బీజేపీ గెలుపుపై క్రికెటర్ ధీమా | Confident of BJP victory in KeralaElection, says Sreesanth | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలుపుపై క్రికెటర్ ధీమా

Apr 20 2016 10:08 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ గెలుపుపై క్రికెటర్ ధీమా - Sakshi

బీజేపీ గెలుపుపై క్రికెటర్ ధీమా

టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్నారు.

తిరువనంతపురం: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్నారు. కేరళ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించి అధికారం కట్టబెట్టనట్టయితే రాష్ట్ర పరిస్థితుల్లో చాలా మార్పులొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత నెల వరకు తన తండ్రి లెఫ్టిస్ట్ అని పేర్కొన్న శ్రీశాంత్... ప్రస్తుతం ఆయన బీజేపీ మద్ధతుదారుడని వివరించారు. ఆయన బీజేపీ తరఫున కేరళ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన తర్వాత అతడిపై నిషేధం పడింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement