Bihar Results: మహువాలో తేజ్ ప్రతాప్ వెనుకంజ | Bihar Assembly Election Results 2025, Trends In Mahua Show Close Fight Between Tej Prataps JJD And RJD | Sakshi
Sakshi News home page

Bihar Election Results: మహువాలో తేజ్ ప్రతాప్ వెనుకంజ

Nov 14 2025 9:35 AM | Updated on Nov 14 2025 10:50 AM

Trends In Mahua Show Close Fight Between Tej Prataps JJD And RJD

పట్నా: బీహార్‌లోని 243 నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. తొలి ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడి ఉండగా, ఆర్జేడీ నేత ముఖేష్ కుమార్ రౌషన్ ముందంజలో ఉన్నారు. 

ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం ఎన్‌డీఎ 100 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 67 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీహార్‌లోని కీలకమైన నియోజకవర్గాల్లో మహువా ఒకటి. ఇక్కడ తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జనశక్తి జనతా దళ్ (జేజేడీ), ఎంజీబీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ), ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. సుమారు ఆరేళ్ల క్రితం లాలూ పార్టీతో విడిపోయిన తేజ్ ప్రతాప్ తన సొంత పార్టీ జేజేడీని స్థాపించారు.  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. తేజ్ ప్రతాప్ స్వయంగా మహువాలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement