఈ సినిమా రీమేకే ఇప్పటి కథా ఇన్నూవరే. ఇక కథ విషయానికొస్తే కొంచెం లేటు వయస్సులో ఉన్న రామచంద్ర తాను ఫ్యూను గా పనిచేస్తున్న ఆఫీసులో ఆఫీసరైన జానకి ప్రేమలో పడతాడు. జానకి కి 20 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఇంకో పక్క కాలేజీలో చదువుకునే ఉమ కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం పని చేసే జోసెఫ్ ని ఇష్టపడుతుంది. ఉమ తండ్రికి ఈ విషయం అస్సలు నచ్చదు. మరో పక్క నశీమా అనే వేశ్యను లిక్కర్ షాపులో పని చేసే రామచంద్రన్ ప్రేమిస్తుంటాడు. ఈ మూడు కథలతో పాటు బొమ్మలు తయారు చేసే ఓ శిల్పి కొడుకు స్కూల్ లో మరో అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ నాలుగు ప్రేమ కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధముండదు. అయితే వాటిని లింక్ చేసేది మాత్రం ప్రేమే. అలాగే ఈ సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్. మామూలుగా అయితే ప్రేమ కథలను చూసి అనుభూతి పొందుతాం. కాని ఈ సినిమాలో ప్రేమ మాత్రం జీవితానికి అర్ధం చెప్తుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా కథా ఇన్నూవరే స్ట్రీమ్ అవుతోంది. వర్త్ ఫుల్ మూవీ ఫర్ ఎ ఫీల్ గుడ్ వ్యూవర్స్.-ఇంటూరు హరికృష్ణ -
Atal Bihari Vajpayee: చదవని ప్రేమలేఖ
అటల్ బిహారీ వాజ్పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్లా ఉండిపోయారు.ఎవరీ హస్కర్? కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్కుమారీ హస్కర్ వాజ్పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్గా మారి వాజ్పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్ను చూసి వాజ్పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్ను వాజ్పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు. ‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటర్మీడియట్ ప్రేమను రివీల్ చేసి షాక్ ఇచ్చిన రాజమౌళి
-
నాగ చైతన్య... శోభితా లవ్ స్టోరీ..
-
సినిమా కథలా జాకీర్ హస్సేన్ ప్రేమ వివాహం
ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.ఆ సమయంలో జాకీర్కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్నేమ్తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
కాకినాడ జిల్లాలో ప్రియురాలి మృతికి కారణమైన ప్రియుడు
-
అసలు వీరిద్దరి మధ్య లవ్ స్టోరి ఎప్పుడు స్టార్ట్ అయింది?
-
బుమ్రా లవ్ జర్నీ ఎలా మొదలైందంటే..
-
సినిమా రేంజ్ ట్విస్ట్ స్క్రీన్ షార్ట్స్ బయటపెట్టిన లావణ్య
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలనం
-
కీలక ఆధారాలతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ లవర్
-
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ
తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్కు చెందిన మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు. -
నటి హేమ లవ్ స్టోరీ.. ఇంతకీ భర్త ఎవరో తెలుసా?
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. అయితే ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మొదటి తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.ఇదంతా పక్కనపెడితే.. టాలీవుడ్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందలకు పైగా సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది. ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది. హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే హేమ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ అతనెవరో తెలుసా? ఆ వివరాలేంటో చూసేద్దాం.నటి హేమ లవ్ స్టోరీతూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. తెలుగులో 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్కు పరిచయమయ్యారు. అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.. శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ. ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ కాగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది. తాను దూరదర్శన్లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది. అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్గా పనిచేసేవారని వెల్లడించింది. ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానని హేమ వివరించింది. కాగా.. వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో హేమ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. -
Sunil Chhetri Love Story: ‘చిన్నపిల్లవి చదువుకో అని చెప్పాను.. కానీ నా మనసే వినలేదు’
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్బాల్ కెప్టెన్గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.అయితే, తన మెసేజ్లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.నా కెరీర్తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈ విషయం గురించి మా కోచ్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు. -
సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. రైలులో మొదలై..
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్ మోదీ, జెస్సీలు 1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి వారి వివాహానికి హాజరయ్యారు. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్ మోదీ గెలుపొందారు. సుశీల్ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్గా పనిచేశారు. -
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
సరికొత్త ప్రేమ కథ
ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురం’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేష్ చికిలే మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్స్టోరీ ‘మధురం’. సరికొత్త ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టినట్లు మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే టీనేజ్ లవ్స్టోరీ ఇది. నా పాత్ర ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు ఉదయ్ రాజ్. ‘‘మా మూవీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు యం. బంగార్రాజు. ఈ సినిమాకు సంగీతం: వెంకీ వీణ. -
ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024 -
ఏ సినిమా ప్రేమలు... ఎవరి స్టయిల్ వారిదే!
ప్రేమించడం నిజజీవితంలో కాస్త అరుదే. అక్కడెవరో వాళ్లెవరో ప్రేమించారట, ఇక్కడెవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అంటూ వినడం తప్ప వాస్తవంలో ప్రేమ అందరికీ అంతగా అనుభవంలోకి రాదు. (కాపోతే కాలేజీల్లో విరివిగా కనిపించినా... చదువు ముగిసేనాటికి, మురిగిపోయే జస్ట్ సీజనల్ ప్రేమలవి). సినిమాల్లో అలా కాదు. ప్రతి మూవీలోనూ ప్రేమ ఉండనే ఉంటుంది. పట్టుబట్టి విషాదాంతం తీయాలని భీష్మించుకుంటే తప్ప... హీరో, హీరోయిన్ల ప్రేమ ఫలించి తీరుతుంది. విచిత్రం ఏమిటంటే... హీరోను బట్టి లేదా దర్శకుడిని బట్టి వారి వారి ప్రేమలకూ ఓ శైలి ఉంటుంది. హీరో మ్యానరిజంలాగా అదీ ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ సినిమాల్లో అంతా జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రేమ. అక్కినేని వారి ప్రేమల్లా ఇక్కడ సంక్లిష్టతలుండవు. కాకపోతే అలనాటి గుండమ్మకథలో ‘కోలుకోలోయమ్మ కోలో నాస్వామి’ అంటూ పాడుతూ... ‘హేయ్ బుల్లెమ్మా...’ ‘ఓయ్ బుల్లెమ్మా’ అంటూ అరుపులు అరిచినా... ఆ తర్వాత ‘త్తిఖ రేగీ థిమ్మిరెఖ్ఖీ’ అంటూ యమగోల చేసినా... అప్పటి అరుపులతో ఇప్పుడు నడుం మీద చరుపులూ కనిపిస్తాయి. వెరసి అవి... దట్టంగా, దిట్టంగా మిళాయించిన మసాళాలా, గ్యాసెక్కువైన సోడాలా ఘాటుగా నాటుగా ఉంటాయంతే. ఎన్టీఆర్ ప్రేమలన్నీ దాదాపుగా ఒక హీరోయిన్తోనే... సిక్స్ లేన్స్ హైవే మీద ఎదురెవ్వరూ రాని ట్రాఫిక్లా సాఫీగా, హాయిగా సాగిపోయే ప్రేమలే. ఇక ఏఎన్నార్ దగ్గరికి వస్తే ఆయన సినిమా ప్రేమలన్నీ సంక్లిష్టంగా ఉంటాయ్. ఆయన ఎవరినో ప్రేమిస్తాడు... హీరోయిన్ కూడా యథాశక్తి ఏఎన్నార్ను లవ్ చేస్తుంది. కానీ మరెవరో సెకండ్ హీరోయిన్ కూడా నాగేస్రావ్నే లవ్ చేయడంతో... కుటుంబంకోసమో, చెల్లెలి ప్రేమ కోసమో... తప్పనిసరి పరిస్థితుల్లో అక్కినేని కూడా ఆమెనే ప్రేమించాల్సొస్తుంది. అంతే...! పాపం అక్కడో ఓ త్రికోణ ప్రేమ ఏర్పడటంతో త్రికోణమితి సూత్రాలూ, లెక్కలూ సినిమాలోకి వచ్చేసి ఈక్వేషన్లను చిక్కుముడుల్లా సంక్లిష్టంగా మార్చేస్తుంది. దాంతో ప్రేక్షకులు కూడా ఆ బెర్ముడా ట్రయాంగిల్లో చిక్కి... పాపం గిలగిల్లాడతారు. జామెట్రీ భాషలో చె΄్పాలంటే ఎన్టీఆర్వన్నీ సరళరేఖ ప్రేమలూ... ఏఎన్ఆర్ వన్నీ ట్రిగనామెట్రీ లెక్కలూ!! శోభన్బాబువి కూడా ఇంచుమించూ త్రికోణమితులేగానీ... ఆయన మనసు మరీ విశాలం కావడంతో ఇద్దరు హీరోయిన్లనీ మితిమీరి సమానంగా ప్రేమిస్తాడు. వారిద్దరి ప్రేమల్నీ తన మనసు సున్నితపు త్రాసులో సమానంగా తూస్తాడు. అద్దిగ్గో... అక్కడొస్తుంది కథలో బలం. నిజానికి ట్రిగనామెట్రీలన్నీ శోభన్బాబువే. నిజం చె΄్పాలంటే ఏఎన్నార్వి ‘సుడిగుండాలే’! ఇక సూపర్స్టార్ కృష్ణ ప్రేమలు కూడా దాదాపు ఎన్టీఆర్ ప్రేమల్లా స్ట్రెయిట్గా ఉంటాయి. కాకపోతే హీరోయినే ప్రేమించి ప్రేమించి పైపైన పైపైన పడిపోతుంటుంది. ఈమె తప్పనిసరిగా విలన్ కూతురే అయి ఉంటుంది. అంతగా పైపైన పడిపోయినందుకు కృష్ణ కూడా రుణం ఉంచుకోడు. పరిహారంగా డ్యూయెట్లలో ఈయన కూడా ఏదో ఓ టైమ్లో ఆమె ఎద మీద తలవాల్చి బదులు తీర్చుకుంటాడు. ఆ దృశ్యమే వాల్పోస్టర్గా మారి ప్రేక్షకుల్ని సినిమాకు ఆహ్వానిస్తుంది. చిరంజీవి హీరోయిన్ల తీరు కూడా ఇంచుమించూ సూపర్స్టార్ కృష్ణ స్టైల్లోనే ఉంటది. ఈయన కూడా కృష్ణలాగే హీరోయిన్ను ‘హేయ్ తింగరిబుచ్చి’ అంటూ తీసిపారేస్తూనో... ‘చెయ్యి చూశావా.. ఎంత రఫ్గా ఉందో’ అంటూ సరదా బెదిరింపులతో సందడి చేస్తుంటాడు. చిరంజీవి బెదిరిస్తాడు. హీరోయిన్ ప్రేమకోసం దేబిరిస్తుంది. ఇంకో విశేషం... చిరంజీవి సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే వాళ్లిద్దరూ తమ శక్తికొద్దీ హీరోని ప్రేమించినప్పటికీ... ఏఎన్నార్, శోభన్బాబు ప్రేమల్లోలా ఇక్కడ సంక్లిష్టతలుండవ్. ఆ ఇద్దరి ప్రేమలూ గ్లామర్ కోసమే. కాబట్టి ఈ ప్రేమల్లో సంఘర్షణలూ ఉండవు. ఇవన్నీ అందంగా చెదిరిపడ్డ సరళరేఖలే కావడంతో ప్రేక్షకులు అదిరిపడ్డానికి ఆస్కారాలుండవ్. ∙∙ హీరోల ప్రేమలకే కాదు... తెర మీద ప్రేమను చూపడంలోనూ దర్శకులకూ ఓ స్టైలుంటుందీ, ఓ మేనరిజముంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్ ప్రేమలన్నీ చాలా ఉదాత్తంగా ఉంటాయ్. నిజజీవితంలో ఏ హీరోయిన్లు కూడా ప్రవర్తించనంత ఉన్నతంగా ఉంటాయ్. అంతెందుకు... మన జీవితాల్లో మన చెల్లెలికో, మన కూతురికో విశ్వనాథ్ సినిమాలో లాంటి హీరో సంబంధం వస్తే స్ట్రెయిటవే వద్దనేస్తాం. అలాంటి హీరోకి మనింటి ఆడబిడ్డనివ్వం. డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాలకు వద్దాం. ఇక్కడ ప్రేమలన్నీ ఫ్రూట్ జ్యూసులంత మధురంగా, పండ్లు తింటే సమకూరేంత ఆరోగ్యంగా నవనవలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూయెట్లలో!. అప్పటిదాకా తీసిపారేసే హీరో కూడా... హీరోయిన్ ఎద మీద నడుములిరిగిపోయినట్టు వాలిపోయినట్టే... నడుములిరగకపోయినా ప్రేక్షకులూ ఆమె మీద అంతే మోతాదులో మనసు పారేసుకుంటారు. ∙∙ హీరో హీరోయిన్లకు తోడు, సపోర్టింగ్ క్యారెక్టర్లూ మేమూ ఉన్నామంటూ తగుదునమ్మా అంటూ వచ్చేస్తారు. వాళ్లూ హీరోయిన్ని ప్రేమిస్తారు. హీరోయిన్ దక్కాల్సింది హీరోకే కదా. అందుకే ప్రేమించిన పాపానికి... పాపం వాళ్లు తగిన మూల్యం చెల్లించి శంకరగిరి మాన్యాలకు ట్రైన్ టిక్కెట్టు అడ్వాన్సు బుకింగ్ చేయించుకుంటారు. అందరికీ తెలిసినా క్లైమాక్స్ వరకూ వాళ్లకా విషయం తెలియకపోవడమే ఇక్కడ విశేషం. ఉదాహరణకు... మాయాబజార్లో లక్ష్మణకుమారుడైన రేలంగి కూడా శశిరేఖ సావిత్రి మీద మనసు పడతాడు. కానీ నాగేస్రావ్కే కదా సావిత్రి దక్కాల్సిందీ! కాబట్టి... దర్శకుడు రేలంగిని ముప్పుతిప్పలు పెట్టిస్తాడు. చేతులు ఠక్కున అంటుకుపోవడంతో... చప్పట్లు కొట్టడానికి కూడా జంకేలా భయపడతాడు. పులిని చూసినట్టు భయపడటమనేది రేలంగికి నిజంగానే అనుభవంలోకొస్తుంది. అప్పుడు రేలంగైనా అంతే... ఇప్పుడు అదుర్స్లో బ్రహ్మానందానికైనా ఇంతే. సినిమాలు మారతాయి. హీరోలూ, హీరోయిన్లలో కొత్త తరాలు వస్తాయి. కానీ ప్రేమమాత్రం అజరామరంగా ఉండిపోతుంది. కాకపోతే ఒకనాటి పాత సినిమాల్లో ప్రేమ ఉదాత్తంగా ఉంటుంది. ఈ తర్వాత చిరంజీవి నాటి మధ్యయుగాల్లో కాస్త రఫ్గా ఉన్నా సరదా సరదాగా ఉంటుంది. ఇక ఈ తరం అర్జున్రెడ్డిలకు వచ్చేసరికి అప్పటి మేన్లీ మేన్ కాస్తా... ఇంకాస్త హార్ష్ అండ్ పవర్ఫుల్ అవుతాడు. యాంగ్రీయంగ్ కాస్తా యానిమల్ అయిపోతాడు. సినీ విమర్శకులంతా డార్విన్లాగా వచ్చేసి... పరిణామక్రమంలో ఆల్జీబ్రాలూ, ఆల్ కెన్ బి అఛీవ్డ్ బై హీరోలనే ఆ ధీరోదాత్తులు తమకు ఉన్న టైటిల్లోని ఉదాత్తత కోల్పోయి... ఆల్ఫా మేల్స్గా యానిమల్స్గా ప్రవర్తిస్తుంటారని సెలవిచ్చేస్తారు. హీరోయిన్లు మాత్రం అప్పుడూ ఇప్పుడూ డిల్లమొహాలేసుకుని, తెల్లబోతూ, జెల్లకొట్టే ఆ హీరోనే అనాదిగా, అనంతంగా, ఆత్రంగా అలా ప్రేమిస్తూనే ఉండిపోతారు. – యాసీన్ -
కోనసీమ ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్!
సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'ఐ హేట్ లవ్'. నేనూ ప్రేమలో పడ్డాను అనేది ఉప శీర్షిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారు. అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు' అని అన్నారు. నిర్మాత డాక్టర్ బాల రవి మాట్లాడుతూ కథ పరంగా ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించామన్నారు. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా అంత ప్రశాంతంగా చూడవచ్చని తెలిపారు. దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ..' గోదావరి జిల్లా యాసతో పూర్తిగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఇది యూత్ను బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ. పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది, మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏస్కేఎల్ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ కాబోతుంది అన్నారు. Presenting the Heart Touching #IHateLove movie trailer out now on @MadhuraAudiohttps://t.co/61HjC0Frbt#subbumudunuri #srivalli #Sagar #raviartproductions @Venkateshvi @prmusicdirector pic.twitter.com/XTj9gas1pk — Madhura Audio (@MadhuraAudio) February 8, 2024 -
సుధా-నారాయణమూర్తి లవ్ స్టోరీ: పెళ్లికి తండ్రి నో....చివరికి పెళ్లి ఖర్చు కూడా!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుంటారు. ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి రిటైర్డ్ చైర్పర్సన్ సుధామూర్తి కూడా చాలామందికి ఇన్సిపిరేషన్. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్గా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధా మూర్తి మూడుముళ్ల బంధంలో ఒక్కటైనారు. అయితే అన్ని విషయాల్లో గుంభనం, దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, భోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్దంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగానే జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలున్నప్పటికీ, ఒకరిపై మరొకరు నమ్మకం వారి ప్రేమను శాశ్వతం చేసింది. పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిరువురం కలుసుకున్నామని జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పూణే బ్రాంచ్లో టెల్కోగా పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ , ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. ఈ బృందంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ నారాయణ ఆమెను ఒప్పించారట. అలాగే ప్రసన్న దగ్గరినుంచి చాలా పుస్తకాలను తీసుకోవానే వారట సుధ. ఆ పుస్తకాలపై ఎక్కువగా నారాయణమూర్తి పేరు ఉండేదట. అలా తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది.. ముఖ్యంగా ఆయనలోని వినయం, ముక్కు సూటిగా ఉండే తత్వం తననను ప్రేమలో పడేసిందని ఆమె చెప్పారు. ‘‘నా పొడవు 5'4" పొడవు ఉన్నాను . దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను నా జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేను,నేను మీకు ఏ సంపదను ఇవ్వలేను. మీరు అందంగా ఉన్నారు. పైగా తెలివైనవారు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగారట నారాయణమూర్తి. పెళ్లి ఖర్చు సమంగా పంచుకున్నాం రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నారాయణమూర్తి మొదట్లో వీరిద్దరి వివాహాన్ని సుధ తండ్రి వ్యతిరేకించారు. జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు అని సుధ తండ్రి అడిగితే, కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథాశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని మూర్తి చెప్పారట. దీంతో ఆయన ససేమిరా అన్నారట. చివరికి 1977 చివరిలో నారాయణ పాట్నీ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా జాయిన్అయిన తరువాత మాత్రమే ఆయన అంగీకరించారు. అమెరికా వెళ్లే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మేరకు వబెంగుళూరులోని నారాయణ ఇంట్లో కుటుంబ సన్నిహితుల పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు. అలా తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తు చేసు కున్నారు. అంతేకాదు ఆనాటి తమ పెళ్లి ఖర్చును ఇద్దరమూ సమానంగా పంచుకున్నామని సుధామూర్తి వెల్లడించారు. ఒక్కొక్కరు రూ.400 చొప్పున మొత్తం పెళ్లి ఖర్చు రూ.800 అయిందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్న నారాయణమూర్తి కూడా . తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధ్యతరగతి నేపథ్యం తాము ఎక్కువగా ఆటోలోనే ప్రయాణించే వారమంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నడ రాని డ్రైవరున్న ఆటోలో తాము కన్నడలోమాట్లాడుకుంటూ తమ జీవితంలో కీలక మైన విషయాలను షేర్ చేసుకున్నట్టు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో పూణేలో తన సహచరులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలన్న తన భర్త కల సాకారం కోసం 10 వేల రూపాయలను సుధామూర్తి అప్పుగా ఇచ్చారు. అదే ఆ తరువాత కోట్లాది రూపాయల విలువ చేసే దేశంలో అనే అత్యున్నత ఐటీ సంస్థగా అవతరించింది. అలాగే ఇటీవల తన భార్య సుధ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని మరీ నారాయణ మూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. -
ప్రశ్నించేవారికి షరతు విధించిన సీమాహైదర్!
పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్ ప్రతిరోజూ హెడ్లైన్స్లో కనిపిస్తుంటుంది. ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్కు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది. సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది. సచిన్, సీమా హైదర్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్ల వీడియో వైరల్గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది. తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీమా హైదర్ ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు. -
మామూలోడు కాదు.. పక్కా మోసగాడు
-
యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యూట్యూబర్
-
Love Story: పాక్ యువతితో ప్రేమ.. భారత్లో అడుగుపెట్టిన జావెరియా
ఢిల్లీ: ఇటీవల కొన్ని ప్రేమలు దేశాలు దాటుతున్నాయి. ఒక దేశానికి చెందిన యువతి/యువకుడు.. మరో దేశానికి చెందిన వారితో ప్రేమలో పడటంతో వారు అక్కడికి వెళ్లడం పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. తన తల్లి మొబైల్లో ఉన్న ఓ యువతి ఫోటోను చూసి మనసు పడ్డ ఓ యువకుడి లవ్స్టోరీ ఇది. వీరి ప్రేమకథ 2018లో మొదలైంది. ఇక్కడ అమ్మాయిది పాకిస్తాన్, అబ్బాయిది భారత్కు చెందిన కోల్కత్తా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం.. కోల్కతాకు చెందిన సమీర్ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, భారత్కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. #WATCH | Amritsar, Punjab: A Pakistani woman, Javeria Khanum arrived in India (at the Attari-Wagah border) to marry her fiancé Sameer Khan, a Kolkata resident. She was welcomed in India to the beats of 'dhol'. She says, "I am extremely happy...I want to convey my special thanks… pic.twitter.com/E0U00TIYMX — ANI (@ANI) December 5, 2023 ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్ వీసా దక్కింది. అమృత్సర్ నుంచి కోల్కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక, మంగళవారం వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అడుగుపెట్టిన పాక్ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. వచ్చే జనవరిలో ఇరువురి వివాహం జరగనుంది. -
పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా వస్తోన్న "ఏ చోట నువ్వున్నా"!
ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరో, హీరోయిన్స్గా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రానికి పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..' దర్శకుడు పసలపూడి కథ చెప్పినపుడు చాలా బాగా అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నటీనటుల కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్లను సెలెక్ట్ చేసుకున్నాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.' అని అన్నారు. -
అతను నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్ రాజ్పుత్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్కి పరిచమైంది హీరోయిన్ పాయల్ రాజ్పుత్. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్లో భారీ హిట్ అందించిన ‘ఆర్ఎక్స్ 100’ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: హీరో విజయ్ విడాకుల రూమర్స్.. లియో నటి ఏమందంటే?) వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్స్టోరీని వెల్లడించింది పాయల్. మీ క్రష్ ఎవరనే ప్రశ్నకు పాయల్ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్ డేస్లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్ క్లాస్ ఎండింగ్లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను. (చదవండి: నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!) కానీ అతను నా లవ్ ప్రపోజ్ని రిజెక్ట్ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది’అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ. ‘మంగళవారం’ షూటింగ్ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఎమోషనల్ అయింది. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే తనకు కిడ్నీ సమస్యల ఏర్పడిందన్నారు. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి అని పాయల్ విజ్ఞప్తి చేశారు. -
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్లాక్తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
ఆ సినిమాతోనే నేను జ్యోతిక లవ్ లో పడ్డాం
-
యూత్ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
షారుక్ ఖాన్ లవ్ స్టోరీ.. ఇంటిపై రాళ్లదాడి.. పెళ్లికి నో చెప్పిన గౌరీ!
ప్రేమకు, అట్రాక్షన్కు తేడా తెలియని వయసులో ప్రేమించుకున్నారు. కానీ వారికి తెలియకుండానే పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. మరీ ముఖ్యంగా షారుక్ ఖాన్! ఇదంతా అయ్యే పని కాదనుకుందో.. మరేంటో కానీ గౌరీ సడన్గా అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊపిరాడట్లనైంది షారుక్కు. తనకోసం ముంబై అంతా గాలించాడు. ప్రేయసి కళ్లముందుకు రాగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది. తనను హత్తుకున్నాడు. జీవితంలో చేయి వదలనన్నాడు. అదే మాట మీద నిలబడ్డాడు కూడా! త్వరలో (అక్టోబర్ 25న) షారుక్- గౌరీల పెళ్లి రోజు రాబోతోంది. ఈ సందర్భంగా వారి ప్రేమకహానీని ఓసారి గుర్తు చేసుకుందాం.. 18 ఏళ్లకే లవ్.. అది 1984.. అక్కడ పార్టీ జరుగుతోంది. మేం వయసుకు వచ్చాం అంటూ కుర్రాళ్లు హంగామా చేస్తున్నారు. అందులో షారుక్ కూడా ఉన్నాడు. అప్పుడతడి వయసు 18 ఏళ్లు. ఆ పార్టీలో అతడి కళ్లంతా ఒక అమ్మాయి మీదే ఉన్నాయి. ఎవరా అమ్మాయి? అని తన స్నేహితుడిని అడిగాడు. అతడు కనుక్కుని వస్తానని చెప్పి ఏకంగా ఆ అమ్మాయితో డ్యాన్స్ కూడా చేసి వచ్చాడు. ఆమె తన బాయ్ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోందని షారుక్ ఆశలపై నీళ్లు చల్లాడు. వేరే అబ్బాయిలతో మాట్లాడితే తట్టుకోలేని షారుక్ ఇంతకీ అక్కడున్న అమ్మాయి ఎవరో కాదు గౌరీ ఖాన్. తన వయసు 14 ఏళ్లు. తను ఎదురుచూస్తోంది బాయ్ఫ్రెండ్ కోసం కాదు, తన సోదరుడి కోసం.. కాకపోతే అప్పట్లో అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడేది. ఎవరు పలకరించినా నవ్వుతూనే మాట్లాడేది. తొలి చూపులోనే షారుక్కు తెగ నచ్చేసింది. అక్కడ మొదలైంది వారి పరిచయం. షారుక్ మాటతీరు, నడవడిక గౌరీకి కూడా నచ్చేసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ షారుక్కు పొజెసివ్నెస్ ఎక్కువ. గౌరీ వేరే అబ్బాయిలతో చనువుగా మాట్లాడితే తట్టుకోలేకపోయేవాడు. వద్దని వారించేవాడు. పిచ్చోడిలా బీచ్ల వెంట తిరిగిన హీరో ఈ ప్రవర్తన తట్టుకోలేకపోయిన గౌరీ ఖాన్ ఈ రిలేషన్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంది. షారుక్కు చెప్పకుండా ముంబై వెళ్లిపోయింది. ప్రియురాలు కనిపించకపోయేసరికి పిచ్చోడయ్యాడు. తన కెమెరా అమ్మేసి ఆ డబ్బులతో ముంబై వెళ్లాడు. గౌరీకి బీచ్లంటే ఇష్టం కాబట్టి అక్కడే ఎక్కడో ఉండొచ్చని ఆలోచించాడు. ఆటో డ్రైవర్ చేతిలో రూ.400 పెట్టి ఈ డబ్బుతో ఎన్ని బీచ్లు తిరగొచ్చో అన్ని బీచ్ల దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. అలా కొన్ని బీచ్లు తిరిగిన తర్వాత ఓ సముద్ర తీరంలో గౌరీ గౌంతు వినబడింది. తనలో తనకే తెలియని సంతోషం మొదలైంది. షారుక్ను చూడగానే షాకైన గౌరీ ఇక్కడేం చేస్తున్నావ్? అని అడిగింది. పెళ్లి చేసుకుంటే పనైపోతుంది.. తనకోసమే పిచ్చోడిలా తిరుగుతున్నాడని తెలిసిన గౌరీ మనసు కరిగిపోయింది. వారి ప్రేమ మరింత బలపడింది. అదే బీచ్లో పెళ్లి చేసుకుందాం అని అడిగాడు షారుక్. అయినా తను ఒప్పుకోలేదు. ఏడాది తర్వాత షారుక్ తల్లి మరణించింది. అప్పుడు ఎంతో బాధపడిన గౌరీ.. పెళ్లి చేసుకునే సమయం వచ్చిందని చెప్పింది. కానీ అప్పుడే హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు షారుక్. బ్యాచిలర్గా ఉంటేనే ఫాలోయింగ్ మెండుగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే నీ పనైపోతుంది అని నిర్మాతలు హెచ్చరించారు. షారుక్ వాటిని లెక్క చేయలేదు. ఇద్దరిదీ ఒకే మతం కాకపోవడంతో గౌరీ తల్లిదండ్రులూ పెళ్లికి ఒప్పుకోలేదు. షారుక్ ఫ్రెండ్ ఇంటిపై రాళ్లు.. మనసు మారితే ఇక్కడికి రండంటూ ఓ అడ్రస్ ఇచ్చాడు. తనకంటూ ఓ ఇల్లు లేకపోవడంతో స్నేహితుడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఇంకేముంది, అప్పటికే కోపం మీదున్న గౌరీ తల్లిదండ్రులు ఆ ఇంటిపై రాళ్లదాడి చేయించారు. ఇలా ఎన్నో గొడవలు, వివాదాలు దాటుకుని 1991 అక్టోబర్ 25న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా, అభ్రమ్ అని ముగ్గురు పిల్లలు సంతానం. షారుక్ ఇప్పటికీ స్టార్ హీరోగా తన చరిష్మాను ఏమాత్రం తగ్గకుండా అలాగే కాపాడుకుంటూ వస్తుండగా గౌరీ ఇంటీరియర్ డిజైనర్గా రాణిస్తోంది. వీరిద్దరూ చిత్రసీమలో ఆదర్శ దంపతులుగా రాణిస్తున్నారు. చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్ -
పెళ్లి చెయ్యండి అని ఇంటికెళ్తే కుళ్ల బొడిచి గెంటేశారు: రాజ్ కుమార్
సీనియర్ నటుడు రాజ్ కుమార్ గురించి ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైంటీస్ కిడ్స్కి మాత్రం బాగా తెలుసు. అప్పట్లో ఆయనను బుల్లితెర మెగాస్టార్ అనేవాళ్లు. చూడ్డానికి చిరంజీవిలా ఉండటంతో ఆయనకి ఈ పేరు వచ్చింది. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు రాజ్ కుమార్. కొన్నాళ్ల తర్వాత చిరంజీవి పోలీకలు ఉండడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఇలా దక్షిణాది సినిమాలతో పాటు సీరియళ్లలో నటించి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న రాజ్ కుమార్ ఆ మధ్య ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకున్నాడు. (చదవండి: నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్బాస్ గొడవపై స్పందించిన నటి!) నాది ప్రేమ పెళ్లి. చెన్నైలో ఉన్నప్పడు.. నేను నేను ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో నా భార్య ఉండేది. రోజు కిటికిలో నుంచి ఇద్దరం చూసుకునే వాళ్లం కానీ మాట్లాడుకోలేదు. ఒక రోజు ఫోన్లో మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అంతే మరుసటి రోజు నుంచి ఆమె కనిపించలేదు. మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో తెలియడంతో..వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. దాదాపు 5 ఏళ్లు దూరంగా ఉన్నాం. ఓ సారి ధైర్యం చేసి వాళ్లింటికి వెళ్లాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని మా మాయయ్య అడిగితే.. కుళ్లబొడిచి బయటకు పంపించేశారు. కొన్నాళ్ల తర్వాత ఆమెనే ఫోన్ చేసి.. ఇంటికి వచ్చి డైరెక్ట్ తాళి కట్టు అని చెప్పింది. దీంతో వెంటనే ఇంటికెళ్లి ఆమె మెడలో తాళి కట్టి.. ఇంట్లో వాళ్ల ముందు నిలబడ్డాం. అప్పుడు అంతా వచ్చి నన్ను కొట్టి.. ఆమెను తీసుకెళ్లారు. తాళి తీసి పారేశారు. మూడేళ్ల తర్వాత అంటే 1995లో ఇంట్లో చెప్పకుండా ఇద్దరం కలిసి లేచిపోయాం. దాదాపు ఏడాది పాటు ఎవరికి కనిపించకుండా ఉన్నాం. బాబు పుట్టిన తర్వాత మా అడ్రస్ వాళ్లకు తెలిసింది. కొన్నాళ్ల తర్వాత వాళ్లే మా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మా మామయ్యకు నేను పెద్ద కొడుకును అయ్యాను’అని రాజ్ కుమార్ తన లవ్స్టోరీని చెప్పుకొచ్చాడు. -
తన సీక్రెట్ లవ్ బయటపెట్టిన నాని..ఆ అమ్మాయి ఎవరంటే
-
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మళ్లీ జోడీగా ...
హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి మళ్లీ జోడీగా కనిపించనున్నారు. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ ‘ఎన్సీ 23’లో (వర్కింగ్ టైటిల్) మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లు బుధవారం మేకర్స్ ప్రకటించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమిది. నాగచైతన్య, చందు మొండేటి కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. త్వరలోనే షూటింగ్ ్ర΄ారంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ప్రేమకు గ్రీన్ సిగ్నల్!
ఉత్తరాది అమ్మాయి రాశీ ఖన్నా హీరోయిన్గా దక్షిణాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ లిస్ట్లో ఉన్నారు. రచ్చ గెలిచిన రాశీ ఖన్నా ఇప్పుడు ఇంట అంటే ఉత్తరాదిలో నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. తాజాగా రాశీ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారని బాలీవుడ్ సమాచారం. నూతన దర్శకుడు బోధయన్ రాయ్ హీరో విక్రాంత్ మెస్సీతో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను ఇటీవల రాశీకి వినిపించారట. ఈ ప్రేమకథతో ప్రేమలో పడ్డారట ఈ బ్యూటీ. దాంతో ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీకి ప్రేయసిగా నటించేందుకు రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్ సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటోందట చిత్ర యూనిట్. -
ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ స్టార్డమ్ దక్కించుకున్న హీరో ధనుశ్. రఘువరన్ బీటెక్ సినిమాతో యూత్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హిందీతో పాటు హాలీవుడ్లో నటిస్తున్నారు. . హాలీవుడ్లో తెరకెక్కిన ది గ్రే మ్యాన్ చిత్రంలో కనిపించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రాబోయే ప్రాజెక్ట్స్తో బిజీ ఉన్నారు ధనుశ్. అయితే రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న హీరో ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) అయితే తాజాగా ధనుశ్ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాను సినిమాల్లోకి రాకముందే ప్రేమలో పడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో ధనుశ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ టాపిక్ నెట్టింట వైరల్గా మారింది. గతంలో సార్ మూవీ ఈవెంట్లో ధనుశ్ మాట్లాడుతూ.. 'టెన్త్ క్లాస్లో ఉండగా బాగా చదివేవాడిని. క్లాస్లో ఎప్పుడూ నేనే టాపర్గా వచ్చేవాడిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఓ అమ్మాయి పరిచయం కాగా.. ప్రేమలో పడ్డాను. ఇక అప్పటి నుంచి ఓన్లీ చాటింగ్ చేయడమే నా పని. చదువును పూర్తిగా గాలికొదిలేశా. ఆ అమ్మాయి వల్లే చదువులో వెనకపడ్డా. కానీ అతికష్టం మీద ఇంటర్ ఎలాగోలా పాసయ్యా.' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం అరుణ్ మాతీశ్వరన్ తెరకెక్కిస్తోన్న కెప్టెన్ మిల్లర్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. (ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?) -
ఆ పాయింట్తో ఖుషి తీశామనేది అవాస్తవం
‘‘నిన్ను కోరి, మజిలీ’ వంటి నా గత చిత్రాల్లో విఫలమైన ప్రేమకథలను చూపించాను. కానీ, ఈసారి పూర్తి స్థాయి వినోదం, ఉత్సాహంగా ఉండే ప్రేమకథ తీయాలని ‘ఖుషి’ చేశాను’’ అన్నారు శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. డైరెక్టర్ మణిరత్నంగారి ఫ్యాన్గా ఆయన దగ్గర చేరాలనుకుని చెన్నై వెళ్లాను. కానీ ఆయన్ను కలవడానికి కుదరలేదు. మణిరత్నంగారి సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. ఆయన తీసిన ‘సఖి’ లాంటిపాయింట్తో ‘ఖుషి’ తీశామనే వార్తలు అవాస్తవం. ప్రస్తుత సమాజంలోని ఒక సమకాలీన అంశాన్ని విజయ్, సమంతలాంటి స్టార్స్ ద్వారా చూపిస్తే బాగుంటుందని నమ్మాను. ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ నేపథ్యం. ఈ చిత్రంలో విజయ్పాత్ర అమ్మాయిలకు, కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సమంత వాస్తవ జీవితానికి, ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలు నవీన్, రవిశంకర్గార్లు డైరెక్టర్స్కు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి సంతోషంగా సినిమా చేసుకోవచ్చు. హేషమ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను డైరెక్ట్ చేసిన ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్’ సినిమాల్లో కొన్నిపాటలు రాశాను. కానీ, ‘ఖుషి’కి అన్నిపాటలు రాయాల్సి వచ్చింది.. రాశాను. మనంపాన్ ఇండియా సినిమా చేయాలని ముందే అనుకుని, కథ రాసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం.‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ వంటి సినిమాలన్నీ మన నేటివిటీకి నచ్చేలా చేసుకున్నవి. ఇతర భాషల వాళ్లు కూడా వాటిని ఇష్టపడ్డారు కాబట్టిపాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చిపాన్ ఇండియా మూవీ అవుతుందన్నది నా అభిప్రాయం. -
ఎమోషనల్ లవ్స్టోరీ
యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంకా రేవ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎమోషనల్ లవ్స్టోరీ ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రత్యేక గీతం ‘మసక తడి..’ని ఆవిష్కరించారు. అజయ్ పట్నాయక్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, గీతామాధురి పాడారు. -
గోపాలపట్నంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
-
పబ్జీ లవ్స్టోరీ: పాకిస్థాన్లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?
గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్చల్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది. Anger issues comedy: "Lappu sa Sachin" & "Jhingur sa ladka" 😂😂pic.twitter.com/2DI4dliGls — Marathi Walter 🇮🇳 𝕏 (@dotnagpur) July 19, 2023 ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి? వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. Her kids learning alphabet: J for Jhingoor K for Keeda L for Lappu pic.twitter.com/TEmqGyp75A — Sagar (@sagarcasm) August 2, 2023 ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. Haha haha. “Kya hai Sachin mey” has been immortalised 😂#SeemaHaider pic.twitter.com/8GFpat6V17 — Smita Prakash (@smitaprakash) August 4, 2023 ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ -
ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు!
ఇటీవలి కాలంలో భారత్-పాకిస్తాన్ మధ్య పలువురు యువతీయువకుల ప్రేమ కథలు వినిపిస్తున్నాయి. మొదట సీమా హైదర్, ఇప్పుడు అంజూ.. వీరిద్దరూ ప్రేమ పేరుతో ‘సరిహద్దులు’ దాటేశారు. ఈ తరహా కథలు ఈమధ్య కాలంలో సోషల్మీడియాలో లెక్కకుమించి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి కథలన్నీ నిజం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా పాక్ పోలీసులు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టులో ఒక మహిళ తన ప్రేమికునితో పాటు ఉండేందుకు విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అతని కథనంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. సీరియస్గా మారిన సిల్లీ పోస్ట్! పాక్ న్యూస్ వెబ్సైట్ ‘ఆజ్ ఇంగ్లీష్’లోని ఒక కథనం ప్రకారం ముహమ్మద్ గులాబ్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఇలా అనే ఒక బ్రిటీష్ మహిళ తన ప్రియునితో పాటు ఉండేందుకు సలార్జై వచ్చిందని పేర్కొన్నాడు. కేవలం వినోదం కోసం అతను షేర్ చేసిన ఈ పోస్టు సీరియస్గా మారిపోయింది. ఈ పోస్టును చూసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, ఆ వ్యక్తి ఆ పోస్టులో పేర్కొన్న చిరునామాకు తరలివెళ్లి చూడగా, అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. కేసు నమోదు.. అరెస్టు! అనంతరం పోలీసులు ఈ ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన ముహమ్మద్ గులాబ్పై కేసు నమోదు చేయడంతో పాటు అతనిని అరెస్టు చేశారు. అయితే స్థానికులు ముహమ్మద్ అరెస్టును వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు సాధారణమేనని వారు వాదిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం పాకిస్తానీ మహిళ సీమా హైదర్ తన భారతీయ ప్రేమికుని కోసం నేపాల్ మార్గం గుండా అక్రమంగా భారత్లోనికి ప్రవేశించింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఇదేవిధంగా భారత్కు చెందిన అంజూ తన ఫేస్బుక్ ప్రెండ్ నసరుల్లాను కలుసుకునేందుకు పాక్ వెళ్లింది. ఇది కూడా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే.. -
జార్ఖండ్లో యువతిపై దారుణం.. బట్టలు విప్పి చెట్టుకి కట్టేసి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని నలుగురు తమ కుమారుడితో ప్రేమ వ్యవహారంలో 26 ఏళ్ల యువతిని అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ యువతిని రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆ నలుగురిలో యువతి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో 26 ఏళ్ల బాధితురాలు ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అతని కుటంబసభ్యులు.. తండ్రి, తల్లి, సవతి తల్లి కుమారుడిని మందలించి ఆ యువతిని ఇంటికి రప్పించమన్నారు. వెంటనే వారి కుమారుడు ఆమెకు కబురు పంపగా బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి చేరుకోగానే నలుగురు కలిసి దౌర్జన్యంగా బంధించి సమీపంలోని అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమె ప్రియుడితో సహా కుటుంబసభ్యులంతా ఏకమై ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి బట్టలను చింపివేశారని అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించి యువతిని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించామని.. ఆమె ప్రియుడిని, అతడి తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్రానికి ఊరట.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగించిన సుప్రీంకోర్టు -
ఇండో- బంగ్లా జూలీ ప్రేమకథ.. కట్ చేస్తే.. బిగ్ ట్విస్ట్..
లక్నో: సీమా హైదర్-సచిన్, అంజూ-నస్రుల్లాల సరిహద్దులు దాటిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సీమా హైదర్ పాకిస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని సచిన్ కోసం దేశం విడిచి వచ్చింది. అంజూ- నస్రుల్లా ప్రేమ కథలో అంజూ పాకిస్థాన్లోని నస్రుల్లా కోసం భారత్ వీడింది. ఈ ఘటనల తర్వాత ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చిన మరో ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్కు చెందిన జూలీ.. భారత్లోని ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ల ప్రేమ కథ వివాదంతో బయటపడింది. ఫేస్బుక్ ప్రేమ.. బంగ్లాదేశ్కు చెందిన జూలీ అనే వివాహిత ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లోని అజయ్లు 2017లో ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2022లో బంగ్లాదేశ్లో ఉన్న జూలీ భర్త మరణించాడు. ఆ తర్వాత అజయ్ కోసం బంగ్లా విడిచిన జూలీ.. అజయ్ కోసం భారత్ వచ్చేసింది. ఇద్దరు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే.. ఉద్యోగం రీత్యా అజయ్ కర్ణాటకలో ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యను ఇంటి దగ్గరే ఉంచాడు. ఇక కొన్ని రోజుల్లోనే అత్తకోడళ్ల గొడవ కారణంగా జూలీ పుట్టిల్లు బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! బిగ్ ట్విస్ట్.. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన అజయ్.. తల్లిని ప్రశ్నించాడు. దీంతో అతనిపై కూడా అజయ్ తల్లి గొడవ పడగా.. కోపంతో ఇంటిని విడిచి వెళ్లాడు. అయితే.. తాజాగా అజయ్ రక్తమోడుతున్న ఫొటోతో పోలీసులను ఆశ్రయించింది అతని అమ్మ. తన కొడుకును రక్షించాల్సిందిగా వేడుకొంది. అయితే.. పోలీసులు అతన్ని బంగ్లాదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కు తీసుకువచ్చారు. తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని, పశ్చిమ బెంగాల్లోని ఓ సరిహద్దు గ్రామంలో అద్దె ఇంట్లో ఉన్నానని మీడియాకు అజయ్ వెళ్లడించాడు. ఇటీవల కురిసిన వర్షాల్లో కాలుజారి తలకు దెబ్బ తాకినట్లు తెలిపాడు. ఇటీవల మొరాదాబాద్కు చేరిన అజయ్ని పోలీసులు విచారించగా.. బంగ్లాదేశ్లోనే ఉన్నట్లు చెప్పాడు. ఇక బంగ్లాదేశ్ వెళ్లబోనని తెలిపాడు. కానీ అతని తలకు గాయాల ఎలా తగిలాయి? అనే అంశాలు ఇంకా బయటికి రాలేదు. అజయ్ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
తన లవ్ గురించి చెప్పిన ప్రభాస్
-
Nachinavadu trailer: ‘నచ్చినవాడు’.. సరికొత్త ప్రేమ కథా చిత్రం
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్ హీరోయిన్. స్ట్రీట్ డాగ్ సమర్పణలో లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం నిర్మించారు. ఆగస్టు 18న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్ని సోమవారం విడుదల చేశారు. హీరో–దర్శక–నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ– ‘‘మహిళల ఆత్మగౌరవం కథాంశంగా చేసుకుని అల్లిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘నచ్చినవాడు’’ అన్నారు. హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ "నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు. నటి లలిత నాయక్ మాట్లాడుతూ ‘నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు" అని తెలిపారు. -
పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?
గ్రేటర్ నోయిడా: పబ్జీలో పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆలోచనలో ముందు వెనుక చూడకుండా నలుగురు పిల్లలతో సహా ఇండియాలో ల్యాండ్ అయిపొయింది పాకిస్తాన్ వీర ప్రేమికురాలు సీమా గులామ్ హైదర్. అన్ని అడ్డంకులను జయించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ తనకు భారత పౌరసత్వం ఇప్పించమని కోరిన విషయం తెలిసిందే. మరోపక్క ఆమెకు తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు యూపీ యాంటీ టెర్రరిస్టు పోలీసులు. ఇదిలా ఉండగా గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనా ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టిన సీమా హైదర్ పై చుట్టుపక్కల వారు చిరుబుర్రుమంటున్నారు. ఓ మీడియా సంస్థ వీరిద్దరినీ పలకరించేందుకు వెళ్లి అక్కడ గుమికూడిన స్థానికులను కూడా కొన్ని ప్రశ్నలు అడగ్గా... అందులోని ఒకామె.. పాకిస్తాన్ మహిళను వెంటనే ఆమె దేశం పంపించాలి.. లేదంటే ఇటువంటి వారి వలన ఇక్కడివారి మనసుల్లో కొత్త ఆలోచనలు పుడతాయి. పాకిస్తాన్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాలన్న కోరిక పుట్టినా పుడుతుందని అంది. అసలు నీకు వాడేలా నచ్చాడు తల్లీ.. వాడొక బద్ధకస్తుడు.. చూడటానికి కూడా చాలా సన్నగా పుల్లల ఉంటాడని ఎద్దేవా చేసింది. ఆ మహిళ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. Seema haider ke Indian padosi 🤣 pic.twitter.com/0mFyZm54aW — SwatKat💃 (@swatic12) July 19, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి.. -
ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి..
జైపూర్: ఇటీవలి కాలంలో ఆన్లైన్ పరిచయాలతో యువత ప్రేమలో మునిగిపోతున్నారు. కొద్దిరోజుల పరిచయాలకే సరిహద్దులతో పాటు దేశాలు కూడా దాటిపోతున్నారు. మొన్నటికి మొన్న పాకిస్థాన్కు చెందిన సీమా.. తన ప్రేమ కోసం భారత్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే భారత్కు చెందిన ఓ యువతి.. ఫేస్బుక్ ప్రేమలో పడి పాకిస్తాన్కు వెళ్లింది. వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన వివాహిత అంజు(34)కు.. సోషల్ మీడియాలో పాకిస్థాన్కు చెందిన నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇక, ఒకరినొకరు కాలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంజు.. సరిహద్దులు దాటి పాక్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్లోని దీర్ సిటీకి జూలై 21న వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. తన భార్య జైపూర్కు వెళ్తున్నాననే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఆమె పాకిస్థాన్కు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు. ఇదిలా ఉండగా.. యూపీకి చెందిన అంజుతో అరవింద్కు 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. అటు నస్రుల్లా.. వైద్య రంగంలో పనిచేస్తున్నాడు. అయితే, అంజు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా, పాక్కు వెళ్లేందుకు అంజు వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ సెక్యూరిటీ కల్పించాలని అధికారులను కోరారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. A married Indian woman Anju resident of UP has travelled from Rajasthan’s Bhiwadi district all the way to Pakistan's KPK province to meet a man she befriended and fell in love with on Facebook. Her husband Arvind came to know about this from media.#SeemaHaidar #Pakistan pic.twitter.com/qw84iGvWMX — Ashutosh Pandey (@Indiawiing) July 23, 2023 ఇది కూడా చదవండి: సీమా, సచిన్ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(యూపీ ఏటీఎస్)ముందు ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పబ్జీ ఆడుతూ భారత్కు చెందిన యువకుడు సచిన్ ప్రేమలో పడి, అక్రమంగా నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించిన సీమాకు సంబంధించిన పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీమా సోదరుడు, మామ పాక్ ఆర్మీ సభ్యులు తాజాగా సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించాడు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్లో ఉంటున్నాడని గులామ్ తెలిపాడు. సీమా హైదర్కు పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఢిల్లీలో మరికొంతమందితో ఆమెకు పరిచయం యూపీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడి ప్రేమలో పడ్డానంటూ భారత్లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాక్ మహిళ సీమా గులాం హైదర్ను ఉత్తర్ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) పోలీసులు విచారిస్తున్నారు. పాక్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో మరికొంతమందితో పరిచయం ఉన్నన్నదని ఏటీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎస్ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి! ఆశ్యర్యపరుస్తున్న సీమా ఆంగ్ల పరిజ్ఞానం విచారణలో సీమా హైదర్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి కీలక విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులభం కావడంలేదని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమాకు గల ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. ఇదిలావుండగా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి అక్కడికి పంపాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్ చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పాక్ పంపించండి: భర్త వేడుకోలు యూపీ ఏటీఎస్ అధికారుల విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్నందున సీమాను నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్తోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా సీమా తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపింది. అయితే ఆమెను ఎలాగైనా పాక్కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ పోలీసులను కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న పబ్జీ ప్రేమకథ..
గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది. ఫస్ట్ హాఫ్.. భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది. ఇంటర్వెల్.. భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు. ప్రీ క్లైమాక్స్.. ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు. క్లైమాక్స్.. బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్. ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే.. -
సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Sourav Ganguly Dona Roy Love Story: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ శనివారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. వివాదాలను లెక్క చేయకుండా భారత క్రికెట్లో సంచలన మార్పులకు కారణమైన దాదా వ్యక్తిగత జీవితం గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈరోజు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డోనా రాయ్తో అతడి ప్రేమ, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలు మీకోసం.. చిన్ననాటి నుంచే పరిచయం గంగూలీ చిన్నపుడు ఎక్కువగా ఫుట్బాల్ ఆడేవాడు. స్నేహితులతో కలిసి గ్రౌండ్కు వెళ్లే దారిలోనే డోనా ఇల్లు ఉండేది. అలా ఓసారి ఆమెను చూసిన దాదా.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ కూడా ఆడే గంగూలీ కావాలనే రెండు మూడుసార్లు షటిల్కాక్ను డోనా ఇంట్లో పడేశాడు. అలా తమకు సంబంధించిన వస్తువును తిరిగి తెచ్చుకునే సాకుతో డోనాతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. అప్పటి నుంచి గంగూలీ- డోనా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో తొలిసారి అలా ప్రేమ పక్షులు తొలిసారి కోల్కతాలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో కలుసుకున్నారు. నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ఫుల్లుగా లాగించేశారు. ఆ తర్వాత నుంచి అక్కడే తరచుగా కలుసుకునేవారు డోనా- గంగూలీ. స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కుటుంబాల మధ్య గొడవ సౌరవ్ గంగూలీ- డోనా రాయ్ కుటుంబాల మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి. దీంతో ఇరు కుటుంబాలు ఉప్పు-నిప్పుగా ఉండేవి. అయితే, ఇవేమీ ఈ లవ్బర్డ్స్పై ప్రభావం చూపలేదు. ఇద్దరి మనసులు కలవడంతో జీవితాంతం కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ.. అప్పటికి జీవితంలో సెటిల్ కాలేదు కాబట్టి తమ రిలేషన్షిప్ను సీక్రెట్గానే ఉంచారు. అప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన గంగూలీ.. 1996లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్తో అరంగేట్రం చేసిన గంగూలీ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డోనాను వివాహమాడాలని ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుడి నివాసంలో రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అంతా సజావుగానే సాగింది. ఒకరి చేయి ఒకరు వీడలేదు అయితే, తమ పెళ్లి విషయాన్ని చాలా కాలం వరకు సీక్రెట్గానే ఉంచిన గంగూలీ- డోనా.. ఒకానొక రోజు నిజం బయటపడటంతో ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కానీ.. ఒకరి చేయి ఒకరు వీడలేదు. తమ నిజమైన ప్రేమతో పెద్దల మనసు గెలిచి కథను సుఖాంతం చేసుకున్నారు. ఇక 1997లో పెళ్లి చేసుకున్న డోనా- సౌరవ్ గంగూలీ జంటకు 2001లో కూతురు జన్మించింది. ఆమెకు సనాగా నామకరణం చేశారు. ఇక టీమిండియా స్టార్గా గంగూలీ, ఒడిస్సీ డ్యాన్సర్గా డోనా తమ కెరీర్లో విజయవంతమైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి ఒక్కటిగా కొనసాగుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: టీమిండియాతో సిరీస్కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!
కొలంబియాకు చెందిన 46 ఏళ్ల పాప్ సింగర్ షకీరా గతేడాది స్టార్ ఫుట్బాలర్ గెరార్డ్ పీక్తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షకీరా తరచుగా ఇద్దరు వ్యక్తులతో క్లోజ్గా మూవ్ అవడం కనిపించింది. అందులో ఒకరు ఏడుసార్లు ఫార్ములావన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ అయితే.. మరొకరు హాలీవుడ్ యాక్షన్ హీరో.. మిషన్ ఇంపాజిబుల్(Mission Impossible) ఫేమ్ టామ్ క్రూజ్. ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్స్టోరీ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే లూయిస్ హామిల్టన్ పాల్గొన్న మియామి గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో షకీరా ప్రత్యక్షమయ్యింది. రేసు ముగిసిన తర్వాత హామిల్టన్తో కలిసి డిన్నర్కు వెళ్లడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఏదో సమ్థింగ్ ఉన్నట్లు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. షకీరా మాత్రం మేమిద్దరం(లూయిస్ హామిల్టన్) మంచి ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకముందు ఈ ఇద్దరు యాచ్లో షిప్పింగ్తో పాటు పలు సందర్భాల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరగినట్లు సమాచారం. మరోవైపు యాక్షన్ హీరో టామ్ క్రూజ్తో కూడా షకీరా ప్రేమాయణం నడుపుతుందని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ షకీరా కంటే టామ్ క్రూజ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా షకీరాతో డేటింగ్కు వెళ్లాలని టామ్ క్రూజ్ అనుకున్నాడని.. ఇంతలో వీరి మధ్యలోని లూయిస్ హామిల్టన్ వచ్చి చేరాడు. కాగా లూయిస్ హామిల్టన్తో షకీరా కలిసి తిరగడం టామ్ క్రూజ్కు నచ్చలేదని.. అందుకే ఈగో డెంట్ అంటూ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ 50 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న షకీరా తన అందంతో ఇద్దరు సూపర్స్టార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ఆసక్తి కలిగించింది. ఇక ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ 2015 వరకు పుస్సీక్యాట్ డాల్స్ సింగర్ నికోల్ షెర్జింజర్తో రిలేషన్లో ఉన్నాడు. మరోవైపు టామ్ క్రూజ్ మిమి రోజర్స్(1987-1990), నికోల్ కిడ్మన్(1990-2001), కేటీ హోమ్స్(2006-2012)తో రిలేషిన్షిప్ కొనసాగించాడు. చదవండి: #MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి -
క్రైమ్ థ్రిల్లర్గా 'ఎవోల్' (EVOL)
టాలీవుడ్లో ఒక్కోసారి చిన్న చిత్రాలే మెప్పిస్తుంటాయి. ఇదే కోవలో సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్’. దాని ట్యాగ్ లైన్ (a love story in reverse) రామ్యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్) దర్శక నిర్మాత రామ్యోగి మాట్లాడుతూ 'ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ జానర్ అంశాలతో పాటు వాణిజ్య విలువలతో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతుంది. కథ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సెన్సార్కు ఈ చిత్రం వెళ్లనుంది. ఈ లోపు ఫస్ట్ లుక్, టీజర్ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నమిది. ప్రేక్షకుల ఆదరణ కావాలని కోరుతున్నా' అని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జజర్దస్త్ కమెడియన్) -
అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు
మెగా ఇంట మరో ప్రేమ వివాహం జరగబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు ఏకైక తనయుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లవాణ్య త్రిపాఠి త్వరలోనే ఒక్కటవ్వబోతున్నారు. ఈ రోజు(జూన్ 9) వీరిద్దరి నిశ్చితార్థం జరుగుతోంది. సాధారణంగా సినీ సెలెబ్రెటీలు ప్రేమలో ఉంటే ఆ విషయం త్వరగానే జనాలకు తెలిసిపోతుంది. కానీ వరుణ్, లావణ్యల విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించినా.. ఎవరూ స్పందించకపోవడంతో అందులో వాస్తవం లేదనుకున్నారు. అయితే ఆ పుకార్లు కూడా ఆలస్యంగానే వినిపించాయి. వాస్తవానికి 2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె) వీరిద్దరు కలిసి నటించిన రెండో సినిమా ‘అంతరిక్షం’ సమయంలో ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. అయినా కూడా ఇరువురు స్పందించలేదు. ఇక నిహారిక పెళ్లి (2020లో) సమయంలో మెగా ఇంట లావణ్య చేసిన సందడి చూసి నిజంగానే వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. పలు వెబ్సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య కానీ స్పందించలేదు. దీంతో ఇదంతా ఒట్టి పుకారే అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం డేట్ అనౌన్స్ చేసి షాకిచ్చారు. లావణ్య దగ్గరు వరుణ్ పెళ్లి ప్రపోజల్ పెట్టగా.. అమె వెంటనే ఓకే చెప్పేసిందట. మెగా ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. -
శివ బాలాజీపై డౌట్ వచ్చి అప్పుడే దూరం పెట్టేశా: మధుమిత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకరు. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని అంటోంది ఈ ప్రేమ జంట. అంతే కాకుండా శివనే మొదట తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ) ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలాగానే తమ పెళ్లిలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ జంట లైఫ్లో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని మధుమిత వెల్లడించారు. మధుమిత మాట్లాడుతూ.. 'నేను ఇది మా అశోక్గాడి లవ్ స్టోరీలో మొదటిసారి శివను చూసినప్పుడే ఈ అబ్బాయి బాగున్నాడనిపించింది. ఇంగ్లిష్ కరన్’ సమయంలో దర్శకుడు పరిచయం చేయగా.. నేనే అతన్ని పలకరించాను. ఆ తర్వాత చాలాసార్లు నాకు హెల్ప్ చేసే సరికి మంచి వాడనే ఫీలింగ్ కలిగింది. మొదట్లో నేను హాయ్ అంటే హాయ్ అనేవాడు. తను కూడా నన్ను చాలా గమనించేవాడు. నేను ఒకసారి లిప్స్టిక్ వేసుకున్న తర్వాత తుడుచుకున్న టిష్యూ తీసుకుని దాచుకున్నాడు. అలాంటి పనులు చేస్తూ నాకు కనిపించాలని ప్రయత్నించేవాడు. ఒకసారి నేను చెన్నై వెళ్లగానే మిస్ అవుతున్నట్లు మెసేజ్ పెట్టాడు. అది చూసి నాకు సందేహం వచ్చి దూరం పెట్టడం మొదలుపెట్టా. కానీ ఆ తర్వాత కూడా నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు. ఒకరోజు ఏకంగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. ' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!) -
ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం (జూన్ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి. వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. Just 2 days back, there was a train accident in Balasore, India. Too many died and a lot more had serious injuries. A bundle of love letters and poems were found amongst the debris on the tracks. A glimpse of a lost romance. A rarity in this age. Give this post a read. pic.twitter.com/MHUq8LplyD — Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023 -
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్కు సైకిల్పై
ప్రేమకు అవధులు లేవు. ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎంతో మంది ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ప్రేమను దక్కించుకున్న వారు ఉన్నారు. ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. అలాంటి కోవకే చెందినదే పీకే మహానందియా, షార్లెట్ వాన్ షెడ్విన్ ప్రేమ.. వీరి ప్రేమ దేశాలు కాదు ఏకంగా ఖండాంతరాలే దాటింది. అయితే ఇది దాదాపు 50 ఏళ్ల నాటి కథ. ఇటీవల తన ప్రేమ కోసం చేసిన సాహసాలను మహానందియా ఓ మీడియాతో పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం.. 22 రోజులు వ్యాన్లో ప్రయాణించి ఢిల్లీకి చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా పేదరిక కుటుంబంలో పుట్టిన గొప్ప కళాకారుడు. పెయింటింగ్ అంటే పిచ్చి. పెయింటింగ్లో తనకంటూ మంచి పేరు సంపాదించాలనే ఆశతో ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో చేరాడు.. ఈ క్రమంలో ప్రద్యుమ్న పెయింటింగ్ గురించి యూరప్లోని స్వీడన్కు చెందిన 19 ఏళ్ల షార్లెట్ వాన్ షెడ్విన్ తెలిసింది. ఎలాగైనా అతనితో తన పెయింటింగ్ వేయించుకోవాలని నిర్ణయించుకొని ఢిల్లీకి పయనమైంది. 22 రోజులు వ్యాన్లో ప్రయాణించి చివరికి అతన్ని చేరుకుంది. అలా 1975లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి.. అదృష్టం కొద్దీ మహానందియాను కలిసి తన పోర్ట్రెయిట్ను తయారు చేస్తున్న సమయంలో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతను ఆమె అందానికి ప్రేమలో పడగా.. ఆమె అతని సింప్లిసిటీకి ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మహానందియా తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె అతని తల్లిదండ్రులను కలిసే సమయంలో మొదటిసారీ చీర కట్టుకుంది. విదేశీయురాలైన ఆమె చీరను ఎలా మేనేజ్ చేసిందో తనకిప్పటికీ ఆశ్యర్చంగానే అనిపిస్తుందని మహానందియా చెప్పాడు. చివరికి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: Palestina: 75 ఏళ్లయినా.. గుండెల్లో అవే గుర్తులు, ఇంటికి తిరిగి రాగలమా? భర్తపై నమ్మకంతో షెడ్విన్ స్వీడన్ వెళ్లే సమయం దగ్గరకు రాగా.. తనతో రావాలని ఆమె భర్తను కూడా కోరింది. అయితే మహానందియా మొదట తన చదువును పూర్తి చేయాల్సి ఉందని చెప్పాడు. తరువాత స్వీడిష్ టెక్స్టైల్ పట్టణం బోరాస్లోని తన ఇంటికి తప్పక వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. అతనిపై నమ్మకంతో ఒక్కతే ఆమె తన స్వదేశానికి పయనమైంది. తరువాత ఇద్దరు ఉత్తరాల ద్వారా సన్నిహితంగా ఉండేవారు. రోజూ 70 కిమీ ప్రయాణం ఏడాది తర్వాత తన చదువు పూర్తి కావడంతో మహానందియా స్వీడన్ వెళ్లి తన భార్య షెడ్విన్ను కలవాలనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి అసలు విషయం గుర్తొచ్చింది. విమాన టికెట్ కొనుగోలు చేయడానికి తన వద్ద తగిన డబ్బు లేదని గుర్తొచ్చింది. దీంతో తనకున్నదంతా అమ్మేసి సైకిల్ కొన్నాడు. 1977 జనవరి 22న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోజు దాదాపు 70 కిమీ ప్రయాణించాడు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి పాకిస్తాన్, అప్గనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటుకొని వెళ్లాడు. మార్గ మధ్యలో ఎన్నోసార్లు తన సైకిల్ పాడైపోయింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి తన ఒళ్లు పూనకం అయిపోయింది. అయినా అవేవి అతని సంకల్పాన్ని చెదర్చలేదు. స్వీడన్ చేరుకొని తన కళే అతన్ని ఆమె వద్దకు చేర్చిందని చెబుతుంటాడు. దారిలో కలిసిన వ్యక్తుల చిత్రాలను పెయింటింగ్ వేస్తే కొందరు డబ్బులు ఇచ్చేవారని.. మరికొందరు ఆహారం, ఆశ్రయం కల్పించారని చెప్పాడు. ఎట్టకేలకు మే 28న యూరప్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇస్తాంబుల్, వియన్నా మీదుగా, ఆపై రైలులో స్వీడన్లోని బోరస్ చేరుకొని ఆమెను కలుసుకున్నాడు. అక్కడ ఇద్దరూ అధికారికంగా స్వీడన్లో మళ్లీ పెళ్లిచేసుకున్నారు. చదవండి: Video: ఎయిర్పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు.. నేటికి అదే ప్రేమలో యూరోపియన్ సంస్కృతి గురించి తనకేం తెలియదని.. కానీ తన భార్య అడుగడుగునా మద్దతు నిలచిందని తెలిపారు. ఆమె ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. 1975లో తొలిసారి తనను చూసి ప్రేమలో పడిన రోజులానే.. నేటీకి అదే ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ కుటుంబం స్వీడన్లో నివసిస్తున్నారు. మహానందియా అక్కడే ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. చివరగా.. ప్రేమ గొప్పతనం అందరికీ తెలియదంటారు. కానీ మహానందియాకు దాని విలువ బాగా అర్థమైంది. అందుకే మనసిచ్చి మనువాడిన ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద మూడు నెలల ప్రయాణం చేశాడు. నచ్చిన చెలితో జీవితం గడుపుతున్నాడు. నేటి తరం యువతకు ప్రేమ అంటే కొత్త నిర్వచనాన్ని అందించాడు. View this post on Instagram A post shared by @mignonettetakespictures -
శరత్బాబు-రమాప్రభ లవ్స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?
విలక్షణ నటుడు శరత్బాబు మరణంతో టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అప్పటికే నటిగా, స్టార్ కమెడియన్గా రమాప్రభకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో శరత్బాబును సినిమాల్లో రికమండ్ చేసి వేషాలు ఇప్పించారని వార్తలు వచ్చేవి. ఆ సమయంలో వీరి సాన్నిహిత్యంపై కథలు కథలుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరికి వాటినే నిజం చేస్తూ వయసులో తనకంటే నాలుగేళ్ల పెద్దదైన రమప్రభను శరత్బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అప్పట్లో శరత్ బాబు తాను మరచిపోలేని రోజులు మూడే అని అందులో ఒకటి తన పుట్టినరోజు కాగా, రెండు రెండు తన భార్య రమ పుట్టినరోజు, మూడు తమ పెళ్ళి రోజూ అంటూ ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు. -
పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్, అప్పటి క్షణాలను తలుచుకుంటూ..
డైరెక్టర్ కావాలన్న ఆశతో బంగారం లాంటి జాబ్ వదిలేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఫేస్బుక్, గూగుల్లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలింస్ చేశాడు. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో ఉద్యోగం మానేసి డైరెక్షన్ ట్రై చేశాడు. ఆ ప్రయత్నంలో భలే మంచి రోజు చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే మంచి మార్కులు పడ్డప్పటికీ తర్వాతి సినిమాకు మాత్రం దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం శర్వానంద్తో ఓ చిత్రం చేస్తున్నాడు. సినిమాల్లో ట్విస్టులున్నట్లే ఆయన జీవితంలో కూడా ఎన్నో మలుపులున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్ నుంచి సినీ రంగానికి రావడం, అలాగే ప్రేమించిన అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకోవడం వంటి కీలక మలుపులున్నాయి. శ్రీరామ్ పెళ్లి గురించి అప్పట్లో ఓ వార్త తెగ వైరలయింది. దీని ప్రకారం శ్రీరామ్.. ప్రియాంక అనే ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. కానీ వీళ్ల ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వేరొకరితో తన కూతురికి పెళ్లి ఫిక్స్ చేశారు. బంధుమిత్రులకు పత్రికలు పంచడం కూడా అయిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా శ్రీరామ్ ఆమెను తీసుకెళ్లి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇందులో ఎంత నిజముందో కానీ వీరి పెళ్లి జరిగిన మాట మాత్రం వాస్తవం. వీరికి 2020లో బాబు పుట్టాడు. తాజాగా ఓ షోకి భార్య ప్రియాంకతో కలిసి హాజరైన శ్రీరామ్ అప్పటి ప్రేమ ముచ్చట్లను పంచుకున్నాడు. 'మాకు రెండు పెళ్లి రోజులున్నాయి. ఒకటి ఆర్య సమాజ్లో జరిగింది. ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం. కానీ అప్పుడు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నెక్స్ట్ డే పెళ్లి పెట్టుకుని సర్దార్ గబ్బర్ సింగ్ బెనిఫిట్ షో చూశాం' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు శ్రీరామ్. చదవండి: ఓటీటీలో సందడి చేసే సినిమాలివే, ఆ ఒక్క సినిమా కోసమే అంతా వెయిటింగ్! -
ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో చిల్లర పనులు చేశా: మారుతి
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హిట్ వచ్చిందంటే నెక్స్ట్ అంతకు మించిన సినిమా తీయాలి. తేడా కొట్టి ఫ్లాప్ అయిందంటే విమర్శలను ఎదుర్కొనేంత సత్తా ఉండాలి. అదే వరుసగా ఫ్లాపులు పడితే మనుగడను కాపాడుకునేందుకు కష్టపడాలి. ఇలా చిత్రపరిశ్రమలో నానాసమస్యలను దాటుకుని స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు మారుతి. కేవలం రెండు రూపాయల జిలేబీ తిని కడుపు నింపుకున్న రోజుల నుంచి అరటి పండ్లు అమ్మిన రోడ్డుపై జాగ్వార్ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన మారుతి ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సత్తా చాటుతున్న అతడు ప్రస్తుతం ప్రభాస్తో సినిమా తీస్తున్నాడు. తాజాగా అతడు తన భార్య వీరనాగ స్పందనతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ ప్రేమ విశేషాలను పంచుకున్నారు. స్పందన మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. అతడు నా సీనియర్. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ముఖం నచ్చింది. 9వ తరగతిలో టాలెంట్ నచ్చింది. పదవ తరగతికి వచ్చేసరికి తను వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మా ప్రేమ కొనసాగింది. ఆయన నన్ను కలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చేవాడు, నేను స్కూటీపై వెళ్లేదాన్ని. ఇద్దరం దొంగతనంగా కలుసుకుని నా స్కూటీపై తిరిగేవాళ్లం' అని చెప్పుకొచ్చింది. మారుతి మాట్లాడుతూ.. 'స్పందనకు డైరీ రాయడం అలవాటు. ఈ రోజు వచ్చాడు, ఇది జరిగిందని అన్నీ రాస్తుంది. తనను ఇంప్రెస్ చేయడానికి చేసిన వెధవ పనులన్నీ అందులో ఉంటాయి' అని పేర్కొన్నాడు. కాగా మారుతి జీవితంలో సెటిలయ్యాక ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ గ్రాండ్గా బాలీవుడ్ నటి సీమంతం -
ఆ హీరోతో డేటింగ్ చేస్తోందని బాధపడ్డ మరో హీరో.. హర్టయిన నటి!
ఎవర్ గ్రీన్గా నిలిచిపోయే పాటల్లో దమ్మారో దమ్ సాంగ్ ఒకటి. ఈ పాటను ఆస్వాదించినవాళ్లంతా జీనత్ కాన్ను అంత ఈజీగా మర్చిపోలేరు. బాలీవుడ్ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులు ఆమెను ఆరాధించారు. కెరీర్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో హీరో రాజ్ కపూర్తో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అప్పటికి జీనత్ను మరో హీరో దేవ్ ఆనంద్ ప్రేమిస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. తన ఆటోబయోగ్రఫీలో మాత్రం... తాను ప్రేమిస్తున్న జీనత్ మరొకరితో ప్రేమలో ఉందన్న వార్తలు బాధించాయని రాసుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయింది జీనత్. పబ్లిక్గానే కంగ్రాచ్యులేషన్స్ చెప్పా 'నా కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో గోల్డెన్ త్రయం నడుస్తోంది. దేవ్ సాబ్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్ హిందీ సినిమాకు తలమానికంగా నిలిచారు. ఈ క్రమంలో 1973లో రాజ్ కపూర్ డైరెక్షన్లో వచ్చిన బాబీ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలవడమే కాకుండా అవార్డులు సైతం గెల్చుకుంది. పబ్లిక్గానే అతడికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను. వకీల్ బాబు, గోపీచంద్ జసూస్ సినిమాల్లో అతడితోపాటు నటించాను. అతడి డైరెక్షన్లో సినిమా చేయాలనుండేది. తీరా ఆ అవకాశం వచ్చేసరికి నేను సత్యం శివం సుందరం సినిమా ఒప్పుకోవడంతో దాన్ని తిరస్కరించక తప్పలేదు. తర్వాత రాజ్ కపూర్ సినిమాల్లోనూ నటించాను. కానీ మా మధ్య ఉన్న సాన్నిత్యాన్ని దేవ్ సాబ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అబద్ధాన్ని ప్రచారం చేశాడు 2007లో వచ్చిన ఆయన ఆటోబయోగ్రఫీ రొమాన్సింగ్ విత్ లైఫ్ పుస్తకంలో దేవ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ రాజ్కు నాకు మధ్య బంధం చిక్కపడటం చూసి తన మనసు ముక్కలైందని రాసుకున్నాడు. అది చూశాక నాకు విపరీతమైన కోపం వచ్చింది. దేవ్ నన్ను ప్రేమిస్తున్న విషయమే నాకు తెలియదు, ఆయనను గురువుగా ఆరాధించాను, ఎంతో అభిమానించాను. కానీ తను ఓ అబద్ధాన్ని నమ్మి నాపైనే దుష్ప్రచారం చేశాడు. చాలా బాధేసింది. ఆ పుస్తకం పబ్లిష్ అయ్యాక నా ఫోన్ రింగవుతూనే ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎంతో అవమానకరంగా భావించిన ఈ విషయం గురించి ఇన్నేళ్లుగా మాట్లాడలేకపోయాను. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ ఇవ్వాలనిపించింది. దేవ్ ఆనంద్ అరుదైన ప్రతిభ కలవాడు. ఆయన్ను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది జీనత్. సంజయ్ఖాన్తో ప్రేమ పెళ్లి, హింసతో బ్రేకప్ జర్నలిస్టు, మోడల్గా ఉన్న జీనత్ అమాన్ 1970లో హల్చల్తో నటిగా పరిచయమైంది. హరే రామ హరే కృష్ణతో స్టార్డమ్ తెచ్చుకుంది. కుర్రకారంతా ఆమెను ఆరాధించింది. ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడు, హీరో సంజయ్ ఖాన్ను ఆమె అందం కలవరపెట్టింది. అటు జీనత్కూ సంజయ్ అంటే ఇష్టం మొదలైంది. ఇద్దరూ అబ్దుల్లా సినిమాలో జంటగా నటించారు. ఈ క్రమంలో వీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే సంజయ్కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా అతడు ముక్కోపి! ఓసారి పార్టీలో అందరి ముందే దవడ ఎముక విరిగేలా జీనత్కు కొట్టాడట సంజయ్. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలో నుంచి తప్పించుకుంది. జీనత్. మూడేళ్ల వారి ప్రేమ హింసాత్మకంగా ముగిసింది. ఆ తర్వాత 1985లో మజర్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కుటుంబంతో సంతోషంగా జీవనం సాగిస్తుందనుకున్న సమయంలో 1998లో మజర్ కన్నుమూశాడు. సింగిల్ పేరెంట్గానే పిల్లలను పెద్ద చేసింది జీనత్. View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) View this post on Instagram A post shared by Zeenat Aman (@thezeenataman) చదవండి: కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార -
బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య
కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్ లైఫ్లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్ లైఫ్లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథ ఉంది. ఆల్రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్ లైట్, మరోపక్క సన్ రైజ్.. హైస్పీడ్లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్డేకు నా చైన్ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ మృతి జియా ఖాన్ కేసులో సంచలన తీర్పు -
సినిమా రేంజ్ లో సచిన్ - అంజలి లవ్ స్టోరీ...!
-
తొలి సినిమా రిలీజ్కు ముందే సూపర్స్టార్తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..
భారతీయ సినిమా తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్లలో రాజేశ్ ఖన్నా ఒకరు. వరుసగా 15 హిట్లు కొట్టిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న రోజులవి.. ఆ సమయంలో బాబీ(1973) సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసింది డింపుల్ కపాడియా. ఇది ఆమె తొలి చిత్రం. అయితే ఈ సినిమా రిలీజవడానికి ముందే తన అందచందాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. అది రాజేశ్ ఖన్నా చెవిన పడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తన చేయి పట్టుకుని నడిచాడు. అలా 1973లో తనకంటే రెట్టింపు వయసున్న రాజేశ్ను పెళ్లాడింది డింపుల్. పెళ్లి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ దంపతులు 1984లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అప్పటికే వీరికి ట్వింకిల్ ఖన్నా, రింఖీ ఖన్నా జన్మించారు. భర్తతో విడిపోయిన తర్వాత 1985లో సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్. ఆ సినిమా రిలీజ్ సమయంలో తను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. 'ఓసారి నేను, రాజేశ్ ఖన్నా చార్టెడ్ ఫ్లైట్లో అహ్మదాబాద్ వెళ్తున్నాం. అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అతడు నా కళ్లలోకి సూటిగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అప్పుడు నా వయసు 16 మాత్రమే! పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా త్వరత్వరగా మా పెళ్లి జరిగిపోయింది. ఏ రోజైతే ఆయనతో నా వివాహం జరిగిందో అప్పుడే నా సంతోషం, జీవితం ముగిసిపోయినట్లనిపించింది. బాబీ సినిమా తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.5 లక్షలిస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆ వయసులో కెరీర్ ప్రాధాన్యత అర్థం కాలేదు. రాజేశ్ ఇంట్లో అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకున్న రోజు నాకెందుకో ఈ పెళ్లి వర్కవుట్ కాదేమో అనిపించింది. పలువురు మహిళలు ఆయన జీవితంలోకి వస్తున్నారని తెలిసినా బాధేయలేదు. కానీ మా బంధం బలంగా లేదని మాత్రం అర్థమైంది. పైగా సమానత్వం అనే మాట మా విషయంలో నిజం కాలేదు. అతడి కెరీర్ నెమ్మదిగా డౌన్ అవడంతో మా మధ్య పోట్లాటలు మరింత పెరిగాయి. చివరికి ఇద్దరం విడిపోయాం' అని చెప్పుకొచ్చింది డింపుల్. చిత్రపరిశ్రమలో అందరూ కాకాజీ అని పిలుచుకునే రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18న మరణించారు. దంపతులుగా విడిపోయినప్పటికీ డింపుల్.. రాజేశ్ ఖన్నాతో స్నేహితురాలిగానే మెదిలేవారు. ఆయన చివరి రోజుల్లోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు. చదవండి: డైరెక్టర్ నమ్మలేదు, రెండు ఆడిషన్స్ ఇచ్చాను: హీరోయిన్ -
ప్రేమ విషయం పేరెంట్స్కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా?
Sachin- Anjali Love Story In telugu: తొలి చూపులోనే ప్రేమ.. ప్రణయంలో ఐదేళ్ల ప్రయాణం.. వయసులో ఐదేళ్ల వ్యత్యాసం... అతడు ఆమె కంటే చిన్నవాడు కావడం వల్లపెద్దల నుంచి నో అనే మాట వినాల్సి వస్తుందేమోనన్న భయం.. అతడు మొహమాటపడ్డాడు.. ఆమె బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది.. మనసిచ్చిన వాడితో కలిసి జీవితాంతం నడవాలన్న కలను నెరవేర్చుకునేందుకు తనే ముందుడుగు వేసింది.. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పింది.. వాళ్లు అర్థం చేసుకున్నారు.. ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.. ఆటలో రికార్డుల రారాజే అయినా.. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే భర్త కోసం ఆమె తన కెరీర్ను త్యాగం చేసింది.. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. అదే ఆమె ప్రపంచం.. నిజానికి ఆమె లేకుంటే అతడు లేడు.. తను క్రికెట్ దేవుడిగా ఎదగడంలో ఆమెది కూడా కీలక పాత్రే.. అలాంటి భార్యను పొందడం తన అదృష్టం అంటాడతడు.. నిజమే.. సంపన్న కుటుంబంలో పుట్టి.. ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగి.. డాక్టర్ అయినప్పటికీ కుటుంబం కోసం బంగారం లాంటి కెరీర్ను పణంగా పెట్టిన ఆ మహిళ పేరు అంజలి. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సతీమణి. సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా కపుల్ గోల్స్ సెట్ చేసిన అంజలి- సచిన్ ప్రేమకథ. తొలి చూపులోనే ప్రేమ 17 ఏళ్ల వయసులో 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు సచిన్ టెండుల్కర్. పాకిస్తాన్ పర్యటనలో టెస్టు సిరీస్లో భాగంగా అరంగేట్రం చేసిన అతడు తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు.. కానీ రెండో మ్యాచ్లో అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్ ముగించుకుని జట్టుతో పాటు భారత్కు పయనమయ్యాడు. స్వదేశానికి చేరుకుని స్వస్థలానికి పయనమయ్యే క్రమంలో ఎయిర్పోర్టులో తొలిసారి అంజలిని చూశాడు. తన తల్లిని తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన అంజలి కూడా తొలి చూపులోనే ప్రేమలో పడింది. ఆమె డాక్టర్ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ మరోసారి కలుసుకున్నారు. స్నేహం పెరిగి.. ప్రేమగా మారింది. అప్పుడప్పుడే క్రికెటర్గా ఎదుగుతున్నాడు సచిన్.. మరోవైపు అంజలి మెడిసిన్ చదువుతోంది.. ప్రేమలో ఉన్నా సచిన్ ఆటను, అంజలి చదువును నిర్లక్ష్యం చేయకుండా కెరీర్కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. చదువులో చురుకైన అంజలికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు.. అయితే, ఎప్పుడైతే సచిన్ను ఇష్టపడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆటపై కూడా ఆసక్తి పెంచుకుంది.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జర్నలిస్టు అని చెప్పు సరేనా! అంజలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలనుకున్న సచిన్.. ఆమెను ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. అయితే, ఇంట్లో వాళ్లందరికీ ముందే విషయం తెలిసిపోతే బాగుండదని భావించి తనను తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకోమని అంజలికి చెప్పాడు. నువ్వు ఎలా అంటే అలా! సరే అంది అంజలి. సల్వార్ కమీజ్లో డ్రెస్సప్ అయి సచిన్ ఇంటికి వెళ్లింది. కాబోయే అత్తామామలను పరిచయం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఫోన్ బిల్స్ కట్టలేక 1990లలో మొబైల్ ఫోన్స్ ఉనికి పెద్దగా లేదు. కాబట్టి సచిన్తో మాట్లాడాలంటే అంజలి ఎంతో విశాలమైన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అంజలి స్వయంగా చెప్పింది. 1994లో నిశ్చితార్థం.. మరుసటి ఏడాది పెళ్లి తమ ప్రేమ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు సచిన్ మొహమాట పడటంతో అంజలినే స్వయంగా వారితో మాట్లాడి ఒప్పించింది. అలా సచిన్- అంజలిల నిశ్చితార్థం 1994లో న్యూజిలాండ్ టూర్లో ఉన్న సమయంలో జరిగింది. ఆ మరుసటి ఏడాది మే 24న వీరి వివాహం జరిగింది. 1997లో తొలి సంతానంగా కుమార్తె సారా జన్మించగా, 1999లో కుమారుడు అర్జున్ జన్మించాడు. సారా మోడల్గా, అర్జున్ క్రికెటర్గా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కుటుంబం కోసం త్యాగం పిడియాట్రిషియన్గా ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం పొందిన అంజలి.. భార్యగా, డాక్టర్గా రెండు పడవల మీద ప్రయాణం చేయలేకపోయింది. సచిన్ తన కెరీర్లో బిజీ కావడంతో పిల్లల కోసం గృహిణిగా మారిపోయింది. ఎవరినీ ఊహించుకోలేను ‘‘సచిన్ కాకుండా నా జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను తన గర్ల్ఫ్రెండ్గా ఉన్నప్పుడైనా.. భార్యగా మారిన తర్వాతైనా మా బంధంలో ఎలాంటి మార్పు లేదు. తను కాకుండా నా జీవితంలో వేరే వ్యక్తిని అసలు ఊహించుకోలేను. తను ఆడే ప్రతి మ్యాచ్ను నేను తప్పకచూసేదాన్ని. స్టేడియానికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లోనే టీవీలో తన బ్యాటింగ్ చూసేదాన్ని. మా ఇంట్లో ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ టీవీ ఉంది. దాని పక్కనే గణేషుడి విగ్రహం కూడా! సచిన్ క్రీజులో ఉన్నంత సేపు అలా చూస్తూ ఉండిపోతా. ఆ సమయంలో కనీసం తినడానికి కూడా అక్కడి నుంచి కదలను. కనీసం నీళ్లు కూడా ముట్టను. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఆన్సర్ కూడా చేయను’’ అంటూ సచిన్తో పాటు తన ఆటను కూడా అంతే ప్రేమిస్తానని అంజలి ఒక సందర్భంలో చెప్పింది. అంజలి గురించి ఆసక్తికర విశేషాలు ►గుజరాతీ కుటుంబంలో జన్మించిన అంజలి ముంబైలో పెరిగింది. ►అంజలి తండ్రి ఆనంద్ మెహతా గుజరాతీ పారిశ్రామికవేత్త. ఆమె తల్లి అన్నాబెల్ బ్రిటిష్ సంతతికి చెందినవారు. అప్నాలయ పేరుతో ఎన్జీవో స్థాపించారు. ►అంజలి తాతయ్య భూస్వామి. ఆమె కుటుంబానికి బ్రీచ్కాండీ ఏరియాలో అత్యంత విలాసమైన రెసిడెన్షియల్ బంగ్లాలు ఉన్నాయి. ►అంజలి కజిన్లలో చాలా మంది మెక్సికన్ మూలాలు ఉన్నవారు ఉన్నారు. ►అంజలి కుటుంబానికి నెహ్రూ- గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవట. చదవండి: #HBD Sachin: సచిన్ క్రికెట్కి దేవుడైతే.. ఆ భక్తుడు ప్రత్యక్షం కావాల్సిందే! గతంలో ఎప్పుడూ చూడలేదు.. పర్పుల్ క్యాప్ పొందేందుకు అర్హుడు: కోహ్లి -
ఆ క్షణమే నయన్తో ప్రేమలో పడిపోయా: విఘ్నేశ్ శివన్
సౌత్ లేడీ సూపర్స్టార్ నయనతార కోలీవుడ్ రెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇటీవల ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విఘ్నేశ్ శివన్ నయనతారతో తన ప్రేమ కహానీని వెల్లడించారు. పోడాపోడి సినిమాతో డైరెక్టర్గా మారిన నేను తొలి సినిమాతోనే భారీ పరాజయాన్ని చూశాను. కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘నేనూ రౌడీనే’ అనే కథ రాశాను. హీరో ధనుష్ కథ నచ్చడంతో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. నయనతారను కలిసి కథ చెప్పమన్నాడు. నయన్ అంగీకరించదేమో అని అనుకొని నజ్రియాతో మాట్లాడదామనుకున్నా. కానీ ధనుష్ చెప్పడంతో నయన్ దగ్గరికి వెళ్లా. ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నయన్తో ప్రేమలో పడిపోయా. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ నుంచే మేం ఇద్దరం డేటింగ్లో ఉన్నాం. కానీ సెట్స్లో అస్సలు బయటపడలేదు. నయన్ను మేడమ్ అనే పిలిచేవాడ్ని. ఆమె క్యారవాన్కు కూడా వెళ్లేవాడిని కాదు. ఇద్దరం వృత్తిపరంగా ప్రొఫెషనల్గా ఉండేవాళ్లం. మేం ప్రేమలో ఉన్నామని చెప్పేవరకు ఈ విషయం ఎవరికి తెలియదు అంటూ విఘ్నేశ్ తన లవ్స్టోరీని రివీల్ చేశాడు. -
ఈ జన్మకు బతికి వేస్ట్ అనుకున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో, మంచు వారబ్బాయి మనోజ్ ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడి ఆమెతో కొత్త జీవితం ఆరంభించాడు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం తర్వాత ప్రేమగా మారగా దాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారిద్దరూ. మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ షోలో పాల్గొని తమ ప్రేమ కహానీని బయటపెట్టింది. ముందు మనోజ్ మాట్లాడుతూ.. మా ఇద్దరిలో తానే ఎక్కువ రొమాంటిక్ అని చెప్పాడు. మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ఆమె జయంతి రోజు ఆకాశం వైపు చూస్తూ ఎక్కడున్నావమ్మా.. నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని నాలో నేను మాట్లాడుకున్నాను. అప్పుడు ఎంతో బాధలో ఉన్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు రాడేమో అనుకున్నాను... ఆరోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. పెళ్లికి ముందు మనోజ్ కోపాన్ని ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ మనోజే ఇప్పుడు నా కోపంతో డీల్ చేస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది మౌనిక. ప్రేమ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మనోజ్ మాట్లాడుతూ.. 'ప్రేమ అనేది రెండుపక్కలా ఉండాలి. ఒకానొక సమయంలో ఎక్కడున్నాను? ఎటు వైపు వెళ్తున్నాను? అనేది అర్థం కాలేదు. అప్పుడు ప్రేమ? సినిమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది. నన్ను నమ్ముకుని ఒక బిడ్డతో అమ్మాయి నిలబడి ఉంది.. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు మనోజ్. అలా మౌనికను పెళ్లాడి ఆమె కొడుకు బాధ్యతను సైతం తనే స్వీకరించాడు. -
మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్!
బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత బైజూస్ సంస్థను స్థాపించారు. ఇప్పుడా కంపెనీ విలువ 23 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1.9 లక్షల కోట్లు. రవీంద్రన్ తన భార్య గురించి సీక్రెట్ బయటపెట్టారు. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సెషన్లో బైజు రవీంద్రన్.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య తన స్టూడెంటేనని వెల్లడించారు. ఆమెతో తాను ఎలా ప్రేమలో పడిందీ వివరించారు. ఆమె తరచూ ప్రశ్నలు అడిగేదని, అలా తనను ఆకర్షిందని చెప్పారు. అది ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదని, తాము భార్యాభర్తలు అయిపోయామని పేర్కొన్నారు. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! 2012లో స్థాపించిన ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇప్పుడు అత్యంత విజయవంతమైన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం బైజూస్ మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు. బైజూస్ సీఈవోగా రవీంద్రన్ వ్యవహరిస్తుండగా, దివ్య గోకుల్నాథ్ డైరెక్టర్గా ఉన్నారు. -
రిలీజ్కు సిద్ధమైన ప్రేమకథా చిత్రం 'రాజ్ కహాని'
ప్రేమకథ ఇతివృత్తంగా రాజ్ కార్తికేన్ హీరోగా నటించిన చిత్రం 'రాజ్ కహాని'. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 24 న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ పోస్టర్ను రిలీజ్ చేసింది. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 24 న ప్రేక్షకుల ముందుకొస్తుంది . ఈ సంధర్భంగా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.. హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకముంది.' అని అన్నారు. నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు మాట్లాడుతూ..'మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేశాం. యూత్, ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి.' అని తెలిపారు. -
శ్రీదేవిపై ఉన్న ఫీలింగ్స్ నా భార్యకు చెప్పాను: బోనీ కపూర్
భారతీయ సినీపరిశ్రమను ఏలిన అతి కొద్దిమంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. తన అందాన్ని, నటనాప్రతిభను చూసి ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం విస్తుపోయేవారు. శ్రీదేవి అందం, అభినయం చూసి బోనీ కపూర్ కూడా మంత్రముగ్ధుడయ్యాడు. అందుకే ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమెకు నటుడు మిథున్ చక్రవర్తితో పెళ్లైందంటూ వార్తలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోలేదు. తనతో జీవితం కొనసాగించాలని కలలు కన్నాడు. చివరకు ఆ కల నిజం చేసుకున్నాడు. కానీ కలకాలం తనతో కలిసి ఉండాలనుకున్న కోరిక మాత్రం తీరలేదు. 2018 ఫిబ్రవరి 24న బోనీ కపూర్ను ఒంటరి చేస్తూ శ్రీదేవి మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈరోజు శ్రీదేవి వర్ధంతి కావడంతో బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నాడు. 'శ్రీదేవిని ఓ తమిళ సినిమాలో చూడగానే తనతో వెంటనే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. సోల్వా సావన్లో శ్రీదేవి గ్లామర్ రోల్ చేయనప్పటికీ తన పాత్ర నన్ను ఇంప్రెస్ చేసింది. తర్వాత తనను ఎలాగోలా కలిశాను. ఆమెతో మాట్లాడాక నాకు తెగ నచ్చేసింది. ఒక ఈవెంట్లో శ్రీదేవి తల్లిని కలిశా. అప్పుడు శ్రీదేవి రెమ్యునరేషన్ దాదాపు రూ.8 లక్షలు ఉండి ఉంటుంది. ఆమెతో సినిమా చేయాలని చెప్తే శ్రీదేవి తల్లి మాత్రం రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. నేను వెంటనే కుదరదని షాకిచ్చి ఆ వెంటనే రూ.11 లక్షలిచ్చి సర్ప్రైజ్ చేశాను. షూటింగ్స్కు తన వెంట వెళ్లేవాడిని. అలా తనకు మరింత దగ్గరయ్యాను. అప్పటికే నాకు ఓసారి పెళ్లైంది. భార్య మోనా శౌరీకి తనతో ప్రేమలో పడ్డానని, నా ఫీలింగ్స్ చెప్పాను. తనను వదులుకోలేనన్నాను. ఇకపోతే శ్రీదేవిపై ఎంతో కేర్ తీసుకునేవాడిని. అదే ఆమెను తిరిగి ప్రేమించేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు బోనీ కపూర్. కాగా బోనీ కపూర్.. నిర్మాత మోనా శౌరీని మొదటగా వివాహం చేసుకున్నాడు. 1996లో ఆమెకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు. వీరికి జాన్వీ, ఖుషీ కపూర్ జన్మించారు. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
కనుల చాటు మేఘమా...
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా..’ అంటూ సాగే మొదటి పా టను విడుదల చేశారు మేకర్స్. ఈ పా టకు లక్ష్మీ భూపా ల సాహిత్యం అందించగా ఆభాస్ జోషి పా డారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ అనుకున్నాక కళ్యాణీ మాలిక్గారితో ‘ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం.. దానికి మంచి పా ట కావాలి’ అన్నాను. ఆయన అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు’’ అన్నారు. ‘‘కనుల చాటు మేఘమా..’ పా ట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పా టా ఇవ్వలేదు’’ అన్నారు కళ్యాణీ మాలిక్. -
తారకరత్న లవ్స్టోరీ.. గుడిలో పెళ్లి చేసుకున్న నటుడు
గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడిన నటుడు నందమూరి తారకరత్న(39) శనివారం తుదిశ్వాస విడిచారు. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు(ఫిబ్రవరి 22) ఉండగా ఇంతలోనే మరణించడంతో అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహనకృష్ణ తనయుడిగా తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తారకరత్నకు తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్యరెడ్డి పరిచయమైంది. ఆమె పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తారక్ సినిమా నందీశ్వరుడికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసింది. కానీ వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కారణం అలేఖ్యకు ఇదివరకే పెళ్లై విడాకులు కావడమే! అయినా వెనక్కు తగ్గని తారకరత్న 2012లో ఓ గుడిలో తనను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబాలు ఈ జంటను చేరదీశాయి. 2013లో వీరి ప్రేమకు గుర్తుగా నిషిక అనే పాప జన్మించింది. పాపు పుట్టాక తన ఆలనా పాలనా చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంది అలేఖ్య. కానీ ఇలా తారకరత్న అర్ధాంతరంగా తనువు చాలించడంతో అలేఖ్య, ఆమె కూతురు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చదవండి: తారకరత్న చివరి కోరిక ఏంటో తెలుసా? -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్కుమార్. -
రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ బ్రేకప్ సాంగ్ విన్నారా?
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సాథియా’. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమా లోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే.. అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్ లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు.. సాంగ్ కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలైట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్కి మేజర్ అట్రాక్షన్ గా మారింది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. -
Valentine's Day: ప్రేమ పేరుతో ఉన్మాదం.. ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు
భిన్న సంస్కృతుల సమ్మేళనం మన మహా నగరం. విభిన్న సంప్రదాయాల సంగమం మన హైదరాబాద్. ‘భాగ్య’నగరమే ప్రేమ పునాదిగా వెలసిందని కొందరి నమ్మకం. ఆ ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి కొన్ని జంటలు. నగరంలోని కొన్ని ప్రాంతాలు. ప్రేమ అనే రెండు పదాలు మదిలో నాటుకున్న తర్వాత అవి వేద మంత్రాలై పెళ్లికి దారి తీస్తాయి. వివాహంతో ఒక్కటవుతాయి. కష్ట సుఖాలను పంచుకుంటాయి. నీతోటిదే లోకమంటూ కలకలం సాగుతాయి. ఇలాంటి ప్రేమలు కొన్ని అయితే.. మరికొన్ని పగతో రగులుతున్నవీ ఉన్నాయి. క్షణికావేశమో, పక్కా ప్లాన్తోనే ప్రేమనే అంతమోందించిన ఘటనలు ఉన్నాయి. మంగళవారం వలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు. పెళ్లి చేసుకోమన్నందుకు.. ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్కు చెందిన సరస్వతి, భూదేవి నగర్కు చెందిన దీపక్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె అతడిపై ఒత్తిడి తెస్తోంది. కొన్నాళ్లు దాటవేత ధోరణి ప్రదర్శించిన అతగాడు చివరకు ఆమెను హత్య చేయాలని పథకం వేశాడు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ ఆమెను చంపేశాడు. పెళ్లికి నిరాకరించినందుకు.. తనను ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యాప్రాల్ ప్రాంతానికి చెందిన గిరీష్ బాపూజీనగర్కు చెందిన చామంతిపై హత్యాయత్నం చేసి, తానూ ఆత్మహత్యకు యతి్నంచాడు. సదరు యువతిని వేధించిన కేసులో అతడు న్యాయ స్థానంలో జరిమానా చెల్లించడం గమనార్హం. ప్రేమించి మోసం చేసిందని... వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ సరూర్నగర్లో నివసిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా ఇటీవల ఆమె ఇతడిని దూరం పెట్టింది. దీంతో తనను మోసం చేసిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగి ప్రాణాలు తీస్తున్న అకృత్యాలు..లైంగిక వేధింపులతో వెంటపడుతూ చేస్తున్న అఘాయిత్యాలు, ప్రేమ విఫలమైందనే కారణంగా ఆత్మహత్యలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి. పదును లేని చట్టాలంటే పట్టని ఉన్మాదులు దాడులతో తెగపడుతున్నారు. అధికారిక గణాంకాల అటుంచితే పరువు, ప్రతిష్టలకు భయపడి జరిగిన అన్యాయంపై బాధితులు ఫిర్యాదు చేయని సందర్భాలు ఎన్నో. ప్రేమ నేపథ్యంలో జరుగుతున్న ఆత్మహత్యలు సైతం అనేకం ఉంటున్నాయి. అపరిపక్వతే ఈ దురాగతాలకు ప్రధాన కారణంగా మారుతోంది. సమాజంలో మహిళలకు సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన విధానం. మహిళల పట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏళ్ల క్రితం నాటి ఈ విధానం లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు అవగాహన కల్పించడంలో, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు శ్రద్ధ చూపట్లేదు. -
Valentine's Day: తీరం చేరిన ప్రేమకథలు.. లవ్, లైఫ్లో గెలిచిన జంటలు
సాక్షి , కరీంనగర్: ప్రేమ.. కులమతాలకు అతీతమైన భావన. టీనేజీ వయసులో మొదలయ్యే ప్రేమకథలు ఆకర్షణతో మొదలై.. అక్కడితో ముగుస్తాయి. కానీ, పరిణితితో కూడిన ప్రేమకథలు కచ్చితంగా విజయతీరాలు చేరతాయి. ఒక చేత్తో కెరీర్, మరో చేత్తో ప్రేమను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఖండాలు దాటినా, ఏళ్లకు ఏళ్లు గడిచినా ఎదురుచూపుల్లోనే బతికేస్తారు. చివరికి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆ తరువాత పెద్దల్ని ఒప్పిస్తారు. కొందరికి ఈ అవకాశం లేకపోవచ్చు. అయినా వీరు చేరుకున్న విజయతీరాలు, సమాజంలో వీరికి దొరికే స్థానం వీరిపై ఉన్న వ్యతిరేక భావనను క్రమంగా దూరం చేస్తుంది, అందరినీ దగ్గర చేస్తుంది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలపై కథనం. మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాక మా స్నేహితులతో మా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలి్సన అవసరం రాలేదు. అందరినీ ఒప్పించి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య దివ్యాన్షీ కంటి డాక్టర్. ఈ తరం యువతకు నేను చెప్పేది ఒక్కటే.. కెరీర్పై దృష్టి పెట్టి లక్ష్యం సాధిస్తే అన్ని మనవద్దకు వచ్చి చేరుతాయి. ఆకర్షణకు గురైతే లైఫ్ ఆగమవుతుంది. – సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్– డాక్టర్ దివ్యాన్షీ దంపతులు ఖండాలు దాటిన ప్రేమ నేను ఎస్సారార్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నక్రమంలో నాకు రమేశ్ పరిచమయ్యాడు. రోజూ మా కాలేజీకి వచ్చేవాడు. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. అయితే, జీవితంలో పైకి రావాలన్న నా కలను వివరించాను. అయినా తను వెనకడుగు వేయలేదు. నాకు పూర్తిగా సహకరించాడు. ఉన్నత విద్య కోసం నేను బ్రిటన్ వెళ్లాను. పీజీ పూర్తయి ఉద్యోగంలో చేరాక ఇండియా వచ్చాను. నా కోసం ఎదురుచూస్తున్న రమేశ్తో వివాహం జరిగింది. కులాలు వేరుకావడంతో మొదట్లో మా పెద్దలు వ్యతిరేకించినా.. కెరీర్లో నిలదొక్కుకున్న తీరుకు మా ప్రేమను అంగీకరించారు. ఇపుడు లండన్లో రెండు రెస్టారెంట్లు, ఒక కేక్షాప్ నడుపుతున్నాం. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నం. ఏటా మా ఇద్దరి పిల్లలతో ఇండియాకు వస్తాం. – సుష్మ– రమేశ్ నేనే ప్రపోజ్ చేశా.. ఏదో సందర్భంలో తన ఫ్రెండ్ ప్రశాంత్ను పరిచయం చేశారు. ఆ పరిచయమే కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. ధైర్యం చేసి నేనే పెళ్లి ప్రేమను ప్రతిపాదించా. అమ్మానాన్న అంగీకరించలేదు. గొడవలు కూడా అయ్యాయి. సొంతంగా నిర్ణయం తీసుకుని అగ్రహారం ఆంజనేయస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ల తరువాత ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించి కలిసిపోయారు. ప్రస్తుతం అంతా సంతోషంగానే ఉంది. – లహరి, ప్రశాంత్ అనాథ యువతికి అన్నీ తానై.. కథలాపూర్(వేములవాడ): అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు ఓ సామాజిక సేవకుడు. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన కాసారపు శేఖర్ షైన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని అదే గ్రామానికి చెందిన రమ్యను ప్రేమించాడు. 2013లో శేఖర్, రమ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని ఆమెకు అన్నీ తానయ్యాడు. వీరికి శ్రీహర్ష, రిషికేశ్ ఇద్దరు కుమారులు. శేఖర్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో 2018లో గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నాడు. కులాంతరమే కాదు.. అనాథ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శేఖర్ను పలువురు అభినందించారు. ప్రేమ కోసం దేశంలోనే.. మాది మంథని, మా వారిది కరీంనగర్. నేను అపుడు పీజీ చదువుతున్నా. మా ఆయన ప్రభాకర్ అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకలో అనుకోకుండా కలిశాం. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాం. మాకు ఇపుడు ఒక పాప. మా ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు చివరికి మమ్మల్ని క్షమించేశారు. హైదరాబాద్లో ఓ ఇంటి వారిమయ్యాం. విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా మా పేరెంట్స్ను చూసుకునేందుకు మా ప్రభాకర్ వాటిని సున్నితంగా తిరస్కరిస్తారు. ఏమాత్రం సెలవు దొరికినా మా పేరెంట్స్కే టైం కేటాయిస్తాం. – స్వప్న– ప్రభాకర్ అప్పట్లో చాలా కష్టపడ్డాం నాది జగిత్యాల, ఆమెది కరీంనగర్. డిగ్రీ చదువుకునే రోజుల్లో మాకు ఎన్సీసీలో పరిచయం. పీజీకి వెళ్లాక కూడా కొనసాగింది. అపుడే ఎస్సై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తనకు దాదాపుగా ఏడాది దూరంగా ఉండి ప్రిపేరయ్యా. ఈ లోపు విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించారు. నేను ఎస్సైగా సెలెక్ట్ అయ్యాక మరో ఏడాది దూరంగా ఉన్నాం. పోస్టింగ్ తీసుకున్నాక వెళ్లి వారిని ఒప్పించా. తొలుత వ్యతిరేకించినా... కొన్నిరోజులకు కలిసిపోయాం. ఇపుడు నేను సీఐగా మానుకోటలో విధులు నిర్వహిస్తున్నా. మాకిద్దరు పాపలు. కులాలు వేరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటే అంతా ఆమోదిస్తారు. – సుష్మ– రవిరాజ్ ప్రేమ ముందు ఓడిన వైకల్యం పెద్దపల్లిరూరల్: ‘నా స్వాతి బంగారం.. నేను మరుగుజ్జుగా పుట్టినా నాకు ఆ భగవంతుడు స్వాతి రూపంలో మంచి జీవితాన్నే ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు రవికిరణ్. స్వాతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి పెద్దపల్లికి వలస వచ్చింది. వారు రవికిరణ్ ఇంటి సమీపంలో అద్దెకు రావడంతో స్వాతితో ఏర్పడ్డ పరిచయం పరిణయానికి దారితీసింది. స్వాతి కుటుంబీకులు వ్యతిరేకించడంతో అప్పటి సీఐ హబీబ్ఖాన్ను ఆశ్రయించగా ఠాణాలోనే పెళ్లి జరిపించారని రవికిరణ్, స్వాతి పేర్కొన్నారు. వారికి ఓ బాబు, ఇద్దరు కూతుళ్లు జన్మించినా అనారోగ్య కారణాలతో బాబు, ఓ కూతురు చనిపోయారని బాధపడ్డారు. అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు ఆశాజ్యోతిని తమకున్నంతలో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. మరుగుజ్జునైన తనకు ప్రభుత్వం నుంచి దివ్యాంగ పింఛన్ అందుతోందని, మెప్మాలో పనిచేసినందుకు మరో నాలుగు వేలతోనే నెట్టుకొస్తునన్నాడు. టీనేజ్ ప్రేమతో సమస్యలు చదువు పూర్తికాకుండానే టీనేజ్లో ప్రేమలో పడుతున్న వారు చాలా మంది ఆ తరువాత కాలంలో ప్రేమ, ఆకర్షణ తేడాలు తెలుసుకుని తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ప్రేమికులు ఇద్దరిలో ఏ ఒక్కరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా ఇంకొకరు గౌరవించే రీతిలో ప్రేమ ఉండాలి. అంతే కాని ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఫేస్బుక్లు, వాట్సాప్ల్లో పెడతానని బ్లాక్మెయిలింగ్ దిగడం సరికాదు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తే కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. – రాజశేఖర్రాజు, సీఐ, కోరుట్ల -
Nick Vujicic: ‘పరిపూర్ణతే’ అర్హతా? ఆమెది నిజమైన ప్రేమ.. నలుగురు పిల్లలతో ముచ్చటగా..
‘లవ్ వితౌట్ లిమిట్స్’.. అవధుల్లేని ప్రేమ ప్రేమంటే.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఎదుటి వ్యక్తిని అచ్చంగా ఇష్టపడటం గుణం, రూపం, వ్యక్తిత్వం.. ఒక్కటేమిటి మొత్తంగా ఓ మనిషిని ‘నా’ అనుకునే ఫీలింగ్! ఇష్టపడ్డ వ్యక్తిలోని సుగుణాలే తప్ప ‘లోపాల’ని మైనస్లా చూడలేని ఆరాధ్య భావన! ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్ని వర్ణనలైనా సరిపోవు..!! PC: Instagram మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న మాటకు నిలువెత్తు రూపం అతడు.. దృఢసంకల్పం ఉంటే విధికి ఎదురొడ్డి జీవనమాధుర్యాన్ని ఆస్వాదించొచ్చని నిరూపించిన స్ఫూర్తిప్రదాత.. అతడి ఆత్మవిశ్వాసం.. ఆకాశాన్ని తాకే శిఖరం.. అతడి బతుకు పోరాటం.. నిరాశలో కూరుకుపోయిన వారికి ఆశాకిరణం.. అతడి చిరునవ్వు.. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులో ఉన్నవారిని మార్చేసే ఆయుధం.. అతడి మాటలు.. కోట్లాది మందిలో నిస్పృహను వదిలించి నూతనోత్తేజాన్ని నింపే ఔషధపు చుక్కలు PC: Instagram Valentine's Day 2023: Nick Vujicic- Kanae Miyahara Love Story In Telugu: బయటి నుంచి చూసే వారికి అతడంటే ఇంతే! మరి ‘అసలైన అతడు’ ఎలా ఉంటాడు? తనకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి.. తన జీవితం ఇలానే ఉండాలనే కోరికలు.. తనకంటూ భార్య, పిల్లలతో ముచ్చటైన కుటుంబం కావాలన్న తపన.. కానీ పుట్టుకతోనే ‘ఇంపర్ఫెక్ట్’ అంటూ ముద్ర.. ఒకానొక దశలో చచ్చిపోదామన్నంతగా కుంగుబాటు.. కానీ అమ్మానాన్నలు తనను కాపాడి పునర్జన్మను ఇచ్చారు. తమ స్వచ్ఛమైన ప్రేమతో అతడి ఆలోచనలు మార్చివేశారు.. ‘‘దేవుడిచ్చిన గొప్ప బహుమతి నువ్వు.. కాకపోతే అందరి కంటే ఇంకాస్త గొప్పగా ఉన్నావు’’ అంటూ స్ఫూర్తిని నింపారు. ఇష్టమని పక్కకు తప్పుకొన్నారు టీనేజ్లో ఎంతో మంది అమ్మాయిలు నువ్వంటే ఇష్టమన్నారు.. కొన్నాళ్లు డేటింగ్ చేశారు.. కానీ సెట్ అవ్వదని పక్కకు తప్పుకొన్నారు.. చాలా వరకు అన్నీ చేదు అనుభవాలే.. ట్వంటీస్లోకి వచ్చే సరికి తనిక ఫిక్సైపోయాడు. తన జీవితంలోకి ఇక ఏ అమ్మాయి రాదు.. తనను తనలా ప్రేమించలేదు.. తనతో లైఫ్ షేర్ చేసుకోలేదు! కానీ ఆమె రాక అతడి జీవితంలో వసంతాలు పూయించింది.. PC: Instagram ఆమె అతడిని నిజంగా ప్రేమించింది అతడి మనోసౌందర్యాన్ని మెచ్చి.. భార్యగా బంధాన్ని పెనవేసుకున్న ఆమె.. అతడితో తన ప్రేమకు ప్రతిరూపాలుగా నలుగురు అందమైన పిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఆమె ప్రేమను గెలుచుకున్న రియల్ హీరో నిక్ వుజిసిక్.. ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్. అతడితో జీవితాన్ని పంచుకున్న ఆమె పేరు కనే మియహార. రేర్ డిజార్డర్ బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆస్ట్రేలియా దంపతులకు 1982, డిసెంబరు 4న నిక్ జన్మించాడు. ‘ఫోకోమెలియా’ అరుదైన డిజార్డర్ కారణంగా కాళ్లూ, చేతులూ లేకుండా పుట్టిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కానీ దేవుడిపై మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. PC: Instagram కేవలం తమ జీవితాల్లోనే కాదు.. చిన్న చిన్న లోపాలకే డిప్రెషన్లో కుంగిపోయే లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపేలా.. ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మలచుకుంటామని మనసులో సంకల్పించుకున్నారు. చిరు నవ్వుతోనే అందుకు తగ్గట్లే తమ కుమారుడిని సాధారణ పిల్లల్లాగే పెంచారు. స్విమ్మింగ్ చేయడం సహా పలు ఆటలాడటం నేర్పించారు. తోటి వాళ్లు అవహేళన చేసినా చిరునవ్వుతోనే వాటిని ఎలా తిప్పికొట్టాలో నేర్పించారు. ఎంత నిలదొక్కుకుందామని చూసినా ఒక్కోసారి హేళనలు శ్రుతిమించినపుడు.. అందరూ తనని పక్కన పెట్టినపుడు.. ఒంటరితనం నుంచి పారిపోయేందుకు తనను తాను అంతం చేసుకోవాలని భావించాడు నిక్. అయితే, అదృష్టవశాత్తూ అమ్మానాన్నలు అతడిని కాపాడుకోగలిగారు. PC: Instagram ఇంపర్ఫెక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ ‘‘నువ్వు ఎంత అసంపూర్తిగా ఉంటే ఇతరుల ముందు అంత పరిపూర్ణ వ్యక్తిగా నిరూపించుకోగలవు’’ అని అమ్మ చెప్పిన మాట అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. ఓ న్యూస్పేపర్లో వచ్చిన ఆర్టికల్ అతడి జీవితాన్నే మార్చివేసింది. వైకల్యం ఉన్నా సదరు వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో నిక్కు అర్థమైంది. ‘‘కాళ్లూ, చేతులు మాత్రమే లేవు.. అలా అని జీవితానికే అర్థం లేకుండా చేసుకోలేం కదా!’’ అన్న దృక్పథం అతడికి అలవడేలా చేసింది. దేవుడిని విశ్వసించే నిక్కు పదిహేడేళ్ల వయసులో ప్రేయర్ గ్రూప్లో స్పీచ్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ స్థాయికి ఎదిగాడు. దాదాపు 57 దేశాల్లో తన స్పీచ్తో కోట్లాదిమందిలో నూతనోత్తేజం నింపాడు. తొలి చూపులోనే ప్రేమ.. చూపులు కలిసిన శుభవేళ ఈ క్రమంలోనే కనే మియహారను కలుసుకున్నాడు. తొలి చూపులోనే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ అప్పటికే.. తమ కుటుంబంలోని కలతలు చూసి విసిగిపోయిన కనేకు వైవాహిక బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకు తోడు.. నిక్ను కలిసే కంటే ముందున్న రిలేషన్షిప్స్ ఆమె మనసులో ఏ మూలో ఉన్న రవ్వంత నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేశాయి. అయితే, విధిరాత మరోలా ఉంది. నిక్తో చూపులు కలిసిన ఆ వేళ శుభప్రదమైంది.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. PC: Instagram సమాజం నుంచి తమ జంటకు ఎదురుకాబోయే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో ముందే చర్చించుకున్నారు. ఒకరి కోసం ఒకరు బతకాలని నిర్ణయించుకున్నారు. 2012లో వాలంటైన్స్ డేకి రెండ్రోజుల ముందు అంటే ఫిబ్రవరి 12న పెళ్లి చేసుకున్నారు. నిజమైన ప్రేమ ఎలాంటి అవరోధాలనైనా అధిగమిస్తుందనే సందేశాన్నిస్తూ ముందుకు సాగుతున్నారు. లవ్ వితౌట్ లిమిట్స్ ఆస్ట్రేలియా అబ్బాయి- మెక్సికో అమ్మాయి ఇలా ప్రేమతో ఒక్కటయ్యారు. తమ ప్రేమ ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు.. ‘‘లవ్ వితౌట్ లిమిట్స్: ఎ రిమార్కబుల్ స్టోరీ ఆఫ్ ట్రూ లవ్ కాంకరింగ్ ఆల్’’.. (అవధుల్లేని ప్రేమ: నిజమైన ప్రేమ అన్నిటినీ జయిస్తుందన్న అర్థం) పేరిట పుస్తకాన్ని రచించారు. PC: Instagram దేవుడే తమను కలిపాడని నమ్మిన ఆ జంటకు ఇప్పుడు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు కియోషి, డేజాన్, ఒలీవియా, ఎల్లీ. నిజమైన ప్రేమకు అర్థంగా నిలిచిన నిక్ వుజిసిక్- కనే మియహారకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు!! -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్డెస్క్ చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. -
ప్రేమికుల రోజు చూడాల్సిన స్పెషల్ మూవీస్ ఇవే..
వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం. ప్రేమికుల రోజు సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్లో టాప్ ప్లేస్లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. జయం దేశ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం. గీతాంజలి నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్గ్రీన్. ఏ మాయ చేసావే నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్నైట్ స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆర్య సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్డమ్కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు. లవ్స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్కు తగ్గట్లుగా మంచి ఫీల్గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. -
ప్రేమకథా చిత్రమ్
‘ప్రేమకథ’లు చూడ్డానికి బాగుంటాయి. గాఢమైన ‘ప్రేమ కథలు’ అయితే మనసులో నిలిచిపోతాయి. దుష్యంతుడు, శకుంతలది అలాంటి ప్రేమకథే. కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నా వీరి ప్రేమ బలమైనది కాబట్టే నిలబడింది. ఈ ప్రేమకథని త్వరలో వెండితెరపై చూడనున్నాం. మరికొన్ని ప్రేమకథలు కూడా రానున్నాయి. ఒక్కో ‘ప్రేమకథా చిత్రమ్’ది ఒక్కో కథ. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రేమకావ్యాల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ది ప్రత్యేకమైన స్థానం. కాళిదాసు రచించిన ఈ ప్రేమకథ ఆధారంగా ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమ చుట్టూ ఈ సినిమా సాగు తుందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ కొత్త ప్రేమకథతో ఖుషీగా రానున్నారు విజయ్ దేవరకొండ–సమంత. ఈ ఇద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘ఒక రొమాంటిక్ ప్రేమకావ్యం నిర్మాణంలో ఉంది’ అని విజయ్, ‘కుటుంబమంతా చూసి మంచి అనుభూతికి గురయ్యే సినిమా’ అని సమంత ‘ఖుషి’ అప్డేట్ అప్పుడు పేర్కొన్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్కి చిన్న బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటోంది యూనిట్. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో 2018లో వచి్చన లవ్స్టోరీ ‘గీత గోవిందం’ సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఇది లవ్స్టోరీ ఫిల్మ్ అని, ‘గీత గోవిందం’కు సీక్వెల్ అనే ప్రచారం తెరపైకి వచ్చ్చింది . ఇదే నిజమైతో విజయ్ వెంట వెంటనే ప్రేమకథా చిత్రాల్లో నటించినట్లు అవుతుంది. ఇక అబ్బాయి, అమ్మాయి స్నేహం ప్రేమగా మారిన ఎన్నో కథలు వెండితెరపైకి వచ్చాయి. ప్రేక్షకుల మనసులను మెప్పించాయి. ఈ కోవలో రానున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అబ్బాయి సంజయ్ పీసపాటి, అమ్మాయి అనుపమా కస్తూరిల ప్రేమకథ ఇది. సంజయ్ పాత్రలో నాగ సౌర్య , అనుపమ పాత్రలో మాళవికా నాయర్ నటించారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ అంశాల మేళవింపుతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ హీరోగా, విరాజ్ అశి్వన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఫస్ట్ లవ్ కాన్సెప్తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక శ్రీదేవి ఎక్కడుంటే శోభన్బాబు అక్కడే ఉంటాడట. ఎందుకంటే ప్రేమంట. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందిన లవ్స్టోరీ ‘శ్రీదేవి శోభన్బాబు’. ఇందులో శోభన్బాబుగా సంతోష్ శోభన్, శ్రీదేవిగా గౌరి కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇంకోవైపు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో ఫేమ్ సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఫోన్ నంబర్ నైబర్హుడ్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో కాశ్మీర హీరోయిన్గా నటించగా, కిశోర్ డైరెక్టర్ చేశారు. ఈ చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఇవి కాక మరికొన్ని ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. -
ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..
Hardik Pandya- Natasa Stankovic Love Story: అమ్మానాన్న.. తోబుట్టువులు మినహా.. జీవితంలో అచ్చంగా తమకు మాత్రమే సొంతమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా సదరు వ్యక్తి ముందు మాత్రమే తమ మనసులోని భావాలు వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా వాళ్లతోనే పంచుకోవడానికే ఇష్టపడతారు. తాము పూర్తిగా నమ్మిన వ్యక్తి.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే.. చెప్పేదేముంది! ఎగిరి గంతేయడం సహజం. మనసుకు నచ్చితే చాలు.. ‘‘మనవాళ్లా’’, ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వారితో ముడిపడిపోతారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధాన్ని బలపరచుకుంటారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ఈ కోవకు చెందినవాళ్లే! సాధారణ మధ్య తరగతి కుటుంబం హార్దిక్- నటాషా విభిన్న ధ్రువాలకు చెందిన వాళ్లు. గుజరాత్లోని సూరత్లో 1993 అక్టోబరు 11న జన్మించాడు హార్దిక్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే, కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో సహా వడోదరకు ఫిష్ట్ అయ్యారు. కొడుకులు కృనాల్, హార్దిక్కు క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోన్ ఏజెంట్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి ప్రోత్సాహంతో అన్న కృనాల్తో కలిసి కిరణ్ మోరే అకాడమీలో చేరిన హార్దిక్.. అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే, అప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆటను వదల్లేదు. ఆటంటే ప్రాణం తొమ్మిదో తరగతిలోనే హార్దిక్ స్కూల్కు వెళ్లడం మానేసి పూర్తిగా క్రికెట్పైనే దృష్టి పెట్టాడు. జూనియర్ లెవల్లో రాణిస్తూ.. క్లబ్ క్రికెట్లో సత్తా చాటాడు. నిజానికి 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్గా ఉన్న హార్దిక్ పాండ్యా.. బరోడా కోచ్ సనత్ కుమార్ సూచనతో ఫాస్ట్ బౌలర్గా మారాడు. దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ఆడిన హార్దిక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ దృష్టిలో పడటంతో అతడి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. 2015 నుంచి 2021 వరకు అదే జట్టుతో కొనసాగిన హార్దిక్.. ఆర్థికంగానూ, టీమిండియా క్రికెటర్గానూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భావి కెప్టెన్గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు. ‘ప్లే బాయ్’ ఇమేజ్ అయితే, కొన్నిసార్లు తన ఆటిట్యూడ్ వల్ల హార్దిక్ తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్తో కలిసి.. 2019లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడు నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన హార్ది్క్ పాండ్యా.. నటాషానూ మధ్యలోనే వదిలేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెర్బియా నుంచి వచ్చి బాలీవుడ్లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటాషాకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుపులు. అయితే, ఎవరెన్ని మాటలు అన్నా నటాషా వెనుకడుగు వేయలేదు.. హార్దిక్ను నమ్మిన నటాషా ఓ పార్టీలో తనకు పరిచయమైన హార్దిక్ను హార్దిక్లానే చూసింది. తన కంటే వయసులో దాదాపు ఏడాది చిన్నవాడైన అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. ఆమె నమ్మకాన్ని హార్దిక్ వమ్ముచేయలేదు. 2020 జనవరిలో నటాషా చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ముచ్చటైన కుటుంబం మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ గోముగా అడిగాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందే మనసిచ్చిన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది మేలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలల్లోనే వీరి దాంపత్యానికి గుర్తుగా కుమారుడు అగస్త్య జన్మించాడు. వీరిది ఇప్పుడు ముగ్గురితో కూడిన ముచ్చటైన కుటుంబం. మరోసారి తన ‘రాణి’తో నిజమైన ప్రేమకు విధి కూడా సహకరిస్తుంది అంటారు. ఇలా రెండు వేర్వేరు దేశాల్లో జన్మించి.. విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన హార్దిక్- నటాషా.. ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వేడుకగా పెళ్లిచేసుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనుంది. తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్, నటాషాను వివాహమాడనున్నాడు. రాజస్థాన్ కోటలో తన ‘హృదయపు పట్టపురాణి’ని మనువాడి మరో చిరకాల జ్ఞాపకాన్ని మిగిల్చబోతున్నాడు. భార్య విశ్వాసాలకు గౌరవమిస్తూ ‘వైట్ థీమ్ వెడ్డింగ్’కు ఏర్పాట్లు చేయించి మరోసారి ఆమె మనసు గెలుచుకున్నాడు. వాలంటైన్స్డే-2023 సందర్భంగా ప్రేమ పక్షులు.. సారీ సారీ ప్రేమతో ముడిపడిన దంపతులు.. మరోసారి పెళ్లిచేసుకోబోతున్న అగస్త్య అమ్మానాన్న హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్కు శుభాకాంక్షలు!! చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! -
కృష్ణగాడి లవ్స్టోరీ
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్ కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేసి, ఆసక్తికరంగా ఉందన్నారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాబు వర్గీస్ సంగీతం, ఎస్కే రఫి కెమెరా వర్క్ హైలైట్గా నిలుస్తాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చుంచు భాను ప్రకాష్, హరిహర ప్రసాద్ పెట్లా. -
మహేశ్ బాబు-నమ్రతల లవ్స్టోరీ.. ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ల పేరు ముందుంటుంది. తెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ వీరి జోడికి ఎంతోమంది అభిమానులున్నారు. మహేశ్వరుస సినిమాలతో బిజీగా ఉంటే, నమ్రత ఇంటి బాధ్యతలతో పాటు మహేశ్ కాస్ట్యూమ్స్ విషయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. దీనికి తోడు మహేశ్ వ్యాపారాలన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేంతలా ఉండే ఈ అందమైన జంట పరిచయం ఎలా మొదలైంది? అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? అంత స్టార్డమ్ ఉండి సీక్రెట్గా పెళ్లెందుకు చేసుకున్నారు వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహేశ్బాబు, నమ్రతలు తొలిసారి వంశీ సినిమా షూటింగ్లో కలుసుకున్నారు. అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారట.దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే మహేశ్-నమ్రతల స్నేహం మరింత బలపడింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. వీరి ప్రేమను మహేష్ కుటుంబం తొలుత అంగీకరించలేదట.దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట.అలా నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించింది. అలా ఈ ప్రేమ మజిలీ పెళ్లిదాకా వెళ్లింది. 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. వీరి పెళ్లి జరిగే వరకు ఈ విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 18ఏళ్ల వైవాహిక బంధంతో ఇప్పటికీ ఎవర్గ్రీన్ కపుల్గా ఆదరణ పొందుతున్న మహేశ్, నమ్రతల దంపతులకు పలువురు సెలబ్రిటీల నుంచి పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
బ్రేకప్ జరిగింది.. నాకు రిలేషన్షిప్స్ సెట్ కావు : సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి తాను రిలేషన్షిప్లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని పేర్కొన్నాడు. 'నేను చాలా ఎమోషనల్ పర్సన్. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాను. నాలాంటి వ్యక్తికి రిలేషన్షిప్స్ చాలా డేంజరస్. అవి నాకు సెట్ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో లవ్లో ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. కాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో సందీప్ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు. -
అమెరికా అమ్మాయి-ఆర్మూర్ అబ్బాయి. ఔను వాళ్లు ఇష్టపడ్డారు
సాక్షి, నిజామాబాద్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది పెద్దల మాట. కానీ, మనసులు కలిస్తే చాలు.. అనేది ఇప్పటి జనరేషన్లో కొంతమంది చెప్తున్న మాట. అందుకే తమ వైవాహిక బంధాలకు కులం, మతం, ప్రాంతం లాంటి పట్టింపులు లేకుండా చూసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన ఓ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు కావడం!. విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మధనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చిఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు. ఇవాళ(మంగళవారం) ఆర్మూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటినా ఈప్రేమజంటను ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది. -
Happy Birthday Rajinikanth: గమ్మత్తుగా లతా లవ్లో..
ఎన్న రాస్కెల్.. మైండ్ ఇంట్.. సూపర్స్టార్ క్రేజ్ ఒక్క తమిళనాడు.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలు.. సౌత్.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా విస్తరించింది. ఏడు పదుల వయసులోనూ స్క్రీన్పై ఆయన స్టైలింగ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ప్రతీ పుట్టినరోజుకి వయస్సు తగ్గిపోతుందేమో అనిపించేది.. తలైవా విషయంలోనే ఏమో!. రజనీకాంత్ స్టైల్కు ఉన్న ప్రత్యేకత అదే!. రజనీ పుట్టినరోజుకు.. కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కానీ, రజనీకాంత్ది ప్రేమ వివాహమని.. అది చాలా గమ్మత్తుగా జరిగిందనేది మీకు తెలుసా?.. సినిమాల్లో రజనీ.. హీరోయిన్లతో ప్రేమ-పెళ్లి.. ఎంత విజీగా అయిపొగొట్టేస్తారో!. కానీ, రియల్ లైఫ్లో ఇష్టపడ్డ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. డెబ్భైవ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రాన్ని.. తిల్లు మల్లు పేరుతో కోలీవుడ్లో రీమేక్ చేశారు దర్శక దిగ్గజం బాలచందర్. అందులో ఆయన ప్రియశిష్యుల్లో ఒకరైన రజనీ హీరో. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కి.. సూపర్ హిట్ అయ్యిందా చిత్రం. అయితే.. ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకావిడ వచ్చారని.. రజనీతో ఆయన అసిస్టెంట్ చెప్పారు. అయితే షూటింగ్ హడావిడిలో ఉన్న రజనీ కాసేపటి దాకా ఆ విషయం పట్టించుకోలేదు. ఆపై ఆ విషయం గుర్తొచ్చి.. పక్కకి వెళ్లారు. ఆమె పేరు లతా రంగాచారి. ఆమెను చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో మరో ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి.. తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పి వెళ్లిపోయిందట. కానీ, తలైవా చాలా చిలిపి. ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్కు చెప్పాడంట. ఆయన.. లత సోదరి సుధ భర్త కావటం విశేషం. దీంతో తన పని తేలిక అవుతుందని రజనీ భావించారు. అదే సమయంలో.. ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు.. మహేంద్రన్ దౌత్యంతో వాళ్ల ప్రేమ ఫలించింది. రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం టెన్షన్తో ఎదురు చూసేలా చేశారట. లతా కూడా కొన్నిరోజులు ఆయనతో మాట్లాడకుండా ఏడ్పించిందట. దీంతో రజనీ ఎవరితో మాట్లాడకుండా కొన్నిరోజులపాటు డిప్రెషన్లోకి వెళ్లారు. చివరికి.. లత, మహేంద్రన్లు రజనీ ఇంటికి అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యంతో ఆనందానికి లోనయ్యారట. అలా.. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇది సూపర్స్టార్ గమ్మత్తు లవ్ కమ్ మ్యారేజ్ కహానీ!. -
కుక్క పిల్ల కారణంగానే ఆ హీరోతో ప్రేమలో పడ్డా: హీరోయిన్
‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది కన్నడ బ్యూటీ హరిప్రియ. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా నటసింహం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో బాలయ్య సరసన నటించి,మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కానీ.. కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. షబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా తన లవ్స్టోరీని రివీల్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చింది. ‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Hariprriya (@iamhariprriya) -
ఇద్దరిదీ ఒకే ఊరు.. సినిమాను తలపించే లవ్స్టోరీ.. పోలీస్స్టేషన్లో ప్రేమజంట..
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రేమజంట తెలిపిన వివరాలు మేరకు.. వడ్డిముక్కల గ్రామానికి చెందిన శీలం అవినాష్, అదే గ్రామానికి చెందిన జె.ఏస్తేర్రాణి ఒకరినొకరు ప్రేమించుకొని ఆదివారం వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలతో తమకు హాని ఉందని రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమజంటకు చెందిన ఇరుకుటుంబాలతో ఎస్ఐ భార్గవ్ మాట్లాడి అబ్బాయి అవినాష్ తల్లిదండ్రులతో ప్రేమజంటను పంపించారు. చదవండి: బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే.. -
Viral Love Story: ఆయన వయసు 70, ఆమెకు 19.. ఇద్దరిది ఒకటే టేస్టు...
‘మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటారు. వివాహానికి ఈడు జోడు కుదరాలి అంటారు. అయితే, కొన్ని పెళ్లిళ్లు వింతగా విడ్డూరంగా జరుగుతుంటాయి. ముదిమి వయసులో ఉన్న వ్యక్తులకు యవ్వనులకు ముడిపడుతుంది. ఇటువంటి ప్రత్యేక వివాహాలకు సంబంధించి యూట్యూబర్ సయ్యద్ బాసిత్ వీడియోలు చేస్తుంటాడు. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్లో 19 ఏళ్ల యువతిని 70 ఏళ్ల వ్యక్తి మనువాడాడు. అది తాజాగా వైరల్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం! లిఖత్ అలీ (70) లాహోర్లోని ఓ పార్కుకు మార్నింగ్ వాక్ వెళ్తుండేవాడు. అక్కడకు షుమైలా (19) కూడా వస్తుండేది. అనుకోకుండా చోటుచేసుకున్న ఓ సన్నివేశం వారి మనసుల్ని కలిపింది. షుమైలా ముందు నడుస్తుండగా.. ఆ వెనకే వెళ్తున్న లిఖత్ అలీ ఓ పాటను హమ్ చేస్తున్నాడు. దాంతో మ్యూజిక్ అంటే చెవికోసుకునే ఆ యువతి.. లిఖత్ పాటకు ఫిదా అయింది. అలా వారిద్దరి మనసులు కలిశాయి. (చదవండి: ఏడుగురికి ఉరి శిక్ష..షాక్లో మానవ హక్కుల సంఘాలు) ‘ప్రేమ వయసు భేదాల్ని పట్టించుకోదు. అలా జరిగిపోతుంది అంతే!’ అని షుమైలా సిగ్గుపడుతూ చెప్పింది. మరి మీ పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకున్నారా? లేక ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అని అడగ్గా.. ‘తొలుత ఒప్పుకోలేదు. వయసులో అంత తేడా ఉన్న వ్యక్తిని పెళ్లాడటం వద్దే వద్దు అని తేల్చిచెప్పారు. కానీ, నేను, లిఖత్ వారిని ఒప్పించగలిగాం’ అని కొత్త పెళ్లికూతురు బదులిచ్చింది. వయసులో భారీ తేడాలతో పెళ్లిచేసుకున్నవారిని దయచేసి నిందించవద్దని కోరింది. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంచుకుంటారని చెప్పుకొచ్చింది. ఆత్మాభిమానం, వ్యక్తిత్వమే రెండు మనసుల కలయికకు, పెళ్లికి సోపానమని తెలిపింది. చెడు తిరుగుళ్లు తిరిగే బదులు మనసుకు నచ్చినవాడితో మనువు ఎంతో మంచిది కదా అని ఆమె సూచించింది. ఇక శరీరానికికే వయసు 70 అని.. తన మనసుకు కాదని లిఖత్ పేర్కొన్నాడు. ఎప్పుడూ హోటళ్లలో భోజనం చేసే తనకు.. భార్య రాకతో మరో కొత్త లోకం పరిచయమైందని అన్నాడు. ఇదిలాఉండగా.. గత ఆగస్టులో కూడా ఇటువంటి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బాబీ డియోల్ పాటనే తమను ఒక్కటి చేసిందని వారు చెప్పడం గమనార్హం. (చదవండి: ‘ఈ సలహా నా భార్య ఎప్పుడో చెప్పింది’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్) -
Virushka: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!
Virat Kohli- Anushka Sharma Love Story: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది.. ‘‘థాంక్ గాడ్.. నువ్వు ఈ భూమ్మీద పుట్టావు కాబట్టి సరిపోయింది.. లేదంటే నాకసలు ఏం తోచేదే కాదు.. నువ్వు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు.. నీ రూపమే కాదు.. మనసు కూడా ఎంతో అందమైనది’’ అంటూ ఆమెపై ప్రేమను కురిపిస్తాడు అతడు.. దేవుడు తనకిచ్చిన గొప్ప కానుకకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొంటాడు.. ఆమె ఒక్కమాటలో.. ‘‘నువ్వే సర్వస్వం.. నీపై నా ప్రేమ అపరిమితం’’ అంటుంది. ఎల్లవేళలా అతడికి తోడుగా ఉంటుంది.. ఆమె అనుష్క శర్మ.. అతడు విరాట్ కోహ్లి.. వారి ప్రేమ కథే ఇది! చూపులు కలిసిన శుభవేళ కోహ్లి అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం.. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా తమ కమర్షియల్ యాడ్లో అతడిని నటింపజేసింది ఓ షాంపూ కంపెనీ. 2013 నాటి ఆ యాడ్లో కోహ్లికి జోడీగా అనుష్క శర్మ. స్వతహాగా నటి కాబట్టి చాలా క్యాజువల్గానే సెట్లోకి వచ్చిందామె. కానీ కోహ్లికి కొత్త కాబట్టి కాస్త కంగారుగా ఉన్నాడు. పొడవాటి హీల్స్ వేసుకుని తన కంటే ఎత్తుగా కన్పిస్తున్న అనుష్కను చూసి.. ‘‘ఇంతకంటే పొడుగైన హీల్స్ దొరకలేదా’’ అంటూ ఆమెతో మాట కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె కాస్త చిరాగ్గా ఏంటీ అని ఎదురు ప్రశ్నించడంతో.. ‘‘లేదు లేదు నేను జోక్ చేశానంతే’’ అంటూ తప్పించుకున్నాడు. కానీ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ఆమె వ్యక్తిత్వానికి ఫిదా కాకుండా మాత్రం ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా మాటలు కలిశాయి. అవును ప్రేమలో ఉన్నాం అడపాదడపా బయట కలిసి కనిపించేవారు.. ఇటు క్రికెట్.. అటు సినిమా వర్గాల్లో చర్చ.. ఇంతకీ వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా? లేదంటే మూణ్నాళ్ల ముచ్చటగానే వీరి బంధం ముగుస్తుందా? అంటూ చెవులు కొరుక్కున్నారు. అనవసరంగా గాసిప్ రాయుళ్లకు మరీ ఎక్కువ పని కల్పించడం ఎందుకని విరాట్- కోహ్లి తమ గురించి తామే స్వయంగా బయట ప్రపంచానికి తెలిసేలా ఓ ప్రకటన చేశారు. ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అందరు యువతీ యువకుల్లాగే మేమూ రిలేషన్షిప్లో ఉన్నాం’’ అని తమ బంధాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా 2014 నవంబరులో ఓ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు జంటగా హాజరయ్యారు. ఫ్లైయింగ్ కిస్తో.. అదే ఏడాది శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్ విరాట్ చరిత్ర సృష్టించాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చింది అనుష్క.. స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత బ్యాట్ను ముద్దాడి స్టాండ్స్లో ఉన్న నిచ్చెలికి ఫ్లైయింగ్ కిస్ విసిరాడు కోహ్లి. అతడి ప్రతిభకు మెచ్చుకోలుగా.. ప్రేమకు బదులుగా లేచి నిల్చుని చిరునవ్వులు చిందించింది అనుష్క. కానీ కొంతమంది ఆకతాయిలు వారి ప్రేమను అపహాస్యం చేసే విధంగా.. అనుష్కను దారుణంగా నిందిస్తూ ట్రోల్ చేశారు. అయితే, కోహ్లి ఆమెకు అండగా నిలబడ్డాడు. తనలో సానుకూల దృక్పథం పెంపొందడానికి కారణం ఆమేనంటూ ప్రేమను చాటుకున్నాడు. ఎంగేజ్మెంట్.. పెళ్లి 2016లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన కథనాలను ఇద్దరూ ఖండించారు. దీంతో విరుష్క ఫ్యాన్స్లో గందరగోళం నెలకొంది. అయితే వారి అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు కోహ్లి. 2017లో అనుష్కతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ నీతో ఉన్న ప్రతిరోజూ వాలైంటైన్ డేనే అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. అదే ఏడాది డిసెంబరులో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేసుకుందీ స్టార్ జంట. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు విరుష్క. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో కుమార్తె వామిక జన్మించింది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా.. ఎన్హెచ్ 10 సినిమాతో నిర్మాతగా మారింది అనుష్క. ఆ సినిమాలో ఆమెదే లీడ్ రోల్. అనూహ్య పరిస్థితుల్లో అన్యాయంగా తన భర్తను, ఓ ప్రేమజంటను పొట్టనబెట్టుకున్న దుర్మార్గులకు శిక్ష విధించిన ఆధునిక స్త్రీగా ఆమె నటన అమోఘం. సినిమా చూసి మరోసారి ఫిదా అయ్యాడు కోహ్లి. నా అనుష్క నన్ను గర్వపడేలా చేసిందంటూ కితాబులిచ్చాడు. అనుష్క కూడా అంతే.. తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఎల్లప్పుడూ భర్త వెంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తన కెరీర్లో ఎత్తుపళ్లాలు.. ముఖ్యంగా గత మూడేళ్లలో నిలకడలేమి ఫామ్, కెప్టెన్సీ కోల్పోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విమర్శల పాలైన కోహ్లికి ఆమె ధైర్యాన్నిచ్చింది. తిరిగి ఫామ్ పొందడం, ఆసియా కప్, ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కోహ్లి.. తన సెంచరీని అనుష్కకు అంకితమిస్తూ.. తన జీవితంలో ఆమె పాత్ర, ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పాడు. ఇలా ఈ స్టార్ జంట ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ యువ జంటకు ఆదర్శంగా ఉంటోంది. (నవంబరు 5 కోహ్లి పుట్టినరోజు సందర్భంగా) - సుష్మారెడ్డి యాళ్ల చదవండి: Virat Kohli Birthday Special: 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
అలా చూసి..ఇలా చాటింగ్.. పెళ్లికి ట్విస్ట్..‘కాంతార’ఫేమ్ రిషబ్ శెట్టి లవ్స్టోరీ
‘కాంతార’... చిన్న చిత్రంగా విడుదలైన ఈ కన్నడ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచ వాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్కరు రిషబ్ శెట్టి గురించి ఆరా తీస్తున్నారు. ఆయన బ్యాగ్రౌండ్, పర్సనల్ లైఫ్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి లవ్స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫేస్బుక్లో ప్రేమాయణం రిషబ్ శెట్టిది ప్రేమ వివాహం. 2016లో రిషబ్ శెట్టి కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారట. ఆ కార్యక్రమానికి రక్షిత్ శెట్టి వీరాభిమాని ప్రగతి కూడా వెళ్లిందట. అక్కడే ప్రగతిని చూశాడట రిషబ్. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడట. ఆమె గురించే ఆలోచిస్తూ.. ఫేస్బుక్ ఓపెన్ చేశాడట. అందులో ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించిందట. దాదాపు ఏడాది క్రితమే రిషబ్కి ప్రగతి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందట. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదట. ఈవెంట్లో చూశాక.. ఫ్రెండ్రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడట.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాటింగ్, ఫోన్కాల్స్ మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం..పెళ్లివరకు వెళ్లడం జరిగిపోయింది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు ప్రగతి కుటుంబ సభ్యులు. ఈ పెళ్లికి మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. రిషబ్ది సినిమా బ్యాగ్రౌండ్ కావడం, పెద్దగా సెటిల్డ్ కాలేదనే ఉద్దేశంలో పెళ్లికి నిరాకరించారట. కానీ ప్రగతి పట్టుబట్టి ఇంట్లో వాళ్లని ఒప్పించిందట. 2017లో రిషబ్, ప్రగతి పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిలిం డైరెక్షన్లో డిప్లొమా చేసిన ఆయన కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్గా చేరారు. అతను తెరకెక్కించిన ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. అలా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాతగా ఒక చిత్రం, దర్శకుడిగా మరో మూవీ చేస్తున్నారు -
లవ్స్టోరీకి పనికి రానన్నారు.. అందుకే ఈ మూవీ చేశాను : హీరో
అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్ జంటగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ జంజాల నిర్మించిన చిత్రం ‘నీతో’. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, నటుడు శివ, ఐ.ఏ.ఎస్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిరామ్ వర్మ మాట్లాడుతూ – ‘‘నా యాక్టింగ్ లవ్స్టోరీలకు పనికి రాదన్నట్లుగా కొందరు మాట్లాడారు. దాంతో మంచి లవ్స్టోరీ చేయాలనే కసి పెరిగింది. బాలు శర్మగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ డిఫరెంట్ లవ్స్టోరీ చేశాను’’ అన్నారు. ‘‘యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్తో రూపొందిన ఫ్రెష్ లవ్స్టోరీ ‘నీతో’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఫ్యామిలీతో చసే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే నేను రిలీజ్ చేస్తున్నాను’’ అన్నారు పీవీఆర్ ఉదయ్. -
ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్లే...ప్రేమలో పడ్డా!: లవ్ స్టోరి వైరల్
బెంగుళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పక్క ట్రాఫ్రిక్ సమస్య తోపాటు, గుంతలమయమైన రహదారులతో నిత్యం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐతే ఇక్కడొక వ్యక్తి ఆ టాఫ్రిక్ సమస్య కారణంగానే తాను ప్రేమలో పడ్డానని, పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే...బెంగళూరులోని ఒక వ్యక్తి ఎజిపురా ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల వారు ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. అప్పుడే అతను తన భార్యని సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద చూసినట్లు చెబుతున్నాడు. ఆ రోజు విపరితమైన ట్రాఫిక్ కారణంగా... షార్ట్కట్లో వెళ్లే మరో మార్గాన్ని ఎంచుకోవాలసి వచ్చింది. ఆ రహదారి గుంతమయం కావడం, మరోవైపు బాగా ఆకలి దంచేయడంతో ఆ రోజు తాము ఒక రెస్టారెంట్కి వెళ్లాం. అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాము మూడేళ్లు డేటింగ్లో ఉన్నామని. తదనంతర పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తమ పెళ్లై రెండేళ్లవుతుందని చెబుతున్నాడు. ఐతే తాము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి దాదాపు ఐదేళ్లు అయినా... ఆ ఫ్లైఓవర్ మాత్రం నిర్మాణంలోనే ఉంది. ట్రాఫ్రిక్ సమస్య కూడా తీరలేదని వాపోయాడు. ఇలా అతను వినూత్నంగా తన ట్రాఫిక్ కష్టాలు కారణంగా తాను ఒక ఇంటివాడిని అయ్యానంటూనే...రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలను వివరించాడు. ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అతని ప్రేమ కథను విని....ట్రాఫిక్ కొందరికి చేదు అనుభవాలు ఇస్తే, అతనికి మాత్ర మాత్రం మంచి అనుభవాన్ని ఇచ్చిందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Top drawer stuff on Reddit today 😂😂@peakbengaluru pic.twitter.com/25H0wr526h — Aj (@babablahblah_) September 18, 2022 (చదవండి: సీఎం ముఖచిత్రంతో 'పేసీఎం'.. కర్ణాటక సర్కార్పై కాంగ్రెస్ అస్త్రం) -
భర్తకు ట్రాన్స్వుమన్తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..
భువనేశ్వర్: ఒడిశా కలాహాండీ జిల్లాలో ట్రాన్స్వుమన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 32 ఏళ్ల వ్యక్తి. అయితే అతనికి అప్పటికే మరో మహిళతో వివాహమైంది. రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోవడమే గాక.. ట్రాన్స్వుమన్ కూడా తమతో పాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించడం గమనార్హం. అలామొదలైంది.. ట్రాన్స్వుమన్ను గతేడాది రాయగడ జిల్లా అంబడోలాలో చూశాడు ఈ వ్యక్తి. రోడ్డుపై భిక్షాటన చేసే ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడిపోయాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత రోజూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యక్తి భార్య అతని ఫోన్ను చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. రోజూ ట్రాన్స్వుమెన్తో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడ్ని భార్య నిలదీసింది. ఇక చేసేదేంలేక అతను నిజం ఒప్పుకున్నాడు. ట్రాన్స్వుమన్తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె తనుకు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో భార్య వారి రిలేషన్కు అంగీకరించింది. పెళ్లి చేసుకుంటామంటే ఓకే చెప్పింది. భార్య అంగీకారంతో ట్రాన్స్వుమన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. రెండో పెళ్లి చెల్లదు.. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. భర్త మాత్రం తమ కుటుంబమంతా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నాడు. చట్టాల గురించి తాము పట్టించుకోమని పేర్కొన్నాడు. చదవండి: అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్ -
హౌస్ కీపర్ని పెళ్లి చేసుకున్న డాక్టర్
ఓ పాకిస్తానీ జంట వింత ప్రేమ కథ. చాలా వరకు ప్రేమ కథల్లో తల్లిదండ్రులు అంగీకరించకపోవడం లేదా వేర్వేరు మతాలు లేదా వేరే వర్గం ప్రేమకి అడ్డంకిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జంట మధ్య ప్రొఫెషన్ పరంగానే చాలా వ్యత్యాసం ఉంది. వాళ్లు ఎలా ప్రేమించుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి డాక్టర్, అబ్బాయి హౌస్ కీపర్గా పనిచేస్తున్నాడు. అసలేం జరిగిందంటే... పాకిస్తాన్కి చెందిన కిశ్వర్ సాహిబా ఎంబీబీఎస్ చదువుకున్న వైద్యురాలు. ఆమె పనిచేసే ఆస్పత్రిలోనే గదులు శుభ్రం చేసి టీలు అందించే షాహిద్ని ప్రేమించింది. ఒక రోజు వైద్యురాలు కిశ్వర్ అతడి ఫోన్ నెంబర్ని అడిగింది. ఆ తర్వాత వారు క్రమం తప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హఠాత్తుగా ఒకరోజు కిశ్వర్ షాహిదాకి ప్రపోజ్ చేసింది. ఒక్కసారిగా ఆమె అలా అడిగేటప్పటికీ షాహిదా షాక్కి గురవ్వడమే కాదు దెబ్బకి జ్వరం కూడా వచ్చేసింది. కొద్ది రోజుల్లనే వారిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే ఆమె వివాహాన్ని ఆమె స్నేహితులు, బంధువులు వ్యతిరేకించారు. పైగా ఆమెను ఇది చాలా పిచ్చి నిర్ణయం అంటూ తిట్టడం మొదలు పట్టారు. దీంతో ఆమె ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తగా ఒక క్లినిక్ని తెరవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది, ఇది అద్భుతమైన ప్రేమ కథ అని ఆ జంటని ప్రశంసిస్తున్నారు. (చదవండి: స్వీట్ బాక్స్ లేయర్ల మధ్య అరకోటిపైనే అక్రమ రవాణ!.. వీడియో వైరల్) -
కలెక్టర్ సంబంధం కాదని చిరంజీవినే పెళ్లాడిన సురేఖ!
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్న మాటను మెగాస్టార్ చిరంజీవి తు.చ. తప్పకుండా పాటించాడు. కష్టపడి నటుడైతే సరిపోదు, స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవాలి అనుకున్నాడు. స్టార్ హీరో ఏంటి? ఏకంగా మెగాస్టార్గా ఎదిగాడు. ఇండస్ట్రీ పెద్దను కాదంటూనే చిత్రపరిశ్రమలోని బరువులను, బాధ్యతలను తన భుజాన వేసుకుని మోస్తుంటాడీ గ్యాంగ్ లీడర్. లెక్కలేనన్ని సాయాలు చేసి మనసున్న మారాజుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు చిరు పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో సంబరాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే చిరంజీవి పెళ్లి స్టోరీ కోసం ఆరా తీస్తున్నారు అభిమానులు. మరి వారిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? చదివేద్దాం.. చిరంజీవి ఓసారి తన స్నేహితుడు బి.సత్యనారాయణను అతడి పెదనాన్నగారింట్లో దింపేశాడు. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్యగారు. అప్పటికే చిరు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించడంతో ఇంట్లోకి వెళ్లాడు. కానీ, అప్పుడు రామలింగయ్యగారు లేరు, అయితే తన స్నేహితుడు కాఫీ తాగి వెళ్దువు అన్నాడు. లోపల కాఫీ పెట్టింది సురేఖ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదప్పుడు. కానీ చిరంజీవి వెళ్లాక ఆ అబ్బాయి ఎవరు? అని సురేఖ ఆరా తీయగా మనవూరి పాండవులులో నటించాడని చెప్పాడు బి.నారాయణ. తర్వాత అల్లు అరవింద్ తన గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని కలెక్టర్కిచ్చి పెళ్లి చెయ్యాలనుండేదట. దాంతో కలెక్టర్కు ఇవ్వాలా? లేదా చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాలా? అని అల్లు ఫ్యామిలీ ఆలోచనలో పడింది. సురేఖ ఎవరిని ఓకే అంటే వారితోనే పెళ్లి జరిపేద్దామని డిసైడయ్యారట. కానీ చిరంజీవి ఆంజయనేయభక్తుడు, చెడు అలవాట్లు లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు అని చాలామంది మంచి సర్టిఫికెట్ ఇవ్వడం, దీనికి తోడు మేకప్మెన్ జయకృష్ణ అల్లు రామలింగయ్యగారిని దగ్గరుండి కన్విన్స్ చేయడంతో తన పెళ్లికి మొదటి అడుగు పడిందని చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సుమారు పది మంది నిర్మాతల దగ్గర చిరంజీవి గురించి తెలుసుకున్నాకే అతడికి సురేఖను ఇచ్చి చేయడానికి ఓకే అన్నాడట. కానీ అప్పుడే పెళ్లేంటని చిరంజీవి తటపటాయించినా ఆయన తండ్రి మాత్రం బలవంతంగా అతడిని పెళ్లిచూపులకు తీసుకెళ్లారు. మరోవైపు ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్ను చేసుకుంది. నేనూ యాక్టర్ను చేసుకుంటే బాగుంటుంది అనుకుందట సురేఖ. అలా తొలిసారి కలిసినప్పుడు చూసుకోకపోయినా ఇద్దరికీ ముడిపడింది. ఫిబ్రవరిలో బ్రహ్మాండమైన ముహూర్తాలుండటంతో లగ్నపత్రిక రాసేశారు. అలా చిరంజీవి- సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఆదర్శ దంపతులకు రామ్చరణ్తో పాటు శ్రీజ, సుష్మిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చదవండి: వన్ అండ్ ఓన్లీ 'మెగాస్టార్' చిరంజీవి ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? -
షాకింగ్ ఘటన: ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది
దిస్పూర్: ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని, వాళ్ల ఆలోచనలు కూడా అంతే ఎక్స్ట్రీమ్గా ఉంటుందని నిరూపించిన ఘటన ఇది. ప్రియుడికి హెచ్ఐవీ ఉంది. ఆ విషయంలో ఆమెకు తెలిసింది. తెలిసింది ఏంటీ.. తెలిసే ప్రేమించింది కూడా. ఇంతలో పెద్దలు వాళ్ల ప్రేమకు అడ్డుతగిలారు. ఓ హెచ్ఐవీ రోగిని చేసుకోవడం ఏంటని చెడామడా వాయించారు ఆ అమ్మాయిని. కానీ, తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నిరూపించుకునేందుకు ఎవరూ దిగని చేష్టలకు దిగిందామె. అస్సాం సువాల్కుచీకి చెందిన ఓ టీనేజర్కి సత్దోలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల కిందట ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఈ మూడేళ్లలో వాళ్ల స్నేహం.. ప్రేమగా ఎదిగింది. కలిసి జీవిద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయారు. ప్రియుడికి హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె జీవించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో పెద్దలకు విషయం చెబితే.. ఆమెను చితకబాదారు. ఇద్దరు రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు కూడా. కానీ, ఈ పెద్దోలున్నారే.. లాక్కొచ్చి ఇంట్లో పడేశారు. బాధితురాలు.. (గతంలో వెళ్లిపోయినప్పుడు ప్రెస్మీట్లో) ఇక లాభం లేదనుకుని తన ట్రూ లవ్ను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఓ సిరంజీ ద్వారా సేకరించి తన నరాల్లోకి ఎక్కించుకుంది ఆమె. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన షాకింగ్ పని.. స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని(15) అబ్జర్వేషన్లో ఉంచామని, బ్లడ్ రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రేమ పేరుతో మైనర్లో ముగ్గులోకి దించిన నేరానికి సదరు యువకుడిని హజో పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఇదీ చదవండి: చిలిపి దొంగలు.. ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు! -
నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
సాక్షి, వెబ్ డెస్క్: వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ఫీస్ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్ సమయంలోనే నమ్రత-మహేశ్ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది. నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్. ఇక పెళ్లి తర్వాత మహేశ్ కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. సినిమా ప్రమోషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్-నమ్రతల రిలేషన్ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. -
తన ఫస్ట్ లవ్ స్టోరిని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi Says He Fell In Love At 7th Standard: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్సింగ్ చద్దా'. సూపర్ హిట్టయిన హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మూవీ విడుదల తేది దగ్గరపడనుండటంతో సినిమా ప్రమోషన్స్లో వేగం పెంచింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్యలను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో టెలీకాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో ఎన్నో ఆసక్తికర విషయాలను, నవ్వులను పంచుకున్నారు. 'లాల్ సింగ్ చద్దాలో అమీర్ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్ స్టూడంట్లా, ఆర్మీ ఆఫీసర్లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది' అని నాగార్జున ప్రశ్నించారు. దానికి వీఎఫ్ఎక్స్ వాళ్లు అంతా చేశారని అమీర్ ఖాన్ చెప్పగా.. 'ఈ మాటలు ఎడిట్ చేయండి' అని చిరంజీవి చెప్పడం సరదాగా ఉంది. చదవండి: ప్రియుడితో బర్త్డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ ఈ క్రమంలోనే 'ఈ సినిమాలో పదేళ్ల వయసులోనే హీరో ప్రేమలో పడతాడు' అని నాగార్జున అన్న వెంటనే.. 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరుని అమీర్ ఖాన్ అడుగుతారు. అప్పుడు చిరంజీవి 'ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి పట్టుకుంటే నేను సైకిల్ తొక్కేవాడిని. అప్పుడు సైకిల్ తొక్కడంపై కాన్సంట్రేషన్ పక్కన పెట్టి ఆమెను చూసేవాన్ని. అప్పుడు ఆమె ముందు చూడు అంటూ నా ముఖాన్ని ముందుకు తిప్పేది' అని తెలిపారు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ అలాగే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు. మెగాస్టార్తో డైరెక్షన్, లేదా ప్రొడక్షన్లో సినిమా చేస్తానని అమీర్ అన్నారు. అప్పుడు చిరంజీవి 'టేక్ వన్ ఓకే కాదు కదా..' అని అనండతో అమీర్ నవ్వేశారు. తర్వాత 'ప్రొడక్షన్ ఓకే. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దు' అని నాగార్జున సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ చిత్రాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే ఏ సినిమా తీస్తారు అని చిరంజీవిని అడిగిన ప్రశ్నకు 'ఏ మూవీ తీయను' అని సమాధానమిచ్చారు. ఇలా ఆద్యంతం నవ్వులతో, ఆసక్తిగా ఈ ప్రొమో సాగింది. మరీ మరిన్ని ఆసక్తికర విషయాలేంటో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ టెలీకాస్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్గా ఆమె కండక్టర్గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్కు అప్పుడు 26. తారా దామోదరన్కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
ప్రియుడి మోసాన్ని దిగమింగుకుని నవ్వుతూ..
ఇష్టపడే వ్యక్తులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే.. కొన్నిసార్లు చాలా ముఖ్యం కూడా. కానీ, ఆ దయాగుణమే కొందరి జీవితాల్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఏ ప్రేయసి చేయని త్యాగం చేసి.. చివరకు అతని చేతిలో దారుణంగా మోసపోయింది. అయినా ఆమె పెదాలపై చిరునవ్వు విరబూయడం మాత్రం ఆగిపోలేదు. ప్రేమించడం అంటే.. కొందరి దృష్టిలో ప్రేమను ఇవ్వడం.. మరిచిపోవడం!. కానీ, అవతలి వ్యక్తిని తమ సర్వస్వంగా భావించడం అనేదే అసలైన ప్రేమగా నిర్వచించింది ఆ యువతి. ప్రేమలో అవతలి వాళ్లను గౌరవించడంతో ఆగిపోకుండా.. వాళ్లకు ఆపదొస్తే కాపాడుకోవం కూడా బాధ్యత అనుకుంది. అలా అనుకుంది కాబట్టే.. వెల కట్టలేని కానుకను ప్రియుడికి బహుమతిగా సమర్పించుకుంది. కానీ, ఆమె ప్రేమకు అతను అర్హుడు కాదని గుండె బద్దలయ్యే నిజం తెలిసినా.. చిరునవ్వుతో జీవితంలో ముందుకు సాగుతోంది. ప్రేమించిన వ్యక్తి కోసం.. కాలిఫోర్నియాలోని యోర్బా లిండాకు చెందిన కోలీన్ లీ(30).. బహుశా కొందరికి ఈమె గురించి తెలిసే ఉండొచ్చు. ఏడేళ్లు వెనక్కి వెళ్తే.. 2015లో కోలీన్కు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి గురించి ఏమీ తెలియకున్నా గుడ్డిగా మనసారా ప్రేమించేసింది ఆ యువతి. డేటింగ్ చేసి నాలుగు నెలలు తిరగకుండానే.. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలుసుకుంది. సమస్య ముదరడంతో.. అతన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అందుకే తన కిడ్నీని దానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో అతనేం బలవంతం చేయలేదు. కానీ, మానసికంగా, భావోద్వేగంగా ఆమెను బాగా ప్రభావితం చేశాడు. అతను ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం ఇబ్బంది పడుతుంటే.. చూస్తూ తట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే.. అతన్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టి. మొత్తానికి అతనికి కిడ్నీ దానం చేసింది. కథ సుఖాంతం కావాలి కదా. అలా జరగలేదు. కొన్ని నెలలపాటు మొక్కుబడిగా ఆమెతో మాట్లాడాడు అతను. ఆ తర్వాత.. ఆమె నిజాయితీకి మెచ్చో లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ ఆమె గుండె బద్దలయ్యే నిజాన్ని చెప్పాడు అతను. చెప్పాపెట్టకుండా ఓరోజు ఆమె దగ్గరికి వెళ్లి.. తాను ప్రేమించలేదని, కేవలం మోసం మాత్రమే చేశానని చెప్పాడతను. సెకండ్ ఛాన్స్- ప్చ్.. అంతే.. ఆమెకు నోట మాట రాలేదు. ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. కానీ, ఆమె సహనం కోల్పోలేదు. ఎందుకంటే ప్రేమలో తాను నిజాయితీగా ఉంది కాబట్టి. మరో అవకాశం ఇవ్వాలని అనుకుంది. కాల్స్ చేసింది. మెసేజ్లు పెట్టింది. ప్చ్.. దేనికి బదులు లేదు. పైగా అన్నింటా ఆమెను బ్లాక్ చేశాడు. అంటే.. మరో అవకాశానికి అతను సిద్ధంగా లేడని ఆలస్యంగా అర్థమైంది ఆమెకు. అందుకే అతన్ని వదిలేసింది. జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది. కోలీన్ లీ.. ఇప్పుడు మళ్లీ ఈ పేరు ఎందుకు తెర మీదకు వచ్చింది. ఎందుకంటే.. టిక్టాక్లో ఆ మధ్య ఓ వీడియో ద్వారా ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది కాబట్టి. ఆమెది ప్రేమ విషాదం.. కానీ, దానికి ఆమె జోడించింది హ్యూమర్ను. పది మిలియన్ల వ్యూస్, 3 మిలియన్ల లైకులతో ఆమె వీడియో ఆ షార్ట్ వీడియో మేకింగ్ యాప్లో ఇంకా దూసుకుపోతోంది. అందులో ఆమె త్యాగానికి దక్కిన ప్రతిఫలానికి దిగ్భ్రాంతి, సానుభూతి కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను నిజంగా అతనితో నా శేష జీవితాన్ని గడపాలని అనుకున్నా. ఎంతగానో ప్రేమించాను కాబట్టే అతని ప్రాణాన్ని కాపాడాను. కానీ, అతను నాతో చాలా తేలికగా బంధాన్ని తెంచుకున్నాడు. అతని జీవితంలో నేను లేను అనే వాస్తవాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమే. కానీ, జీవితం అక్కడితోనే ఆగిపోకూడదు కదా! అని చిరునవ్వుతో చెప్తోంది కోలీన్ లీ. ఆ నవ్వే ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది కూడా. -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్లైట్లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
హైదరాబాద్: మైనర్ల ‘ప్రేమకథ’ విషాదాంతం
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్సాగర్లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్పై వెళ్లిపోయారు. వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. -
సినిమా కంటే ముందే పుస్తకరూపంలో ‘ప్యారీ’
మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్యారీ’. లక్ష్మణ్ అనే యువకుడు - ప్యారి అనే యువతి నడుమ నడిచిన ప్రేమకు సాక్షాత్కారమే ఈ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగానే ఈ ప్రేమకథను పుస్తకం రూపంలో ‘ప్యారి తారావలి ది ట్రూ స్టోరీ’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రజనీష్ దూబే రాసిన ‘ప్యారి - తారావలి ది ట్రూ లవ్ స్టోరీ’ అమెజాన్, ఫ్లిప్ కార్డ్, కిండిల్, ప్లే స్టోర్, గూగుల్ బుక్స్, కోబో, ఐ బుక్స్ వంటి మాధ్యమాల్లో లభ్యం కానుంది. ప్రేమ తాలూకు ఓ గొప్ప పార్శ్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ‘ప్యారి’ ప్రేమాస్పదులైన ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్చరణ్–శంకర్గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ..
జగదేవ్పూర్(గజ్వేల్): ఆమెకు పెళ్లైంది. కానీ, ఇన్నాళ్లలో భర్తతో ప్రేమగా ఏనాడూ మాట్లాడింది లేదు. దగ్గరకు రానిచ్చింది లేదు. కారణం.. ఆమె మనసులో మరో వ్యక్తి ఉన్నాడు. పెళ్లయ్యాక మరో వ్యక్తిని ఇష్టపడింది ఆమె. ఇద్దరూ గప్చుప్గా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. విషయం ఇంట్లో తెలిసింది. కోపడ్డారు. కలిసి బతకడం సాధ్యం కాదనుకుంది.. ఆత్మహత్యతో ప్రాణం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని మంగళవారం రాత్రి యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమాయ్యాయి. సమాచారం తెలుసుకున్న జగదేవ్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి ఆధార్కార్డు, ద్విచక్రవాహనం ఆర్సీ లభించడంతో వాటి ఆధారంగా వివరాలను సేకరించారు. ఎస్ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పూజ(26), రాజీవ్నగర్కు చెందిన నామా వేణుగోపాల్(24) సిరిసిల్లలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. విషయం ఇంట్లో తెలిసి పెద్దలు మందలించారు. ఈ నెల పదిహేనవ తేదీన డ్యూటీకి అని వెళ్లి.. పూజ తిరిగి రాలేదు. దీంతో తన భార్య కనిపించకుండా పోయిందని సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పూజ భర్త. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పీర్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న శవాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధార్కార్డు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ముఖాలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో.. ఉరేసుకుని చాలారోజులై ఉంటుందని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పంచనామా చేసి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బిందు మాధవితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన శివ
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్బాస్ నాన్స్టాప్పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్బాస్ హౌజ్లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్బాస్ నాన్స్టాప్లో వచ్చిన గొడవలు ఏ బిగ్బాస్ సీజన్లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా) పాల్గొన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్గా నిలవగా అఖిల్ రన్నరప్గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్గా నిలిచాడు. అయితే హౌజ్లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ. చదవండి: అనిల్, సునిల్ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు.. బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్బాస్కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్లోపలికి గెస్ట్లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
దర్శకులుగా రాణిస్తున్న కుప్పం బ్రదర్స్
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న మహనీయుల పలుకులను ఆ సోదరద్వయం నిజం చేసింది. డైరెక్టర్ కావాలి.. సినిమా రంగంలో రాణించాలి.. అని పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధించారు. కూలి పనులు చేసుకునే స్థాయి నుంచి స్టార్ట్ కెమెరా చెప్పే స్థాయికి ఎదిగారు. ఇప్పటికే రెండు చిత్రాలు రిలీజ్ కాగా, మరో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అని సినీకవి పేర్కొన్నట్లు అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి కష్టించి మనసు పడిన రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. కుప్పంం బ్రదర్స్గా పేరుపొందిన రమేష్, గోపీ దర్శకత్వంలో సత్తా చాటుతున్నారు. కుప్పం: తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులోని హోసూరుకు చెందిన మునిరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. బతుకుదెరువు కోసం గతంలో పొట్టచేతబట్టుకుని కుప్పం బాట పట్టారు. స్థానిక మోడల్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని నివాసముండేవారు. రోడ్డుపక్కన ఇరువైపులా చింతచెట్లు.. వాటికింద మునిరాజు రాతి డ్రస్సింగ్ పనిచేస్తూ కుమారులు రమేష్, శంకర్, గోపీని పోషించేవారు. కుమారులు కూడా తరచూ రాతి పనికి వెళ్లి కుటుంబానికి అండగా నిలిచేవారు. ఇంటర్ పూర్తిచేసిన రమేష్ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. డైరెక్టర్ కావాలన్న లక్ష్యంతో 1995లో హైదరాబాద్ వెళ్లాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్గా చేరేందుకు ప్రయత్నించాడు. కనీసం డిగ్రీ పూర్తి చేయాలని ఆయన రమేష్కు హితవు చెప్పి పంపించేశాడు. ఈ నేపథ్యంలో 1998లో డిగ్రీ పూర్తి చేసుకున్న రమేష్ తన లక్ష్యం కోసం మళ్లీ భాగ్యనగరానికి చేరాడు. సినీ పరిశ్రమలో పని దొరక్క, తినడానికి తిండి లేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ కుప్పం వచ్చేశాడు. రాతి కూలీగా పనిలో చేరాడు. తర్వాత తండ్రి సూచన మేరకు కర్ణాటక వెళ్లి చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేరాడు. మలుపు తిరిగింది అక్కడే.. 2018 శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణలో సినీ నటులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అప్పటి కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గోపీ, రమేష్కు బాధ్యతలు అప్పగించింది. అదే వారి జీవితానికి బాటలు వేసింది. ఈ కార్యక్రమంతో సినీ పెద్దల పరిచయాలు పెరిగాయి. కుప్పం దర్శక సోదరులుగా గుర్తింపు లభించింది. అనంతరం హైదరాబాద్కు చెందిన మ్యూజిక్ యాక్సెస్ నిర్మాణ సంస్థలో దర్శకులుగా చేరారు. ఈ సంస్థ ప్రోత్సాహంతో ‘రెడ్డిగారింట్లో రౌడీరాజ్యం’, కన్నడంలో ‘యారికి బేకు ఈలోక’ సినిమాలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా జూన్ మొదటి వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం రమేష్ దర్శకుడిగా, రచయితగా రాణిస్తున్నాడు. ఇది నా లవ్ స్టోరీలో మూడు పాటలు, రెడ్డిగారింట్లో రౌడీరాజ్యం సినిమాలో కొన్ని పాటలు రాశాడు. అన్న కల.. తమ్ముడితో సాకారం ! చనిపోయే లోపు ఒక్క సినిమా అయినా తీస్తానంటూ రమేష్ తన తమ్ముడు గోపీకి తరచూ చెబుతుండేవాడు. ఈ నేపథ్యంలో అన్న ఆశయం కోసం గోపీ 2006లో హైదరాబాద్ చేరుకుని డీఎఫ్టీ పూర్తిచేశాడు. అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలు తిరుగుతూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించి విజయం సాధించాడు. మీ శ్రేయోభిలాషి, నరహరి, గుండెజారి గల్లంతైంది తదితర సినిమాలకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. దీంతో పాటు షార్ట్ ఫిలిమ్స్పై దృష్టిసారించాడు. ఆ సమయంలో ఓ టీవీ సౌజన్యంతో దర్శకుడు రాఘవేంద్రరావు నిర్వహించిన రేపటి దర్శకులు షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్లో పాల్గొన్నాడు. ఇందులో గోపీ తీసిన షార్ట్ ఫిలిమ్ ‘ది వే’ ప్రథమ బహుమతి సాధించింది. అనంతరం బెంగళూరులో ఎడిటింగ్ కోర్సులో చేరి ఏడాదిపాటు శిక్షణ పొందాడు. కన్నడ దర్శకుడు సునీల్కుమార్ సింగ్ వద్ద మధువేమని కన్నడ చిత్రానికి పనిచేశాడు. తర్వాత ఐదేళ్లపాటు కథలు చేతబట్టుకుని అవకాశాల కోసం బెంగళూరు, హైదరాబాద్ తిరిగి తిరిగి అలిసిపోయాడు. 2015లో ఎస్వీ ప్రకాష్ నిర్మించిన ఇది నా లవ్ స్టోరీ సినిమాతో గోపీ మరో అవకాశం అందుకున్నాడు. తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అన్నదమ్ములు రమేష్, గోపీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. -
నాకు లవ్స్టొరీ ఉంది, కానీ బ్రేకప్ అయ్యింది: హీరో ఎమోషనల్
Vishwak Sen Love Breakup Story: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్ను కాస్తా డిఫరెంట్గా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రెటీలతో విశ్వక్ సేన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఈ క్రమంలో ప్రతి సినిమాలో తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు నిజ జీవితంలో ఏదైనా ఉందా? అని ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి విశ్వక్ స్పందిస్తూ.. ప్రతి ఒక్క మగాడి జీవితం ఖచ్చితంగా ప్రేమ, బ్రేకప్ ఉంటుందన్నాడు. అలాగే తన జీవితంలో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందన్నాడు. ‘నా జీవితంలో ఒకేసారి లవ్లో పడ్డాను. అది కూడా బ్రేకప్ అయ్యింది. నా కాలేజీలో రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే కాలేజీ మూడేళ్లలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాలేజీ అయిపోయాక తనని ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాను. ఓ సంఘటనతో ఇద్దరం దగ్గరయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే.. ‘ఇక అంతా ఓకే అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో వదిలేసింది. అయితే ఈ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరం’ అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికీ తనని మరిపోలేదని, బ్రేకప్ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుందని విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని, బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండ కాస్తా జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతానన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్గా ఉంటాయని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ శర్మతో డేట్ చేశా: నటి బ్రేకప్ లవ్ స్టోరీ
రోహిత్ శర్మ.. క్రికెట్ మైదానంలో హిట్మన్గా ప్రసిద్ధుడు. ఇండియన్ ఒపెనింగ్ బాట్స్మన్. సోఫియా హయత్.. సంచలనాలకు మారుపేరు. బ్రిటిష్ మోడల్, సింగర్, యాక్ట్రెస్.. టెలివిజన్ పర్సనాలిటీ.. బిగ్బాస్ (హిందీ) పోటీదారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విరబూసి జీవితాలను పండించేలోపే వాడిపోయింది. ఆ ఫెయిల్యూర్ స్టోరీ ఎలా మొదలైందంటే.. 2012.. లండన్లోని ఓ క్లబ్లో రోహిత్ను కలిసింది సోఫియా. ఆమె నటించిన సినిమా పూర్తయిన సందర్భంగా ఇస్తున్న పార్టీలో. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రోహిత్ ఆ పార్టీకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అది మొదలు లండన్, ముంబై, ఢిల్లీలో జరిగిన ఇంకెన్నో పార్టీల్లో కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా మారారు. ఇంకొన్నాళ్లకే ప్రేమికులయ్యారు. చెట్టాపట్టాల్.. చెట్టుపుట్టల్.. హాలిడేయింగ్స్.. సర్వసాధారణమే! కానీ ఆ ప్రేమను బయటపడనివ్వకుండా గుట్టుగానే దాచుకున్నారు. కాదు.. దాచుకున్నామని అనుకున్నారు. మీడియా పట్టేసింది. ఆ వార్తలను హెడ్లైన్స్గా మార్చి బాగా ప్రచారం చేసింది. ఇటు క్రికెట్ ఫీల్డ్లో.. అటు సినిమా, మోడలింగ్ ఫీల్డ్లో ఈ జంట ప్రేమ చర్చనీయాంశమైంది. అది ఆ ఇద్దరి చెవిన పడినా రూమర్ అన్నట్టుగానే పట్టించుకోలేదు. ఏనాడూ మీడియా ముందు గానీ.. సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించలేదు. ఆ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యాకే తమ మధ్య ప్రేమవ్యవహారం నడిచిందని ట్విటర్ వేదికగా ప్రకటించింది సోఫియా... ‘ఓకే.. ఈ వదంతులకు నేటితో.. ఫుల్స్టాప్ పెడుతున్నాను. యెస్..రోహిత్ శర్మతో నేను డేట్ చేశాను. కానీ ఇప్పుడా ప్రేమ బ్రేక్ అయిపోయింది. మళ్లీ మేం కలిసేది లేదు.. మా ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకునే ఆసక్తీ లేదు. ఇప్పుడు నేనో మంచి మనిషి తోడు కోసం వేచి చూస్తున్నాను’ అంటూ. నువ్వంటే నువ్వని.. మూడేళ్ల ముచ్చటగా 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్కు కారణం రోహిత్ శర్మ అంటుంది సోఫియా. ‘సోఫియానే’ అంటారు రోహిత్ శర్మ సన్నిహితులు. ‘నా గురించి మీడియా ఎప్పుడు వివరం అడిగినా.. సోఫియా నా ఫ్యాన్ అనే చెప్పాడు తప్ప లవ్ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్ చేసేసుకున్నా’ అని చెప్పింది సోఫియా ఒక ఇంటర్వ్యూలో. రోహిత్ శర్మ సన్నిహితుల కథనం ప్రకారం.. సోఫియా, విరాట్ కొహ్లీల స్నేహం. ఆమె.. విరాట్తో చెలిమి పెంచుకొని అతనితో చనువుగా మసలుకోవడం వల్లే రోహిత్.. సోఫియాకు దూరమయ్యాడని అంటారు. సోఫియాతో కలిసి ఉన్నప్పుడు రోహిత్ శర్మ తమ ప్రేమానుబంధం గురించి ఎలా పెదవి విప్పలేదో విడిపోయిన తర్వాతా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం సోఫియా ట్వీట్లకు కౌంటర్ కూడా ఇవ్వలేదు. చదవండి: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని ‘రోహిత్ను పరిచయం చేస్తూ అతను క్రికెటర్ అని చెప్పాడు నా ఫ్రెండ్. అతను నాకు పరిచయం అయ్యేవరకు అతనో క్రికెటర్ అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు.. మ్యాచెస్ను చూడలేదు కూడా. కాని తొలి పరిచయంలోనే రోహిత్ నచ్చాడు. వాట్ ఏ కూల్ మ్యాన్ అనుకున్నాను. మా స్నేహం పెరిగే కొద్దీ నిజంగానే అతను మంచి మనిషిగానే కనిపించసాగాడు నాకు. చాలా సెన్సెటివ్. క్రికెట్ గురించి, ఫ్యాన్స్ గురించి చెప్పేవాడు. బాగా ఆడకపోతే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పేవాడు. ఆ భావోద్వేగాల గురించి గంటలు గంటలు డిస్కస్ చేసుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది.. సజావుగా సాగిపోతోంది అనుకుంటున్నప్పుడే రోహిత్ను ఒకసారి మీడియా అడిగింది ఆయన లైఫ్లో నేనేంటి అని. దానికి రోహిత్ అసలేం తడుముకోకుండా తను జస్ట్ ఫ్యాన్ అంతే. అంతకుమించి మరేం లేదు అని ఆన్సర్ చేశాడు.ఆ జవాబు.. చెప్పిన తీరును ఎందుకో రిసీవ్ చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఇక ఆ ప్రేమ ముందుకు సాగదని అర్థమైంది. అందుకే వద్దనుకున్నాను’ అని ట్విటర్ ముఖంగా వెల్లడించింది. సోఫియాతో విడిపోయాక 2015లోనే రితికా సజ్దేను ప్రేమ వివాహం చేసుకున్నాడు రోహిత్. ఇప్పుడు వాళ్లకొక పాప సమైరా. సోఫియా.. తన జీవితాన్ని పుస్తకంగా రాసే పనిలో ఉంది. అందులో రోహిత్ శర్మతో తన ప్రేమ జీవితం కూడా ఉంటుందని చెప్పింది. - ఎస్సార్ చదవండి: వెబ్ సిరీస్తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
Mukesh Ambani : బిజినెస్ నుంచి తప్పుకుంటే నెక్ట్స్ చేయబోయే పని అదే
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. జియోతో దేశీ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఓవైపు సంప్రదాయ పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంటూనే మరోవైపు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. 90.70 బిలియన్ డాలర్ల సంపద ముకేశ్ సొంతం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస గృహం అతని సొంతం. కానీ చిన్నప్పటి నుంచి ముకేశ్ను అంటిపెట్టుకున్న ఓ కోరిక ఇప్పటికీ సంపూర్ణంగా తీర్చుకోలేకపోతున్నారు ముకేశ్ అంబానీ. ఆ కోరిక ఏంటీ? ఆ కోరికను ఆయన ఎలా తీర్చుకున్నారనే అంశాలను వివిధ ఇంటర్యూల్లో ముకేశ్ నీతా అంబానీలు చెప్పిన వివరాల ఆధారంగా ఏప్రిల్ 19న ముకేశ్ అంబానీ బర్త్డే స్పెషల్ కథనం... ధీరుభాయ్ అంబానీ యెమెన్లో పెట్రోల్ పంపులో పని చేసే రోజుల్లో ముకేశ్ అంబానీ అక్కడే జన్మించాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రికి ఉన్న పెట్రో కెమికల్స్, వస్త్ర పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ముంబైలోనే పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్లో పట్టా సాధించాడు ముకేశ్ అంబానీ. ఆ తర్వాత మాస్టర్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు ముకేశ్. మాస్టర్స్ పూర్తి కాగానే తనకిష్టమైన రంగంలో కొద్ది రోజలు పని చేసి ఆ తర్వాత కుటుంబ వ్యాపారాలు చూసుకోవాలని కలగన్నాడు. అయితే మాస్టర్స్ మధ్యలో ఉండగానే ఇండియాకి వచ్చేయమంటూ తండ్రి నుంచి పిలుపు వచ్చింది. తండ్రి నుంచి పిలుపు క్లాసురూముల్లో కంటే క్షేత్రస్థాయిలోనే ఎక్కువ జ్ఞానం, అనుభవం వస్తుందనేది ధీరుభాయ్ అంబానీ నమ్మకం. అందుకే కొడుకు ముకేశ్ను చదువు మధ్యలో ఇండియాకి వచ్చేయమన్నాడు. వచ్చి రాగానే ఉద్యోగం చేయడం నీ లక్ష్యమైతే నువ్వో మేనేజర్ అవుతావ్. ఎంట్రప్యూనర్గా రాణించాలంటే ఇక్కడున్న సమస్యలు ఏంటో గుర్తించు, వాటికి పరిష్కారం ఆలోచించు అంటూ చెప్పేశారు. దీంతో తన కలల ఉద్యోగాన్ని పక్కన పెట్టి తండ్రి చెప్పినట్టుగా సమస్యలను అన్వేషించే పనిలో పడ్డారు ముకేశ్. కాలంతో పరుగులు ఇదే సమయంలో టాటా, బిర్లాలతో పాటు పాలిస్టర్ బిజినెస్లోకి రిలయన్స్కి ఎంట్రీ లభించింది. కొత్తగా కర్మాగారం నిర్మించాల్సి వచ్చింది. దీంతో ఆ పనుల్లో బిజీ అయ్యాడు ముకేశ్. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యేసరికి అతనికెంతో ఇష్టమైన ఆ ఉద్యోగం చేయాలనే ఆశ ఎక్కడో మరుగున పడిపోయింది. కాలంతో పరుగులు పెట్టడమే అతని నిత్య జీవితం అయ్యింది. నీతా నృత్యం పగలు రేయి తేడా లేకుండా కష్టపడుతున్న కొడుక్కి ఓ తోడును చూడాలని నిర్ణయించుకున్నాడు ధీరుభాయ్. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన నీతా ఆయన కంటపడింది. వెంటనే తనను కలవమంటూ కబురు పంపాడు. అంత పెద్ద బిజినెస్మేన్ ఎందుకు కలవమన్నాడో తెలియక కంగారు పడుతూనే రిలయన్స్ ఆఫీస్కి వెళ్లింది నీతా. స్నేహం వరకే ఇద్దరి మధ్య కాసేపు మాటలు పూర్తి కాగానే మా పెద్ద అబ్బాయిని కలవమంటూ చెప్పారు ధీరుభాయ్. అలా ముకేశ్, నీతాల మధ్య తొలి పరిచయం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతున్నా కానీ పెళ్లి విషయంలో కాంక్రీట్గా ఏదీ జరగడం లేదు. మరోవైపు ఇంత పెద్ద ఫ్యామిలీలోకి వెళితే నా ఇండివీడ్యువాలిటీ నాకు ఉంటుందా అనే ప్రశ్నలు నీతాను వేధిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటావా? ఓ రోజు కారులో నీతా, ముకేశ్ ఇద్దరు కారులో ప్రయణిస్తున్నారు. ముంబైలో రద్దీగా ఉండే పెద్దార్రోడ్లో కారు ప్రయాణిస్తోంది. చుట్టూ ట్రాఫిక్ రద్దీ, రణగొణ ధ్వనులు, కారు మీదకే దూసుకొస్తున్నట్టుగా అటు ఇటు నడుస్తున్న జనాలు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ముకేశ్ ఒక్కసారిగా గొంతు సవరించుకుని.. విల్ యూ మ్యారీ మీ.... సే యస్ ఆర్ నో... నౌ ఇన్ దిస్ కార్ అంటూ మనసులో మాట చెప్పేశాడు. వెంటనే ‘పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ వన్ కండీషన్’ అంటూ తడుముకోకుండా జవాబు ఇచ్చింది నీతా. కండీషన్స్ అప్లై పెళ్లైన తర్వాత ఇంటి పట్టునే ఉండకుండా ఉద్యోగం చేయాలన్నది తన అభిప్రాయమంటూ నీతా అంబానీ కండీషన్ పెట్టింది. వెంటనే ఆ నిబంధనకు ముకేశ్ ఓకే చెప్పడంతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లి తర్వాత అంబానీ ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు నీతాకి అప్పగించారు. ఇప్పటికీ ఆ స్కూల్ పనులు తానే చూస్తూ దాన్ని మరింతగా విస్త్రృతం చేశారామె. ఇద్దరి కల నెరవేరిన వేళ పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానన్న నీతా అంబానీకి రిలయన్స్ సంస్థ పరిధిలో ఎన్నో మంచి పోస్టులు ఉన్నా ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న మతలబు ఏంటంటే ముకేశ్ అంబానీకి టీచింగ్పై ఉన్న మక్కువ. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం వరల్డ్ బ్యాంకులో ప్రొఫెసర్గా టీచింగ్ చేయాలని కలగన్నాడు ముకేశ్. కానీ అది తీరకుండానే తండ్రి ఆజ్ఞలతో వ్యాపారంలోకి వచ్చేశాడు. నీతాతో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాక ఇద్దరికి నచ్చేట్టుగా ‘టీచింగ్ జాబ్ ’లోకి నీతాని తీసుకు వచ్చారు. వ్యాపారాలను పక్కన పెట్టిన రోజు మా సంతృప్తి కోసం టీచింగ్ చేస్తామంటున్నారు అంబానీ దంపతులు. చదవండి: నీతా అంబానీ చెబుతున్న సక్సెస్ సీక్రెట్స్, ఆర్థిక పాఠాలు -
Russia-Ukraine war: ప్రేమ యుద్ధం
యుద్ధం దేశాలను ఓడించవచ్చు. ప్రేమను కాదు. ఆమె ఉక్రెయిన్లో ఉంది. అతడు ఇండియాలో ఉన్నాడు. ఆమె యుద్ధంలో ఉంది. అతడు ఎదురు చూస్తున్నాడు. ఉక్రెయిన్ జాతీయురాలు అన్నా హొరొడెట్స్కా ఢిల్లీలో ఉండే అనుభవ్ భాసిన్ కోసం ప్రాణాలకు తెగించి వచ్చింది. అతడు ఎయిర్పోర్ట్లోనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. అత్తగారు పూలతో స్వాగతం చెప్పింది. ప్రతీకారాలు యుద్ధాలు తెస్తాయి. ప్రేమలు ప్రపంచాన్ని నిర్మిస్తాయి ఈ ప్రేమకథ చెబుతున్నది అదే. యుద్ధంలోనూ ప్రేమలోనూ ఉత్కంఠ తప్పదు. అనుభవ్, అన్నాలది కూడా ఉత్కంఠభరిత ప్రేమ కథే. 29 ఏళ్ల ఉక్రెనియన్ అన్నా హొరొడెట్స్కా తన ప్రేమను సఫలం చేసుకోవడానికి బాంబుల మోతల మధ్య నడిచి ఢిల్లీ చేరింది. ఢిల్లీ హైకోర్టులో లాయర్గా పని చేస్తున్న 33 ఏళ్ల అనుభవ్ను కలసుకోగలిగింది. ఇక వాళ్ల పెళ్లి జరగడం ఒక లాంఛనం మాత్రమే. ప్రయాణంలో కలిసిన ప్రేమకథ ఉక్రెయిన్లో ఐటి ప్రొఫెషనల్గా, మేకప్ ఆర్టిస్ట్గా పని చేసే అన్నా 2019లో ఇండియా చూడటానికి వచ్చింది. ఆమె ట్రావెల్ చేస్తున్నప్పుడు తనూ ట్రావెల్ చేస్తున్న అనుభవ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆమె ఉక్రెయిన్ వెళ్లిపోయింది. అయితే వాట్సప్లో వీరి పలకరింపులు కొనసాగాయి. 2020లో ఆమె మళ్లీ ఇండియా వచ్చి రాజస్తాన్ రోడ్ ట్రిప్కు బయలుదేరింది. అనుభవ్ ఆమెతో టచ్లో ఉన్నాడు. ఇంతలో లాక్డౌన్ వచ్చింది. ఫ్లయిట్లు కేన్సిల్ అయిపోయాయి. స్వదేశం వెళ్లే వీలు లేదు. ‘నువ్వు మా ఇంటికి వచ్చి ఉండు’ అని కోరాడు అనుభవ్. అతని తల్లి కూడా ఆమెను ఆదరించింది. అప్పుడే వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. లాక్డౌన్ ఎత్తేశాక సెకండ్ వేవ్ వచ్చింది. అది ముగుస్తూ ఉండగా అనుభవ్ ఉక్రెయిన్ వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో దుబాయ్లో కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ మార్చిలోనే సౌత్ఢిల్లీలోని అనుభవ్ ఇంటిలో పెద్ద ఆర్భాటం లేకుండా చేసుకుందామనుకున్నారు. ఉక్రెయిన్లో ఉద్యోగం చేసుకుంటున్న అన్నా కావలసిన సమయానికి ఇండియా చేరుకుంటానులే అని నిశ్చింతగా ఉంది. యుద్ధమలుపు హటాత్తుగా ఫిబ్రవరిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మార్చిలో పెళ్లి పెట్టుకున్న ఈ జంట ఇక ఎడతెగని ఫోను సంభాషణల్లోకి దిగింది. ‘మొదట అతను వెంటనే బయల్దేరి వచ్చేయమన్నాడు. కాని రష్యా అంతకు తెగించదు అని నేను నిరాకరించాను. అప్పుడు మా ఇద్దరికీ ఫైటింగ్ జరిగింది. ఆ తర్వాత ట్రైన్ పట్టుకుని పోలాండ్ వెళ్లిపోమన్నాడు. నేను ఆ పనీ చేయలేదు. ఫిబ్రవరి 24న బాంబుల మోత మొదలయ్యింది. బంకర్లో దాక్కున్నాను. అక్కడే ఉండు అన్నాడు అనుభవ్. కాని బయలుదేరి ఇండియా వస్తున్నాను అని చెప్పాను. హడలిపోయాడు. అస్సలు కదలొద్దు అన్నాడు. కాని నేను బయలుదేరాను’ అంది ఢిల్లీలో దిగిన అన్నా. సాహసయాత్ర అన్నా కీవ్ నగరానికి దగ్గరిలోని ఊరిలో ఉంటుంది. కీవ్ నగరం మీద ఫిబ్రవరి 24న బాంబులు పడ్డాయి. వెంటనే ఆమె రెండు మూడు రోజులు తల్లితో పాటు షెల్టర్లలో ఉండిపోయింది. 27 వ తేదీ ఉదయం ఇక లాభం లేదని తల్లితో, తన కుక్కతో ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది. ఆమె దగ్గర ఉన్నది ఉన్నిబట్టలు మాత్రమే. అక్కడి నుంచి తల్లిని అమ్మమ్మ ఉంటున్న తమ సొంత ఊరు కమియంకాకు తీసుకెళ్లి వదిలింది. అమ్మమ్మా... పెళ్లి చేసుకోవడానికి ఇండియా వెళుతున్నా అంటే ఆమె కాఫీ మిషన్ను పెళ్లి కానుకగా ఇచ్చింది. దానిని తీసుకుని కీవ్ నగరానికి అదే రోజు రాత్రి చేరుకుంది. ఎందుకంటే కీవ్ సరిహద్దు పశ్చిమ పోలాండ్ సరిహద్దుకు దగ్గర. కాని పోలాండ్కు వెళ్లడానికి వేలాది మంది రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలిసింది. దాంతో అన్నా ఆ రాత్రి ఇంకో బస్ పట్టుకుని స్లోవేకియా చేరుకుంది. అక్కడి పోలాండ్కు చేరుకుని క్రాకో అనే ఊళ్లో రెండు వారాలు ఉండిపోయింది. ఫ్రెండ్స్ ఆమెకు సాయం చేశారు. పోలాండ్లో ఉన్న భారత ఎంబసీలో వీసాకు అప్లై చేస్తే దొరికింది. అలా ఆమె బయలుదేరి మార్చి 25న ఢిల్లీ చేరుకుంది. ఎయిర్పోర్ట్లో వరుడు ఆమె వచ్చే సమయానికి ఎయిర్పోర్ట్లో అనుభవ్ బాజా భజంత్రీలతో స్వాగతం చెప్పాడు. అక్కడే మోకాళ్ల మీద కూలబడి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ‘నేను చచ్చే అలసటలో ఉన్నాను. కాని అతను చేసిన పని బాగనే అనిపించింది’ అంది అన్నా. అనుభవ్ తల్లి పూలతో ఆమెకు స్వాగతం చెప్పింది. ‘మా పెళ్లికి పేపర్స్ రెడీ చేస్తున్నాం’ అన్నాడు అనుభవ్. ‘నా వీసా ఒక సంవత్సర కాలం ఉంది. ఈలోపు మా దేశం ఏమవుతుందో చూడాలి’ అంది అన్నా. ఒక విధ్యంసం జరుగుతున్నప్పుడు మనుషుల మధ్య పొంగె ఇలాంటి ప్రేమే ఆశను కలిగిస్తుంది. యుద్ధం ఎప్పుడూ ఓడిపోతుంది. ప్రేమ గెలుస్తుంది. -
మైనర్తో టీచరమ్మ ప్రేమ పాఠాలు.. ఇద్దరు కలిసి ఫ్రెండ్ ఇంట్లో..
సాక్షి, చెన్నై: ఆమె ఓ టీచర్.. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టింది. మైనర్కు ప్రేమ పాఠాలు చెప్పి.. మాయ మాటలతో అతడిని తన వెంట తిప్పుకుని ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుచురాపల్లి జిల్లా తురాయుర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి(17).. 11వ తరగతి చదువుతున్నాడు. అతడు రోజులాగే మార్చి 5వ తేదీన బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలిసి కంగుతున్నారు. విచారణలో భాగంగా.. విద్యార్థి చదివే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ కూడా అదే రోజు నుంచి మిస్స్ అయినట్టు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో షర్మిల తల్లి.. తన కూతురు ఫోన్లో ఓ విద్యార్థితో మాట్లాడుతుండేదని పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె ఫోన్ను ట్రాక్ చేసిన పోలీసులు.. తంజావూర్, వెళాంకిణి, తిరువారూర్, తిరుచిరాపల్లిలో ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు. మార్చి 25వ తేదీన సిగ్నల్ ఆధారంగా ఆమె పుత్తూర్లో ఉన్నట్లు కనిపెట్టారు. దీంతో అక్కడికి వెళ్లాగా.. వారిద్దరూ అప్పటికే తాంజావూర్లోని ఓ గుడిలో పెళ్లి చేసుకొని.. షర్మిల ఫ్రెండ్ ఇంట్లో కాపురం పెట్టినట్టు గుర్తించారు. కాగా, మైనర్ను అపహరించి, పెళ్లి కూడా చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు పోక్సో చట్లం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం మైనర్కు అతడి పేరెంట్స్కు అప్పగించారు. -
ట్రెండింగ్.. వార్ వేళ ఉక్రెయిన్ అమ్మాయికి భారతీయుడి ప్రపోజ్.. ఎక్కడో తెలుసా.?
ఉక్రెయిన్పై రష్యా బలగాలు దండయాత్ర చేస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ జన్మభూమిని వీడుతుండగా.. విదేశాలకు చెందిన వారు తమ స్వదేశాలకు తిరుగు పయణం అవుతున్నారు. ఎన్నో కష్టాలను ఓడ్చి యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ నుంచి బయటపడుతున్నారు. కాగా, ఇప్పటికే యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఎన్నో జంటలు ఒకటయ్యాయి. బాంబుల దాడులు, కాల్పుల మోతల మధ్యే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ప్రేమ ముందు యుద్ధం కూడా చినబోగా.. భారత్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ అమ్మాయి, భారత్కు చెందిన అబ్బాయి ఒకటయ్యారు. తన ప్రేయసి భారత్లో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్పోర్టులో ప్రపోజ్ చేశాడు ఢిల్లీకి చెందిన హైకోర్టు న్యాయవాది అనుభవ్ భాసిన్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కపుల్స్ లవ్ స్టోరీ హాట్ టాపిక్గా మారింది. భారత్కు చెందిన అనుభవ్ భాసిన్, ఉక్రెయిన్కు చెందిన అన్నా హోరోడెట్స్కా ప్రేమించుకున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని.. కొత్త జీవనం కొనసాగించాలనుకున్నారు. ఇంతతో ఊహించని యుద్దం కారణంగా మళ్లీ కలుస్తామో లేదో అన్న ఆందోళనలో ఆమె తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా భారత్లో అడుగుపెట్టింది. వీరి ప్రేమ గురించి అనుభవ్ భాసిన్ చెబుతూ.. ఉక్రెయిన్కు చెందిన అన్నా హోరోడెట్స్కా రెండున్నరేళ్ల క్రితం పరిచయమైంది. ఆమె ఓ ఐటీ కంపెనీ పనిచేస్తోంది. అయితే, అన్నా.. భారత్కు రాగా కరోనా కారణంగా 2020లో మొదటిసారి లాక్డౌన్ కారణంగా విమానాల రద్దుతో ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె.. లాక్డౌన్ ముగిసే వరకు తన ఇంట్లోనే ఉందన్నాడు.తర్వాత వారు మళ్ళీ దుబాయ్లో కలుసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించిదన్నాడు. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చిందని.. తాను కూడా కీవ్కు వెళ్లినట్టు తెలిపాడు. అయితే, గతేడాది డిసెంబర్లో ఆమె ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. అనంతరం ఆమె తిరిగి ఉక్రెయిన్ వెళ్లిపోయింది. ఇంతలో యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్ను విడిచే క్రమంలో మూడు రోజులపాటు బాంబ్ షెల్టర్లో ఉన్నట్టు వివరించాడు. అనంతరం రైలు మార్గం ద్వారా, కాలినడకతో సరిహద్దును దాటింది. ఎన్నో కష్టాలతో పోలాండ్లోని క్రాకోవ్కు చేరుకున్నట్టు పేర్కొన్నాడు. అక్కడ తన స్నేహితులు ఆమెకు సాయం చేసిన్టటు చెప్పాడు. చివరగా ఆమె పోలాండ్లోని భారత రాయబారం కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక.. వీసా రావడంతో ఆమె భారత్ చేరుకున్నట్టు తెలిపాడు. ఆమె భారత్కు వచ్చిన ఆనందంలో ఎయిర్పోర్టులోనే ప్రపోజ్ చేసినట్టు తెలిపాడు. కాగా, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం అన్నాకు ఏడాది గడువుతో వీసా ఉండగా.. ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు స్సష్టం చేశాడు. -
మ్యూజిక్ డైరెక్టర్తో బ్రేకప్.. బయటపెట్టిన బిగ్బాస్ బ్యూటీ
Shree Rapaka Revealed About Her Break Up: బిగ్బాస్ నాన్స్టాప్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. 24గంటల ఎంటర్టైన్మెంట్తో కంటెస్టెంట్లు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇటీవలె బిగ్బాస్ ఓటీటీలో రెండోవారం ఎలిమినేట్ అయి బయటికొచ్చిన శ్రీ రాపాక తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 'బిగ్బాస్లో నా లవ్స్టోరీ గురించి చెప్పాను. దాన్ని లవ్ ఫెయిల్యూర్ అని అనను. ఎందుకంటే, ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉండే సెట్ అవుతుందనుకున్నా కానీ అదే దెబ్బ కొట్టింది. మేం పెద్దగా గొడవ పడింది లేదు. విడిపోవాలని అనుకోలేదు. కానీ తెలియకుండానే మా మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. దాదాపు రెండేళ్లు అవుతుంది. తను కాల్ చేయడు, నేనూ చేయను. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ 4 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. అతని తర్వాత నేను కూడా ఎవరిని లవ్ చేయలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. నన్ను కమాండ్ చేసే అబ్బాయే నాకు భర్తగా కావాలి. అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా. కమాండ్ చేసే మగాడు ఉంటేనే లైఫ్ కొత్తగా అనిపిస్తుంది.. ఆ కొత్తలో లైఫ్ బోర్ కొట్టదు. నేను ప్రేమను ఇస్తా.. ఆ ప్రేమను తిరిగి ఇస్తే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. -
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు.. ఆ హీరోతో నిధి వివాహం!
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లవ్ ఎఫైర్ మరోసారి తెరమీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ఈ నిధి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్. మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్తో లవ్ ట్రాక్ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. -
స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్తో అనన్య పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖలీపిలీ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. దీనికి తగ్గట్లు గానూ పార్టీలు, పబ్లు అంటూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలాసార్లు మీడియాకు కనిపించారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి ప్రేమ విషయంపై ఇషాన్ తల్లి నీలిమా అజీమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనన్య మా కుటుంబంలో ఒక మెంబర్. ఆమె నా కొడుకికి మంచి స్నేహితురాలు. అతని జీవితంలో అనన్య ముఖ్యమైన భాగమైపోయింది. షాహిద్, మీరాతోనూ అనన్య చాలా బాగా మాట్లాడుతుంది. ఇక ఇషాన్ ఫ్రెండ్స్తోనూ ఇట్టే కలిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ని బట్టి ఇషాన్-అనన్యల ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లే అని, ఆమె మాటల్ని బట్టి అనన్య-ఇషాన్ల ప్రేమాయణం ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
బాలీవుడ్ నటితో ఇంగ్లండ్ క్రికెటర్ లవ్..కానీ!
అమృతా అరోరా.. తెర మీద నటిగా కన్నా పేజ్ త్రీ సెలబ్రిటీగా బాగా పరిచయం. ఉస్మాన్ అఫ్జల్.. మైదానంలో క్రికెటర్గా కన్నా లవర్ బాయ్గా ఎక్కువ పాపులర్. ఈ ఇద్దరిదీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్. అతను లండన్లో.. ఆమె ముంబైలో. వీలైనప్పుడల్లా .. వీలు చేసుకుని మరీ కలుసుకునే ప్రయత్నం చేసినా.. ఆ బంధం నిలవలేదు. ఆ లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ గురించి.. ఉస్మాన్ అఫ్జల్ లండన్లో పుట్టి పెరిగిన పాకిస్తానీ. అమృతా ముంబై వాసి. ఆమెకు పార్టీలు అంటే చాలా ఇష్టం. ఆ పార్టీలోనే కలిశాడు ఉస్మాన్. అమృతా చురుకుదనం, నవ్వుతూ చలాకీగా కలియతిరగడం నచ్చింది అతనికి. ఇష్టపడ్డాడు. ఇంకో రెండు మూడు పార్టీల్లోనూ అమృతాను చూశాక ఆ ఇష్టాన్ని ప్రకటించాడు. అప్పుడు ఆమె అతని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. తెలుసుకున్న వెంటనే తన పట్ల ఉన్న అతని ఇష్టాన్ని అంగీకరించింది. ప్రేమ కథ మొదలైంది. అయితే అది అకేషనల్ లవ్గానే ఉండింది. అతనికి క్రికెట్ నుంచి సెలవు దొరికనప్పుడో.. ఆమెకు సినిమా షెడ్యూల్ లేనప్పుడో.. కలుసుకునేవారు. అలా ఆ ప్రేమ లండన్ టు ముంబై మధ్య షటిల్ చేసింది. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొన్నాళ్లు బాగానే నడిచినా.. నెమ్మదిగా పలుచబడసాగింది. ఇద్దరూ సెలబ్రిటీలవడం.. ఒకరికొకరు దగ్గరగా లేకపోవడం వల్ల.. గాసిప్స్ మొదలయ్యాయి. వీళ్ల ప్రేమ గురించి కాదు.. అమృతా వ్యక్తిత్వం, ఆమె సరదా మనస్తత్వం, పార్టీలను ఎంజాయ్ చేసే ఆమె తత్వం గురించి. పేజ్ త్రీ వేడుకల్లో అమృతా ఎక్కువగా మోడల్ సాహిల్ ష్రాఫ్ వెంటే కనపడుతోందనే వార్తలు ఫొటోలతో సహా కనిపించడం, వినిపించడం మొదలయ్యాయి. ఇవి లండన్లో ఉండే ఉస్మాన్ దాకా పరుగెత్తాయి. సెలెబ్రిటీల విషయంలో అవన్ని సహజమేనని కొట్టిపారేసి.. వాటిని వదంతులుగానే తీసుకున్నాడు ఉస్మాన్. అలాంటి సమయంలోనే.. ఉస్మాన్ పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అమృతా ‘గోల్మాల్ రిటర్న్స్ (హిందీ సినిమా)’ షూటింగ్ నిమిత్తం బాంకాక్లో ఉండడం వల్ల లండన్లో జరిగిన ఉస్మాన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరుకాలేకపోయింది. ఈ గైర్హాజరును ఆ వదంతులకు ముడిపెట్టి రకరకాల కథనాలు వచ్చాయి మీడియాలో. అవి ఉస్మాన్ మనసులో స్పర్థను సృష్టించాయి. తుడిచేయడానికి అమృతా లండన్ వెళ్లింది. అయినా దూరం తగ్గలేదు. ఆ సంఘటన తర్వాత ఉస్మాన్ నుంచీ పెద్దగా స్పందన లేదు. దాంతో అది ముందుకు వెళ్లే అనుబంధం కాదని అమృతా గ్రహించింది. ఓ రోజు ఉస్మాన్కు ఫోన్ చేసింది.. ‘నువ్వు లండన్లో.. నేను ముంబైలో.. నువ్వు క్రికెట్తో.. నేను సినిమాలతో క్షణం తీరికలేని బిజీ. రిలేషన్ అంటే మనిద్దరి సౌకర్యంలో ఇమిడేది కాదు.. ఒకరి కోసం ఒకరుగా మనిద్దరినీ సౌకర్యంగా ఉంచేది కదా. మన విషయంలో ఇది జరగడంలేదు. ఇంత అసౌకర్యంగా ఉండే కంటే..’ అని ఆగింది. ‘ఆ .. ఉండేకంటే..’ అని రెట్టించాడు ఉస్మాన్ అవతలి నుంచి. ‘విడిపోవడం బెటర్..’ అంది అమృతా. ‘సో..’ అంటూ ఆగాడు అతను. ‘బ్రేకప్..’ అంది ఆమె. ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ ఫర్ ప్యూచర్ అని చెప్పేసుకొని ఫోన్ లైన్స్ డిస్కనెక్ట్ చేసుకున్నారు. బ్రేకప్ అని చెప్పనైతే చెప్పింది కానీ ఆ స్థితిని నిభాయించుకోవడం.. తనను తాను సంభాళించుకోవడం చాలా కష్టమైంది అమృతాకు. సరదాకి పర్యాయమైన ఆమె ఒక్కసారిగా మూడీ అయిపోయింది. కళ్లల్లో నీటి కుండలను మోసింది. ఆ బాధలో అమృతాకు భుజమిచ్చి.. ఊరటగా నిలిచింది ఆమె ఆప్తురాలు కరీనా కపూర్. ‘నిజమే.. ఆ టైమ్లో కరీనా లేకపోతే ఏమైపోయేదాన్నో. పవర్ యోగాను పరిచయం చేసింది. ఆ యోగాతోనే దిగులు, డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. ముందుకెళ్లిపోయా. విషాదాన్ని పదేపదే గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది అమృతా అరోరా. ఎస్సార్ -
ఆ జంట కళ్లు చెబుతాయి ‘ప్రేమ’ ఎంత స్వచ్ఛమైనదో!
మనసుకు నచ్చాలే కానీ మనిషి రూపంతో పనేముంటుంది? ప్రేమ గుడ్డిదని అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఒక్కటైన ఆ జంట కళ్లు చెబుతాయి తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో? ఈ అరుదైన బ్రిటన్ జంటే అందుకు ఉదాహరణ. క్లో లస్టెడ్ అనే మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. ఆమె భర్త జేమ్స్.. పొడవు 3 అడుగుల 7 అంగుళాలు మాత్రమే. 2016లో వీరి పెళ్లి వార్త ప్రపంచాన్నే అబ్బురపరచింది. 2021, జూన్ 2న ఈ కారణంతోనే (ఇలా భార్యాభర్తల మధ్య ఉండే ఎత్తుల తేడాతో) గిన్నిస్ రికార్డ్లకు ఎక్కింది ఈ జంట. ప్రస్తుతం జేమ్స్ (33) నటుడుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. క్లో (27) ఉపాధ్యాయురాలు గా పనిచేస్తోంది. వీరికి పెళ్లై ఐదేళ్లు కాగా.. వారికి ఒలీవియా అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎముకలపై ప్రభావం చూపే డయాస్ట్రోఫిక్ డిస్ప్లేసియా అనే రుగ్మతతో బాధ పడుతున్న జేమ్స్.. ఎదుగుదల లేకుండా పొట్టిగానే ఉండిపోయాడు. 2012లో మొదటిసారి వీళ్లు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. 2014లో జేమ్స్... క్లోను ప్రపోజ్ చేశాడట. ప్రస్తుతం తమ రెండేళ్ల కూతురితో కలసి దిగిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
ఆల్రెడీ పెళ్లైన క్రికెటర్తో నటి సీక్రెట్ మ్యారేజ్, బాలీవుడ్కు గుడ్బై!
‘మంచి సినిమా.. భవిష్యత్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పక్కన రోల్.. ఇంకోసారి ఆలోచించండి మేడం..’ కాస్టింగ్ అసిస్టెంట్ నుంచి ఫోన్. ‘సారీ.. డేట్స్ క్లాష్ అవుతున్నాయి. భవిష్యత్ సూపర్ స్టార్ కోసం ఆల్రెడీ సూపర్ స్టార్గా ఉన్న హీరో సినిమాను వదులుకోలేను కదా..’ అని ఆ హీరోయిన్ సమాధానం. ఆమె వదులుకున్న సినిమా.. బాజీగర్. విలక్షణ నటుడు కమల్హాసన్ పక్కన చేయబోతున్న సినిమా కోసం. ఇది 1990ల నాటి సంగతి. ఆ హీరోయిన్.. ఫర్హీన్ ఖాన్. హిందీ నటే అయినా తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ‘జాన్ తేరే నామ్’తో తారాపథంలోకి దూసుకెళ్లింది. బాలీవుడ్ను మాధురీ దీక్షిత్ ఏలుతున్న కాలంలో అడుగుపెట్టింది ఫర్హీన్. అదే కను, ముక్కు తీరు.. అదే నవ్వు.. అదే గిరిజాల జుట్టు ఉండడంతో ఫర్హీన్ను మాధురీకి జిరాక్స్గా పోల్చారు. స్టార్డమ్లో కూడా మాధురీకి పోటీ వస్తుందని జోస్యమూ చెప్పారు. నిజానికి ఆ అవకాశాలు మెండుగా కనిపించాయి. కానీ హఠాత్తుగా పెళ్లి చేసేసుకొని అంతర్థానమైపోయింది. ఆ వరుడెవరు? క్రికెట్ సంచలనం.. మనోజ్ ప్రభాకర్. ఒక పార్టీలో కలుసుకున్నారిద్దరూ. అతనికి ఫర్హీన్ నచ్చింది. మాటామాటా కలిపాడు. పరిచయం పెరిగింది. ప్రేమ మొదలైంది. అయితే అప్పటికే మనోజ్ వివాహితుడు, ఒక కొడుకు కూడా. అదేమీ అభ్యంతరంగా అనిపించలేదు ఫర్హీన్కు. అతను ఆమె జీవితంలోకి వచ్చాక ఆమె తెర మీద మెరవలేదిక. ఇంకా చెప్పాలంటే అదృశ్యమైపోయింది. కుతూహలం కలవారు కూపీ లాగితే.. మనోజ్ను రహస్యంగా నిఖా చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయిందని తెలిసింది. ఇంచుమించుగా బాలీవుడ్తో సంబంధాలు తెంచేసుకుంది. చదవండి: వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే? విడిపోయారని.. కాలం సాగిపోతోంది. మనోజ్, ఫర్హీన్ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. నాలుగేళ్లు గడిచాయి. ఇంతలోకే ఓ వార్త.. మనోజ్ మీద అతని మొదటి భార్య సంధ్య వరకట్న వేధింపుల కేస్ పెట్టిందని.. ఢిల్లీ హైకోర్ట్లో అది సెటిల్ అయిందని.. ఆ తీర్పు ప్రకారం మనోజ్.. ఫర్హీన్ను వదిలేసి సంధ్య దగ్గరకు వెళ్లిపోయాడు అని. బాలీవుడ్ దృష్టి మళ్లీ ఫర్హేన్ మీదకు మళ్లింది. వివరాలేమీ అందలేదు. ఇంకొన్నాళ్లకు.. ఫర్హీన్ ఢిల్లీలోనే ఉంటున్నట్టు తెలిసింది. ‘మిర్రర్ ’ ప్రతినిధి.. ఆమెను సంప్రదిస్తే ఇంటర్వ్యూ ఇచ్చింది. తను.. మనోజ్తో కలిసే ఉంటున్నట్టు చెప్పింది. వాళ్లు విడిపోయినట్టు వచ్చినవన్నీ వదంతులేనని తేల్చింది. ‘నిజానికి మేమిద్దరం (ఆమె, మనోజ్) ముందు ఫ్రెండ్స్గానే ఉన్నాం. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం.. రెండింటిలో అతను గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నా ఆసరా కోరాడు. సోలేస్గా నిలిచాను. అప్పుడే కలిసి జీవిద్దామనుకున్నాం. బహుశా ఆ టైమ్లోనే మా మాధ్య ప్రేమ మొదలై ఉండొచ్చు. మనోజ్ను లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నాను. కెరీర్ను వదిలేశాను’ అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి వివరించింది. ‘అందరూ అనుకున్నట్టు నేనేం అదృశ్యమైపోలేదు. మా మకాం ఢిల్లీకి మారింది అంతే. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లాడి బాధ్యతల్లో పడిపోయి సినిమాల గురించి ఆలోచించలేదు. అలాగని ఖాళీగా కూడా లేను. హెర్బల్ స్కిన్కేర్ బిజినెస్ పెట్టాను. బాలీవుడ్తో కనెక్షన్ కంటిన్యూ చేయకపోయినా.. కట్ కూడా చేసుకోలేదు. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన దీపక్, ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, శక్తి కపూర్తో టచ్లో ఉన్నాను. సినిమాల్లో నటించొద్దని మనోజ్ చెప్పలేదు. నేనే విరామం తీసుకుందామనుకున్నా. ఇప్పుడు పిల్లాడు పెద్దాడైపోయాడు. బాధ్యతలూ ఓ కొలిక్కి వచ్చాయి. కావాల్సినంత టైమ్ దొరుకుతోంది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ రోల్స్ దొరికితే కచ్చితంగా చేస్తాను. జాన్ తేరే నామ్ సినిమా సీక్వెల్ కోసం అడిగారు. ఓకే అన్నాను’ అని చెప్పింది ఫర్హీన్. త్వరలోనే ఫర్హీన్ను తెర మీద చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆమె అభిమానులు. - ఎస్సార్ -
నడిరోడ్డు మీద కొట్టుకున్న దీపికా ఎక్స్ బాయ్ఫ్రెండ్స్!
దీపికా పదుకొణె రణ్బీర్ కంటే ముందు నిహార్ పాండ్యేను ప్రేమించింది. అయితే కొన్ని కారణాలతో వీరి విడిపోయారు. ఆ తర్వాత దీపిక రణ్బీర్ ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. అయితే రణ్బీర్తో డేటింగ్ చేసే సమయంలోనే ఆమె తన ఎక్స్ బాయ్ఫ్రెండ్ నిహార్ పాండేతోనూ చనువుగా ఉన్నట్లు రణ్బీర్కు తెలిసిందట. ఓ సినిమా షూటింగ్ కోసం రణ్బీర్ ఊటీకి వెళ్లినప్పుడు దీపికా నిహార్తో లంచ్డేట్కి వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వీరి డేట్ జరిగిందని సమాచారం. మరోసారి దీపికా, నిహార్లు కలిసి వెళ్తున్నప్పుడు రణ్బీర్ వాళ్లను చూసి నిహార్తో గొడవకు దిగాడట. ఈ క్రమంలో ఇద్దరూ నడిరోడ్డుమీదే కొట్టుకున్నారట. నిహార్ విషయంలో రణ్బీర్ ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉండేవాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరోవైపు రణ్బీర్ కూడా దీపికాతో లవ్లో ఉన్నప్పుడే కత్రినాతో కూడా డేటింగ్ చేశాడని, ఓసారి వీరిద్దరి దీపికా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని బీటౌన్ టాక్. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్యా దూరం పెరిగి తమ ప్రేమకు గుడ్బై చెప్పేసుకున్నారు. దీపికాతో విడిపోయాక కత్రినా కైఫ్తో రణ్బీర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. కానీ ఆ తర్వాత కత్రినాకు కూడా బ్రేకప్ చెప్పి ప్రస్తుతం ఆలియాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అటు దీపికా రణ్వీర్ సింగ్ను వివాహమాడితే, ఆమె ఎక్స్ బాయ్ఫ్రెండ్ నిహార్ కూడా సింగర్ నీతి మోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. -
పోస్టర్ చూసి హీరోయిన్ ప్రేమలో పడ్డ హర్భజన్ సింగ్
‘ఐ లవ్ యూ.. నీతోనే ఉండిపోవాలనుంది’ అని చెప్పాడు అతను ఓ కాఫీ హోటల్లో. ‘ప్రేమ – గీమ, కలిసుండడాలు – గిలిసుండడాలు వంటివేం వద్దుకానీ.. ముందు ఫ్రెండ్స్గా స్టార్ట్ చేద్దాం జర్నీ.. తర్వాత చూద్దాం.. అది ఎటు తీసుకెళితే అటు వెళదాం’ అని బదులిచ్చింది ఆమె. ఆ ప్రతిస్పందన అతనిలో ఎక్కడలేని నిరాశను పెంచింది. అయినా ఆమె అభిప్రాయాన్ని గౌరవించాడు. ఆమె నిర్ణయాన్ని పాటించాడు. అతను.. ఇండియన్ క్రికెట్ టీమ్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆమె.. బాలీవుడ్ యాక్ట్రెస్ గీతా బస్రా. గీతా పట్ల హర్భజన్ ప్రేమ ఇంచుమించు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిదే. ‘ది ట్రైన్’ ఆమె మొదటి సినిమా. ఆ చిత్రం పోస్టర్లో ఉన్న ఆమె బొమ్మను చూసి మనసు పారేసుకున్నాడు హర్భజన్. ఆ క్షణం నుంచే ఆమె గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. ఈలోపు ఆ సినిమాలోని ‘వోహ్ అజ్నబీ’ అనే వీడియో సాంగ్ విడుదలైంది. అది చూశాక.. ఎలాగైనా ఆమెను కలవాలి అన్న ఆరాటం ఎక్కువైంది అతనికి. గీతా వివరాల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. సినిమా అభిమానే తప్ప.. బాలీవుడ్తో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అతనికి. అందుకే ఆమె ఆచూకీ దొరకడం చాలా కష్టమైంది. చివరకు అతని స్నేహితులు ఆమె ఫోన్నంబర్ సంపాదించి హర్భజన్కు ఇచ్చారు. అలా నంబర్ అందుకున్నాడో లేదో ఇలా ఆమెకు సందేశం పంపించాడు. గీతా చూడలేదు. చాన్నాళ్లు వేచున్నాడు అవతలి నుంచి సమాధానం వస్తుందేమోనని. టీ20 వరల్డ్ కప్ (2007)ను గెలిచేంత వరకు గీతా నుంచి మెసేజ్ రాలేదు. వచ్చిన మెసేజ్ కూడా హర్భజన్ అంతకుముందు పంపిన సందేశానికి రిప్లయ్ కాదు. టీ20 వరల్డ్ కప్ విజయానికి ఆమె అభినందన మెసేజ్. దానికే ఉబ్బితబ్బిబ్బై పోయాడు అతను. వెంటనే ఓ సందేశం పంపాడు.. ‘కలుద్దామా?’ అంటూ. ఐపీఎల్ మ్యాచ్లకు టికెట్లూ పంపాడు. గ్యాలరీలో ఆమెను చూసుకుని గ్రౌండ్లో రెచ్చిపోయాడు. అతనికేమూలో ఆశ.. తన మనసుని అర్థం చేసుకొని తన చేయి పట్టుకుంటుందని. గీతా పట్టించుకోలేదు. అతని మనసు అర్థంకానట్టే ప్రవర్తించింది. కాఫీ డేట్కు ఒప్పేసుకుంది గీతా బస్రా.. లండన్లో పుట్టి, పెరిగింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ముంబై చేరింది. ఆమె దృష్టి అంతా కెరీర్ మీదే. అందుకే హర్భజన్ను పట్టించుకోలేదు. అలా వన్ సైడెడ్ లవ్తో దాదాపు పది నెలలు ఆమె వెంట పడ్డాడు హర్భజన్. మొత్తానికి అతని ఆరాటాన్ని అర్థం చేసుకున్న గీతా.. ఓ రోజు కాఫీ డేట్కి రావడానికి ఒప్పుకుంది. కలుసుకున్న వెంటనే ఆమె అంటే తనకున్న ఇష్టాన్ని ప్రకటించేశాడు. అప్పుడే ఆమె చెప్పింది ముందు ఫ్రెండ్ షిప్ చేద్దాం అని. ‘హర్భజన్ ప్రపోజ్ చేసిన వెంటనే నేను ‘‘ఎస్’’ చెప్పకపోవడానికి అతనంటే ఇష్టం లేక కాదు.. కెరీర్ను సీరియస్గా తీసుకోవడం వల్ల. నేను యాక్ట్ చేసిన ది ట్రైన్ రిలీజ్ అయ్యేనాటికి నాకు బాలీవుడే కాదు.. ఇండియా కూడా కొత్తే. ఆ టైమ్లో ప్రేమ, డేటింగ్లో పడిపోతే కెరీర్ మీద ఫోకస్ చేయలేం. అందుకే ముందు ఫ్రెండ్స్గానే ఉందాం అన్నా. కానీ ఉండలేకపోయా. అతని ప్రేమలో పడిపోయా. కుటుంబం అంటే ప్రాణం పెడతాడు. సింపుల్గా ఉంటాడు.. నెమ్మదస్తుడు.. ఇన్ని క్వాలిటీస్ ఉన్న మనిషిని ప్రేమించకుండా ఎలా ఉంటాం!’ అని చెప్పింది గీతా బస్రా ఓ ఇంటర్వ్యూలో. అయిదేళ్లు సాగిన ఆ స్నేహయానంలో పొరపొచ్చాలు చాలానే వచ్చాయి ఇద్దరి మధ్య. గొడవలు పడ్డారు. ‘ఇంక చాలు.. మనం ఫ్రెండ్స్గా కూడా ఉండలేం’ అని చెప్పుకున్నారు. బ్రేకప్ చేసుకున్నారు. కానీ హర్భజన్తో స్నేహంగా లేని కాలం ఆగిపోయినట్టుగా తోచింది గీతాకు. ఉండలేకపోయింది. అప్పుడు గ్రహించింది అది ఫ్రెండ్షిప్ కాదు.. ప్రేమ అని. అతని తోడు లేనిదే ఉండలేనని.. అతని తోడిదే జీవితమని. ఆ విషయమే హర్భజన్కు చెప్పింది. అతని సంతోషానికి అవధుల్లేవ్. ‘అయితే ఒకరికొకరం జీవితాంతం ముడిపడి ఉందాం’ అన్నాడు గీతాతో. ‘సరే’అంది ఆమె. 2015, డిసెంబర్లో ఈ ఇద్దరికీ పెళ్లయింది. ప్రపంచంలోని ఆనందాన్నంతా ఆస్తిగా చేసుకొని సాగిపోతోంది ఆ జంట. ∙ఎస్సార్ -
క్రికెటర్ను ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే?
ఇది గాయని లతా మంగేష్కర్ ప్రేమ కథ. ‘ఇంటికి పెద్ద కూతురు.. చిన్న వయసులోనే తోబుట్టువుల మంచి,చెడులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతకే జీవితాన్ని అంకింతం చేసి ఒంటరిగా మిగిలిపోయింది’ అని లతా మంగేష్కర్ గురించి తెలిసిన కొందరు చెబుతారు. ‘సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ల చేష్టలు .. వాటి పర్యవసానాలు పిల్లలకు పాఠాలవుతాయి. కానీ లతా విషయంలో అది రివర్స్ అయింది. ప్రేమ, పెళ్లికి సంబంధించి లతా చెల్లెలు ఆశా భోంస్లే తీసుకున్న తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు.. వాటి తాలూకు ఫలితాలు లతాను జీవితాంతం అవివాహితగానే ఉంచాయి’ అనేది ఇంకొందరు సన్నిహితుల అభిప్రాయం. ‘ఆమె ఇష్టపడ్డ మనిషి.. ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లకపోవడంతో ఏ తోడు లేకుండానే జీవితాన్ని గడిపేసింది’ అని మరికొందరి ఆప్తుల మాట. లతా మంగేష్కర్ ప్రేమించిన వ్యక్తి.. క్రికెటర్, దుంగార్పూర్(రాజస్థాన్) సంస్థానాధీశుడు లక్ష్మణ్ దుంగార్పూర్ కుమారుడు.. రాజ్ సింగ్ దుంగార్పూర్. రంజీల్లో రాణించాడు. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కు ప్రెసిడెంట్గా పనిచేశాడు. అభిమాని.. లతా మంగేష్కర్ను, రాజ్ సింగ్ దుంగార్పూర్ను కలిపింది క్రికెటే. ఆమెకు క్రికెట్ మీద చక్కటి అవగాహన ఉంది. ఆ ఆటకు వీరాభిమాని కూడా. లతా ఒక్కరే కాదు మంగేష్కర్ కుటుంబమంతా క్రికెట్ అభిమానులే. దాంతో ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్కి రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య స్నేహం బలపడింది. అలా మంగేష్కర్ కుటుంబానికే ఆత్మీయుడిగా మారిపోయాడు అతను. ఆ సాన్నిహిత్యమే లతా, రాజ్ సింగ్ ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేసింది అంటారు ఇద్దరినీ ఎరిగిన మిత్రులు. పెళ్లిదాకా ఎందుకు రాలేదు? ‘మా తాత, మా అమ్మ, పిన్ని ఒప్పుకోకపోవడం వల్లే’ అంటుంది రాజ్ సింగ్ దుంగార్పూర్ మేనకోడలు రాజశ్రీ కుమారి. ‘సినిమా గాయని రాజ కుటుంబపు కోడలెలా అవుతుందనేది వాళ్ల అభ్యంతరం. నాకింకా గుర్తు.. నా చిన్నప్పటి విషయం ఇది.. ఒకసారి బాంబేలోని బికనీర్ హౌస్కి లతా మంగేష్కర్ని పిలిచారు. మా అమ్మ, పిన్ని.. తమ తమ్ముడిని వదిలేయమని, అప్పుడే అతను తమకు తగినట్టుగా ఏ రాజ్పుత్ అమ్మాయినో లేదంటే ఏ రాజవంశస్తురాలినో చేసుకుంటాడు అని లతాకు చెప్పారు. కానీ లతాతో రిలేషన్షిప్ వదులుకోవడానికి మామయ్య ఇష్టపడలేదు’ అని రాజశ్రీ కుమారి తన ‘ది ప్లేస్ ఆఫ్ క్లౌడ్స్’ అనే పుస్తకంలో రాసింది. ఆమె రాసిన ఈ విషయాన్ని దుంగార్పూర్ వంశస్తులు ఖండించారు. రాజ్ సింగ్ కుటుంబ సభ్యుడొకరు ‘రాజ్ సింగ్ మొదటి నుంచీ సర్వస్వతంత్రుడిగానే ఉన్నాడు. ఎవరో కట్టడి చేస్తే ఆగే మనిషి కాదు అతను. రాజ్ సింగ్ కన్నా లతా ఆరేడేళ్లు పెద్ద. వాళ్లది లేట్ వయసు ప్రేమ. బహుశా ఈ కారణాలతో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోకపోయుండొచ్చు’ అంటాడు. ఇలా వాళ్ల ప్రేమ గురించి వాళ్లిద్దరి సన్నిహితులు చెప్పడమే కానీ ఇటు లతా మంగేష్కర్ కానీ.. అటు రాజ్ సింగ్ కానీ ఎప్పుడూ నిర్ధారించలేదు. అయితే తనకు అత్యంత ఆప్తుల్లో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఒకరని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో లతా మంగేష్కర్ చెప్పారు. ఆమె కోసం రాజ్ సింగ్ లార్డ్స్ స్టేడియం గ్యాలరీలోని సీట్ను పర్మినెంట్గా రిజర్వ్ చేయించారనేది ప్రచారంలో ఉంది. ‘నిజమేనా?’ అని లతాని అడిగారు నస్రీన్ కబీర్ మున్ని.. ‘లతా మంగేష్కర్ .. ఇన్ హర్ ఓన్ వాయిస్’ పుస్తక రచయిత. దానికి లతా నవ్వుతూ ‘కాదు. లార్డ్స్లో నాకెలాంటి రిజర్వేషన్ లేదు. సామాన్య ప్రేక్షకుల్లాగే ఆ స్టేడియంలో మ్యాచ్లు చూస్తా’ అని జవాబిచ్చారు. ‘రాజ్ సింగ్, లతా మంగేష్కర్లది పరిణతి చెందిన ప్రేమానుబంధం. దానికి లేనిపోని కల్పనలు జోడించొద్దు. ఆమెకు అతని ఆస్తి అవసరం లేదు. అతనికి ఆమె కీర్తితో సంబంధం లేదు. ఆ ఇద్దరికీ వాళ్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలున్నాయి. వాళ్ల సహజీవనానికి ఉన్న అడ్డంకులను అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు బలమయ్యారు.. పెళ్లితో కలవకపోయినా.. ప్రేమకు గౌరవమిచ్చారు ’ అని చెప్తారు ఇరు కుటుంబ సభ్యులు. రాజ్ సింగ్ కూడా అవివాహితుడిగానే నిష్క్రమించాడు. ప్రపంచానికేం అవసరం? ‘చాలా కాలంపాటు నేను డైరీలు రాశాను. కొన్ని కథలు, పాటలూ రాశాను హిందీలో. కానీ ఓ రోజు అనిపించింది.. అలా రాయడం వల్ల ఉపయోగమేంటీ అని. అందుకే వాటన్నిటినీ చించేశాను. ఆత్మకథ రాసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆత్మకథ రాసేప్పుడు నిజాయితీగా ఉండాలని నమ్ముతాను. అయితే ఆ నిజాయితీ చాలా మందిని బాధపెట్టొచ్చు. ఇతరులను బాధపెట్టే రాతలెందుకు? నా జీవితం.. అదిచ్చిన అనుభవాలు నా వ్యక్తిగతం. వాటిని రాయడమెందుకు? నా వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా!’ అని చెప్పారు లతా మంగేష్కర్. - ఎస్సార్