ప్రధాన వార్తలు

'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..
భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు.

24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్గఢ్లతో సహా మల్టిపుల్ ఎక్స్ప్రెస్వేల గుండా ప్రయాణించింది.రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్టార్క్ రేస్ ఎక్స్పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్టీవీఎస్ ఎన్టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్బాట్తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches)

రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్
దేశీయ మార్కెట్లో సరికొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్' లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). నాలుగు ట్రిమ్లలో లభించే ఈ కొత్త కారు.. పెట్రోల్, డీజిల్, CNG అనే మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. కంపెనీ దీని కోసం జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిస్తుంది.స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మంచి డిజైన్ పొందుతుంది. కొత్త ఎల్ఈడీ హెడ్లైట్లు, కొత్త గ్రిల్, బంపర్లు, 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, ఫ్లష్ ఫిట్టింగ్ ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్ బార్, టీ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ మొదలైనవి ఉన్నాయి. ఇది డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్లైట్లు, వైపర్లు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అనేవి మీరు ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతాయి.1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇంజిన్ ఆటోమాటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతాయి. CNG వేరియంట్ ఫ్యూయెల్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది.
బిజినెస్ పోల్
కార్పొరేట్

టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?

జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..

హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం

హైరేంజ్లో హైదరాబాద్

కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి

ఫ్లైట్ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు

‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం

ఇండస్ఇండ్ బ్యాంక్కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!

ఇండిగో లాభం ‘హై’జంప్

తయారీలో భారత్ ముందడుగు

మళ్లీ బంగారం రయ్..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలతో పసిడికి మరోసారి ...

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి...

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబ...

ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో...

ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు ...

ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలతో పాటు.. తప్పుడు వార్తల ప...

పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు
సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అ...

లంచ్ బ్రేక్లో బ్యాంకింగ్ సర్వీసులు నిలిపేస్తారా..?
బ్యాంకింగ్ సర్వీసుల కోసం చాలామంది నిరంతరం బ్యాంక్...
ఆటోమొబైల్
టెక్నాలజీ

యాపిల్ ఎయిర్పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్పాడ్స్ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుఎయిర్పాడ్స్ ప్రో లైనప్కు తదుపరి అప్డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్పాడ్ మోడల్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది.

యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్లైన్ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్ యాప్లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.టికెట్ బుకింగ్: ప్లాట్ఫామ్ టికెట్లతో సహా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్ఫామ్ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్డేట్లను పొందవచ్చు.రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్లైన్లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్మెంట్): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్లో ట్రాక్ చేయవచ్చు.ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లుపార్సిల్, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్లో మీరు ఎక్కబోయే కోచ్ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.ఇతర భాషలు: ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు.

లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది.

బకాయిలు చెల్లించలేం బాబోయ్..
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.ఏజీఆర్ బకాయిలుసర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.వివాదం ఏమిటంటే..ఏజీఆర్లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్కంపెనీ వాదన ఇలా..సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది.
పర్సనల్ ఫైనాన్స్

అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..
అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్హౌస్'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎలాగో పూడ్చలేరు. కానీ ఆస్తి నష్టాన్ని ముందుగానే తీసుకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మీ బీమా ప్రొవైడర్కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. భీమా కంపెనీ స్పందించడానికి ముందే.. రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు & వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా.. వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, ఫైర్ బ్రిగేడ్ నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?సర్వేయర్తో సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక సర్వేయర్ను నియమిస్తుంది. సర్వేయర్కు పూర్తిగా సహకరించండి. వారికి అవసరమైన సమాచారం & పత్రాలను అందించండి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి వారికి అనుమతి ఇవ్వండి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. అయితే చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీ విధానాలు కొద్దిగా మారవచ్చు. కాబట్టి, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను సంప్రదించండి.

అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్క్యాప్, లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

పదేళ్ల చరిత్ర.. సెక్షన్ 80Cలో ఎన్నో ఆప్షన్లు
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ... 🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా 🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి చెల్లింపులు 🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు 🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు 🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లు 🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో జమలు 🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు 🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్ఐసీ జమలు 🔸 ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్కి జమలు 🔸 ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్ధార అక్షయ 🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ 🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) వారికి చేసిన చెల్లింపులు 🔸 బ్యాంకు/ఎల్ఐసీ/ఎన్హెచ్బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు 🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా) 🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు. ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. ఇతరత్రా విషయాలు.. 🔸 ప్రావిడెండ్ ఫండ్కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు. 🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్లో 10 శాతం దాటకూడదు. 🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.

EPFOలో ఐదు కీలక మార్పులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రొఫైల్ అప్డేట్ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.పీఎఫ్ బదిలీగతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.జాయింట్ డిక్లరేషన్జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్గా మారింది. మీ యూఏఎన్ ఆధార్తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.పెన్షన్ పేమెంట్స్ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'జీతంపై పెన్షన్ ప్రక్రియఅధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.
రియల్టీ
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 112000.00 | 1000.00 | 1.20 |
Gold 22K 10gm | 89750.00 | 450.00 | 0.50 |
Gold 24k 10 gm | 97910.00 | 490.00 | 0.50 |
Egg & Chicken Price
Title | Price | Quantity |
---|---|---|
Chicken (1 Kg skin less) | 243.00 | 1.00 |
Eggs | 76.00 | 12.00 |