Bihar: బీఎల్‌ఓల మరణాలకు‘సర్‌‌’ కారణమా? | Political storm over deaths of Bihar BLOs: Shadows cast over panchayat elections | Sakshi
Sakshi News home page

Bihar: బీఎల్‌ఓల మరణాలకు‘సర్‌‌’ కారణమా?

Nov 25 2025 12:59 PM | Updated on Nov 25 2025 3:03 PM

Political storm over deaths of Bihar BLOs: Shadows cast over panchayat elections

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అంతకుముందు జరిగిన సమ్మరీ రివిజన్ (సర్‌) ప్రక్రియ వివాదాలు మరో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం సన్నద్ధమవుతున్న తరుణంలో ఇవి  ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ‘రివిజన్‌’ప్రక్రయ సమయంలో బిహార్‌ వ్యాప్తంగా 16 మంది బూత్ లెవల్ ఆఫీసర్‌ల (బీఎల్‌ఓ) వరుస మరణాలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

గతంలో రాష్ట్రంలో జరిగిన సమ్మరీ రివిజన్ (సర్‌) ప్రక్రియ సమయంలో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగానే పలువురు బీఎల్‌ఓలు మరణించారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషాద ఘటనలు అట్టడుగు స్థాయిలో పనిచేసే పోల్ సిబ్బంది భద్రత, పని పరిస్థితులపై తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో పలువురు ఎన్నికల కమిషన్, పాలక యంత్రాంగాల జవాబుదారీతనంపై ప్రశ్నలను లేవదీస్తున్నారు.

ఈ మరణాలపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ, ఇవి వ్యవస్థాగత వైఫల్యానికి చిహ్నాలుగా అభివర్ణించాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), పాలక యంత్రాంగాల  నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని ఆరోపించాయి. కాంగ్రెస్ నేతలు ఇందుకు బాధ్యులైనవారు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశం న్యాయవ్యవస్థకు కూడా చేరింది. హైకోర్టు ఈ సమస్యపై స్పందిస్తూ ఇది పరిపాలనా అధికార పరిధికి సంబంధించినదని పేర్కొంటూ దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఈ ఉదంతం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. కాగా ఎన్నికల సందర్భంలో బీఎల్‌ఓల పాత్ర అత్యంత కీలకం. అర్హత కలిగిన ప్రతి గ్రామస్థుడిని లెక్కించేలా ఓటరు నమోదు, ఓటర్ల జాబితాల తయారీకి వారు వెన్నెముకగా నిలుస్తారు. ఈ నేపధ్యంలో వారి మరణాలు పోల్ సిబ్బందిలో నైతికత తగ్గుతుందనే భయాలను రేకెత్తిస్తున్నాయి. అట్టడుగు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పంచాయతీ ఎన్నికలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపనుందనే మాట వినిపిస్తోంది.

ఈ  అంశంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పందించింది. బీఎల్‌ఓ మరణాలను పని ఒత్తిడితో ముడిపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, దీనిపై పూర్తి వివరాలు కోరుతూ అన్ని రాష్ట్రాలలోని ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈఓ) నుండి నివేదికలను అత్యవసరంగా కోరింది. బిహార్‌లో ‘సర్‌’ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తయినప్పటికీ, పని ఒత్తిడిపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ వివాదంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఈసీ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement