మణికొండ: అమావాస్య రోజు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశారనే అనుమానంతో ఎదురెదురు నివాసాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన మేరకు.. మణికొండ శివాజీనగర్ కాలనీలో ప్రభాకర్, నర్సింహాల కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రభాకర్ తోబుట్టువులు సోమవారం తమ ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఎందుకు వేశారని నర్సింహా కుటుంబ సభ్యులు నిలదీశారు.
అయితే తాము వేయలేదని వాగ్వాదానికి దిగారు. ఇంతలో ప్రభాకర్ సోదరి ఉమారాణి కారం తెచ్చి నర్సింహా కుటుంబ సభ్యుల కంట్లో చల్లింది. దాంతో ఓ మహిళ తీవ్ర అస్వస్థకు గురైంది. రాయదుర్గం పోలీసులకు సమాచారం అందడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


