-
కెప్టెన్సీ లేదు.. చెలరేగిపోతాడు! అతడిదే ఆరెంజ్ క్యాప్: శ్రీశాంత్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ముంబై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ముంబై కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మను తప్పించి మరి జట్టు తనకు పగ్గాలను అప్పగించిన ముంబై యాజమన్యం నమ్మకాన్ని హార్దిక్ నిలబెట్టుకోలేకపోయాడు. ఎంఐ కెప్టెన్గా ఎంపికైనప్పటి నుంచి హార్దిక్కు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆఖరికి ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా హార్దిక్కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాడు. అతడిని తప్పించి ముంబై జట్టు పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ స్వేచ్ఛగా ఆడటానికి ఇష్టపడతాడని శ్రీశాంత్ తెలిపాడు. "సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడటం మనం చూశాం. మేము అందరం కలిసి వన్డే వరల్డ్కప్ను కూడా గెలిచాము. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కింద రోహిత్ ఆడటానికి ఇష్టపడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఆ వాస్తవం. రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడటానికి కచ్చితంగా ఇష్టపడతాడు. నా వరకు అయితే రోహిత్ ఎలాంటి కెప్టెన్సీ భారం లేదు కాబట్టి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సీజన్లో రోహిత్ మంచి రిథమ్లో కన్పిస్తున్నాడు. రోహిత్కు ఐదు సార్లు ముంబైని విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు జట్టును రోహిత్ వెనుకుండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నానని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
Yamadheera Review: క్రికెటర్ శ్రీశాంత్ విలన్గా నటించిన ‘యమధీర’ ఎలా ఉందంటే?
కన్నడ స్టార్ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ విలన్గా నటించిన తాజా చిత్రం యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వేదాల శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘యమధీర’ కథేంటంటే.. కెపి గౌతమ్ ( కోమల్ కుమార్) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అన్యాయం ఎవరు చేసిన సహించడు. అందుకే ఎక్కడా కూడా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోతాడు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో గొడవ కారణంగా ట్రాన్స్ఫర్స్ అవుతూ చివరికి వైజాగ్ కమిషనర్గా వస్తాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేస్తాడు. విచారణలో ఆ యువకుడిని చంపింది అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశ్ముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) అని తెలుస్తుంది. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ్ సీఎం అవుతాడు. మరి ఈ కేసును గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? సీఎం దేశ్ముఖ్కి ఆ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ నీ గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి జనాలకి అవగాహన కలిగించే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు కానీ ఓ మంచి సందేశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి చక్కగా చూపించారు. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమా మాదిరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఫస్టాఫ్లో సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం, శ్రీశాంత్ పాత్ర నిడివి తక్కువగా ఉండడం సినిమాకు మైనస్. శ్రీశాంత్ పాత్ర నిడివి పెంచి, స్క్రిప్ట్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. నటీనటుల విషయానికొస్తే.. హీరోగా కోమల్ కుమార్ నటన చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ నటన ఆయన పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. అరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. పాటలు జస్ట్ ఓకే. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
సినిమాలో విలన్గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్
టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన శ్రీశాంత్.. 'యమధీర' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మార్చి 23న తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర విశేషాలని పంచుకున్నారు. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా?) కన్నడ హీరో కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'యమధీర'. వేదాల శ్రీనివాస్ నిర్మించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్: టీమిండియా మాజీ క్రికెటర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల గుండెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తన అభిమాన హీరోలని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ లిస్ట్లో మరో క్రికెటర్ చేరిపోయారు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీశాంత్ జూనియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారని.. మీ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెళ్తూ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. 'ఆయనకు గుర్తు ఉందో లేదో తెలియదు కానీ.. ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ను కలిశా. అక్కడే ప్రియమణి, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లా. మీరు డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని చెప్పా. థ్యాంక్యూ శ్రీశాంత్ అన్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆయనను చూస్తే చాలా మోటివ్గా అనిపించింది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాలో చిన్న అవకాశమొచ్చిన నటిస్తా' అని అన్నారు. -
గంభీర్తో గొడవ.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు
లెజెండ్స్ లీగ్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్లో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్ను శ్రీశాంత్ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement