fighting
-
ఏయ్.. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!
లక్నో : ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.ఆ సమయంలో అక్కడే పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.స్కార్పియోలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet. Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj— Manish RJ (@mrjethwani_) February 23, 2025 -
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు. ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్ఇండియా అధికారులు తెలపడం గమనార్హం. -
Vijay Diwas: బంగ్లాదేశ్ ఆవిర్భవించిన రోజు.. భారత్కు ఎందుకు ప్రత్యేకం?
దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో ఇదే రోజున భారత్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్లో భారత్.. పాక్తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్తో యుద్ధానికి అనుమతించారు.అతిపెద్ద సైనిక లొంగుబాటుభారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
కొట్టుకున్న ప్రిన్సిపాల్ టీచర్
-
Israel Hezbollah War: పోరు ఆపం
బీరుట్: ఇజ్రాయెల్తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు. -
పిఠాపురంలో కొత్త లొల్లి..
-
నడిరోడ్డుపై పడి పడి కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు..
-
క్యాన్సర్తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో మహిళలు
రద్దీగా ఉన్న ఢిల్లీ మెట్రోలో కూర్చునేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతుంటారు. సీటు కోసం వాదులాడుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది ఇటీవలి కాలంలో తరచూ కనిపిస్తోంది. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతుంటాయి.తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయివుండటాన్ని చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.అది కొట్టుకోవడం వరకూ దారితీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మరింతగా పెరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి తరువాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఈ ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
జాతరలో గజరాజుల కొట్లాట.. పలువురికి గాయాలు
కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!. కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. An elephant which was brought for the arat ritual at #Mandarakadavu in connection with the #ArattupuzhaPooram in #Kerala's #Thrissur, attacked a fellow elephant. pic.twitter.com/6OXptgdjnl — Hate Detector 🔍 (@HateDetectors) March 23, 2024 -
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
జనసేన ఆఫీసు ముందే తనుకున్న జనసైనిక్స్..
-
డోన్.. టీడీపీ వికెట్ డౌన్
సాక్షి, నంద్యాల: డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎవరికి వారు తాము సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో అభ్యర్థిని ఓడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబుకే స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కొంత పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్ పోటీ చేసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇన్చార్జిగా తప్పించి కేఈ ప్రభాకర్ను అధిష్టానం నియమించింది. కొంతకాలం తర్వాత ప్రభాకర్ను కూడా తప్పించి కేఈ వర్గానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఆయన నియామకాన్ని కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అతడికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. బీసీ ప్రోద్బలంతోనే గ్రూపు రాజకీయాలు నంద్యాల జిల్లా టీడీపీకి బీసీ జనార్దన్రెడ్డి పెద్ద దిక్కుగా మారారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో మిగిలిన నాయకులు బీసీ నిర్ణయాలకు అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం వెనక బీసీ జనార్దన్రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కేఈ, కోట్ల వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. బీసీ ప్రోద్బలంతోనే సుబ్బారెడ్డి గ్రూపు రాజకీయాలకు తెరతీశారని మండిపడుతున్నాయి. నువ్వొస్తే మర్యాదగా ఉండదు గత ఆదివారం పత్తికొండలో జరిగిన ‘రా.. కదిలిరా’ సభకు బీసీ జనార్దన్రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డికి మినహా మిగిలిన నంద్యాల జిల్లా నాయకులకు ఆహ్వానం అందింది. ఒకవేళ ఆహ్వానం లేకున్నా సభకు వస్తే మర్యాద దక్కదని పత్తికొండ టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక ఇద్దరు నేతలు సభకు హాజరుకాలేదు. సభ ముగిశాక చంద్రబాబు అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి మాట్లాడారు. కానీ, డోన్ పంచాయితీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ఇన్చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి సహకరించాలని అటు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి కానీ ఇటు కేఈ కుటుంబానికి కానీ చంద్రబాబు సూచించకపోవడంతో ఈ అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే సహకరిస్తాం డోన్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇస్తేనే తాము సహకరిస్తామని కేఈ కుటుంబం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డోన్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. దాదాపు రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో డోన్ బరిలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. ఎమ్మిగనూరు నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి కోరినా చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక ఓడిపోయే డోన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా భారీ ఖర్చు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లుగా టీడీపీ కార్యక్రమాలను ధర్మవరం సుబ్బారెడ్డి చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.నాలుగు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన తన అనుచరుల వద్దే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తనకే టికెట్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఖర్చు చేశానని, ఇప్పుడు టికెట్ విషయంలో మీన మీషాలు లెక్కిస్తుండడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేయడం సుబ్బారెడ్డి వంతైంది. మరోవైపు చంద్రబాబు ఖాతాలో మరో వికెట్ పడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్కు బ్రేక్..! -
పొలం వద్ద ఉన్న పారతో అన్నను తమ్ముడు దారుణంగా..
మహబూబాబాద్: బోరుబావి వివాదంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని సూర్యబండా తండాలో ఆదివారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన భూక్యా సదన్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా సదన్లాల్ తనకున్న వ్యవసాయ భూమిని, బోరు మోటరును కుమారులు రవీందర్, రమేశ్కు ఇవ్వడంతో దానిని ఉమ్మడిగా వాడుకుంటున్నారు. కాగా కొంతకాలంగా బోరుబావి విషయంలో అన్నదమ్ముల మధ్య పంచాయితీ నెలకొంది. ఈక్రమంలో ఆదివారం అన్నదమ్ముల మధ్య సయోధ్యకు పెద్దమనుషులు ప్రయత్నిస్తుండగా తమ్ముడు రమేశ్ పొలం వద్ద ఉన్న పారతో అన్న రవీందర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేర రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్కార్డులకే ఎక్కువ! -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు!
యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని విన్నవారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇక్కడి శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాహ వేడుకలో రసగుల్లా విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో కొట్టుకునేంత వరకూ వివాదం దారితీసింది. ఈ గొడవలో ఒక మహిళతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నయాబన్స్ రోడ్డు సమీపంలోని సంతోషి మాత దేవాలయం దగ్గర ఒక వివాహ వేడుకలో విందు జరిగింది. ఈ సందర్భంగా రసగుల్లా తినే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది పరస్పరం కొట్టుకునేవరకూ దారితీసిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ శర్మ తెలిపారు. క్షతగాత్రులందరినీ వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. విందు ఏర్పాటు చేసిన గౌరీశంకర్ శర్మపై కేసు నమోదు చేశామని, ఈ వివాదంపై విచారణ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: హిమాచల్లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే.. -
ఆసక్తికరంగా ఛత్తీస్గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్గఢ్లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
లిఫ్ట్లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
Lb Stadium: రణరంగంలా కుస్తీ పోటీలు.. కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీలో వివాదం చెలరేగింది. దీంతో కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. మోదీ కేసరి ఫైనల్ కాంపిటీషన్లో పహిల్వాన్ల గ్రూప్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జఫర్, పైల్వాన్, సాలం పైల్వాన్ గ్రూప్లు కుర్చీలతో కొట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కుస్తీలో గెలిచింది మేమంటే.. మేమని వాగ్వాదానికి దిగారు. ఈ కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిని తరలించారు. ఇరువర్గాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?! -
లైవ్ డిబేట్ లో కొట్లాట..
-
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
కాంగ్రెస్ సభలో కుర్చీల కొట్లాట
సాక్షి, మహబూబాబాద్: మానుకోట కాంగ్రెస్ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. రాష్ట్ర పరిశీకురాలు మీనాక్షి నటరాజన్ ముందే కుర్చీల కోసం కొట్లాడుకున్నారు. అందరినీ సభావేదికపైకి పిలవా లని డిమాండ్ చేశారు. ఈ నెల 17న హైదరా బాద్లో జరిగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ నిమిత్తం మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోని ముఖ్యనాయకుల సమావేశం గురువారం మహబూబాబాద్లో జరిగింది. ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇల్లెందు నుంచి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్చంద్రా రెడ్డిని పిలవాలని అనుకున్నారు. అయితే, అక్కడు న్న చిన్నాచితకా నాయకులు కూడా వేదికపైకి వచ్చి కూర్చోవడంతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ముందుగా పీసీసీ ఉపాధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతుండగా ‘అందరూ వేదిక పై ఉన్నారు. మా నేత మురళీనాయక్ను కూడా పిలవాలి, లేకపోతే అర్హత లేని వారిని కిందికి దింపాలి’అంటూ పలువురు కేకలు వేశారు. ఈ క్రమంలో మురళీ నాయక్, బలరాంనాయక్ వర్గాల కార్యక ర్తలు ఒకరినొకరు గల్లాలు పట్టుకుని తోసుకున్నారు. ఇరువర్గాల నినాదాలతో సభాస్థలి దద్దరిలింది. మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకొని విజ్ఞప్తి చేయ డంతో వేదికపై ఉన్న అందరూ కిందికి దిగారు. ఆ తర్వాత ఆమె ముఖ్యులతో మాట్లాడించారు. -
HYD: నేడు డబ్ల్యూడబ్ల్యూఈ పోరు
హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 16 సార్లు ప్రపంచ చాంపియన్, రెజ్లింగ్ ఆల్టైమ్ గ్రేట్ జాన్ సినా ఇక్కడ బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. అతని ఫైట్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జాన్ సినా భారత్లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 2017లో భారత్లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్ను తిలకించేందుకు వస్తున్నారు. ‘సూపర్ స్టార్ స్పెక్టకిల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్లో జాన్ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు. ఫిన్ బాలర్, రియా రిప్లీ, సేట్ రోలిన్స్ ఈ జాబితాలో ఉన్నారు. టీమ్ ఈవెంట్లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ రోలిన్స్తో కలిసి జాన్ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్ కై సర్ద్ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్ను ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస.. కుర్చీలతో పరస్పర దాడులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగ్ కంటే ముందే నాయకులు బాహాబాహీకి దిగారు. ముస్తాబాద్ మండలం నుంచి ఉమేష్ రావు వర్గం కొంతమందిని జాయిన్ చేసుకునేందుకు తీసుకువచ్చింది. తాను మండలాధ్యక్షుడిగా ఉండగా తమకే తెలియకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ బాల్ రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ చీటి ఉమేశ్ రావు, సంగీతం శ్రీనివాస్ వర్గాల పేరిట రెండు వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ నాయకులు.. కుర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గందరగోళంగా మారింది. ఇదీ చదవండి: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా? -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
త్రివర్ణ పతాక రెపరెపలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్వాతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర పోరాట వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వతంత్ర పోరాటం గురించి, ఇన్నేళ్లలో సాధించిన ప్రగతి గురించి పలువురు ప్రసంగించారు. మిఠాయిలు పంచి పరస్పరం అభినందించుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి జగన్ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గృహనిర్మాణసంస్థ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, సచివాలయాల విభాగం డైరెక్టర్ లక్ష్మీషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సచివాలయాల విభాగం అదనపు డైరెక్టర్లు ధ్యానచంద్ర, భావన వశిష్ట పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో.. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సౌధలో.. విజయవాడలోని విద్యుత్ సౌధలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్బాబు, ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, జెన్కో విజిలెన్స్ ఆఫీసర్ పనసరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు అభివృద్ధి, సంక్షేమం: సీఎస్ జవహర్రెడ్డి రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి.. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవానికి సక్రమంగా అందించడంలో మనమంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి, జీఏడీ డిప్యూటీ సెక్రటరి రామసుబ్బయ్య, పలువురు సచివాలయ అధికారులు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి అడుగుల జాతీయ పతాకం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని తమ కళాశాల వద్ద జాతీయ రహదారి వెంట ప్రదర్శించారు. – ఒంగోలు సాగరగర్భంలో.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుషికొండ బీచ్లో లివిన్ అడ్వెంచర్స్ డైరెక్టర్ బలరామ్నాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవింగ్ వారు 60 అడుగుల సముద్రగర్భంలో జాతీయ జెండాను ఎగురవేశారు. – కొమ్మాది తిరుపతిలో వంద అడుగుల ఎత్తైన జాతీయ పతాకం జిల్లా కేంద్రం తిరుపతిలోని సామవాయి మార్గంలో వంద అడుగుల ఎత్తైన జాతీయజెండాను ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో శ్రీనివాససేతు వారధిని సెప్టెంబర్ 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో క్లీన్ ఇండియా–న్యూ ఇండియా సెల్ఫీ పాయింట్ విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘క్లీన్ ఇండియా–న్యూ ఇండియా’ సెల్ఫీ పాయింట్ను ప్రారంభించారు. ఏడీఆర్ఎంలు డి.శ్రీనివాసరావు, ఎమ్.శ్రీకాంత్, సీనియర్ డీపీవో బాలమురళీధర్, సీనియర్ డీసీఎం వి.రాంబాబు, ఏసీఎం డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదిలో స్విమ్మర్ల జెండా వందనం కృష్ణాజిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద గ్రామానికి చెందిన కొందరు స్విమ్మర్లు కృష్ణానదిలో జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. రేమాల చంటి, వేములపల్లి ప్రసాద్, సనకా మురళి, తలశిల రఘుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.– నాగాయలంక -
మస్క్ & జుకర్బర్గ్ పోరుకి అంతా సిద్ధం.. వేదిక అక్కడే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు. మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..! ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. The fight will be managed by my and Zuck’s foundations (not UFC). Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all. I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location. — Elon Musk (@elonmusk) August 11, 2023 -
ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి.. ఇంతలో..
యాదాద్రి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య గురువారం చోటుచేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న చింతపల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వింజమూరు గ్రామానికి చెందిన విద్యార్థి గురువారం సాయంత్రం పాఠశాల పక్కనే ఉన్న స్థలంలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో సెకండియర్ విద్యార్థి కత్తితో ఫస్టియర్ విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్కి ముందే సర్జరీ అవసరం అంటూ..
Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్ చేసే సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మస్క్ జుకర్బర్గ్తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్బర్గ్ తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. Exact date is still in flux. I’m getting an MRI of my neck & upper back tomorrow. May require surgery before the fight can happen. Will know this week. — Elon Musk (@elonmusk) August 7, 2023 -
‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో..
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరు టెక్ టైటాన్లు గత నెలలో కేజ్ ఫైట్లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది. జుకర్బర్గ్తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు. Zuck v Musk fight will be live-streamed on 𝕏. All proceeds will go to charity for veterans. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్బర్గ్ ఈ విజయాన్ని ఇన్స్టాగ్రామ్లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
బైజూస్ ఆఫీస్లో జగడం.. ఘర్షణకు దిగిన మహిళా ఉద్యోగి.. వీడయో వైరల్
ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్మెంట్లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు. ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్మెంట్లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 -
బర్త్డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టూ జుట్టూ పట్టుకున్న యువతులు!
ఘనంగా బర్త్డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్టాక్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది. తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i — New York Post (@nypost) July 19, 2023 -
లోకల్ ట్రైన్లో మహిళల సిగపట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
కలకత్తా: ట్రైన్లలో ప్రయాణికుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రైళ్లలో గొడవ పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముంబయి లోకల్ ట్రైన్లో మహిళల ఫైటింగ్ వార్త మరవక ముందే కలకత్తా లోకల్ ట్రైన్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు గుంపుగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కలకత్తా లోకల్ ట్రైన్లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనను ఓ యూజర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లో 6 వేల వ్యూస్ వచ్చాయి. Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L — Ayushi (@Ayushihihaha) July 11, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రైన్లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తోందంటూ మరో యూజర్ స్పందించాడు. క్లినిక్ ప్లస్ యాడ్లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్న హిజ్రాలు
-
చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. చదవండి: కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా.. -
US : తానా సభల్లో తన్నుకున్న లోకేశ్, జూ.ఎన్టీఆర్ వర్గాలు
పెన్సిల్వేనియా, అమెరికా : అమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణకు ప్రధాన కారణం లోకేష్ నాయకత్వంపై వ్యక్తమైన విమర్శలే కారణమని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా కొందరు తెలుగు తమ్ముళ్లు ‘జై ఎన్టీఆర్’అని నినదించడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు వర్గం దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. అ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంతవరకు టీడీపీకి మనుగడ లేదని, 2024లోనూ మరోసారి పరాజయం ఖాయమని కొందరు ఎన్నారైలు వాదించినట్లు సమాచారం. తనను తాను మూర్ఖుడిగా చెప్పుకునే లోకేష్ కు బదులుగా జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీంతో కలవరం చెందిన చంద్రబాబు వర్గం దాడులకు దిగినట్లు తెలిసింది. అమెరికాలో సుదీర్ఘ చరిత్ర కలిగిన తానాకు ఈ ఘటన మాయని మచ్చలా మిగిలింది. ఘనంగా ప్రారంభం.. అంతలోనే వివాదం పెన్సిల్వేనియాలో తానా 23వ మహాసభలను ఘనంగా ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన అనంతరం తానాలోని కొందరు ప్రముఖులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. కర్రలు విసురుకుంటూ.. సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న తానాకు ఫిలడెల్ఫియాలో జరిగిన అనూహ్య ఘటన ఊహించని ఇబ్బంది తెచ్చింది. తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. మాట మాట పెరిగి గొడవకు దిగారు. కొందరు తానా ముఖ్యులు ఆపడానికి ప్రయత్నించినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి స్థానిక సెక్యూరిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య వివాదం రేగడంతో ముష్టి యుద్ధానికి దిగాయి. వివాదం శృతి మించడంతో కొందరు అందుబాటులో ఉన్న కర్రలను విసిరారు. ప్రతిష్టాత్మక తానా సంస్థను రాజకీయ సంస్థగా మార్చిన ఘనత చంద్రబాబుదేననే విమర్శలున్నాయి. నిధుల సేకరణ కోసం తానాను ఆయన కామధేనువులా మార్చుకున్నారు. గొడవకు కారణం లోకేష్ సమర్థతేనా? తానాకు హాజరయిన కొందరు సభ్యుల్లో గొడవ ముదరడానికి ప్రధాన కారణం తెలుగుదేశం రాజకీయాలే అని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం చంద్రబాబు, లోకేషేనని.. మళ్లీ 2024 ఎన్నికల్లోనూ పార్టీకి పరాభవం తప్పదని కొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్నంత కాలం బాగుపడే అవకాశం లేదని చెప్పుకున్నారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారని, అయితే తనను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకుంటోన్న లోకేష్ కు అంత సీన్ లేదని, లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే గానీ పార్టీ బాగుపడదని కొందరు వాదించినట్టు తెలిసింది. ఇటీవల చంద్రబాబు ఎక్కడికెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ పగ్గాలు జూనియర్ కు ఇస్తేనే.. బాగుంటుందని ఎక్కువ మంది వాదించారు. దీంతో చంద్రబాబు వర్గంలో కలవరం మొదలై, దాడులకు దిగే దుస్థితి వచ్చినట్టు టిడిపి వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
ముష్టియుద్ధానికి సిద్ధమవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ట్రైనింగ్ కూడా..
సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. I’m up for a cage match if he is lol — Elon Musk (@elonmusk) June 21, 2023 మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్బర్గ్ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం. I did an impromptu training session with @elonmusk for a few hours yesterday. I'm extremely impressed with his strength, power, and skill, on the feet and on the ground. It was epic. It's really inspiring to see Elon and Mark doing martial arts, but I think the world is served… pic.twitter.com/cq00A9Xnmw — Lex Fridman (@lexfridman) June 27, 2023 అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) Here's a highlight video of Mark Zuckerberg and I training jiu jitsu. I look forward to training with @elonmusk as well. It's inspiring to see both Elon and Mark taking on the martial arts journey. See the full video here: https://t.co/G1ubUuxILK pic.twitter.com/WsLaRiFf1o — Lex Fridman (@lexfridman) June 25, 2023 నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్బర్గ్ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. -
కిక్కిరిసిన మెట్రో.. ఏమైందో తెలియదు.. తన్నుకున్న యువకులు..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా సరిగా స్థలం దొరకని పరిస్థితి. ఇంతలోనే మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అదీ కాస్త ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఇద్దరు యువకులు ఒకరిపై ఇంకొకరు రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn — Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది. ఇదీ చదవండి: వీడేం లవర్రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. -
గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!
శాఫ్ 2023 చాంపియన్షిప్లో భాగంగా శనివారం భారత్, నేపాల్ మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్తో మ్యాచ్ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్లు హెడర్ షాట్ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్కు ప్రయత్నించడంతో మగర్ను తాకి రాహుల్ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్ మగర్ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్ ఆటగాడు భారత్ ఆటగాడిని కాలర్ పట్టి కింద పడేశాడు. ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్ ఛెత్రి మగర్ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్ మాత్రం 'ప్లీజ్ కామ్డౌన్' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సునీల్ ఛెత్రీ సేన నేపాల్పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్లో 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్కు తొలిగోల్ అందించగా.. నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో మరో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. Crazy Fight among Players during India vs Nepal football match. This Aggressive Indian team is looking more dangerous. I'm liking it ❤️🔥❤️🔥pic.twitter.com/UjNnIKIm5t — Mukesh Chaudhary (@MukeshG0dara) June 24, 2023 Another fight, and now it's between India and Nepal🤣🤣#INDNEP #SAFFChampionship pic.twitter.com/ieGbQ1aV3F — BumbleBee 軸 (@itsMK_02) June 24, 2023 చదవండి: సెమీస్కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి -
రాత్రివేళలో రచ్చ..ఐఏఎస్,ఐపీఎస్ సస్పెండ్
రాజస్థాన్:రాజస్థాన్లో జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై జరిగిన ఘర్షణల్లో ఓ ఐఏఎస్,ఐపీఎస్ అధికారితో సహా ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, అజ్మీర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ సస్పెండ్ అయినట్లు సమాచారం. స్థానిక వివరాల ప్రకారం.. ఐపీఎస్ అధికారి కొత్త ప్రాంతానికి బదిలీ అయినందున ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసు సిబ్బంది కూడా హాజరయ్యారు. పార్టీ ముగించుకుని వెళ్లే క్రమంలో రెస్టారెంట్లో వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. అనంతరం ఐపీఎస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎస్ అధికారి రెస్టారెంట్ సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రెస్టారెంట్ సిబ్బంది కూడా అధికారిపై తిరగబడిన తర్వాత ఘర్షణ మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐపీఎస్ అధికారితో సహా పలువురు పోలీసులు తమ సిబ్బందిపై ఘర్షణకు దిగారని రెస్టారెంట్ యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ రిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోందని రాజస్థాన్ పోలీసు చీఫ్ ఉమేష్ మిశ్రా తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణనలను ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ ఖండించారు. अजमेर में IAS और IPS अफसरों ने की होटल स्टाफ के साथ मा#रपीट! | Si News@BJP4India @Myogioffice @Narendramodi#Ajmer #HotelMakranaRaj #IAS #IPS #IPSSushilBishnoi #IASGiridhar #Suspended #SiNews pic.twitter.com/TKyqvRWeAJ — Since Independence (@Sinceindmedia) June 14, 2023 ఇదీ చదవండి:మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. 9మంది మృతి.. -
సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ.. 33 మంది అరెస్టు
గ్రేటర్ నోయిడాలో గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని సుమారు 33 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసలు తెలిపిన కథనం మేరకు.. సెక్యూరిటీ గార్డులు యూనివర్సిటీ క్యాంపస్లోని మున్షీ ప్రేమ్చంద్ హాస్టల్లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. అదికాస్త తీవ్రమై ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుడంతో తాము ఘటన స్థలానికి చేరుకుని ఆయా వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ప్రైవేటు గార్డులు, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఫిర్యాదులను స్వీకరించామని, దీనిపై సత్వరమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, క్యాంపస్ వెలుపల సెక్యూరిటీ గార్డు, విద్యార్థులు కర్రలు చేతపట్టుకుని ఘర్షణ పడుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
Karnataka: ఇంటి పెద్ద అత్తా? కోడలా?.. ఇంటింటా ‘గృహలక్ష్మి’ కలహాలు!
కర్నాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2000 మొత్తాన్ని ప్రతీనెలా ఇంటిలోని పెద్దకు ఇవ్వనున్నారు. ఈ పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే చాలా ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద వచ్చే మెత్తం ఎవరు తీసుకోవాలనే దానిపై చాలా కుటుంబాలు తమలో తాము గొడవలు పడుతున్నాయి. చాలా కుటుంబాలలో అత్తాకోడళ్లు కలిసి ఉండటం లేదు. అటువంటప్పుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం అత్తలకే చెందాలని కొందరు అంటుండగా, కోడళ్లకే దక్కాలని మరికొందరు అంటున్నారు. అయితే సఖ్యతగా ఉన్న కొన్ని కుటుంబాలలోని అత్తాకోడళ్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటామని చెబుతున్నారు. దీని గురించి కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం కింద అందించే మొత్తాన్ని పంచుకోవడంతో కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని అన్నారు. అయితే ఇంటిపెద్దగా అత్తకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆమె ఇవ్వాలనుకుంటే కోడలికి ఈ మొత్తాన్ని అందించవచ్చన్నారు. పీడబ్ల్యుడీ మంత్రి సతీష్ జార్కీహోలీ మాట్లాడుతూ ‘గృహలక్ష్మి’ పథకం మొత్తం అత్తకే చెందాలని అన్నారు. ఆమెనే ఇంటిపెద్ద అని అన్నారు. ఈ విషయంలో అత్తాకోడళ్లు సయోధ్యతో మెలగాలని సూచించారు. -
విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
-
Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు
ఇద్దరు మహిళలు గొడవ పడటానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న విషయాలతో మొదలైన వాటిని కూడా ఎంత దూరమైనా తీసుకువెళ్లగలరు. కుళాయి వద్ద, మెట్రో, రైలు, బస్సు వంటి చోట్ల సీట్ల విషయంలో ఆడవాళ్లు గొడవ పడటం సాధారణంగా చూస్తూనే ఉంటాం.. కానీ ఓ పాఠశాలలో ముగ్గురు మహిళా టీచర్లు ఓ రేంజ్లో కొట్టుకున్నారు. ఒకరినొకరు జుట్టు పట్టుకొని, చెప్పులతో వాయించుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిహార్లోని పాట్నా జిల్లాల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. బిహ్తాలోని పాఠశాలలోని క్లాస్రూమ్లోని ఏదో విషయంలో మహిళా ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఒకరిని మరొకొరు కొట్టుకునేదాకా వెళ్లింది. ప్రధానోపాధ్యాయురాలిని కాంతి కుమారిగా గుర్తించగా.. మరో టీచర్ పేరు అనితా కుమారి. వీరిద్దరికి ముందుగా తరగది గది లోపల గొడవ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో మరో ఉపాధ్యాయురాలు కూడా చేరింది. చదవండి: రేపు సీఎం కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ.. విషయమిదే.. ఇద్దరు టీచర్లు కలిసి క్లాస్ రూమ్లో విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తరువాత బయటకు వచ్చి చేతిలో చెప్పులు పట్టుకుని ప్రిన్సిపాల్ వెంట పరుగెత్తీ మరి దాడి చేశారు. ముగ్గురూ పక్కనే ఉన్న పోలాల్లో పడిపోయినా.. గొడవ ఆపకుండా కొట్టుకున్నారు. కర్రలు, చెప్పులతో ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ గొడవను ఆపేందుకు పలువురు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీనిని క్లాస్ రూమ్లోని విద్యార్థులు ఫోన్లో రికార్డ్ చేశారు. దీనికి పాఠశాల అధికారి నవేష్ కుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా గొడవకు దారితీసిందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. ఘర్షణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులను వివరణ కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చదవండి: ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం -
Video: ఎయిర్పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు..
రోడ్డు మీద, గల్లీలో, బస్సు, రైళ్లలో కొందరు వ్యక్తులు కొట్టుకోవడం చాలానే చూశాం. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారుతుంటాయి. మరి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారో ఏమో గానీ ఏకంగా విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు గొడవపడ్డారు. ఒకరినొకరు వీర లెవల్లో తన్నుకున్నారు. ఇది ఎక్కడో కాదు.. సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలో జరిగింది. వివరాలు.. చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సోమవారం భారీ పోరాటమే జరిగింది. విమానం దిగి వస్తుండగా మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజ్ క్లెయిమ్ ప్రాంతంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు చేయిచేసుకోవడంతో ఈ గొడవ ప్రారంభమైంది. టెర్మినట్ 3లో వద్ద జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 12 మందికి పైగా పాల్గొన్నారు. చదవండి: రేయ్! మారండ్రా.. హెల్మట్ ధరించి మరీ రైడ్ చేస్తున్న కుక్క దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో కొంతమంది వ్యక్తులు బీభత్సంగా కొట్టుకోవడం, మహిళలు నేలపై పడుకొని ఒకరు జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వీరిని బాక్సింగ్ విభాగంలో పోటీలకు పంపితే గోల్డ్ మెడల్ సాధించడం పక్కా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తొలుత మహిళపై దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్గా గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని వెల్లడించాయి. చదవండి: 14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా.. Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd — Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023 -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య ఘర్షణ..వీడియో వైరల్..
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు. కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు. చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే -
నారా లోకేష్ పాదయాత్ర పొడవునా టీడీపీలో గొడవలే
-
వీళ్ళ క్రియేటివిటీ మాములుగా లేదుగా వైరల్ అవుతున్న వీడియో..
-
మామూలుగా తిట్టుకోవట్లే...
-
కోహ్లి- గంభీర్ గొడవ.. ఎలా మొదలైంది? పూర్తి వీడియో
-
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
వెయిట్రస్తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్తో శివంగిలా విరుచుకుపడి..
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్లతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో రెస్టారెంట్లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది. ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ — CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023 -
పోలీస్టేషన్కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
నడిరోడ్డుపై కొట్టుకున్న రామ్చరణ్ లేడీ ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
సినిమా స్టార్స్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. నటీనటులను ఫాన్స్ తమ దేవుళ్లుగా భావిస్తుంటారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు హడావిడీ చేస్తుంటారు ఇక టాలీవుడ్ విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువకులతోపాటు అమ్మాయిలు కూడా హీరోలంటే పడిచచ్చిపోతారు. గర్ల్ఫ్యాన్ పేరుతో సోషల్ మీడియా పేజ్లు తెరిచి అభిమానాన్ని చాటుకుంటారు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. తాజాగా ఓ ఇద్దరు రామ్ చరణ్ మహిళా అభిమానులు ఘర్షణ పడ్డారు. గొడవ ఎందుకు మొదలైందో తెలియదు కానీ హీరో విషయంలోనే ఇలా కొట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్చరణ్ లేడీ ఫ్యాన్స్ వార్’ అనే క్యాప్షన్తో ట్విటర్లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇందులో యూనిఫాం ధరించిన ఇద్దరు యువతులు నడిరోడ్డుపై అందరిముందే పిచ్చిపిచ్చిగా తనుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్లు పట్టుకొని చెంపదెబ్బలు కొట్టుకున్నారు. చుట్టూ మిగతా విద్యార్థులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా రెచ్చిపోయి గొడవ పడ్డారు. విద్యార్థినిలు కొట్టుకుంటుంటే అక్కడున్న వారంతా నవ్వుతూ, అరుస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. చివరికి అబ్బాయిలు జోక్యం చేసుకొని ఈ గొడవను ఆపేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ యువతులు తెలుగులో మాట్లాడుకోవడం ద్వారా ఏపీలో ఎక్కడో జరిగిందని భావిస్తున్నారు. అంతేగాక అసలు ఇద్దరు యువతులు నిజంగానే రామ్చరణ్ విషయంలో గొడవపడ్డారనేదానిపై స్పష్టత లేదు. Ram charan lady fans fan war pic.twitter.com/Gqc4rZhOjE — KingJdeep (@KingJdeep) March 27, 2023 -
పావురాల కోసమే తన్నుకున్నారు!
అనంతపురం: పావురాల కోసం బుధవారం రాత్రి బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు...కొత్తూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ అదే గ్రామానికి చెందిన శివప్ప, హేమంత్, భూపతి బంధువులు. ఇరు కుటుంబాలలో పావురాలు పెంచుకుంటున్నారు. ఇటీవల పావురాలు తారుమారు కావడంతో రోజూ అడ్డపేర్లు పెట్టుకుని తిట్టుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో ఓ వర్గంలోని బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ, మరో వర్గంలోని భూపతికి గాయాలయ్యాయి. ఇరువురూ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ బీజేపీ నేత పంకజ్ దీక్షిత్ ఓ ప్రభుత్వ ఉద్యోగితో గొడవపడ్డాడు. బారాబంకీలో నిర్వహించిన కృషి మేళాలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అలోక్ సింగ్ బయట నుంచి క్యాబేజీ తెచ్చినందుకు ఆగ్రహించిన పంకజ్ సింగ్.. అతనితో ముష్టియుద్ధానికి దిగాడు. ఉద్యోగిపై దాడి చేసి కిందపడేశాడు. అనంతరం పలుమార్లు కొట్టాడు. చివరకు అక్కడున్నవారు కలుగజేసుకుని ఇద్దరినీ ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పంకజ్ దీక్షిత్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించాడు. వీళ్లు తీరుమార్చుకోకపోతే మళ్లీ ఇలాగే చేస్తానని హెచ్చరించాడు. #बाराबंकी बीजेपी नेता पंकज दीक्षित ने सरकारी कर्मचारी आलोक सिंह को जमकर पीटा, कृषि मेले में हुई इस शर्मनाक घटना का वीडियो सोशल मीडिया पर वायरल pic.twitter.com/uen9SCO5kT — ठाkur Ankit Singh (@ankit_singh08) February 28, 2023 చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్లో శిక్షణ.. -
కుక్కను హడలెత్తించిన కోడి.. ఎగిరి ఎగిరి దాడి..
-
ఆప్, బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని రచ్చ రచ్చ..
లక్నో: పెళ్లి భోజనంలో మాంసాహారం పెట్టలేదనో లేదా చికెన్, మటన్ సరిపోను వడ్డించలేదనో జరిగిన గొడవల గురించి విన్నాం. కానీ ఉత్తర్ప్రదేశ్ భాగ్పత్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మాత్రం పన్నీర్ కోసం రచ్చ రచ్చ చేశారు. పెళ్లి కొడుకు కుటుంబం తమను పన్నీర్ వడ్డించలేదని బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చొక్కాలు చిరిపోయేలా పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो.... यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV — Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023 ఈ ఘటనలో వెయిటర్పై విచక్షణా రహితంగా దాడి జరిగింది. దీంతో అతను రోడ్డుపై అచేతన స్థితిలోపడిపోయాడు. అయినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లి వేడుకలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్మారింది. పన్నీరు కోసం ఇంతలా కొట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. చదవండి: స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు మృతి -
ఫుట్పాత్పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
స్కూల్లో అబ్బాయిలు అప్పుడప్పుడు స్నేహితులతో గొడపడుతుంటారు. మాటా పెరిగి ఒక్కోసారి పోట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. అమ్మాయిల మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అసలు ఎలాంటి గొడవల జోలికి వెళ్లరు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అమ్మాయిలే ఫైటింగ్కు దిగుతున్నారు. ఒకరిపైఒకరు దాడి చేసుకుంటూ సినిమా రేంజ్లో పోట్లాటకు దిగుతున్నారు. కారణమేదైనా ఒక్కోసారి సీరియస్గా ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. స్కూల్ డ్రెస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫుట్పాత్పైనే రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తూ తోసేసుకుని కిందపడ్డారు. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వీళ్లనే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అబ్బాయిలైతే అరుపులు, కేకలు వేస్తూ ఫైటింగ్ను ఎంకరేజ్ చేశారు. చివరకు అక్కుడున్న ఒకరు జోక్యం చేసుకుని పైటింగ్ను ఆపారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke Kalesh (@gharkekalesh) January 29, 2023 ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఈ అమ్మాయిలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించారని, పాప్కార్న్ తింటూ వీరి ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేసినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్.. -
మ్యాచ్ రిఫరీపై పంచ్ల వర్షం.. ఫుట్బాలర్పై 30 ఏళ్ల నిషేధం
క్రీడల్లో గొడవలు జరగడం సహజం. ఒక్కోసారి అది కొట్టుకునేంత స్థాయికి వెళుతుంది. మితిమీరినప్పుడు క్రమశిక్షణా చర్యల కింద ఆట నుంచి నిషేధించడం జరుగుతుంది. తాజాగా ఒక ఫ్రాన్స్ ఫుట్బాలర్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్ సందర్భంగా రిఫరీకి పంచుల వర్షం కురిపించాడన్న కారణంతో అతనిపై 30 ఏళ్ల నిషేధం విధించారు మ్యాచ్ నిర్వాహకులు. 25 ఏళ్ల వయసున్న ఫుట్బాలర్ పేరు ప్రస్తావించడానికి నిర్వాహకులు ఇష్టపడలేదు. అయితే ఆ ఆటగాడు ఫ్రాన్స్లోని ఎంటెంటే స్పోర్టివ్ గాటినైస్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లోరిట్ ఫుట్బాల్ డ్రిస్టిక్ట్ ప్రెసిడెంట్ బెనోయిట్ లెయిన్ పేర్కొన్నారు. కాగా లోకల్ కప్లో భాగంగా జనవరి 8న జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుందన్నారు. మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో రిఫరీపై పిడిగుద్దులు కురిపించడంతో.. అతను రెండురోజుల బెడ్పై నుంచి లేవలేకపోయాడని తెలిపారు. ఘటన జరిగిన రోజే ఆటగాడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించి 30 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. విచారణ తర్వాత పోలీసులకు అప్పజెప్పామన్నాడు. అంతేకాదు ఆటగాడి చర్యతో సదరు టీమ్ను రెండు సీజన్ల పాటు టోర్నీల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసినట్లు బెనోయిట్ వెల్లడించాడు. చదవండి: 'బిర్యానీ నచ్చలేదని రెస్టారెంట్కు వెళ్లడం మానేస్తామా' ఆర్థిక సంక్షోభం.. పాక్ క్రికెటర్కు మంత్రి పదవి -
భర్త ఆలస్యంగా వచ్చాడని..భార్య ఆత్మహత్య!
సాక్షి, బెంగళూరు: పక్కింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఆలస్యంగా వచ్చిన భర్తతో గొడవపడిన భార్య అలిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్లోని బాళ గ్రామం ఒట్టెకాయారుకు చెందిన హరీశ్, దివ్య (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదివారం పక్కింట్లో శుభకార్యం జరిగితే హరీశ్ ఒక్కడే వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆక్రోశం వ్యక్తం చేసిన దివ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దివ్వ సూరత్కల్లోని ఒక మందుల షాపులో పని చేసేది. అన్యోన్యంగా కాపురం సాగుతుండగా, కూతురు ఇలా చేయడంపై అనుమానంతో ఆమె తల్లి గిరిజా పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త హరీశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తునారు. చదవండి: ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి -
Viral Video: పిల్లిని చుట్టుముట్టిన కుక్కలు.. కుక్కలకి ఝలక్ ఇచ్చిన పిల్లి
-
మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అకాల మరణం.. 18 ఏళ్లకే..!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) భవిష్యత్ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్లో పుట్టిన ఈ అప్కమింగ్ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్షిప్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. View this post on Instagram A post shared by Angela Lee Pucci (@angelaleemma) లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్మీడియా సందేశాన్ని పెట్టింది. View this post on Instagram A post shared by ONE Championship (@onechampionship) విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెస్నర్ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ రింగ్లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది. గతేడాది నవంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. 4 girls brutally beating 1 girl with belts and kicks passer-by watching and enjoying #Fights #streetfights #fightingvideos #Girlsfight #India #gemsoffights pic.twitter.com/MVLec2CYai — TheFight1 (@InsanelyIfight3) December 29, 2022 చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి -
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
-
Video: విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
కారణం ఏంటో తెలియదు కానీ విమానంలో కొంతమంది యువకులు తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్లాండ్కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్ నుంచి కోల్కతా వస్తున్న థాయ్ స్మైల్ ఎయిర్వేస్ టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు. విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది. దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కావడంతో తనను తాను రక్షించుకుంటూ వారి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు రికార్డ్ చేయగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 ఇందులో.. ఇద్దరిలో ఒకరు.. కూర్చోని నెమ్మదిగా మాట్లాడండి అని చెబుతుండగా.. ఎదుటి వ్యక్తి ముందు చేయి కిందకు దించు అని అరవడం వినిపిస్తోంది. సెకన్ల వ్యవధిలోనే వీరి మధ్య గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రైలు, బస్సులో సీటు కోసం గొడవ పడటం చూశాం. కానీ విమానంలో ఒకరినొకరు తన్నుకోవడం ఏంట్రా బాబూ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అంతేగాక ఇప్పటివరకు, థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఈ ఘటనపై స్పందించలేదు. చదవండి: Bomb Cyclone: జారిపోతున్న కార్లు.. మంచులా మారుతున్న వేడి నీళ్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
ఒంటిపై కేవలం అండర్వేర్..అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్ ఇంటి ముంగిట ఉన్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్కి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు. విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్ని 'అండర్ వేర్ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Not all heroes wear capes, in fact some just wear a pair of undies. Steve Middleton was up early on Boxing Day when he spotted some thugs trying to steal from his car - the tradie decided to take matters into his own hands. #9News pic.twitter.com/ocg3s37W2f — 9News Gold Coast (@9NewsGoldCoast) December 26, 2022 (చదవండి: ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!) -
షాకింగ్ వీడియో.. మెట్రో రైలులో మహిళపై పిడిగుద్దులు!
హాంకాంగ్: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఓ వ్యక్తి మహిళపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన హాంకాంగ్లోని ఎంటీఆర్ ట్రైన్లో జరిగింది. 13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్లో ఉన్న మహిళపై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో వ్యక్తి వారిని విడిపించేందుకు కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తిరిగి దాడి చేసేందుకు యత్నించింది. రద్దీగా ఉన్న ట్రైన్లో ఒక్కసారిగా గొడవ జరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు హోరాహోరీగా గొడవపడడం వల్ల పలువురు ప్రయాణికులు కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోను ‘టుడే రీవ్యూ67’ అనే ఫేస్బుక్ పేజీలో డిసెంబర్ 18న పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నా..!
విమానంలో అందించే ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎయిర్హోస్టెస్తో గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. అందులోని గుర్ప్రీత్ సింగ్ హాన్స్ అనే మరో ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి డిసెంబర్ 19న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో అనువైన ఆహారం అందించాలి. కానీ అలా జరగటం లేదు. ఇచ్చిన ఆహారం తిని కొందరు సర్దుకోగలరు కానీ అందరు అలా ఉండలేరు. ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూశాను. ’ అని రాసుకొచ్చారు గుర్ప్రీత్ సింగ్ హాన్స్. Unfortunately, I mean it Unfortunately I book a flight with @IndiGo6E from #Istanbulairport to @DelhiAirport people are right staff are right but @IndiGo6E can't. Every international LONG DISTANCE(we can manage from Dubai to India ) flight has a food choices video in front — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 18, 2022 వీడియో ప్రకారం.. ఎయిర్హోస్టెస్తో ఓ ప్రయాణికుడు వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘నీ వల్ల విమానంలో గందరగోళం నెలకొంది. నీ బోర్డింగ్లో ఉన్న ఆహారమే అందిస్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి.’ అని ఎయిర్హోస్టెస్ సూచించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. మరో సిబ్బంది కలుగ జేసుకుని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె సర్వెంట్, ఒక ఉద్యోగిని, నేను మీ సర్వెంట్ని కాదు అని పేర్కొన్నారు ఆ ప్రయాణికుడు. ఎయిర్హోస్టెస్ను అక్కడి నుంచి తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ సంఘటనపై ఎయిర్లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. Even staff checked our boarding pass before giving us food which is not right for long distances #internetflight @IndiGo6E @AAI_Official @DelhiAirport @GovtOfIndia_ one thing you must need to realise is that "we choose you, you can't" pic.twitter.com/2uLIqhG5vw — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 19, 2022 ఇదీ చదవండి: ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం! -
కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల స్టూడెంట్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. జూనియర్లు కాపుకాసి సీనియర్ విద్యార్థిని చితకబాదారు. జూనియర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో సీనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ విషయంలో తెలెత్తిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కొడుకుగా తెలుస్తుంది. పట్టపగలే విద్యార్థులు కర్రలతో దాడి చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా విద్యార్థులు కొట్టుకున్న దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చదవండి: సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా! -
కాలేజీ విద్యార్థుల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు
-
షాకింగ్.. క్లాస్లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సహనం కోల్పోయాడు. తనను హేళన చేసిన కొంతమంది అభిమానులతో బహిరంగ గొడవకు దిగాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవలే ఫామ్ కోల్పోయిన జట్టుకు దూరమైన హసన్ అలీ ఒక లోకల్ మ్యాచ్లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్లోని పక్పత్తన్ జిల్లాలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్ అలీని టీచ్ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడడానికి సిగ్గులేదా.. అంటూ ఆటపట్టించారు. చాలాసేపు ఓపికతో భరించిన హసన్ అలీపై కొంతమంది గడ్డి, పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పోయిన హసన్ అలీ తనను టీచ్ చేసిన వారితో గొడవకు దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా మిగతావారు హసన్ అలీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి హసన్ అలీని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఒక లోకల్ మ్యాచ్లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్ను ఇలానే అవమానిస్తారా అంటూ మ్యాచ్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్ అలీ సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్ అలీని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు. దీంతో అభిమానుల ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచిగా ఉన్నంతవరకు ఏం కాదు కానీ ఆటగాళ్లు రివర్స్ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హసన్ అలీ ఉదంతం హెచ్చరిస్తుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఒకప్పుడు హసన్ అలీ పాక్ తరపున నెంబర్వన్ బౌలర్గా రాణించాడు. ఆ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ నెంబర్వన్గా కొంతకాలం కొనసాగాడు. ఇక పాకిస్తాన్ తరపున హసన్ అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 21 టెస్టుల్లో 77 వికెట్లు, 50 టి20ల్లో 60 వికెట్లు తీశాడు. You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd — zayn (@ZaynMahmood5) December 4, 2022 Hassan Ali's fight with the crowd😱#HassanAli #PakvEng #Cricket pic.twitter.com/G4mji06uwa — Muhammad Noman (@nomanedits) December 3, 2022 చదవండి: FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! ENG Vs PAK: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా -
వామ్మో ఇదేం ఫైటింగ్.. రోడ్డుపై తన్నుకున్న కాలేజీ అమ్మాయిలు
ఇటీవలి కాలంలో కాలేజీ విద్యార్థులు నడిరోడ్లపై తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. చిన్న చిన్న కారణాలు, లవ్ వ్యవహారాల్లో స్టూడెంట్స్ దెబ్బలాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీంతో, నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. నాసిక్లో ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాసుల అనంతరం క్యాంటీన్కు వెళ్లారు. ఈ క్రమంలో క్యాంటీన్లో కూర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో, అక్కడే వాదనకు దిగి వ్యవహారం తిట్లు, తన్నుకునే వరకు వెళ్లింది. ఇంతలో క్యాంటీన్ సిబ్బంది వారిని వారించి అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. नाशिकच्या महाविद्यालयात तरुणींमध्ये तुफान हाणामारी. एकमेकींच्या झिंज्या उपटल्या#Nashik #Girl #Fight #CollegeStudent pic.twitter.com/m6NGKPoDup — India Darpan Live (@IndiaDarpanLive) November 18, 2022 అనంతరం, బయటకు వచ్చిన నలుగురు అమ్మాయిలు మరోసారి వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన విద్యార్థినిలు తాము రోడ్డుపై ఉన్నామనే విషయం మరిచిపోయి దారుణంగా బూతులు తిట్టుకున్నారు. జట్టు పట్టుకుని భౌతిక దాడులు చేసుకున్నారు. తిట్టుకుంటూ ఒకరినొకరు తన్నుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వారిని వారించినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దాడులు చేసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తే ఇలా ఉంటుందా! వీడియో వైరల్
అనుకున్నది జరగకపోతే పిచ్చ కోపం వస్తుంది. మహా అయితే ఆ రోజంతా మన మూడ్ బాగోక ఎవరితోనూ మాట్లాడకుండా డల్ ఉంటాం. కానీ కొందరూ మాత్రం తమకు నచ్చినట్టు జరగకపోతే కోపంతో ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఫ్లైట్ మిస్సయ్యానన్న కోపంతో ఎంత దారుణంగా ప్రవర్తించిందో వింటే షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...మెక్సికోలో ఎమిరేట్స్ అనే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఒక మహిళను అధికారులు తనిఖీ చేసే నిమిత్తం ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె ఫ్లైట్ మిస్సైయ్యింది. అంతే పట్టరాని కోపంతో అక్కడ ఉన్న మహిళా అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసి...అక్కడ ఉన్న కంప్యూటర్లను అన్నింటి విసిరేస్తూ పెద్ద వీరంగం సృష్టించింది. అయితే ఆమె గడువు ముగిసిన పాస్పోర్ట్తో ఎక్కేందుకు యత్నించడంతో ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నామని ఎయిర్ పోర్ట్ అదికారులు తెలిపారు. తాము అడ్డుకున్నమన్న కోపంతో ఆమె తమను దుర్భాషలాడి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు రంగంలోకి ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కింద పడేసి పెద్ద హంగామా సృష్టించిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు) -
పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి
అందంగా జరుపుకోవాల్సిన వివాహ వేడుక విషాదంగా మారింది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా చిన్న రగడ మొదలైంది. అది కాస్త తీవ్రంగా పరిణమంచి నలుగు వ్యక్తులు మృతికి దారితీసింది. వివరాల్లోకెళ్తే...స్పెయిన్లోని మాడ్రిడ్లో ఓ రెస్టారెంట్లో వివాహం జరగబోతోంది. ఇంతలో ఏమైందో ఏమో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ చోటుచోసుకుంది. అది కాస్త మరింత రసాభాసగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుహ్యంగా ఒక కారు పెళ్లికి వచ్చిన అతిథులపైకి దూసుకు వచ్చింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఐతే దాడికి పాల్పడిన కారుని రెస్టారెంట్కి 50 కి. మీ సమీపంలోనే పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గరులో ఒకరు తండ్రి, మిగతా ఇద్దరు అతని పిల్లలుగా గుర్తించారు. దీంతో మరోకరు కూడా ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు గాలించడం ప్రారంభించారు. (చదవండి: 9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా..) -
భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ
-
భీమవరం కాలేజీ హాస్టల్లో దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్ బాక్స్లో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కోర్టులో లేడీ లాయర్ల ఫైటింగ్ .. వీడియో వైరల్..
-
లవ్ ఎఫైర్.. అమ్మాయి కోసం నడిరోడ్డుపై తన్నుకున్న స్టూడెంట్స్
కాలేజ్ డేస్లో లవ్ వ్యవహరం పెద్ద రచ్చే చేసింది. ఒకే అమ్మాయిని ఇద్దరు స్టూడెంట్స్ ప్రేమించడంతో వారి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వారిద్దరూ రెండు గ్రూపులను ఏర్పాటుచేసి అమ్మాయి నాదంటే నాది అని చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. కుడ్డలూరుకు చెందిన ఓ ప్రైవేటు కాలేజీలో వరుణ్, సుధాకర్ అనే ఇద్దరు విద్యార్థులు చదువుతున్నారు. కాగా, అనూహ్యంగా వీరిద్దరూ అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ విషయంలో వారి మధ్య పెద్ద తగాదానే నడిచింది. సినిమా రేంజ్లో ఒకరికి ఒకరు వార్నింగ్ సైతం ఇచ్చుకున్నారు. సినిమాలో హీరో స్టైల్లో తనే నా హీరోయిన్ అంటూ మాటల వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహరంలో వారిద్దరూ రెండు గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బస్సు కోసం బస్స్టాప్లో వేచిచూస్తుండగా.. వారిద్దరూ ప్రేమించిన అమ్మాయి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రూపుల సపోర్టర్లు అక్కడికి చేరుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై చిత్తుగా తన్నుకున్నారు. ఇక, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్..
లక్నో: ఇద్దరు మహిళా లాయర్లు కోర్టు ఆవరణలోనే రెచ్చిపోయారు. తాము న్యాయవాదులమని మర్చిపోయి సిగపట్లు పట్టారు. జట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు చెంపదెబ్బల వర్షం కురిపించుకున్నారు. వారిని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తర్ప్రదేశ్ కాస్గంజ్ కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చివరకు మహిళా ఎస్సై జోక్యం చేసుకుని ఇద్దరు లాయర్లను ఆపింది. ఆ తర్వాత వారు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరు ఎందుకు అంతలా గొడవపడ్డారనే విషయం మాత్రం తెలియరాలేదు. లాయర్లు అయి ఉండి ఇలా ఫైటింగ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు महिला वकीलों में जमकर मारपीट, एक-दूसरे के खींचे बाल, जमकर बरसाए थप्पड़। वीडियो हुआ वायरल... यूपी के कासगंज से सामने आया मामला pic.twitter.com/vhpZvRdiMP — News24 (@news24tvchannel) October 28, 2022 చదవండి: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్.. -
Viral Video: నోటికందిన ఆహారాన్ని వదిలేసి.. కొట్టుకున్న సింహాలు..
సింహాలు అడవికి రారాజు. సాధారణంగా సింహాలు వేటాడితే టార్గెట్ గురి తప్పదు. గంభీరత్వానికి నిదర్శనమైన ఇవి ఎప్పుడూ గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జంతువును ఆహారంగా చేసుకోవాలని డిసైడ్ అయితే వార్ వన్సైడ్ అవ్వాల్సిందే. చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి దున్నలు, జిరాఫీలను సైతం తమ వశం చేసుకుంటాయి. సింహాలు ఎక్కువగా వేటాడే జంతువుల్లో గేదె ఒకటి. దీని సైజు పెద్దగా ఉండటం వల్ల దాదాపు అయిదు రోజుల వరకు మరే ఇతర జంతువును వేటాడాల్సిన పని ఉండదు. తాజాగా ఓ సింహాల గుంపు కష్టపడి పొలంలో ఒంటరిగా మేస్తున్న గేదెపై దాడి చేసి ఆహారంగా తెచ్చుకున్నాయి. మిగతా గేదెల నుంచి దానిని దూరంగా తీసుకొచ్చి తినడం ప్రారంభించాయి. అయితే ఇంతలో ఏమయ్యిందో తెలిదు కానీ ఆడ సింహాల(శివంగి) మధ్య గొడవ ప్రారంభమైంది. నోటికి వరకు వచ్చిన ఆహారాన్ని పక్కకు పెట్టి మరీ ఒక్కొక్కటిగా దాడి చేసుకున్నాయి. శివంగిలు కొట్టుకుంటుంటే.. ఒక్క సింహం మాత్రం గేదెను అలాగే అదిమి పట్టుకుంది. చివరికి అది కూడా గొడవలో జాయిన్ అయ్యింది. ఇంకేముంది ఇదే మంచి చాన్స్ అని భావించిన గేదె మెల్లగా అక్కడి నుంచి లేచి పరుగు అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గేదె అదృష్టం బాగుంది. పాపం సింహాలకు ఈ రోజు ఉపవాసమే. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్తో రచ్చ.. Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/JGiKMVJaQQ — OddIy Terrifying (@OTerrifying) October 19, 2022 -
కింగ్ కోబ్రా, ముంగీస ఫైట్.. వీడియో వైరల్
కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ముంగీసకు కోబ్రా అంటే అసలు భయమే ఉండదు. ఎప్పుడూ దాంతో విరోచితంగా పోరాడుతుంది. ఎక్కువ సందర్భాల్లో కోబ్రాపై పైచేయి సాధిస్తుంది. ఈ రెండు భీకరంగా తలపడిన వీడియోలు అరుదుగా లభిస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది తెగ వైరల్గా మారింది. లక్షల వ్యూస్, వేల లైక్స్తో దూసుకుపోతుంది. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే.. కింగ్ కోబ్రా, ముంగీస నేలపై కాకుండా బురద నీటిలో తలపడ్డాయి. కోబ్రా ఎన్నిసార్లు కాటేసేందుకు ప్రయత్నించినా.. ముంగీస మాత్రం చురుగ్గా తప్పించుకుంది. అంతేకాదు దాని వెంటపడి మరీ కయ్యానికి కాలుదువ్వింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి ఫైట్ తాము ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు. నీటిలో దాచుకోవడం ఎలాగో కోబ్రా నేర్చుకోవాలి, ఇలాంటి పోరాటల్లో ఎప్పుడూ ముంగీసదే విజయం అని మరో జూయర్ కామెంట్ చేశాడు. ఆ వీడియో మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Animalia - Animal (@wildanimalia) చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
మాట్లాడుతూనే చెంప పగలకొట్టింది.. అమ్మాయిల కొట్లాట వైరల్
వైరల్: కాలేజ్ క్యాంటీన్లో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కుడివైపు వున్న అమ్మాయి ఎడమ వైపు వున్న అమ్మాయిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతితో తన చెంప పగలకొట్టింది. దీంతో.. ఎదురుగు వున్న అమ్మాయి కూడా చేతితో బుద్దిచెప్పింది. అంతే.. అక్కడ రణరంగమే మొదలైంది. అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి ‘హూ.. అంటూ చప్పట్లు కొడుతూ ఆస్వాదిందించారు. ఆ అమ్మాయిల గొడవకు కారణం ఏంటో తెలియదు. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్లో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోపై మేనేజ్మెంట్ స్పందన కూడా తెలియాల్సి ఉంది. Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w — r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022 -
దారుణంగా కొట్లాడుకున్న ఫుడ్ డెలివరి మ్యాన్, సెక్యూరిటీ గార్డు... షాక్లో స్థానికులు
నోయిడా: ఫుడ్ డెలివర్ మ్యాన్, సెక్యూరిటీ గార్డుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన నోయిడా గార్డెనియా సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సబీ సింగ్ అనే జోమాటో ఫుడ్ డెలవరీ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ రామ్ వినయ్ల మధ్య ఎంట్రీ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరి ఒకరినోకరు గాయపరుచుకునే వరకు వచ్చింది. మొదటగా ఫుడ్ డెలివరీ మ్యాన్ సబీ సింగ్ సెక్యూరిటీ గార్డుని కొట్టడం, నెట్టడం వంటివి చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గార్డు కర్ర తీసుకుని ఫుడ్ డెలివరీ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కాసేపు కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించిన ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాసేపటికి ఫుడ్ డెలవరీ మ్యాన్ స్ప్రుహ తప్పి నేలపై పడిపోయాడు. దీంతో ఘటనా స్థలం వద్ద ఉన్న స్థానికులు అతనికి సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని ఇరువురి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...) -
నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి.. రెండు వర్గాల మధ్య పోట్లాట
భోపాల్: నవారాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. రెండు వర్గాల వారు బీభత్సంగా కర్రలతో కొట్లాడుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో బోపాల్లోని కంకర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గర్బా ఫంక్షన్లో ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదన ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని అన్నారు. వారంతో కర్రలతో తీవ్రంగా కొట్లాడుకున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐతే దళిత సంఘాల సభ్యులు దుర్గామాత విగ్రహం ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాలవారు తమపై దాడి చేశారని చెబుతున్నారు. మరోవర్గం వారు ఆ అమ్మాయిల చేసిన అశ్లీల నృత్యం కారణంగానే గొడవ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..) -
నడి రోడ్డులో మహిళల ఫైట్.. ఆపేందుకు ఒక్కరూ రాలే!
రద్దీగా ఉన్న రోడ్డులో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. టాప్స్, షార్ట్స్ ధరించిన ఇద్దరు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకపడ్డారు. పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా పట్టించుకోలేదు. జుట్టు పట్టుకుని లాక్కెళుతూ కాళ్లతో తంతూ పట్టువీడని విక్రమార్కుల్లా ప్రవర్తించారు. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారే తప్పా.. ఏ ఒక్కరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇద్దరు మహిళల మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ పోటీని తలపించే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని తీవ్రంగా కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ ఫైట్లో ఎవరు గెలిచారో స్పష్టంగా తెలియదు. వీడియోను ‘విసియస్ వీడియోస్’ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా తెగ వైరల్గా మారింది. ఆవేశపు పిడికిలి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళలు ఫైట్ చేసిన వీడియో సైతం వైరల్గా మారిన విషయం తెలిసిందే. Fists of fury 🤣 pic.twitter.com/4hREYWowF7 — Vicious Videos (@ViciousVideos) September 29, 2022 ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని.. -
కారు ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డా.. తగ్గేదేలే!
లక్నో: నడి రోడ్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో జరిగింది. వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DISTURBING Video: Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad, Uttar Pradesh Brawl Continues Despite Hit; Case Registered#UttarPradesh pic.twitter.com/0gVnclbSkH — The Jamia Times (@thejamiatimes) September 21, 2022 ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్ -
వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ, సందేశాత్మకం, డ్యాన్స్, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్ సమీపంలో కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది -
నడి రోడ్డుపై ఎద్దుతో పరాచకాలు... దెబ్బకు కుమ్మిపడేసింది: వీడియో వైరల్
జంతువులను ఇబ్బంది పెట్టే స్టంట్లు వంటివి చేయకూడదు. జంతు చట్టాలు ప్రకారం నేరం కూడా. ఐతే కొన్ని దేశాల్లో జంతువులతో చేసే ఫైట్లు, స్టంట్లు నేరం కాదు. పైగా అక్కడ చట్టాలు వాటిని ప్రోత్సహిస్తాయి. జంతువులకు జ్ఞానం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామన్నది వాటికి తెలియదు. వాటితో స్టంట్లు చేయాలనుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకే ప్రమాదం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి వ్యవహారించి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే....స్పెయిన్లోని ఒక వ్యక్తి ఎద్దుతో పరాచకాలు ఆడబోయి పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. నడిరోడ్డులో బహిరంగంగా ఆ ఎద్దును పట్టుకుని గేలి చేస్తూ....ఒక చేతితో దాని తలపై చేయి వేసి ఏదో చెప్పబోతుండగా సదరు ఎద్దు ఒక్క ఊదుటున తన కొమ్ములతో కుమ్మేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారందరూ భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. ఈ ఘటన స్పెయిన్లో వీధుల్లో చోటుచేసుకుంది. బుల్ ఫైట్ సందర్భంగా ఎద్దులను సిద్ధం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడ కోడిపందాలు, బుల్పైట్లు చట్టబద్ధమని అక్కడ కోర్టులే చెబుతుండటం విశేషం. ఈమేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
Russia-Ukraine war: బలపడుతున్న శక్తి
‘మహిళ మగవారికన్నా బలహీనమైనది. ఆమె మనసు బహు సున్నితం. రకరకాల భావోద్వేగాలలో ఆమె స్థిరంగా ఉండలేదు...’ ఇలాంటి స్టేట్మెంట్లను ఏళ్లుగా వింటున్నాం. ఇప్పుడు స్త్రీ తనేం తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. శక్తిని పుంజుకుంటోంది. ఆ శక్తి ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో నుంచి పుట్టుకొచ్చింది. సమస్య వచ్చినప్పుడే సమర్థత స్థాయి ఏంటో అర్థమవుతుంది. దీనికి సరైన అర్థంలా ప్రపంచానికి కొత్తగా పరిచయం అవుతోంది ఉక్రెయిన్ మహిళ. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళల సంఖ్య అక్కడ రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేళ్లక్రితం వరకు ఈ రంగంలో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం వెనకంజ వేసింది. కానీ, యుద్ధం తర్వాత మహిళల్లో వచ్చిన మార్పులతో స్త్రీ శక్తి బలపడుతోంది. ఎలా పుట్టిందంటే.. భయం లేకుండా ముందుకు వచ్చే మహిళలకు రెండేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చి, ప్రేరణగా నిలుస్తోంది హన్నా అనే 34 ఏళ్ల మహిళ. దీంతో ఇక మహిళలు చేయలేరు అనుకున్న మరో 450 రకాల ఉద్యోగాలలో నిషేధాన్ని తొలగించి అక్కడి ప్రభుత్వం మహిళలకు ఆహ్వానం పలికింది. భయం నుంచి భరోసా వైపుగా కదులుతున్న మహిళ మార్గం మరింతగా శక్తిమంతం అవుతోంది. ఉత్తర ఉక్రేనియన్లోని చెర్నిహివ్ను చూస్తే చాలు ఐదు నెలల క్రితం జరిగిన యుద్ధం చేసిన నాశనం ఎలా ఉంటుందో చూడచ్చు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, దెబ్బతిన్న పెద్ద పెద్ద బిల్డింగులతో రోడ్లు మూసుకుపోయి ఉంటాయి. ‘ఇక్కడ పేలని మందుపాతరలు ఉన్నాయి’ అని సూచించే బోర్డ్ ఉన్నచోట ‘మందుపాతరల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా గుర్తించాలో, దూరంగా ఎలా ఉండాలో’ హన్నా తన చుట్టూ ఉన్న వారికి వివరిస్తుంటుంది. మందుపాతర నిర్మూలనలో శిక్షణ పొందుతున్న మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తోంది. హన్నా రెండేళ్ల క్రితం మందుపాతరలను తొలగించే ఫౌండేషన్లో చేరింది. కిందటి ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై దాడికి దిగినప్పుడు ఆమె నార్త్ ఉక్రెయిన్వైపుగా వెళ్లింది. యుద్ధ నాశనం తర్వాత మందుపాతరల నుండి నగరాలను, పట్టణాలను సురక్షితంగా మార్చడానికి చెర్నిహివ్ పనిచేస్తోంది. ఏం చేస్తోందంటే... తూర్పు ఉక్రెయిన్లో 2014 జరిగిన అలజడుల కారణంగా మహిళలు అధిక సంఖ్యలో కొత్త పాత్రలను పోషించడంతో రక్షణ, భద్రతా రంగాలలో మార్పులు వేగవంతం అవడం కొంతకాలంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు స్త్రీలు సమాజంలో పోరాట పాత్రల నుండి నిషేధించబడ్డారు. ఇప్పటికీ పురుషులతో సమానమైన హోదా, ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోరాటంలో పాల్గొంటూనే ఉన్నారు. ఎంతోకాలంగా ఉన్న మూస పద్ధతులను ఎదుర్కొనేందుకు యుద్ధంలో ఒక శక్తిగా మారారు అక్కడి మహిళలు. పురుషులు ఇప్పటికే సైన్యంలో మెజారిటీ సంఖ్యలో యోధులుగా ఉండటంతో, మహిళలు తమ కుటుంబాలు చూసుకోవడంతోపాటు వ్యాపారాలను నడుపుతున్నారు. దీంతో అన్ని రంగాల్లో మహిళ స్థానం మరింతగా శక్తిని పుంజుకుంటోందని స్పష్టం అవుతుంది. ఉక్రేయిన్ సామాజిక శాస్త్రవేత్త అన్నా క్విట్ మాట్లాడుతూ –‘సాధారణంగా మహిళలలో అవగాహన పితృస్వామ్యంగా ఉంటుంది. ఈ యేడాది పెరిగిన యుద్ధంతో ఎదుర్కోవడానికి మహిళల భాగస్వామ్యం పెరిగింది’ అని వివరించడం చూస్తుంటే సమస్య మహిళను సమర్థవంతంగా ప్రపంచానికి చూపడానికే అనేది స్పష్టం అవుతోంది. ప్రపంచం చూపు తనవైపు నిజానికి సైన్యం, యుద్ధం మహిళల స్థలం కాదు. ఇది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న మాటే. కానీ, నేడు అన్నిదేశాలలో మహిళలకు సాయుధ దళాలలో పురుషులతో సమానమైన చట్టపరమైన హోదా ఇచ్చింది. ఈ మార్పు మరిన్ని కొత్త మార్పులకు, అవకాశాలకు మార్గం విస్తృతం చేసింది. ఫలితంగా ఉక్రెయిన్లో మహిళలకు నిషేధంలో ఉన్న రంగాలను గుర్తించి, అక్కడి చట్టాలను పక్కన పెట్టి 450 రక్షణ, భద్రతాపరమైన వృత్తులలో దేనిలోనైనా మహిళలు చేరచ్చు అని ఆహ్వానం పలికింది. వీటిలో మందుపాతర తొలగింపుతో పాటు ట్రెక్కింగ్, వెల్డింగ్, అగ్నిమాపక, భద్రత, రక్షణ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఉక్రెయిన్ దేశ సాయుధ దళాలలో 50,000 మందికి పైగా మహిళలు ఉన్నారని, యుద్ధం మొదలైననాటి నుంచి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’ని అక్కడి రక్షణ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ కీలక నిర్ణయాధికారులు, మెజారిటీ యోధులు పెరుగుతున్న మహిళల సంఖ్య స్పçష్టంగా చెప్పడం లేదనేది నిపుణులు చెబుతున్న మాట. నిజానికి మహిళలు తమకు ఏ మాత్రం గుర్తింపులేకున్నా కీలకమైన పనులు చాలా చేస్తారు. రకరకాల సంఘర్షణల్లో ఉన్న సమాజాలను నిలబెట్టే అన్ని విషయాల్లోనూ స్త్రీలు తమ సమర్థతను చూపుతారని ఉక్రెయిన్ మహిళ యుద్ధరంగాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుండటం స్పష్టం చేస్తోంది. -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
కాంగ్రెస్లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి కాంగ్రెస్లో అసమ్మతి భగ్గుమంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ శ్రేణులు రోడ్డెక్కి నిరసనకు దిగాయి. వివరాలు.. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అధికారం చేజారిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా పార్టీని నెట్టుకొస్తున్న నారాయణస్వామిపై నిరసన మేఘాలు కమ్ముకున్నాయి. పార్టీని బలోపేతం చేస్తూ, నిరసన నిప్పును ఆర్పివేసేలా పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలతో సమావేశం కావాలని రాష్ట్ర ఇన్చార్జ్ దినేష్ గుండూరావు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన పుదుచ్చేరికి చేరుకున్నారు. అప్పటికే సమావేశం కోసం గుమికూడిన ఇరువర్గాలు బాహాబాహాకి దిగాయి. ఈ సమయంలో దినేష్ గుండూరావు సమావేశం ప్రాంగణానికి చేరుకోగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. గుండూరావు కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సమావేశం హాలులోకి వెళ్లకుండా గుండూరావుకు పార్టీ శ్రేణులు చుక్కలు చూపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లురువ్వారు. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణస్వామిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇక కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి భౌతిక దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ సీఎం నారాయణ స్వామి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. -
అపార్థమే.. హత్యకు దారితీసింది
సాక్షి, శామీర్పేట్: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అందులో ఒకరి మృతికి దారితీసిన ఘటన శామీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్కు చెందిన శివదులార్ రామ్(55), శామీర్పేట మండలం, బొమ్మరాశిపేట గ్రామ శివారులోని కమలాకర్రెడ్డికి చెందిన క్రషర్ మిషన్లో రెండేళ్లుగా సెక్యూరిటీకి గార్డుగా పని చేస్తున్నాడు. కాగా అక్కడే ఉండే వేయింగ్ మెషిన్ వద్ద విజయ్ మరవి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కంకర లోడ్తో ఓ టిప్పర్ లారీ వేయింగ్ కొరకు రాగా అక్కడ విజయ్ మరవి లేకపోవడంతో సూపర్వైజర్ సుశాంత్ వచ్చి వేయింగ్ చేసి పంపించి, విజయ్ మరవిని మందలించాడు. తను వేయింగ్ మెషిన్ వద్ద లేడనే విషయం సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న శివదులార్ రామ్ సూపర్వైజర్కు చెప్పి ఉంటాడనుకొని అతనితో విజయ్ దు ర్భాషలాడుతూ గొడవపడ్డాడు. దీంతో ఇరువురిని సూపర్వైజర్ సుశాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో చెట్ల పోదల్లో శివదులార్రామ్ తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. వేయింగ్ మెషిన్ వద్ద పనిచేసే విజయ్ మరవి కనబడకపోవడమే కాక ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు శామీర్పేట పోలీసులు తెలిపారు. (చదవండి: సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు) -
పెళ్లి మండపంలోనే వధూవరుల ఫైటింగ్.. వీడియో వైరల్!
పెళ్లి మండపంలో వధూవరులు కొత్తగా ప్రయత్నించి నవ్వులు పూయిస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. అన్ని పెళ్లిళ్లు అలా నవ్వులు పూయించవు. వధూవరుల్లో ఎవరికైనా పెళ్లి ఇష్టంలేకపోతే.. చిన్న చిన్న వాటికే కసురుకుంటారు. ఎవరైనా ఏదైనా అంటే మీదపడిపోతుంటారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే.. ఇక్కడ గొడవకు దిగింది వధూవరులే. వివాహ వేదికపైనే వధూవరులు ఇద్దరు తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. వరుడు కోపంతో తన చేతిని వధువు పైకి తీసుకెళ్లగా.. ఆమె దానిని అడ్డుకుంది. దాంతో ఆగ్రహించిన వధువు.. వరుడుపై సివంగిలా విరుచుకుపడింది. వెనకాల ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా వరుడికి చుక్కలు చూపించింది. అయితే.. వారి గొడవకు అసలు కారణాలేంటని తెలియరాలేదు. తేగుస్తి అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్గా మారింది. కొందరు నెజిటన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫైట్కు గల కారణాలను తెలుసుకనేందుకు ప్రయత్నించారు. పెళ్లి రోజునే గొడవకు దిగారంటే వారి బంధం ఎక్కువ రోజులు నిలవదని ఒకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by British Bengali Banter 🇧🇩🇬🇧 (@thegushti) ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
Viral Video: భారీ పాముతో చిన్నారుల వీరోచిత పోరాటం
చిన్న పాము కనిపిస్తేనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు జంకుతారు. అయితే.. ఈ ముగ్గురు చిన్నారులు భారీ కొండ చిలువతో వీరోచిత పోరాటం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పెంపుడు శునకాన్ని భారీ కొండ చిలువ చుట్టేసింది. దాని నుంచి విడిపించుకునేందుకు ఆ కుక్క తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. శునకం అరుపులు విన్న చిన్నారులు అక్కడికి చేరుకుని పాముతో వీరోచిత పోరాటం చేశారు. పాము వారిపైకి బుసలు కొడుతున్నా వారు భయపడలేదు. ఓ బాలుడు దాని తలను అదిమిపట్టేందుకు ప్రయత్నించాడు. కొద్ది సేపటికి ఓ రాడ్డు సాయంతో దాని తలను అదిమిపట్టి పామును చేతపట్టుకున్నాడు. మిగిలిన ఇద్దరు చిన్నారులు శునకాన్ని తప్పించేందుకు పామును లాగుతూ తీవ్రంగా శ్రమించారు. చివరకు దాని చెర నుంచి విడిపించారు. దీంతో బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పప్పీ. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా 19.7 మిలియన్ల మంది చూశారు. చిన్నారుల ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. These kids 👏👏 pic.twitter.com/fa2yQH71Eo — figensezgin (@_figensezgin) August 5, 2022 ఇదీ చదవండి: Viral Video: వామ్మో! ఏంటీ దెయ్యం అలా ఎలా చేస్తోంది -
మద్యంమత్తులో రెచ్చిపోయిన యువతులు.. పబ్బులో యువకుడిపై దాడి
లక్నో: తాగిన మత్తులో ఇద్దరు యువతులు రెచ్చిపోయారు. పబ్బులో యువకుడిపై దాడి చేసి చితకబాదారు. అతడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. ఇద్దరిలో ఒక యువతి పబ్బు ఎంట్రెన్స్ డెకరేషన్లోని పూలకుండి తీసుకొని మరీ యువకుడిపై విరుచుకుపడింది. పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి అక్కడున్న బౌన్సర్ వచ్చి ముగ్గురినీ విడదీశాడు. అనంతరం ఆ ఇద్దరమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కేసు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. Fierce fight between boys and girls in the unplugged cafe of Vibhutikhand police station area of #Lucknow #Trending #Viralvideo #India pic.twitter.com/vMQrArO3eZ — IndiaObservers (@IndiaObservers) July 23, 2022 ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో గతవారం ఈ ఘటన జరిగింది. నగరంలో గొతకొద్ది వారాలుగా వరుసగా వివాదాస్పద ఘటనలు జరుగుతుండటమూ చర్చనీయాంశమైంది. ఇటీవలే లులు షాపింగ్ మాల్లో అర్ధరాత్రి నిర్వహించిన సేల్ వీడియో వైరల్ కాగా.. ఓ షాపింగ్ మాల్లో మతపరమైన ప్రార్థనలు నిర్వహించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చదవండి: మంత్రిగారి లైఫ్ స్టైల్ మామూలుగా లేదుగా.. కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. అర్పితకు కానుకలు! -
వారణాసి టెంపుల్: శివుడి గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, సిబ్బంది
Kashi Vishwanath temple.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా ఆలయ గర్భగుడిలో దర్శనం విషయంలో వాగ్వాదం చోటుచేసుకొని.. కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గర్భగుడిలో శివుడికి హారతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తలుపులు మూసివేస్తుండగా ఇద్దరు భక్తులు దర్శనం చేసుకుంటామని పట్టుబట్టారు. దీంతో, ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా.. వారితో దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ లేఖలో తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే కాశీలో దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఇలా జరిగింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Devotees, temple staff fight over darshan at Kashi Vishwanath templepic.twitter.com/AgLLBmNPiZ — Priyathosh Agnihamsa (@priyathosh6447) July 24, 2022 ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
అర్ధరాత్రి పార్టీలో ఫైటింగ్.. లవర్స్ హల్చల్
ప్రేమ జంటలు ఒకరినొకరు చితకబాదుకున్నారు. తమ పార్టనర్స్ మోసం చేశారని ఆరోపిస్తూ పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. న్యూయార్క్లోని ఓ క్రూయిజ్ షిప్లోని ఐదో అంతస్తులో అర్ధర్రాతి ఫుల్ జోష్లో పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో దాదాపు 60-70 మంది ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ప్రేమికులు.. తమ పార్టనర్స్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ కేకలు వేశారు. దీంతో, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రేమికులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. బట్టలు చింపుకుంటూ.. జుట్టు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై మరోకరు పడిపోయి పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దాదాపు గంట పాటు ఇలా కొట్టకున్నారు. దీంతో, షిప్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదేం ఫైట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. last nights festivities on my carnival cruise 🥳🛳 pic.twitter.com/uehhfmCfaC — naim (@nyeem0) June 28, 2022 -
ఎస్ఈసీ చెంతకు అన్నాడీఎంకే పంచాయితీ.. పన్నీరు సెల్వం ఫిర్యాదు, పళని స్వామి వ్యూహాలు
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు. పెరిగిన బలం పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్ -
కదిరిలో తారస్థాయికి ‘తమ్ముళ్ల’ పోరు
కదిరిలో అతుకులబొంతగా మారిన టీడీపీలో.. ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. ఓ వైపు కందికుంట.. మరోవైపు అత్తార్ వర్గాలు కత్తులు దూస్తున్నాయి. ఇప్పటి నుంచే అసెంబ్లీ టికెట్ కోసం బాహాబాహీకి సిద్ధమయ్యాయి. తాజాగా చాంద్ అనుచరుడిపై కందికుంట వర్గం దాడి చేయడంతో కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. సాక్షి,కదిరి(అనంతపురం): ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నప్పటికీ కదిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అప్పుడే టికెట్ లొల్లి మొదలైంది. ఈసారి టీడీపీ టికెట్ తమ నేతకేనని కందికుంట వెంకట ప్రసాద్ వర్గం చెబుతుండగా, కాదు కాదు.. కచ్చితంతా మా నాయకుడికే అని అత్తార్ చాంద్బాషా వర్గం వాదిస్తోంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య ఫేస్బుక్ వార్ నడుస్తోంది. ఇది కాస్త శ్రుతిమించి భౌతిక దాడుల వరకూ వెళ్లింది. పోస్టులు పెడితే చంపేస్తాం ‘కదిరి టీడీపీ టికెట్ అత్తార్కే..’ అని బీసీ (పట్ర) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతో కందికుంట వర్గానికి కోపం వచ్చింది. సుమారు 10 మంది శుక్రవారం(10వ తేదీన) కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో కాపురం ఉంటున్న శ్రీనివాసులు నాయుడు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో అతని తల్లితో.. ‘నీ కొడుకు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈసారి కందికుంట అన్నకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాన్ని చంపడం ఖాయం. ఈ మాట నీ కొడుక్కు చెప్పు’ అని బెదిరించి వచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అందరూ చూస్తుండగానే దాడి.. చాంద్ వర్గీయుడైన శ్రీనివాసులు నాయుడు శనివారం పట్టణంలోని అత్తార్ లాడ్జి వద్ద ఉన్నాడని తెలుసుకున్న కందికుంట అనుచరులు పట్టపగలే అతనిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే దాడి చేసి అంతమొందించేందుకు యత్నించారు. తర్వాత బలవంతంగా ఆటోలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లి మరోసారి అతనిపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీనివాసులునాయుడు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్ తెలిపారు. ఆయన గెలిస్తే బతకనిస్తారా..? ‘కందికుంట వెంకట ప్రసాద్ ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అనుచరులు ఇంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారే.. ఇక ఆయన గెలిస్తే సామాన్యులను బతకనిస్తారా?’’ అని ‘పట్ర’ సామాజిక వర్గానికి చెందిన కొందరు మీడియా ముందు వాపోయారు. ‘ఈసారి టీడీపీ టికెట్ చాంద్కే’ అని పోస్టు పెట్టినంత మాత్రాన చంపడానికి ప్రయత్నిస్తారా..? అని వారు మండిపడ్డారు. ఒకవేళ కందికుంటకే టికెట్ ఇస్తే ఆయన ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని వారు తేల్చిచెబుతున్నారు. కందికుంట బాటలోనే అనుచరులు.. మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలింగ్బూత్లోకి దూసుకెళ్తున్న తనను అడ్డుకున్న సీఐ మధుతో కందికుంట గొడవ పడ్డారు. ఇంకోసారి టౌన్ప్లానింగ్ అధికారి రహిమాన్పై దాడికి దిగారు. మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఐ మున్వర్పై దాడి చేశారు. తాను చెప్పినట్లు వినడం లేదన్న కారణంతో మహిళ అని కూడా చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రమీళను రాయలేని భాషలో దూషించారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడేళ్లలోనే కోకొల్లలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న చందంగా కందికుంట అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులు, పాత్రికేయులు, అత్తార్ చాంద్బాషా వర్గీయులపై భౌతిక దాడులకు దిగారు. వ్యక్తిగతంగా దూషిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారిపై పలు కేసులు నమోదు చేసినప్పటికీ.. ప్రవర్తనలో మార్పు రాలేదు. పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కఠినంగా శిక్షించాలి కదిరి టౌన్: ఫేస్బుక్లో పోస్టు పెట్టినంత మాత్రానికే శ్రీనివాసులునాయుడుపై దాడికి పాల్పడడం అమానుషమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని అత్తార్ రెసిడెన్షియల్లో ఆ పార్టీ నాయకులు సోమ్లా నాయక్, అబ్దుల్ ఖాదర్, బయప్ప తదితరులు శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇంకోసారి చాంద్బాషా వర్గంపైకి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కానీ, హత్య చేయాలను కోవడం దారుణమన్నారు. దాడి చేసిన కందికుంట వర్గీయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమల్, శ్రీకాంత్ చౌదరి, చంద్రశేఖర్, షామీర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
మటన్ ముక్కలు.. డీజే పాటలు!.. రెండు పెళ్లిళ్లు.. రెండు వివాదాలు
సాక్షి, భువనగిరి క్రైం: ఒకచోట పెళ్లి విందులో మటన్ ముక్కల విషయమై గొడవ.., మరొకచోట వివాహానంతరం బారాత్ సమయంలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కడీలబాయి తండాకు చెందిన యువతితో చండూరు మండలం సర్వయితండాకు చెందిన యువకుడి వివాహం గురువారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. కాగా పెళ్లి తర్వాత ఇచ్చిన విందులో మాంసం కూర వడ్డించే క్రమంలో వివాదం మొద లైంది. అదికాస్తా ముదరడంతో అమ్మాయి, అబ్బా యి తరఫు వారు ఘర్షణకు దిగి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండువర్గాల బంధువులు ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్స్టేషన్ వద్ద కూడా గొడ వపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిలో ఉన్న ఓ సర్పంచ్పై ఎస్ఐ వెంకటేశ్ అనుచితంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏసీపీ ఉమామహేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్కు చెందిన ఓ అబ్బా యి వివాహం భువనగిరికి చెందిన అమ్మాయితో పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. పెళ్లి అనంతరం బారాత్లో డీజే పాటలతో డ్యాన్స్ చేస్తున్న క్రమంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల బంధువులు తమకు నచ్చిన పాటే పెట్టాలని ఒకరినొకరు తోసుకున్నారు. కాసే పటి తర్వాత అబ్బాయి తరఫు వారు బస్సులోకి ఎక్కేందుకు వెళ్లగా అక్కడ వేచి ఉన్న అమ్మాయి తరఫు వారు ఇటుకలతో దాడి చేశారు. దీంతో కూరడి ఈశ్వర్, దొంతరబోయిన స్వామిశేఖర్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కర్రలతో దాడి చేయడంతో అబ్బాయి తరఫు వారి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. చదవండి: Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్పై వెళ్తుండగా -
మొసలి నెత్తిన పిడిగుద్దులు, కళ్లలో పొడిచి..
కుర్రాడే కదా.. అనుకుని నీళ్లలోకి లాగేసిన ఆ మొసలికి చుక్కలు చూపించాడు. పది నిమిషాలపాటు వీరోచితంగా పోరాడి మొసలి నోట్లోంచి సజీవంగా బయటపడ్డాడు. ఒడిషా కేంద్రపడా జిల్లా నేషనల్ పార్క్ పరిధిలో భితర్కనికా నది ఉంది. అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా ఆ నది ఒడ్డుకు ఈతకు వెళ్లారు. అందులో పద్నాలుగేళ్ల ఓంప్రకాశ్ సాహోను.. ఉన్నట్లుండి ఆరడుగుల పొడవు ఉన్న ఓ మొసలి నీళ్లలోకి లాక్కెల్లింది. నడుము లోతు నీటిలోకి మునిగిపోయిన కుర్రాడు.. ప్రాణ భయంతో కేకలు వేశాడు. వెంటనే మిగతా పిల్లలు ఒడ్డుకు చేరి సాయం కోసం స్థానికులను పిలిచారు. అయితే అప్పటికే మొసలి నోట్లో సాహో చిక్కుకుపోయాడు. ఈలోపు ఒడ్డున్న ఉన్న కొందరు మొసలిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా శక్తిని కూడదెచ్చుకుని మొసలి కళ్లలో తన వేళ్లతో పొడిచి.. దాని తలపై పిడిగుద్దులు గుద్దాడు సాహో. ఆ దెబ్బకి విలవిలలాడుతూ.. అతన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది మొసలి. ఒడ్డుకు ఎలాగోలా చేరిన కుర్రాడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. సాహసంతో మొసలితో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ కుర్రాడిని అంతా మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే నెల వ్యవధిలో భితర్కనికా నదిలో ఒడిషాలో మొసళ్ల బారిన పడి ముగ్గరు చనిపోవడం విశేషం. నదులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అవి నెమ్మదిగా నదిని ఆనుకుని ఉన్న ఊళ్లలోకి ప్రవేశించి.. దాడులు చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. -
‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. అనుకోకుండా జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకుని కోపం తీర్చుకుంటున్నారు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా.. అంటూ సూసైడ్ నోట్రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... అమలాపురానికి చెందిన సంధ్య(19) వివాహం ఏడాది క్రితం మేనమామ వరసయ్యే మీర్సాహెబ్తో జరిగింది. మీర్సాహెబ్ కార్పెంటర్గా పనిచేస్తూ భార్యతో కలిసి కార్మికనగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్నిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సంధ్య తన తల్లితో కలిసి ఆటోలో మూసాపేట నుంచి ఇంటికి వచ్చింది. అయితే ఆ ఆటోలో ఎందుకు వచ్చావంటూ ఆమెపై భర్త కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అడ్డు వచ్చిన అత్తపై మీరాసాహెబ్ చేయి చేసుకోవడంతో పాటు దుర్భాషలాడాడు. రాత్రంతా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఏ తప్పూ చేయలేదంటూ సంధ్య వాదనకు దిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసిన సంధ్య గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బెడ్ కోసం పిల్ల ఏనుగు చేసిన హంగమా! వీడియో వైరల్
Elephant immediately tries to get the "sleeping" man off: జంతువులను ప్రేమగా చూసుకుంటూ ఉంటే అవి కూడా మన స్నేహితుల మాదిరిగా అయిపోతాయి. కొన్ని రోజులకు అవి జంతువులు అనే ఫీలింగ్ కూడా రాదు. మనం ఎలా అలవాటు చేస్తే అవి కూడా వాటికి తగ్గట్టుగా తమను మార్చుకుంటాయి. మన స్నేహితుల మాదిరి మనతో సరదాగా పోట్లాడతాయి కూడా. ఈ ఏనుకు కూడా అలానే తన సంరక్షకుడితో పొట్లాడుతోంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక బేబి ఏనుగు బెడ్ పై సంరక్షకుడు సరదాగా కాసేపు పడుకుంటాడు. అక్కడ తన తల్లితో ఆహారం తింటున్న పిల్ల ఏనుగు ఈ ఘటనను చూసి వెంటనే వచ్చేస్తుంది. పైగా అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ని కూడా దాటి మరీ వచ్చి తన సంరక్షకుడితో దెబ్బలాడుతోంది. అతను లేచి వెళ్లిపోయేంతవరకు వదలదు. చివరికి ఇద్దరు కలసి బెడ్ మీద పడుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారతీయ అటవీ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. Hey! That's my bed..get up..😠 pic.twitter.com/WX4IaROsvp — Dr.Samrat Gowda IFS (@IfsSamrat) May 10, 2022 (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
కన్నకూతురిని చిరుత ఈడ్చుకెళ్తుండగా తల్లి సమయస్ఫూర్తి..
చంద్రాపూర్: చిరుత పులి (Leopard) ఎదురుపడితే.. పైప్రాణాలు పైనే పోవడం ఖాయం. అలాంటిది ఇక్కడ ఓ అమ్మ సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ధైర్యం తెచ్చుకుని చిరుతతో పోరాడింది. బిడ్డ కోసం వంట చేస్తుండగా.. గట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించింది ఓ చిరుత. అన్నం తింటున్న కూతుర్ని ఈడ్చుకెళ్తుంటాన్ని చూసి షాకైన ఆ తల్లి.. ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసింది. జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితోపాటు మహారాష్ట్ర చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో కూతురు ఆకలి అనడంతో ఆ చిన్నారికి జ్యోతి అన్నం పెట్టి తన పనిలో నిమగ్నం అయింది. మూడేళ్ల చిన్నారి ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంట్లోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. కూతురి అరుపులు విన్న జ్యోతి.. చిన్నారి వద్దకు పరుగెత్తుకెళ్లింది. తన కూతురిని చిరుత ఈడ్చుకెళ్లడం చూసి షాకైంది. వెంటనే సమయస్ఫూర్తితో ఓ కర్ర తీసుకుని చిరుతను వెంబడించింది. ప్రాణాలకు తెగించి మరీ దానితో పోరాటం చేసింది. చివరకు కూతురి ప్రాణాలను రక్షించుకుంది. ఆ కర్ర దెబ్బలకు బిడ్డను వదిలేసిన చిరుత.. జ్యోతిని కూడా ఏం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ కూతురుని స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది జ్యోతి. ప్రస్తుతం ఆ బిడ్డ క్షేమంగానే ఉంది. చిరుతతో పోరాడిన ఊరంతా జ్యోతిని మెచ్చుకుంటున్నారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
వామ్మో ఇదేం ఫైటింగ్.. బస్టాండ్లో తన్నుకున్న విద్యార్థినులు
సాక్షి, చెన్నై: బస్టాండ్లో విద్యార్థినులు తన్నుకున్నారు. మగరాయుళ్లకు ఏమాత్రం తీసి పోమన్నట్టుగా సినీ స్టంట్లు చేశారు. విద్యార్థులు వ్యవహరిస్తున్న తీరుతో కౌన్సెలింగ్కు తగ్గ చర్యలపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తీరు వివాదాలకు, చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తిరునల్వేలిలో విద్యార్థుల గొడవలో ఓ విద్యార్ధి మరణాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, కడలూరులో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థుల పై కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్గా మారింది. స్టంట్లతో మదురై పెరియార్ టౌన్ బస్టాండ్లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం. ఈ దృశ్యాలన్నింటినీ అక్కడే ఉన్న విద్యార్థులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అక్కడి ప్రయాణికులు వారిస్తున్నా, పట్టించుకోకుండా విద్యార్థినులు సాగించిన ఫైట్ దిగ్భ్రాంతి కలిగించింది. అర్ధ గంట తర్వాత రంగంలోకి పోలీసులు దిగడంతో విద్యార్థినులు పత్తా లేకుండా పోయారు. అయితే, విద్యార్థులు చిత్రీకరించిన వీడియో రాత్రి సమయంలో వైరల్గా మారింది. విద్యార్థినుల ఫైట్ను ప్రోత్సహించే విధంగా మరి కొందరు విద్యార్థులు ఈల గోల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. అక్కడ తన్నుకున్న విద్యారి్ధనులు అందరూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి కౌన్సెలింగ్కు ఇవ్వడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. என்ன நடக்குது தமிழ்நாட்டுல?? பள்ளிக்கூட மாணவிகள் மதுரை பேருந்து நிலையத்தில்,,,,! நடந்த அடிதடி! ரவுடிசம் பெருகும் சூழல்!!! pic.twitter.com/TQvSfZSiyk — மணவை S.செல்வராஜ் AHMA, BA,,, (@Selva_AIADMK) May 1, 202 ఇది కూడా చదవండి: చిన్నారి కన్నీళ్లు తుడిచేవారెవరు? -
Hyderabad: గురుకుల కాలేజీలో దారుణం
గచ్చిబౌలి/ హైదరాబాద్: గాఢనిద్రలో ఉన్న ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో ఈనెల 25న సాయంత్రం అల్పాహారం వడ్డించే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్ (16) లైన్లో ఉన్నాడు. రెండో సంవత్సరం విద్యార్థి సేమియా వడ్డిస్తుండగా సాత్విక్ చేతిపై పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వడ్డించిన విద్యార్థి.. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, అతడు సాత్విక్పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత.. రాత్రి హాస్టల్లో నిద్రపోయిన సాత్విక్ 1.30 సమయంలో గొంతు వద్ద నొప్పిగా అనిపించి, నిద్రలేవగా గొంతు భాగంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు చెప్పాడు. గొంతు వద్ద రక్తస్రావం అవుతుండటంతో వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం లేదని, విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనపై చేయిచేసుకున్న విద్యార్థే దాడిచేసి ఉంటాడని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్ ఫిర్యాదు చేశాడు. కాగా, బ్లేడ్తో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు తెలిసింది. తమ కొడుకును కేసులో ఇరికిస్తున్నారని అనుమానితుని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యాక్షేత్రంలో కలకలం.. గ్రామీణ పేద విద్యార్థులకు ఉత్తమవిద్య అందిస్తూ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అగ్రభాగంలో ఉంది. ఇదే కళాశాలలో ఫిబ్రవరి 19న ఇంటర్ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా సాత్విక్పై దాడి జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత భార్యను.. -
పెళ్లి వేడుకలో వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు.. వీడియో వైరల్
లక్నో: ప్రతీరోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ● A #video has surfaced in which a bride can be seen slapping the groom in #Hamirpur ● As per reports, the groom was in a drunken state that's why the bride took this step pic.twitter.com/C5Cg5zjQSj — Taaza TV (@taazatv) April 18, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట్విట్టర్ యూజర్ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇది చదవండి: ఏపీలో టూరిస్ట్ స్పాట్గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్ కాలంలో ఎంతో ఫేమస్ -
డిప్యూటీ స్పీకర్పై దాడి.. జుట్టు పట్టుకుని లాగుతూ..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై అవిశ్వాస తీర్మాణం సందర్భంగా ఆ దేశ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం పాక్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా సభ జరుగుతున్న క్రమంలో.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు బీభత్సం సృష్టించారు. గట్టిగా అరుస్తూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై వారు దాడి దిగారు. ఆయనపైకి పువ్వులు విసురుతూ, జుట్టు పట్టుకుని లాగుతూ, చెంపపై కొడుతూ దాడి చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని నిలువరించలేకపోయారు. ఈ సందర్భంలో పీటీఐ, పీఎంఎల్క్యూ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ సెక్యూరిటీ గార్డుల రక్షణలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Pti and pmlQ members resorting to violence eventually in Punjab assembly. Assault on Deputy speaker Dost Mazari makes it another sad day for democracy in this country and a blatant violation of LHC order. God knows what else is left for us to see, disturbing visuals. pic.twitter.com/RkblxWmd4g — Absa Komal (@AbsaKomal) April 16, 2022 -
పరువు తీసుకున్న పాకిస్తాన్ నేతలు.. ట్రెండింగ్లో వీడియో
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం మాజీ ప్రధాని ఇమ్రాన్.. అటు పాకిస్తాన్ నేతలపై, ఇటు భారత్పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. పాక్లో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, నేతలు ఓ స్టార్ హోటల్లో రచ్చరచ్చ చేశారు. ఇఫ్తార్ విందులో ఇరు వర్గాల మద్దతుదారులు, నేతలు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు డ్రింక్స్ , ఫుడ్ విసురుకున్నారు. బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఓ బాడీ బిల్డర్.. వృద్ధుడిపై దాడికి దిగి భారీ పంచ్లు విసిరాడు. దీంతో కిందపడిపోయిన అతడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. افطاری کرتے ہوئے آوازیں کسنے اور بدتمیزی کرنے پر مصطفی نواز کھوکھر اور نور عالم غصے میں آگئے،، یہ ہم لوگوں کو کیا سکھا رہے ہیں؟؟ pic.twitter.com/W9SrPbYG6A — Waseem Abbasi (@Wabbasi007) April 12, 2022 మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాను మరింత ప్రమాదకరంగా మారుతానని గురువారం హెచ్చరించారు. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారి కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయి వారం కూడా గడవకముందే ఇమ్రాన్ ఖాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం అర్ధరాత్రి దాకా న్యాయస్థానం తలుపులు తెరవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. నేను న్యాయవ్యవస్థను అడుగుతున్నాని.. మీరు అర్ధరాత్రి వరకు కోర్టును ఎందుకు తెరిచి ఉంచారని ప్రశ్నించారు. Welcome to purana Pakistan#امپورٹڈ_حکومت_نامنظور pic.twitter.com/7XgB0dYUm9 — Chaudhry Ataur Rehman (@AtaurRehmanCh81) April 12, 2022 ఇది చదవండి: నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో వైరల్ -
రణరంగంగా జేఎన్యూ వర్సిటీ.. విద్యార్థులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్యూ వర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీరామనవమి పూజ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్యూఎస్యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్లో నాన్ వెజ్ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్లో ఏదైనా తినవచ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు. ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్యూఎస్యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. -
వైట్నర్ మత్తులో రోడ్డుపై కొట్టుకున్న యువకులు
-
కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. ఈ పందుల పోటీలు ఏంట్రా?!
సాక్షి, మహబూబ్నగర్: మనకు కోడి పందేలు, ఎడ్లబండ్ల పోటీల గురించి తెలుసు. కానీ.. పందుల పోటీల గురించి ఎప్పుడైనా విన్నారా? చూశారా? అయితే ఇదిగో చూడండి మరి. నారాయణపేట జిల్లా మక్తల్ పరిధిలోని కాట్రపల్లి రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం పందుల పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, కర్ణాటకలోని రాయచూర్ తదితర ప్రాంతాల నుంచి పలువురు వరాహాలతో వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. రెండేసి వరాహాల మధ్య పోటీ నిర్వహించి గెలుపొందిన వరాహం యజమానికి నిర్వాహకులు రూ.లక్ష అందజేసినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఒక్కో పంది విలువ రూ.15 వేలనుంచి రూ.45 వేల ఉంటుం దని అంచనా. ఈ పోటీలను చూసేందుకు మక్తల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కోడి పందేలపై ఆంక్షలు ఉండడంతో రెండు, మూడేళ్లుగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గద్వాల జిల్లా అయిజలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 1960 నుంచి ఏటా పందుల పోటీలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. చదవండి: హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం -
ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి
MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. (చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత) మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది. జరిగిన సంఘటనతో కిరణ్ బైగా ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. (చదవండి: బాయ్ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే) చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు కిరణ్బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj) Not like today's gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ — Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021 చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ -
KCR: రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు
ఇందిరాగాంధీ మొదలు మోదీ ప్రభుత్వం వరకు ఒకటే తీరు. ఇప్పటివరకు కేంద్రంలో పాలన సాగించిన పార్టీలన్నీ ఒకే తరహాలో పథకాలను అమలు చేశాయి. కాకుంటే పేర్లు మారుస్తారు. వైఖరి మారదు. ఈ ధోరణి విడనాడాలి. రాష్ట్రాలు సొంతంగా పనిచేసుకునే విధంగా మార్పు రావాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడంలో కేంద్రంలో పాలన సాగించిన బీజేపీ, కాంగ్రెస్లు దొందూ దొందేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను కాలరాస్తూ, రాష్ట్రాల్లోని పాలనను కేంద్రం నియంత్రణలోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశా రు. ఇటీవల పొరుగున ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తనతో ఫోనులో మాట్లాడి కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. శాసనసభలో గురువారం పల్లెప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. ఒక్కొక్కటిగా హక్కులను దెబ్బతీస్తోంది. ‘ఉపాధి హామీ డబ్బును లబ్ధిదారు ఖాతాలోకి వేయడమొక్కటే కాదు.. పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తానంటోంది. ఈ నిర్ణయాన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా భగ్గుమంటున్నా యి. యూపీ ఆర్థిక మంత్రి ఏకంగా గొడవకు దిగారు. ఇలా ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం దెబ్బతిస్తోంది. జీఎస్టీతో రాష్ట్రాలకు భారీగా నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి చాలా రాష్ట్రాలతో నేరుగా సంబంధాలుండవు. విద్యాసంస్థలు, వైద్యశాఖల నిర్వహణ తదితర అంశాల్లో కేంద్రానికి నేరుగా సంబంధం ఉండదు. కేంద్రం లోని విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన కార్యాలయాలు రాష్ట్రాల్లో ఉండవు. ఇదివరకు నేను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంతో పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది..’అని కేసీఆర్ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రతినెలా రూ.339.5 కోట్లు ‘స్థానిక సంస్థలను గాడిలో పెట్టిన ప్రభుత్వం మాదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉండేది. వాటిల్లో పనిచేసే కార్మికులకు నాలుగైదు నెలలకోసారి వేతనాలు వచ్చేవి. చాలాచోట్ల కారోబార్ దయతోనే జీతాలు అందుకునేవారు. ఇక పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిన మా ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ప్రతి స్థానిక సంస్థకు ప్రణాళికను తయారు చేయించాం. వాటి నిర్వహణకు నెలకు ఠంచనుగా రూ.339.5 కోట్లు విడుదల చేస్తున్నాం. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ నిధులు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. దేశంలో ఇలా ఠంచనుగా నిధులిస్తున్న ప్రభుత్వం మరొకటి లేదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి పాలనను గాడిలో పెట్టాం. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.12,173 కోట్లు ఖర్చు చేస్తే, మా ప్రభుత్వం ఏడేళ్లలో రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది. బిందెలతో ధర్నాలు ఇప్పుడు లేవు ఇదివరకు గ్రామాల్లో మంచి నీళ్లు లేక బిందెలతో ధర్నాలు చేసిన సంఘటనలు అనేకం ఉండేవి. ఇప్పుడు మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా అంతటా పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. ప్రతి పల్లెలో హరితవనాలు ఏర్పాటు చేశాం. వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు.. ఇలా రకరకాలుగా పచ్చదనాన్ని పెంచుతున్నాం. ప్రతి మండలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. పైసా ఇవ్వని కేంద్రం ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు గాను.. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. మిషన్ భగీరథ, ఉపాధి హామీ పథకం అమలు తదితరాలపై నీతి అయోగ్ ప్రశంసలు కురిపించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. అభినందనలు తెలిపింది. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పైగా కేంద్రం ఇవ్వాల్సిన వాటాల్లో 25 శాతాన్ని తగ్గించడం దారుణం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికీ ఇవ్వనంతగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నాం. ఇటీవల 30 శాతం పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి అందిస్తున్నాం. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకూ గౌరవ వేతనాన్ని ఉత్తమంగా ఇస్తున్నాం, ఇక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు కూడా రెట్టింపు చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణపై సీబీసీఐడీ విచారణ ‘వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలపై సీబీసీఐడీతో విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఉపేక్షించేది లేదు. సభ్యులు అక్బరుద్దీన్ కోరినట్లుగా సీబీసీఐడీతో విచారణ చేయించేందుకు మేము సిద్ధమే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తాం. వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ వైద్య, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించాం. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో టిమ్స్ ఏర్పాటు చేశాం. మరో మూడుచోట్ల కూడా వీటిని నిర్మించనున్నాం. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించి అక్కడ మరో ఆస్పత్రిని నిర్మిస్తాం. అల్వాల్ సమీపంలో, మంచిరేవులలో మరో రెండు ఆస్పత్రులు నిర్మిస్తాం. నగరానికి నాలుగు దిక్కులా ఈ ఆస్పత్రుల్ని అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తాం..’అని సీఎం చెప్పారు. సలహా బాగుందన్నారు కానీ.. ‘హైదరాబాద్ చారిత్రక నగరం. ఈ నగరాన్ని ఎవరో ఒక్కరు నిర్మించడం సాధ్యం కాదు. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ వస్తోంది. దేశంలో ఇలాంటి చార్రితక నగరాలు ఐదు ఉన్నాయి. కొల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలను కూడా మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీతో చాలాసార్లు చెప్పా. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అడగడంతో.. ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించా. ఈ సలహా బాగుందని కితాబిచ్చారు. కానీ ఇప్పటికీ పైసా ఇవ్వలేదు. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెలరోజుల్లో హైదరాబాద్ స్థితిని చూశా. సీఎం ఇంటి ముందు చాలాచోట్ల నీళ్లు నిలవడం చూసి ఇదేందని జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే వారంలో కొత్త ప్రణాళికతో వచ్చారు. రూ.15 వేల కోట్లు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు నగరాన్ని ఇంత దారుణంగా చేశాయని అప్పుడు తెలిసింది. కానీ ఈ నగరాన్ని మరింత బాగు చేసుకుందాం. విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తానని చెప్పా. ప్రజల్లో పాజిటివ్ ఆలోచన పెంచే విధంగా చెప్పాను. కరీంనగర్ను డల్లాస్ చేస్తానని అనలేదు. అక్కడ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తే లండన్ నగరంలా మారుతుందని చెప్పా. రూ.330 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది..’అని కేసీఆర్ తెలిపారు. గుండెమీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని సభ్యులు మాట్లాడాలి. సభ్యులు చేసే చర్చ, మాట్లాడే తీరు సభ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని పెంచేలా ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చేసిన పనులు, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పోల్చి చూడండి. మంచి చేస్తే ప్రశంసించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విమర్శలు చేయాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై గుండె మీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి..’అని సీఎం హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకించి ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తేవాలని, వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. చదవండి: ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక -
కొమురంభీం జిల్లా దిందా లో పోరుబాట పట్టీన గిరిజనులు
-
ముళ్లపందితో పోరులో పులి మృతి
మైసూరు: ముళ్లపంది, పులి మధ్య సాగిన పోరు లో చివరకు పులి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా బండీపుర పులుల సంరక్షణ ప్రాంతంలో జరిగింది. మంగళవారం అటవీశాఖ సిబ్బందికి 6 సంవత్సరాల వయసున్న మగ పులి కళేబరం కనిపించింది. ఘటనా స్థలానికి పశువైద్యులు వచ్చి పరిశీలించారు. శరీర భాగాల్లోకి ముళ్లు చొచ్చుకుపోయి ఉండటాన్ని గమనించారు. ముళ్లపంది–పులి మధ్య జరిగిన పోరాటంలో పులి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పులి కళేబరాన్ని అక్కడే ఖననం చేశారు. -
నెల్లూరు: మహిళతో డాక్టర్ వివాహేతర సంబంధం.. వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రచ్చకెక్కింది.. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఈ ఎఫైర్ కొనసాగింది. అయితే ఇటీవల మహిళను డాక్టర్ బాలకోటేశ్వరరావు దూరం పెడుతున్నాడు. దీంతో సదరు మహిళ.. తన ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. డాక్టర్, మహిళ మధ్య మాటామాటా పెరిగి ఇరువురు పరస్పర దాడులకు దిగారు. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! చేపలు, రొయ్యలు, పీతలు.. ఇక మన దరికే ‘మీనం’! -
ఒక్కడి కోసం ఇద్దరు యువతుల ఫైట్.. జుట్టు పట్టుకొని!
ప్రేమ.. రెండక్షరాల ఈ పదం ఎంతో మంది జీవితాలను ముడిపెడుతుంది. అదే సమయంలో ఎంతోమంది జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రేమించిన వారు దక్కితే ఆనందం.. మనల్ని కాదని వెళ్లిపోతే కొండంత దుఃఖం.. వీరిలో కొంతమంది మాత్రమే మనసిచ్చిన వారిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించి పోరాడుతారు. అలకలు, గొడవలు, దెబ్బలు ఇలా ఎన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అది ప్రేమకున్న గొప్పతనం. ఇలా ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పుడిదంతా ఎందుకుంటే ప్రేమకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది. ఇష్టపడిన ఒకరి కోసం ఓ ఇద్దరు బీభత్సం సృష్టించారు. సాధారణంగా అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవలు పడడం ఇప్పటి వరకు చూసే ఉన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఒక యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డెక్కారు. నడిరోడ్డు మీద జుట్టూ.. జుట్టూ పట్టుకొని కొట్టుకున్నారు. సిగపట్లుతో కుస్తీ పట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని సరాయకేలాలో చోటుచేసుకోగా కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో తిరగడాన్ని అమ్మాయి సహించలేకపోయింది. వారు ఎదురుగా కనిపించడంతో కోపం ఎక్కువై.. తోక తొక్కిన తాచుపాములా విరుచుకుపడింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతి జుట్టు పట్టుకొని, పిడిగుద్దులతో దాడి చేసింది. అయితే నాలుగు దెబ్బలు పడగానే అవతలి అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గలేదు. యువతిపై ఎదురు దాడికి దిగింది. ఇద్దరు అమ్మాయిలు కిందపడి పొర్లుతూ కొట్టుకున్నారు. ఇది చూసిన వారికి ఓ సినిమా చూసిన పనైంది. చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో యువతులతో పాటు యువకుడు సైతం అక్కడ్నుంచి జంప్ అయ్యారు. -
ఒక యువకుడి కోసం ఇద్దరు యువతుల సిగపట్లు
-
ఇదేందయ్యా ఇది! ఇలా కూడా కొట్లాడొచ్చా...
-
ఇదేం గొడవరా బాబు.. గుండుపై మందు బాటిల్ బద్దల్!
లండన్ : కుక్కల విషయంలో చోటుచేసుకున్న గొడవ చినికి చినికి గాలివానలా మారినట్లు అయింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తి గుండుపై బాటిల్ బద్దలు కొట్టాడు. వివరాలు.. శనివారం ఇంగ్లాండ్, గ్రీన్ విచ్లోని థేమ్స్ పాత్(నడక దారి)లో ఎర్ర టీ షర్టు వేసుకుని, చేతిలో మందు బాటిల్తో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి పక్క తెల్ల టీ షర్టుతో ఉన్న మహిళ, కుక్కపిల్లను నడిపించుకుంటూ వెళుతోంది. అదే దారిలో ఓ మహిళ పెద్ద కుక్కతో నిలబడి ఉంది. చిన్న కుక్క పిల్ల.. పెద్ద కుక్క దగ్గరకు రాగానే పెద్ద కుక్క, చిన్న కుక్కపిల్ల మీద దాడి చేయటానికి ప్రయత్నించింది. దీన్ని అడ్డుకున్న ఎర్ర టీషర్టు వ్యక్తి.. పెద్దకుక్క యజమాని అయిన మహిళను తిట్టడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తెల్ల టీషర్టు వేసుకుని గుండుతో ఉన్న వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. ఎర్ర టీషర్టు వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. వీళ్లు ఇలా గొడవ పడుతుండగా చేతిలో కోక్ బాటిల్తో ఓ బట్ట తల వ్యక్తి వీరి మధ్యలోకి వచ్చాడు. ఆ గొడవకు అతడికి ఏం సంబంధం ఉందో.. ఎర్ర టీ షర్టు వేసుకున్న వ్యక్తికి అతడి ఏం పగ ఉందో తెలియదు కానీ, ఎర్ర టీషర్టు వేసుకున్న వ్యక్తి మూతమీద ఓ పంచ్ ఇచ్చాడు. దీంతో ఎర్ర టీషర్టు వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. కొట్టిన వ్యక్తిని కాకుండా తనతో గొడవ పడుతున్న తెల్ల టీషర్టు వ్యక్తి గుండుపై మందు బాటిల్ బద్దలు కొట్టాడు. ఈ గొడవ అంతటితో ఆగలేదు. రోడ్డు మీదే ఇద్దరూ బాహాబాహీకి దిగారు. కొద్దిసేపటి తర్వాత జనం ఎర్ర టీషర్టు వ్యక్తిని మూకుమ్మడిగా తరిమేశారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియో వైరలైనప్పటికి, తమ వద్ద ఎలాంటి కేసు నమోదు కాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. -
దారుణం: ఇద్దరు మహిళల మధ్య గొడవ ఎంత పనిచేసింది..
సాక్షి, వర్ధన్నపేట(వరంగల్): ఇద్దరు మహిళలు గొడవపడుతుండగా.. ఆపడానికి వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వర్ధన్నపేట పట్టణ పరిధి డీసీ తండా శివారు నీలగిరి తండాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నీలగిరి తండాకు చెందిన బానోతు కిషన్(50) కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిష న్ భార్య దుభిలి ఇంటి పక్కనే ఉన్న బానోతు గమిలీతో గురువారం గొడవ పడింది. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు వెళ్లిన కిషన్ను గమిలీ నెట్టడంతో ప్రమాదవశాత్తు కింద పడ్డా డు. అతడిని వరంగల్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య దుభిలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ద్యావుడా.. రోడ్డుపై చితకొట్టుకున్న యువతులు.. వైరల్ వీడియో..
Girls Fighting On Road Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెరైటీగానూ ఉంటున్నాయి. తాజాగా, ముగ్గురు యువతులు రోడ్డుపక్కన కొట్టుకుంటున్న వెరైటీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంట్లో, ముగ్గురు యువతులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరికి మరో యువతి ఎదురుగా వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నా... ఇద్దరు యువతులు మూడో యువతిపై దాడికి పాల్పడి, కోపంతో ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. మొదట ఆ యువతి షాక్కు గురయ్యింది. ఆ తర్వాత వెంటనే తెరుకుని ఆమె కూడా ఇద్దరిని తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నవారంతా, వీరిని గొడవను వింతగా చూస్తున్నారు. కొంత మంది వీడియో తీస్తూ నిలబడ్డారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం మాత్రం చేయడం లేదు. అయితే, యువతులు మాత్రం మాస్క్లు ధరించి మరీ ఒకరిపై మరొకరు పంచ్లు విసురుకుంటూ తన్నుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, జుట్టులు కూడా పీక్కుంటున్నారు. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడం లేదు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. సతు.సైనీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. వీరు లేడి రెజ్లర్స్లా ఉన్నారు., ‘వీరిని.. బాక్సింగ్ పోటీలకు పంపించాలి..’, ‘ఇంతకి కారణం ఏంటో చెప్పలేదు..’, ‘వీరిని.. ఏవడు కట్టుకుంటాడో కానీ.. అయిపోతాడు.’ ‘ ద్యావుడా.. కంగారుల మాదిరి తన్నుకుంటున్నారు..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
కళ్యాణదుర్గంలో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
Viral Video: ఏనుగుల పోరాటం
కర్నాటక: రెండు ఏనుగులు తలపడ్డాయి. తొండంతో ఒకదానిపైకి మరొకటి కలబడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం చేశాయి. రెండు ఏనుగులు పోటాపోటీగా ఘీంకరిస్తూ గొడవకి దిగితే అక్కడున్న ఫారెస్ట్ సిబ్బంది ఆందోళనతో అటు ఇటు పరుగులు పెట్టారు. ఇంతకీ ఈ ఏనుగుల యుద్ధం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది. సత్యమంగళం అడవులతో పాటు పశ్చిమ కనుమలకు నెలవైన కర్నాటకలో ఏనుగులు సంఖ్య ఎక్కువ.అప్పుడప్పుడు అడవుల్లోంచి ఏనుగులు గ్రామాలపైకి దండెత్తుతాయి. వాటిని తిరిగి అడవుల్లోకి పంపే పనిని శిక్షణ పొందిన ఏనుగులు తీసుకుంటాయి. ఈ క్రమంలో రెండు ఏనుగులు తలపడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. రెండు ఏనుగులు కొట్టుకోవడం వల్ల బలహీనంగా ఏనుగు గాయాలపాలవుతుందని... పోరాడే పద్దతికి బదులు మరో ప్రత్యామ్నాయం చూడలంటున్నారు జంతు ప్రేమికులు. Kumki elephants are trained captive elephants traditionally used for capturing conflict wild elephants. Karnataka Forest Department officials and their Mahauts have age old expertise in handing such conflict situations. pic.twitter.com/FWV4ATS6NN — Ramesh Pandey (@rameshpandeyifs) June 11, 2021 చదవండి : Cheetahs: చీతా.. పునరాగమనం -
భార్యాభర్తలు పడిపోతున్నారు.. పట్టుకోండి పట్టుకోండి
మాస్కో: భార్య-భర్తల మధ్య గొడవలు కామన్. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఇద్దరు దంపతులు గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో భార్యభర్తలు ఓల్గా వోల్కోవా, కార్లాగిన్ నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో ఉన్న దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త ముదరడంతో ఇద్దరు తన్నుకునేదాకా వెళ్లింది. అయితే ఆ గొడవ శృతిమించడంతో అదుపు తప్పి బాల్కనీ నుంచి జారి కిందపడ్డారు. అదే సమయంలో ఆఫీస్కు వెళుతున్న డెనీస్.. వారిని కాపాడేందుకు పడిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండని కేకలు వేశాడు. అతని స్నేహితుడు జారి పడుతున్న బాధితుల్ని వీడియోలు తీయడంతో, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా డెనీస్ మాట్లాడుతూ భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడినట్లున్నారు. కిందపడిన వాళ్లిద్దరిని కాపాడేందుకు డాక్టర్లు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీశాం. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందంటూ స్థానిక మీడియాకు వెల్లడించాడు. చదవండి : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు -
వైరల్ తూకిత్తా .. మైకిత్తా.. అంటున్న చేపలు
సముద్ర జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. .. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో తమిళనాడు, కర్నాటకలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. ఆఖరికి మంచినీటి కొళాయి దగ్గర కుమ్ములాటలు మనందరికీ సుపరిచితమే. రెండు వర్గాల మధ్య క్షణాల్లో మంటలు పుట్టించగల శక్తి నీటి సొంతం. ఆ శక్తి ఎలాంటిదంటే నిత్యం నీటిలో ఉండే చేపలు సైతం గొడవలు పెట్టుకునేంత. రెండు సముద్రపు చేపలు ఒకదానిపై మరొకటి దుమ్ముత్తి పోసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బయటి ప్రపంచంలో నీరు లేక గొడవలు జరుగుతుంటే నీటిలో ఉండి కూడా చేపలు పౌరుషంగా పొట్లాటకు దిగడం చూపరులను ఆకట్టుకుంటోంది Arguing on Twitter.. 😅 pic.twitter.com/0656I4ephJ — Buitengebieden (@buitengebieden_) May 24, 2021 -
Mangalore: జైలులో కొట్టుకున్న ఖైదీలు
బనశంకరి: మంగళూరు జిల్లా జైలులో ఖైదీలు పరస్పరం దాడులకు దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. పణంబూరు పోలీస్స్టేషన్లో దోపిడీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సమీర్ అనే ఖైదీ ఇతర ఖైదీలపై దాడికి దిగాడు. మూల్కి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన అన్సార్పై ఆదివారం ఉదయం దాడికి దిగాడు. దాడిలో అన్సార్తో పాటు మూడిబిదిరే దోపిడీ కేసులో ఉన్న ఖైదీ జైనుద్దీన్ కూడా గాయపడ్డాడు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మంగళూరు జైలును పోలీస్ కమిషనర్ శశికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఇతర ఖైదీలు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు వారిపై లాఠీ ఝుళిపించారు. (చదవండి: పెళ్లి పేరుతో శారీరకంగా అనుభవించి.. 37 లక్షలతో! ) -
వైరల్: జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు
మూడు గుండ్లు ఒక దగ్గర ఉండగలవేమోగాని రెండు సిగలు మాత్రం ఒక దగ్గర ఉండలేవు.. అన్న మాటకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందీ ఘటన. నడిరోడ్డు మీద జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. చివరికి డ్రైనేజీలో పడినా కూడా అదేం పట్టించుకోకుండా బాదుడు మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టారిద్దరూ. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందన్న వివరాలు తెలియరాలేదు, కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో జీన్స్ ధరించిన ఇద్దరు యువతులు కోపంతో ఊగిపోతూ ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఒకరు తోసేస్తుంటే మరొకరేమో జుట్టు పట్టుకుని లాగుతూ ఆమె వీపు మీద పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఈ ఘర్షణలో వారు ఒకరినొకరు తోసుకుంటూ మురికి కాలువలో పడ్డారు. చేతికి, శరీరానికి అంతటికీ మురికి నీరు అంటినా వారు మాత్రం కొట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారు. అడ్డొస్తే తమను కూడా కొడతారని భావించారే ఏమో కానీ.. అక్కడున్న స్థానిక జనాలు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ వీడియో చూసిన జనాలు ఛీ ఛీ.. మరీ మురికి గుంటలో పడ్డాం అన్న స్పృహ లేకుండా ఆ కొట్టుకోవడం ఏంట్రా నాయనా! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీ ముందు రెజ్లర్లు కూడా పనికి రారు తల్లో.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సూపర్ మార్కెట్లోకి అనుకోని అతిథి.. జనం హడల్ పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం.. -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
టీడీపీ నేతల వీరంగం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో టీడీపీ నేతలు కత్తులతో వీరంగం సృష్టించారు. వైస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల మీద కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటన కేవీ పల్లి మండలం తిమ్మాపురంలో జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన 10 మంది గాయపడ్డారు. దారుణం ఏంటంటే వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు.. పంచాయితీ ఎన్నికల్లో తిమ్మాపురంలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్గా గెలిచాడు. దాంతో బరితెగించిన తెలుగుదేశం నేతలు వైఎస్సార్సీపీ శ్రేణుల కుటుంబాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ద్వారక, ఆనంద్లతో పాటు మరో 50 మంది ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దుకృష్ణ ఇంటితోపాటు మరో నాలుగు కుటుంబాల మీద దాడులు చేశారు. కత్తులు, ఇనప రాడ్లతో దాడులు చేయడంతో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు! -
టీడీపీ నేతల వీరంగం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి